-
ఉజ్జయినిలో విచిత్ర పోటీ.. ఇద్దరు అనిల్లు, ఇద్దరు మహేష్లు!
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్లు, ఇద్దరు మహేష్లు ముఖాముఖీ తలపడటం విశేషం.ఉజ్జయిని నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్లాల్, సురేష్, ఈశ్వర్లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి -
శ్రీరాముని రూపంలో మహాకాళేశ్వరుడు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి, వివిధ పూజలు చేశారు. హారతి అనంతరం మహాకాళేశ్వరునికి వెండి కిరీటం, రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి సమయాన మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళ్వేర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి, అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీ మహాకాళ్ నినాదాలతో మారుమోగిపోయాయి. -
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం
మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గర్భగుడిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. बहुत दुखद खबर उज्जैन के महाकाल मंदिर में भस्म आरती के दौरान लगी आग, कई लोग झुलसे ! ईश्वर से सभी के सकुशल होने की कामना करते है !🙄😥🙏#होलिकोत्सव#Ujjain #MahakaleshwarTemple pic.twitter.com/YuuEvpLYHm — Rajni (@RajniRajni2210) March 25, 2024 వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు. -
ఉజ్జయినిలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం!
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 29) శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (గురువారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి శివపంచాయతన పూజ, అభిషేకం జరిగింది. హారతి అనంతరం మహాకాళేశ్వరుని పూజ, అభిషేకం జరిగింది. 11 మంది బ్రాహ్మణులు ఈ పూజలను నిర్వహిస్తున్నారు. వీరు ఈ శివరాత్రి మహోత్సవాలలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహాకాళేశ్వర ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత, పార్కింగ్, ప్రసాద వితరణ తదితర సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మార్చి 8న జరిగే శివరాత్రి వేడుకల వరకూ ప్రతీరోజూ మహాశివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ శివ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే పండితులు ఉపవాసం పాటించనున్నారు. -
ఏ అవగాహనా లేదు!
గువాహటి: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్ ఈశాన్య పర్యాటకానికి గేట్వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు. పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు. ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. ‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్ లేన్ హైవేలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి. విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్.ఎన్.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. ‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు. ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?
భోపాల్: కాంగ్రెస్ నేత కమల్నాథ్ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్ నేత కమల్నాథ్ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కమల్నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్ ప్రశ్నించారు. -
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్యాక్షన్కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
ఉజ్జయిని కేసులో వారిపై కూడా చట్టపరమైన చర్యలు: ఏఎస్పీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. శభాష్ పోలీస్.. ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బాధ్యతారాహిత్యం.. సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరణశిక్ష విధించండి.. ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఇది కూడా చదవండి: గ్యాంగ్స్టర్ సునీల్ నాహక్ హత్య -
మనిషికేమైంది..?
ఉజ్జయిని: ఈ వారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు మన సమాజం ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ మానవత్వం ఉందా, కన్నుమూసిందా అన్న సందే హాన్ని రేకెత్తిస్తున్నాయి. ఉజ్జయిని నగర వీధుల్లో మొన్న సోమవారం ఉదయం ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా నెత్తురోడుతున్న పన్నెండేళ్ల బాలిక తనను కాపాడాలంటూ ఇల్లిల్లూ తిరిగి విన్నవించుకున్నా ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు. ఇలా రెండున్నర గంటలు గడిచి ఆమె స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా ఒక ఆశ్రమం నుంచి బయటికొస్తున్న యువకుడు గమనించి చొరవ తీసుకున్నాడు. తన పైపంచె తీసి కప్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలో తేలింది. బహుశా ఆ యువకుడు కూడా స్పందించకపోయి వుంటే రక్తస్రావంతో ఆమె మరణించేది కూడా. ఎందుకంటే అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఆమె అవయవాలను తీవ్రంగా గాయపరిచాడు. గర్భాశయానికైతే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది కూడా. దశాబ్దం క్రితం ఢిల్లీలో నిర్భయ అనుభవించిన నరక యాతననే ఈ బాలిక కూడా చవిచూసింది. తాను ఉజ్జయిని ఎలా చేరిందో చెప్పలేని స్థితిలో ఉంది. బాలిక తప్పిపోయిందని అంతక్రితం ఆమె తాత సాత్నాలో ఫిర్యాదు చేశాడంటున్నారు. ఉజ్జయినికి 720 కిలోమీటర్ల దూరంలోని సాత్నా నుంచి ఆ బాలికను తరలించిందెవరు అన్నది ఇంకా తేల్చాల్సి వుంది. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు మరో అయిదు గురిని అరెస్టు చేశారు. దేశ రాజధాని నగరంలో మంగళవారం జరిగిన ఉదంతం కూడా అమాను షమైనది. ప్రసాదం దొంగిలించాడన్న అనుమానంతో మతిస్థిమితం లేని ఒక ముస్లిం యువకుణ్ణి అందరూ ఏకమై కరెంటు స్తంభానికి కట్టి, తీవ్రంగా కొట్టి ప్రాణం తీశారు. ఒంటినిండా గాయాలతో తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడని శవపరీక్షలో తేలింది. ఈ ఉదంతంలో అరెస్టయిన ఏడు గురూ పాతికేళ్ల లోపువారే కాగా, అందులో ఒకడు మైనర్. ఈ రెండు ఉదంతాల్లోనూ సమాజం ప్రేక్షక పాత్ర వహించింది. బాధితులను ఆదుకోవాలన్న స్పృహ లేకుండా ప్రవర్తించింది. ఉజ్జయిని నగరానికి ఉజ్వల చరిత్ర వుంది. ఒకనాడది వైభవోపేతంగా వర్ధిల్లిన సాంస్కృతిక కేంద్రం. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుడి విశాల సామ్రాజ్యంలో భాగం. తన తండ్రి బిందుసారుడి కాలంలో అశోకుడు స్వయంగా పర్యవేక్షించిన ప్రాంతం. నాలుగో శతాబ్దంలో రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి రాజధాని. అది కాళిదాస మహాకవీంద్రుడు నడయాడిన నేల. అక్కడే శూద్రకుడు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వంటివారు వివిధ శాస్త్రాల్లో ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గడించారు. అంతటి గొప్ప చరిత్ర కలిగినచోట పట్టపగలు నగర వీధుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక బాలిక కాపాడమని అర్థిస్తే ఆడ, మగ అందరూ తలుపులేసుకున్నారంటే... పదో పరకో ఇచ్చి తమ అపరాధ భావనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారంటే ఎలాంటి వారికైనా మనసు వికలమవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలించటానికీ, కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పటానికీ ఎవరూ ముందుకు రాకపోవటం తరచు గమనిస్తూనే ఉంటాం. చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటామనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ ఇప్పటికీ అనేకులు వెనకడుగేయటం కనబడుతూనే ఉంటుంది. కానీ అర్ధనగ్న స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన బాలికకు వైద్య సాయం అందేలా చూడటం సంగతి అటుంచి కనీసం ఒంటిని కప్పుకోవటానికి బట్టలిచ్చేందుకు కూడా ఎవరూ సిద్ధపడకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమానవీయతకు సీసీ టీవీ కెమెరాలు సాక్ష్యంగా నిలిచాయి. సమాజం మొత్తాన్ని కాపలా కాయటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమన్నది వాస్తవం. లక్షల్లో జనాభా ఉండేచోట వందల్లో మాత్రమే రక్షకభటులుంటారు. అయితే ఉన్న ఆ కొద్దిమందీ కూడా కొన్ని సందర్భాల్లో నేరగాళ్లకు సాయపడుతున్నారనీ, రాజకీయ ప్రాపకం కోసం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండున్నర గంటలపాటు ఆ బాలిక ఎక్కడో మారుమూల పల్లెటూరులో కాదు... కేంద్రం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నగర వీధుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో సంచరిస్తున్నప్పుడు ఒక్క కానిస్టేబులైనా ఆమెను గమనించి ఆదుకోలేకపోవటం పోలీసుల పనితీరును పట్టిచూపిస్తోంది. ఇక గోవధ జరిగిందనో, జరగబోతున్నదనో అనుమానంతో కొందరు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి చంపుతున్న ఉదంతాల్లో నేరగాళ్లకు ప్రభుత్వాల ఆశీస్సులుంటున్న సంగతి బహిరంగ రహస్యం. కానీ సమాజం ఏమై పోతోంది? పట్టపగలు కళ్లెదుట జరుగుతున్న దురంతాలపై కూడా కనీస స్పందన కొరవడటం, సహానుభూతి వ్యక్తం కాకపోవటం ఏమిటి? ఎన్నికల్లో ఓటేయటంతోనే పౌరులుగా తమ బాధ్యత తీరిందని జనం అనుకుంటున్నారా? కుల మత చట్రాల్లో, రాజకీయ రొదలో కూరుకుపోయి మనుషు లుగా తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నారా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఆపత్సమయాల్లో మానవీయతను ప్రదర్శించటం, సహానుభూతి వ్యక్తపరచటం, బాధితులకు అండగా నిలవటం మనుషుల కనీస లక్షణాలని తెలుసుకోలేని సమాజం శవప్రాయమైనది. అలాంటిచోట ఎవరికీ రక్షణ ఉండదు. సమాజం సంఘటితంగా ఉన్నప్పుడే, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించు కున్నప్పుడే ఇలాంటి దురంతాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదీ చదవండి: అర్ధనగ్నంగా రక్తమోడుతూ -
ఉజ్జయిని కేసు: నిందితుడు తప్పించుకునే ప్రయత్నం
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. #WATCH | Ujjain minor rape case: Ujjain SP Sachin Sharma says, "There is an accused in the rape case. There is another auto driver against whom a case will be registered for not informing the police about the incident. When we were taking (the accused) for recreation of the crime… pic.twitter.com/6x3AggXxqq — ANI (@ANI) September 28, 2023 ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి -
ఉజ్జయిని హర్రర్.. ‘భయంతో నా వెనక దాక్కుంది, ఆమెకు మాటిచ్చాం’
అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈఘటనలో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్తోపాటు మరోముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనస్థితిలోని బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచి.. ఈ ఫుటీజీలో బాధితురాలు చెప్పులు లేకుండా సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచినట్లు తేలింది. అరెస్ట్చేసిన ఆటో డ్రైవర్ను రాకేష్గా గుర్తించారు. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఈ ఆటోనే ఎక్కిందని, ఆ సీసీటీవీ వీడియో కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఆటోలు రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆటోను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్ అయిన మిగతా ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లనే తేలింది. వీడియో బయటకు రావడంతో.. అణ్యంపుణ్యం తెలియని పన్నెండేళ్ల బాలిక నీచుల చేతిలో అఘాయిత్యానికి గురై ఉజ్జయిని కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నగర్ రోడ్డుపై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ సాయం కోరుతూ కనిపించిన వీడియో అందరినీ కంట తడి పెట్టించిన విషయం తెలిసిందే. చిన్నారికి వచ్చి కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేని దారుణమైన ఉదంతం మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం బయటకు రావడంతో ఈ దారుణం గురించి తెలిసింది. చదవండి: యువతిపై స్పా యజమాని దాడి.. రోడ్డుపై జుట్టు లాగి, దుస్తులు చింపి సిట్ ఏర్పాటు.. బాలికను చూసిన కొందరు పొమ్మంటూ సైగలు కూడా చేయడం కూడా వీడియో కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుటకు రాగా రాహుల్ శర్మ అనే పూజారి గమనించి ఆమెకు దుస్తులు అందించాడు. బాధితురాలు నిస్సహక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచ్చిందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని, ఆమె నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలిపారు. He is Acharya Rahul Sharma, a priest in an Ashram in Ujjain. When a 12-year-old rape victim, went door to door, semi-naked, asking for help & no one came to her rescue, she eventually reached an Ashram. Then, Acharya Rahul Sharma covered her with a towel & rushed her to the… pic.twitter.com/3KlCiLFy6t — Anshul Saxena (@AskAnshul) September 28, 2023 నా దుస్తులు ఇచ్చి, పోలీసులకు కాల్ చేశా: పూజారి ఉజ్జయిని అత్యాచార బాధితురాలిని రక్షంచిన పూజారి రాహుల్ శర్మ.. బాలిక ఎదుర్కొన్న భయానక స్థితిని వివరించాడు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర రక్తస్రావంతో అర్ధనగ్నంగా ఉన్న బాలికను గమనించినట్లు తెలిపారు. ఆమెకు తన బట్టలు ఇచ్చినట్లు చెప్పారు. రక్తం కారుతూ, కళ్ళు వాచిపోయాయి కనిపించాయని, ఏం మాట్లాడలేకపోయిందని పేర్కొన్నారు. వెంటనే డయల్ 100కి కాల్ చేసినట్లు తెలిపారు. మహంకాల్ పోలీసులు 20 నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భయంతో నా వెనక దాక్కుంది బాలిక తమతో ఏదో చెప్పిందుకు ప్రయత్నిస్తుంటే మాకు అర్థం కాలేదు. ఆమె పేరు, కుటుంబం గురించి ఆరా తీశాము. ఆమె సుక్షితంగా ఉందని, తనను జాగ్రత్తగా ఇంటి వద్దకు చేరుస్తామని భరోసా ఇచ్చాను. కానీ ఆమె చాలా భయపడుతూ కనిపించింది. బాలిక కేవలం మమ్మల్ని మాత్రమే నమ్మింది. వేరే వాళ్లు ఆమె వద్దకు వచ్చినప్పుడు భయపడి నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. చివరికి పోలీసులు వచ్చి ఆమెను తమతో తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు. -
అమానవీయం.. అత్యాచార బాధితురాలి పట్ల కర్కశంగా..
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంటా.. బయటా నిత్యం ఏదో ఒకచోట వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. దాడులు, వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై నేరాలూ తగ్గడం లేదు, దుర్మార్గుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగుచూసింది. మైనర్(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. అత్యాచార బాధితురాలు ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్ మీడియాలో కలవరం రేపుతున్నాయి. అర్థ నగ్నంగా, రక్తస్రావంతో బాలిక బాధపడుతూ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దారుణ ఘటన ఉజ్జయిని సమీపంలోని బాద్నగర్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. షాక్కు గురిచేస్తోన్న ఈ వీడియోలో 12 ఏళ్ల వయసున్న ఓ బాలిక ఒంటిపై ఓ క్లాత్తో వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. రోడ్డు మీద ప్రజలు ఆమెను చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేసేందుకు మాత్రం ముందుకు రాకపోవడం మరింత సిగ్గుచేటు. సహాయం కోసం ఓ వ్యక్తిని సంప్రదించగా అతను బాలికను వెళ్లిపోమ్మంటూ నెట్టేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చివరకి బాధితురాలు ఓ ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఓ పూజారి ఆమెను చూశారు. ఆమెపై టవల్ కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు జరిపిన పరీక్షల్లో బాలికపై త్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలుండంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. బాలిక ఎక్కడ అఘాయిత్యం జరిగిందో ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ జరిపి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి బాధితురాలి వివరాలు కూడా తెలియలేదని అయితే ఆమె మాటలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి చెందినట్లు తెలుస్తుందన్నారు. ఈ భయానక సంఘటన మధ్యప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న ఘోరాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. 2019 నుంచి 2021 మధ్య మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అత్యధికంగా మహిళలు, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2021లో మధ్యప్రదేశ్లోనే ఎక్కువ అత్యాచార ఘటనలు (6,462) నమోదయ్యాయి. వాటిలో 50 శాతానికి పైగా నేరాలు మైనర్లపైనే జరిగాయి. అంటే సగటున రోజుకు 18 అత్యాచారాలునమోదవుతున్నాయి. -
ఏ నాయకుడు అయినా ఆ పుణ్యక్షేతంలో రాత్రిపూట ఉన్నారో అంతే..!
భారతదేశంలో పురాతన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని చాలా మహిమాన్వితమైనది. ఈ నగరం దేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్ర స్థానంగా అలరారుతుంది. మధ్యప్రదేశ్లో శిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఈ నగర సాంస్కృతిక వారసత్వం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉజ్జయిని నగరంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి రాత్రిపూట బస చేయలేదట. ఇంతవరకు అలా ఎవ్వరూ ఉండేందుకు సాహసం చేయలేదట. ఎందకలా? దాని వెనుక దాగిఉన్న రహస్యం ఏంటీ?.. నిజానికి ఈ ఉజ్జయినిని మహాభారత కాలంలో 'అవంతి' అని పిలిచేవారు. వేదాలు, పురాణాలతో సహ వివిధ పురాతన హిందూ గ్రంథాల్లో ఈ నగరం ప్రస్తావన ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ నగరం పేరు చెప్పగానే విక్రమాదిత్యుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయనే ఇక్కడకు నిత్యం వచ్చి 'హరసిద్ధ' మాతను పూజించేవాడు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ప్రధాన అధి దేవత 'బాబా మహాకల్'. ఉజ్జయిని సర్వోన్నత ప్రభువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ నగరంలోని అన్ని అధికారాలు ఆయనవే. అందువల్ల అక్కడ ఏ నాయకుడు ఉండకూడదు. అలాగే ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండటం కుదరదు. అందువల్ల ఏ నాయకుడు అక్కడ బస చేయరు. అది అక్కడ ఆచారం. దీన్ని అతక్రమించి ఉన్నవాళ్లందరూ విపత్కర పరిస్థితులు చూచిన దాఖాలాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఏ నాయకుడు ఆ సాహసం చేయకపోవడం విశేషం. నాయకులు ఈ ఆచారాన్ని అతిక్రమించకపోవడానికి మరో ప్రధాన కారణం రాజకీయ అంశం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండలి, అధికారంలో సాగాలంటే వారి ఆధరాభిమానాలు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ప్రజల మత విశ్వాసాలను గౌరవించక తప్పదు. ఆయా కారణాల రీత్యా కూడా నాయకులు దీనికి విరుద్ధంగా వెళ్లే సాహసం చేయలేదు. మరికొందరూ ఆ ఆచారానికి విరుద్ధంగా వెళ్లితే ఏమవుతుందన్న భయంతోనే.. మొత్తం మీద ఇంతవరకు ఏ నాయకుడు ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయలేదట. భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందో లేదో కానీ ఈ విషయం మాత్రం ఉజ్జయినీలో ఓ అంతుపట్టని మిస్టరీలా ఉంది. -
మహాకాల్ లోక్లో గాలివాన బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
-
మహాకాల్ లోక్లో బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
ఉజ్జయిని: హఠాత్తుగా మొదలైన ఈదురు గాలులు, ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో విధ్వంసం సృష్టించింది. అదే సమయంలో.. మహాకాళ్ లోక్ ఆలయ ప్రాంగణంలో పిడుగు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమందికి గాయాలు కాగా, అక్కడ ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్ష బీభత్సానికి ఉజ్జయిని అతలాకుతలం అయ్యింది. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడగా.. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వారాంతం కావడంతో.. ఆదివారం పాతిక వేల మందికి పైగా మహాకాళ్ లోక్ను సందర్శించినట్లు తెలుస్తోంది. భారీగా సందర్శకులు మహాకాళ్ లోక్కు రాగా.. ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసున్నారు. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాలుల ధాటికి ఆలయ కారిడార్లో ఏర్పాటు చేసిన సప్తరుషి విగ్రహాలు పక్కకు జరిగాయి. అందులో రెండు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ కారిడార్లో మొత్తం 155 విగ్రహాలు ఉండగా.. దెబ్బ తిన్న విగ్రహాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) చెబుతున్నారు.మహాకాల్ లోక్ ఆలయ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ కిందటి ఏడాది అక్టోబర్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అపూర్వం.. అమోఘం.. మహాకాళ్ లోక్ (ఫొటోలు) -
ఉజ్జయిని మహాకాళేశ్వర్ను దర్శించుకున్న విరాట్ కోహ్లి
-
ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ గుడిలో విరాట్ కోహ్లి- అనుష్క శర్మ పూజలు (ఫొటోలు)
-
'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబైలోకి కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పంత్కు పలు సర్జరీలు నిర్వహించిన వైద్యులు అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడి ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. న్యూజిలాండ్తో మూడో వన్డే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మంగళవారం జరగనుంది. మ్యాచ్ కోసం టీమిండియా, కివీస్ జట్లు ఇప్పటికే ఇండోర్కు చేరుకున్నాయి. కాగా సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా పంత్ త్వరగా కోలుకోవాలంటూ మహాశివుడికి పూజలు నిర్వహించారు. అనంతరం శివ లింగానికి బాబా మహాకాల్ భస్మ హారతి అర్పించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ఏఎన్ఐ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. సూర్యకుమార్ మాట్లాడుతూ.. ''కారు ప్రమాదానికి గురైన పంత్ త్వరగా కోలుకోవాలని పరమ శివుడిని ప్రార్థించాం. ఆయన దీవెనలతో పంత్ కోలుకొని టీమిండియా జట్టులోకి తిరిగి రావడం మాకు చాలా ముఖ్యం. ఇక ఇప్పటికే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను గెలిచాం.. ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు. We prayed for the speedy recovery of Rishabh Pant. His comeback is very important to us. We have already won the series against New Zealand, looking forward to the final match against them: Cricketer Suryakumar Yadav pic.twitter.com/2yngbYZXfb — ANI (@ANI) January 23, 2023 చదవండి: 'కివీస్ను క్లీన్స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' -
దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త
ఉజ్జయిని: టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో దుర్మార్గుడైన ఓ భర్త కట్టుకున్న భార్యను చపాతీ పీటతో కొట్టి కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా ఘటియా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(41) టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో భార్య(40)ను చపాతీ పీటతో కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విద్యుత్ షాక్కు గురైందని వైద్య సిబ్బందితో అబద్ధమాడాడు. కొద్ది సేపటి తర్వాత భార్య చనిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్టుమార్టంలో విషయం బయటపడగా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఫ్రెండ్స్తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 83వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆయనతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్ ఈ పాదయాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇటీవలే రాహుల్తో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. భర్త రాబర్ట్తో వాద్రాతో వచ్చి తొలిసారి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాలను కవర్ చేసి 1,209 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 11 గంటల వరకు 18.95% పోలింగ్ -
గడ్కరీ ఛాలెంజ్: హమ్మయ్యా.. 32 కేజీలు తగ్గాను
ఢిల్లీ: అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా?.. అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షరతు విధించడం.. అది ఛాలెంజ్గా తీసుకుని వర్కవుట్లు చేస్తూ బరువు తగ్గించుకునేందుకు యత్నించిన బీజేపీ ఎంపీ. ఆ ఎంపీ ఇప్పడు ఏకంగా 32 కేజీల బరువు తగ్గారట. పొద్దున్నే ఐదున్నరకు లేచి నడక. ఆపై రన్నింగ్, ఎక్సర్సైజ్లు, యోగాలతో కూడిన వర్కవుట్స్. ఆయుర్వేదిక్ డైట్ పాలో కావడం. ఆపై లైట్ బ్రేక్ఫాస్ట్. లంచ్, డిన్నర్లోకి సలాడ్, ఒక గిన్నెలో గ్రీన్ వెజిటెబుల్స్, మిశ్రమ తృణధాన్యాలలతో చేసిన ఒక రోటీ, క్యారట్ సూప్, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్.. ఇవి మాత్రమే తిని ఆయన తన బరువును ఏకంగా 30 కేజీలకు పైగా తగ్గించుకున్నారట. అలా ఎనిమిది నెలలకు పైగా ఇష్టాలను కట్టడి చేసుకుని.. కష్టం మీద బరువును నియోజకవర్గం కోసం తగ్గించుకున్నారాయన!. ఈ మేరకు సోమవారం ఉజ్జయిని ఎంపీ(మధ్యప్రదేశ్) అనిల్ ఫిరోజియా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తాను బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన గడ్కరీ.. ఫిరోజియాను అభినందించి ఇచ్చిన మాట ప్రకారం.. తొలి దశలో రూ.2,300 కోట్ల అభివృద్ది నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. గడ్కరీ స్ఫూర్తితో పాటు ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్ భారత్ పిలుపు తనను ఆకర్షించాయని చెప్తున్నారాయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఫిరోజియాగారికి ఒక షరతు. ఆ పని చేస్తేనే నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తా. ఒకప్పుడు నా బరువు 135 కేజీలు ఉండేది. అది ఫిరోజియాగారి కంటే ఎక్కువ. ఇప్పుడు నా బరువు 93 కేజీలు. నా పాత ఫొటోను కూడా ఆయనకు చూపించా. అందులో నన్ను గుర్తు పట్టడం కష్టమే. ఒక వేళ ఫిరోజియా గనుక బరువు తగ్గితే.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తా అని ప్రకటించారు. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 ఇదీ చదవండి: ప్లీజ్ సార్.. మా అమ్మను అరెస్ట్ చేయండి!! -
అపూర్వం.. అమోఘం.. ఉజ్జయిని మహాకాళ్ లోక్ (ఫొటోలు)
-
Mahakal: మహాకాళ్ లోకపు ప్రత్యేకతలు తెలుసా?
ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్ట ప్రత్యేకతతో కూడుకున్న జ్యోతిర్లింగం.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ప్రసిద్ధ శైవ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇదేనని చెప్తారు. ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు. అంతేకాదు.. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణం కొత్త సొగసులతో.. సరికొత్తగా ముస్తాబు అయ్యింది. రుద్రసాగరం సమీపాన ఉన్న శ్రీ మహా కాళేశ్వరాలయ కారిడార్ ఇవాళ(మంగళవారం) ప్రారంభం కాబోతోంది. మహాకాళ్ లోక్ పేరిట అభివృద్ధి చేసిన పనులను ఆవిష్కరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్తిక్ మేళా గ్రౌండ్లో ప్రజల సమక్షంలో ఆయన పాల్గొనున్నారు కూడా. పూజ తర్వాత ఈ కారిడార్ను జాతికి అంకితం చేయనున్నారాయన. Har Har Mahadev! The newly built Mahakal Corridor in Ujjain. pic.twitter.com/dA4ZgeEejD — Y. Satya Kumar (సత్యకుమార్) (@satyakumar_y) October 8, 2022 ► మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ► ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. ► ఉజ్జయినిలో శివలింగాలు మూడుఅంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కంటే కింద మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగం ఉంటుంది. ► రెండు ఫేజ్లు మహాకాళ్ లోక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కారిడార్ కోసం రూ.856 కోట్లు కేటాయించారు. విశాలమైన కారిడార్లో శివతత్వం ఉట్టిపడే అలంకరణలతో పాటు సందర్శకులను ఆకర్షించేలా పలు నిర్మాణాలు చేపట్టారు. ► మొదటి ఫేజ్ నిర్మాణానికి రూ.316 కోట్లు ఖర్చు అయ్యింది. 900 మీటర్ల కంటే పొడవైన ఈ కారిడార్.. దేశంలోనే అతిపెద్ద కారిడార్గా గుర్తింపు దక్కించుకోబోతోంది. ► మహాకాళేశ్వర ఆలయం చుట్టూరా పాత రుద్రసాగర్ సరస్సు చుట్టూరా ఈ కారిడార్ విస్తరించి ఉండనుంది. Preview of Mahakal Corridor. Newly developed corridor at the Mahakaleshwar temple has been named Sree Mahakal Lok, & its design is inspired by Shiv Leela. Murals & statues portray various aspects of Lord Shiva. On Oct 11, PM @narendramodi Ji will inaugurate it.#ShriMahakalLok pic.twitter.com/uK0Tfyg7q6 — Shobha Karandlaje (@ShobhaBJP) October 9, 2022 ► ఈ కారిడార్కు రెండు భారీ నందీద్వారం, పినాకి ద్వారం ఉన్నాయి. ఈ రెండు గేట్వేస్లో తక్కువ దూరంలోనే కారిడార్ ప్రారంభంలో ఉంటాయి. ► ఇక ఈ కారిడార్కు మరో ప్రత్యేకత.. విశేష అలంకరణలతో కూడిన 108 స్తంభాలు. ఇసుక రాళ్లు, ఫౌంటైన్లు, శివ పురాణం నుండి కథలను వర్ణించే 50 కంటే ఎక్కువ కుడ్యచిత్రాలు ఉన్నాయి. ► కారిడార్ ప్రాజెక్ట్లో మిడ్-వే జోన్, పార్క్, కార్లు, బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్. పూలు, ఇతర వస్తువులు అమ్మే దుకాణాలు, సోలార్ లైటింగ్, యాత్రికుల సౌకర్యాల కేంద్రం, నీటి పైప్లైన్, మురుగునీటి లైన్ మొదలైనవి కూడా ఉన్నాయి. అలాగే, లైట్, సౌండ్ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేశారు. ► ఇక రూ.310.22 కోట్లతో సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతున్నాయి. రుద్రసాగర్కు పునర్వైభవ పనులు ఇందులోనే సాగుతున్నాయి. A Golden era for Cultural rejuvenation under leadership of Hon'ble PM Shri @narendramodi Ji - Started with Kedarnath Shrine, then Kashi Vishwanath & now Ujjain #MahakalCorridor. Redevelopment of ancient temples for promoting religious tourism is a key priority of @BJP4India govt. pic.twitter.com/aYv4mVvlqm — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రెండో దశ అభివృద్ధి పనుల్లో.. ఆలయ తూర్పు, ఉత్తర ముఖాల విస్తరణ ఉంటుంది. ఉజ్జయిని నగరంలోని మహారాజ్వాడ, మహల్ గేట్, హరి ఫాటక్ వంతెన, రామ్ఘాట్ ముఖభాగం, బేగం బాగ్ రోడ్ వంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కూడా ఇందులో ఉంది. పురాణాల ప్రకారం.. ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివారాధనకే అంకితం అయ్యేవాడు. ఒకరోజు ఓ రైతు కొడుకు అయిన శ్రీకరుడు, రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి.. క్షిప్ర నదీ తీరంలో మహాశివుని కోసం ప్రార్థనలు చేస్తాడు. శివుడు తన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి చేరిన శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, వ్రిధి ల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరిస్తాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి మరణ, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తాడనే నమ్మకం ఉంది. -
చిన్నారి సమాధానంతో ప్రధాని మోదీ నవ్వులు
వైరల్: ప్రధాని నరేంద్ర మోదీ పెదాలపై చిరునవ్వులు పూయించింది ఓ చిన్నారి. ఎంపీ అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా? అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కండిషన్ పెట్టడం.. దానిని ఛాలెంజ్గా తీసుకుని వర్కవుట్లు చేసి బరువు తగ్గిన వ్యక్తి. ఉజ్జయిని(మధ్యప్రదేశ్) ఎంపీ అనిల్ ఫిరోజియా.. తన కుటుంబాన్ని తీసుకుని పార్లమెంట్కు వచ్చారు. ఆ సమయంలో ప్రధానిని కలిసింది ఆ కుటుంబం. అనిల్ కూతురు ఐదేళ్ల అహానా.. ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించింది. నేనెవరో తెలుసా? అని మోదీ ఆ చిన్నారిని ప్రశ్నించారు. అవును.. మీరు మోదీ. రోజూ మీరు టీవీలో కనిపిస్తారు అని చెప్పింది. నేనేం చేస్తానో తెలుసా? అని మోదీ మళ్లీ ప్రశ్నించగా.. మీరు లోక్ సభలో పని చేస్తారు అని సమాధానం ఇవ్వడంతో మోదీ నవ్వుల్లో మునిగిపోయారు. చివర్లో మోదీ, అహానాకు ఓ చాక్లెట్ కానుకగా ఇచ్చి పంపించారు. ఈ సరదా విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నారు ఎంపీ అనిల్. आज मेरी दोनों बालिकाएं छोटी बालिका अहाना और बड़ी बालिका प्रियांशी आदरणीय प्रधानमंत्री जी से प्रत्यक्ष मिल कर और उनका स्नेह पाकर बहुत आनंदित और अभीभूत है।@narendramodi @PMOIndia @BJP4India @BJP4MP pic.twitter.com/v5ULVP9KPU — Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022 ఇక యోగా, ఎక్సర్సైజులతో 21 కేజీల బరువు తగ్గిన అనిల్ ఫిరోజియా.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున 21 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని ఆశిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రధాని అనిల్ను అభినందిస్తూనే.. ఇంకాస్త బరువు తగ్గి ఫిట్గా ఉండడంటూ ప్రొత్సహించారు. ఇదిలా ఉంటే.. బరువు తగ్గాలంటూ ప్రధాని మోదీ ఈమధ్య ఇద్దరికి సూచించారు. रास्ते भी जिद्दी है मंजिलें भी जिद्दी है हौंसले भी जिद्दी है। pic.twitter.com/P0BMleuJus — Tejashwi Yadav (@yadavtejashwi) July 25, 2022 ఒకరు ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా, మరొకరు ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వి యాదవ్. 32 ఏళ్ల తేజస్వి.. ప్రధాని సూచన మేరకు రోజూ కష్టపడి వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు కూడా. ఇదీ చదవండి: సీఎం షిండేకు షాకిచ్చిన చిన్నారి!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement