-
రూ. 2 కోట్లు ఆఫర్ ఇచ్చినా అందుకు నో చెప్పిన సాయిపల్లవి
నటిగా తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ను పెట్టుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె చదివింది వైద్యవిద్య అయినా అయ్యింది నటి. తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న సాయిపల్లవి. దీంతో మలయాళం, తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే నటిగా కొన్ని నిర్ధిష్టమైన భావాలకు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా గ్లామర్కు దూరంగా ఉంటడం. సహజత్వానికి ప్రాధాన్యత నివ్వడం. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం వంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉంటారు. తన పాత్రకు అవకాశం లేకపోతే నిక్కచ్చిగా నిరాకరించేస్తుంది సాయిపల్లవి. అది ఎంత పెద్ద స్టార్ నటుడి చిత్రం అయినా సరే. అలా జరిగింది కూడా. అలాంటి నటి ఇప్పుడు సైలెంట్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదీ రామాయణ్ చిత్రంలో సీతగా నటించే అవకాశం వరించింది. ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోలను చూస్తే సీత పాత్రలో సాయిపల్లవి ఎంతగా ఒదిగి పోయారో అని అనిపిస్తుంది. ఇకపోతే తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో శివకార్తీకేయన్కు జంటగా నటిస్తున్న అమరన్ చిత్రాన్ని పూర్తి చేశారు.కాగా నటి సాయిపల్లవికి ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి రూ. 2 కోట్లు పారితోషకం ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయిపల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. కారణం అది ఒక సౌందర్య సాధనకు చెందిన ప్రకటన కావడమేనట. అలాంటి సౌందర్య వస్తువులతో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాదన్న ఒక్క కారణంగా అంత పారితోషాకిన్ని చెల్లిస్తానన్నా సాయిపల్లవి నో చెప్పారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పారు. -
Tandel: ప్రేమ కబుర్లు
మొబైల్లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ ఫిల్మ్కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్. సత్యభామ ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
ప్రస్తుత జనరేషన్లో మిగతా హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి కాస్త డిఫరెంట్. నటన, పాత్రల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తుంది. 'ప్రేమమ్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం 'తండేల్' సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి.. తమిళంలో శివకార్తికేయన్ మూవీలో చేస్తోంది. హిందీలో 'రామాయణ్' పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సరే ఇదంతా పక్కనబెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తన శారీరక సౌందర్యం గురించి మాట్లాడింది. 'ప్రేమమ్' మూవీ టైంలో ముఖంపై మొటిమలు చాలా ఉండేవి. తనకు చిత్రంలో అవకాశం రావడానికి కారణమే కూడా అవే. ప్రస్తుతం మాత్రం తన ముఖంపై ఎలాంటి మొటిమలు లేవు. అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా? అని చాలామంది అడుగుతున్నారు. కానీ తాను ఎలాంటి చికిత్స గానీ థెరఫీ గానీ చేయించుకోలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం సహజమేనని చెప్పిన సాయిపల్లవి.. అవి పోవడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదన్నారు. వాటంతటికి అవే పోతాయని చెప్పింది. తన ఒత్తయిన జుత్తు సీక్రెట్ గురించి చెప్పిన ఈ బ్యూటీ.. తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటానని, ఆలోవెరా జెల్స్ ఉపయోగిస్తానని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్) -
తండేల్ - భారీ ధరకు డిజిటల్ రైట్స్
-
భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో చైతూ కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. తండేల్ మూవీ ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. నాగచైతన్య కెరీర్లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న తండేల్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
మాస్ డిష్యుం
‘తండేల్’ సెట్స్లో డిష్యుం డిష్యుం అంటూ అదిరిపోయే మాస్ ఫైట్స్ చేస్తున్నాడు రాజు. నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాకు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ‘తండేల్’లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
హైదరాబాద్లో తండేల్
నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్’. ‘లవ్ స్టోరీ’ వంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్యతో రెండోసారి ‘తండేల్’లో నటిస్తున్నారు సాయి పల్లవి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూట్ డైరీస్ పేరుతో సెట్స్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ ‘తండేల్’. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. పాత్రలకు అనుగుణంగా నాగచైతన్య–సాయిపల్లవి డీ –గ్లామర్గా కనిపిస్తారు. నటీనటుల గెటప్, క్యాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చందు మొండేటి’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్దత్. -
Thandel Shooting Pics: సాయి పల్లవి ఒళ్లో క్యూట్ పాప.. తండేల్ షూటింగ్ ఫోటోలు
-
తండేల్ పైనే చైతూ ఆశలు..!
-
హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు!
హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు ఏంటి? అనే సందేహం తలెత్తడం ఖాయం. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా కోసం హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆ జైలు సెట్లోనే జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేపల వేటలో భాగంగా పోరపాటున పాకిస్తాన్ సముద్రంలోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల వాస్తవ ఘటనలతో ‘తండేల్’ రూపొందుతోంది.పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించిన వారిలో ఓ వ్యక్తిపాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్లోపాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్లో షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగేపాకిస్తాన్ జైలు నుంచి విడుదలై భారతదేశానికి వచ్చిన మత్స్యకారులు ఒక రైల్వే స్టేషన్లో దిగే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారట మేకర్స్. హైదరాబాద్లోని రైల్వేస్టేషన్లో ఈ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. -
తండేల్ సెట్లో నాగ చైతన్య.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో!
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. నాగచైతన్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ బర్త్ డేను సెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. తండేల్ మూవీ సెట్లో కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందు కూడా అతనికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంతవాళ్లలా చూసుకునే చైతూపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Our Queen @Sai_Pallavi92 🥹🤍 from the sets of #Thandel movie celebrating @chay_akkineni 's assistant Venki Bday ❤️#SaiPallavi @chandoomondeti pic.twitter.com/YwbFzksCSG — SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) March 10, 2024 -
ఉత్తరాంధ్రపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్
టాలీవుడ్లో ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే సినిమాలు ఎక్కువ వచ్చేవి. హీరోలు కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడేవాళ్లు. ఆ తర్వాత తెలంగాణ నేపథ్య కథలు వెండితెరపై సందడి చేశాయి. కేవలం విలన్లకు, కమెడియన్లకు మాత్రమే వాడే తెలంగాణ యాసను.. హీరో పాత్రతో మాట్లాడించి హిట్ కొట్టారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు నాని, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, నాగచైతన్య లాంటి యంగ్ స్టార్స్ సైతం తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అంతా ఉత్తరాంధ్ర బాషపై మక్కువ చూపుతున్నారు. టాలీవుడ్లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడట బుచ్చిబాబు. ఇందులో హీరోతో పాటు అన్ని మిగతా పాత్రధారులంతా ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారట. ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడే నటీనటులను వెతికే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర యాస కోసం రామ్ చరణ్ శిక్షణ తీసుకుంటున్నారట. ఈ మూవీలో ఆయన లుక్ చాలా రస్టిక్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జాలరి ప్రేమ కథ నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరు ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారు.ఇటీవలే వచ్చిన గ్లింప్స్లో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది. ‘మట్కా’ఆడనున్న వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస ఫేం కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. మట్కా అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆడే ఒక జూదం.1958-1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా మట్కా స్టోరీ రాసుకున్నాడు కరుణ కుమార్. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర యాసలో అనుష్క మాటలు అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ లేడి ఓరియెంటెండ్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వేదం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలాంటి పోరాటం చేసిందనే పాయింట్తో ఈ కథను రాసుకున్నాడట క్రిష్. ఇందులో అనుష్క ఉత్తరాంధ్రకు చెందిన యువతిగా కనిపించబోతున్నారట. ఇవి మాత్రమే కాదు.. తెలుగులో మరిన్ని చిత్రాలు ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. - పోడూరి నాగ ఆంజనేయులు -
'ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయా'.. నాగచైతన్య హీరోయిన్పై సామ్ కామెంట్స్!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడుదాని నుంచి బయటపడటానికి శత విధాలుగా పోరాడుతున్నారు. ఈ కారణంగా సినిమాలను కూడా కోల్పోతున్నారు. కాగా తాజాగా వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. గతంలోనే అంగీకరించిన సిటాడెల్ అనే వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్సిరీస్లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహతప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్సిరీస్ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే నూతన చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో ద్వారా విడుదల చేశారు. సాయిపల్లవిపై ప్రశంసలు మరో టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయిపల్లవి మంచి డాన్సర్ అన్న విషయం తనకు తెలుసన్నారు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు తాను జడ్జిగా కూడా వెళ్లానన్నారు. అప్పుడు సాయి పల్లవి డాన్స్ను చూసి దృష్టి మరల్చలేక కళ్లప్పగించి చూస్తుండి అలాగే పోయానన్నారు. కాగా..ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
దసరాకు తండేల్!
దసరా పండక్కి థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట ‘తండేల్’. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ``కాగా ‘తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట దర్శకుడు చందు మొండేటి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
సాయిపల్లవికి నాగచైతన్య లవ్ ప్రపోజల్.. వీడియో చూశారా?
నటుడు నాగచైతన్య వాలెంటైన్స్ రోజున ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో హీరోయిన్ సాయి పల్లవికి లవ్ ప్రపోజల్ చేస్తున్నట్లు ఉంది. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో వీరిద్దరూ ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిదే. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం స్పెషల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డైలాగ్తో ఇన్స్టాలో లెక్కలేనన్ని రీల్స్ వచ్చాయి. ఇప్పుడు నాగచైతన్య కూడా సాయి పల్లవితో ఒక రీల్ చేశాడు. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే అంటూ వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. తండేల్ గ్లింప్స్ పట్ల వస్తున్న రెస్పాన్స్ తనకు చాలా థ్రిల్లింగ్ ఉన్నట్లు నాగచైతన్య చెప్పాడు. దానిపై నెటిజన్లు రీల్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. దీంతో అందరిలా తాము కూడా ఒక రీల్ చేయాలని నిర్ణయించుకొని వాలెంటైన్స్ డే రోజున అందిస్తున్నట్లు ఆయన తెలిపాడు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
మరో ముందడుగు
ఆగేదే లేదన్నట్లుగా ‘తండేల్’ చిత్రం షూటింగ్ నాన్స్టాప్గా జరుగుతోంది. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందూ మొండేటి. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. రాజు మనసు గెలుచుకున్న అమ్మాయి పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్, కర్ణాటక, ఉడిపి, గోకర్ణి లొకేషన్స్లో షూటింగ్స్ను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసినట్లు వెల్లడించి, ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘‘రాజు పాత్ర కోసం నాగచైతన్య అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సాయిపల్లవి సహజ సిద్ధంగా కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
స్పెషల్ లుక్లో 'తండేల్' హీరో.. వీడియో వైరల్!
గతేడాది కస్టడీ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన హీరో అక్కినేని నాగచైతన్య. సురేశ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం బ్యాప్డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోన్న తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీగా కనిపించనుంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స టీజర్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మత్స్యకారుడి పాత్రలో చై కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫిషర్మేన్ బాడీ లాంగ్వేజ్ కోసం మూడు నెలలు కష్టపడ్డానని నాగ చైతన్య వెల్లడించారు. తాజాగా నాగ చైతన్య ఎయిర్పోర్ట్లో కనిపించారు. గడ్డంతో ఉన్న చైతూ ఫుల్ స్టైలిష్ లుక్లో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండేల్ కథేంటంటే.. గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా.. అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా.. తండేల్కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #TFNExclusive: Thandel Raju aka Yuvasamrat @chay_akkineni gets papped at Hyderabad airport in a fully rugged look!😎🔥#NagaChaitanya #Thandel #TeluguFilmNagar pic.twitter.com/GSdYBHreq0 — Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2024 -
టార్గెట్ 2024.. ఈ సారైనా హిట్ కొడతారా?
గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే...ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి..హిట్ ట్రాక్ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు..? యంగ్ హీరో నితిన్..2022 లో మాచర్ల నియోజక వర్గంతో వచ్చి నిరాశ పడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు .. ఇది బెడిసికొట్టింది. అందుకే తనకు అచ్చోచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకొని గత ఏడాది..ఎక్ట్రా ఆర్డనరి మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కాని ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. (చదవండి: క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?) అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పొతినేని రామ్...ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూల్లు రాబట్టాడు.దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్తో వచ్చాడు. 2022 లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కంద తో గత ఏడాది మరోసారి మాస్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియోలో ట్రోల్స్ కు గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదికి వస్తాడేమో చూడాలి. (చదవండి: దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!) నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు.థాంక్యూ మూవీతో పాటు..కస్టడీతో ..ప్లాపులు చూశాడు.ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తున్నాడు. చందు మోండెటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ హీరోలతో పాటు..విజయ్ దేవరకొండ,నిఖిల్,మంచు విష్ణు లాంటి కథాయకులతో పాటు...కుర్ర హీరోలు..వైష్ణవ్ తేజ్ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది. -
ఇక రాజులమ్మ జాతరే...
‘దదా.. గుర్తెట్టుకో.. ఈ పాలి యేట.. గురి తప్పేదెలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో నాగచైతన్య చెప్పే డైలాగ్తో మొదలవుతుంది ‘తండేల్’ గ్లింప్స్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతోంది. ‘ఎసెన్స్ అఫ్ తండేల్’ అంటూ శనివారం గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ‘మా నుంచి ఊడపోసిన ఓ ముక్కా.. మీకే అంతుంటే ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంతుండాలి’, ‘తేరే పాకిస్తాన్కే అడ్డా మే బైట్కే బతా రహ్ తా హూం. భారత్ మాతా కీ జై’ అంటూ నాగచైతన్య చెప్పిన మరికొన్ని డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. ‘‘వాస్తవ ఘటనలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. పాకిస్తాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ భారత మత్స్యకారుని కథే ఈ సినిమా ప్రధానాంశం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
నాగచైతన్య తండేల్ సినిమా టీజర్
-
'తండేల్' టీజర్ లాంటి వీడియో.. 2 నిమిషాల్లో కథేంటో చెప్పేశారుగా!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య అదరగొట్టేశాడు. 'తండేల్' సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడీ అక్కినేని హీరో. 'ఎసెన్స్ ఆఫ్ తండేల్' పేరుతో తాజాగా ఓ స్పెషల్ వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. చెప్పాలంటే శుక్రవారం సాయంత్రమే విడుదల చేయాల్సింది కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల శనివారం ఉదయం రిలీజ్ చేశారు. అయితే టీజర్ లాంటి ఈ వీడియో ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా, అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది. బోటుపై చేపల వేటకు వెళ్తున్న హీరో.. 'దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే' చెప్పే ఓ డైలాగ్తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతడు పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సీన్స్ చూపించారు. చివర్లో సాయిపల్లవిని అలా చూపించి టీజర్ని ముగించారు. అయితే కథేంటనేది.. ఈ వీడియోలో చూచాయిగా చెప్పేశారు. చైతూ మాట్లాడిన శ్రీకాకుళం యాస కూడా బాగుంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్'తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
రాజు మనసులో సత్య
గోకర్ణలో రాజును కలిసింది సత్య. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ఉడిపిలో ప్రారంభమైంది. తాజాగా గోకర్ణలో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ లొకేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘రాజు అనే జాలరి మనసును గెలుచుకునే పల్లెటూరి అమ్మాయి సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
తండేల్ జర్నీ ప్రారంభం.. సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్తో మరో సినిమా ప్రారంభమైంది. లవ్ స్టోరీ చిత్రం తర్వాత వారిద్దరూ ‘తండేల్’లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్, సాయి పల్లవి, అల్లు అరవింద్తో పాటు మూవీ టీమ్ హాజరైంది. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సాయి పల్లవి నిలిచింది. 'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు భారీగానే కసరత్తు చేశాడు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. ఈ రియల్ కథకు తనదైన స్టైల్లో తెరకెక్కించేందుకు ఆయన రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెడుతున్నారని పూజా కార్యక్రమంలో నాగ చైతన్య తెలిపాడు. 'లవ్స్టోరి' తర్వాత మళ్లీ సాయిపల్లవితో కలిసి ఇందులో నటించడం. తన వల్ల కథకి మరింత బలం చేకూరినట్టైందని ఆయన అన్నాడు. విస్తృత పరిధి ఉన్న కథ కావడంతో కొంత భాగం ఇండియాలో, కొంత భాగం పాకిస్థాన్లో చిత్రీకరణ జరుగుతుందని చైతూ తెలిపాడు. ఈ చిత్రానికి సంగాతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. KING @iamnagarjuna garu graces the #Thandel Muhurtham Ceremony to extend his wishes and blessings to the team ❤️🔥 Watch live now! - https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥 Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas… pic.twitter.com/WWnv5evAFH — Geetha Arts (@GeethaArts) December 9, 2023 The ever gracious @Sai_Pallavi92 is here at the #Thandel Muhurtham Ceremony ❤️🔥 Watch live now! - https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥 Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @KarthikTheeda @bhanu_pratapa… pic.twitter.com/GfMxTT5fvc — Geetha Arts (@GeethaArts) December 9, 2023 -
సముద్రం వైపు స్టార్ హీరోలు.. విజయ తీరాలకు చేరేనా?
మొన్నటి వరకు అడవి బాట పట్టిన తెలుగు హీరోలు..ఇప్పుడు సముద్రం వైపు చూస్తున్నారు. తీర ప్రాంతాల నేపథ్యంలో ఉన్న కథలను ఎంచుకొని బాక్సాఫీస్ వేటకు రెడీ అవుతున్నారు. కోస్టల్ బ్యాక్డ్రాప్ రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ మూవీ నేపథ్యం సముద్ర తీర ప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్. కోస్టల్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ని నిర్మించారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. తండేల్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. ఇందులో చైతూ మత్య్సకారుడిగా కనిపించబోతున్నాడు. తండ్రి బాటలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో 'వాల్తేరు వీరయ్య' వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసి హిట్ కొట్టాడు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా తండ్రిని ఫాలో అవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో నటించబోయే సినిమా కథకి సముంద్రంతో లింక్ ఉంటుందని అంటున్నారు. కోస్తా బ్యాక్డ్రాప్లో స్మోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్నట్లు సమాచారం. అలాగే పవన్ కల్యాణ్-సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ(OG) కథకు కూడా సముద్రంతో సంబంధం ఉంటుందట. ముంబై షిప్పింగ్ యార్డ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మొత్తానికి తెలుగు స్టార్ హీరోలంతా విజయం కోసం సముద్రాన్ని నమ్ముకున్నారు. మరి వీరిలో ఎవరు విజయ తీరాలకు చేరుతారో చూడాలి. -
టాలీవుడ్ కి గట్టి షాక్ ఇవ్వబోతున్న నాగ చైతన్య
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement