సేవాభావం పెంపొందించుకోవాలి | Sakshi
Sakshi News home page

సేవాభావం పెంపొందించుకోవాలి

Published Wed, May 8 2024 8:50 AM

సేవాభావం పెంపొందించుకోవాలి

కొరుక్కుపేట : సేవాభావం పెంపొందించుకుని, తమవంతుగా సమాజానికి సేవ చేయాలని ఆవలూరులోని శ్రీఓం పంచశక్తి పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి జగద్గురు శ్రీఓం ఆది సత్యేంద్రస్వామి ఉద్భోదించారు. చైన్నె కొరట్టూరు సమీపంలోని శ్రీ అరుణోదయం బాలురు, బాలికల గృహాన్ని జగద్గురు శ్రీఓం ఆది సత్యేంద్రస్వామి సందర్శించారు. ఆ గృహంలోని దివ్యాంగులైన చిన్నారులకు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వామీజీ ఎదుట సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. చివరగా స్వామీజీ బాలబాలికల నుదుట తిలకాలు దిద్ది అందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హోమ్‌ మేనేజింగ్‌ ట్రస్ట్రీ అయ్యప్పన్‌ సుబ్రమణియన్‌, ట్రస్టీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. అనంతరం స్వామీజీ అను గ్రహభాషణం చేస్తూ మానవత్వం దైవత్వానికి దారి తీస్తుందని, మానవ సేవే మాధవ సేవ కనుక అంద రూ సేవాభావం పెంపొందించుకుని పేదలకు తమవంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement