-
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-
ముగియనున్న ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని గడువుపై కొమ్మినేని విశ్లేషణ
-
అంచనాల కంటే ముందే.. రైతులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, సాక్షి: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. మరో చల్లని వార్త చెప్పింది. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే.. ఇదీ చదవండి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షంఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పేర్కొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా జూన్ 5వ తేదీలోపే రుతుపవనాలు చేరతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈలోపు ప్రీ మాన్ సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అక్కడక్కడా వర్షాలు పడ్డప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. -
ఫ్యాషన్ హబ్గా మారబోతోన్న హైదరాబాద్
-
తెలుగు రాష్ట్రాలపై తుపాన్ ఎఫెక్ట్..
-
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
-
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు
హైదరాబాద్/గుంటూరు, సాక్షి: వేసవి తాపం నుంచి ఊరట ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఇరు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. విదర్భ నుంచి తమిళనాడుకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వానలు, అలాగే ఏపీలో నాలుగు రోజులపాటు వానలు కురవనున్నాయి.తెలంగాణలో 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్, నగర శివారుతో పాటు మెదక్, సిద్ధిపేటలో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండలో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది.SEVERE STORMS ALERT - MAY 7As marked in the map, East, Central TG to get massive storms, heavy winds, lightining next 24hrs. West TG to get scattered storms ⚠️Hyderabad already had some rains this morning, more scattered storms ahead today with nice respite from heat 😍 pic.twitter.com/fhzs79oYbN— Telangana Weatherman (@balaji25_t) May 7, 2024ఇక కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి వల్ల నేటి నుంచి మూడు రోజులు పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కురుస్తాయని తెలిపింది. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.మరోవైపు.. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది. ఈ ఉదయం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కాగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక శ్రీకాకుళంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. 6th May 5:25 pm : Heavy Thunderstorms forming in a line along YSR Kadapa, Annamayya, Anantapur and also along Palnadu districts close to Nallamala forest range. Next 2 hours, parts of these districts will see good spells of rain with Thunderstorms. Stay indoors !! pic.twitter.com/fChTo2MPSi— Andhra Pradesh Weatherman (@praneethweather) May 6, 2024 అయితే.. రాయలసీమ జిల్లాలలో ఇవాళ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాలులు కొనసాగినా.. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. బుధవారం నుంచి వాతావరణం చల్లబడొచ్చని చెబుతోంది. ఇంకోపక్క.. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మాత్రం వడగాడ్పులు వీయొచ్చని వాతావరణశాఖ అంచనా. -
తెలంగాణలో భానుడి భగభగలు..!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎండలు ప్రచండ‘మే’ అనేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. సూరీడి ఉష్ణతాపానికి శుక్రవారం ‘ఫ్రై’ డేను తలపించింది. శివార్లలోని కీసరలో 45.7, చిలుకూరులో 45.2, అల్లాపూర్ వివేకానందనగర్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత తొమ్మిదేళ్లలో ఇదే రికార్డు. 2015 మే 22న మాత్రం సికింద్రాబాద్లో 47.6, అబ్దుల్లాపూర్మెట్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆల్టైమ్ రికార్డు. మహానగర సగటు ఉష్ణోగ్రత సైతం రికార్డు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటుండడంతో ద్విచక్ర వాహనదారులు, ఇంట్లోని పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాలకు బాధితులు భారీగా వస్తున్నారు. ఆల్కహాల్తోనూ డీ హైడ్రేషన్.. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలను తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. వేళకు సరిపడా నీరు తాగక పోవడం, ఉక్కపోతకు శరీరంలోని నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోతుండటంతో త్వరగా డీహైడ్రేషన్కు లోనవుతుండటంతో పాటు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. వడదెబ్బ లక్షణాలివీ.. వడదెబ్బకు గురైన వ్యక్తికి మూత్ర విసర్జనలో భరించలేని నొప్పి, కండరాల తిమ్మిరి, భారీగా చెమట పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక హృదయ స్పందన, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. వీరిని తక్షణమే రోగిని చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి, రోగి చుట్టూ గుంపులు గుంపుగా ఉండకూడదు. చన్నీటి బట్ట, స్పాంజ్తో నుదురు, మెడ, తల భాగాన్ని తుడవాలి. వదులుగా ఉండే, తేలిక పాటి, లేత రంగు దుస్తులను ధరించాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు, ఈత ఉత్తమం. ఆరుబయట ఉంటే, నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. నెత్తిన టోపి, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించడం ద్వారా సూర్య రశ్మి నుంచి శరీరాన్ని, కళ్లను కాపాడుకోవచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన..ఫోటోలు
-
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
ఫోర్బ్స్ జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరులు (ఫొటోలు)
-
Good Friday 2024 : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే (ఫొటోలు)
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు
-
ఈసీ షెడ్యూల్.. వైఎస్సార్సీపీ కోరిందే జరిగింది
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి.. ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు మొగ్గు చూపింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఒకేసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ పలుమార్లు కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేసిన టైంలోనే కాకుండా.. ఈసీ సమీక్షకు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలను ఈసీకి సమర్పించింది. ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. దొంగ ఓట్లను అరికట్టవచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించడానికే తాము ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోరుతున్నామని వైఎస్సార్సీపీ ఆ వినతుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాలుగో దశలో ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జూన్ 4వ తేదీన ఇరు రాష్ట్రాల లోక్సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: 175 మందితో వైఎస్సార్సీపీ సిద్ధం -
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 12న వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు నడపనున్నారు. గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్ నడవనుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకి వందేభారత్( రైల్ నంబర్-20707) విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20కి వందేభారత్ ( రైలు నంబర్-20708) సికింద్రాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్- విశాఖ మధ్య మరొక వందేభారత్ రైలును కేటాయించారు. విశాఖ- పూరి మధ్య ఈ నెల 12 నుంచి వందే భారత్ పరుగులు పెట్టనుంది. శనివారం మినహా మిగిలిన ఆరు రోజులలో పూరి- విశాఖ మధ్య వందేభారత్ నడవనుంది. పూరిలో ఉదయం 5.15 బయలుదేరి.. ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకోనున్న వందేభారత్ ( రైలు నంబర్- 20841).. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరి వందేభారత్ ( రైలు నంబర్- 20842) చేరుకోనుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో స్టాపేజ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: ఇంగ్లిష్.. భవిత భేష్ -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా: శివనామ స్మరణతో కోటిపల్లి, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రినీ పురస్కరించుకొని కోటిపల్లి ద్రాక్షారామం ఆలయాలలో క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. వేకువజామున నుంచి భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నంద్యాల: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. కరీంనగర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జనసంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరుగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పించింది. మరో వైపు పంచాక్షరీ నామస్మరణతో రాజన్న సన్నిధి మార్మోగుతోంది. 👉: (మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా భక్తజనం (ఫొటోలు) -
Maha Shivratri: శివయ్య అనుగ్రహం కలగాలంటే..
విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం. ‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి. మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే... మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవత్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాలపై ఎంటీఆర్ మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల సంస్థ ఎంటీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో సునయ్ భాసిన్ తెలిపారు. ఓక్లా ఇండియాలో భాగమైన తమ సంస్థ గత మూడేళ్ల వ్యవధిలో గుంటూరులోని ప్లాంటు, ఇతరత్రా అప్గ్రేడేషన్ మొదలైన వాటిపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో లైన్పై రూ. 30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1.5 లక్షల అవుట్లెట్స్ ఉన్నాయని, గత అయిదేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపయ్యాయని భాసిన్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమ సంస్థకు రెండో అతి పెద్ద మార్కెట్ అని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసి వందేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. మూడు విభాగాలతో కలిపి ఓక్లా ఇండియా టర్నోవరు రూ. 2,300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. -
బంగారం కొనేవారికి మంచి ఛాన్స్..హైదరాబాద్ లో తులం ఎంతంటే?
-
షాక్ ఇస్తున్న బంగారం ధరలు..!
-
భారీగా పడిపోతున్న బంగారం ధర
-
తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్ల కేటాయింపు
ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
Pagination
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురు దెబ్బ
లోక్ సభ ఎన్నికల ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాహల్ గాంధీ: శశిథరూర్
T20 World Cup 2024: ఐర్లాండ్-కెనడా మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఈ హీరోయిన్ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)
త్వరలో ఈపీఎఫ్ వడ్డీ.. మీ ఖాతాలో ఎంతుంది.. ఎంతొస్తుంది?
బీచ్లో బుజ్జి సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
T20 World Cup 2024: పాక్ పేసర్పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
Advertisement