మంచి ముహూర్తం చూసుకుని.. | Sakshi
Sakshi News home page

మంచి ముహూర్తం చూసుకుని..

Published Thu, Apr 18 2024 9:40 AM

- - Sakshi

నామినేషన్ల హడావిడి నేటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగనుంది. బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు పండితులు, గురువులు, స్వామీజీలను ఆశ్రయించి ముహుర్తాలను నిర్ణయించుకుంటున్నారు. పంచాంగం ప్రకారం చూస్తే ఈ నెల 18, 19, 22, 23, 24 తేదీల్లో మంచి ముహుర్తాలున్నట్లు పండితులు పేర్కొంటున్నారు. కొందరు సెంటిమెంట్‌తో పాటు వారాలకు ప్రాధాన్యతనిస్తూ అందుకు అనుగుణంగా శుభగడియల్లో ముహూర్తాలను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఈనెల 18వ తేదీన శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గురువారం ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేయనున్నారు. ఈనెల 22వ తేదీన పాణ్యం వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, 23వ తేదీ నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, 24వ తేదీన ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దారా సుధీర్‌, బనగానపల్లె వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Advertisement
Advertisement