-
నిరుద్యోగ ‘యువ భారత్’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగయువత అనేక సవాళ్లు ఎదు ర్కొంటోంది. భారత్లోని నిరుద్యోగుల్లో 83 శాతం యువతే ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత విద్య (సెకండరీ) లేదా ఆపై ఉన్నతవిద్య (హయ్యర్) అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. వీరి శాతం 2000లో 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి (నిరుద్యోగుల శాతం) పెరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ (ఐహెచ్డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000– 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్ ఎంప్లాయ్మెంట్) తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్టుగా ఈ నివేదిక పేర్కొంది. 2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది’ అని ఈ నివేదిక చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. తెలంగాణ విషయానికొస్తే... సెకండరీవిద్య, ఆపై ఉన్నత చదువులు చదివినా తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం... ♦ 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30.3 శాతం అమ్మాయిలు, 18.3% అబ్బాయిలు (మొత్తం 48.6%) నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో ఇదే కేటగిరిలో చూస్తే 65.7 శాతంగా ఉంది. ♦ రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతమనేది క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 2005లో చూస్తే.. యువతలో 14.1నిరుద్యోగ శాతం ఉండగా, 2012కల్లా 14.9 శాతానికి, 2019 కల్లా 34.9 శాతానికి చేరుకుంది. ♦ అదే 2022 సంవత్సరంలో 21.7శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే 2022లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా సాధించారు. నిరుద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3 శాతం ఉండగా, అమ్మాయిల్లో అది 30.3 శాతంగా ఉంది. ♦ 2022లో రాష్ట్రంలో 27.5% మంది యువత ‘నాట్ ఇన్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్స్న్ ఆర్ ట్రైనింగ్’ (నీట్) కేటగి రిలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2005 నుంచి 2019 మధ్యలో అది 17.9 శాతం నుంచి 34 మధ్యలో ఉంది. ♦ రాష్ట్రంలో పదిహేనళ్లకు పైబడిన క్యాజువల్ వర్కర్ల నెలవారీ వేతనం విషయానికొస్తే...2022లో మగవారిది రూ.10,175గా, మహిళలది రూ.6,642గా ఉంది. మనోళ్ల టెక్ స్కిల్స్ అంతంతే... దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ సాంకేతికంగా, టెక్ స్కిల్స్లో ఉన్నతస్థాయిలో నిలుస్తుందని అనుకుంటాం. కానీ... ♦దాదాపు 90 శాతం యువత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా రాయలేకపోతున్నారు. ♦ అధికశాతం విద్యార్థులకు ఎమ్మెస్ ఎక్సెల్ తదితర అప్లికేషన్లలో విస్తృతమైన పరిజ్ఞానం, అవగాహన లేదు. ♦ 50 శాతానికి పైగా యువత అటాచ్మెంట్తో కూడిన ఈ–మెయిల్ను కూడా పంపించలేకపోతున్నారు. ♦ 53.83 శాతం యువత కాపీ చేసి ఫైల్ను మూవ్ చేయగలుగుతున్నారు. ♦ 50.4 శాతం మంది ఏదైనా ఫైల్ను కాపీ, పేస్ట్ చేయగలుగుతున్నారు. ♦ కేవలం 14.7 శాతం మాత్రమే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే... ♦ తెలంగాణలోని అనేక స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లున్నా, సాంకేతిక అంశాలు బోధించే టీచర్లు, టెక్ నైపుణ్యం ఉన్నవారు లేకపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా పాఠశాల బోధనాంశాల్లో చేర్చితేనే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. -
ఈవీఎం, ఈడీ, ఐటీ లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు: రాహుల్
ముంబై/లఖ్నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాల్సి వచి్చందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. జాతుల హింసతో అట్టుడికిన మణిపూర్లో జనవరి 14న మొదలు పెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజులకు ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని అంబేడ్కర్ స్మారకం చైత్యభూమిని రాహుల్ సందర్శించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి నివాళులరి్పంచారు. అనంతరం స్థానిక శివాజీ పార్కులో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడారు. మోదీ ఓ అసమర్థ నేత అంటూ దుయ్యబట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదన్నారు. ‘‘మోదీ కేవలం అధికారం కోసం అర్రులు చాచే ముసుగు మనిషి. అవినీతిపై మోదీదే గుత్తాధిపత్యం. తనది 56 అంగుళాల ఛాతీ అని ఆయన చెప్పుకునే మాటలన్నీ అబద్ధాలే’’ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం వీవీప్యాట్లను కచ్చితంగా లెక్కించాలన్న తమ డిమాండ్కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ సంపన్నుల కోసమైతే ఇండియా కూటమి హామీలు సామాన్యుని కోసమన్నారు. విపక్షాల బల ప్రదర్శనలో భాగంగా జోడో యాత్ర ముగింపులో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో పాటు శరద్ పవార్ (ఎన్సీపీ–శరద్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో కీలక పక్షమైన సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. అయితే, యాత్ర ను రాహుల్ విజయవంతంగా ముగించారని కొనియాడుతూ ఆయనకు లేఖ రాశారు. వచ్చేది ‘ఇండియా’ సర్కారే గాంధీ ముంబై నుంచే క్విట్ ఇండియా నినాదమిచ్చారని శరద్ పవార్ గుర్తు చేశారు. బీజేపీని అధికారం నుంచి దించేందుకు ఇండియా కూటమి కూడా ముంబైలో ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమేనని స్టాలిన్ అన్నారు. ఎన్నికల బాండ్లను బీజేపీ పాల్పడ్డ వైట్ కాలర్ నేరంగా అభివర్ణించారు. ప్రజలంతా ఒక్కటైనప్పుడే నియంతృత్వానికి తెర పడు తుందని ఉద్ధవ్ అన్నారు. ఈడీ, సీబీఐ సాయంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని తేజస్వి మండిపడ్డారు. తమ పోరు విద్వేష రాజకీయాలపైనే తప్ప మోదీపైనో, అమిత్ షాపైనో కాదన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదు అంతకుముందు ముంబైలో మహాత్మాగాంధీ నివసించిన మణిభవన్ను రాహు ల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదన్నారు. ఈ విషయంలో పార్టీ ప్రకటనలు ఉత్తి అరుపులు మాత్రమేనన్నారు. ‘‘జ్ఞానం కేవలం ఒక్క వ్యక్తి సొత్తేనన్నది బీజేపీ, ఆరెస్సెస్ భావన. రైతులు, కారి్మకులు, నిరుద్యోగ యువతకు ఏమీ తెలియదన్నది వారి దురభిప్రాయం’’ అంటూ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలను కేంద్రీకృత పాలనే కావాలనే బీజేపీ, అది వికేంద్రీకృత తరహాలో సాగాలనే కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరుగా అభివరి్ణంచారు. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. - వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 - కోడెపాక కుమార స్వామి -
‘జై శ్రీరాం’ అంటూనే ఆకలితో చావాలనుకుంటున్నారు: మోదీపై రాహుల్ ఫైర్
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో నిరుద్యోగం, ఉపాధి లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయని.. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం ‘జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో 'జై శ్రీరాం' అని చెప్పిపిస్తూ.. వారు ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు. మంగళవారం మధ్యప్రదేశ్లోని సారంగ్పూర్లో భారత్ జోడో న్యాయ యాత్ర యాత్రలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.. యాత్రలో భాగంగా రాహుల్కు ‘ మోదీ, మోదీ, జై శ్రీరాం’ అనే నినాదాలతో బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యంగా ఆహ్వానం పలికారు. బీజేపీ శ్రేణుల చర్యపై స్పందించిన రాహుల్.. మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, ఉద్యోగాలు లేక యువత సోషల్ మీడియాలో రోజంతా రీల్స్ చూస్తూ గడుపుతున్నారని అన్నారు. ‘మీరు రోజంతా ఫోన్లు చూస్తూ.. జై శ్రీరామ్ అని నినాదాలు చేసి, ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారు’ అని ఆరోపించారు. చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకంపై రాహుల్ మాట్లాడుతూ.. గతంలో సాయుధ దళాలు యువతకు రెండు హామీలు ఇచ్చాయని, యువతకు పెన్షన్ ఇవ్వడంతోపాటు వారు మరణిస్తే సరైన గౌరవం పొందుతారని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అగ్నివీర్ పథకం కింద నలుగురిని తీసుకొని ముగ్గురిని వదిలేస్తారని.. ఆ ముగ్గురిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఉంటారని విమర్శించారు. పాకిస్తాన్తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెట్టింపుగా ఉందని రాహుల్ అన్నారు. ఆదివారం గ్వాలియర్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్య జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. భారత్లో నిరుద్యోగం 23 శాతంగా ఉంటే పాక్లో 12 శాతం ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్ల కంటే దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉందని, భారతదేశ నిరుద్యోగిత రేటు గత 40 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. Rahul Gandhi Ji and soldier in Madhya Pradesh Jitu Patwari resumed the Bharat Jodo Nyay Yatra from Sarangpur. pic.twitter.com/EkgGr89Dyx — Shantanu (@shaandelhite) March 5, 2024 -
తగ్గిన నిరుద్యోగిత రేటు - క్యూ3 బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా పట్టణ ప్రాంతాల్లో 2023 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 6.5 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో రేటు 7.2 శాతంగా నమోదైంది. కార్మిక శక్తి సర్వేకు (పీఎల్ఎఫ్ఎస్) సంబంధించి ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన త్రైమాసిక బులెటిన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘2022 అక్టోబర్–డిసెంబర్లో పురుషుల్లో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ త్రైమాసికంలో 5.8 శాతానికి తగ్గింది. మహిళలలో ఇది 9.6 శాతం నుంచి 8.6 శాతానికి దిగి వచ్చింది‘ అని బులెటిన్ పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వర్కర్ల జనాభా నిష్పత్తి 44.7 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగినట్లు వివరించింది. పురుషుల్లో ఇది 68.6 శాతం నుంచి 69.8 శాతానికి మహిళల్లో 20.2 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. ఎప్పటికప్పుడు కార్మిక శక్తి వివరాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017లో పీఎల్ఎఫ్ఎస్ను ప్రారంభించింది. -
Mallikarjun Kharge: ‘పదేళ్ల అన్యాయ కాలం’
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసింది. మోదీ పాలనా కాలంలో ప్రజలకు వాటిల్లిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని, మహిళలపై నేరాలు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం అతిపెద్ద తప్పు అని స్పష్టం చేసింది. ఈ బ్లాక్ పేపర్కు ‘10 సంవత్సరాల అన్యాయ కాలం’గా పేరుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వైట్ పేపర్కు పోటీగా ఈ బ్లాక్ పేపర్ను కాంగ్రెస్ తీసుకొచి్చంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీల ఈ బ్లాక్ పేపర్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘చార్జిషీట్’గా అభివరి్ణంచారు. గత పదేళ్ల కాలమంతా అన్యాయ కాలమేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో ఎన్నో మాటలు చెప్పే ప్రధానమంత్రి వైఫల్యాలను మాత్రం నిస్సిగ్గుగా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత గురించి తాము మాట్లాడితే దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అందుకే సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బ్లాక్ పేపర్ తీసుకొచ్చామన్నారు. ఉత్తరం, దక్షిణం పేరిట దేశాన్ని విచి్ఛన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే స్పందించారు. గతంలో మాట్లాడిన మాటలను అబద్ధాలకోరులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ పన్ను హక్కులు అంటూ మాట్లాడారని గుర్తుచేశారు. దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు తనను దూషిస్తూ కొన్నిరోజులుగా ఫోన్కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖర్గే తెలిపారు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, దళితుడినైన తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల గురించి తాము నిలదీసినప్పుడల్లా ప్రధాని మోదీ.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, పైగా నిధులిస్తే ఖర్చు చేయడం లేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మోదీ ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ సొమ్మును వాడుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకున్నారని, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఆక్షేపించారు. -
నిరుద్యోగంపై సీఎం జగన్ ప్రణాళిక ఏంటి..?
-
ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం
డోర్నకల్: ఉద్యోగం రావడంలేదనే మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారు ఎర్రమట్టితండాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.ఉపేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమట్టితండాకు చెందిన భూక్యా అనిల్ అలియాస్ విజయ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొన్ని పోటీపరీక్షలకు హాజరైన అనిల్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనలో ఉన్న అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం కుటుంబసభ్యులు గమనించి చుట్టుపక్కల వెతకగా తండా సమీపంలోని ఓ వ్యవసాయబావిలో అనిల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం నుంచి పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఉద్యోగం రాలేదనే బాధతోనే అనిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనిల్ తండ్రి జయరాజ్ 20 ఏళ్ల క్రితమే అదృశ్యంకాగా, తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది. ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో అనిల్ పేర్కొన్నాడు. కాగా, లేఖ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. -
పార్లమెంట్పై దాడి..కారణాలు చెప్పిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణాల వల్లే పార్లమెంట్పై కలర్స్మోక్ దాడి జరిగిందని తెలిపారు. ‘అసలు పార్లమెంట్పై దాడి ఎందుకు ఎజరిగింది. నిరుద్యోగం ఈ దేశంలో పెద్ద సమస్య. ఈ సమస్యతో దేశం అట్టుడుకుతోంది. ప్రధాని మోదీ పాలసీ వల్లే యువతకు ఉద్యోగాలు లేవు’అని శనివారం రాహుల్ మీడియాతో వ్యాఖ్యానించారు. డిసెంబర్13న మధ్యాహ్నం నీలం సింగ్, అమోల్ షిండే అనే ఇద్దరు వ్యక్తులు కలర్స్మోక్తో లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలపైకి దూకిన విషయం తెలిసిందే. దేశంలోని నిరుద్యోగంపై నిరసన తెలిపేందుకే ఈ దాడికి పాల్పడ్డారని నిందితుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదీచదవండి..మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్గా జీతూ పట్వారీ -
‘పార్లమెంట్ ఘటనకు మోదీ విధానాలే కారణం’
న్యూఢిల్లీ: దేశంలోని పెరిగిపోయిన యువత నిరుద్యోగానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మొదటి సారీ పార్లమెంట్ భద్రత వైఫల్యంపై మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ భద్రత వైఫల్యం వంటి ఘటనలు జరగడానికి కారణం యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడమని అన్నారు. దేశంలో నిరుద్యోగమనే అతిపెద్ద సమస్యను ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మోదీ పాలసీలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం జరిగింది నిజమేనని.. అయితే లోక్ సభలో ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారిందని అన్నారు. కేవలం యువత నిరుద్యోగం ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాల వల్లనే పెరిగిందని ధ్వజమెత్తారు. దీంతో దేశంలోని యువత ఉద్యోగాలను పొందలేకపోతున్నారని అన్నారు. మోదీ విధానాల వల్ల దేశంలో పెరుగుతున్న.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పార్లమెంట్ భద్రతా వైఫల్యం వెనకాల ప్రధాన కారణాలుగా ఉన్నాయని రాహుల్గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ ఘటనకు సంబంధించిన అరెస్టు అయిన నిందితుల్లో ముగ్గురూ నిరుద్యోగ బాధితులు ఉన్నారు. నిందితులు ఉద్యోగాలు రాక చాలా నిరుత్సాహంతో ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. VIDEO | "Security breach happened in Lok Sabha. The reason behind this is unemployment and inflation due to PM Modi's policies," says Congress leader @RahulGandhi. pic.twitter.com/BFkEAjoZwI — Press Trust of India (@PTI_News) December 16, 2023 -
తగ్గిన నిరుద్యోగ రేటు - గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఇది 7.2 శాతం నమోదైంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉండగా, ఏప్రిల్–జూన్లో 6.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగం రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్లో 8.6 శాతానికి వచ్చి చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 9.4 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్లో 9.1 శాతం, జనవరి–మార్చిలో 9.2 శాతం, అక్టోబర్–డిసెంబర్ 9.6 శాతం నమోదైంది. పట్టణ ప్రాంత పురుషులలో నిరుద్యోగిత రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్లో 6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 6.6 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్లో 5.9 శాతం ఉంది. 2022–23 జనవరి–మార్చిలో 6 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 6.5 శాతంగా నమోదైంది. క్రియాశీల శ్రామిక శక్తి.. 2023 జూలై–సెప్టెంబర్లో పట్టణ ప్రాంతాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో క్రియాశీల శ్రామిక శక్తి 49.3 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.9 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్–జూన్లో 48.8 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చిలో 48.5 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 48.2 శాతం నమోదైంది. -
ఏపీలో తగ్గిన నిరుద్యోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగిత రేటు తగ్గింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గణాంకాలు స్పష్టం చేశాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఈ కృషి ఆర్బీఐ గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగితపై ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. చంద్రబాబు హయాం(2018–19)లో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే 2022–23లో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగాలు, ఉపాధే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా.. గ్రామ సచివాలయాల్లో పది మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 11 మంది చొప్పున శాశ్వత ఉద్యోగాలను కల్పించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4.93 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇందులో శాశ్వత ఉద్యోగాలే 2.13 లక్షలు ఉన్నాయి. మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. తద్వారా కొత్తగా 16.5 లక్షల మందికి ఉపాధి లభించింది. దీనికి తోడు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తూ చిన్నచిన్న వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద మార్ట్ల ద్వారా వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది. దీంతో లక్షలాది మంది మహిళలు తాము జీవనోపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అలాగే క్యాంపస్ ఉద్యోగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందజేస్తోంది. దీంతో ఇప్పటివరకు 1.2 లక్షల మందికి క్యాంపస్ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. టీడీపీ పాలనలో ఉపాధి కల్పన శూన్యం.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అసలు పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ఏజెన్సీల నియామకంపైనే దృష్టి సారించింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల ఉద్యోగాలనే భర్తీ చేశారు. దీంతో ఆయన హయాంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి
భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. ‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్రాజన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్ఎస్బీసీ సూచిస్తుంది. -
కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు: ఖర్గే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు. ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగాలు, ప్రమోషన్లు వచి్చనవారికి మళ్లీ నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలపై ప్రధానమంత్రి నీళ్లు చల్లుతున్నారని ఆక్షేపించారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత శాతం రెండేళ్ల గరిష్టాన్ని అధిగమించిందంటూ ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లిమిటెడ్’ తాజాగా విడుదల చేసిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో 90 లక్షలకుపైగా ఉద్యోగాలు మాయమయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థిత మరింత దారుణంగా ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం డిమాండ్ 20 శాతం పెరిగిందని తెలిపారు. మొత్తానికి దేశంలో నిరుద్యోగం 10.8 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో నిరుద్యోగం 13.4 శాతంగా ఉందని, ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రకటనలు, ట్రిక్కులు ఎక్కువ కాలం చేయవని తేలి్చచెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచకుండా అన్యాయం చేసిన వారిపై యువత ప్రతీకారం తీర్చుకుంటారని, ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతున్నారన్నారు. -
జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 7.6 శాతంగా ఉన్నట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 19వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేసింది. 15 ఏళ్ల పైన వయసుండి, పనిచేసే అర్హతలు కలిగిన వారిలో, ఉపాధి లేమిని ఈ రేటు సూచిస్తుంటుంది. 2023 జనవరి–మార్చి కాలంలో నిరుద్యోగం 6.8 శాతంగా, 2022 జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్లో 7.2 శాతంగా నిరుద్యోగ రేటు ఉండడం గమనించొచ్చు. పట్టణాల్లో 15 ఏళ్లకు పైన మహిళల్లో నిరుద్యోగం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది ఇది 9.2 శాతంగా ఉంది. పురుషుల్లో నిరుద్యోగ రేటు జూన్ త్రైమాసికంలో 5.9 శాతానికి క్షీణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 6 శాతంగా ఉండడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.8 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది పట్టణాల్లో 48.5 శాతంగా ఉంది. -
అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణస్టేట్ పబ్లిక్సర్విస్ కమిషన్ గతేడాది ఏప్రిల్లో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఇంజనీరింగ్ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్, హార్టీకల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. రెండో ‘సారీ’ ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు. ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతే హాజరులో స్పష్టత గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 11వ తేదీ సాయంత్రం టీఎస్పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బయోమెట్రిక్ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్ వద్దనుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్ టికెట్లలో బయోమెట్రిక్ చెక్ఇన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. -
వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!
Unemployment Fraud in US: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత భారీ నిరుద్యోగ మోసం బయట పడింది. కోవిడ్ (COVID-19) మహమ్మారి సమయంలో మోసగాళ్లు 100 బిలియన్ డాలర్ల (రూ. 8.3 లక్షల కోట్లు) నుంచి 135 బిలియన్ డాలర్లు (రూ. రూ. 11 లక్షల కోట్లు) వరకూ నిరుద్యోగ బీమా ప్రయోజనాలను తప్పుగా క్లెయిమ్ చేసి కాజేసి ఉండవచ్చని యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) నివేదిక విడుదల చేసింది. యూఎస్, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులలో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే మధ్య చెల్లించిన నిరుద్యోగ ప్రయోజనాలపై జీఏవో అధ్యయనం నిర్వహించింది. ఆ సమయంలో అమెరికన్లకు చెల్లించిన మొత్తం నిరుద్యోగ ప్రయోజనాలలో మోసపూరితంగా క్లెయిమ్ చేసిన నిధులు 11 శాతం నుంచి 15 శాతం వరకూ ఉన్నాయని జీఏవో అంచనా వేసింది. ఆ కాలానికి నిరుద్యోగ ప్రయోజనాల మొత్తం చెల్లింపులు 900 బిలియన్ డాలర్లు. అన్ఎంప్లాయిమెంట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ప్రోగ్రామ్ సమగ్రతతో దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొందని, ఇది కోవిడ్ మహమ్మారి సమయంలో మరింత దిగజారిందని జీఏవో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ మోసం మొత్తం జీఏవో గత ఫిబ్రవరిలో అంచనా వేసినదాని కంటే రెట్టింపు. ఈ నివేదికను యూఎస్ సెనేట్ ఫైనాన్స్ ర్యాంకింగ్ సభ్యుడు, సెనేటర్ మైక్ క్రాపో (R-Idaho), యూఎస్ హౌస్ వేస్ అండ్ మీన్స్ ఛైర్మన్ జాసన్ స్మిత్ (R-Missouri) అభ్యర్థించారు. ఖండించిన కార్మిక శాఖ అయితే జీఏవో నివేదికను యూఎస్ కార్మిక శాఖ ఖండించినట్లుగా రాయిటర్స్ పేర్కొంది. జీఏవో ఏ లెక్కల ఆధారంగా ఈ అంచనాకు వచ్చిందని ప్రశ్నించిందని, దాని పరిశోధనలు మోసం పరిధిని మరీ ఎక్కువగా పేర్కొన్నాయని పేర్కొంది. -
G20 Summit: జిన్పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్పింగ్కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ను జిన్పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిరుద్యోగభృతి ఇచ్చాకే కేసీఆర్ ఓట్లు అడగాలి
హుజూర్నగర్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ ఓట్లు అడగాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్ నుంచి నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.3 వేల చొప్పున బాకీ ఉన్నదని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి ఇంతవరకు పట్టించుకోకుండా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు గత ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, మరో పెద్ద సామాజికవర్గం ముదిరాజ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినా వాటిలో రెండు ఓడిపోయే సీట్లేనని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయని, ఢిల్లీలోని బీజేపీని ఇంటికి పంపాలంటే బీఆర్ఎస్ను ఓడించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 పైచిలుకు స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్, కోదాడలలో 50 వేల ఓట్ల మెజారీ్టతో గెలవబోతున్నామని ఆయన తెలిపారు. -
పాపం చైనా యువతకు ఎంత కష్టం వచ్చింది!
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా (China)లో నిరుద్యోగం (Unemployment) తాండవిస్తోంది. అక్కడ యువత ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన జాంగ్ అనే యువతి ఉద్యోగం కోసం వేలకొద్దీ రెజ్యూమ్లను చైనీస్ కంపెనీలకు పంపినప్పటికీ, ఆమె ఎంచుకున్న మార్కెట్ పరిశోధన రంగంలో జాబ్ దొరకలేదు. నెలల తరబడి అన్వేషించినా ఉద్యోగం దొరక్కపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన 23 ఏళ్ల జాంగ్.. తాను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మానసిక స్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ సర్వే కూడా గమనార్హం. గ్రాడ్యుయేషన్ తర్వాత యువతపై ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చినట్లు ఇటీవల బీజింగ్లో జరిగిన రిక్రూట్మెంట్ ఫెయిర్లో ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో జాంగ్ పేర్కొంది. తాను పంపే ప్రతి పది రెజ్యూమ్లకు ఒక స్పందన మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పింది. యువత నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో చైనా జాబ్ మార్కెట్ (China Job Market) లోకి ప్రవేశించిన మిలియన్ల మంది గ్రాడ్యుయేట్లలో జాంగ్ ఒకరు. 16 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతలో నిరుద్యోగం జూన్ నెలలో రికార్ట్ స్థాయిలో 21.3 శాతానికి చేరింది. తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా వయసు ఆధారిత ఉపాధి డేటా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. సవాలుగా మారిన ఉద్యోగ సాధన అనుభవం లేని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సవాలుగా మారిందని బీజింగ్లో జరిగిన కెరీర్ ఫెయిర్లకు హాజరైన యువత పేర్కొన్నారు. యాంగ్ యావో మీడియాలో అనుభవం ఉన్న 21 ఏళ్ల నిరుద్యోగి. సెంట్రల్ బీజింగ్లో జరిగిన ఒక జాబ్ ఫెయిర్లో ప్రకటనలను చూసి నిరాశకు గురయ్యాడు. కారణం అక్కడ కంపెనీలు కేవలం సేల్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్లు ఆఫర్ చేశాయి. అది కూడా తక్కువ జీతానికి పనిచేసేవారికే. బీజింగ్లోని తన కుటుంబానికి దగ్గరగా వెళ్లడం కోసం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో తన మునుపటి ఉద్యోగాన్ని మానేసిన అతను ఇప్పుడు నెలల కొద్దీ వెతుకుతున్నా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన పడుతున్నాడు. ‘తలచుకుంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఉద్యోగం దొరకకపోతే జీవనం గడిచేదెలా?’ అని ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో వాపోయాడు. -
Parliament Monsoon Session: నేటి నుంచే సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చలు, సంవాదాలకు రంగం సిద్ధమయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఆరంభం కానున్నాయి. ఇరుపక్షాలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మణిపూర్లో జాతుల మధ్య రగులుతున్న హింస, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై సభలో గట్టిగా నిలదీసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కూటమి సిద్ధమవుతోంది. తిప్పికొట్టేందుకు అధికార పక్షం ప్రతివ్యూహాలు పన్నుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజుల పాటు పార్లమెంట్ భేటీ కానుంది. పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం.. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో నూతన భవనానికి మారుతాయి. ఈసారి మొత్తం 21 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైంది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు. యూసీసీ, ఢిల్లీ ఆర్డినెన్స్పై రగడ తప్పదా? మణిపూర్లో హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యూసీసీ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ సహా ఇతర విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే అన్ని స్థాయిల్లో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఢిల్లీ విషయంలో కేంద్ర ఆర్డినెన్స్ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన బీఆర్ఎస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల మద్దతు కూడగట్టారు. జోషి ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. జోషి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలకపార్టీల నేతలు పాల్గొన్నారు. 32 అంశాలు పార్లమెంట్లో ప్రస్తావనకు రానున్నట్లు జోషి చెప్పారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా కోరుకుంటే, సభలో ప్రతిపక్షాలు లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరి అన్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని వ్యాఖ్యానించారు. మా డిమాండ్కు వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ మద్దతు: బీజేడీ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ శశి్మత్ పాత్రా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ డిమాండ్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. -
నైపుణ్యాల కొరతే అడ్డు
న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు. గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. -
మోదీ లూటీ విధానాల వల్లే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ చేతగానితనమే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వ డొల్ల నినాదాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడమే పనిగా పెట్టుకుందని, అందుకే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జనం కష్టాల్లో ఉంటే బీజేపీ మాత్రం అధికారం కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఖర్గే బుధవారం ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయని, నిరుద్యోగం 8.45 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, పనులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అచ్చే దిన్, అమృత్ కాల్ అంటూ నినాదాలు ఇచి్చన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించారని ఖర్గే ఆక్షేపించారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా ఫలితం ఉండదని, బీజేపీని జనం ఓడించడం తథ్యమని జోస్యం చెప్పారు. -
అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు
అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినవారి సంఖ్య గత వారం 20 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అది అలాగే స్థిరంగా కొనసాగుతోంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్ 17తో ముగిసిన వారంలో కాలానుగుణంగా సర్దుబాటు ప్రాతిపదికన నిరుద్యోగ ప్రయోజనాల కోసం 2,64,000 కొత్త క్లెయిమ్లు దాఖలయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరాయి. కాగా నిరుద్యోగ భృతికి కొత్త దరఖాస్తులు సగటున 2,60,000 ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగా ‘రాయిటర్స్’ పేర్కొంది. ఇదిలా ఉండగా మొదటి వారం దాటి ప్రయోజనాలను పొందుతున్న వారందరి ర్యాంక్లు జూన్ 10తో ముగిసిన వారంలో 17.6 లక్షలకు పడిపోయాయి. అంతకు ముందు వారం ఇది 17.72 మిలియన్లుగా ఉండేది. యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి మూడు నెలలలో స్థిరంగా విస్తరించి మూడు త్రైమాసికాల దిగువకు తగ్గిందని ఆ దేశ ప్రభుత్వం నివేదించింది. మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ గ్యాప్ 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తెలిపింది. కాగా అది 217.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్లో అంచనా వేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement