వైఎస్సార్‌ సీపీలోకి ముమ్మరంగా చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి ముమ్మరంగా చేరికలు

Published Thu, May 9 2024 5:15 AM

వైఎస్సార్‌ సీపీలోకి ముమ్మరంగా చేరికలు

నూజివీడు : చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) అన్నారు. మీర్జాపురం శివారు కండ్రికకు చెందిన యాదవ సామాజిక వర్గం నుంచి పుట్ట బలేస్వామి, అంగడాల ఉమామహేశ్వరరావు, కొలుసు నీలకంఠం, అంగడాల మణికంఠ, పుట్టి ఏసురాజు, అంగడాల ప్రదీప్‌, జొన్నలగడ్డ రామాంజనేయులు, నెర్సు సాంబయ్య తదితరులు 20 కుటుంబాల వారు చంటినాయన సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో బుధవారం రాత్రి చేరారు. వీరందరికి చంటినాయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ తరుపున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌లను గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్యే ప్రతాప్‌ సమక్షంలో..

ఆగిరిపల్లి: మండలంలో ఆగిరిపల్లి, చిన్నగిరిపల్లి, కొత్త ఈదర గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు టీడీపీ, బీజేపీ నుంచి ఆగిరిపల్లిలో ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు సమక్షంలో బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. బీజేపీకి చెందిన జిల్లా బీసీ నాయకుడు దొడ్డ నాగరాజుకు ఎమ్మెల్యే ప్రతాప్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన ఎర్ర సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాసరావు, జాలిపర్తి రాజాబాబు, జల్లి కొండలు, సుబ్బారావు, షేక్‌ బాజాని, షేక్‌ పటేల్‌ పార్టీ లో చేరిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న నూజివీడు లో పెనమలూరు నుండి వలస వచ్చిన టిడిపి అభ్యర్థి పార్థసారథి నూజివీడులో రౌడీయిజం చేయాలని చూస్తున్నారని, వారి ఆటలను ఎట్టి పరిస్థితిలో సాగనివ్వనని ఓటుతో ప్రజలు పెనమలూరుకు తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా సునీల్‌ కుమార్‌ యాదవ్‌ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జిల్లా కార్యదర్శి మచ్చా హరిబాబు, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపి సర్పంచ్‌ అత్తి మురళీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు నక్కనబోయిన పండు, వాకాసకేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement