పశ్చిమగోదావరి డెస్క్: అవును నేను ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్ ఫ్యాన్స్ని.. అంటున్నారట ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పలువురు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. తమ సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడుకునే సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు చూసి వారి సన్నిహితులు.. ఏమైందన్నా నీ మైండ్ ఖరాబైందా అని అంటున్నారంట. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్.. నేను మాత్రం జగన్ ప్రజలకు చేస్తున్న సేవకే ఫ్యాన్స్ అయ్యానంటున్నావ్.. ఇదేందన్నా అని ప్రశ్నిస్తున్నారంట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థిస్తూ జనం దగ్గరికి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. పలువురు జనం జగన్ అందించిన పథకాలతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మా రాయని.. తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు జగనన్న బాటలు వేస్తున్నాడని.. పింఛన్లు తమ ఇంటికే వలంటీర్లను పంపించి అందిస్తున్నాడని.. తమ ఎదుటే ఎలాంటి బెరుకూ భయం లేకుండా చెబుతుండటం చూసి అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారట. ఇక చేసేదేమీ లేక తమ ప్రభుత్వం వచ్చినా అవన్నీ అమలు చేస్తామని చె బుతున్నారట. అయితే.. ఇవన్నీ జగనన్నే ఎలాంటి ఇబ్బందీ లేకుండా అమలు చేస్తుంటే.. ఇంక మీకెందుకు ఓటేయడం.. అని ప్రశ్నిస్తు న్నారట. దీంతో ఆయా అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారట. ఎక్కడికి వెళ్లినా.. కొంతమంది ముక్తసరిగా, మొక్కుబడి గా ముఖంలో లేని నవ్వు పులుముకొని కనిపిస్తుండటం గమనించిన నేతలు.. వారి ఓటు కచ్చితంగా తమకు పడదని ఫిక్సయి పోతున్నారంట. ఈ పరిస్థితులపై ఒక్కసారి లోతుగా ఆలోచిస్తున్న నేతలు.. సీఎం జగన్ పేదల జీవితాల్లో ఎంతటి మార్పు తెచ్చాడో కదా అని అనుకుంటున్నారంట. అదే విషయాన్ని తమ అనుయాయుల వద్ద ప్రస్తావిస్తే.. అవునన్నా మాకూ జగన్ ఇచ్చిన పథకాలు అందుతున్నాయ్.. కానీ మనం తొలి నుంచీ ఈ పార్టీనే నమ్ముకుని ఉన్నాం కాబట్టి.. ఇందులోనే తిరుగుతున్నాం.. అంటూ అసలు విషయం చెబుతున్నారంట. దీనిని బట్టి చూస్తే తమ అనుచరుల ఓట్లు తమకు పడినా.. వారి కుటుంబసభ్యుల ఓట్లు మాత్రం తమకు పడతాయనే గ్యారెంటీ లేదని ఆయా అభ్యర్థులు అయోమ యంలో పడుతున్నారంట. ఈ నేపథ్యంలోనే జ గన్ విజన్కు సలామ్ కొడుతూ.. నేను కూడా ఫ్యాన్ ఫ్యాన్సే అంటున్నారంట. కానీ తనకే ఓటు వేసి గెలిపించాలని మాత్రం ఓటర్లను ఇంటింటికీ వెళ్లి బతిమాలుకుంటున్నారంట. అదండీ సంగతి!
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్ ఫ్యాన్స్ని..
Published Sat, Apr 20 2024 10:30 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై ఆగని దాడులు
ఈవీఎం ట్యాంపరింగ్ పై రాహుల్ గాంధీ, మస్క్ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్లో ఎన్కౌంటర్: నలుగురు మావోయిస్టుల మృతి
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement