-
'తెలుగు టెక్ ట్యూట్స్' సయ్యద్ హఫీజ్ నెల సంపాదన ఎంతో తెలుసా!
ప్రముఖ తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్ సయ్యద్ హఫీజ్కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైంటిక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఉన్నత విద్యను చదవకపోయినా టెక్నాలజీపై తనకున్న మక్కువతో 2011 నుంచి హఫీజ్ 'తెలుగు టెక్ట్యూట్స్' పేరుతో వీడియో కంటెంట్ను అందిస్తున్నాడు. ముఖ్యంగా అటు సోషల్ మీడియాను.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలి. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రమాదాల గురించి యూజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ రివ్వ్యూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోవడాన్ని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. 8.89 క్రియేట్ స్కోర్తో టాప్ 100 డిజిటల్ స్టార్ట్స్లో చోటు కల్పిచ్చింది. సయ్యద్ హఫీజ్ ఆదాయం ఎంతంటే టెక్ కంటెంట్తో యూజర్లకు ఆకట్టుకుంటున్న సయ్యద్ హఫీజ్ యూట్యూబ్ ఛానల్కు ప్రస్తుతం 16లక్షల మంది సబ్ స్క్రైబర్లతో నెలకు రూ.2 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ర్యాంకులు ఎలా ఇచ్చింది ఫోర్బ్స్ ఇండియా, ఐఎన్సీఏ, గ్రూప్ ఎం సంస్థలు సంయుక్తంగా డిజటల్ స్టార్ట్స్ ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్, ఫిట్నెస్, ఫుడ్,టెక్, ట్రావెల్, సోషల్ వర్క్ ఇలా తొమ్మిది రకాల కంటెంట్తో యూజర్లను ఆకట్టుకుంటున్న 100కి ర్యాంకులు విధించింది. ఆ 100మందిని ఎలా సెలక్ట్ చేసిందంటే టాప్ 100 డిజిటల్ స్టార్స్లో స్థానం సంపాదించిన కంటెంంట్ క్రియేటర్లు నెటిజన్లు ఆకట్టుకోవడంతో పాటు క్రియేట్ చేసే కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది. ఎంత మంది ఆ కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నారు. ఆ కంటెంట్ జెన్యూన్గా ఉందా? లేదా? ఇలా అన్నీ రకాలు పరిశీలించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ లిస్ట్లో సయ్యద్ హఫీజ్ 32వ స్థానం దక్కడం గమనార్హం. చదవండి: ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు! -
యాపిల్ సంచలన నిర్ణయం.. వాటిని పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధం..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్-14 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు యాపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. iDropNews నివేదిక ప్రకారం...ఐఫోన్-11 స్మార్ట్ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ 3తో నేరుగా పోటీపడటంతో...ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్-11, ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్-11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఇదిలా ఉండగా ఐఫోన్-12 ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్ ధరలు ఐఫోన్-11 ధరలతో సమానంగా ఉండే ఆస్కారం ఉందని ఐడ్రాప్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే... -
సూపర్ ఫీచర్స్తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్ఫోన్ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..! -
వాట్సాప్ సంచలన నిర్ణయం..!
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్ను రూపొందిస్తోంది వాట్సాప్. కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసెజ్స్కు కళ్లెం..! ఫార్వెర్డెడ్ మెసేజ్స్కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫార్వర్డ్ మెసేజ్లకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ను టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తెస్తోన్న ఫీచర్తో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్లకు చెక్ పెట్టనుంది. ఈ ఫీచర్తో ఒక మెసేజ్ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ చేయకుండా చేస్తోంది. దీంతో స్పామ్ మెసేజ్లకు వాట్సాప్ అడ్డుకట్ట వేయనున్నది. ఒకవేళ సదరు మెసేజ్ను ఒకరికంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయా మెసేజ్ను కాపీ చేసి రెసిపెంట్ కాంటాక్ట్ చాట్కు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన వాట్సాప్ల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ విజయవంతమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ ట్రాకర్ బెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: పండుగ వేళ ఆకాశంలో అద్భుతం...! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..! -
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..! ఈ ఎమోజీ పంపితే 20 లక్షల జరిమానా..!
Warning for Whatsapp Users: వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వాట్సాప్ చాట్స్లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అక్కడి ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది. ఒక వేళ రెడ్ హార్ట్ ఏమోజీలను పంపితే రూ.20 లక్షల జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. . వేధింపులతో సమానంగా... గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం... వాట్సాప్ చాట్స్లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు. వాట్సాప్లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్ప్రెషన్స్ను పంపించడం వేధింపుల నేరమవుతుందని ఆయన పేర్కొన్నారు. యూజర్లు ఇతరులకు రెడ్ హార్ట్ ఎమోజి మెసేజ్లను పంపితే వారు తీవ్రంగా భావిస్తే కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయడం నేరం. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సౌదీ అరేబియాలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కింద పరిగణిస్తారు. అక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్లో రెడ్ హార్ట్ లేదా రెడ్ రోజెస్ వంటి ఎమోజీలను పంపించడం తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి 1లక్ష సౌదీ రియల్స్ను జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3లక్షల సౌదీ రియల్స్ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement