-
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024 -
MI vs KKR : ముంబై ఇండియన్స్పై కోల్కతా విజయం (ఫొటోలు)
-
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.52 బంతుల్లో 70 పరుగులు చేసిన అయ్యర్.. కేకేఆర్ ఫైటింగ్ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కేకేఆర్ను అయ్యర్ తన ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. అయ్యర్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు.31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలో తుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. -
వెంకటేశ్ అయ్యర్ గాయంపై అప్డేట్!..అందుకే ఆ సెలబ్రేషన్!
ఐపీఎల్-2024ను పేలవంగా ఆరంభించిన వెంకటేశ్ అయ్యర్.. తాజా మ్యాచ్లో మాత్రం దంచికొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఈ కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ అభిమానులను అలరించాడు. ఎదుర్కొన్న 30 బంతుల్లోనే 50 పరుగులతో సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్కు పంపించారు. ఈ నేపథ్యంలో గాయంపై అప్డేట్ అందించిన అయ్యర్.. ‘‘కండరాలు పట్టేసినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని స్కానింగ్కు వెళ్లాను. ఈ రోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మరో ఎండ్లో సునిల్ నరైన్ నుంచి గొప్ప సహకారం లభించింది. ఈరోజు క్రెడిట్ మొత్తం నరైన్కు ఇవ్వాల్సిందే. మాపై ఏమాత్రం ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. విజయానికి అతడు పునాదులు వేస్తే.. మేము పని పూర్తిచేశాం’’ అని పేర్కొన్నాడు. వెన్నునొప్పి గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదని తెలిపాడు. ఇక హాఫ్ సెంచరీ నేపథ్యంలో తన ‘కిస్’ సెలబ్రేషన్ గురించి చెబుతూ.. ‘‘నాకు కాబోయే భార్య కూడా ఈరోజు మ్యాచ్కు వచ్చింది. నా ఇన్నింగ్స్లో ఆమెకూ క్రెడిట్ ఇవ్వాలని భావించాను’’ అని వెంకటేశ్ అయ్యర్ నవ్వులు చిందించాడు. కాగా గతేడాది నవంబరులో వెంకటేశ్ అయ్యర్కు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్ అయిన శృతి రఘునాథన్తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శుక్రవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ (22 బంతుల్లో 47 పరుగులు) అద్భుతంగా రాణించాడు. చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు A well deserved 50 for Venkatesh Iyer in just 29 deliveries 💪🫡‼️#KKRvRCB pic.twitter.com/IDDmCiFjNu — Kolkata Knight Riders Universe (@KKRUniverse) March 29, 2024 -
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునిల్ నరైన్పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్పై.. సెకండాఫ్లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్డౌన్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్ను ఓపెనర్గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు..
ఓ ప్లేయర్ అద్భుతంగా ఆడుతూ ఉంటే.. ఆ క్రీడలో దిగ్గజాలతో పోలిక పెట్టి మాట్లాడుతూ విశ్లేషణలు సహజం. అయితే, కొన్నిసార్లు ఆ పోలిక వాళ్లకు చేకూర్చే మేలు కంటే.. నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది టీమిండియా యువ క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది. ప్రస్తుతం.. అంతర్జాతీయ టీ20లలో రింకూ సింగ్ అదరగొడుతున్న తరుణంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడి ఆట తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. ధోని స్టైల్లో మ్యాచ్ ముగిస్తున్న తీరుకు ఫిదా అవుతూ నయా ఫినిషర్ వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇప్పుడే ధోని వారసుడిగా ట్యాగ్ వేసి రింకూపై ఒత్తిడి పెంచొద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న రింకూపై ఇలాంటి ప్రశంసలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. హార్దిక్ వారసుడంటూ.. గతంలో వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా విషయంలో ఇలాంటి పోలికలు కొంపముంచాయంటూ వారి పేర్లను ఉదాహరిస్తున్నారు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడంటూ ప్రశంసల వర్షం కురిసింది. గాయాల బెడదతో సతమతమవుతున్న పాండ్యా కెరీర్ సందిగ్దంలో పడిన సమయంలో వెంకటేశ్ అతడి వారసుడిగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టులో చోటే కరువు కానీ.. పాండ్యా రీఎంట్రీ ఇచ్చి.. వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగిన తర్వాత వెంకటేశ్ అయ్యర్కు జట్టులో స్థానమే కరువైంది. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వెంకటేశ్ టీమిండియా తరఫున ఆడాడు. సచిన్ అంతటి వాడవుతాడు ఇక పృథ్వీ షా.. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సమయంలోనే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్తో పోలిక తెచ్చారు విశ్లేషకులు. భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా ఓపెనర్గా అద్భుతాలు చేస్తాడని ఈ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ను కొనియాడారు. తన కెప్టెన్సీలో ఆడిన వాళ్లు స్టార్లు.. అతడేమో ఇలా కానీ.. సీన్ రివర్స్ అయింది.. పృథ్వీ కెప్టెన్సీలో ఆడిన శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా శుబ్మన్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా పాతుకుపోయి.. భావి భారత జట్టు కెప్టెన్గా, తదుపరి సూపర్స్టార్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, పృథ్వీ షాకు టీమిండియాలో ఎంట్రీ కాదు.. కనీసం ఐపీఎల్లో అయినా స్టార్ బ్యాటర్గా గుర్తింపు దక్కడం లేదు. వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ పృథ్వీని గాయాలు వేధిస్తుండటంతో దెబ్బమీద దెబ్బ పడుతోంది. అతడు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రింకూ విషయంలో ఇలా.. ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ సింగ్. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కోల్కతా నైట్రైడర్స్ మేనేజ్మెంట్ దృష్టిలో పడటంతో అతడి దశ తిరిగింది. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా స్థాయికి ఇంటింటికీ సిలిండర్లు మోస్తూ తండ్రి సంపాదిస్తే.. తాను స్వీపర్గా పనిచేసేందుకు కూడా సిద్ధపడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రింకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటను మాత్రం వీడలేదు. అంచెలంచెలుగా ఎదిగి తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్ను గెలపించిన తీరు నభూతో అనిపించింది. ఈ క్రమంలో.. 2023, ఆగష్టులో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. నయా ఫినిషర్గా కితాబులు ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న రింకూ.. మొత్తంగా 7 మ్యాచ్లు ఆడి 216.95 స్ట్రైక్రేటుతో 128 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనితో పోలిక తెస్తూ రింకూ ఆట తీరును కొనియాడుతూ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే వన్డే క్రికెట్లోనూ అతడు అడుగుపెడతాడని జోస్యం చెబుతున్నారు. పోలికలు వద్దు.. మద్దతు ముఖ్యం అయితే, మరికొంత మంది మాత్రం.. రింకూను ఇప్పుడు ప్రశంసిస్తున్న వాళ్లు కష్టకాలంలో అతడికి అండగా నిలబడితే చాలని.. పోలికలకు బదులు నైతికంగా మద్దతునివ్వడం అతి ముఖ్యమని పేర్కొంటున్నారు. రింకూ ధోని స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడే అయినా కెరీర్ ఆరంభంలోనే పోలికలు తెచ్చి అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచొద్దని హితవు పలుకుతున్నారు. కాగా పటిష్ట ఆసీస్తో ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20లలో రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా.. 22(14 బంతుల్లో), 31(9 బంతుల్లో) పరుగులు సాధించాడు. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
టీమిండియా యువ క్రికెటర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?!
Venkatesh Iyer Engagement Pics: టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తన అభిమానులుకు శుభవార్త చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ.. కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘నా జీవితంలో తదుపరి అధ్యాయానికి నాంది’’ అంటూ మంగళవారం ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ సహా హర్ప్రీత్ బ్రార్ తదితరులు వెంకటేశ్ను విష్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్! కాగా వెంకటేశ్ అయ్యర్కు కాబోయే భార్య పేరు శృతి రఘునాథన్. పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో బీకామ్ చదివిన శృతి.. నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన వెంకటేశ్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో 2021లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు. ఇక ఐపీఎల్-2023లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన 28 ఏళ్ల అయ్యర్కు కొన్నాళ్లుగా భారత జట్టులో చోటు కరువైంది. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్ View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venky_iyer) -
తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో ఈస్ట్ జోన్-సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడి 207 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (8) సహా టాపార్డర్ అంతా విఫలం కాగా.. శివమ్ చౌదరీ (22), కర్ణ శర్మ (32) సహకారంతో రింకూ సింగ్ (63 బంతుల్లో 54; ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. కష్ట సమయంలో బరిలోకి దిగిన రింకూ సింగ్.. శివమ్ చౌదరీ, కర్ణ శర్మలతో చెరో 50 ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోర్ 200 దాటేలా చేశాడు. అనంతరం ఆరో వికెట్గా రింకూ వెనుదిరగడంతో సెంట్రల్ జోన్ పతనం ఆరంభమైంది. ఆ జట్టు మరో 31 పరుగులు జోడించి ఆఖరి 4 వికెట్లు కోల్పోయింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో మురసింగ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు పడగొట్టగా... ఉత్కర్ష్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాణించిన ఉత్కర్ష్ సింగ్.. ఈస్ట్ జోన్ సునాయాస విజయం అనంతరం 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. అభిమన్యు ఈశ్వరన్ (38), ఉత్కర్ష్ సింగ్ (89), సుభ్రాన్షు్ సేనాపతి (33 నాటౌట్) రాణించడంతో 46.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా గెలుపొందింది. సెంట్రల్ జోన్ బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. అదిత్య సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో సత్తా చాటిన (కేకేఆర్ తరఫున 14 మ్యాచ్ల్లో 59.25 సగటున 149.52 స్ట్రయిక్రేట్తో 474 పరుగులు) రింకూ సింగ్.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. అదే ఫామ్ను రింకూ ప్రస్తుతం దేశవాలీ టోర్నీల్లోనూ కొనసాగిస్తున్నాడు. -
ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్తో దిమ్మతిరిగిపోయింది!
MS Dhoni- IPL 2023: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాస్టర్మైండ్తో ఊహించని రీతిలో ఫీల్డింగ్ సెట్ చేసి.. ఓడిపోతామనుకున్న మ్యాచ్లోనూ గెలిపించడంలో తనకు తానే సాటి. అందుకే ఈ మిస్టర్ కూల్ టీమిండియాతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ అత్యంత విజయవంతమైన సారథిగా పేరొందాడు. భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్రుడు.. చెన్నై సూపర్ కింగ్స్ను ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక యువ ఆటగాళ్లకు రోల్ మోడల్ అయిన ధోని గురించి టీమిండియా బ్యాటర్, కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి మిస్టర్ కూల్ కెప్టెన్సీని హైలైట్ చేశాయి. నమ్మశక్యంకాని రీతిలో ఇటీవల రాజ్ షమన్ పాడ్కాస్ట్లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన సంఘటన గురించి చెబుతాను. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ థర్డ్మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాను. నమ్మశక్యంకాని రీతిలో అవుట్ కావడంతో వెంటనే వెనక్కి తిరిగి చూడగా.. సదరు ఫీల్డర్ ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఉన్నట్లు అనిపించింది. నిజానికి అతడు మరికాస్త కుడివైపునకు నిల్చోవాల్సింది. అది చూసి నేను షాకయ్యా. వెంకటేశ్ అయ్యర్ భయ్యా ఎందుకిలా చేశావు? మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయం గురించి ధోనిని అడిగాను. ‘‘భయ్యా. ఇలా ఎందుకు చేశారు?’’ అన్నపుడు.. నేను షాట్ కొట్టగానే ఫీల్డింగ్ అలా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకు నేను వావ్ అనకుండా ఉండలేకపోయాను. అసలు అంత తక్కువ సమయంలో అలా ఎలా ఆలోచిస్తారో అర్థంకాక తలపట్టుకున్నా. నిజానికి క్రికెట్లో యాంగిల్స్ గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తే అనుకున్న ఫలితం రాబట్టగలమో తెలుస్తుంది. ధోని స్ట్రెంత్ అదే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2023లో వెంకటేశ్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 14 మ్యాచ్లలో కలిపి మొత్తంగా 404 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 104. ఇక ధోని సారథ్యంలోని సీఎస్కే రిజర్వ్ డే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఐదోసారి చాంపియన్గా అవతరించింది. చదవండి: చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్లో తొలి బౌలర్గా రికార్డు 42 మ్యాచ్ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత' -
తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు..
IPL 2023 KKR Vs RR- Yashasvi Jaiswal: 6.. 6.. 4.. 4.. 2.. 4.. తొలి ఓవర్లోనే 26 పరుగులు.. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఘోర పరాభవం ఎదుర్కోబోతోందనడానికి సంకేతం.. మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్పిన్తో మాయ చేయగల అనుభవజ్ఞుడైన సునిల్ నరైన్.. కొత్తవాడే అయినా తనదైన ముద్రవేయగలుగుతున్న సూయశ్ శర్మ.. అతడి తోడుగా అనుకూల్ రాయ్.. జట్టులో ఇంత మంది స్పిన్ బౌలర్లు ఉన్నా.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మాత్రం చెత్త ప్రయోగంతో ముందుకు వచ్చాడు. సీజన్ ఆరంభం నుంచి దంచికొడుతున్న యశస్వి జైశ్వాల్ కోసం పార్ట్ టైమ్ స్పిన్నర్ను దింపితే బాగుంటుందంటూ తానే స్వయంగా రంగంలో దిగాడు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దంచికొట్టిన యశస్వి.. అదే జోరులో నితీశ్ పుణ్యమా అని 6 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టిన యశస్వి 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 98 పరుగులతో చెలరేగి రాజస్తాన్కు భారీ విజయం అందించాడు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా నిర్ణయంపై కేకేఆర్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. తప్పు చేశాను! ఈ క్రమంలో ఓటమి అనంతరం కేకేఆర్ సారథి నితీశ్ స్పందిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈరోజు అతడిది. తను ఏం చేయాలని కోరుకున్నాడో ఆ పని పూర్తి చేశాడు. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అతడిని కట్టడి చేయడానికి పార్ట్ స్పిన్నర్ను పంపితే బాగుంటుందని భావించా. కానీ నా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయా. ఏదేమైనా అతడి ఇన్నింగ్స్ అద్భుతం’’ అని మొదటి ఓవర్ తానే వేయాలన్న తన నిర్ణయానికి చింతించాడు. మరేం పర్లేదు.. దురదృష్టవశాత్తూ ఇలా అయితే, కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మాత్రం నితీశ్ రాణాకు మద్దతుగా నిలిచాడు. ‘‘నితీశ్ బంతితోనూ మాయ చేయగల సమర్థుడు. తన కెరీర్లో కొన్ని కీలకమైన వికెట్లు తీశాడు. లెఫ్టాండర్ క్రీజులో ఉన్నపుడు స్పిన్నర్తో బౌలింగ్ చేయించడం మంచి ఆప్షన్. కానీ దురదృష్టం మమ్మల్ని వెక్కిరించింది. ఒకవేళ నితీశ్ తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అది మాస్టర్స్ట్రోక్ అయ్యేది. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఒక్కోసారి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో వెంకటేశ్ 57 పరుగులతో కేకేఆర్ టాప్ స్కోరర్గా నిలవగా.. నితీశ్ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన నితీశ్.. రైట్ ఆర్మ్బ్రేక్ స్పిన్నర్ కూడా! కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా టాస్: రాజస్తాన్ - బౌలింగ్ కేకేఆర్ స్కోరు: 149/8 (20) రాజస్తాన్ స్కోరు: 151/1 (13.1) విజేత: రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్. చదవండి: రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్ గెలుపు జోష్లో ఉన్న రాజస్తాన్కు బిగ్ షాక్.. బట్లర్కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls. Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI — IndianPremierLeague (@IPL) May 11, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! అందరికీ సాధ్యం కాదు!
IPL 2023 KKR- Venkatesh Iyer: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాపై ఆ జట్టు ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నానంటూ సారథిగా బాధ్యతలు భుజాన వేసుకున్నాడని కొనియాడాడు. కెప్టెన్గా జట్టులోని ఆటగాళ్ల గౌరవం, అభిమానం పొందాడని.. అతడి విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయ్యర్ దూరం కావడంతో ఐపీఎల్-2023కు ముందు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీమిండియాకు దూరమైన అతడు.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ స్థానంలో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది. అతడెందుకని విమర్శలు కెప్టెన్సీ రేసులో సీనియర్ సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ.. మేనేజ్మెంట్ రాణా వైపు మొగ్గు చూపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో నరైన్, సౌథీ వంటి సీనియర్లను కాదని రాణాను సారథిగా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపిస్తున్న నితీశ్ రాణాకు అతడి అభిమానులు మద్దతుగా నిలిచారు. కౌంటర్ అటాక్తో అతడిని విమర్శిస్తున్న వాళ్లకు సమాధానమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు నితీశ్ రాణా. బ్యాటర్గా రాణిస్తున్నాడు బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్గా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో కేకేఆర్ కేవలం నాలుగింట మాత్రమే గెలుపొంది పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్లలో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా గురించి ఆ జట్టు ఓపెనర్, సెంచరీ వీరుడు వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్తో మే 8 నాటి మ్యాచ్ నేపథ్యంలో ఇండియా టుడే ముచ్చటించాడు అయ్యర్. ఈ సందర్భంగా కెప్టెన్ నితీశ్ రాణా, కోచ్ చంద్రకాంత్ పండిట్ గురించి ప్రశ్న ఎదురైంది. చందూ సర్ కోచ్గా రావడం సంతోషం ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో చందూ సర్తో మూడేళ్లపాటు కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆయనే ఐపీఎల్ కోచ్గానూ రావడం బాగుంది. ఈ విషయంలో నాకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. ఇక నితీశ్ రాణా విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయపడిన సమయంలో జట్టును నడిపించేందుకు అతడు ముందుకు వచ్చాడు. శ్రేయస్ సేవలు కోల్పోయి జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బాధ్యత తను తీసుకున్నాడు. అతడికి సాధ్యమైంది నా వరకు కెప్టెన్గా అతడు బాగానే రాణిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూంలో ప్రతీ ఆటగాడితో మమేకం అవుతాడు. అందరూ అతడి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. కెప్టెన్గా అందరితో కలిసిపోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. రాణా కూడా వారిలో ఒకడు’’ అని మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో వెంకటేశ్ ఇప్పటి వరకు 303 పరుగులు చేయగా.. నితీశ్ రాణా 275 పరుగులు సాధించాడు. చదవండి: సన్రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. -
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో (ఇంపాక్ట్ ప్లేయర్గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్లో విలయం సృష్టిస్తున్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కేతో మ్యాచ్లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి. అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు. ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ముంబై ఫటాఫట్... మెరిసిన ఇషాన్, సూర్యకుమార్.. 17.4 ఓవర్లలోనే
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా ఐపీఎల్ సీజన్లో ఫామ్లోకి వచ్చేసింది. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ముంబై... వరుసగా రెండో విజయంతో ప్రత్యర్థి జట్లకు ప్రమాద సంకేతాలు పంపించింది. సొంత మైదానంలో కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇషాన్, సూర్య, తిలక్ వర్మ ధనాధన్ ఆటతో చెలరేగడంతో 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 14 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. అంతకుముందు కోల్కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసినా చివరకు అతని వీరోచిత ప్రదర్శన వృథా అయింది. ముంబై: లక్ష్యం పెద్దదైనా... ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ముంబై ఇండియన్స్ అనుకున్న ఫలితం సాధించింది. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అస్వస్థతతో ముంబై జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగకపోవడంతో సూర్యకుమార్ ఈ మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన సూర్య ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్స్లు) ముంబై బౌలర్లను చితగ్కొట్టి సెంచరీ చేశాడు. అనంతరం ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించి గెలిచింది. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. రోహిత్ శర్మ (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (13 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గతంలో సచిన్ కూడా ముంబై ఇండియన్స్ తరఫునే ఆడటంతో ఐపీఎల్ టోర్నీ ఆడిన తండ్రీ, కొడుకులుగా సచిన్, అర్జున్ గుర్తింపు పొందారు. ఇదే మ్యాచ్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ దువాన్ జాన్సెన్ కూడా అరంగేట్రం చేశాడు. దువాన్ కవల సోదరుడు మార్కో జాన్సెన్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడు తున్నాడు. ఐపీఎల్లో ఆడిన తొలి కవల సోదర ద్వయంగా మార్కో, దువాన్ గుర్తింపు పొందింది. ఆరంభం నుంచే... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు బౌలర్ మెరిడిత్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన రోహిత్ శర్మ, మరో ఓపెనర్ ఇషాన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. శార్దుల్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ 4,4,6 బాదగా... మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ 4, ఇషాన్ 4,6తో చెలరేగగా... 17 పరుగులు వచ్చాయి. నరైన్ నాలుగో ఓవర్లో రోహిత్, ఇషాన్ ఏకంగా 22 పరుగులు రాబట్టారు. దాంతో ముంబై 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 57/0తో నిలిచింది. స్పిన్నర్ సుయశ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన రోహిత్ అదే ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు. అనంతరం ఇషాన్తో సూర్య జతకలిశాడు. వీరిద్దరు అదే జోరును కొనసాగించారు. పవర్ప్లే ముగిసేసరికి ముంబై 72/1తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఏడో ఓవర్లో రెండో బంతిని సిక్స్గా మలిచిన ఇషాన్ తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 90/2తో గెలుపుదిశగా సాగింది. ఇషాన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చి న తిలక్, సూర్యతో కలిసి ముంబైను ముందుకు నడిపించారు. ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్లో సూర్య రెండు సిక్స్లు కొట్టాడు. రసెల్ వేసిన 13వ ఓవర్లో సూర్య, తిలక్ 17 పరుగులు సాధించారు. ముంబై 13 ఓవర్లకే 147/2తో విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. సుయశ్ వేసిన 14వ ఓవర్లో తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. క్రీజులో వచ్చి న టిమ్ డేవిడ్. రెండు సిక్స్లతో తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ముంబై గెలుపునకు 10 పరుగులు ఉన్నాయనగా సూర్య.. ఆ తర్వాత వధేరా అవుటైనా టిమ్ డేవిడ్ మిగతా పనిని పూర్తి చేశాడు. 2008 తర్వాత... అంతకుముందు వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్తో 2008 ఐపీఎల్ తొలి సీజన్ తర్వాత మళ్లీ ఈ టోర్నీ లో కోల్కతా బ్యాటర్ సెంచరీని నమోదు చేయడం విశేషం. 2008లో బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో బ్రెండన్ మెకల్లమ్ (158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్స్లు) భారీ సెంచరీ చేశాడు. కోల్కతా ఇన్నింగ్స్లో ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరోవైపు వెంకటేశ్ ఒక్కడే పోరాటం చేశాడు. ఫోర్లు, సిక్స్లతో అదరగొట్టాడు. 49 బంతుల్లో అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మెరిడిత్ బౌలింగ్లో స్కూప్ షాట్ కొట్టిన వెంకటేశ్ షార్ట్ థర్డ్మ్యాన్ వద్ద జాన్సెన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) జాన్సెన్ (బి) చావ్లా 8; జగదీశన్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) జాన్సెన్ (బి) మెరిడిత్ 104; నితీశ్ రాణా (సి) రమణ్దీప్ సింగ్ (సబ్) (బి) షోకీన్ 5; శార్దుల్ ఠాకూర్ (సి) తిలక్ వర్మ (బి) షోకీన్ 13; రింకూ సింగ్ (సి) నేహల్ వధేరా (బి) జాన్సెన్ 18; రసెల్ (నాటౌట్) 21; నరైన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–11, 2–57, 3–73, 4–123, 5–159, 6–172. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2–0–17–0, కామెరాన్ గ్రీన్ 2–0–20–1, దువాన్ జాన్సెన్ 4–0–53–1, పీయూష్ చావ్లా 4–0–19–1, హృతిక్ షోకీన్ 4–0–34–2, మెరిడిత్ 4–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఉమేశ్ యాదవ్ (బి) సుయశ్ 20; ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) గుర్బాజ్ (బి) శార్దుల్ 43; తిలక్ వర్మ (బి) సుయశ్ 30; టిమ్ డేవిడ్ (నాటౌట్) 24; నేహల్ వధేరా (సి) గుర్బాజ్ (బి) ఫెర్గూసన్ 6; గ్రీన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–65, 2–87, 3–147, 4–176, 5–184. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–0, శార్దుల్ ఠాకూర్ 2–0–25–1, సునీల్ నరైన్ 3–0–41–0, సుయశ్ శర్మ 4–0–27–2, వరుణ్ చక్రవర్తి 4–0–38–1, ఫెర్గూసన్ 1.4–0–19–1, రసెల్ 1–0–17–0. ఐపీఎల్లో నేడు బెంగళూరు vs చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
సాయపడడంలోనూ మనోడు ముందువరుసలోనే!
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్.. తెలుగుతేజం నంబూరి తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుస అర్థసెంచరీలతో రాణించిన తిలక్ వర్మ ప్రస్తుతం ముంబై జట్టులో కీలక బ్యాటర్గా ఉన్నాడు. తాజాగా ఆదివారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ తనలోని క్రీడాస్పూర్తిని బయటపెట్టాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్బంగా నాలుగో ఓవర్లో కామెరున్ గ్రీన్ వేసిన బంతిని వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్ అయిన బంతి మోకాలికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో అయ్యర్ విలవిల్లాడాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ బాధను చూసి తట్టుకోలేక అతని కాలికున్న ప్యాడ్ను తొలగించి మోకాలికి మర్దన చేశాడు. తిలక్ వర్మ చర్యతో వెంకటేశ్ అయ్యర్కు కాస్త ఉపశమనం కలిగింది. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఇక తిలక్ వర్మ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి హీరోగా మారాడు. తిలక్ వర్మ చేసిన పనికి అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ''తిలక్ వర్మ మంచి బ్యాట్స్మన్ మాత్రమే కాదు.. సాయపడడంలోనూ ముందు వరుసలో ఉంటాడు..'' అంటూ కామెంట్ చేశారు. మోకాలి గాయం బాధిస్తున్నా నొప్పిని భరిస్తూనే వెంకటేశ్ అయ్యర్ శతకంతో చెలరేగాడు. సీజన్లో రెండో సెంచరీ కాగా.. అయ్యర్కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ. అయితే అయ్యర్ సెంచరీ వృథాగా మారింది. మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో కేకేఆర్పై విజయాన్ని సాధించింది. చదవండి: వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే? -
వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే?
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శతకంతో మెరిశాడు. ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అయ్యర్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ కాగా.. కేకేఆర్ తరపున ఇది రెండో ఐపీఎల్ సెంచరీ మాత్రమే. ఇంతకముందు ఐపీఎల్ తొలి సీజన్ 2008లో బ్రెండన్ మెక్కల్లమ్(158*పరుగులు) మాత్రమే కేకేఆర తరపున సెంచరీ సాధించాడు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వెంకటేశ్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ శతకంతో మెరవడమే కాదు.. కేకేఆర్ తరపున సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో శతకం మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్ ఆ తర్వాత మరో నాలుగు పరుగులు చేసి 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే వెంకీ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శతకం సాధించగానే రెండు చేతులతో బ్యాట్ను పట్టుకొని భారతీయ సంప్రదాయ పద్దతిలో మొక్కుతూ కనిపించాడు. ఆ తర్వాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ ఈ సెంచరీ మీకోసమే అన్నట్లుగా గెస్టర్ ఇచ్చాడు.. మరి ఆ సైగ ఎవరికి ఇచ్చాడా అని తిరిగిచూస్తే ఎదురుగా కింగ్ ఖాన్.. షారుక్ కూతురు సుహానా ఖాన్ కనిపించింది.వెంకీ అలా చేయగానే ఆమె నవ్వుతూ చప్పట్లతో అభినందించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబై, కేకేఆర్ మ్యాచ్ ఏమో గానీ ఇరుజట్లలో కీలకపాత్రల్లో ఉన్న సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్ల ముద్దుల తనయలు ఈ మ్యాచ్లో ప్రత్యక్షమయ్యారు. ఒక ఎండ్లో సచిన్ కూతురు సారా టెండూల్కర్.. మరో ఎండ్లో షారుక్ కూతురు సుహానా ఖాన్లు తమ జట్లను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అర్జున్ టెండూల్కర్ కూడా ఇవాళ్లి మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. History Created... #venkateshiyer is the 2nd player to score 100 for KKR. 🔥🔥 What a Innings 🔥💪#KKRvMIpic.twitter.com/jiemQWEXkN — 𝐁𝐀𝐁𝐀 𝐘𝐀𝐆𝐀 (@yaga_18) April 16, 2023 చదవండి: #venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. -
#venkateshIyer: నొప్పిని భరిస్తూనే..
ఐపీఎల్ 16వ సీజన్లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్లో గుడ్లెంగ్త్తో వచ్చిన డెలివరీని స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం. ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్ అయ్యర్ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్ కింద డగౌట్ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్ అనంతరం చెప్పుకొచ్చాడు. చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే! -
వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. ఐపీఎల్లో అయ్యర్కు ఇది తొలి శతకం కాగా.. కేకేఆర్ తరఫున కేవలం రెండవది మాత్రమే. అరంగేట్రం సీజన్ తొలి మ్యాచ్లో బ్రెండన్ మెక్కల్లమ్ (158 నాటౌట్) బాదిన సెంచరీ ఒక్కటే ఇప్పటివరకు కేకేఆర్ తరఫున నమోదై ఉంది. అంటే 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున ఐపీఎల్లో రెండో సెంచరీ నమోదైందన్న మాట. కాగా, కేకేఆర్ ఇన్నింగ్స్లో బ్యాటర్లంతా కలిపి కేవలం 3 ఫోర్లు (శార్దూల్ 1, రింకూ 2) కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. అయ్యర్కు జతగా రింకూ సింగ్ (18) క్రీజ్లో ఉన్నాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు. -
అర్జున్ టెండూల్కర్ను చెడుగుడు ఆడుకున్న వెంకటేశ్ అయ్యర్
ముంబైలోని వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ, తన రెండో ఓవర్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ చేతికి చిక్కి బలయ్యాడు. Photo Credit : IPL Website ఈ ఓవర్లోనూ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వని అర్జున్.. ఆ తర్వాత బంతిని వైడ్ వేసి, ఆ వెంటనే వరుసగా 2 పరుగులు, 0, బౌండరీ, సిక్సర్ సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో అయ్యర్ ధాటికి మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవడంతో కెప్టెన్ సూర్యకుమార్ అర్జున్ను బౌలింగ్ నుంచి తప్పించి డ్యూయాన్ జన్సెన్కు బంతిని అప్పజెప్పాడు. కాగా, సుదీర్ఘకాలంగా (రెండేళ్లుగా) ఐపీఎల్ ఎంట్రీ కోసం ఎదురుచూసిన అర్జున్కు ఓ మోస్తరు ప్రారంభమైతే లభించింది. ఎన్నో అంచనాల నడుమ కుటుంబ సభ్యుల సమక్షంలో బరిలోకి దిగిన అర్జున్ తొలి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనించాడు. అయితే రెండో ఓవర్లో మాత్రం అర్జున్ కాస్త తడబడ్డాడు. తన కోటా ఓవర్లు మొత్తం పూర్తయితే కాని అతను బౌలింగ్పై ఓ అంచనాకు రాలేని పరిస్థితి. ఇక్కడ ఓ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అర్జున్ తొలి బంతి నుంచి రన్అప్తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అతని శైలి ఆశిష్ నెహ్రాను తలపించినప్పటికీ.. బౌలింగ్లో మాత్రం వేగం లోపించింది. అతను బౌల్ చేసిన 13 బంతులు 130కిమీ వేగం లోపే ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేకేఆర్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. 8.1 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5) ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (22 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. -
ఇంపాక్ట్ ప్లేయర్ల ఇంపాక్ట్ ఎంత.. ఏ జట్టు ఎక్కువ లాభపడింది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఆప్షన్ ప్రస్తుత ఎడిషన్ (2023) నుంచే మొదలైన విషయం తెలిసిందే. ఈ సరికొత్త నిబంధన ప్రకారం టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఐదుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిలో ఒకరిని సంబంధిత జట్టు ఇంపాక్ట్ ప్లేయర్గా వినియోగించుకుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, వికెట్ పడిన తర్వాత, బ్యాటర్ రిటైర్ అయిన తర్వాత, ఓవర్ పూర్తయిన సందర్భాల్లో పరిచయం చేయవచ్చు. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ల్లో అన్ని జట్లు ఈ అప్షన్ను విజయవంతంగా వినియోగించుకున్నాయి. లీగ్లో మున్ముందు అన్ని జట్లు ఈ ఆప్షన్ను ఇంకా బెటర్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. లీగ్లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ల్లో కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ను సక్సెసఫుల్గా వాడుకుందని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో బౌలర్ సుయాశ్ శర్మ స్థానంలో వెంకటేశ్ అయ్యర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించి, సక్సెస్ సాధించింది. ఆ మ్యాచ్లో అయ్యర్ 40 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ల వివరాలు.. గుజరాత్ వర్సెస్ సీఎస్కే: అంబటి రాయుడు స్థానంలో తుషార్ దేశ్పాండే, కేన్ విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్: వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యర్, భానుక రాజపక్ష స్థానంలో రిషి ధవన్ లక్నో వర్సెస్ డీసీ: ఆయుష్ బదోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్, ఖలీల్ అహ్మద్ స్థానంలో అమాన్ ఖాన్ సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్: ఫజల్హక్ ఫారూఖీ స్థానంలో అబ్దుల్ సమద్, యశస్వి జైస్వాల్ స్థానంలో నవ్దీప్ సైనీ ఆర్సీబీ వర్సెస్ ముంబై: సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బెహ్రెన్డార్ఫ్ సీఎస్కే వర్సెస్ లక్నో: ఆవేశ్ ఖాన్ స్థానంలో బదోని, రాయుడు స్థానంలో తుషార్ దేశ్పాండే ఢిల్లీ వర్సెస్ గుజరాత్: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ఖలీల్అహ్మద్, జాషువ లిటిల్ ప్లేస్లో విజయ్ శంకర్ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్: చహల్ ప్లేస్లో దృవ్ జురెల్, ప్రభ్సిమ్రన్ స్థానంలో రిషి ధవన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సుయాశ్ శర్మ, సిరాజ్ప్లేస్లో అనూజ్ రావత్ లక్నో వర్సెస్ సన్రైజర్స్: రాహుల్ త్రిపాఠి ప్లేస్లో ఫజల్హక్ ఫారూకీ, అమిత్ మిశ్రా స్థానంలో బదోని రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ షా, బట్లర్ ప్లేస్లో మురుగన్ అశ్విన్ ముంబై వర్సెస్ సీఎస్కే: టిమ్ డేవిడ్ స్థానంలో కుమార్ కార్తికేయ, దీప్ చాహర్ స్థానంలో రాయుడు గుజరాత్ వర్సెస్ కేకేఆర్: సాయి సుదర్శన్ స్థానంలో జాషువ లిటిల్, సుయాశ్ ప్లేస్లో వెంకటేశ్ అయ్యర్ సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్: ప్రభ్సిమ్రన్ స్థానంలో సికందర్ రజా ఆర్సీబీ వర్సెస్ లక్నో: అమిత్ మిశ్రా స్థానంలో బదోని, అనూజ్రావత్ ప్లేస్లో కర్ణ్ శర్మ ఢిల్లీ వర్సెస్ ముంబై: పృథ్వీ షా స్థానంలో ముకేశ్ కుమార్ సీఎస్కే వర్సెస్ రాజస్థాన్: బట్లర్ స్థానంలో జంపా, మగాలా ప్లేస్లో రాయుడు -
V ఫర్ వెంకటేశ్ అయ్యర్, V ఫర్ విధ్వంసం
-
Venkatesh Iyer: ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి విధ్వంసం
ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి 'ఇంపాక్ట్ ప్లేయర్' ముద్ర కనబడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు జరిగితే ఒక్క మ్యాచ్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ సరైన ప్రభావం చూపించింది లేదు. బౌలింగ్లో ఇంపాక్ట్ ప్రభావం కనిపించినా బ్యాటింగ్లో మాత్రం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా కేకేఆర్ మాత్రం తొలిసారి బ్యాటింగ్లో వెంకటేశ్ అయ్యర్ను ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా సరైన సమయంలో వాడింది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్లో వెంకటేశ్అయ్యర్కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇక వెంకటేశ్ అయ్యర్ మాత్రం తన వింటేజ్ ఆటను చూపించాడు. గుజరాత్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి కావాల్సిన ఇంపాక్ట్ను వెంకటేశ్ సరిగ్గా అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మధ్యలో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసినప్పటికి రింకూ సింగ్ తన విధ్వంసంతో మ్యాచ్ను గుజరాత్ నుంచి లాగేసుకున్నాడు. -
చాలా ఊహించుకున్నా.. హార్ధిక్ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..!
యూఏఈ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సెకెండ్ లెగ్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చాలామందికి గర్తుండే ఉంటాడు. ఆ సీజన్లో బ్యాట్తోనూ బంతితోనూ మెరుపులు మెరిపించి, టీమిండియాకు సరికొత్త ఆశాకిరణంలా అగుపించిన ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు ఈ మధ్యకాలంలో టార్చ్ లైట్ పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో చాలామంది భారత క్రికెట్ అభిమానులు ఈ యువ ఆల్రౌండర్కు ఏమైందని, ఎక్కడికెళ్లిపోయాడని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ అయ్యరే స్వయంగా సోషల్మీడియా ముందుకు వచ్చాడు. తను ఎక్కడికీ పోలేదని. దేశవాలీ టోర్నీల్లో బిజీగా ఉన్నానని తనను గుర్తు చేసుకున్న అభిమానులను పలకరించాడు. టీమిండియాలో తన జాడ లేదని కొందరు అభిమానులు అతన్ని ప్రశ్నించగా.. జట్టుతో అతను ట్రావెల్ చేసిన కొద్దిపాటి జర్నీని షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత టీమిండియా తరఫున తనకు అవకాశాలు వచ్చినప్పటికీ.. తను అనుకున్న రీతిలో ఓపెనర్గా బరిలోకి దిగలేకపోయానని, జట్టు తనను ఫినిషర్ పాత్రలో వాడుకోవాలని భావించిందని, ఆ పాత్రకు నేను న్యాయం చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. తనకు దొరికిన కొద్దిపాటి అవకాశాల్లో అడపాదడపా రాణించినప్పటికీ.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయానని, ఈ లోపు హార్ధిక్ పాండ్యా టీమిండియాలోకి గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిపాడు. ఐపీఎల్-2022, ఆసియా కప్, వరల్డ్కప్ సక్సెస్లతో హార్ధిక్ జట్టులో పాతుకుపోయాడని, అతని హవాలో తాను కనుమరుగయ్యానని వాపోయాడు. జట్టుకు ఎంపికైన సమయంలో కోచ్, కెప్టెన్ తనకు వీలైనన్ని అవకాశాలిస్తామని ప్రామిస్ చేశారని, ఈ లోపే హార్ధిక్ కుదురుకోవడంతో తన అవసరం వారికి లేకుండా పోయిందని అన్నాడు. దేశవాలీ టోర్నీల్లో రాణించినప్పటికీ సెలెక్టర్లు తనను పరిగణలోకి తీసుకోలేదని, టీ20 వరల్డ్కప్లో తన సత్తాను నిరూపించుకోవాలని చాలా కలలు కన్నానని, కానీ తన టైమ్ బాగాలేక ఇలా ఉండిపోయానని తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. కాగా, మధ్యప్రదేశ్కు చెందిన 27 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో 10 మ్యాచ్ల్లో 129 స్ట్రయిక్ రేట్తో 370 పరుగులు చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకుని 2 వన్డేలు, 9 టీ20 ఆడాడు. అయితే అతనికి లోయర్ మిడిలార్డర్లో అవకాశాలు రావడంతో పెద్దగా రాణించలేక, జట్టుకు దూరమాయ్యడు. -
IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో.. దారుణంగా విఫలమైనా..!
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్ రెండు రోజుల కిందటే (నవంబర్ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్లో దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), సునీల్ నరైన్ (కేకేఆర్), మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్), షారుఖ్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. గత రెండు సీజన్లుగా కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్, 2021 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో అతనాడిన 12 మ్యాచ్ల్లో 107.69 స్ట్రయిక్ రేట్తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. పార్ట్ టైమ్ ఆల్రౌండర్ అయిన అయ్యర్ సీజన్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సునీల్ నరైన్ విషయానికొస్తే.. కేకేఆర్కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్ ఆల్రౌండర్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 11 ఏళ్ల తర్వత ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ వికెట్కీపర్ మాథ్యూ వేడ్.. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్ రేట్తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్కు 2011 ఐపీఎల్ సీజన్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిన అతను 66.66 స్ట్రయిక్ రేట్తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్ ఖాన్.. గత సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 108 స్ట్రయిక్ రేట్తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. అండర్-19 వరల్డ్కప్ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన పరాగ్ 138. 64 స్ట్రయిక్ రేట్తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రియాన్ పరాగ్లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
టీమిండియా ఆల్రౌండర్కు గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీమిండియా యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చీలమండకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో టోర్నీలో మిగిలిన మ్యాచ్ల మొత్తానికి అయ్యర్ దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రైల్వేస్తో జరిగిన తొలి మ్యాచ్లో అయ్యర్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తొలుత 62 పరుగులతో ఆజేయంగా నిలిచిన వెంకటేశ్.. బౌలింగ్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా అయ్యర్ అందించాడు. "చీలమండ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాను. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. నేను జట్టుకు దూరమైన్పటికీ.. మా బాయ్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని సోషల్ మీడియాలో అయ్యర్ పోస్ట్ చేశాడు. కాగా ఐపీఎల్-2021లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్కు భారత జట్టులో చోటు దక్కింది. అయితే జట్టులో మాత్రం తన స్థానాన్ని అయ్యర్ సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, రెండు వన్డేల్లో అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venkatesh -
వెంకటేశ్ అయ్యర్కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ!
దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్లో గాయపడ్డాడు. వెస్ట్ జోన్ పేసర్ చింతన్ గజా వేసిన ఓవర్లో అయ్యర్ బౌలర్ దిశగా ఢిపెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న గజా.. అయ్యర్ వైపు బంతిని త్రో చేశాడు. అయితే బంతి నేరుగా అయ్యర్ మెడకు బలంగా తాకింది. దీంతో అయ్యర్ తీవ్ర నొప్పితో గ్రౌండ్లో విలవిలాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకువెళ్లడాననికి అంబులెన్స్ కూడా గ్రౌండ్లోకి వచ్చింది. అయితే అయ్యర్ మాత్రం నెమ్మదిగా నడుస్తునే ఫీల్డ్ను వదిలాడు. ఈ ఘటన అతడు 6 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తుండగా చోటుచేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో రిటైర్ హార్ట్గా వెనుదిరిగిన అయ్యర్ తిరిగి మళ్లీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. Unpleasant scene here. Venkatesh Iyer has been hit on the shoulder as Gaja throws the ball defended ball back at the batter. Venkatesh is down on the ground in pain and the ambulance arrives. #DuleepTrophy pic.twitter.com/TCvWbdgXFp — Dhruva Prasad (@DhruvaPrasad9) September 16, 2022 చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా ట్రెవర్ బేలిస్!
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
దేశంలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది
కాంగ్రెస్ గెలిస్తే అవినీతి పాలన
మీకు తెలుసా ?
బీర్ల కోసం.. బారులు
పల్లెల్లో డిజిటల్ ప్రచారం
రైల్వే చరిత్రలో 1974 మరుపురాని ఘట్టం
హేమాచలుడిని దర్శించుకున్న ఎన్నికల వ్యయపరిశీలకులు
ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు
ఓటుహక్కును వినియోగించుకోవాలి
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
తప్పక చదవండి
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ‘సత్య’ మూవీ రివ్యూ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement