-
రహస్యంగా యంగ్ హీరోయిన్ వివాహం.. ఇప్పటికీ అది సస్పెన్సే
హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ప్రేమించి చేసుకుంటే.. మరికొందరు పెద్దల చూపించిన అబ్బాయితో ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరోయిన్ చేరింది. కుర్రాళ్ల ఫేవరెట్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) తమిళ సినిమాల్లో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్.. గతేడాది 'గుడ్ నైట్' చిత్రంతో హిట్ కొట్టింది. అంతకు ముందు 'ముదల్ నీ ముదువమ్ నీ' చిత్రంలో హీరోయిన్గా చేసింది. ఈమె క్యూట్ యాక్టింగ్కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటిది గతేడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు వరుడు వివరాలు కూడా అస్సలు బయటపెట్టలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు.. తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా, తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే చాలామందికి ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లలోనూ త్రిష, ఆండ్రియా లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆండ్రియా విషయానికొస్తే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లోనూ నటించింది. తాజాగా ఈమెని పెళ్లి గురించి అడగ్గా.. చేసుకోనని చెప్పింది. కారణం కూడా వెల్లడించింది. త్రిష వయసు 40 ఏళ్లు. లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని ఈమె చెబుతోంది. నటి ఆండ్రియా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా అంటోంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని.. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని కుండబద్దలు కొట్టేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?) పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బహుశా వీరిద్దరూ విడిపోయి ఉంటారు. అలానే బ్రేకప్ లాంటివి ఏమైనా ఈ నటి జీవితంలో ఉన్నాయేమో? బహుశా అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
సినిమాటోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్గా చేస్తున్న కుర్రాడితోనే ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అందరూ సదరు హీరోయిన్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!) ముంబయి బ్యూటీ అక్ష.. 2004లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'ముసాఫిర్' అనే సినిమా చేసింది. 2007లో 'గోల్' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో 'యువత' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరసగా తెలుగులోనే 'రైడ్', 'అది నువ్వే', కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, మెంటల్ పోలీస్, రాధ చిత్రాల్లో నటించింది. అయితే 2017 తర్వాత ఈమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 'జమత్రా', 'కాట్మండు కనెక్షన్', 'రఫుచక్కర్' లాంటి వెబ్ సిరీసుల్లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వెబ్ సిరీసులు చేస్తున్న టైంలోనే సినిమాటోగ్రాఫర్ కౌశల్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఫిబ్రవరి 26న పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. ఆ ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్.. తల్లి హీరోయిన్, తండ్రి డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా. ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లండన్లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) Transformation!!👌🔥 pic.twitter.com/4sjmKINI6V — Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2024 View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
చిరు-మహేశ్తో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడేమో ఇలా!
ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్. చాలా చిన్న వయసులోనే ఏకంగా చిరంజీవి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్, నాగార్జున లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కెరీర్ సాఫీగా సాగుతోందనుకునే టైంలో సడన్గా సినిమాలకు వీడ్కోలు చెప్పేసింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: సీక్రెట్గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు సాక్షి శివానంద్. ఇప్పటి జనరేషన్కి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1993లో 'అన్నా వదిన' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. కానీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే 1997లో చిరంజీవి 'మాస్టర్'తో పూర్తిస్థాయి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2001 వరకు వరసపెట్టి మూవీస్ చేసింది. కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్దారకుడు, యువరాజు, సింహరాశి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. 2001లో రాజశేఖర్ 'సింహరాశి' సినిమాలో సాక్షి శివానంద్ హీరోయిన్గా హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాల్లో ఛాన్సులు సరిగా రాలేదు. 2008లో 'హోమం', 2010లో 'రంగా ది దొంగ' చిత్రాల్లో చివరగా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు చిత్రాలకే దూరమైపోయింది. అనంతరం సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా గృహిణిలా మారిపోయింది. ఈమెకు ఒహానా శివానంద్ అనే చెల్లెలు ఉంది. పైన చూసిన ఫొటోలో సాక్షితో పాటు ఉన్నది ఒహానే. అయితే సాక్షి అప్పుడెలా ఉందో ఇప్పటికీ అంతే అంతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత) -
పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్!
గత రెండు మూడు నెలల్లో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు నిశ్చితార్థం చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. చెప్పుకొంటే ఈ లిస్టులో చాలామంది తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పేసింది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీ దివ్య.. 'హనుమాన్ జంక్షన్', 'యువరాజు', 'వీడే' లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. 'మనసారా' అనే సినిమాతో హీరోయిన్ అయిపోయింది. దీని తర్వాత బస్స్టాప్, కేరింత లాంటి మూవీస్ చేసినప్పటికీ ఎందుకో టాలీవుడ్లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరసపెట్టి చిత్రాల్లో నటించింది. 2013లో మొదలుపెడితే ఇప్పటికీ చేస్తూనే ఉంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో శ్రీ దివ్యకు తమిళంలో కూడా అవకాశాలు తగ్గాయి. అయితే ఓ కమెడియన్ ఇచ్చిన పార్టీలో తప్ప తాగి పడిపోయిందని, దీంతో ఈమె పేరు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఛాన్సులు కూడా తగ్గిపోయాయని మాట్లాడుకున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుందట. ఈ విషయమే సన్నిహితుల దగ్గర చెప్పిందట. దీనిపై ఆమె వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
ఈమె హిట్ సినిమాల తెలుగు హీరోయిన్.. కానీ అదే పెద్ద మైనస్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో సక్సెస్ అందుకుంది. బాగానే ఉందనుకునేలోపు వరస దెబ్బలు తగిలాయి. దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఛాన్సుల్లేక ఎదురుచూసే పరిస్థితికి వచ్చేసింది. ఈ బ్యూటీకి ప్రతిభతో పాటు అన్నీ ఉన్నాగానీ ఓ విషయం మాత్రం ఈమె కెరీర్కి మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు స్నేహా ఉల్లాల్. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. అరబ్ దేశం ఒమన్లో పుట్టి పెరిగింది. అక్కడ చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లితో కలిసి ముంబయిలో అడుగుపెట్టింది. మరి నక్క తోక తొక్కిందో ఏమో గానీ ఫస్ట్ ఫస్టే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' చిత్రంతో నటిగా మారింది. నటిగా పాజిటివ్ మార్క్స్ పడ్డాయి. కానీ హిట్ మాత్రం తెలుగు డెబ్యూతో దక్కింది. (ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్) 2007లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన స్నేహా ఉల్లాల్.. ఫస్ట్ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 'కరెంట్' చిత్రంతోనూ ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల పర్లేదు గానీ.. నేను మీకు తెలుసా?, సింహా, అలా మొదలైంది, మడతా కాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే తదితర చిత్రాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ తీసుకురాలేకపోయాయి. ఈ మూవీస్ వల్ల వరస షాకులు తగిలాయి. మరోవైపు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్లా నీలి కళ్లతో ఉంది అనే పోలిక కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. సాధారణంగా ఏదైనా పోలిక ఉంటే.. మాట్లాడుకుంటారు తప్పితే ఛాన్సులైతే ఇవ్వరు. అలా ఆ పోలిక వల్ల పెద్దగా ఉపయోగమైతే జరగలేదు. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో సినిమాలేం లేవు. దీంతో సొంత దేశానికి వెళ్లిపోయి.. తల్లిదండ్రులతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
కప్ కొట్టిన తెలుగు హీరోయిన్.. ఈమెలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
హీరోయిన్లలో యాక్టింగ్ బాగా చేయడం సహజమే. కానీ అంతకు మించిన టాలెంట్స్ కూడా కొందరిలో ఉంటాయి. అవి టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. అలా తెలుగు హీరోయిన్ నివేతా పేతురాజ్లోని మరో ప్రతిభ ఇప్పుడు బయటపడింది. ఏకంగా కప్ కొట్టేయడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఈమెలో ఏయేం టాలెంట్స్ ఉన్నాయి? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు. నటన-మోడలింగ్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ షట్లర్లా మారిపోయింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అలానే 'తర్వాత ఏంటి?' అనే ఓ క్యాప్షన్ పెట్టింది. అంటే మళ్లీ ఏదో పోటీలో టాలెంట్ చూపించబోతుందనమాట. (ఇదీ చదవండి: బిజినెస్ మొదలుపెట్టిన నటి సన్నీ లియోన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా
మీనా పేరు చెప్పగానే చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. 90ల్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. మరోవైపు తమిళంలో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఈమెకు బోల్డ్ రోల్స్, గ్లామర్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురవగా.. పలు ఆసక్తికర విషయాల్ని మీనా బయటపెట్టింది. ఆయన సలహా వల్లే 'నేను నార్మల్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నా చుట్టూ ఉన్నవాళ్లు గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదా అని అడిగారు. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే పాత్రలు చేయాలని.. కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా నాకు సలహా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ప్రభుదేవాతో చేసిన సినిమాలో ఓ సీన్లో భాగంగా స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్నాను. కాకపోతే సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను' (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) వాళ్లకు దండం పెట్టాలి 'ఇక స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్న తర్వాత అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని తెగ భయపడిపోయాను. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ చేసే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని అప్పుడే అనిపించింది' అని తనకెదురైన అనుభవాల్ని తాజాగా ఓ తమిళ షోలో చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో 'దృశ్యం' సినిమాలతో పాటు పలు మలయాళ సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తోంది. మరోవైపు ఈమె భర్త విద్యాసాగర్.. 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మీనా కూతురు కూడా 'తెరి' అనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
ఈమె స్టార్ హీరోయిన్, ఆ ఒక్క సినిమాతో చాలా ఫేమస్.. కానీ ఆ తర్వాతే!
ఈమెని చూస్తే అచ్చ తెలుగమ్మాయి అనుకుంటారు. కానీ ఈమెది తెలుగు కాదు. సొంత భాషలో కెరీర్ సంగతి పర్లేదు కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్లో సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అనన్య. అరె.. ఈమెని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? పర్లేదు కాస్త గుర్తుపట్టారనమాట. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు అయిల్య గోపాలకృష్ణ. కాకపోతే సినిమాల్లోకి వచ్చేసరికి అనన్య అని పేరు మార్చుకుంది. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పుడే ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఇక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్చరీలో(విలువిద్య) రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో ఈమెకు మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పింది. కానీ కొన్నిరోజుల తర్వాత 'పాజిటివ్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'జర్నీ' సినిమాతో తెలుగు ఆడియెన్స్కి దగ్గరైపోయింది. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగులో 'అమాయకుడు' అని స్ట్రెయిట్ మూవీ చేసింది. కానీ ప్లాఫ్ అయింది. గత కొన్నాళ్లలో అయితే 'అఆ', 'మహర్షి' లాంటి తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది కానీ టాలీవుడ్లో ఇదేమంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. నటిగా కొనసాగుతూనే 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు యాక్టింగ్ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే చాలారోజుల తర్వాత ఈమెని చూసి నెటిజన్స్ గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జర్నీ' హీరోయిన్ కదా అని గుర్తుపట్టారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by SuMaN RaMdAs 🇮🇳 (@the_art_of_photographer) -
మత్తెక్కించేలా పోజిచ్చిన ఆ బ్యూటీ.. కేక పుట్టించేలా తాప్సీ
బీచ్ ఒడ్డున క్యూట్గా హాట్ బ్యూటీ హంస నందిని స్పాట్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న హీరోయిన్ తాప్సీ మెడపై చెయ్యి పెట్టి మత్తెక్కిస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న సంయుక్త మేనన్ కొబ్బరితోటలో వయ్యారంగా పోజులిస్తున్న పూజాహెగ్డే వర్కౌట్ బిజీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నాభి అందాలతో రెచ్చిపోతున్న భూమీ పెడ్నేకర్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
లుక్ మార్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇలా అయిపోయిందేంటి?
సాధారణంగా హీరోయిన్లు దాదాపు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కట్టుబొట్టు మార్చి షాకిస్తుంటారు. అలా తెలుగులో ఓ సినిమా చేసిన యంగ్ బ్యూటీ కూడా సడన్ షాకిచ్చింది. మొత్తం వేషధారణ మార్చేసి కనిపించింది. ఈమెని చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు హనీరోజ్. హా అవును మీరు ఊహించింది కరెక్టే. గతేడాది సంక్రాంతికి రిలీజైన 'వీరసింహారెడ్డి' సినిమాలో ఓ హీరోయిన్గా నటించింది ఈమెనే. ఈ మూవీతో ఈమెకు క్రేజ్ బాగానే వచ్చినప్పటికీ ఛాన్సులే సరిగా రాలేదు. తెలుగులో మరో మూవీ చేయట్లేదు. అదే టైంలో ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈమె వయసు 32 ఏళ్లే అయినప్పటికీ రోజురోజుకీ బొద్దుగా మారిపోతోంది. సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) #HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z — Trend Soon (@trend_soon) January 6, 2024 -
ఈ పాప తెలుగు హీరోయిన్.. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. ఎవరో కనిపెట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. అంటే పదుల సంఖ్యలో సినిమాలేం చేసేయలేదు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ మూవీస్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. దీంతో ఛాన్సులే రావడం మానేశాయి. అయితేనేం బాలీవుడ్లో చెక్కేసింది. సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్మే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇషా తల్వార్. అరె.. ఈ పేరు ఎక్కడా గుర్తురావట్లేదే? అని అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడకండి. మేం చెప్పేస్తాం. అప్పట్లో 'ఇష్క్' మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన నితిన్.. అదే ఊపులో 'గుండె జారి గల్లంతయ్యిందే' అని మరో మూవీ చేశాడు. ఇందులో నిత్యామేనన్ మంచి స్కోప్ ఉండే పాత్ర చేసింది. అదే టైంలో మరో హీరోయిన్గా చేసిన ఇషా తల్వార్ కూడా బాగానే ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) అయితే నితిన్ మూవీ తర్వాత 'మైనే ప్యార్ కియా', 'రాజా చెయ్యి వేస్తే' అని మరో రెండు సినిమాల్లో ఇషా తల్వార్ హీరోయిన్గా చేసింది. కానీ లక్ అన్నదే అస్సలు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసింది. 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరసపెట్టి మలయాళ మూవీస్ చేసింది గానీ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. హీరోయిన్ అనే కాకుండా 'మీర్జాపూర్' లాంటి ఫేమస్ వెబ్ సిరీస్లోనూ గుర్తింపు ఉన్న పాత్ర చేసింది. 2023లోనూ సాస్-బాహు ఔర్ ఫ్లెమింగో, చమక్ లాంటి సిరీసుల్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే అటు మూవీస్ ఇటు సిరీసులు చేసుకుంటూ బండి నడిపేస్తోంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 36 ఏళ్లు వయసొచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) -
అలా కనిపించిన అరియానా.. ఐటమ్ బ్యూటీ మెల్ట్ అయ్యే లుక్
జనవరి గురించి అనసూయ పోస్ట్.. క్రేజీ ఫొటోలు కూడా 'లియో' నటి జనని క్యూట్ డ్యాన్స్ వీడియో వైరల్ అందాల విందు చేస్తున్న నటి ఇషా తల్వార్.. చూస్తే అంతే తెల్లచీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ రాజశేఖర్ సోకుల వయ్యారాలతో టెంప్ట్ చేస్తున్న 'బిగ్బాస్' అరియానా ఫుల్ జాలీ మూడ్లో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న జిమ్లో సెల్ఫీతో క్యూట్గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి మరింత అందంగా కనిపిస్తూ మెరిసిపోతున్న హంస నందిని View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
ఫుల్ చిల్ మూడ్లో కాజల్.. భర్త గౌతమ్ కిచ్లూతో ఏకంగా అలా!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్య తెగ కనిపించేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా గతేడాది పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. కొత్త ఏడాది మరికొన్ని మూవీస్తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. కెరీర్ పరంగా పర్వాలేదనిపిస్తున్న కాజల్.. ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) కొత్త సంవత్సర వేడుకల్లో కాజల్ అగర్వాల్తోపాటు ఫ్యామిలీ అంతా కనిపించాడు. కొడుకు నీల్, భర్త గౌతమ్ కిచ్లూ కూడా ఉన్నారు. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మిగతా ఫొటోలన్నింటి గురించి పక్కనబెడితే భర్త గౌతమ్ని ఘడంగా ముద్దుపెట్టుకున్న పిక్ మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ఫొటో చూస్తుంటే ఇద్దరూ ఫుల్ చిల్ మూడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
హీరోయిన్గా షారుక్ లేడీ ఫ్యాన్.. ఏకంగా ఆ తెలుగు సినిమాతో
ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు వీరాభిమాని. తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అలా తమ అభిమానంతో 'జవాన్'తో చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ హీరోయిన్గా ఓ సినిమా చేసింది. ఇప్పుడది రిలీజ్ కానున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) తమిళంలో సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న లీషా ఎక్లైర్స్.. తాజాగా తెలుగులో 'రైట్' అనే మూవీలో హీరోయిన్గా చేసింది. బిగ్బాస్ 2 ఫేమ్ కౌశల్ ఇందులో హీరోగా చేశాడు. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఈ సందర్భంగా బ్యూటీ లీషా ఎక్లైర్స్ తన ఆనందాన్ని పంచుకుంది. షారుక్ అభిమాని అయిన తాను.. ఇప్పుడు హీరోయిన్గా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఈమె ఎవరంటే?
సినిమా హీరోయిన్లు.. ఇండస్ట్రీకి దూరమైపోతే బయట పెద్దగా కనిపించరు. ఒకవేళ వాళ్ల ఫొటోలు ఒకటో రెండో కనిపించినా సరే సడన్గా గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుంది. ఎందుకంటే అంతలా మారిపోతారు. ఇప్పుడు కూడా అలానే ఓ బ్యూటీ కనిపించింది. ఈమె తెలుగులో నాని హిట్ సినిమాలో చేసిన హీరోయిన్. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శరణ్య మోహన్. అలెప్పీలో పుట్టిన ఈ కేరళ కుట్టి.. చిన్నప్పుడే అంటే ఎనిమిదేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. టీనేజ్లోకి వచ్చాక సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలా కొన్నాళ్లకు హీరోయిన్ అయిపోయింది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే) 'విలేజ్లో వినాయకుడు' సినిమాలో హీరోయిన్గా చేసిన శరణ్య మోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు' మూవీలో నటించి మనసు దోచేసింది. 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఇవి తప్పితే మరో తెలుగు మూవీలో నటించలేదు. అలా టాలీవుడ్కి దూరమైపోయింది. 1997 నుంచి 2014 వరకు సినిమాల్లో నటించిన శరణ్య మోహన్.. 2015లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈమెకి సినిమాలు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఉంటుందేమో తెలీదు. ఇకపోతే స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన శరణ్య.. తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో అప్పడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. అందుకే తెలుగు ఆడియెన్స్ గుర్తుపట్టలేకపోయారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) View this post on Instagram A post shared by Saranya Mohan (@saranyamohanofficial) -
స్టార్ హీరోయినే కానీ ఆ టైంలో అష్టకష్టాలు పడింది!
ఇండస్ట్రీలోకి వస్తున్న వారసులు మినహా చాలామంది నటీనటులు సొంతంగా ఎదిగినవాళ్లే. హీరోయిన్లలో లేడీ సూపర్స్టార్ నయనతార కూడా మొదట్లో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. కానీ చాలా కష్టాలు పడిన తర్వాత అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజులో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇక దక్షిణాదిలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ దీనికి ఏ మాత్రం అతీతం కాదు. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) తొలుత మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక మోహన్.. అడపాదడపా యాడ్స్ చేస్తూ వచ్చింది. అయితే ఈ టైంలో కనీస అవసరాలకు కూడా ఇవి సరిపోకపోవడంతో చాలా కష్టాలు పడింది. అలా మోడల్గా చేస్తూనే సినీ రంగంపై ఆసక్తి పెంచుకుంది. నటించడం తెలియకపోవడంతో యాక్టింగ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్'లో హీరోయిన్గా చేసింది. దీనితో పాటు శర్వానంద్ 'శ్రీకారం'లోనూ నటించింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అదే టైంలో తమిళ డైరెక్టర్ నెల్సన్ దృష్టిలో పడింది. అతడు తీసిన 'డాక్టర్' మూవీలో చేసింది. ఇది సూపర్ హిట్ కావడంతో ప్రియాంక దశ తిరిగింది. తమిళంలో డాన్, ఈటీ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, ఓజీ తదితర పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) -
హీరోయిన్ జయప్రద అరెస్ట్కి రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే?
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ జయప్రద అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? హీరోయిన్ కమ్ పొలిటిషన్ అయిన జయప్రద ఏం తప్పు చేసింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా చేసిన జయప్రద.. 1994లో తెలుగుదేశం పార్టీలే చేరింది. కొన్నాళ్ల తర్వాత ఈ పార్టీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసింది. 2019 నుంచి బీజేపీలో కొనసాగుతోంది. అయితే 2019లో ఎన్నికల సందర్భంగా జయప్రద.. నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి. ఈ కేసులో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసినా సరే విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట జయప్రద.. హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, ఆమెని అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే మహిళా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే జయప్రద అరెస్ట్ త్వరలో జరగడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
17 ఏళ్లకే హీరోయిన్.. తెలుగులో ఫస్ట్ మూవీనే బ్లాక్బస్టర్.. ఈమెని గుర్తుపట్టారా?
ఈమె స్వతహాగా చైల్డ్ ఆర్టిస్ట్. కట్ చేస్తే టీనేజ్లోకి వచ్చేసరికి హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ ఫస్ట్ తెలుగు మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈమె లక్ ఏంటో గానీ ఏకంగా బ్లాక్బస్టర్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ సినిమాల సంగతి అటుంచితే ఘోరమైన కాంట్రవర్సీలో ఈమె ఇరుక్కుంది. ఆల్మోస్ట్ కెరీర్ మటాష్ అయిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్వేతబసు ప్రసాద్. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. 'కొత్తబంగారు లోకం' మూవీతో 2008లో సెన్సేషన్ సృష్టించిన బ్యూటీనే ఈమె. జార్ఖండ్లోని జంషెడ్పుర్లో పుట్టిన ఈ భామ.. చిన్నతనంలో ఫ్యామిలీతో కలిసి ముంబయి వచ్చేసింది. ఈమె పేరు శ్వేత మాత్రమే. తల్లి పేరులోని బసు, తండ్రి పేరులోని ప్రసాద్ని తన పేరుకి యాడ్ చేసుకుంది. దీంతో శ్వేతబసు ప్రసాద్ అయింది. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) 2002లోనే 'మక్దీ' అనే హిందీ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్వేత.. ఆ తర్వాత మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. 2008లో బెంగాలీలో 'ఏక్ నదిర్ గల్పో', తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. అనంతరం తెలుగు-తమిళ భాషల్లో దాదాపు ఆరేళ్లు పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి షిప్ట్ అయిపోయింది. అయితే కొన్నేళ్ల క్రితం ఓసారి హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో ఇండస్ట్రీలో హాట్టాపిక్ అయిపోయింది. ఈ సంఘటన వల్ల ఈమె కెరీర్ కాస్త దెబ్బతింది. ఇకపోతే 2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ సరిగ్గా ఏడాదిలోనే అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటూ ఓటీటీలో మూవీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే బిజినెస్మ్యాన్ లేదా యాక్టర్ని కాకుండా ఓ పోలీస్ అధికారితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు? (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) మధ్యప్రదేశ్కి చెందిన చిత్రశుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమాతో పాటు 'పులి', 'నేను శైలజ' చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్గా కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో 'రంగుల రాట్నం', సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. మరోవైపు కొన్నాళ్ల ముందు నుంచే వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్గా ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ డిసెంబరు 8న పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం మెహందీ, హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈ క్రమంలోనే చిత్రశుక్లా.. కాబోయే భర్త వైభవ్తో ఉన్న ఫొటోలని పోస్ట్ చేసింది. ఇకపోతే వైభవ్.. మధ్యప్రదేశ్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికైతే చిత్రశుక్లా చేతిలో కొత్త సినిమాలు ఏం లేవు. అంటే ఈ పెళ్లి తర్వాత బహుశా నటనకు టాటా చెప్పేయొచ్చేమో అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) -
ఈమెని గుర్తుపట్టారా? తెలుగు సూపర్హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా!
ఈమె తెలుగు హీరోయిన్. కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ మూవీతోనే సూపర్హిట్ కొట్టింది. కుర్రాళ్ల డ్రీమ్ హీరోయిన్ అయిపోయింది. అలా వరసగా టాలీవుడ్లో ఐదు వరకు సినిమాలు చేసింది. కానీ తొలి చిత్రం రేంజులో అయితే ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీకే దూరమైపోయింది. అలా చాన్నాళ్ల తర్వాత లేటెస్ట్గా ఓ చోట.. తళుక్కన కనిపించింది. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు కాంచీ కౌల్. 90స్ కిడ్స్లోనూ మహా అయితే ఒకరో ఇద్దరికో మాత్రమే బహుశా ఈ పేరు కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే 'సంపంగి' లాంటి హిట్ మూవీలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది గానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తమిళంలో మూడు చిత్రాల్లో ఛాన్స్ వచ్చినా సరే అవన్నీ షూటింగ్ దశలో ఆగిపోయాయి. 2004లో చివరగా హిందీలో 'వో తేరా నామ్ తా' చిత్రం చేసి.. సిల్వర్ స్క్రీన్కి పూర్తిగా దూరమైపోయింది. ఇక సినిమాలకు దూరమైన తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005 నుంచి 2014 వరకు హిందీలో పలు సీరియల్స్ చేసింది. అలా బుల్లితెరపై యాక్ట్ చేస్తున్న టైంలోనే సీరియల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2014 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన కాంచీ కౌల్.. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొడుకులతో ఓ చోట కనిపించింది. ఆ వీడియో వైరల్ కాగా.. తొలుత ఈమెని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. 'సంపంగి' బ్యూటీ ఇంతలా మారిపోయిందేంటి అని అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) View this post on Instagram A post shared by kanchikaul (@kanchikaul) View this post on Instagram A post shared by kanchikaul (@kanchikaul) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?
ఈమెది సినిమా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం లేదు కానీ తల్లి మాత్రం ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. తల్లి, అక్కతో పోలిస్తే.. ఈ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్గా మారింది. జస్ట్ రెండంటే రెండు చిత్రాల్లోనే నటించింది. ఇప్పుడేమో సడన్గా ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు తులసి నాయర్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే? సమయానికి గుర్తు రావడం లేదే అనుకుంటున్నారా.. కంగారు పడొద్దు. కాస్త మెల్లగా ఈ ఆర్టికల్ చదివేయండి. ఎవరో ఏంటో మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకప్పటి తెలుగు హీరోయిన్ రాధ గుర్తుందా? హా అవును ఆమెకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా! అందులో చినమ్మాయే తులసి. (ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?) రాధ పెద్ద కూతురు కార్తీక.. నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. కాకపోతే 'రంగం' సినిమా తర్వాత తమిళంలోనూ ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే తులసి మాత్రం అనుకోకుండా హీరోయిన్ అయింది. యాక్టింగ్ అంటే ఈమెకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ సుహాసిని చూసి.. మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వమని చెప్పింది. అలా 'కాదల్' మూవీతో హీరోయిన్ అయ్యింది. దీన్ని 'కడలి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ రెండు భాషల్లోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది. దీని తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీన్ని 'రంగం 2' పేరు తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అస్సలు కలిసి రాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయింది. రీసెంట్గా అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. కాస్త బొద్దుగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, తొలుత ఈమెని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత ఈమె, ఆమె అని తెలిసి అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) View this post on Instagram A post shared by Thulasi Nair (@thulasin) -
హీరోయిన్గా తెలుగులో ఒక్కటే సినిమా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
హీరోయిన్లకు వయసు పెరిగితే గ్లామర్ తగ్గిపోతుందని అంటారు. అదేంటో గానీ ఈ బ్యూటీ 40 ఏళ్లు క్రాస్ చేసినా సరే ఇప్పటికీ అందంగానే కనబడుతోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. తెలుగుతో కలిసి మొత్తంగా ఏడు భాషల్లో సినిమాలు చేసింది. అలానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు రియాసేన్. స్వతహాగా బెంగాలీ అయినా ఈమె.. అమ్మ, అమ్మమ్మ కూడా హీరోయిన్లే. అంతెందుకు ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగులో 'ధైర్యం'లో చేసిన రైమా సేన్ ఈమెకు సొంత అక్క. వీళ్లందరి వారసత్వాన్ని కొనసాగిస్తూ రియా సేన్.. ఐదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 10 ఏళ్ల వయసు నుంచి పూర్తి స్థాయి నటిగా మారిపోయింది. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన చైతూ ఫస్ట్ వెబ్ సిరీస్) 18 ఏళ్ల టీనేజ్ వయసులో ఉండగానే 'తాజ్మహల్' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయ్యింది. అనంతరం బెంగాలీ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. 2008లో రిలీజైన 'నేను మీకు తెలుసా?' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీనే. కాకపోతే ఇది ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో మిగతా భాషలకే పరిమితమైపోయింది. గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు అటు సినిమాల్లో గానీ ఇటు వెబ్ సిరీస్ల్లో గానీ ఛాన్సులు రావడం లేదు. దీంతో ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. అయినా సరే అస్సలు అలా కనిపించదు. అక్క రైమాసేన్లానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) -
బాయ్ఫ్రెండ్ని సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్!
ఇదేం వింటర్ సీజన్ కాదు పెళ్లిళ్ల సీజన్. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వరుణ్ తేజ్-లావణ్య కొన్నిరోజుల ముందే ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పలువురు సీరియల్, సినీ నటులు కూడా ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరోయిన్ చేరింది. (ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ) ఈ బ్యూటీ పేరు మాళవిక రాజ్. బాలీవుడ్ హిట్ మూవీ 'కబీ ఖుషీ కభీ ఘమ్'లో కరీనా కపూర్ చిన్నప్పటి పాత్రలో ఈమె నటించింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వేరే చిత్రాల్లో నటించలేదు. వయసొచ్చాక 'కెప్టెన్ నవాబ్' అనే హిందీ మూవీతో పాటు 'జయదేవ్' అనే తెలుగు సినిమాలోనూ హీరోయిన్గా చేసింది. ఇవి కాకుండా 'స్క్వాడ్' అని మరో సినిమాలోనూ నటించింది. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే సినిమాలు, యాక్టింగ్ లాంటివి పక్కనబెట్టేసిన మాళవిక.. కొన్నాళ్ల క్రితం ప్రేమలో పడింది. ఈ మధ్య నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంది. యువ పారిశ్రామికవేత్త ప్రణవ్ బగ్గా అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. గోవాలో తాజాగా ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇదంతా కూడా రహస్యంగానే జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అందరికీ పెళ్లి గురించి తెలిసింది. దీంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: ఇంట్లో పనిమనిషికి ఆ సాయం చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్) View this post on Instagram A post shared by Malvika Raaj (@malvikaraaj)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement