కుల బహిష్కరణ ఘటనలో కేసు నమోదు | Sakshi
Sakshi News home page

కుల బహిష్కరణ ఘటనలో కేసు నమోదు

Published Sun, Apr 7 2024 1:40 AM

-

భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డికి చెందిన లలితను కులం నుంచి బహిష్కరించారని, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ కులపెద్దలపై కేసు నమోదు చే సినట్లు ఎస్సై సాయికుమార్‌ శనివారం తెలిపారు. బాధితురాలు ఫిర్యాదులో పే ర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. లలిత భర్త నర్సింలు ఇటీవల మృతి చెందాడు. ఆయన బతికి ఉన్నప్పుడు ఓ పెళ్లి విషయంలో నర్సింలుకు కులస్తులతో గొడవ జరిగింది. నర్సింలుపై ద్వేషం పెంచుకున్న పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. ఆ తరువాత నర్సింలు గతనెల 24వ తేదీన మృతి చెందగా, ఆయన అంత్యక్రియలకు కులస్తులు హాజరుకాకపోగా, వచ్చిన వారిని బెదిరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణభయం ఉందని లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement