-
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బాన్సువాడ రూరల్: బంధువుల విందుకు హాజరైన ఓ మహిళను మృత్యువు కబళించింది. కిరాణ దుకాణంలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వస్తున్న వాహనం సదరు మహిళను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం తాడ్కోల్లో చోటు చేసుకుంది. సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన పోతరాజు గంగవ్వ(60) బాన్సువాడ మండలంలోని తాడ్కోలో తమ బంధువులు నిర్వహించిన కందూరు విందుకు శుక్రవారం హాజరైంది. పెద్దదేవుని దర్గాలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో బాన్సువాడ వైపు వేగంగా వెళ్తున్న తుఫాను వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తమ్ముడు సాయిలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
విద్యుత్ శాఖకు రూ.50 లక్షల ఆస్తి నష్టం
నిజామాబాద్నాగారం: వడగళ్ల వానతో విద్యుత్ శాఖకు సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్ఈ రవీందర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ దురు గాలులు, వడగళ్లకు గంటల వ్యవధిలో 10 ట్రాన్సుఫార్మర్లు, 150 వరకు విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. కరెంట్ సరఫరాలో ఇక్కట్లు రావడంలో అధికారులు, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచే విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో పడ్డా రు. పట్టణాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పల్లెలో అర్ధరాత్రి వరకు కరెంట్ సరఫరా అందిస్తామన్నారు. -
దొంగతనం కేసులో ముగ్గురికి జైలుశిక్ష
ఖలీల్వాడి: బంగారు ఆభరణాలు దొంగిలించిన ఘటనలో ముగ్గురికి జైలు శిక్షను విధించినట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దులంకు చెందిన నీరడి అరుణ్, నీరడి రాజమణి, రెంజల్ మండలం కుర్నాపల్లికి చెందిన కొండపల్లి సావిత్రి, కోటగిరి మండలం కల్లూరుకు చెందిన సాయిలు 2022 మే 8న నగరంలోని గౌతంనగర్లో ఉన్న బోయిని పోచమ్మ ఇంటికి వెళ్లి ఇల్లు అద్దెకు కావాలని ఇంట్లోకి ప్రవేశించారు. వీరు పోచమ్మపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి గొంతు నులిమి హత్య చేశారు. నిందితులపై సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. విచారణలో అరుణ్, సాయిలు, రాజమణి దొంగతనం చేసినట్లు రుజువు కావడంతో వీరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు దొంగసొత్తు కలిగి ఉన్నందున మరో రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. వేయి జరిమానా విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కాగా పోచమ్మ పోస్టుమార్టంలో సహజ గుండెజబ్బుతో మృతి చెందినట్లు రిపోర్టు రావడంతో నిందితులపై హత్య నేరం కాకుండా దొంగతనం, దొంగసొత్తు కలిగి ఉన్నందున కేసు నమోదు చేసి శిక్షను విధించినట్లు జడ్జి పేర్కొన్నారు. -
పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
రెంజల్: పూడ్చిపెట్టిన మృతదేహానికి కొల్లూర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని సాటాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీరయ్య(48) బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మా ణ కార్మికుడిగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న ప్రదేశంలో భవనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనపై సైబరాబద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూర్ పీఎస్లో కేసు నమోదైంది. గాయపడిన గీరయ్యను కుటుంబీకులు గ్రామానికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించారు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకొని కేసు విషయమై పూడ్చిపెట్టిన మృతదేహానికి డాక్లర్లు, ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించారు. -
బోధన్–బీదర్ రైల్వే లైన్కు కృషి చేస్తా
రుద్రూర్: బోధన్–బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. చందూర్, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు బోధన్–బీదర్ రైల్వే లైన్ సర్వే చేయించి ఎస్టీమెట్ వేయించానని, ఆ తర్వాత ఎంపీగా వచ్చిన బీబీ పాటిల్ దాని గురించి పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోధన్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ బాన్సువాడ సెగ్మెంట్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, పార్టీ మండలాల అధ్యక్షులు తోట అరుణ్కుమార్, సురేశ్బాబా, పుప్పాల శంకర్, షాహీద్, నాయకులు పాల్గొన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement