breaking news
-
చంద్రబాబుకు బిగ్ షాక్!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కూటమి సర్కార్కు ఊహించని షాక్ తగిలింది. మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.వివరాల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో టెండర్లను పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అయితే, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే సింగిల్ బిడ్ దాఖలైంది. కాగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెండర్లు గడువు పెంచింది. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుండి ఉద్యమ బాట పట్టిన వైఎస్సార్సీపీ.. కోటి సంతకాల సేకరణతో పతాక స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ..అంతకుముందు.. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. ఎక్స్లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్ ట్రెండింగ్లో కొనసాగింది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్లో మద్దతు వెల్లువెత్తింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇది బట్టబయలు చేసింది.వైఎస్ జగన్ సంకల్పం..పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి జిల్లా కేంద్రాలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని గవర్నర్కు అందజేశారు. -
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి. -
మందుబాబులకు అలర్ట్.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వచ్చెనని, సంబరాలు తెచ్చెనని రోడ్లపై హంగామా సృష్టించారో.. హద్దు మీరి ప్రవర్తించారో.. జర జాగ్రత్త! పోలీసులు చూస్తున్నారు.. నిఘా నేత్రం కనిపెడుతోంది! నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు తాగి వాహనాలు నడిపే వారిపై నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ)లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం 7 ప్లటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. పట్టుబడితే రూ.పదివేల జరిమానా.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతోపాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ’డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా... డిసెంబర్ 31 రాత్రి పబ్లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ను ఉంచుతామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు సీపీ(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీసీపీలు ఎన్.శ్వేత, రక్షితాకృష్ణమూర్తి, శ్రీ రూపేష్, ఆర్. వెంకటేశ్వర్లు, వి.అరవింద్బాబు, లావణ్య నాయక్ జాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్బాస్ సీజన్-9లో కామనర్గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్.. తనూజ గురించి చెప్తూ 'ముద్దు మాటలతో చెవిలో మందార పూలు పెడుతున్నారు' కొంతమంది అంటూ డైలాగ్ కొట్టాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫైనల్ ఎపిసోడ్లో తనూజ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని పేర్కొంది. దీంతో తాజాగా మనీష్ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.ఎవరైనా క్వీన్పై దాడి చేస్తారు.. 'ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ ప్రారంభించాలి, ఏమి చెప్పాలి! 105 రోజులుగా, ఇంత తెలివైన, అద్భుతమైన ఆటను బయటకు తీయడం దాదాపు అసాధ్యం. కానీ, దానిని మీరు సాధించారు. మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేరు. మీరు ఎల్లప్పుడూ ఈ సీజన్లో నా టాప్- 5 లిస్ట్లో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు మీకు ఓటు వేసాను. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. చెస్లో క్వీన్ బలమైనదిగా ఉంటుంది. అక్కడ ఆట గెలవడానికి అందరూ ముందుగా క్వీన్పై దాడి చేయాలి అనుకుంటారు. క్వీన్ పోతే గేమ్ కుడా పోయినట్లే. నేను తిరిగి హౌస్లోకి వచ్చినప్పుడు.. మీతో నా ఆట ఆడవలసి వచ్చింది. ఎందుకంటే మీరు క్వీన్ ఆపై ఈ సీజన్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇంటి లోపలే కాదు.. బయట కూడా మీరు బలంగానే ఉన్నారు.బహిరంగ క్షమాపణకానీ, మీరు ఫైనల్ వేదికపై నా మాటలకు చెడుగా భావించారని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మైక్ దొరికితే షోలోనే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేవాడిని. కానీ, అవకాశం రాలేదు. అయితే, నిన్ను కలిసినప్పుడు నేను మొదట చేసిన పని క్షమాపణలు చెప్పడమే..! కానీ. మరోసారి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం ద్వారా ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాలేరు. ఆరోగ్యకరమైన రేపటి కోసం హృదయపూర్వక హస్తాన్ని అందిస్తున్నట్లు అవుతుంది! ఇదే సమయంలో మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజు నేను ఇంట్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు దానిని గ్రహించి నాతో మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను. BB అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆటను మీరు ఆడారు! ఆపై మీరు చాలా మందిని గెలుచుకున్నారు.' అంటూ తనూజతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మనీష్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Maryada Manish (@maryada.manish) -
రిలయన్స్ కన్జూమర్ చేతికి ‘ఉదయం’
రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడుకి చెందిన ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం కంపెనీలో ఆర్సీపీఎల్కి మెజారిటీ వాటాలు, సంస్థ గత ప్రమోటర్లు ఎస్. సుధాకర్, ఎస్. దినకర్లకు మైనారిటీ వాటాలు ఉంటాయి.ఈ డీల్తో ఆర్సీపీఎల్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఉదయం బ్రాండ్ కూడా చేరినట్లయింది. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను దశాబ్దాలుగా అందిస్తూ ఉదయం ఎంతో పేరొందిందని ఆర్సీపీఎల్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం బ్రాండ్ కింద బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్యాకేజ్డ్ పప్పు ధాన్యాలు మొదలైన అమ్ముడవుతున్నాయి. -
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్లైన్ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి. -
ఔటర్ టు ఆర్ఆర్ఆర్.. 16 గ్రీన్ఫీల్డ్ రోడ్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక(కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్యన వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41 కి.మీ. మేర నిర్మించనున్న మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కి.మీ. మేర నిర్మించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు డీపీఆర్ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గాల్లో భూసేకరణకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ రెండింటితోపాటు మరో 14 చోట్ల ఈ తరహా రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ మీదుగా నేరుగా ట్రిపుల్ ఆర్ వరకు చేరుకొనే విధంగా ఈ రహదారుల నిర్మాణం ఉంటుందని అధికారులు అంటున్నారు. మహానగరం అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా దశలవారీగా రోడ్ల నిర్మాణంపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ రైజింగ్–47 నివేదికలోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు భారీ టౌన్షిప్ల ఏర్పాటుకు కూడా హెచ్ఎండీఏ యోచిస్తోంది. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టౌన్షిప్లను నిర్మించనుంది. 2047 నాటికి రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే రహదారుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రెండో రోడ్డుకు త్వరలో డీపీఆర్... ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుద్వేల్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వెలుపల ఉన్న కోస్గి వరకు నిరి్మంచనున్న రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు త్వరలోనే డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ దీన్ని 167వ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని 7,250 చ.కి.మీ. నుంచి సుమారు 10,050 చ.కి.మీ. వరకు ప్రభుత్వం ఇప్పటికే విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 11 జిల్లాలకు హెచ్ఎండీఏ కార్యకలాపాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగానే పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా హెచ్ఎండీఏ ముందుకు సాగుతోంది. సమగ్ర మాస్టర్ప్లాన్–2050లో భాంగా ఆర్థికాభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రజారవాణా వ్యవస్థ, జలవనరులు, అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది.ఈ మూడు ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల మీదుగా తేలిగ్గా రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. టీజీఐఐసీకి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు బుద్వేల్ నుంచి చందన్వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం వరకు దీన్ని నిర్మించనున్నారు. సుమారు 81 కి.మీ. మేర ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డులో హెచ్ఎండీఏ పరిధి 52 కి.మీ.వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరికొందరు రైతులు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్పై ముందుకు వెళ్లనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. -
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.దీనికోసం భాగస్వామి షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మా గ్రూప్తో తమ అనుబంధ సంస్థ హెలిక్స్ హెల్త్కేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఈ లావాదేవీ ముగియనుంది. జేవీలో హెలిక్స్కి 30 శాతం, షాన్డాంగ్కి 70 శాతం వాటాలు ఉన్నాయి. 2029 నాటికి 18.86 మిలియన్ డాలర్లతో మిగతా 50 శాతం వాటాను అరబిందో ఫార్మా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది. -
పాక్ నేత తిరుగుబాటు.. భారత్కు మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం సరైనదని పాక్ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Maulana Fazlur Rehman to Pakistan’s military regime:“If you justify attacking Afghanistan by claiming you are targeting your enemy there, then why do you object when India targets its enemy in Bahawalpur and Murid (inside Pakistan)?” pic.twitter.com/T91sdps611— Afghanistan Times (@TimesAFg1) December 23, 2025కరాచీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన రెహ్మాన్.. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. ‘భారతదేశం.. పాక్లోని బహవల్పూర్, మురిడ్కేలలో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినప్పుడు పాక్ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై అలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని ఆయన నిలదీశారు. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సారధ్యంలో జరుగుతున్న ఈ సరిహద్దు దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరిపిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని భారత్ సమర్థిస్తుందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 2021లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పాక్ నేతలు తమ దేశ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇది పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేసే పరిణామంగా మారింది.ఇది కూడా చదవండి: భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే.. -
శ్రుతిహాసన్ ట్రైన్ వచ్చేస్తుంది..
కోలీవుడ్లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం 'ట్రైన్'.. విజయ్ సేతుపతి, నటి శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం ఇది. యూగీసేతు, నరేన్, సంపత్ రామ్ ముఖ్యపాత్రలు పోషించారు. నటుడు నాజర్, వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాపులర్ దర్శకుడు మిష్కిన్ తెరకెక్కిస్తున్నారు. ఈయన చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ట్రైన్ చిత్రం కూడా అదేవిధంగా ఉంటుందని భావించవచ్చు. ఇది విజయ్సేతుపతి, శ్రుతిహాసన్ రేర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం. ఇందులో విజయ్సేతుపతి, శ్రుతిహాసన్ల గెటప్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. శ్రుతిహాసన్ ఇటీవల వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్, ఆ తరువాత రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రాల్లో ఈమె పాత్రలు అంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ట్రైన్ చిత్రంలో కూడా శ్రుతిహాసన్ గెటప్ కొత్తగా ఉంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా అప్డేట్ను యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈచిత్ర సింగిల్సాంగ్ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో త్వరలోనే ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. మరో విషయం ఏమిటంటే తాజాగా విడుదలైన పాటను శ్రుతిహాసన్ పాడడం విశేషం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. -
గ్రీన్కార్డులపై గూగుల్ గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాతో గూగుల్ సంస్థలో పని చేస్తున్నవారికి శుభవార్త. వారి గ్రీన్కార్డు కలలకు త్వరలోనే మోక్షం లభించనుంది. తమ ఉద్యోగుల గ్రీన్కార్డు స్పాన్సర్షిప్ ప్రక్రియను వచ్చే ఏడాది వేగవంతం చేయబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు సమాచారం చేరవేసింది.అమెరికాలో వేలాది మంది విదేశీయులు తాత్కాలిక వీసాలతో గూగుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కంపెనీ స్పాన్సర్షిప్తో శాశ్వత నివాసిత హోదా(గ్రీన్కార్డు) పొందాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి వారికి గత రెండేళ్లుగా గ్రీన్కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యోగులకు గ్రీన్కార్డులు లభించడానికి వీలుగా ప్రోగ్రామ్ ఎల్రక్టానిక్ రివ్యూ మేనేజ్మెంట్(పెర్మ్) దరఖాస్తులు స్వీకరించడంతోపాటు వాటికి ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలియజేసింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డు పొందడంలో పెర్మ్ అనేది కీలకమైన ప్రక్రియ.అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియను విస్తృతంగా వాడుకుంటాయి. టెంపరరీ వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు పరి్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ వచ్చేలా సహకరిస్తాయి. పెర్మ్కు అర్హులైన వారికి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రీన్కార్డు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై గూగుల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్గతంగా సమాచారం మాత్రం ఇచి్చంది.విదేశీ ప్రయాణాలు ఇప్పుడే వద్దు.. ఉద్యోగులకు అమెరికా టెక్ కంపెనీల సూచన అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు కీలక సూచన జారీ చేశాయి. విదేశీలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వాయిదా వేసుకోవాలని తెలియజేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడే వద్దని పేర్కొన్నాయి. విదేశాల్లోని అమెరికా ఎంబీసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చాలా ఆలస్యమవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఏడాది కాలం పడుతోందని చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిరావడం కష్టమన్న ఉద్దేశంతోనే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టెక్ కంపెనీలు సూచించాయి. ఈ మేరకు కొన్ని రోజులుగా తమ ఉద్యోగులకు సమాచారం అందిస్తున్నాయి. -
పారిశ్రామిక భూముల లభ్యతలో రాష్ట్రం నంబర్ వన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో సారి సత్తా చాటింది. పరిశ్రమల స్థాపనకు కీలకమైన భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 157 పారిశ్రామిక పార్కుల్లో అందుబాటులో ఉన్న మొత్తం 32,033 హెక్టార్ల భూమిలో.. పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. అలాగే మహారాష్ట్రలో 19,658 హెక్టార్లు, తమిళనాడులో 16,291 హెక్టార్లు, గుజరాత్లో 12,605 హెక్టార్లు భూమి అందుబాటులో ఉంది. ఈ మేరకు ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదికలో ఆయా గణాంకాలను విడుదల చేసింది.మరోవైపు ఏపీలో ఉన్న 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా అందులో 10,747 హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. మొత్తం 6.45 లక్షల ప్లాట్లు ఉండగా 1.25 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనలో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ‘ప్లగ్ అండ్ ప్లే’విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 2025–26 బడ్జెట్లో దీనికోసం రూ. 2,500 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 306 ప్లగ్ అండ్ ప్లే పార్కులు ఉన్నాయి. మరో 20 పార్కులను నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది. గ్రీన్ పార్కులకు గ్రీన్సిగ్నల్పారిశ్రామిక పార్కుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ ఏడాది సెపె్టంబర్లో ఇండ్రస్టియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 3.0ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటలైజేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచి్చంది. 41 పార్కులు ‘లీడర్స్’గా, 90 పార్కులు ‘చాలెంజర్స్’గా నిలిచాయి. భారత్లో సులభతర వాణిజ్యం మెరుగుపడటంతో విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. 2025 ఏప్రిల్–ఆగస్టు మధ్య ఏకంగా 43.76 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏకగవాక్ష అనుమతులు, జీఎస్టీ వంటి సంస్కరణలు దీనికి దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది. -
జనవరి 1 నుంచి రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జూలై 1 నుంచి రైళ్ల వేళలను మార్చే వారు. ఇప్పుడు దాన్ని జనవరి 1 నుంచి మారేలా సవరించారు. దేశవ్యాప్తంగా 1,400 రైళ్ల వేళలను సవరిస్తుండగా, దక్షిణమధ్య రైల్వే పరిధిలో 80కిపైగా రైళ్ల వేళలు మారుతున్నాయి. 3 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల వరకు ఈ సమయాలను మారుస్తున్నారు. వేళలు మారిన రైళ్ల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.జనవరి 1 నుంచి ప్రయాణాలు ఉన్నవారు మారిన రైళ్ల వివరాలను తెలుసుకుని తదనుగుణంగానే స్టేషన్కు రావాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1 తర్వాత ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు, వారు ప్రయాణించాల్సిన రైళ్ల వేళలు మారితే... ఆ సమాచారాన్ని మెసేజ్ రూపంలో వారికి పంపుతామని తెలిపారు.కాగా, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో, కొన్ని నెలలపాటు విడతల వారీగా కొన్ని ప్లాట్ఫామ్స్లో రైళ్ల రాకపోకలను నిలిపేయనున్నారు. తాజా మార్పులపై దీని ప్రభావం కూడా ఉండనుంది. ఇక ఇప్పటికే చర్లపల్లి టెరి్మనల్ అందుబాటులోకి వచి్చనందున చాలా రైళ్లను అక్కడి నుంచే నడుపుతున్నారు. త్వరలో మరికొన్ని రైళ్లు అక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనివల్ల కూడా కొన్నింటి వేళల్లో సవరణలు చోటుచేసుకుంటున్నాయి. -
ఐఫోన్, నిమ్మ సోడా!
దుకాణానికి వెళ్లి నేరుగా సరుకులు కొనుక్కోవడం లేదా ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెట్టే పద్ధతి పెద్ద నగరాల్లో క్రమంగా గతంగా మారుతోంది! కాలంతో పోటీపడుతూ క్విక్ కామర్స్ సంస్థలు చిటికెలో ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇన్స్టంట్ విధానానికే ఇప్పుడందరూ జై కొడుతున్నారు. అది ఎంతగా అంటే రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్ను కూడా ఇన్స్టంట్గా పొందే అంత! అదొక్కటే ఆర్డర్ పెడితే మజా ఏం ఉంటుందనుకున్నాడో ఏమో కానీ.. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారుడు ఐఫోన్తోపాటు ఒక నిమ్మ సోడా కూడా జోడించారని క్విక్ కామర్స్ కంపెనీ ఇన్స్టామార్ట్ వార్షిక నివేదిక చెబుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్10 నిమిషాల్లో డెలివరీ హామీతో.. బెంగళూరు వినియోగదారుడు రూ. 10 ఖరీదు చేసే ప్రింట్ అవుట్ మొదలు.. మూడు ఐఫోన్ల కోసం ఓ హైదరాబాదీ పెట్టిన రూ. 4.3 లక్షల విలువైన సింగిల్ ఆర్డర్ వరకు దేశంలో క్విక్ కామర్స్ పోకడలపై హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025 పేరుతో స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ‘10 నిమిషాల’డెలివరీ హామీతో క్విక్ కామర్స్ కంపెనీలు భారత రిటైల్రంగ రూపురేఖలను మారుస్తున్న తీరుకు ఈ నివేదికే నిదర్శనంగా నిలుస్తోంది. కరివేపాకూ ఉండాల్సిందే.. ఇన్స్టామార్ట్ వేదికగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు సెకనుకు 4 ప్యాకెట్ల పాలు కొనుగోలు చేశారు. దేశంలోని 10కిగాను 9 ప్రధాన నగరాల్లో రాత్రివేళ ఆర్డర్స్లో మసాలా ఆలు చిప్స్ టాప్లో నిలిచాయి. కొచి్చకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకును ఆర్డర్ పెట్టాడు. మరోవైపు లక్నోకు చెందిన ఓ కస్టమర్కు కేవలం 2 నిమిషాల్లోనే మ్యాగీ మేజిక్ మసాలా నూడుల్స్ను డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేర్చాడు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యే ఎక్కువగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైనా సరే..ఏడాది మొత్తంలో ఓ కస్టమర్ ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించారంటే క్విక్ కామర్స్ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఐఫోన్–17 మోడల్లో 22 ఫోన్లు, 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్, ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్.. ఇలా ఒకటేమిటి పాలు, గుడ్లు, ఐస్క్రీమ్, పండ్లను సైతం ఆ వినియోగదారుడు చేసిన ఆర్డర్లలో ఉన్నాయి. అలాగే నోయిడావాసి సింగిల్ ఆర్డర్లో ఏకంగా రూ. 2.69 లక్షలతో బ్లూటూత్ స్పీకర్స్, ఎస్ఎస్డీలు ఆర్డర్ పెట్టాడు. దీపావళి రోజున ఓ బెంగళూరు కస్టమర్ రూ. 1.97 లక్షలు వెచ్చించి ఒక కిలో వెండి కొన్నాడు. ఇక చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో కాండోమ్స్ కోసం 228 ఆర్డర్లు పెట్టి రూ. 1,06,398 ఖర్చు చేశారు. స్విగ్గీ వేదికగా ఇలా... ⇒ ఈ ఏడాది కస్టమర్లు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే నిమిషానికి 194 అన్నమాట. వాటిలో 5.77 కోట్ల చికెన్ బిర్యానీలు ఉన్నాయి. ⇒ వినియోగదారులు మొత్తం 4.42 కోట్ల బర్గర్స్, 4 కోట్ల పిజ్జాలు, 2.62 కోట్ల దోశలు ఆరగించారు. ⇒ మధ్యాహ్నం 3–7 గంటల మధ్య 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల అల్లం చాయ్లను ఆస్వాదించారు. ⇒ 69 లక్షల వైట్ చాక్లెట్ కేక్స్, 54 లక్షల చాక్లెట్ కేక్స్, 45 లక్షల గులాబ్ జామూన్స్ ఆర్డర్లున్నాయి. ⇒ కస్టమర్లు ఏకంగా 1.1 కోట్ల ఇడ్లీలు, 1.6 కోట్ల మెక్సికన్, 1.2 కోట్ల టిబెటన్, 47 లక్షల ఆర్డర్లతో కొరియన్ ఫుడ్ రుచి చూశారు. ⇒ రూ. 47,106తో 65 బాక్సుల డ్రై ఫ్రూట్ కుకీస్ గిఫ్ట్ ప్యాక్లను ఓ హైదరాబాదీ స్వీకరించాడు. ⇒ ఓ ముంబైకర్ ఏడాది పొడవునా 3,196 ఆర్డర్లతో టాప్లో నిలిచాడు. ⇒ ఆర్డర్ల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై టాప్–3లో ఉన్నాయి. ⇒స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ 2,400 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేశారు. ⇒ బెంగళూరుకు చెందిన మొహమ్మద్ రాజిక్ అనే డెలివరీ పార్ట్నర్ 11,718 డెలివరీలతో టాప్లో నిలిచాడు. ఇన్స్టామార్ట్ కస్టమర్ల రేంజ్ ఇదీ..⇒ రెడ్బుల్ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కోసం ముంబై కస్టమర్ ఏకంగా రూ. 16.3 లక్షలు ధారపోశాడు. ⇒ ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 15.16 లక్షల విలువ చేసే పుత్తడి కొన్నాడు. ⇒ బెంగళూరు వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.36 లక్షల విలువైన నూడుల్స్ కొనుగోలు చేశాడు. ⇒ నోయిడా కస్టమర్ రూ. 2.8 లక్షలతో 1,343 ప్రొటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేశాడు. ⇒ చెన్నై కస్టమర్ పెట్ ఫుడ్ కోసం రూ. 2.41 లక్షలు ఖర్చుపెట్టాడు. ⇒ గులాబీలకు రూ. 31,240 వెచ్చించి హైదరాబాదీ తన ప్రేమను చాటుకున్నాడు. ⇒ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కు టిప్స్ రూపంలో బెంగళూరు కస్టమర్ రూ. 68,600, చెన్నైవాసి రూ. 59,505 అందించారు. ⇒ వాలెంటైన్స్ డే రోజున గులాబీల కోసం సగటున నిమిషానికి 666 ఆర్డర్లు వెల్లువెత్తాయి. -
పోగు కలవక.. పొట్ట నిండక
ఒక్కోపోగును కలిపి మిరుమిట్లు గొలిపే పట్టుచీరలను నేసే వారి బతుకు మాత్రం అంధకారంలో మగ్గిపోతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి కూడా గిట్టుబాటు కాక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ముడి పట్టు ధరలు అమాంతం పెరిగినా... చీర ధర మాత్రం పైకి రానంటోంది. వ్యయం పెరిగి..ఆదాయం తగ్గి అప్పుల పాలైన నేతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు తెగిస్తున్నా... చంద్రబాబు సర్కార్ పైసా సాయం విదల్చడం లేదు.ధర్మవరం: సత్యసాయి జిల్లాలో ధర్మవరం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, గోరంట్ల, చిలమత్తూరు తదితర ప్రాంతాలలో 24 వేలకుపైగా చేనేత మగ్గాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.20 లక్షల మందికిపైగా చేనేత కార్మికులు, అను బంధ రంగాలవారు చేనేతపై ఆధారపడి పని చేస్తు న్నారు. ధర్మవరం పట్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డిజైనర్లూ ఉన్నారు. వీరందరికీ మగ్గం పని తప్ప మరొకటి తెలియదు. అందుకే నష్టమైనా..కష్టమైనా మగ్గంపైనే జీవనం సాగిస్తున్నారు. నాడు వెలుగులు.. గత పాలకుల నిర్లక్ష్యంతో చేనేత రంగం కుదేలైంది. ఆర్థిక చేయూత లేక చాలామంది నేతన్నలు మగ్గం పక్కనపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కానీ రాష్ర్టంలో జగన్ సర్కార్ కొలువుదీరాక పరిస్థితి పూర్తిగా మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి చేనేత రంగానికి ప్రాణం పోశారు. 2019 డిసెంబర్ 21న తన జన్మదినం రోజున ధర్మవరంలోనే ఈ పథకాన్ని ప్రారంభించి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు ముడిపట్టురాయితీని ఒకేసారి ఖాతాలో జమ చేసి ఆదుకున్నారు. ఇలా ఐదేళ్ల పాటు సాయం అందించారు. కరోనావంటి కష్టకాలంలోనూ రెండు నెలలు ముందుగానే ‘నేతన్న నేస్తం’ నిధులు కార్మికులకు ఖాతాలలో జమ చేశారు. ఇలా ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తం ఉన్న 83వేల మంది కార్మికులకు రూ.960 కోట్ల ఆర్థిక సాయం అందింది. ఈ క్రమంలో జిల్లాలోని 16వేల మంది చేనేత కార్మికులకు రూ.178 కోట్లు దక్కాయి. ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే 12 వేల మందికిపైగా చేనేత కార్మికులకు రూ.136 కోట్ల మేర చేయూత లభించింది.గతంలో ఎవరూ చేయనంత సాయం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. దీంతో చేనేతలు మగ్గాలను అభివృద్ధి చేసుకుని నూతన డిజైన్లతో మార్కెట్లో తమ సత్తా చాటారు. తద్వారా ఆదాయమూ పెరిగి ఆనందంగా ఉండేవారు. పిల్లలనూ బాగా చదివించుకున్నారు. భారీగా పెరిగిన ముడిపట్టు ధరలు.. రాష్ర్టంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరగానే చేతనల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నేతన్న నేస్తం పథకానికి మంగళం పాడిన సీఎం చంద్రబాబు...ఏడాదిన్నర కాలంలో రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు. మరోవైపు పట్టుచీరలకు ఉపయోగించే ముడిపట్టు ధరలు (వార్పు, రేషం, జరీ) ధరలు ఏడాదిన్నర కాలంలో 30 శాతానికి పైగా పెరిగాయి. అప్పట్లో కిలో రేషం రూ. 4 వేలు, వార్పు కిలో రూ.4,500 ధర ఉండగా... ప్రస్తుతం కిలో రేషం రూ.6 వేలు, కిలో వార్పు రూ.6,500లకు చేరింది. చీర తయారీకి వాడే జరీ (మార్కు రకం) సైతం గతంలో రూ.600 ఉండగా... ప్రస్తుతం రూ.800లకు పెరిగింది. దీంతో ప్రతి చీరపైన 30 శాతం పెట్టుబడి వ్యయం పెరిగింది. మరోవైపు పట్టుచీరల ధరలు మాత్రం పెరగలేదు. దీంతో చేనేత కార్మికులకు కూలి కూడా గిట్టుబాటు కాక అప్పుల పాలై మగ్గానికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే హృదయ విదార కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పైసా సాయం విదల్చని చంద్రబాబు సర్కార్ చంద్రబాబు సర్కార్ చేనేతలకు పైసా సాయం విదల్చలేదు. ఈ ఏడాది చేనేత దినోత్సవం రోజున ‘నేతన్న నేస్తం’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికి ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ముడిపట్టు ధరలు పెరగడం...పట్టుచీరల ధరలు మాత్రం అంతంతమాత్రంగానే ఉండటంతో నేతన్నలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. చాలా మంది కార్మికులు మగ్గాలు పక్కన పెట్టారు. మరికొందరు పొట్టచేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఎప్పుడూ లేవని పలువురు నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు కావడం లేదుముడిపట్టు ధరలు విపరీతంగా పెరిగాయి. రోజంతా మగ్గం నేసినా కూలి గిట్టుబాటు కావడం లేదు. గతంలో ‘నేతన్న నేస్తం’ ద్వారా ఏటా రూ.24 వేల సాయం అందేది. ఆ డబ్బుతో మగ్గంను అభివృద్ధి చేసుకుని కొత్త డిజైన్లు నేయడం ద్వారా కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రస్తుతం పథకం నిలిపి వేయడంతో మా అవస్థ వర్ణనాతీతంగా ఉంది. –గాజుల సోము, చేనేత కార్మికుడు, ధర్మవరం. మనుగడ ప్రశ్నార్థకమే జగనన్న సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఉనికి కోల్పోతున్న చేనేత వ్యవస్థకు ప్రాణం పోశారు. ‘నేతన్న నేస్తం’ ద్వారా ఏటా రూ.24 వేలు అందజేశారు. ఆ సాయంతో చేనేతలు ఎంతో అభివృద్ధి చెందారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేతలను పూర్తిగా విస్మరించింది. ముడిపట్టు ధరలు పెరిగి నష్టాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదు. ఉపాధి లేక చేనేత కార్మికులు కేరళ వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కొంతమంది అప్పుల బాధను తాళలేక మగ్గానికే ఉరివేసుకునే దుర్భర పరిస్థితులు జిల్లాలో కనపడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే చేనేత మనుగడ ప్రశ్నార్థకమే. – గుండా ఈశ్వరయ్య, చేనేత సంఘం నాయకుడు, ధర్మవరం -
నాన్నా.. మేమేం పాపం చేశాం!
బొమ్మనహాళ్: తండ్రే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. దేవాలయానికి తీసుకెళ్తానని ఇద్దరినీ కాలువలో తోసేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన శిల్ప, కల్లప్పకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటాడు. కుమార్తెలు సింధు (11), అనూష (9) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కుమార్తెలను కల్లప్ప ఆలయానికి తీసుకెళ్లాడు. కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వద్దకు వెళ్లాక సింధును నీటిలోకి తోసేశాడు. చిన్న కుమార్తె అనూష గమనించి భయంతో పరుగులు తీయగా.. కల్లప్ప వెంబడించి మరీ పట్టుకుని కాలువలోకి విసిరేశాడు. ఏమీ తెలియనట్టు సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఏమయ్యారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు. మంగళవారం ఉదయమైనా పిల్లలు రాకపోయేసరికి బంధువులు, గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కల్లప్ప సిరిగేరి క్రాస్ వద్ద ఎల్లెల్సీ కాలువలో తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీలోకి తోసేశానని మరోసారి చెప్పాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, కర్ణాటక, ఆంధ్ర పోలీసులు కాలువలో గాలించగా మంగళవారం మధ్యాహ్నం సింధు మృతదేహాన్ని దమ్మూరు సమీపంలోని ఎల్లెల్సీవద్ద గుర్తించి బయటకు తీశారు. చిన్నమ్మాయి అనూష జాడ కోసం గాలిస్తున్నారు. -
విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం!
ఇకపై తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. – ఢిల్లీ హైకోర్టు హెచ్చరికసాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇకపై వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ, తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్.. సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. » గత ఏడాది నవంబర్లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ఠ దెబ్బతినేలా కుట్రపూరిత కథనాలు రాశాయని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషపు రాతలను అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ (ఈనాడు), తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.» వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దయాన కృష్ణన్... విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాలు, కుట్రలను ఎండగట్టారు. ‘తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదు. చార్జిషీట్లో నా క్లయింట్ పేరు కూడా లేదు. కానీ, ఈ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వండివార్చాయి. విచారణ జరగకముందే దోషిగా నిలబెట్టి ఉరితీశాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు సాగుతుండగానే, మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, వాదనల తదుపరి విచారణను న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు. -
యూపీలో పొగమంచు బీభత్సం
అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రిదాటాకా 2.30 గంటలప్పుడు ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో రహదారిపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనబడక ట్రక్కు రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టగా దాని వెనుకొచ్చే వాహనాలు ఒకదానివెంట మరోటి ఢీకొని ధ్వంసమై శిథిలాల కుప్పగా మారాయి.మొత్తం నాలుగు ట్రక్కులు, ఒక కారు, ఒక బస్సు ఢీకొన్న ఈ దుర్ఘటనలో వాహనాల్లో ఇరుక్కుపోయి ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ముసాఫిర్ఖాన్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై అమేథీ–సుల్తాన్పూర్ మలుపు వద్ద జరిగింది. -
తహసీల్దార్ కళ్లలో కారం.. 3 గంటలు నిర్బంధం
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో సర్వే నంబర్ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని, చాలాకాలంగా సాగు చేస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ, యాండ్రప్రగడ సత్యనారాయణ, అతడి కుటుంబం, ఒట్టికూటి ఝాన్సీరాణి, యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్ పీవీ చలపతిరావు వీఆర్వోలు, సర్వేయర్లు, పోలీసులతో కలిసి బైక్లపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్, మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో వచ్చారు. అధికారుల మోటార్సైకిళ్లలో గాలి తీసేశారు. ఓ వీఆర్వో బైక్ అద్దాలను పగులగొట్టారు. పంటను పాడుచేసినందుకు సమాధానం చెప్పాలంటూ... తహసీల్దార్ కంట్లో కారం చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక తహసీల్దార్తో పాటు, ఎస్ఐ దుర్గామహేశ్వరరావు, ఆరుగురు కానిస్టేబుళ్లు, రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. కాగా, బైక్లను ధ్వంసం చేయడంతో రెవెన్యూ అధికారులు ఇనుమూరు నుంచి కాలినడకన పందిరిమామిడిగూడెం వచ్చారు. బుట్టాయగూడెంకు చెందిన రైతు తాటినాడ హరిబాబుకు ఫోన్ చేయగా ఆయన కారు తీసుకెళ్లి తహసీల్దార్ను రాత్రి 7:30కు తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
తేజస్.. మరింత సేఫ్
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది. అత్యవసర సందర్భాల్లో అత్యంత వేగంగా యుద్ధవిమానవాహక నౌక లేదా రన్వేపై దిగాల్సిన సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం జరక్కుండా పైలట్కు, విమానానికి సాయపడేలా హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను డిజైన్చేశారు. పూర్తి దేశీయంగా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ అధునాతన పారాచూట్కు తుదిరూపునిచ్చింది.తేజస్ వంటి యుద్ధవిమానాల రక్షణను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీనిని తయారుచేశారు. ఈ పారాచూట్ బరువు సైతం చాలా తక్కువ. దీంతో పేలోడ్(మందుగుండు)ను మోసుకెళ్లే తేజస్కు కొత్తగా అదనపు బరువు లాంటి సమస్యలేవీ ఉండబోవు. దీంతో అత్యంత వేగంగా గాల్లో దూసుకెళ్లేటప్పుడు భార సంబంధ ఇబ్బందులు తలెత్తబోవు. దీంతో అత్యవసర సందర్భాల్లో అత్యల్ప పొడవైన రన్వేలపై ల్యాండ్ అయ్యాక తక్కువ దూరంలో ఆగిపోయేలా ఈ పారాచూట్ ఎంతగానో సాయపడుతుంది. ఎలా ఉపయోగకరం? సాధారణ పౌరవిమానాలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయినప్పుడు రన్వేకు ఆ కొన వద్ద ల్యాండ్ అయి రెండు, మూడు కిలోమీటర్ల దూరం దాకా రన్వేపై పరుగులు తీస్తాయి. అత్యవసర సందర్భాల్లో తేజస్ వంటి యుద్ధవిమానాలకు అంత పొడవాటి రన్వే ఉండే విమానాశ్రయాలు అందుబాటులో ఉండవు. తక్కువ పొడవున్న రన్వేలపై ల్యాండ్ అయ్యాక వేగంతో అలాగే ముందుకు దూసుకెళ్లకుండా ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ నిలువరిస్తుంది. దీంతో బ్రేకింగ్ వ్యవస్థలపై పనిభారం భారీగా తగ్గుతుంది. వెడల్పాటి ప్లస్ గుర్తు ఆకృతిలో ఉండే భారీ వస్త్రపు చివరలను కలుపుతూ గొడుగు ఆకృతిలో దీనిని తయారుచేస్తారు.ల్యాండింగ్ పూర్తయ్యాక రన్వే మీద విమానం అటూఇటూ ఊగకుండా స్థిరంగా ముందుకు కదిలేలా ఈ పారాచూట్ సాయపడుతుంది. రన్వే మీద విమానం ముందుకు దూసుకెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చే అత్యధిక గాలి, ఒత్తిడిని తట్టుకుని ఇది విమానాన్ని వేగంగా ఆపేయగలదు. పారాచూట్ వెడల్పు కేవలం 5.75 మీటర్లు. విస్తీర్ణం 17 చదరపు మీటర్లు. దీని బరువు కేవలం 10 కేజీలు. యుద్ధవిమానం గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ హఠాత్తుగా రన్వేపై ల్యాండ్ అయినా కూడా సమయానుగుణంగా విచ్చుకుని త్వరగా విమానం రన్వే మీద ఆగేలా చేస్తుంది. హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అంటే?సాధారణ సందర్భాలతోపాటు అత్యవసర సమయాల్లోనూ విమానాన్ని నిర్దేశిత దూరం తర్వాత రన్వే మీద ఆపగలిగే సామర్థ్యమున్న పారాచూట్ను హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్గా పిలుస్తారు. తెగిపోని, అత్యంత కఠినమైన నైలాన్, కెవ్లార్ వంటి కృత్రిమ రసాయన దారాలతో ఈ పారాచూట్ను తయారుచేస్తారు. విమానం రకం, బరువు, ల్యాండింగ్ గరిష్ట వేగాలకు తగ్గ బరువు, సైజు, డిజైన్తో పారాచూట్ను తయారుచేస్తారు. -
మా భూములు వదిలేయండి సారూ..!
శాంతిపురం: ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతుల భూముల్లోని నిర్మాణాల వివరాల నమోదుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పం వద్దకు మంగళవారం అధికారులు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాదనకు దిగారు. రైతులకు నచ్చజెప్పేందుకు రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్, తహసీల్దార్ ప్రకాష్ బాబు, డీటీ శివకుమార్ చర్చలు జరిపారు. తమ భూములు ఇచ్చేందుకు సుమఖంగా లేమని, హైకోర్టును ఆశ్రయించినట్టు 44 మంది రైతులు తెలిపారు. కోర్టు ఉత్తర్వు, తమ అంగీకారం లేకుండా భూముల్లోకి రావద్దని తేల్చి చెప్పారు. పాతికేళ్ల క్రితం టైడిల్ సిల్క్ పరిశ్రమ కోసం అమ్మవారిపేట, కిలాకిపోడు రెవెన్యూలలో లాక్కున్న భూములు, ఇతర పరిశ్రమల కోసం ఆరేళ్ల క్రితం విజలాపురం, అమ్మవారిపేట రెవెన్యూలలో తీసుకున్న భూములు కూడా వృథాగానే ఉన్నాయన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములు ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోతే భూ సేకరణ చట్టం ప్రకారం తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూముల్లోని నిర్మాణాల వివరాలను నమోదు చేసుకోవడానికి మాత్రమే వచ్చామని, సహకరించాలని అధికారులు కోరినా రైతులు ససేమిరా అన్నారు. కోర్టు వ్యాజ్యంలోని ఆస్తుల్లో ఎవరూ ప్రవేశించరాదని రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను అధికారులకు చూపించారు. ఇప్పటికే సేకరించిన రెండు వేలకు పైగా ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించి మిగతా రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చక్రపాణిరెడ్డి అధికారులను కోరారు. రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కరుణకుమారికి అధికారులు ఫోన్లో వివరించి వెనుదిరిగారు. -
ఎంత తిరిగినా పింఛన్ ఇవ్వడం లేదు
‘మేడం.. మా నాన్న మహబూబ్బాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. మా అమ్మ హమిదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్లు పని చేయక మంచం పట్టింది. గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో రాడ్లు వేశారు. అయినా అతి కష్టంగా ఇన్నాళ్లూ పాలిష్ కటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం.. మా అమ్మా నాన్నలకు పింఛన్ అయినా ఇప్పించండి.. లేదా నా కిడ్నీలు అమ్ముకుని మా అమ్మనాన్నలను పోషించుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన అన్వర్బాషా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నాడు. ఎంపీడీఓ సావిత్రి అతని నుంచి అర్జీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరుకు కృషి చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదని, కనీసం ఇలాంటి వారిపట్ల అయినా కనికరం చూపడం లేదనే విషయం అక్కడ చర్చకు వచ్చింది. – దొర్నిపాడు -
బ్యాంకులకు రఘురామ టోకరా
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు చేసిన మోసాలపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మోసాలపై దర్యాప్తు చేయకుండా కృష్ణరాజు గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించి, దీనిపై ముందుకు వెళ్లడానికి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మరోసారి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ చేసిన మోసాలు చర్చనీయాంశంగా మారాయి. మోసాల చిట్టా బారెడు.. » ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ పేరుతో రఘురామ కృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. » థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకుల నెత్తిన చేయిపెట్టారు. » పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. » తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు కాలిపోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. » 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్్కలను స్వాధీనం చేసుకున్నాయి. సంస్థకు చైర్మన్గా ఉన్న రఘురామతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశాయి.దివాళా ప్రక్రియ షురూ.. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించాయి. ఇండ్ భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంక్లకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నాయి. అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తుల విలువ కేవలం రూ. 872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి.. దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాళా ప్రక్రియకు అనుమతించింది.ఫెమా నిబంధనల ఉల్లంఘన.. రంగంలోకి ఈడీ ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ. 202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ. 200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దాంతో విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన ఫెమా అధికారులు.. మారిషస్ కంపెనీ నుండి ఏపీకి చెందిన కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. -
హెచ్–1బీ లాటరీకి చెల్లుచీటీ
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై కొంతకాలంగా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు వాటి కట్టడి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఇకపై అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న వారికే ఆ వీసాల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టంచేసింది. దీంతో నైపుణ్యం తక్కువగా ఉన్న విదేశీఉద్యోగుల రాక తగ్గిపోయి ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కే అవకాశముంది. హెచ్–1బీ వీసాల జారీని ఇకపై యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్విసెస్(యూఎస్సీఐఎస్) ద్వారా చేపట్టనుంది. ‘‘ఇప్పటిదాకా కొనసాగిన కంప్యూటరైజ్డ్ హెచ్–1బీ వీసా లాటరీ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది.దీనిని కంపెనీలు ఎంతగానో దుర్వినియోగం చేశాయి. విదేశీ ఉద్యోగులను కారుచవగ్గా తీసుకొచ్చి అమెరికాలో పని చేయించుకున్నాయి. ఫలితంగా ఐటీ తదితర ఉద్యోగాల్లో అమెరికన్లకు చాలా అన్యాయం జరిగింది. ఇకపై దీన్ని సరిదిద్దుతాం. ఇకపై నాలుగు రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికనుగుణంగా హెచ్–1బీలను జారీచేస్తాం. ఎంట్రీ లెవల్ అభ్యర్థులు(1), అర్హత సాధించిన అభ్యర్థులు(2), అనుభవం ఉన్న అభ్యర్థులు(3), అత్యధిక నైపుణ్యమున్న అభ్యర్థులు(4)గా దరఖాస్తులను విభజించి ఆ మేరకే హెచ్–1బీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ)కి సమీక్ష కోసం పంపించాం. అక్కడ ఆమోదం పొందాక ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తాం.ఆ తర్వాత 30 రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి’’ అని యూఎస్సీఐఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ స్పష్టం చేశారు. హెచ్–1బీ వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే అన్ని స్థాయిల్లో అర్హులకు వీసాలు లభించేలా చూసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన ముక్తాయించారు. కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేయాలన్న విద్యాధిక భారత యువత, ముఖ్యంగా ఐటీ జీవుల కలలపై ఈ నిర్ణయం మరిన్ని నీళ్లు చల్లింది. -
రాబోయే రోజులు మనవే
సాక్షి కడప ప్రతినిధి/పులివెందుల: రాబోయే రోజులు మనవేనని, ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసి సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి కష్టం విని.. నేనున్నానని ధైర్యం చెప్పి ఊరడించారు. మంగళవారం ఆయన తన సొంత నియోజకవర్గం కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్టీఏ నూతన డైరీ, క్యాలెండర్లను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్ను నియమించలేదని, పీఆర్సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సు«ధ, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
శ్రీలంకకు రూ. 4 వేల కోట్ల ఆర్థిక సాయం
కొలంబో: దిత్వా తుపానుతో కలావికలమైన శ్రీలంకను పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం రూ.4,000 కోట్ల ఆర్థికసాయంతో ఆదుకునేందుకు భారత్ ముందుకొచి్చంది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్సదా అండగా నిలబడుతుందని ఈ 45 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు విచ్చేసిన మంత్రి జైశంకర్ మంగళవారం శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకె, ఆ దేశ మహిళా ప్రధానమంత్రి హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు.‘‘శ్రీలంక పునర్నిర్మాణానికి 45 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. దిత్వా తుపాను నుంచి తేరుకుని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్న హస్తంఅందించేందుకు మేమున్నామని భారత్ తరఫున ప్రధాని మో దీ రాసిన లేఖను అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకేకు అందించా’’అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్తో కలిసి సంయుక్త మీడియా స మావేశంలో జైశంకర్ చెప్పారు. 45 కోట్ల డాలర్లలో 35 కోట్ల డాలర్లను రుణాలరూపంలో, 10 కోట్ల డా లర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది. పునర్నిర్మాణం కోసం నిధుల వినియోగం తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలికవసతుల పునరుద్ధరణకు ప్రధానంగా నిధులను ఖర్చుచేయనున్నారు. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్ల పునర్నిర్మాణం, రైల్వే ట్రాక్లు, వంతెనల మరమ్మతులు, కుప్పకూలిన ఇళ్లను నిర్మించడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు తోడ్పాటునందించడం, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు తగు ఆర్థికసాయం అందించడం వంటి కీలక పనులను నిధులను సది్వనియోగం చేయనున్నారు. ‘‘నిధుల సత్వర విడుదలతోపాటు ఆయా పనుల కోసం సమన్వయంతో పనిచేసేలా ‘ప్రభావవంత సహకార వ్యవస్థ’ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’అని జైశంకర్ చెప్పారు.అంతకుముందు స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలీ రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్లోని కొలినోచ్ఛి జిల్లాలో జైశంకర్ ప్రారంభించారు. 110 టన్నుల బరువైన ఈ వంతెనను విడిభాగాలుగా భారత్ నుంచి విమానంలో తీసుకొచ్చి శ్రీలంకలో బిగించారు. ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమంలో భాగంగా బేటీ వంతెనను శ్రీలంకకు భారత్ సరఫరాచేసింది. ఆపరేషన్ సాగర్ బంధు సహాయక మిషన్లో భాగంగా భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున టెంట్లు, టార్పాలిన్లు, శుభ్రతా కిట్లు, నిత్యావసర వస్తువులు, నీటి శుద్ధి యంత్రాలను అందించింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలనూ ద్వీపదేశానికి సరఫరాచేసింది. -
శ్రీవారి సన్నిధిలో అపచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఏపీ భవన్లో కొలువైన శ్రీవారి సన్నిధిలో మద్యం సీసాలు లభించడం కలకలం రేపింది. రాత్రివేళ మందుబాబులు బీర్లు తాగి సీసాలను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాలకు పది అడుగుల దూరంలోనే పడేశారు. విషయం మీడియా దృష్టికి రావడంతో ఆగమేఘాల మీద ఏపీ భవన్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మూడు ఖాళీ బీర్ బాటిళ్లు, ఒక కూల్డ్రింక్ బాటిల్, తిని పడేసిన ఆహార పదార్థాల ప్లేట్లు అక్కడి నుంచి తొలగించారు. దీనిపై సిబ్బందిని ఆరా తీయగా.. రాత్రి వేళలో ఇక్కడి పరిసరాల్లో నిద్రిస్తున్న క్యాంటీన్ సిబ్బంది తాగి పడేసి ఉంటారని ఏపీ భవన్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటన స్వామివారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ భవన్లో వేంకటేశ్వ స్వామి వారితోపాటు దుర్గా మల్లేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఆలయ నిర్వహణ టీటీడీతోపాటు ఏపీ భవన్ అధికారులు చూస్తారు. కానీ.. ఏపీ భవన్ అధికారులకు చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. బీరు సీసాలు పడేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
క్రీస్తు బోధనలు అనుసరణీయం
సాక్షి, అమరావతి: పొరుగువారిని ప్రేమించడం, సహాయం చేయడం, కరుణ, దయ, క్షమ గుణాలను కలిగి ఉండాలన్న ఏసుక్రీస్తు బోధనలు అందరూ అనుసరించాలని వక్తలు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పార్థనలు చేసిన అనంతరం మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, లేళ్ళ అప్పిరెడ్డితోపాటు కొమ్మూరి కనకారావు తదితరులు కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉన్నారని చెప్పారు. అందువల్లే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఆరి్థక వనరులు సహకరించపోయినా, కరోనా వంటి పెనువిపత్తు వచి్చనా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని చెప్పారు. నందిగం సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు 18 నెలల అధ్వాన పాలన చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఇవాళ వైఎస్ జగన్ అధికారంలో ఉంటే బాగుండేదని చర్చించుకుంటోందని తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. మానవసేవ చేయడమే దేవునికి సేవ చేయడంగా భావించి క్రైస్తవ మిషనరీలు మన దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. మొండితోక అరుణ్కుమార్, అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తూ కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎ.నారాయణమూర్తి, నత్తా యోనారాజు, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, బూదాల శ్రీను, ముదిగొండ ప్రకాశ్, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎం.మనోహర్రెడ్డి, మల్లవరపు సంధ్యారాణి, కాలే పుల్లారావు, బేతంపూడి రాజేంద్ర, నూతక్కి జోషి, పాస్టర్లు షారోన్, ఎబినేజర్, అబ్రహాం, జె.యెషయ్య పాల్గొన్నారు. -
టీడీపీ–జనసేన దుష్ప్రచారం ఆర్బీఐ నివేదికతో బట్టబయలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై స్థూల విలువ జోడింపు (జీవీఏ– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)తో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నెలలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ విష ప్రచారాన్ని ఎండగట్టారు. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను జత చేస్తూ.. ‘సత్యమేవ జయతే’ హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు.ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘‘టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనిగట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రం పని తీరు దయనీయంగా ఉండేది.కానీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ, పరిశ్రమల రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి.. 2019–24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఇంతకుముందెన్నడూ చూడని ఆర్థిక పురోగతిని చూశామా? -
బాబు స్కామ్ల రోత.. కేసుల మూత 'కేసులు కంచికి'!
నిధులు కొల్లగొట్టారు.. నిగ్గు తేల్చిన ఈడీ.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్లు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. సాక్షి, అమరావతి: బరితెగించి అవినీతికి పాల్పడటంలోనే కాదు.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేయడంలోనూ చంద్రబాబు తన ‘స్కిల్’ ప్రదర్శిస్తున్నారు! నాడు ఆధారాలున్నాయన్న సీఐడీ వాదనతో ఏకీభవించి న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధిస్తే.. నేడు అసలు ఆధారాలే లేవంటూ కోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు తెగబడుతున్నారు! 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసుకు అర్ధ్ధంతరంగా తెరదించేందుకు టీడీపీ కూటమి సర్కారు కుతంత్రానికి సిద్ధపడింది. ఇప్పటికే చంద్రబాబుపై ఫైబర్ నెట్, మద్యం కేసులను అడ్డగోలుగా మూసివేసిన ప్రభుత్వం.. తాజాగా స్కిల్ స్కామ్ కేసుకు గురి పెట్టింది. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’.. పేరిట ఆ కేసును క్లోజ్ చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నింది. తానే దొంగా.. తానే పోలీసూ!!తాను ప్రధాన నిందితుడిగా ఉన్న అవినీతి కేసులను ఏడాది క్రితం ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించినప్పుడే చంద్రబాబు ఈ కుతంత్రానికి తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించారు. అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్తోపాటు యావత్ పోలీసు, న్యాయ శాఖలను లూథ్రా గుప్పిట్లో పెట్టారు. ఆ కేసుల్లో చార్జ్షీట్లను అటకెక్కించారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ కార్పొరేషన్ పూర్వ ఎండీ మధుసూదన్రెడ్డి, అసైన్డ్ భూదోపిడీపై న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇలా అందరినీ బెదిరించి లొంగదీసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్కు తెచ్చింది. ఈ పన్నాగానికి పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం ‘స్కిల్’ కుంభకోణం అడ్డగోలుగా మూసివేత కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. స్కిల్ కుంభకోణంలో ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన తీరు ఇదీ.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కానే కాదు... బాబే ‘స్కిల్’ క్రిమినల్..! స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ అనే పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పొరపాటుగా అభిప్రాయపడ్డాం...! కానీ అసలు అవినీతే లేదు..! అని సీఐడీ పచ్చ పాట పాడుతోంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లోనే సీఐడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో సహా నిగ్గు తేల్చడం గమనార్హం.రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి..సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. అయితే చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించలేదు. ఇక అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసింది. ఈ కుంభకోణానికి రాచబాట పరుస్తూ మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు కూడా చేశారు. డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఆ కుంభకోణం బయటపడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చింది. సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆ అవినీతి ఆధారాలతో సహా నిగ్గు తేలింది.సీమెన్స్ కంపెనీ ముసుగులో...2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ కనికట్టు చేశారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీవో జారీ చేశారు. అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టేందుకు కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మభ్యపుచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్తో తమకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంటూ సిట్కు సీమెన్స్ కంపెనీ పంపిన ఈ–మెయిల్ అవినీతిని నిర్ధారించిన కాగ్..రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) సైతం చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.కాగితాలపై ప్రాజెక్టు చూపించి...జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని చంద్రబాబు కొల్లగొట్టారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి, సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని చంద్రబాబు ప్యాలస్కు తరలించారు. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ పక్కా ఆధారాలతో ఛేదించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షీట్ కూడా నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యలు సాకుగా చూపడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు.అవినీతి సొమ్ము.. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకే!స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారానే బదిలీ చేసినట్లు కూడా ఆనాడు సీఐడీ నిగ్గు తేల్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం తమ బ్యాంకు ఖాతాల్లో భారీస్థాయిలో నోట్లను మార్పిడి చేయడం గమనార్హం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలలో టీడీపీకి బ్యాంకు ఖాతాలున్నాయి. ఆ బ్యాంకు ఖాతాలను సీఐడీ అధికారులు విశ్లేషించడంతో అసలు విషయం బయటపడింది. 2016–18లో ఆ ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం పెద్ద నోట్లను డిపాజిట్ చేయాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్లకు సంబంధించి అయితే రూ.20 వేలకు మించిన డిపాజిట్లపై కేవైసీ నిబంధలను పాటించడం తప్పనిసరి. డిపాజిట్ చేసినవారి పేరు, పాన్ నంబరు, ఫోన్ నంబరు, ఐడీ ప్రూఫ్ మొదలైన వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసినా సరే... కేవైసీ నిబంధనలను పాటించలేదు. అసలు ఎవరు ఆ నోట్లను ఇచ్చారో ఆ వివరాలు ఏవీ బ్యాంకులకు సమర్పించనేలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ స్కామ్కు పాల్పడటం గమనార్హం. అంటే స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు స్పష్టమవుతోంది. సీఐడీ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. అయినా సరే ఆధారాల్లేవు..! మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్..! అంటూ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో సీఐడీ వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది.‘స్కిల్’ స్కామ్ కేసు మూసివేతకు పక్కా పన్నాగం..‘స్కిల్’ స్కామ్ మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకోసం టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ను సీఐడీ వల్లె వేస్తోంది. ఆ కేసులో ఆధారాలు లేవని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా ముద్రవేసింది. ‘ఆ కేసును ఇక క్లోజ్ చేయాలని భావిస్తున్నాం.. మీ అభిప్రాయాన్ని వారం రోజుల్లో చెప్పండి..’ అంటూ అప్పటి ఏపీఎస్ఎస్డీసీ కార్పొరేషన్ ఎండీ బంగార్రాజుకు సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంటే అప్పటికే బంగార్రాజును తమదైన శైలిలో బెదిరించి దారికి తెచ్చుకున్నట్లు స్పష్టమైంది. సీఐడీ నోటీసులు ఇవ్వడమే తరువాయి.. ఆ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తారన్నది సుస్పష్టం. మరి ఇదంతా టీడీపీ పెద్దల స్క్రిప్టే కదా!! స్కిల్ స్కాం కేసును ముసివేస్తామని అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజుకు ప్రస్తుతం సీఐడీ పంపిన నోటీసులు ఫిర్యాదుదారు బంగార్రాజు కాదు... చైర్మన్ అజయ్ రెడ్డిచంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసివేయాలన్న ఆతృతలో సీఐడీ అసలు వాస్తవాలను విస్మరిస్తోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు ఫిర్యాదు చేసింది ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు కాదు. అప్పుడు చైర్మన్గా ఉన్న కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరి ఆ కేసును మూసివేయాలని ప్రస్తుతం సీఐడీ భావిస్తే... అందుకు నోటీసులు జారీ చేయాల్సింది కూడా ఆయనకే కదా!! సీఐడీ అధికారులు అందుకు విరుద్ధంగా అప్పటి ఎండీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎందుకంటే ఆయన్ను బెదిరించి... బెంబేలెత్తించి ఇప్పటికే తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం.. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల కుట్ర. చంద్రబాబు స్కిల్ స్కాంపై ఫిర్యాదు చేసింది అప్పటి ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్ రెడ్డి అని పేర్కొన్న కాపీ -
బెట్టింగ్యాప్ కేసు విచారణకు మంచు లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేసిన సెలబ్రిటీల కేసులో సీఐడీ సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు ముగ్గురిని సీఐడీ అధికారుల బృందాలు వేర్వేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన సంపాదనపై ఆరా తీసినట్టు సమాచారం. ఆయా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రమోషన్కు ప్రతిగా అందిన పారితోషికం తదితర అంశాలపై సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. -
ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ/కోల్కతా: బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్ను అల్లరిమూకలు కొట్టి చంపడం పట్ల విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ మారణకాండను ఖండించడం పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. వందలాది మంది కార్యకర్తలు కాషాయం జెండాలు చేతబూని బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచి్చన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ హైకమిషన్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏడు అంచెల బారికేడ్లు సిద్ధంచేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రజా రవాణా సంస్థ బస్సులను సైతం వలయంగా నిలిపి ఉంచారు. హైకమిషన్కు 800 మీటర్ల దూరంలోనే నిరసనకారులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిందువులకు రక్షణ కల్పించాలి యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య పట్ల బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ సిటీలో వ్రస్తాల పరిశ్రమలో పనిచేసే దీపూచంద్ర దాస్(25)ను ఈ నెల 18న దుండగులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దైవ దూషణకు పాల్పడినందుకే దీపూచంద్ర దాస్ను శిక్షించినట్లు దుండగులు ప్రకటించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. హిందూ కార్మికుడి హత్యను పలు దేశాలు ఖండించాయి. భారత్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.బంగ్లాదేశ్లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ సర్కార్ తీరును ఖండించారు. దీపూచంద్ర దాస్ను పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్లోని హిందువులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని చెప్పారు. పొరుగు దేశంలోని హిందూ కుటుంబాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు హనుమాన్ చాలీసా పఠించారు. మతపరమైన నినాదాలతో హోరెత్తించారు. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్లోని తమ కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల దౌత్య సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. హిందూ కుటుంబం ఇల్లు దహనం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చట్టోగ్రామ్లో హిందూ కుటుంబం ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఇంట్లో జయంతి సంఘా, బాబు షుకుశీల్ కుటుంబాలు నివసిస్తున్నాయి. దుండగుల దుశ్చర్యకు ఇల్లు చాలావరకు దహనమైపోయింది. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు శునకాలు మరణించాయి. హిందువులను హెచ్చరిస్తూ దుండగులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించారు. కోల్కతాలో నిరసనలు బంగ్లాదేశ్లో మైనారీ్టలైన హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది హిందూ సంఘాల సభ్యులు ‘బోంగియో జాగరణ్ మంచ్’ఆధ్వర్యంలో నగరంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
పోలవరం – బనకచర్లను తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధానంపై నదీ పరివాహక ప్రాంతాల (బేసిన్)లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ఏకాభిప్రాయం సాధించాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంతోపాటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) 39వ సాధారణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి గోదావరి–కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని.. అందులో భాగంగా పోలవరం–బనకచర్ల–సోమశీల–కావేరి అనుసంధాన ప్రాజెక్టు చేపట్టాలని ఈ సమావేశంలో ఏపీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సీఈ కె. ప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కేవలం ఏపీ, తమిళనాడుకే ప్రయోజనం కలుగుతుందని.. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానాన్ని జాతీయ దృక్పథంతో చేపట్టారని గుర్తుచేశారు. ఈ ప్రతిపాదన ఏపీ పునిర్వభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980లో ట్రిబ్యునల్లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందానికి పూర్తి విరుద్ధమని.. అందువల్ల దాన్ని తిరస్కరించాలని కోరారు. బెడ్తి–వరద లింక్ ప్రాజెక్టులో వాటా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు ఎంఓయూ చేసుకోవడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముందుకు రాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సమ్మతి తెలిపారు. ఈ ప్రాజెక్టులో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా కొంత వాటా కావాలని ఏపీ డిమాండ్ చేసింది. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. కానీ తరలించే నీటిలో 50 శాతం జలాలను తమకే కేటాయించాలని తెలంగాణ కోరింది. ఏపీ చేసిన పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించే జలాల్లో తమ వాటా 34.40 నుంచి 40 టీఎంసీలకు పెంచాలని కర్ణాటక అధికారులు కోరారు. అనుసంధానంలో తమకు ఎలాంటి నీటి వాటాలు కేటాయించకపోవడంపై మహారాష్ట్ర, కేరళ అభ్యంతరం తెలపగా తక్షణమే పనులు చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరాయి. అన్ని రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. ఏకాభిప్రాయ సాధన కోసం బేసిన్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ పాల్గొన్నారు. అంగీకరించాలన్న కేంద్ర మంత్రి సమావేశంలో ఇచ్చంపల్లి (గోదావరి) నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా 148 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. ఈ అనుసంధానంలో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని కేంద్ర మంత్రి పాటిల్ పేర్కొన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల (ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని జలాలు) గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఏపీకి 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామన్నారు. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు నీళ్లు అందించడంతోపాటు తాగునీటిని అందించవచ్చన్నారు. దీనిపై ఛత్తీస్గఢ్, ఏపీ అభ్యంతరం తెలిపాయి. నాగార్జునసాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్గా మారుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంలో కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని సూచించింది. -
లైంగిక దాడులు.. వరకట్న వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: అత్యాచారాలు, హత్యలు, వరకట్నం, లైంగిక వేధింపులు.. ఏదో ఒక రూపంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2025లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 37,243 కేసులు నమోదు కాగా.. ఇందులో 9 శాతం మహిళలపై జరిగినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సైబరాబాద్లో 1,314 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. అలాగే షీ టీమ్కు వివిధ మాధ్యమాల ద్వారా 1,043 ఫిర్యాదులు అందగా.. వీటిలో 83 ఎఫ్ఐఆర్లు, 2,964 పెట్టీ కేసులు నమోదయ్యాయి. అలాగే 3,322 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. డెకాయ్ ఆపరేషన్స్తో 3,315 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 103 మానవ అక్రమ రవాణా కేసుల్లో 257 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా చూస్తే.. గతేడాదిలో నమోదైన 37,689లతో పోలిస్తే ఈ ఏడాది కమిషనరేట్లో కేసులు 1.18 శాతం స్వల్పంగా తగ్గాయి. సైబర్ క్రైమ్లు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ సంబంధిత నేరాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వార్షిక నివేదికను విడుదల చేశారు. అందులోని పలు కీలకాంశాలివీ.. తగ్గిన సైబర్ నేరాలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో నిండిన సైబరాబాద్లో ఈ ఏడాది సైబర్ నేరాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది 11,914 క్రైమ్లు నమోదు కాగా.. 2025లో 35.9 శాతం మేర తగ్గి, 7,636లకు పరిమితయ్యాయి. వీటిలో 539 కేసుల్లో 917 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా పార్ట్ టైం జాబ్, ట్రేడింగ్, విషింగ్ కాల్, అడ్వర్టయిజ్మెంట్ మోసాలు జరిగాయి. 2025లో సైబర్ నేరాలలో బాధితులు రూ.404 కోట్ల మోసపోగా.. రూ.20.75 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు. పెరిగిన చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఐటీ హబ్గా పేరొందిన సైబరాబాద్లో చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగిపోయింది. పిల్లల అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగాయి. గతేడాది సైబరాబాద్లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు కేవలం నాలుగు నమోదు కాగా.. ఈ ఏడాది ఏకంగా 53 కేసులు రిజిస్టరయ్యాయి. అలాగే ఆన్లైన్లో వేధింపులు, బెదిరింపులు (సైబర్ స్టాకింగ్), మ్యాట్రిమోనీ, డేటింగ్ మోసాలు కూడా పెరిగాయి. 2025లో 40 సైబర్ స్టాకింగ్, 34 మ్యాట్రిమోనీ, 13 డేటింగ్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.పెరిగిన డ్రగ్స్ కేసులు.. ఈ ఏడాది సైబరాబాద్లో రూ.16.85 కోట్ల విలువ చేసే 1,524 కిలోల మత్తు పదార్థాలు దొరికాయి. 575 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కేసులు నమోదు కాగా.. 1,228 మందిని అరెస్టు చేశారు. అత్యధికంగా రూ.8.33 కోట్ల విలువ చేసే గంజాయి, రూ.3.30 కోట్ల విలువైన కొకైన్, రూ.4.27 కోట్ల విలువ చేసే హెరాయిన్ వంటివి ఉన్నాయి. అలాగే 2025లో సైబరాబాద్లో రూ.25.44 కోట్ల విలువ చేసే 2,730 కిలోల మత్తు పద్దార్థాలను ధ్వంసం చేశారు. స్థిరంగానే కన్విక్షన్లు..ఈ ఏడాది సైబరాబాద్లో నేర నిరూపణ (కన్విక్షన్లు) రేటు స్థిరంగానే ఉంది. వరుసగా రెండేళ్లు నేర నిరూపణలు 47 శాతం నమోదయింది. 2025లో మొత్తం 14,369 కేసులు డిస్పోజ్ కాగా.. ఇందులో 22 కేసుల్లో న్యాయస్థానం జీవితకాలం శిక్షలు విధించాయి. 22 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష, 15 కేసుల్లో 10 ఏళ్ల జైలు, 49 కేసుల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు విధించారు. ట్రాఫిక్ జరిమానాలు డబుల్..ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపించారు. 2025లో కమిషనరేట్ పరిధిలో 36.20 లక్షల చలాన్లు జారీ చేసిన పోలీసులు.. ఆయా వాహనదారులకు ఏకంగా రూ.239.37 కోట్ల జరిమానాలు విధించారు. గతేడాది 22.60 లక్షల చలాన్లలో రూ.111 కోట్ల ఫైన్లు విధించారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 4,608 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 803 ఘోరమైన యాక్సిడెంట్లలో 850 మంది మరణించారు. అత్యధికంగా 430 ప్రమాదాల్లో 449 మంది ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడగా.. 283 కేసుల్లో 285 మంది పాదచారులు చనిపోయారు. 15,706 డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) కేసులు నమోదయ్యాయి.2025లో 95 ఆర్థిక నేరాలలో 111 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ.26.17 కోట్ల సొమ్మును స్తంభింపజేయగా.. రూ.11.50 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. -
‘మేమిద్దరమే… దేశం విడిచి పారిపోయిన అతిపెద్ద ఆర్థిక నేరగాళ్లం’
లండన్: ఆర్థిక నేరాల కేసులో భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు మరోసారి వార్తల్లో నిలిచారు. దేశం విడిచి పారిపోయినా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వీరిద్దరూ తాజాగా లండన్లో ఎంజాయ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా భారత్పై వ్యంగ్యగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లండన్లో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బయటపడింది. ఈ వీడియోలో లలిత్ మోదీ.. ‘భారత్ నుంచి పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లు మేమిద్దరమే’ అని వ్యంగ్యంగా పరిచయం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.అంతేకాదు సంబంధిత వీడియోను లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇంటర్నెట్ను మరోసారి భారత్లో బ్రేక్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ విజయ్ మాల్యా లవ్వ్యూ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు, వీడియోలో కనిపించిన ధోరణిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వీరిద్ధరపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 🚨 🇮🇳 UNBELIEVABLE! Embezzler of billions Lalit Modi brags on camera about being India’s top fugitive on the run!Vijay Mallya there but stays silent, skipping the shameless tirade.These audacious criminals must be extradited back to India at any cost! pic.twitter.com/ijeNYZM4wB— Uday Singh (@udaysinghkali) December 23, 2025 -
కృత్రిమ గర్భాశయం!
నెలలు నిండకుండానే జననం. నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ సమస్యకు సైంటిస్టులు తాజా వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అదే... కృత్రిమ గర్భాశయం! 37 వారాలు నిండకముందే పుడితే నెల తక్కువ శిశువు అంటారు. అదే 23 నుంచి 27వ వారం మధ్యలోనే, అంటే ఆరు లేదా ఏడు నెలలకే కాన్పు జరిగితే అలాంటి శిశువు బతకడం చాలాసార్లు కష్టమవుతుంది. అంత లేత ఊపిరితిత్తులు బయటి ప్రపంచపు పరిస్థితులను తట్టుకునేందుకు అనువుగా ఉండవు. మిగతా కీలక శరీరాంగాలదీ అదే పరిస్థితి. ఆస్పత్రుల్లో ఇంక్యూబేటర్లలో ఉంచినా, ఎంత వైద్య చికిత్స అందించినా చాలాసార్లు లాభముండదు. అలాంటి శిశువుల్లో ఎక్కువమంది మృత్యువాత పడుతుంటారు. సైంటిస్టులు రూపొందించిన కృత్రిమ గర్భాశయం ఇందుకు పరిష్కారంగా కనిపిస్తోంది. ఇందులో ఉమ్మ నీటితో సహా అన్నీ అచ్చం అమ్మ గర్భంలో లాంటి పరిస్థితులే ఉండటం విశేషం! సంక్లిష్టమే కృత్రిమ గర్భాశయం ఆలోచన వినేందుకు సింపుల్ గానే ఉన్నా దాని రూపకల్పన మాత్రం చాలా సంక్లిష్టం. అది పరిమాణంలో దాదాపు ఇళ్లలో పెట్టుకునే సాధారణ అక్వేరియాల మాదిరిగా ఉంటుంది. సిజేరియన్ ద్వారా పుట్టిన నెలలు నిండని శిశువును వెంటనే ఉమ్మనీటితో నిండిన సంచీలో పెడతారు. అక్కడ శిశువుకు వెచ్చదనంతో పాటు తల్లి గర్భంలోని అన్ని పరిస్థితులూ అమరుతాయి. మరి పుట్టిన క్షణం నుంచీ అతి కీలకంగా మారే శ్వాసక్రియ పరిస్థితి ఏమిటంటారా? దానికీ మార్గం కనిపెట్టారు. బొడ్డుతాడుకు అనుసంధానించి సింథటిక్ ఉమ్మసంచీ ద్వారా శిశువుకు నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉంటుంది.ఈ కృత్రిమ గర్భాశయంలో అవసరాన్ని బట్టి కొద్ది రోజులు, వారాల నుంచి నెల, ఆపైన కూడా ఉంచే వెసులుబాటు ఉందంటున్నారు దీన్ని రూపొందించిన సైంటిస్టులు. అయితే ఈ కృత్రిమ గర్భాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్ల కన్నా ఎక్కువే పట్టవచ్చట. కానీ ఈ పద్ధతిపై ఇప్పటికే నైతిక తదితర సందేహాలు తలెత్తుతుండటం విశేషం! అవన్నీ తీరి, నెలలు నిండకుండా పుట్టే ప్రతి పాపాయీ బతికి బట్ట కట్టే రోజు వస్తే బాగుంటుంది కదా అన్నది సైంటిస్టుల మాట. –సాక్షి, నేషనల్ డెస్క్ -
200 ఏళ్లపాటు నిలిచేలా ‘మేడారం’ పనులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతినకుండా అనుకున్న సమయానికే మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సు«దీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణ, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, ఇతర పనులను జనవరి 5లోగా ముగించాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులను అధికారులు విభజించుకొని గడువులోపు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలపై గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు సకాలంలో పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు వనదేవతల దర్శనం నిలిపివేత ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనానికి భక్తుల రాకను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈఓ వీరస్వామి, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల నూతన గద్దెలపై ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా అమ్మవార్ల దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి యథావిధిగా అమ్మవార్లను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ విషయంలో భక్తులు తమకు సహకరించి దర్శనాలను బుధవారం వాయిదా వేసుకోవాలని కోరారు. -
నదీ జలాల అన్యాయంపై నల్లగొండ నుంచే పోరు
నల్లగొండ టూ టౌన్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం తిప్పిపంపినా మాట్లాడలేని తెలివి తక్కువ సీఎం రేవంత్రెడ్డి అని విమర్శించారు. నదీ జలాలపై సీఎం రేవంత్రెడ్డికి అవగాహన శూన్యమని అన్నారు. సాగునీటి మంత్రిది అంతులేని అజ్ఞానమని, కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తా రు. రాష్ట్రానికి నదీ జలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై నల్లగొండ నుంచే రణభేరి మోగిస్తామని ప్రకటించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో.. పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పాలమూరు’ 90% మేమే పూర్తి చేశాం.. ‘కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు పూర్తి చేశాం. మిగతా 10% పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల భయం, 420 హామీల భయం పట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు చేసినా గులాబీ సైన్యం ఎదురొడ్డి పోరాడి 45% సర్పంచ్ స్థానాలను గెలిచింది. ప్రభుత్వానికి దమ్ముంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. ఓటమి భయంతోనే అధికారం చేతిలో ఉందని నామినేటెడ్ కింద భర్తీ చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికలు పెడితే రైతులు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతు బంధు రూ.15 వేలు, పెన్షన్లు రూ.4 వేలు, తులం బంగారం, విద్యార్థులకు స్కూ టీలు, మహిళలకు రూ.2,500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేసు లు, బెదిరింపులకు భయపడేది లేదు. రెండేళ్లుగా ఏది ప్రశ్నించినా లీక్ల పేరిట కేసులని పత్రికల వారి కాళ్లు పట్టుకుని తాటి కాయంత అక్షరాలతో రాయిస్తున్నారు..’అని కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో 2.50 లక్షల కోట్ల అప్పు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి రాష్ట్రానికి రూ.80 వేల కోట్లు అప్పు ఉంది. కేసీఆర్ పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసినట్లు స్వయంగా పార్లమెంట్లోనే సంబంధిత శాఖ మంత్రి చెప్పారు. కానీ కనీస అవగాహన లేని రేవంత్రెడ్డి రూ.8 లక్షల కోట్లని, భట్టి విక్రమార్క రూ.7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేశారు. మా ప్రభుత్వ హయాంలో అప్పు చేసి రైతులకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఇచ్చాం. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ నీరు, రూ.20 వేల కోట్లతో మిషన్ కాకతీయ, మెడికల్ కాలేజీల నిర్మాణం, వెయ్యికి పైగా గురుకులాలు, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చాం. రెండేళ్లలో రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్రెడ్డి రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పమంటే ఒక్కదానికీ సమాధానం లేదు..’అని బీఆర్ఎస్ నేత ధ్వజమెత్తారు. ఈ సభలో మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరనేతలు పాల్గొన్నారు.నిజాయితీ ఉంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలి‘సీఎంకు నిజాయితీ ఉంటే, రైతులకు మంచి చేశామన్న నమ్మ కం ఉంటే వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వని రేవంత్రెడ్డి.. సర్పంచ్లకు ఏమి ఇస్తాడు? పార్టీ మారమని సర్పంచ్లను బెదిరిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామా నికి సర్పంచ్ అంత. ఎవరికీ బెదరాల్సిన పనే లేదు. రానున్న ఎన్నికల్లో కూడా గులాబీ సైన్యం కలిసికట్టుగా పని చేసి విజయ ఢంకా మోగించాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
అతి పెద్దది, అత్యాధునికం అద్భుతాల యుద్ధ నౌక
వాషింగ్టన్: ప్రస్తుత యుద్ధ నౌకలన్నింటికంటే అతి పెద్దది. వేగంలో సాటి లేనిది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అణు క్షిపణులను, అత్యాధునిక హై పవర్డ్ లేజర్ క్షిపణులతో శత్రు దురి్నరీక్ష్యం. అటువంటి కనీవినీ ఎరగని యుద్ధ నౌకను ఒకదాన్ని అమెరికా తయారు చేయబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఈ మేరకు స్వయంగా ప్రకటించారు. ‘కొత్త నౌకను నేనే డిజైన్ చేస్తా. ఎందుకంటే సహజంగా నేను మంచి సౌందర్యారాధకుణ్ణి‘ అని చెప్పుకున్నారు. దానికి ముద్దుగా బ్యాటిల్ షిప్ అని పేరు కూడా వెల్లడించారు. సాగర తలంలో అమెరికా రక్షణ కోసం తాను కలలుగంటున్న గోల్డెన్ ఫ్లీట్ ప్రాజెక్టులో ఇది కీలక భాగం కానుందని ఆయన తెలిపారు.ఇప్పటిదాక నిర్మితమైన అన్ని యుద్ధ నౌకల కంటే కూడా ఇది కనీసం 100 రెట్లు శక్తిశాలిగా ఉండనుందంటూ ఊరించారు. గోల్డెన్ ఫ్లీట్లోని నౌకలన్నీ అంతే శక్తిమంతంగా ఉంటాయని కూడా ట్రంప్ భవిష్యద్దర్శనం చేశారు. తన ముద్దుల బ్యాటిల్ షిప్కు యూఎస్ఎస్ డిఫైంట్గా నామకరణం చేస్తామని తెలిపారు. అయితే ట్రంప్ చెప్పినట్టుగా నౌకలపై అణు క్షిపణులను మోహరించడం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. కనుక ఇది ఎంతమేరకు ఆచరణసాధ్యం అన్నదానిపై ఎన్నో సందేహాలున్నాయి. అధ్యక్షునిగా తొలి టర్మ్లో కూడా నేవీని ఆధునీకరించేందుకు ట్రంప్ ఎన్నో పథకాలు ప్రకటించినా అవి చాలావరకు కాగితాలకే పరిమితమయ్యాయి. కష్టాల్లో యూఎస్ నేవీ అమెరికా నావికా దళం కొద్ది రోజులుగా కష్టాల్లో కొనసాగుతోంది. అంచనాలు దాటి మరీ అదుపు తప్పుతున్న వ్యయం కారణంగా చిన్న తరహా యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్టును ఇటీవలే అటకెక్కించాల్సి వచ్చింది. ఫోర్డ్ శ్రేణికి చెందిన విమానవాహక నౌకల తయారీ ఆలోచన కూడా చివరి నిమిషంలో వెనక్కు తీసుకుంది. కొత్త నౌకల్లో ట్రంప్ గొప్పగా చెప్పుకున్న పలు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ఏర్పాటులో కూడా విఫలమే అయింది. వంద కోట్ల డాలర్లతో ఏళ్ల తరబడి చేపట్టిన నౌకలపై రైల్ గన్ టెక్నాలజీ ప్రాజెక్టుకు కూడా 2021లో నేవీ మంగళం పాడింది. ఈ ఈనేపథ్యంలో నేవీ స్థైర్యాన్ని పెంచేందుకే ట్రంప్ సరికొత్త బ్యాటిల్ షిప్ ఆర్ చేసినట్టు భావిస్తున్నారు. అన్నీ అబ్బురాలే ట్రంప్ ఊరిస్తున్న సరికొత్త అత్యాధునిక యుద్ధ నౌకలో అన్నీ అబ్బురాలేనని గోల్డెన్ ఫ్లీట్ పేరిట అమెరికా నేవీ రూపొందించిన కొత్త వెబ్ సైట్ చెబుతోంది. ‘ఇదో గైడెడ్ మిస్సైల్ యుద్ధనౌక కానుంది. తక్కువ సిబ్బంది, ఎక్కువ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు. శత్రు దుర్భేద్యంగా నిర్మాణం. ఇదే దీని మంత్రం. దీనిలో ప్రాథమిక స్థాయి ఆయుధాలే క్షిపణులు కానున్నా యి‘ అని అందులో రాసుకొచ్చారు. అయితే, దీని తయారీ బహుశా 2030 నాటికి మొదలు కావచ్చని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని నేవీ అధికారి ఒకరు చెప్పడం విశేషం! -
‘పద్మాలయ’ పాత జ్ఞాపకమా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను మంత్రులు భట్టి విక్రమార్క, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పంచుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘హరీశ్రావుకి అలాంటి అలవాటు ఉన్నట్టుంది. బడ్జెట్ రిలీజ్ అయితే జేబుల్లో నింపుకొని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన వచ్చారో? ఆయన అలవాట్లు అందరికీ ఉండవు..ఆయనకు బహుశా ‘పద్మాలయా స్టూడియోస్ వంటి జ్ఞాపకాలు’ఉన్నాయేమో. గతంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్రావు.. ప్రస్తుత మంత్రులపై నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. రూ.7 వేల కోట్లలో ప్రతి పైసాకి లెక్కచెప్తా. ఏ రైతులకు భూసేకరణ, పునరావాసం కోసం ఎంత ఇచ్చామో జాబితా ఇస్తా. వెళ్లి చూసుకోమనండి..’అంటూ మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్మాలయ స్టూడియోస్ వ్యవహారం ఏమిటని విలేకరులు వివరణ కోరగా.. ‘మీరు ఎవరిని అడిగినా చెబుతారు..’అని ఉత్తమ్ బదులిచ్చారు. హరీశ్ చెప్పిన ప్రకారమే చూస్తే.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు నీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి ?’అని నిలదీశారు. పదేళ్లలో రూ.17.72 లక్షల కోట్ల బడ్జెట్ను ఖర్చు చేయగా, అందులో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిన రూ.1.83 లక్షల కోట్లతో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలకు పోయే నాటికి తాము రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నీటిపారుదల శాఖ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని అన్నారు. మీ సభల్లో ఆంధ్రవాళ్లకు నీళ్లిచ్చామని చెప్పండి ‘ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభల్లో.. ఆంధ్రవాళ్లకు మేము నీళ్లు, కాంట్రాక్టులు అప్పగించామని ప్రజలకు చెప్పుకోండి. డిండి ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి నీళ్లను తరలించాలి అన్న అంశంపై మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది.మేము వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుంచి తరలించాలని నిర్ణయించడంతో పాటు రూ.1,800 కోట్లతో పనులూ ప్రారంభించాం. కోవిడ్–19 కారణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిచే యలేకపోయామని సాకులు చెప్పుకుంటున్నారు. ఆ కోవిడ్ సమయంలోనే రూ.20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు ఎలా చేపట్టారు? పాలమూరుపై కేసీఆర్ కుట్రలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మీకు ఎందుకంత ప్రేమ? నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాజెక్టులంటే ఎందుకంత పక్షపాతం? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసింది. ప్రాజెక్టు పనుల వేగంతో పాటు పనుల సామర్థ్యాన్ని 1 టీఎంసీకి తగ్గించాలని, ఒకే సొరంగం పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2020 ఏప్రిల్ 8న నాటి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టు అధికారులకు లేఖ రాశారు. 2019లో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయడంతో అనుమతుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించగా, కమీషన్ల కోసం దిగువన ఉన్న శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేలా కేసీఆర్ మార్పులు చేసి వ్యయాన్ని పెంచారు. 35 శాతం ప్రాజెక్టు పనులు చేసి 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అబద్ధాలాడారు. ఈ ప్రాజెక్టుకి 90 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని ఇదే నెలలో కేంద్రానికి లేఖ రాశా. కానీ 45 టీఎంసీలకు తగ్గించాలని తాము కోరినట్టు హరీశ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..’అని ఉత్తమ్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అడగకుండానే.. నాడు కేసీఆర్ ఇతర ప్రాజెక్టులకు 299 టీఎంసీల కేటాయింపులకు సమ్మతి తెలిపారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ఇంత మోసం, దగా చేసి ఇప్పుడు పెద్దమనుషుల్లాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నదీ జలాల్లో అన్యాయంపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాపై కేసులు పెడతామంటూ లీక్లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీ సులు ఇస్తారట. చట్టబద్ధ్దంగా వ్యవహరించని పోలీసు అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది’అని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ‘పోస్టింగుల కోసం అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పోలీసుల వివరాలు రాసి పెడుతున్నాం. బీఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సెంట్రల్ సర్వీసులోకి డిప్యూటేషన్పై వెళ్లినా వదిలిపెట్టేది లేదు. ఏ బొరియలో దాక్కున్నా లాక్కొస్తాం. రేవంత్ అడుగు లకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్రెడ్డి ఖాకీ బుక్’అని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో హరీశ్రావు ఇష్టాగోష్టి నిర్వహించారు. నేతి బీరలో నెయ్యిలా డీజీపీ ఖాకీ బుక్ ‘ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు నాపై సుమారు 300 కేసులు పెట్టారు. రేవంత్ పథకాల ఎగవేతను ప్రశ్నిస్తూ ఆయన పాపాలను క్షమించమని దేవుడిని వేడుకున్నందుకు కూడా యాదగిరిగుట్టలో కేసులు పెట్టారు. సిద్దిపేటలో నా ఇంటిపై దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. ఫార్ములా ఈ–రేస్ తరహాలోనే నాపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు వేయలేదని సజ్జాపూర్లో దళితుల ఇల్లు కూల్చివేస్తే డీఐజీ ఖాకీబుక్ ఏం చేస్తోంది.రేవంత్ ఫుట్బాల్ ఆడితే డీఐజీ మైదానంలో రెండు రోజులు కాపలా ఉన్నారు. కానిస్టేబుళ్లు, హోమ్గార్డులు తమకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు, భద్రత పథకం, అలవెన్సుల కోసం తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని కేవలం యూసుఫ్గూడ బెటాలియన్లో పనిచేసే వారికి మాత్రమే పెండింగ్ అలవెన్సులు ఇచ్చారు. నేతి బీరకాయలో నేతి చందంగా డీజీపీ ఖాకీ బుక్ పనిచేస్తోంది’అని హరీశ్రావు మండిపడ్డారు. వాస్తు భయంతో సచివాలయానికి దూరం ‘కేసీఆర్ ప్రెస్మీట్తో ఆత్మరక్షణలో పడిన రేవంత్ రాత్రి 9.30 గంటలకు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించాడు. వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నాడు. నాలుగు వేలకు పైగా సర్పంచ్ పదవులు మా పార్టీకి దక్కడంతో సహకార సంఘాల ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నాడు. కాంట్రాక్టుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.7వేల కోట్ల కమీషన్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తూ బాంబే బ్రోకర్కు రూ.180 కోట్లు కమీషన్ ఇచ్చి అప్పులు తెచ్చింది. ఇరిగేషన్ అంశాలపై అసెంబ్లీలో మాకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలి. 15 రోజులు అసెంబ్లీ పెట్టి మాకు అవకాశం ఇస్తే ఇరిగేషన్తోపాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతాం. ఉత్తమ్ తన తప్పు ఒప్పుకుని పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలి’అని హరీశ్రావు చెప్పారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. జాతీయ జట్టులో ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ టోర్నీల్లో తప్పక ఆడాల్సిందే అనే నిబంధనల నేపథ్యంలో... స్టార్ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. టి20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి పలువురు టీమిండియా ప్లేయర్లు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘కింగ్’ కోహ్లి విజయ్ హజారే టోర్నీలో ఆడి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. కోహ్లి చివరగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సమయంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలవలేదు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓపెనర్గా కొనసాగుతున్నాడు... మహేంద్ర సింగ్ ధోనీ భారత టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు... రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ భారత మిడిలార్డర్లో పరుగుల వరద పారిస్తున్నారు! తొలిసారి ఈ టోర్నీ ఆడే సమయానికి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోని కోహ్లి... ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరిగి విజయ్ హజారే టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి... 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలనుకుంటున్న నేపథ్యంలో... ఫామ్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఈ టోర్నీ తొలి దశ మ్యాచ్లు ఆడనున్నట్లు వెల్లడించాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో రెండు సెంచరీలు ఒక హాఫ్సెంచరీతో మూడొందలకు పైగా పరుగులు చేసిన విరాట్... అదే జోరు దేశవాళీల్లోనూ కొనసాగిస్తాడా చూడాలి. ఇక ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ 2017–18లో చివరగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. » మొత్తం 32 ఎలైట్ జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ఎనిమిదేసి జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో... ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లతో తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. » బెంగళూరు, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్... ఈ నాలుగు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగాల్సి ఉన్నా... ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా అభిమానులు మృతిచెందడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించలేదు. » ఈ టోర్నీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... గ్రూప్ ‘డి’ మ్యాచ్లు బెంగళూరులో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడే అవకాశం ఉండటంతో పోలీసులు మ్యాచ్ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఢిల్లీ, ఆంధ్ర మధ్య జరగాల్సిన మ్యాచ్ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానానికి తరలించారు. » గతంలో విరాట్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగినప్పుడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం అభిమానులతో నిండిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. » ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన రోహిత్ శర్మ... దక్షిణాఫ్రికాపై సైతం మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. కెరీర్ను పొడిగించుకోవాలనే లక్ష్యంతోనే భారీగా బరువు తగ్గిన ‘హిట్మ్యాన్’ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా సిక్కిం, గోవాతో ముంబై తలపడనుంది. » టీమిండియా టి20 కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్పై కూడా అందరి దృష్టి నిలవనుంది. ఏడాది కాలంగా విఫలమవుతున్న సూర్యకుమార్... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో సిరీస్ వరకు లయ అందుకునేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. » ఈ ఏడాది టి20ల్లో సూర్యకుమార్ సగటు 12.84 కాగా... స్ట్రయిక్ రేట్ 117.87. ఇది అతడి స్థాయికి ఏమాత్రం తగినది కాదు. గత 22 ఇన్నింగ్స్ల్లో అతడు ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేసుకోలేదు. అయితే వచ్చే ఏడాది టి20 వరల్డ్కప్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న సూర్య... మెగా టోర్నీకి ముందు విజయ్ హజారే టోర్నీ ద్వారా ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు. » కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ సారథ్యం వహించనున్నాడు. విరాట్ ఆరంభ మ్యాచ్లు మాత్రమే ఆడనుండగా... రిషభ్ టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం కేవలం భారత టెస్టు జట్టులోనే కొనసాగుతున్న పంత్... పరిమిత ఓవర్లలో పునరాగమనం చేసేందుకు ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడనుంది. » ఇటీవల జరిగిన దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అది్వతీయ ప్రదర్శనతో జార్ఖండ్ జట్టుకు టైటిల్ అందించిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్... ఈ ఆటతీరులో వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడతడు... విజయ్ హజారేలో సైతం అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. » గతేడాది ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2024–25 సీజన్లో అతడు 8 ఇన్నింగ్స్ల్లో 389.5 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు సైతం ఉన్నాయి. దీంతో పాటు రంజీల్లోనూ రాణించిన అతడికి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. » ఐపీఎల్ మినీ వేలం ముగిసినప్పటికీ... ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించడం ఖాయం. గతంలో ఈ టోర్నీ ఆటతీరు ఆధారంగా... స్మరణ్, మయాంక్ ఐపీఎల్ అవకాశాలు దక్కించుకున్నారు. » ఫలితాలపై వాతావరణం ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో మ్యాచ్లన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుపై ఎలాంటి మంచు ప్రభావం పడే అవకాశం లేదు. » ఇక టి20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్మన్ గిల్పై కూడా అందరి దృష్టి నిలవనుంది. అభిషేక్ శర్మ సారథ్యంలో పంజాబ్ జట్టు తరఫున గిల్ బరిలోకి దిగనున్నాడు. » ప్రస్తుతం భారత జట్టులో పేస్ బౌలర్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పని భారం ఎక్కువవుతుండగా... ఇతర పేసర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ స్పీడ్ స్టార్ మొహమ్మద్ సిరాజ్ను సెలెక్టర్లు కేవలం టెస్టు ఫార్మాట్కే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి తరం పేసర్లు ఎవరనేదానికి ఈ టోర్నీ ద్వారా సమాధానం లభిస్తుందా చూడాలి. గుర్జపనీత్ సింగ్ (తమిళనాడు), గుర్నూర్ బ్రార్ (పంజాబ్), యు«ద్వీర్ సింగ్ (జమ్మూ కశ్మీర్), అనూజ్ (హరియాణా), షకీబ్ హుసేన్ (బిహార్) రూపంలో పలువురు యువ పేసర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.హైదరాబాద్ X ఉత్తర ప్రదేశ్ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్కోట్లో జరగనున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్తో హైదరాబాద్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ సారథ్యం వహిస్తుండగా... రాహుల్ బుద్ధి వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన చేసి... సునాయాసంగా ‘సూపర్ లీగ్’కు చేరిన హైదరాబాద్... చివరి మ్యాచ్లో పరాజయంతో ఫైనల్ ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. కెప్టెన్ రాహుల్ సింగ్తో పాటు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, అమన్ రావు, అభిరథ్ రెడ్డి, కార్తికేయ, రక్షణ్ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో జట్టులో ప్రియం గార్గ్, ధ్రువ్ జురెల్, కార్తీక్ త్యాగి, సమీర్ రిజ్వీ, రింకూ సింగ్ కీలకం కానున్నారు. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా జెమీమా
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తన్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్కప్ సెమీఫైనల్లో జెమీమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించనుండటం గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు ఎంతో బాగా సాగింది. వరల్డ్కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే ఈ వార్త నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మూడేళ్లుగా ఇదే జట్టుతో సాగుతున్నా. ఎంతో నేర్చుకున్నా. గత మూడు సార్లు ఫైనల్ చేరినా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈ సారి ఆ గెలుపు గీత దాటుతాం’అని జెమీమా పేర్కొంది. డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కే ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా... 27 మ్యాచ్లాడి 139.67 స్ట్రయిక్ రేట్తో 507 పరుగులు చేసింది. లీగ్లో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీ జట్టు ఫైనల్కు చేరగా... మూడింట్లోనూ జెమీమా ఆడింది. గతంలో ఢిల్లీ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్గా వ్యవహరించింది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్లో తమ తొలి మ్యాచ్లో జనవరి 10న ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. -
గ్లోబల్ చెస్ లీగ్ విజేత ఆల్పైన్ ఎస్జీ పైపర్స్
ముంబై: ‘హ్యాట్రిక్’ సాధించాలని ఆశించిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుకు చుక్కెదురైంది. టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్లో ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టు కొత్త చాంపియన్గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ 2–0 (4–2; 4.5–1.5) పాయింట్ల తేడాతో తొలి రెండు ఎడిషన్స్లో టైటిల్ నెగ్గిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టును బోల్తా కొట్టించింది. ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టులో భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, లియోన్ ల్యూక్ మెండోంకా, కరువానా (అమెరికా), హు ఇఫాన్ (చైనా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), నినో బతియాష్విలి (జార్జియా) సభ్యులుగా ఉన్నారు. తొలి ర్యాపిడ్ మ్యాచ్లో ఆల్పైన్ జట్టు 4–2తో త్రివేణి జట్టును ఓడించింది. రెండో ర్యాపిడ్ మ్యాచ్లో అల్పైన్ జట్టు 4.5–1.5తో త్రివేణి జట్టును మళ్లీ ఓడించి టైటిల్ను ఖరారు చేసుకుంది.కాంటినెంటల్ కింగ్స్ జట్టులో అలీరెజా (ఫ్రాన్స్), వె యి (చైనా), విదిత్ (భారత్), జు జినెర్ (చైనా), కొస్టెనిక్ (స్విట్జర్లాండ్), మౌరిజి (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. మూడో స్థానం మ్యాచ్లో పీబీజీ అలాస్కన్ నైట్స్ 3–1 (2–4; 3.5–2.5; 3.5–2.5; 4–2)తో గ్యాంజెస్ గ్రాండ్మాస్టర్స్ జట్టుపై నెగ్గింది. పీబీజీ అలాస్కన్ నైట్స్ జట్టులో గుకేశ్ దొమ్మరాజు, అర్జున్ ఇరిగేశి (భారత్), కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్), సారా ఖాదెమ్ (స్పెయిన్), లెనియర్ (అమెరికా), డేనియల్ దర్దా (బెల్జియం) సభ్యులుగా ఉన్నారు. -
నీరజ్, నేను క్రీడాంశాలపై చర్చించాం: ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. ఈ ఏడాది చోప్రా మాజీ టెన్నిస్ ప్లేయర్ హిమాని మోర్ను వివాహమాడాడు. సతీమణితో వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించాడు. చాంపియన్ అథ్లెట్తో భేటీని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నీరజ్, తన శ్రీమతి హిమానితో నన్ను కలుసుకోవడం నాకూ సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా చోప్రా, నేను క్రీడాంశాలపై చర్చించాం. ఇతర విషయాలపై కూడా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చాన్నాళ్లు ఫిట్నెస్ సమస్యలతోసతమతమైనప్పటికీ ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ తాను ఆశించినట్లే 90 మీటర్ల మార్క్ను దోహా డైమండ్ లీగ్లో అధిగమించాడు. కానీ సెప్టెంబర్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో మాత్రం టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. హేమాహేమీలతో స్వయంగా తన పేరుతో నిర్వహించిన బెంగళూరు ఈవెంట్లో చోప్రానే విజేతగా నిలిచాడు. -
నంబర్వన్ దీప్తి
దుబాయ్: టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ... ఐసీసీ మహిళల టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా 28 ఏళ్ల దీప్తి రికార్డుల్లోకెక్కింది. శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ తొలి మ్యాచ్లో ఒక వికెట్ పడగొట్టిన దీప్తి... తాజా ర్యాంకింగ్స్లో 737 పాయింట్లతో ‘టాప్’ ప్లేస్కు చేరింది. ఆస్ట్రేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ (736 పాయింట్లు), పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్ (732 పాయింట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా స్మృతి మంధాన (766 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... లంకతో తొలి పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ (653 పాయింట్లు) ఐదు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్కు చేరింది. రెండో మ్యాచ్లో దంచికొట్టిన షఫాలీ వర్మ (650 పాయింట్లు) పదో స్థానంలో ఉంది. -
రన్నరప్ ఆంధ్రప్రదేశ్
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టీమ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా 3–0తో ఆంధ్రప్రదేశ్ను ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత స్టార్ పీవీ సింధు ఫైనల్ మ్యాచ్కు దూరంగా ఉంది. తొలి మ్యాచ్లో దేవిక సిహాగ్ 20–22, 21–16, 21–16తో నవ్య కందేరిపై గెలిచింది. రెండో మ్యాచ్లో ఉన్నతి హుడా 21–14, 21–14తో సూర్య చరిష్మా తామిరిపై నెగ్గి హరియాణాకు 2–0తో ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్లో ఉన్నతి–అన్మోల్ ద్వయం 21–13, 24–22తో నవ్య–సూర్య చరిష్మా జంటపై గెలవడంతో హరియాణాకు టైటిల్ ఖరారైంది. రన్నరప్గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టులో నవ్య, సూర్య చరిష్మా, సీహెచ్ఎస్ఆర్ ప్రణవి, దీపిక దేవనబోయిన, కవిప్రియ సభ్యులుగా ఉన్నారు. పురుషుల టీమ్ విభాగంలో తమిళనాడు చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో తమిళనాడు 3–2తో హరియాణా జట్టును ఓడించింది. విజేత జట్లు హరియాణా, తమిళనాడు జట్లకు రూ. 3 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్మనీ లభించింది. నేటి నుంచి ఐదు రోజులపాటు పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్లు జరుగుతాయి. -
షఫాలీ 'షో'
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ షఫాలీ వర్మ ధనాధన్ షోతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన రెండో టి20లో హర్మన్ప్రీత్ నేతృత్వంలోని భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. హర్షిత సమరవిక్రమ (32 బంతుల్లో 33; 4 ఫోర్లు), కెప్టెన్ చమరి (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుగ్గా ఆడారంతే! భారత బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/23), కొత్త స్పిన్నర్ వైష్ణవి శర్మ (2/32) లంక బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం భారత మహిళల జట్టు 11.5 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 69 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో 8.1 ఓవర్ల ముందే లక్ష్యం మంచు ముక్కలా కరిగింది. ఆరంభం నుంచే దూకుడుగా.... చిన్న లక్ష్యాన్ని దూకుడుగా ఛేదించే క్రమంలో స్మృతి మంధాన (14) అవుటైంది. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ షఫాలీకి జెమీమా (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) జతయ్యాక స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. ఇనోక వేసిన ఐదో ఓవర్లో వరుస బౌండరీలు కొట్టిన షఫాలీ... చమరి మరుసటి ఓవర్ మూడు బంతుల్ని 4, 6, 4గా తరలించింది. పవర్ప్లేలో 68/1 స్కోరు చేసింది. తర్వాత జెమీమా కూడా తానేం తక్కువ కాదని 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్తో విరుచుకుపడింది. కాసేపటికి ఆమె అవుట్కాగా, 9 ఓవర్లలోనే భారత్ స్కోరు వందకు చేరింది. షఫాలీ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది.గెలుపు ముంగిట కెప్టెన్ హర్మన్ప్రీత్ (10) బౌల్డ్ కాగా, రిచా ఘోష్ (1 నాటౌట్) విన్నింగ్ రన్ తీసింది. షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో టి20 తిరువనంతపురంలో ఈ నెల 26న జరుగనుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: విష్మి గుణరత్నే (సి అండ్ బి) క్రాంతి 1; చమరి (సి) అమన్జోత్ (బి) స్నేహ్ రాణా 31; హాసిని పెరీరా (సి అండ్ బి) శ్రీచరణి 22; హర్షిత (రనౌట్) 33; కవీశా (సి) అమన్జోత్ (బి) శ్రీచరణి 14; నీలాక్షిక (సి) శ్రీచరణి (బి) వైష్ణవి 2; కౌశిని (రనౌట్) 11; శాషిని (సి) స్మృతి మంధాన (బి) వైష్ణవి 0; కావ్య (రనౌట్) 1; మల్కిని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 128. వికెట్ల పతనం: 1–2, 2–38, 3–82, 4–104, 5–109, 6–121, 7–122, 8–126, 9–128. బౌలింగ్: క్రాంతి గౌడ్ 3–0–21–1, అరుంధతి రెడ్డి 3–0–22–0, స్నేహ్ రాణా 4–1–11–1, అమన్జోత్ కౌర్ 2–0–11–0, వైష్ణవి శర్మ 4–0–32–2, శ్రీచరణి 4–0–23–2. భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) కావ్య (బి) దిల్హారి 14; షఫాలీ వర్మ (నాటౌట్) 69; జెమీమా రోడ్రిగ్స్ (సి) దిల్హారి (బి) కావ్య 26; హర్మన్ప్రీత్ (బి) మాల్కి మదర 10; రిచా ఘోష్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–29, 2–87, 3–128. బౌలింగ్: మాల్కి మదర 2.5–0–22–1, కావ్య 3–0– 32–1, కవీశా 2–0–15–1, ఇనోక రణవీర 2–0–31–0, చమరి 1–0–17–0, శాషిని 1–0–12–0. -
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ పూర్తి
ఇస్లామాబాద్:పాకిస్తాన్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రైవేటీకరణలో విజయవంతంగా అమ్ముడుపోయింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఈ సంస్థను 135 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది.పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 23, 2025) జాతీయ విమానయాన సంస్థ పీఐఏను ప్రైవేటీకరించింది. ఈ ప్రక్రియలో మూడు సంస్థలు అరీఫ్ హబీబ్ గ్రూప్, లక్కీ సిమెంట్, ఎయిర్బ్లూ పోటీ పడ్డాయి. ప్రారంభ బిడ్డింగ్లో అరీఫ్ హబీబ్ రూ.115 బిలియన్, లక్కీ సిమెంట్ రూ.105.5 బిలియన్, ఎయిర్బ్లూ రూ.26.5 బిలియన్ ఆఫర్ చేశాయి. ప్రభుత్వ రిఫరెన్స్ ధర రూ.100 బిలియన్గా నిర్ణయించబడింది. చివరి దశలో ఓపెన్ ఆక్షన్లో అరీఫ్ హబీబ్ తన ఆఫర్ను పెంచుతూ 135 బిలియన్ రూపాయల వద్ద విజయం సాధించింది.ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం పీఐఏలోని 75శాతం షేర్లు అరీఫ్ హబీబ్ గ్రూప్కు బదిలీ అవుతాయి. మిగిలిన 25శాతం షేర్లను కొనుగోలు చేయడానికి 90 రోజుల గడువు ఇవ్వబడింది.గత కొన్ని ఏళ్లేగా పీఐఏ భారీ నష్టాల్లో ఉంది. మిస్మేనేజ్మెంట్, ఆర్థిక సమస్యలు, సేవా ప్రమాణాల లోపం కారణంగా ఈ సంస్థను నిలబెట్టడం కష్టమైంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ జాతీయ విమానయాన సంస్థను పునరుద్ధరించడమే ఈ ప్రైవేటీకరణ లక్ష్యంగా పాక్ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.80 బిలియన్ అదనపు పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా విమానయాన సేవలను మెరుగుపరచడం, ఆధునీకరణ చేయడం, అంతర్జాతీయ పోటీకి తగిన విధంగా పీఐఏను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కాగా, పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ అమ్మకం దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక మలుపు. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఆధ్వర్యంలో పీఐఏ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న. -
‘కొట్టి చంపిన తర్వాతే అతని నిజాయితీ బయటపడింది’
తిరువనంతపురం: కేరళలోని పళక్కాడ్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనుమానం ఓ వలస కార్మికుడి ప్రాణం తీసింది. పనికోసం వచ్చిన రామనారాయణ్ భగేల్ దొంగతనం చేశాడని భావించి స్థానికులు కొట్టి చంపారు. కానీ ఆ తర్వాతే అతని నిజాయతి బయటపడింది. రామనారాయణ్ దొంగతనం చేయలేదని అమాయకుడని పోలీసులు నిర్ధారించారు.ఛత్తీస్గఢ్కు చెందిన రామనారాయణ్ భగేల్ (31) అనే వలస కార్మికుడు. ఇటీవలే కేరళలోని వాలయార్ ప్రాంతానికి పని కోసం వచ్చాడు. ఒక దుకాణం నుంచి ఆహార ప్యాకెట్ దొంగిలించాడని అనుమానంతో స్థానికులు అతనిపై దాడి చేశారు.దాడిలో తీవ్రంగా గాయపడిన రామనారాయణ్ను ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వాలయార్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో రామనారాయణ్ దొంగతనం చేయలేదని, అతని వద్ద ఏమీ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.రామనారాయణ్ ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాకు చెందినవాడు. నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తల్లి అతని మీద ఆధారపడి జీవిస్తున్నారు. మృతదేహాన్ని ఛత్తీస్గఢ్కు తరలించారు. -
ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అయిదు పాయింట్లు పెరిగి 26,177 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 85,343 – 85,705 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 26,119 వద్ద కనిష్టాన్ని, 26,234 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.71%, రియల్టీ 0.21%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.10% నష్టపోయాయి. మరోవైపు కమోడి టీస్ 0.68%, వినిమయ 0.59%, మెటల్ 0.52%, విద్యుత్ 0.40%, ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఇంధన 0.36% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.38%, 0.07% పెరిగాయి. ⇒ తన అనుబంధ సంస్థలు ఏసీసీ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్ కంపెనీల విలీనానికి అంబుజా సిమెంట్స్ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ షేరు 4.40% పెరిగి రూ.171 వద్ద ముగిసింది. ఒక దశలో 10% పెరిగి రూ.180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంబుజా సిమెంట్స్ షేరు 1.25% పెరిగి రూ.547 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.30% లాభపడి రూ.563 వద్ద గరిష్టాన్ని తాకింది. ఏసీసీ షేరు 1.21% నష్టపోయి రూ.1,754 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.50% పతనమై రూ.1,802 కనిష్టాన్ని తాకింది. ⇒ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.384)తో బీఎస్ఈలో 3.50% డిస్కౌంటుతో రూ.370 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% క్షీణించి రూ.350 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 8% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నగానే చుట్టేసొద్దాం..
సాక్షి, బిజినెస్డెస్క్: కరెన్సీ కదలికలు, క్రిస్మస్..న్యూ ఇయర్ సీజన్ వ్యయాలు విహారయాత్రల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు సుదీర్ఘ యాత్రల కన్నా అయిదు రోజుల్లో చుట్టేసొచ్చేలా టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ వీసా సులభంగా దొరికే దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రావెల్ సర్విసుల కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్కి నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయ ప్రయాణాలకి కేవలం 15–20 రోజులు ముందుగా బుక్ చేసుకునే ధోరణి 30 శాతం పెరిగింది.65 శాతం బుకింగ్స్ అయిదు రోజుల్లోపు ట్రిప్లకే పరిమితమైంది. ఈసారి భారతీయ ప్రయాణికులు బయల్దేరడానికి కాస్త ముందుగా మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఖర్చులు అంచనాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, సుదీర్ఘ ప్రయాణాలను...డాలర్ మారకంతో ముడిపడి ఉండే ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అలాగని ప్రయాణాలకు డిమాండేమీ తగ్గిపోలేదని తెలిపింది. ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పర్యాటకులు తమ సౌకర్యానికి, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లభించే ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. ⇒ మిగతా పేరొందిన ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్, వియత్నాంల వైపు పర్యాటకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనెక్టివిటీ బాగుండటం, వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం, తక్కువ రోజుల్లోనే ఎక్కువగా చుట్టేసేయడానికి అవకాశంలాంటి అంశాలు వీటికి సానుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఆఖరు నిమిషంలో ప్లాన్ చేసుకునే వారు దుబాయ్, వియత్నాంల వైపు చూస్తున్నారు. శ్రీలంక, బాలి, ఒమన్ వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ⇒ ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారు భద్రత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే దుబాయ్లాంటి డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. ఇక తొలిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న వారికి, మిలీనియల్స్కి, జెనరేషన్ జెడ్కి, యువ జంటలకి, బ్యాక్ప్యాకర్స్, యువ ప్రొఫెషనల్స్, మిత్ర బృందాలకి వియత్నాం ఫేవరెట్గా ఉంటోంది. సాధారణంగా ఇది పీక్ సీజన్ కావడంతో పాటు కొన్ని ప్రదేశాలకు టికెట్ల కొరత ఉన్నప్పటికీ ఈ–వీసా ప్రక్రియపై స్పష్టత, ఎయిర్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంలాంటి అంశాలు ఆ దేశానికి సానుకూలంగా ఉంటున్నాయి. ⇒ శీతాకాలంలో స్వల్ప వ్యవధి టూర్లకు బుక్ చేసుకునే వారిలో 55 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణం సులభతరంగా ఉండే ప్రాంతాలను వారు ఎంచుకుంటున్నారు. ⇒ ఆఖరు నిమిషపు శీతాకాలం బుకింగ్స్లో అత్యధిక వాటా దుబాయ్ది ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులున్న కుటుంబాలు దీన్ని ఎంచుకుంటున్నాయి. -
సన్టెక్లో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజాన్ సోలార్ బ్రాండ్ కింద సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు చారుగుండ్ల భవానీ సురేశ్ తెలిపారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటున్నామని, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. 2008లో ఏర్పాటైన సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో అవసరాలకు కావాల్సిన సోలార్ ఉత్పత్తులను అందిస్తోంది. -
పసిడి సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి, వెండి రికార్డు ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం 10 గ్రాములకు రూ.2,650 పెరిగి రూ.1,40,850కు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 78 శాతం పెరిగినట్టయింది. 2024 డిసెంబర్ 31న ఉన్న రూ.78,950 నుంచి నికరంగా రూ.61,900 వరకు 10 గ్రాములకు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కిలోకి మరో రూ.2,750 పెరగడంతో సరికొత్త రికార్డు రూ.2,17,250 నమోదైంది. వెండి ధర ఈ ఏడాది ఏకంగా 142 శాతం పెరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న కిలో ధర రూ.89,700 వద్ద ఉండగా, అక్కడి నుంచి నికరంగా రూ.1,27,550 లాభపడింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు 1.4 శాతం పెరిగి 70 డాలర్ల మార్క్ను మొదటిసారి చేరుకుంది. బులియన్లో అసాధారణ ర్యాలీ కొనసాగుతోందని, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 4,500 మార్క్ను చేరుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడ్ 2026లో ఒకటికి మించిన రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు తాజాగా మరో విడత పసిడి, వెండి ధరల్లో ర్యాలీకి కారణమవుతున్నట్టు చెప్పారు. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత సాధనంగా డిమాండ్ సైతం కొనసాగుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా పసిడి స్పాట్ ధర ఔన్స్కు ఈ ఏడాది 18,92 డాలర్ల నుంచి 4,500 డాలర్లకు చేరుకోవడం గమనార్హం -
బిలియన్ డాలర్ల ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏటా సుమారు 30 శాతం వృద్ధితో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9,000 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం ఇది దాదాపు రూ. 2,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం దాదాపు రూ. 10,000 కోట్లుగా ఉన్న ఆర్డర్ల విలువను రూ. 30,000 కోట్ల స్థాయికి పెంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండు విభాగాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు నాయర్ వివరించారు.నీరు–వ్యర్థ జలాలకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్లు, పారిశ్రామిక పార్క్లపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు నాయర్ తెలిపారు. ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్లకు సరిపడా ఆర్డర్ బుక్ ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా 1 బిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై కసరత్తు జరుగుతోందన్నారు. ఆదాయాల్లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) వాటా 45 శాతంగా, బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) వాటా 25 శాతంగా ఉందని నాయర్ చెప్పారు. కొత్త విభాగాలపై దృష్టి.. ప్రధాన వ్యాపారానికి అనుబంధంగా ఉండేలా డేటా సెంటర్లు, పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనంలాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నాయర్ తెలిపారు. మరోవైపు, డివిడెండు పాలసీ కూడా పరిశీలనలో ఉందని సంస్థ సీఎఫ్వో స్రవంత్ రాయపూడి చెప్పారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా పూర్తి గా చెల్లించివేసి రుణరహిత సంస్థగా కంపెనీ మారిందని ఆయన వివరించారు. ప్రాజెక్టులు బట్టి స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కి సంబంధించి మాత్రమే రుణం తీసుకుంటున్నట్లు స్రవంత్ తెలిపారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ లో గోదావరి జలాలను నింపేందుకు ఉద్దేశించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ నుంచి దక్కించుకున్న రూ. 2,085 కోట్ల భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నాయర్ చెప్పారు. -
విధులు నిర్వర్తించకపోతే రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గాలకు కొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరగడంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఇది కత్తి మీద సాముగా మారే ప్రమాదముంది. గతంలో సర్పంచ్ అనగానే అధికారాలే తప్ప విధులు, బాధ్యతలు పెద్దగా ఉండేవి కాదు. అయితే, నూతన పంచాయతీరాజ్ చట్టం–2018లో అనేక లక్ష్యాలు, బాధ్యతలు నిర్దేశించారు. వీటిని సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచుల తొలగింపుతోపాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశాన్ని నూతన చట్టంలో కల్పించారు. పాలకవర్గాలు గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొత్త చట్టంలో సర్పంచులకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతోపాటు ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్ను కట్టబెట్టారు. గ్రామాల పురోగతికి, వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్లతోపాటు వార్డుమెంబర్లను కూడా భాగస్వాములను చేశారు. పచ్చదనం పరిరక్షణ, మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటివి ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. బాధ్యతలెన్నో... ప్రతీ గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతీ కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యతను కూడా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్పై ఉంచారు. రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించి గ్రామంలోని సమస్యలపై చర్చించాలి. మూడు పర్యాయాలు వరుసగా గ్రామసభల నిర్వహణలో విఫలమైతే సర్పంచ్ను బాధ్యతల నుంచి తొలగించే నిబంధన ఉంది. పాలకవర్గాలు ప్రతి నెలా సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించాల్సి ఉంటుంది. గ్రామాల్లో, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమాని నుంచి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని కల్పించారు. మురుగునీటిని పైప్ద్వారా రోడ్డు మీదకు వదిలితే రూ.5,000 జరిమానా విధిస్తారు. గ్రామంలోని ఒక్కో కుటుంబం ఆరు మొక్కలు నాటాలని నిర్దేశించగా, అందుల్లో కనీసం మూడింటినైనా వారు నాటాలి. సర్పంచ్తోపాటు గ్రామ కార్యదర్శి కూడా సంబంధిత గ్రామంలోనే నివాసం ఉండాలి. సర్పంచ్, ఉపసర్పంచ్లను తొలగించినా, పాలకవర్గాలను రద్దు చేసినా ట్రిబ్యునల్ను ఆశ్రయించే అవకాశం ఉంది. పంచాయతీ పరిధిలోని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నూతన చట్టంలో వీలు కల్పించారు. అక్రమ లేఅవుట్లపైనా చర్యలు పంచాయతీలు అక్రమ లేఅవుట్లకు అనుమతినిస్తే మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇదే రీతిలో కఠిన చర్యలుంటాయి. పంచాయతీలు మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీ ప్లస్ టు భవనాల నిర్మాణాలకే అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాల్సి ఉంటుంది. నూతన చట్టం ప్రకారం ప్రతీ పంచాయతీలో...మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు; అభివృద్ధి పనులకు; వీధి దీపాల నిర్వహణకు; డంపింగ్ యార్డు, పారిశుధ్యం, శ్మశానాల నిర్వాహణకు ఇలా మొత్తం నాలుగు స్టాండింగ్ కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలకు నలుగురు వార్డుమెంబర్లు చైర్మన్లుగా ఉంటారు. ఇందులో మిగతా వార్డు సభ్యులతోపాటు గ్రామంలో ఉత్సాహంగా పనిచేసే యువత, మహిళా సంఘాల సభ్యులను కూడా భాగస్వాములను చేశారు. -
పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం
‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తున్న వంద మందికిపైగా మహిళా నిపుణుల తరఫున మేము ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మీ అంటూ ‘మా’కి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ⇒ ‘మా’ సభ్యునిగా ఉన్న శివాజీ ‘దండోర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, బహిరంగ వేదికపై హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదు... ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నవాళ్లూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ చేసినప్పుడు చాలా హానికరం. అతను ఉపయోగించిన ‘సామాన్లు, దరిద్రపు’ వంటివి అవమానకరమైన వి. అంతేకాదు... నటీమణులను బెదిరించినట్లు అయింది. ఇది బీఎన్ఎస్ 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించడంగా పరిగణించబడుతుంది. ఇది శిక్షార్హమైన నేరం. శివాజీ నుంచి బహిరంగ, షరతులు లేని క్షమాపణ కోరుతున్నాం.. లేకుంటే మేం తీవ్ర చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మహిళల దుస్తులు, చీర లేదా ఇతరత్రా డ్రెస్సింగ్పై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఆధునిక, సృజనాత్మక పరిశ్రమలో దీనికి స్థానం లేదు. మహిళలు నిజమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమ మౌనం వహించడం కూడా ఆందోళనకరమైనది. నటీమణులు నిధీ అగర్వాల్, సమంత ఇటీవల మూక దాడులకు గురైనప్పుడు సామూహిక ఆగ్రహం, జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనకరమైనది. ]మహిళల భద్రతను గౌరవాన్ని ఉల్లంఘించినప్పుడు నిశ్శబ్ద ప్రతిస్పందన ఎందుకు ఉంది? క్షమాపణకు మించి మేము ‘మా’ నుండి స్పష్టమైన, జవాబుదారీతనం, చర్యను కోరుతున్నాం. ‘మా’ అసోసియేషన్ వెంటనే ఈ కింది చర్యలను రూపొందించి అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాం.⇒ కేవలం క్షమాపణలు మాత్రమే కాదు. ఈ విషయాలపై కూడా ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ’ జవాబుదారీతనం వహిస్తుందని అనుకుంటున్నాము. అలాగే ‘మా’ అసోసియేషన్ ఈ క్రింది అంశాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రతినిధులు – నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీలక్ష్మిఇదిలా వుంటే... శివాజీ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగింది అన్నట్లుగా ‘మా’ ఓ ప్రకటన విడుదల చేసింది.ఇదేం చెత్త వాగుడు: శివాజీపై పలువురి ఫైర్‘‘చాలా బాగుందమ్మా (యాంకర్ని ఉద్దేశించి) ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నాను. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా... ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ. మీరు అనుకున్నా నాకు భయం లేదు. లాగి పెట్టి, పీకుతాం మనం. అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు... కానీ ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచివి వేసుకోవచ్చు కదా... బాగుంటావు అని అనాలనిపిస్తుంది కానీ అనలేం. అంటే... స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటారు.నేనిలా మాట్లాడితే... పెద్ద పెద్దోళ్లంతా సీక్త్రి స్వేచ్ఛ లేదని అంటారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం మన దేశ భాషల నుంచే పెరుగుతుంది. ప్రపంచ వేదికల్లో కూడా చీర కట్టుకున్నవారికే విశ్వ సుందరి కిరీటం వచ్చింది’’ అంటూ సోమవారం సాయంత్రం జరిగిన ‘దండోరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అమ్మాయిల దేహాన్ని ‘సామాను’ అనడం... ‘దరిద్రపు...’ అంటూ బహిరంగంగా అనడం పట్ల పాపులర్ యాంకర్–నటి అనసూయ, గాయని–అనువాద కళాకారిణి చిన్మయి, ప్రముఖ స్త్రీవాది కొండవీటి సత్యవతి స్పందించారు.అలాగే, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ, నటి–నిర్మాత లక్ష్మీ మంచు, దర్శకురాలు నందినీ రెడ్డి, పాపులర్ యాంకర్ ఝాన్సీ తదితరులు శివాజీ నుంచి క్షమాపణ కోరాలంటూ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కి లేఖ రాశారు. ‘‘శివాజీ... ఏమిటా చెత్తవాగుడు’’ అంటూ సత్యవతి నిప్పులు చెరిగారు. ‘‘ఏంటా ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనా’’ అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చాడు. వాళ్ల సామాను కవర్ చేసుకోవడానికి చీరలు కట్టుకోమంటున్నాడు.అతనేమో జీన్స్, హుడీలు వేసుకుంటాడు. మరి... భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, ధోతీలు కట్టుకోవచ్చుగా’’ అని చిన్మయి అతని మాటలను ఖండించారు. ‘‘శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం... ఒకరి ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది కానీ ధరించే దుస్తులతో కాదు... మహిళలు గౌరవించబడాలి’’ అంటూ ప్రముఖ హీరో మంచు మనోజ్ ఓ లేఖ వెలువరించారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మంగళవారం సాయంత్రం ‘క్షమాపణ’ చెబుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.శివాజీ మట్టెలు ధరించాలి: చిన్మయి‘‘తెలుగు నటుడు శివాజీ నటీమణులను ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాను’ను కప్పుకోవడానికి చీరలు ధరించాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, చివరికి ఇన్సెల్ బాయ్స్కు హీరోగా మారిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే... వృత్తిపరమైన ప్రదేశాల్లో శివాజీ ‘దరిద్రపు...’ వంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. శివాజీ జీన్స్, హుడీ ధరిస్తాడు. అయితే అతను ధోతీలు మాత్రమే ధరించి, భారతీయ సంస్కృతిని పాటించాలి... బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహితుడని తెలిసేలా కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ (ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశించి కావొచ్చు) మహిళలను చూసే విధానం బాగాలేదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా గాయని చిన్మయి స్పందించారు.నీ ఒంట్లో ఇంత కొవ్వేందిఏమిటా చెత్త వాగుడు శివాజీ? నువ్వేమో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మా మా గురించి అవాకులు చవాకులు పేలతావా నీ ఒంట్లో ఇంత కొవ్వేంది మా బట్టల గురించి వాగడానికి నువ్వెవడివి చెప్పులు తేవాలా చెర్నాకోలా తేవాలా నిన్ను తన్ని తగలెయ్యడానికి అడ్డమైన వాళ్ళూ చెడ్డీలేసుకుని బయలుదేరుతారు సిగ్గూ ఎగ్గూ వదిలేసి అయినా నువ్వెవడివి మా గురించి తీర్పులు చెప్పడానికి మర్యాదగా చెంపలేసుకుని సారీ చెప్పు గుంజీళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ అడుగు ఇంకెప్పుడూ ఇలా వాగనని నీకు నువ్వు ప్రమాణం చేసుకో మా జోలికొస్తే ఖబడ్దార్ బండకేసి ఉతికి ఆరేస్తాం. – కొండవీటి సత్యవతి ఎడిటర్, భూమిక, స్త్రీవాద పత్రికఅలా అనడానికి ఎంత ధైర్యం?: అనసూయశివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ...⇒ నా లైఫ్లో హీరోల ఫ్యాన్స్ పేరుతో చేసిన ట్రోల్స్లో ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి ‘అత్తారింటి దారేది’ (ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ని గ్రూపుతో చేయలేనని రిజెక్ట్ చేశారు), రెండోది ‘అర్జున్ రెడ్డి’ (ఈ మూవీ పబ్లిక్ ఫంక్షన్లో ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు), మూడోది అంతకుముందు ‘గంగోత్రి’ (ఆ సినిమాలో అల్లు అర్జున్ తనకు నచ్చలేదని చెప్పడం). అయితే అప్పట్లో మెచ్యుర్టీ లేకుండా, లౌక్యం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలు అవి.కానీ ఎవరి మీదా అయిష్టంతోనో, హిడెన్ ఎజెండాతోనో మాట్లాడిన మాటలు కావు. అప్పుడు నన్ను చాలా అగౌరవపరిచారు... పర్సనల్గా టార్గెట్ చేస్తూ, మెసేజ్లు పెట్టారు. అయితే నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే... ఫ్యాన్స్ పేరుతో ట్రోల్స్ చేస్తున్నప్పుడు, అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్ అని వారు చెప్పుకుంటారో ఆ స్టార్ ఒక్క మాట చెబితే బాగుండేది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.⇒ తొలి ్రపాధాన్యం కుటుంబానికే...నాకు సినిమానే జీవితం కాదు... యాక్టింగ్ అంటే ఇష్టం... అంతే. నా తొలి ్రపాధాన్యం నా కుటుంబానికే. అందరూ ఆదర్శంగా తీసుకునేలా నా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాను. అందుకే కెరీర్కన్నా ఫ్యామిలీకి ్రపాధాన్యం ఇస్తాను. అవకాశాల కోసం ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చేసి, అవకాశాలు తెచ్చుకుంటే నాకు తృప్తిగా ఉండదు.⇒ రెబల్ అనుకున్నా ఫర్వాలేదుపిరికిగా ఉండే స్త్రీలనే మగవాళ్లు టార్గెట్ చేస్తారు. బోల్డ్గా ఉండే అమ్మాయిల గురించి నెగెటివ్గా ప్రచారం చేస్తారు. ‘ఫేక్ ఫెమినిజమ్’ అని, ‘అటెన్షన్ సీకింగ్’లో భాగంగా ఇలా మాట్లాడుతున్నానని కూడా అంటారు. అయినా ‘నో ్రపాబ్లమ్’. నేను ఉమెన్ని కోరేది ఒక్కటే. పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా బతకాలి. ‘రెబల్’ అనుకున్నా ఫర్వాలేదు... మన జోలికి ఎవరూ రారు.⇒ ఆ జంతువులతో జాగ్రత్తమనం అడవికి వెళ్లామనుకోండి... జంతువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటా కదా. అలాగే సమాజంలోని మగాళ్ల రూపంలో ఉండే కొన్ని జంతువులు ఉన్న చోట మనం (మహిళలు) ఉండాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్లల్లో మంచివాళ్లు చాలామంది ఉన్నారు. కానీ జంతువుల్లా ఉండేవాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు మనుషులు కాదు... సంస్కారం ఉండదు. జంతువులు కాబట్టి రెచ్చిపోతారు. అలాంటివాళ్లు ఉన్న చోట నా జాగ్రత్తలో నేను ఉంటాను.⇒ మా అత్తగారింట్లో నన్ను అర్థం చేసుకున్నారుమా ఆయన బిహారీ. మా పెళ్లప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో లేను. మా అత్తగారింట్లో ‘గూంఘట్’ (ముసుగు) కల్చర్ ఉంది. కానీ నేను అలా ముసుగు వేసుకోవాలని వాళ్లు ఆశించలేదు. నేను మోడ్రన్గా ఉంటాను. అయితే నా వస్త్రధారణకు, నా మనస్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదని మా మామగారు గ్రహించారు. నన్ను కూతురిలా చూసుకుంటారు. మా ఆయన నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా ఇంట్లో నా చుట్టూ అలాంటి మగవాళ్లు ఉన్నారు. వేరే అమ్మాయిల జీవితాల్లోనూ ఇలా మంచి మగవాళ్లు ఉండాలన్నది నా ఆశ.⇒ ధోతీ కట్టుకుని ఉండగలరా?వస్త్రధారణ అనేది కంపర్ట్ కోసమే. ఇప్పుడు మగవాళ్ల దుస్తులు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పూజలు చేసినప్పుడు పట్టు ధోతీ కట్టుకుని చేస్తారు కదా... పూజ అయిపోగానే తీసేసి, ‘షార్ట్స్’ వేసుకుంటారు. మరి... ధోతీ కట్టుకుని గంటలు గంటలు ఉండమంటే వాళ్లు ఉంటారా? ఉండరు... ఎందుకంటే ధోతీ వారికి సౌకర్యం కాదు. మరి అమ్మాయిలు వాళ్ల కంఫర్ట్ గురించి ఆలోచించకూడదా? అయినా చీర కట్టుకో అంటారు... అసలు చీర కంటే ‘ఎక్స్పోజింగ్’ వేరే ఏ డ్రెస్లో ఉంటుంది?⇒ అసలు ఆ పదం ఏంటి?‘సామాను’ అనే పదం ఏంటి? ఆడవాళ్ల శరీర భాగాలను అలాపోల్చడానికి ఎంత ధైర్యం ఉండాలి? పైగా బహిరంగ వేదిక మీద ‘దరిదప్రు....’, ‘సామాను’ అనే పదాలు వాడటం ఎంత ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనే ధైర్యమా? వాళ్లకి కూతుళ్లు లేరా? అయినా వేరేవాళ్లకు తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలా? నేనేదో రెబలియస్గా మాట్లాడటం లేదు. అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని సీక్రెట్ ఎజెండాతో కొందరు మగవాళ్లు రూల్స్ పెట్టారు. కానీ, అమ్మాయిలను గౌరవించే మగవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మంచి భాగస్వాములుగా ఉండే మగవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడల్లా ఆ జంతువుల్లాంటి మగవాళ్లు ఇలా ఎందుకు ఉండటంలేదు అనిపిస్తుంటుంది.⇒ అక్కడ క్రైమ్ రేట్ తక్కువఅమ్మాయిలు ధరించే దుస్తులే వారికిప్రోటెక్షన్ అంటే... అస్సలు కానే కాదు. నా కుటుంబంలో ఉన్న మగవాళ్లు ప్రోటెక్ట్ చేస్తారు... కానీ రక్షణ పేరుతో కంట్రోల్ చేయాలనుకోలేదు. కొన్ని దేశాలు ఉన్నాయి... అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. ధరించే దుస్తులతో సంబంధం లేదు. ఆ దేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి... మనకు ఎందుకీ పక్షపాతం?నాకు ఇద్దరు మగపిల్లలున్నారు. ఒక తల్లిగా వాళ్లకి మంచి ప్రపంచం ఉండాలని కోరుకుంటాను. చేతకాని మగవాళ్లందరూ ఆడవాళ్లను హర్ట్ చేస్తుంటారు. అందుకే మా అబ్బాయిలు నాకంటే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే మగవాళ్లు హర్ట్ చేయాలనుకోరు. వాళ్లకి ఇన్సెక్యూర్టీ ఉండదు కాబట్టి. -
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
-
పనితీరు మారాలి
సాక్షి, హైదరాబాద్: అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. పనితీరులో మార్పురాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల కార్యదర్శుల పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతినెలా సమీక్షిస్తారని, తాను ప్రతి 3 నెలలకోమారు సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పది రోజులకోమారు విధిగా ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అధికారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని అన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీఎంవో కార్యదర్శులతో దాదాపు 3 గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు. పలు సూచనలు చేయడంతో పాటు.. ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. ‘విజన్’ అమలుకు నడుం బిగించాలి ‘గడిచిన రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం కొన్ని విజయాలు సాధించింది. భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. గతంలో ఇంధన, విద్య, నీటిపారుదల, ఆరోగ్య, పర్యాటక శాఖలకు ఒక విధానం అంటూ లేకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఈ సమస్యలను గుర్తించి కీలకమైన శాఖలకు నిర్దిష్ట విధానాలను తీసుకువచ్చాం. శాఖలతో పాటు రాష్ట్రానికి ఒక దిశ, విధానం ఉండాలన్న ఉద్దేశంతో‘ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేశాం. విజన్ అంటే కేవలం ప్రచారానికే పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, విజన్లో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు అధికారులు వెంటనే నడుం బిగించాలి. ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి. వారు జవాబుదారీతనంతో పనిచేయాలి. కార్యదర్శులు సీఎస్కు ప్రతి నెలా రిపోర్ట్ సమర్పించాలి. వాటిపై సీఎస్ శాఖల వారీగా సమీక్షలు చేస్తారు. సీఎస్ సమీక్షించి నాకు నివేదిక ఇస్తారు. మూడు నెలలకోసారి నేను సమీక్షిస్తా. సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకం. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి..’ అని సీఎం చెప్పారు. ఉద్యోగుల పూర్తి వివరాలివ్వాలి ‘వివిధ ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్టైమ్ ఉద్యోగులు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యదర్శులు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగుల భవిష్య నిధికి జమ అయ్యే నిధులు, ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధిపతులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు. జనవరి 26వ తేదీలోగా అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలి. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలి. ఖాళీ స్థలాల్లో సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్రంలో ఉన్న 113 మున్సిపల్ ఆఫీసులకు సొంత భవనాలున్నాయా? ఎక్కడెక్కడ అద్దె భవనాలున్నాయి.. వెంటనే గుర్తించి నివేదిక అందించాలి. ప్రజలకు సేవలందించే ఆఫీసులు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలి. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలు ఖాళీగా ఉంటే వాటిని వినియోగించుకోవాలి. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలి. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాల నిధులు సద్వినియోగం చేసుకోవాలి.. ‘కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వాటాగా చెల్లిస్తే, కేంద్రం దాదాపు 60 శాతం ఈ పథకాలకు నిధులు ఇస్తోంది. ఈ పథకాలతో దాదాపు రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుంది. అందుకు వీలుగా అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలి. సీఎస్ఎస్ నుంచి వచ్చే నిధులకు అవసరమైన రాష్ట్ర వాటాను ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ఈ ఫైలింగ్ సిస్టమ్ అమలు చేయాలి. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని విభాగాలు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి డాష్ బోర్డు సిద్ధం చేయాలి. డాష్ బోర్డును సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గ్రౌండింగ్లో పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలి. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలి..’ అని రేవంత్ సూచించారు. పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి ‘కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో హాజరు నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలుండాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిట్లో టీచింగ్ ఆస్పత్రులను అద్భుతమైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలి. మెడికల్ కాలేజీల హాస్పిటళ్లను కూడా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్తో అనుసంధానం చేయాలి..’ అని సీఎం చెప్పారు. -
‘బాబ్బాబు.. టన్నుల్లో బంగారం ఇస్తాం.. ఆ దీవిని మాకిచ్చేయండి!’
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నేశారు. అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ఆయన తాజాగా ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ అమెరికా దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించారు.గ్రీన్లాండ్లోని లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నాయి. 55–57 వేల మంది జనాభా ఉన్న ఈ దీవి, ఖనిజ సంపదతో పాటు భౌగోళికంగా కూడా కీలకంగా మారింది. 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికాలో కలపాలని ప్రయత్నాలు చేశారు. ‘గ్రీన్లాండ్ను మాకు ఇచ్చేయండి, 800 కోట్లు విలువ చేసే బంగారం ఇస్తాం’ అని ప్రతిపాదనలు పెట్టినా డెన్మార్క్ తిరస్కరించింది.అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదని పలు మార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గ్రీన్లాండ్పై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రతా, వ్యూహాత్మక అంశాలను బలపరచాలని సంకేతం ఇచ్చారు.గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, డెన్మార్క్తో అనుబంధం కొనసాగుతోంది. దీనిపై డెన్మార్క్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ‘ఖనిజ సంపద కోసం కాదు, అమెరికా జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. ఈ నియామకం అమెరికా ఆర్కిటిక్ వ్యూహానికి కొత్త దిశను చూపిస్తోంది. -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.చవితి ఉ.10.51 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ తె.6.24 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి శతభిషం, వర్జ్యం: ప.10.00 నుండి 11.38 వరకు, దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు,అమృత ఘడియలు: రా.7.35 నుండి 9.15 వరకు. సూర్యోదయం : 6.31సూర్యాస్తమయం : 5.28రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం..... సన్నిహితులతో సఖ్యత. ఆస్తి వివాదాలు పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.వృషభం... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి లాభం.మిథునం... ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.కర్కాటకం... పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.సింహం... పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.కన్య... నూతన ఉద్యోగయోగం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.తుల.... మిత్రులతో వివాదాలు. అదనపు బాధ్యతలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృశ్చికం.. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.ధనుస్సు...... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకరం...... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కుంభం... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.మీనం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. -
న్యూజిలాండ్తో ఎఫ్టీఏ
ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్టీఏ) యుగం. మన దేశం ఈ ఏడాది ఇంతవరకూ బ్రిటన్, ఒమన్ దేశాలతో ఎఫ్టీఏలపై సంతకం చేసింది. తాజాగా న్యూజిలాండ్తో ఎఫ్టీఏపై అవగాహన కుదిరింది. మరో మూడు నెలల్లో సంతకాలు కాబోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వాణిజ్య, వాణిజ్యేతర కారణాలతో మన దేశంపై ఎడాపెడా సుంకాలు విధించి తన షరతులకు తలొగ్గటమో, ఆర్థికంగా నష్టపోవటమో తేల్చుకోమని సవాలు విసురుతున్నారు. ఆ నష్టాలను వీలైనంత తగ్గించుకోవటానికి ప్రత్యామ్నాయాలు వెదుక్కునే క్రమంలోనే మన దేశం వివిధ దేశాలతో ఎఫ్టీఏలు కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సరుకులు, సేవల్లో ఇరు దేశాల మధ్యా 130 కోట్ల డాలర్ల విలువైన వర్తమాన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాగల అయిదేళ్లలో 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్లటం, వచ్చే పదిహేనేళ్లలో భిన్న రంగాల్లో న్యూజిలాండ్ 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం భారత్–న్యూజిలాండ్ ఎఫ్టీఏ సారాంశం. దీని ప్రకారం మన సరుకులన్నిటిపైనా దాదాపు సుంకాలు విధించకుండా ఉండేందుకు న్యూజిలాండ్ అంగీ కరిస్తే, అక్కడినుంచి యాపిల్స్, కివీ పండ్లు, చెర్రీలు, నూలు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేసింది. కార్మికుల అవసరం ఎక్కువున్న జౌళి, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్, మెరైన్, హస్త కళలు వగైరా ఉత్పత్తులకు న్యూజిలాండ్ తక్కువ సుంకాలు విధిస్తుంది. కొన్నింటి విషయంలో అసలు సుంకాలే ఉండవు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) పట్టభద్రులకు న్యూజిలాండ్లో ఉద్యోగావకాశాలుంటాయి. అక్కడి వర్సిటీల్లో చదువుకొనేందుకూ, పరిశోధనలు సాగించేందుకూ మన విద్యార్థులకు వీలుంటుంది. మరో విశేషమేమంటే మన తరఫున ఈ ఒప్పందం సాకారానికి కృషి చేసింది మొత్తంగా మహిళా అధికారుల బృందమే.ఎఫ్టీఏలపై ఆరోపణలూ, విమర్శలూ కూడా లేకపోలేదు. ఆహారం, ఆరోగ్యం, కార్మిక వర్గం, పర్యావరణం తదితర అంశాలపై ఇవి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశమున్నా అధిక శాతం ఎఫ్టీఏల చుట్టూ గోప్యత అలుముకుని ఉంటుందనీ, ఆచరణ మొదలయ్యాకే వాటి అసలు పర్యవసానాలేమిటో ప్రజలకు తెలుస్తుందనీ సామాజిక కార్యకర్తల ఆరోపణ. తొలి ఆధునిక సమగ్ర ఎఫ్టీఏ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) 1994లో కుదరగా, మన దేశం తొలిసారి 1999లో శ్రీలంకతో ఎఫ్టీఏ కుదుర్చుకుంది. అటుతర్వాత జపాన్, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ వగైరాలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. వర్తమాన యుగంలో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేదు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటివి స్వావలంబనకు కొంతమేర తోడ్పడవచ్చుగానీ, వాటినే సర్వస్వంగా భావించటం సాధ్యం కాదు. చిత్రమేమంటే భారత్–న్యూజిలాండ్ ఎఫ్టీఏపై సామాజిక రంగాల కార్యకర్తలకన్నా ముందు న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ చిర్రుబుర్రులాడుతున్నారు. న్యూజిలాండ్ డెయిరీ ఉత్పత్తులకు మన మార్కెట్ను బార్లా తెరవకపోవటం ఆయనగారికున్న అభ్యంతరం. పార్లమెంటులో ధ్రువీకరణకొచ్చినప్పుడు ఒప్పందాన్ని ప్రతిఘటిస్తామని కూడా ప్రకటించారు. న్యూజిలాండ్ అధికార కూటమి ప్రభుత్వంలో ఆయన పార్టీ భాగస్వామి. ఈ ఏడాది ఇంతవరకూ 2,400 కోట్ల డాలర్ల డెయిరీ ఉత్పత్తులు పాలు, వెన్న, జున్ను వగైరాలు తాము ఎగుమతి చేయగా, ఒక్క భారత్ మాత్రమే అందుకు సమ్మతించటం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే కుదరబోయే ఈ ఒప్పందం ఒక వెసులుబాటునిస్తోంది. ముడి పదార్థాలు తీసుకొచ్చి ఉత్పత్తులు చేసి వంద శాతం ఎగుమతులు చేసుకునేందుకు న్యూజిలాండ్కు అవకాశం ఉంటుంది. డెయిరీ, సాగు ఉత్పత్తులకు అనుమతులిస్తే మన సాగు, పాడి రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలోనే అమెరికా ప్రధానంగా పట్టుబడుతోంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కుదిరిన అవగాహన చూశాక ట్రంప్ ఏమంటారో చూడాలి. మొత్తానికి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా, లబ్ధి చేకూరేలా కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా స్వాగతించదగిందే! -
మీరూ శాంటా కావచ్చు
శాంటా తాత వస్తాడు అడిగినవన్నీ ఇస్తాడు... అని పిల్లలు అనుకోవడం ఆనవాయితీ.తల్లిదండ్రులే ఏ అర్ధరాత్రో వారి దిండ్ల వద్ద ఆ కానుకలు పెట్టి ఆశ్చర్యపరచడమూ ఆనవాయితే.కాని శాంటాలు రాని ఇళ్లుంటాయి.శాంటా బహుమతులు అందని పిల్లలుంటారు. ఈ క్రిస్మస్ వేళ పేద పిల్లలకు, హోమ్స్లో ఉండే నిరాధార పిల్లలకు మీరే శాంటాలుగా కానుకలు ఎందుకు ఇవ్వకూడదు? అవి అవి అందుకున్న వారి ముఖాల్లో నక్షత్ర కాంతిని ఎందుకు చూడకూడదు?శాంటా క్లాజ్కు దేశం లేదు.... ప్రాంతం లేదు... భాష లేదు... అందరు పిల్లలకూ శాంటా తాత ఇష్టం. తాత తెచ్చే కానుకలు ఇష్టం. అందుకే క్రిస్మస్ వస్తుందనగా తమ కోరికలన్నీ కాగితం పై రాసి జాగ్రత్తగా డబ్బాలో వేసి పెట్టడమో, ఫ్రిజ్కు ఉన్న అయస్కాంతం కింద వేళ్లాడగట్టడమో,పోస్ట్బాక్స్లో వేయడమో చేస్తారు. ఎప్పుడెప్పుడు శాంటా వస్తాడా... కానుకలు ఇస్తాడా అని ఉద్వేగంగా ఎదురు చూస్తారు.క్రిస్మస్ ముందు రోజు రాత్రి తప్పకుండా శాంటా వస్తాడని పిల్లల నమ్మకం. ‘జింగిల్ బెల్స్... జింగిల్ బెల్స్... జింగిల్ ఆల్ ద వే’ అని పాడుకుంటూ, మువ్వలు గలగలలాడుతున్న రైన్డీర్ల బండి ఎక్కి, కానుకల మూటతో శాంటా వచ్చి ఒక్కో పిల్లవాడికి/పాపకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చి వెళతాడని వాళ్లు భావిస్తారు. అంతేనా? మంచి నడవడిక చూపినందుకు, బాగా చదువుకుంటున్నందుకు ‘మెచ్చుకోలు పత్రం’ కూడా ఇచ్చి వెళతాడు. ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే మానుకోమని హెచ్చరిస్తాడు కూడా.అలా అని విశ్వసించే పిల్లలు క్రిస్మస్ రోజు కళ్లు తెరిచి తమ దిండ్ల పక్కనే ఉన్న బహుమతులు చూసుకుని కేరింతలు కొడతారు. శాంటా ఇచ్చాడని మురిసి΄ోయి పక్కింటి పిల్లలకు చూపిస్తారు. శాంటా లేఖను పదే పదే చదువుకుంటారు. ఇది వారి మురిపమైన అమాయక ప్రపంచం. ఆ ప్రపంచంలో వారిని ఉంచేందుకు తల్లిదండ్రులు/ బంధువులు రహస్యంగా కానుకలు ఏర్పాటు చేస్తారు. ఇలా సీక్రెట్ శాంటాలుగా కన్నబిడ్డలకే కాదు... మనసులోని చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరని స్థితిలో ఉన్న పిల్లలకు కూడా కావచ్చు.సీక్రెట్ శాంటా నెట్వర్క్స్మన దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ‘సీక్రెట్ శాంటా నెట్వర్క్స్’ కలిగి ఉన్నాయి. ఇవి తమ వెబ్సైట్స్లో అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు అంటే పేద బస్తీల్లో, హాస్టళ్లలో, అనాథ గృహాలలో ఉన్నవారు కోరిన కోరికలను ఉంచుతారు. వాటిని చూసి ఆ కోరిక నెరవేర్చేందుకు సాయం చేయవచ్చు. లేదా ఆ గిఫ్ట్ను స్వయంగా అందే ఏర్పాటు చేయవచ్చు. శాంటా పంపినట్టే ఈ పిల్లలకు ఆ గిఫ్ట్స్ అందుతాయి. ఇలాంటి పని కోసం వలెంటీర్లుగా పని చేసే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ‘భూమి’, ‘హోమ్లెస్ కేర్ ఫౌండేషన్’, ‘లిటిల్ హార్ట్ ఫౌండేషన్’, ‘ది లెప్రసి మిషన్ ట్రస్ట్ ఇండియా’... వంటి సంస్థలు సీక్రెట్ శాంటాలుగా క్రిస్మస్ సమయంలో పేద పిల్లల ముఖాన చిర్నవ్వులు చిందించే ఏర్పాటు చేస్తున్నారు. నగరాలన్నింటిలోనూ ఇంకా అనేక సంస్థలు పని చేస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఎంచుకుని సహాయం చేయవచ్చు.చిన్న కానుక... ఎంతో సంతోషం:క్రిస్మస్ డిసెంబర్ ఆఖరున వస్తుంది. కాబట్టి స్వెటర్లు, ఉన్ని టోపీలు, రగ్గులు ఇవ్వొచ్చు. స్కూలు బ్యాగులు, నోట్బుక్స్, షూస్, హైజీన్ కిట్స్... ఇవన్నీ వారికి ఆనందాన్ని ఇచ్చేవే. బొమ్మలు, బట్టలు చెప్పనక్కర్లేదు. కేక్స్, చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాలి. ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు చాలా మంచి పిల్లాడివి’ అని రాసిన శాంటా లేఖ వారికి వేయి ఏనుగుల బలం ఇస్తుంది. మనం నివసిస్తున్న చోట హౌస్ హెల్ప్గా పని చేసే వారి పిల్లలకు, వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్ పిల్లలకు సీక్రెట్ శాంటాగా బహుమతులు పంపితే ఆ తర్వాత ఆ పిల్లల రియాక్షన్ తెలుసుకుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.శాంటా కథ ‘మంచికి ప్రతిఫలం ఉంటుంది’ అని చెబుతుంది. పిల్లల్లో ఈ విశ్వాసం నింపడం ముఖ్యం. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల్లో మన కోసం కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది... మనకూ బహుమతులు ఉంటాయి అనే భరోసా కల్పించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రిస్మస్ చెట్టు, తార, బెల్స్... ప్రేమను పంచమనే చెబుతాయి. చిన్నపిల్లలకు ప్రేమను పంచడానికి మించిన ఆనందం లేదు. -
నేపాల్ దారి అగమ్యగోచరం
నేపాల్లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?కనీసం ప్రశ్నించుకోని వైనంఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.రాజకీయ శూన్యంజెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి. అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.కోల్పోయిన విశ్వాసంవీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సాక్షి టెన్త్ క్లాస్ ప్రత్యేకం.. అతి త్వరలో..
సాక్షి టెన్త్ క్లాస్ ప్రత్యేకం.. అతి త్వరలో..మీ స్టడీ టేబుల్పై సాక్షి టెన్త్క్లాస్ స్పెషల్స్..పదో తరగతి పరీక్షల్లో మీ సక్సెస్కు సులువైన మార్గం..ఏం చదవాలి... ఎలా చదవాలి..మంచి మార్కులు ఎలా సాధించాలి..మీకు ఒక క్లాస్ రూం టీచర్లా..టాప్ మార్కుల సాధనకు మార్గం చూపే నేస్తంలా..సాక్షి టెన్త్క్లాస్ స్పెషల్స్ ఉంటాయి..ప్రతి రోజూ సాక్షిలో సబ్జెక్ట్ నిపుణులు అందించే స్టడీ మెటీరియల్..మరి ఇంకెందుకు ఆలస్యం..!నేడే మీ కాపీని సాక్షి ఏజెంట్ వద్ద రిజర్వు చేసుకోండి -
సమాజంలోని బలహీనతలపై దండోరా
రవికృష్ణ, నవదీప్, నందు, మనికా చిక్కాల, బింధు మాధవి, రాధ్య, అదితీ భావరాజు, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ము΄్పానేని నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘దండోరా’ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా చిరస్థాయిగా నిలిచి΄ోతుందనిపించింది. సమాజంలోని బలహీనతను దమ్ముతో దండోరా వేయించి చెప్పేందుకు చాలా గట్స్ ఉండాలి.దర్శకుడు మురళీకాంత్కు దమ్ము, ధైర్యం ఉంది. ఈ చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దండోరా’ సినిమాలో ఏదో ఒక కొత్త విషయం ఉందని జనాల వరకు రీచ్ అయ్యింది. ఈ కథను మాత్రం ఎవ్వరూ ఊహించలేరు’’ అన్నారు నవదీప్. ‘‘ఈ ‘దండోరా’ చిత్రానికి స్టోరీనే హీరో. కంటెంట్ హీరోయిన్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ. ‘‘సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా తీశాను. నా దృష్టిలో నేను విజయం సాధించాను’’ అని పేర్కొన్నారు మురళీకాంత్. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు’’ అన్నారు నటుడు రవికృష్ణ. -
ఈషా కథ విని షాక్ అయ్యాను: అఖిల్ రాజ్
‘‘శ్రీనివాస్ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్ రాజ్ తెలిపారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి, దర్శకుడు శ్రీనివాస్గారు నన్ను ఆడిషన్ చేసి, ఈ చిత్రంలో వినయ్ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైంది. ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్ పాత్రను ‘ఈషా’లో చేశాను. దామోదర ప్రసాద్ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
శంబాలతో సక్సెస్ కొడతాను: ఆది సాయికుమార్
‘‘రాజశేఖర్, మహీధర్ రెడ్డిగార్లకు నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రమైనా ఎంతో ప్యాషన్తో నిర్మించారు. అయితే కథపై నమ్మకంతో నా మార్కెట్కి మించి ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు. కానీ ఎక్కడా వృథా ఖర్చు చేయలేదు. ఈ నెల 25న చాలా సినిమాలు వస్తున్నాయి...పోటీ బాగా ఉండంతో ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ‘శంబాల’ ఔట్పుట్ పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అని ఆది సాయికుమార్ చెప్పారు. ఆయన హీరోగా, అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే డిసెంబరు 23న ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ పంచుకున్న విశేషాలు... ⇒ ‘శంబాల’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుంచి మా మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన టీజర్, ప్రభాస్, నానీగార్లు విడుదల చేసిన ట్రైలర్స్ ఆడియన్స్లో మా మూవీ పట్ల మంచి బజ్ తీసుకొచ్చాయి. ఈసారి మంచి విజయాన్ని అందుకోబోతున్నామనే నమ్మకం ఉంది. మా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి లుక్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం... అందుకే కాస్ట్యూమ్స్ని చాలా సెలెక్టివ్గా తీసుకున్నాం. మా సినిమాలో అద్భుతమైనపోరాట సన్నివేశాలున్నాయి. రాజ్కుమార్ మాస్టర్ బాగా చూపించారు.⇒ ‘శంబాల’ అనే ప్రాంతం ఉందా? లేదా అనేది ఎవరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఆ టైటిల్ చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘కల్కి’ తర్వాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది. ఈ మూవీ కోసం యుగంధర్గారు చాలా కష్టపడ్డారు... ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. సినిమా చూసిన తర్వాత అందరూ నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఆడియన్స్కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇలాంటి జానర్లను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ‘శంబాల’ లాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ను ఎంజాయ్ చేస్తారు.⇒ క్రిస్మస్ అనేది మంచి సీజన్. శ్రీకాంత్గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్ తో నాకు మంచి పరిచయం ఉంది. మా ‘శంబాల’తో పాటు రోషన్ నటించిన ‘చాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల పూర్తిగా సంతృప్తిగా లేను. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ‘శంబాల’తో సక్సెస్ కొడుతున్నాను. ఆ తర్వాత కూడా మంచి కథలు ఎంచుకుంటాను. నేను నటించిన ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇంకా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది. -
కథ విన్నారా?
హీరో రవితేజ, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ సైన్స్ ఫిక్షన్ కథను రవితేజకు వశిష్ట వినిపించారని, ఈ కథ నచ్చి, సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట వశిష్ట. అలాగే తనకు ‘కిక్’ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితోనూ రవితేజ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ కథ కూడా విన్నారని తెలిసింది. ఇంకా ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా కమిట్అయినట్లుగా వార్తలున్నాయి. రవితేజ కొత్త సినిమా కబురు ఏ దర్శకుడితో ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ (వర్కింగ్ టైటిల్)తో రవితేజ బిజీగా ఉన్నారు. అలాగే ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
హెచ్-1బీ వీసాల జారీ.. కీలక మార్పులు చేసిన అమెరికా
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) రద్దు చేసింది. బదులుగా వెయిటేజ్ సిస్టమ్ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఉన్నత ఉద్యోగాలు,అధిక శ్రేణి వేతన దారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27,2026 నుంచి ఈ కొత్త హెచ్-1బీ వీసా విధానం అమల్లోకి రానుంది. వీసా పరిమితి యథాతథంఅమెరికా ప్రభుత్వం ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం..ప్రతి సంవత్సరం 65,000 హెచ్‑1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20,000 వీసాలు యథాతథంగా కొనసాగన్నాయి. అయితే, ఈ కొత్త విధానం అమెరికన్ కార్మికులను రక్షించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ రంగానికి తీవ్ర సవాళ్లు విసరనుంది. పెద్ద కంపెనీలు లాభపడతాయి, కానీ స్టార్టప్లు, తక్కువ వేతన ఆఫర్లు ఇచ్చే సంస్థలు వెనుకబడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసాల జారీకి కీలక మార్పులుహెచ్-1బీ వీసాల జారీకి అమెరికా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం విదేశీ సాంకేతిక నిపుణులందరికీ సమాన అవకాశాలిచ్చే లాటరీ పద్దతిని పూర్తిగా మార్చింది. మొత్తం 85వేల హెచ్-1బీ వీసాల జారీకి నాలుగు నాలుగు కేటగిరీల్లో లాటరీ తీసే పద్దతి ఉండేది.ఇందులో అత్యధిక వేతనం కలిగినవారికి లెవల్ 4 కేటగిరిగా పరిగణింపు. వేతనాన్ని బట్టి లెవల్-1,లెవల్-2, లెవల్-3 కేటగిరి ఉండగా.. లెవల్-4 అర్హత సాధించిన వారికి ఈ ఏడాదిలో నాలుగు సార్లు లాటరీకి అవకాశం. లెవల్-3 అర్హత సాధించిన వారికి మూడుసార్లు, లెవల్-2 అర్హత సాధించిన వారికి 2 సార్లు లాటరీకి ఛాన్స్, ఎంట్రీలెవల్ ఉద్యోగులకు ఒక్కసారి మాత్రమే లాటరీకి ఛాన్స్. ఇచ్చేది.తాజాగా, ఆ లాటరీ సిస్టంను తొలగించింది. బదులుగా వెయిటేజీ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఆధారంగా హెచ్-1బీ వీసాల జారీ ఉంటుంది. -
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా కల్పిత కథనాలు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో ఈనాడు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సహా పలు మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన కథనాలు తొలగించాలని, రూ.10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు.ఇక నుంచి లడ్డు వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ వివాదంలో ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరో వైపు కల్పిత కథనాలు రాస్తూ వై.వీ సుబ్బారెడ్డి పరువు, ప్రతిష్టలకు ఎల్లో మీడియా భంగం కలిగించింది. ఇక నుంచి లడ్డూ వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. -
చిల్ అవుతోన్న మ్యాడ్ బ్యూటీ.. ఫుల్ గ్లామరస్గా భాగ్యశ్రీ బోర్సే..!
డిసెంబర్లో మూడ్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..గులాబీలా మెరిసిపోతున్న కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్..మ్యాడ్ బ్యూటీ రెబా మోనికా జాన్ చిల్..మరింత గ్లామరస్గా కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే..హీరోయిన్ ప్రణీత బ్యూటీఫుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ను గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను.. ఇది నాలో నటుడి ఆకలి తీర్చిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు..మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.ప్రకాశ్ రాజ్ రోల్ అదేనా?అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ రోల్పై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ రోల్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంలో నటించారు. Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰— Prakash Raj (@prakashraaj) December 23, 2025 -
వెహికల్ ఇన్సూరెన్స్: తెలుసుకోవలసిన విషయాలు
కార్లు, బైకులు కొనేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎంచుకోవడం, ఇన్సూరెన్స్ కవరేజ్ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను ఎంచుకోవడం. ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే.. వెహికల్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సమయంలో చేసే తప్పులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ప్రాథమిక అంశాల్ని తెలుసుకోకపోవడంవెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు లేదా అది అందించే సంస్థను ఎంచుకునేముందు ప్రారభమిక అంశాలను గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే.. ఇతర సంస్థలు అందించే పాలసీలు, వాటి ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటివాటిని కూడా తెలుసుకోవాలి.సరైన ఐడీవీ ఎంచుకోకపోవడంవాహనానికి ఏదైనా డ్యామేజ్ లేదా దొంగతనానికి గురైనా.. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తాన్ని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అంటారు. ప్రీమియం అనేది ఈ విలువపైన ఆధారపడి ఉంటుంది. ప్రీమియమ్ తగ్గించుకునే ఉద్దేశ్యంతో.. ఐడీవీ తగ్గించుకునే నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలి.ఎన్సీబీ ఉపయోగించుకోకపోవడంపాలసీ ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయింలు చేయకపోతే.. అలాంటి సమయంలో నో-క్లెయిమ్ బోనస్ (NCB) ఆఫర్ చేస్తుంది. అంటే.. ఎలాంటి క్లెయిమ్ లేకుండా, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రివార్డుగా ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. దీని గురించి వాహనదారులు తెలుసుకోవాలి.పాలసీలను పోల్చి చూడకపోవడంఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. కంపెనీలను గురించి తెలుసుకోవడంతో పాటు, మీరు తీసుకునే పాలసీలను కూడా పోల్చిచూసుకోవాలి. ఇలాంటివేవీ చేయకుండా.. ఏదో ఒక పాలసీ లేదా తక్కువకు లభించే పాలసీని ఎందుకోకూడదు. పాలసీ తీసుకునే ముందే రీసర్చ్ చేసి తీసుకోవడం ఉత్తమం. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన పద్దతి కాదు.యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోకపోవడంఒక వాహనం కొనుగోలు చేసి.. డబ్బు కొంత ఖర్చు అవుతుందని వెనుకడుగు వేసి యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డివైజ్లను ఉపయోగించుకోకపోవడం వల్ల.. వాహనాలు దొంగతనాలకు గురవుతాయి. కాబట్టి జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్లాక్స్ మొదలైన సెక్యూరిటీ డివైస్లను అమర్చుకోవడం వల్ల.. వాహనం కొంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి డివైస్లను ఇన్స్టాల్ చేసిన వాహనాలకు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు. -
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
సత్తా చాటిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన శ్రీలంక
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. శ్రీలంకను స్వల్ప స్కోర్కే పరిమితం చేసింది. దీప్తి శర్మ స్థానంలో జట్టులో వచ్చిన స్నేహ్ రాణా (4-1-11-1) అద్బుతంగా బౌలింగ్ చేసింది. వైష్ణవి శర్మ (4-0-32-2), శ్రీ చరణి (4-0-23-2), క్రాంతి గౌడ్ (3-02-1) కూడా రాణించారు. అరుంధతి రెడ్డి (3-0-22-0), అమన్జోత్ కౌర్ (2-0-11-0) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్డు కూడా చెలరేగిపోయారు. ఏకంగా ముగ్గురిని రనౌట్ చేశారు. అమన్జోత్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి వికెట్ కీపర్ రిచా ఘోష్కు అద్భుతమైన త్రోలు అందించి ముగ్గురిని రనౌట్ చేశారు. లంక ఇన్నింగ్స్లో హర్షిత సమరవిక్రమ (33) టాప్ స్కోరర్గా నిలిచింది. కెప్టెన్ చమారి (31), హాసిని పెరీరా (22), కవిష దిల్హరి (14), కౌషిని (11) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు. విష్మి గౌతమ్ (1), నీలాక్షి (2), కావ్యా కవింది (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శశిని డకౌటైంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఇదే విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది.తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
ఇండస్ట్రియల్ పార్కులు, వాటర్ & వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, అర్బన్ సొల్యూషన్స్లో.. ప్రత్యేక నైపుణ్యం కలిగిన మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న ప్రముఖ సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. 2025లో కంపెనీ ఆపరేటింగ్ ఫండమెంటల్స్ను ఎలా బలోపేతం చేసింది, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి కోసం వ్యూహలు ఏమిటనే విషయాలను వెల్లడించింది.కంపెనీ రూ. 1000 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విధానం ద్వారా చిన్న ప్రాజెక్టులలో విభజనను తగ్గించడం, సంక్లిష్టమైన పనులపై కఠినమైన డెలివరీ నియంత్రణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు దగ్గరగా ఉన్న అంతర్జాతీయ పైప్లైన్తో పాటు సుమారు 1 బిలియన్ డాలర్ల దేశీయ పైప్లైన్ను కూడా సూచించింది.విదేశీ ఇండస్ట్రియల్ పార్కులు, నీటి ప్రాజెక్టులకు పరిమితం చేసిన కంపెనీ.. ఇంజనీరింగ్, నిర్మాణం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి వాటిపై దృష్టి సారించింది. నీరు, వ్యర్థ జలాల విభాగంలో.. కంపెనీ పరిధిలో డిజైన్ బిల్డ్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ పైప్లైన్లు, పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ఉండటం కలేనా..?
ఇటీవలికాలంలో భారత పురుషుల క్రికెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. దీంతో ఫార్మాట్కు ఒక్క జట్టు సరిపోదనే వాదన వినిపిస్తుంది. ఓ దశలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రెండు జట్లతో ప్రయోగం కూడా చేసింది.1998 సెప్టెంబర్లో తొలిసారి సీనియర్ పురుషుల క్రికెట్ జట్లు రెండు వేర్వేరు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నాయి. అజయ్ జడేజా నేతృత్వంలో ఓ జట్టు మలేసియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనగా.. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో మరో జట్టు కెనడాలో పాకిస్తాన్తో సహారా కప్ ఆడింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న జట్టులో సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే లాంటి స్టార్ ఆటగాళ్లు ఉండగా.. సహారా కప్ జట్టుకు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు. ఇలాంటి ప్రయోగమే 2021లో మరోసారి జరిగింది. షెడ్యూల్ క్లాష్ కావడంతో రెండు వేర్వేరు భారత జట్లు ఇంగ్లండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడగా.. శిఖర్ ధవన్ సారథ్యంలోని జట్టు శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడింది.పై రెండు సందర్భాల్లో ఒకే సమయంలో రెండు వేర్వేరు భారత జట్లు ఆడటమనేది షెడ్యూల్ క్లాష్ కావడం వల్ల జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విషయం అది కాదు. షెడ్యూల్ క్లాష్ కాకపోయినా భారత్కు రెండు వేర్వేరు జట్ల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 11 బెర్త్ల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఏ స్థానం తీసుకున్నా, అర్హులైన ఆటగాళ్లు కనీసం పదుల సంఖ్యలో ఉన్నారు.వీరిలో ఒకరికి న్యాయం చేస్తే, మిగతా తొమ్మిది మందికి అన్యాయం జరుగుతుంది. అందుకే మల్టిపుల్ జట్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది. ఇలా చేస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించినట్లవుతుంది. అలాగే వారి టాలెంట్కు కూడా న్యాయం చేసినట్లవుతుంది.ఇటీవలికాలంలో మూడు ఫార్మాట్ల భారత జట్లలో ఒకరిద్దరికి క్రమం తప్పకుండా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు సంజూ శాంసన్. సంజూ టీ20 ఫార్మాట్లో ఓపెనర్గా క్రమం తప్పకుండా రాణిస్తున్నా, శుభ్మన్ గిల్ కారణంగా అతడికి అవకాశాలు రాలేదు. తాజాగా భారత సెలెక్షన్ కమిటీ సంజూకి న్యాయం (గిల్ను పక్కన పెట్టి టీ20 వరల్డ్కప్కు ఎంపిక) చేసినప్పటికీ.. వేరే కోణంలో విమర్శలు మొదలయ్యాయి.తీవ్రమైన పోటీ కారణంగా ప్లేయింగ్ ఎలెవెన్లో స్థానం దక్కని ఆటగాళ్లు సంజూ కాకుండా చాలామంది ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, పడిక్కల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, సిరాజ్, షమీ, చహల్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్ లాంటి వారు అర్హులై, క్రమంగా రాణిస్తున్నా తుది జట్లలో అవకాశాలు రావడం లేదు. వచ్చినా ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితమవుతున్నారు.బెర్త్లు పదకొండే కావడంతో స్టార్ ప్లేయర్లకు కూడా కొన్ని ఫార్మాట్లలో ఈ కష్టాలు తప్పడం లేదు. కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడు వాస్తవానికి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయినా అతనికి టీ20 జట్టులో అవకాశం దక్కడం లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయినా, అతనిదీ ఇదే అనుభవం. రిషబ్ పంత్ లాంటి డాషింగ్ బ్యాటర్ పరిస్థితి అయితే మరీ దారుణం. అతన్ని కేవలం టెస్ట్ల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది. వాస్తవానికి అతనికి ఉన్న దూకుడుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెట్ ప్లేయర్. అయినా పరిమిత బెర్త్ల కారణంగా పంత్ సింగిల్ ఫార్మాట్కే పరిమితమయ్యాడు. బౌలింగ్లో సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్ లాంటి వారి పరిస్థితి కూడా ఇదే. షమీ లాంటి వారికైతే మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నా కనీసం ఒక్క ఫార్మాట్ జట్టులోనూ చోటు దక్కడం లేదు.మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేస్తుంటేనే పరిస్థితి ఇలా ఉంది. అదే.. గతంలో మాదిరి మూడు ఫార్మాట్లకు ఒకే జట్టు ఉంటే సెలెక్టర్లకు ఊపిరి తీసుకోవడం సాధ్యమయ్యేదా..? ఏ ప్లేయర్ అయినా తాను ఏదో ఒక్క ఫార్మాట్కు మాత్రమే పరిమితం కావాలని అనుకోడు. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించాలని ప్రతి ఒక్కరు కలగంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మాట్కు ఒక జట్టు ఎంపిక చేసే దానికంటే, పోటీ దృష్ట్యా ఒక్కో ఫార్మాట్కు ఒకటికి మించిన జట్లను ఎంపిక చేయడం మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అర్హుడైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఉంటుంది. అయితే ఇలా చేసేటప్పుడు సీనియర్ జట్టు, జూనియర్ జట్టు అన్న తేడాలు ఉండకుండా చూసుకుంటే మంచింది. ఎందుకంటే, ఏ టాలెండెడ్ ఆటగాడైనా తాను ఎక్కువ-తక్కువగా ఉండాలని అనుకోడు.చిన్న జట్లు, పెద్ద జట్లు అన్న తేడా లేకుండా అన్ని జట్లు సమానంగా మ్యాచ్లు ఆడాలి. మరి ఇలాంటి ప్రయోగానికి బీసీసీఐ ఎప్పుడు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి. -
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆమెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.అదే సమయంలో "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. -
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. ఇగ మారవా ‘ఛీ వాజీ
చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుగా ఉంది నటుడు శివాజీ పరిస్థితి. ఆడవాళ్లు ఇలా ఉండాలి? అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? అని నీతులు చెప్పే ఈ సుద్దపూస.. తనవరకు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జీన్స్, హుడీలు వేసుకోని కుర్రహీరోలా రెడీ అయిపోతాడు. స్త్రీ అంటే ప్రకృతి.. తల్లి అంటూనే అదే నోటితో దరిద్రపు ము** అంటూ బూతులు మాట్లాడతాడు. చివరకు క్షమాపణలు చెబుతూనే.. తను చెప్పింది మంచి విషయమే కానీ వాడిన పదాలు తప్పు అంటాడు. మహిళలు ఇలాంటి దుస్తులే ధరించాలి..ఇలానే కనిపించాలి అని చెప్పేందుకు శివాజీ ఎవరు? ఎలా కనబడాలి? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది ముమ్మాటికి వాళ్ల హక్కే. ఇది శివాజీ లాంటి స్వయంప్రకటిత మేధావులకు ఎప్పుడు అర్థమవుతుందో..బిగ్బాస్ హౌస్లో కూడా చిల్లర మాటలేమహిళలపై ఇలాంటి చిల్లర కామెంట్స్ చేయడం శివాజీకి ఇదే మొదటిసారి కాదు. గతంలో బిగ్బాస్ షోలో కూడా తోటి కంటెస్టెంట్స్పై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నటుడుగా తన పేరు కనుమరుగు అవుతున్న సమయంలో బిగ్బాస్ 7 షోతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు శివాజీ. అక్కడ కూడా ఆట కంటే ఎక్కువగా ఇలాంటి మాటలతోనే పబ్బం గడిపాడు. బిగ్బాస్ 7లో పాల్గొన్న శోభ, రతిక, ప్రియాంక, అశ్వినితో పాటు మిగిలినవారంతా శివాజీ ప్రవర్తనను, మాటలను తప్పుపట్టారు. (చదవండి: హీరోయిన్ల డ్రెస్పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్)ఒకనొక సమయంలో అయితే అతని మాటలపై గట్టిగా సీరియస్ అయ్యారు కూడా. బిగ్బాస్ 7 పదో వారం..గేమ్లో భాగంగా హౌస్లో ఉన్న రతిక, ప్రియాంక, శోభ, అశ్వినిలను రాజమాతలుగా బిగ్బాస్ నియమిస్తే.. ‘నా మాట వినకపోతే ***పగుల్తాయ్’ అంటూ అనవసరంగా నోరు పారేసుకున్నాడు. అదే షోలో ప్రియాంకతో కూడా శివాజీ దురుసుగా ప్రవర్తించాడు. ఓ వారం అతన్ని నామినేట్ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నాడు’ అని ప్రియాంక అంటే.. ఆమెపై వేలు ఎత్తి చూపిస్తూ.. వెళ్లు వెళ్లు అంటూ వెతకారంగా మాట్లాడాడు. వేలు చూపించడం సరికాదంటూ ప్రియాంక సీరియస్ అయితే.. ‘నీకంత లేదమ్మా’ అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు.ఏమైనా సంబంధం ఉందా ‘ఛీ’వాజీతాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా మీడియా అటెన్షన్ కోసమే అన్నట్లుగా ఉంది. వాస్తవానికి నిన్న శివాజీ వెళ్లింది దండోరా సినిమా ఈవెంట్. అక్కడ సినిమా గురించి మాట్లాడాలి. కానీ అది వదిలేసి.. అమ్మాయిల డ్రెస్పై కామెంట్స్ చేశాడు. ఆడవాళ్ల దుస్తులకు.. ఆయన నటించిన సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? పోనీ గతంలో శివాజీ నటించిన సినిమాల్లో హీరోయిన్లు అంతా చీరలు ధరించే కనిపించారా? ఏదో ఒకటి మాట్లాడి మీడియాలో అటెన్షన్ తెచ్చుకోవాలన్న కోరికతోనే శివాజీ అలాంటి చిల్లర వ్యాఖ్యలు చేశాడు.అదో పిచ్చి.. మీడియాలో తన పేరు వినిపించాలనే పిచ్చి శివాజీకి కాస్త ఎక్కువే. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి.. ‘నేను తోపు.. తురుమ్ ఖాన్’ అని గప్పాలు కొట్టుకుంటాడు. రాజకీయాల గురించి ఇంగిత జ్ఞానం కూడా లేని శివాజీ.. 2019 ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథను అల్లి చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అనంతరం బీజేపీలో చేరాడు. ఆ విషయం పార్టీతో పాటు జనాలు కూడా మర్చిపోయారు. ఇప్పుడు రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఈ మధ్యే శివాజీ ఇంకా నటుడుగా కొనసాగుతున్నాడన్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే.. తనకు గుర్తింపు వచ్చి..మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో శివాజీ ఉన్నాడు. చాన్స్ల కోసం ఇంతకు దిగజారాలా ‘ఛీవాజీ’ -
మహిళలపై శివాజీ కామెంట్స్.. ఆ రెండు ఒక్కటి కాదు: యాంకర్ సుమ
నటుడు శివాజీ చేసిన కామెంట్స్పై టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని తెలిపింది. ఇటీవలే తాను ఎకో అనే మూవీ చూశానని వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో ఇటీవల నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చరికలాంటివని సుమ తెలిపింది. ఇలాంటివీ చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందని ఆమె ప్రశ్నించింది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని వదిలేయడం అంటే ఇంకా పెంచి పోషించడమేనని యాంకర్ రాసుకొచ్చారు. ఈ సంఘటనలను మహిళలు ప్రశ్నిస్తూనే ఉంటారని సుమ తన పోస్ట్లో స్పష్టం చేసింది. హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్..శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడారు. నటీమణుల దుస్తులపై ఆయన కామెంట్స్ చేశారు. సామాన్లు కనపడేలా డ్రెస్సులు ధరించొద్దని.. చీరలోనే అందంగా ఉంటారని వెటకారంగా అన్నారు. అదే సమయంలో కొన్ని అసభ్యకర పదాలు వాడారు. దీంతో శివాజీ చేసిన కామెంట్స్పై అనసూయ, చిన్మయితో సహా పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు శివాజీ.Recently watched a film called eko which says Protection and restriction are not the same. pic.twitter.com/5ozSvvYUhq— Suma Kanakala (@ItsSumaKanakala) December 23, 2025 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, కొమ్మూరి కనకారావు, ఏ. నారాయణమూర్తి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కార్యకర్తలనుద్దేశంచి పార్టీ నేతలు మాట్లాడారు.తానేటి వనిత మాట్లాడుతూ.. పేదలను ప్రేమించడంతో పాటు వారికి సహాయం చేయాలన్న ప్రభువు క్రీస్తు సిద్ధాంతాలను కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. పేదల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టే.. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వనరులు సహకరించకపోయినా, కరోనా వంటి విపత్తులోనూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు.అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండగ. క్రీస్తు జననానికి మానవాళిలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవాళ 2025లో ఉన్నామంటే.. దాని కొలమానం క్రీస్తు శకం అని అంటాం. అంటే ఆయన ఉద్భవించిన నాటి నుంచి నేటికి 2500 సంవత్సరాలు కింద లెక్క. ఆ విధంగా మానవాళి తమ రోజులు లెక్కించుకోవడానికి గుర్తించబడిన.. క్రీస్తు జననం అంటే ఎంత పవిత్రమైనదో, గొప్పదో తెలుసుకోవచ్చు.మన దేశం లౌకిక వాద దేశం. ఇక్కడ సర్వమతాలు సహజీవనం చేస్తున్న దేశం. ఎవరైనా పరమతాన్ని గౌరవిస్తే.. అప్పుడే మన మతాన్ని గౌరవించగలుగుతాం. అన్ని మతాలు సహజీవనం చేస్తున్న చక్కని దేశం మనది. గుంటూరుకు సంబంధించి చాలా కాలం క్రితమే క్రిస్టియానిటీ మొదట విద్యాలయాలు, వైద్యాలయాలను తీసుకొచ్చింది. మానవ సేవ చేయడమే దైవ సేవ చేయడంగా భావించిన క్రిస్టియానిటీ అనేక కార్యక్రమాలు చేసింది. వైఎస్సార్సీపీ తరపున రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా... సమాజానికి సంబంధించి ఆయన బోధనలు, ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్ధాయిగా ఉంటాయి. తోటివారిని ప్రేమించడం, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం, అవసరమైన చోట్ల త్యాగాలకు సిద్ధం కావడం ఇలా బైబిల్ లో అంశాలన్నీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. మనిషి ప్రతి మాటలో మానవత్వం, ప్రేమ ఉండాలి, ప్రతి పనిలో సాయం చేసే గుణం ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ సమాజంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మన ప్రియతమ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ నేతృత్వంలో మనందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ.. అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ మందుకు సాగాలని, ఆ ప్రభువు ఏసుక్రీస్తు చెప్పినట్లు కోరుకుంటున్నాను -
పిల్లల విద్య కోసం ఐదేళ్లు..: ఖతార్లో ఇషా అంబానీ
ఇండియా & ఖతార్లలో.. మ్యూజియం ఇన్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్లను అభివృద్ధి చేయడానికి ఖతార్ మ్యూజియమ్స్ - ముంబై కేంద్రంగా ఉన్న నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) మధ్య ఐదు సంవత్సరాలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఖతార్ మ్యూజియమ్స్ చైర్పర్సన్ షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం.. ఖతార్లలో మ్యూజియం ఇన్ రెసిడెన్స్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీని ద్వారా పిల్లలకు ఉల్లాసభరితమైన, మ్యూజియం ఆధారిత అభ్యాస అనుభవాలను పరిచయం చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం సృజనాత్మకతను ప్రేరేపించడం. మన దేశంలో ఈ కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో.. NMACC అమలు చేస్తుంది. కాగా ఖతార్ మ్యూజియమ్స్ నిపుణులు.. మాస్టర్ క్లాసులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించనున్నారు.ఈ సందర్బంగా ఇషా అంబానీ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు & విద్యాభివృద్ధి కోసం షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరియు ఖతార్ మ్యూజియంలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ భాగస్వామ్యంతో నిర్వహించనున్న కార్యక్రమాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలతో సహా పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ కేంద్రాలలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ముగ్గురు ఏఎస్జీల నియామకం
సుప్రీంకోర్టుకు ముగ్గురు అడిషనల్ సొలిసిటర్ జనరల్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్, రవీంద్ర కనకమేడలలను ఏఎస్జీలుగా నియమిస్తూ కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ముగ్గురు మూడేళ్ల పాటు ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.దవీందర్ పాల్ సింగ్ గతంలో పంజాబ్, హర్యాణాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. అనిల్ కౌశిక్, కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు. అడిషనల్ సొలిసటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులలో సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తారు. రాజ్యాంగం అంశాలతో పాటు ఇతర న్యాయ అంశాలలో ప్రభుత్వానికి వీరు సలహా ఇస్తారు. వీరు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్కు సహాయకారిగా ఉంటారు. -
పవన్ కల్యాణ్ భయం అదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘వైఎస్సార్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్కు కిక్ బ్యాగ్లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్లో పవన్కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?...కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు...ఏపీలో అనేక స్కామ్లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించింది. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. దీప్తి స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది. తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
ఐసీసీ ప్రీమియర్ పార్ట్నర్గా హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. 2026-2027 మధ్యలో జరిగే అన్ని ఐసీసీ పురుషులు మరియు మహిళల క్రికెట్ టోర్నమెంట్లకు ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలోకి 2027 పురుషుల వన్డే వరల్డ్కప్ సహా మొత్తం ఆరు ఐసీసీ ప్రధాన టోర్నీలు వస్తాయి.ఈ ఒప్పందంతో హ్యుందాయ్కు లభించే ప్రత్యేక హక్కులు..- మ్యాచ్డే కాయిన్ టాస్లో భాగస్వామ్యం - స్టేడియంలో ప్రత్యేక బ్రాండింగ్ - అభిమానుల కోసం ప్రత్యేక అనుభవాలు (fan zones, vehicle showcases, digital engagement) ఐసీసీతో ఒప్పందం ఖరారయ్యాక హ్యుందాయ్ సీఈవో జోస్ మునోజ్ మాట్లాడుతూ.. క్రికెట్ మరియు హ్యుందాయ్ రెండూ నిరంతరం మెరుగుపడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ అభిమానులతో కనెక్ట్ కావడం గర్వకారణం. ముఖ్యంగా భారత్లో క్రికెట్ జీవనశైలి. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. హ్యుందాయ్ ఇండియా సీఈవో డెసిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం భారత మార్కెట్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మూలలా కమ్యూనికేషన్ స్ట్రాటజీతో అభిమానులను చేరుకుంటామని అన్నాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఐసీసీ ఈవెంట్స్లో అభిమానులను డిజిటల్, స్టేడియం అనుభవాల ద్వారా ఆకర్షించడానికి హ్యుందాయ్ భాగస్వామ్యం గొప్ప అవకాశమని అన్నాడు. కాగా, హ్యుందాయ్ మోటర్ ఐసీసీతో జతకట్టడం ఇది మొదటిసారి కాదు. 2011–2015 మధ్యలో కూడా ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించింది. -
ఘోర ప్రమాదం మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు, పెళ్లి వాయిదా
ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.🚨🏥 María Sol (Lionel Messi’s sister) was involved in a car accident while driving in Miami and has been forced to postpone her wedding, which was scheduled for January 3, 2026.According to confirmed reports, she lost control of the vehicle and crashed into a wall. As a result… pic.twitter.com/Sae2Uy4Q1Q— FC Barcelona Fans Nation (@fcbfn_live) December 23, 2025 లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది. -
దెబ్బకు దిగి వచ్చిన శివాజీ.. ఎట్టకేలకు క్షమాపణలు..!
టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు కోరారు. మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు మాటలు అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. సారీ చెబుతూ ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశాడు. వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'హలో అండి.. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడిన సందర్భంలో నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అన్పార్లమెంటరీ పదాలు వాడాను. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు.. హీరోయిన్స్ బయటికి వెళ్లినప్పుడు దస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్తి. ఒక అమ్మవారిలా అనుకుంటా. ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. నా ఉద్దేశం మంచిదే కానీ.. ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు మంచి ఉద్దేశమే తప్ప.. అవమానపరచాలి.. కించపరచాలి అనే ఉద్దేశం లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు.. అలాగే మహిళలు తప్పుగా భావిస్తే మీ అందరికీ నా క్షమాపణలు' అంటూ వీడియోలో కోరాడు. I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT— Sivaji (@ActorSivaji) December 23, 2025 -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
రెండో వివాహం చేసుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం (2018లో) అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మొదటి భార్య రూత్ను కోల్పోయిన స్ట్రాస్.. తాజాగా ఆంటోనియా లిన్నేయస్ పీట్ (30) అనే మాజీ పీఆర్ ఎగ్జిక్యూటివ్ను మనువాడాడు.వీరి వివాహం అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో స్ట్రాస్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికాలోని (ఫ్రాన్స్హోక్) ఓ వైన్ యార్డ్లో జరిగింది. లిన్నేయస్ పీట్తో వివాహ సమాచారాన్ని స్ట్రాస్ సోషల్మీడియా వేదికగా పంచుకున్నాడు.వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, భార్య లిన్నేయస్ను ఉద్దేశిస్తూ ఈ సందేశాన్ని రాసుకొచ్చాడు. “మన ప్రియమైన ప్రదేశంలో అత్యంత ప్రత్యేకమైన రోజు జరుపుకున్నాం. నన్ను, నా పిల్లలను ప్రేమించి, నిజమైన ఆనందాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నేను ఎంతో అదృష్టవంతుడిని. మన జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉండాలని కోరుకుంటున్నాను”స్ట్రాస్ భార్య ప్రస్తుతం లిన్నేయస్ అనే ఫైన్ ఆర్ట్ అడ్వైజరీ సంస్థ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల స్ట్రాస్ ఇటీవల ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పని చేసి పదవీ విరమణ చేశాడు. స్ట్రాస్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా వ్యవహరించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన స్ట్రాస్.. 2003-2012 మధ్యలో 100 టెస్ట్లు, 127 వన్డేలు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీల సాయంతో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ గెలిచిన అతి కొద్ది మంది ఇంగ్లండ్ కెప్టెన్లలో స్ట్రాస్ ఒకరు.స్ట్రాస్.. మొదటి భార్య రూత్ జ్ఞాపకార్థం Ruth Strauss Foundation స్థాపించాడు. ఈ ఫౌండేషన్ కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. ఈ సేవలకు గాను స్ట్రాస్కు 2019లో నైట్హుడ్ లభించింది. -
సందీప్ కిషన్ కోలీవుడ్ మూవీ.. తెలుగు టీజర్ వచ్చేసింది.!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్తో పాటు అడ్వెంచరస్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదుఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.అయితే, ఆసీస్టూర్లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.సఫారీలతో సిరీస్లో సత్తా చాటిన జడ్డూఅయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్తో సిరీస్తో బిజీ అవుతారు.చదవండి: Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో.. -
హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీకి బిగ్ షాక్..!
టాలీవుడ్ సినీయర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన కామెంట్స్పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు.శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు.సామాన్లు అంటూ కామెంట్స్.. కాగా.. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన శివాజీ హీరోయిన్లు డ్రెస్లను ఉద్దేశించి మాట్లాడారు. దుస్తుల విషయాన్ని చెబుతూ కొన్ని అసభ్యకరమైన పదాలు వాడారు. సామాన్లు అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పటికే అనసూయతో పాటు చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ కామెంట్స్పై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం క్షమాపణలు చెప్పారు. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
బ్రెయిన్కు మేలు చేసే ఆహారాలు..!
మెదడు ఎంతటి కీలకమైనదంటే... మన శరీరం బరువులో దాని బరువు కేవలం 2 శాతం మాత్రమే. కానీ మొత్తం దేహానికి అందే ఆక్సిజన్లో 20 శాతం దానికే కావాలి. దేహం మొత్తం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే చెందాలి. ఇక అదెంతటి అద్భుతమో చూద్దాం... దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. అన్నీ కొవ్వు కణాలే. అంటే మెదడు కణాలన్నీ కొవ్వుతో నిర్మితమైనవే. కొవ్వు లేకపోతే మెదడే లేదు. అంటే... శరీరంలోని 25 శాతం కొలెస్ట్రాల్ మెదడులోనే ఉంటుంది. మన ఆలోచనలకూ, పనులకూ, తెలివితేటలకూ అదే మూలం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అది మందకొడిగానూ, మరికొన్ని ఆహారాలతో అది చురుగ్గానూ ఉంటుంది. అది చురుగ్గా పనిచేయడానికి ఎలాంటి ఆహారం కావాలో తెలిపే కథనం.మెదడుకు హాని చేసే ఆహారాలునిల్వ ఉంచిన ఉప్పు కలిపిన పదార్థాలైన చిప్స్, టిన్న్డ్ సూప్స్తోపాటు ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహార పదార్థాలు మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యానికే కాదు... మెదడుకూ చేటు చేస్తుంది. కొవ్వుల్లో డాల్డా వంటి ట్రాన్స్ఫ్యాట్స్, అలాగే మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం (Non Veg) తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ వంటి కొవ్వులనూ చాలా పరిమితంగానే (అరుదుగా కేవలం రుచి కోసమే) వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్తబ్ధుగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. అలాగే మెదడును ఉత్తేజపరచడానికి తాగే సిగరెట్ లాంటి పొగతాగే అలవాటు కూడా దీర్ఘకాలంలో మెదడు పనితీరును మందకొడిగా మారుస్తుంది. మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదులనూ తగ్గిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పనిచేయాలనీ, మెదడుకు సంబంధించిన అల్జైమర్స్ వంటి జబ్బులు నివారించడానికి మద్యం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఈలోకంలోని జీవులన్నింటిలోకెల్లా అత్యంత తెలివైన మెదడు మానవులని పిలుచుకునే మన హోమో సేపియన్ జీవులదే. ఈ మొత్తం కాస్మోస్లో ఇంకా తెలివిగల జీవం ఇంకెక్కడుందో ఇప్పటికీ తెలియదు కాబట్టి... ప్రస్తుతానికి ఈ సమస్త విశ్వంలో ఇంతటి సంక్లిష్టమైన మెదడు, అత్యంత అద్భుతమైన మెదడు మానవులది మాత్రమే. అందులో ఎన్ని కణాలు ఉన్నాయనేదానికి నిర్దిష్టమైన లెక్క లేదు. కానీ దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్’ అంటారు. కేవలం ఇసుక రేణువంత భాగంలో కనీసం లక్ష న్యూరాన్లు, పొరుగు కణాలతో అనుసంధానితమైన ఉన్న కనెక్షన్లు 100 కోట్ల వరకు ఉన్నందువల్లనే బహుశా ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం విశ్వంలోనే మరొకటి లేదనేది ఒక భావన.ఎదుగుదలలోనే అద్భుతాలు..తల్లికడుపులో బిడ్డ ఉండగానే మెదడు ప్రతి నిమిషానికీ 2,50,000 కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇలా ఆ బిడ్డ.. ఈ లోకాన్ని చూసే నాటికి అతడు 1000 కోట్ల కణాలతో పుడతాడు. పన్నెండు నెలల వయసప్పుడు తీసిన మెదడు స్కాన్, దాదాపు యుక్తవయసులో ఉన్నప్పటి మెదడు స్కాన్ దాదాపు ఒకేలా ఉంటాయి. కాక΄ోతే ట్రిలియన్ల కొద్దీ సైనాప్స్లు ఏర్పడుతూ ఉంటాయి. పదేళ్ల వయసు నుంచి చాలా వేగంగా సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల జరుగుతుంది. మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరగడం, దృష్టి పెట్టని అంశాలు తగ్గడం జరుగుతాయి. ‘దీన్నే యూజ్ ఇట్... ఆర్ లూజ్ ఇట్’గా పేర్కొంటారు. మనకు ఆనందం ఇచ్చే అంశాలనూ ఈ సమయంలోనే అభివృద్ధి చేసుకుంటాం. దాదాపు 18 నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన వికాసం దాదాపుగా పూర్తవుతుంది. ఈ వికాస క్రమంలోనూ, అటు తర్వాత మెదడు బాగా చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఆహారాలు దోహదపడుతుంటాయి. మెదడు చురుగ్గా ఉండటానికి, చాలాకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పిండదశలో... పిండ దశ నుంచీ మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే కీలకమైన పోషకమే ‘ఫోలిక్ యాసిడ్’. అందుకే ఓ మహిళ గర్భం దాల్చగానే లేదా దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు గర్భం దాల్చకముందు నుంచే మహిళలకు ‘ఫోలిక్ యాసిడ్’ పోషకాన్ని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ఈ ఫోలిక్ యాసిడ్ పోషకం మహిళ గర్భవతిగా ఉన్నప్పట్నుంచే మెదడు తాలూకు మంచి ఎదుగుదలకూ, పిండంలో న్యూరల్ ట్యూబ్కు సంబంధించిన సమస్యల నివారణకూ తోడ్పడుతుంటుంది. ఫోలిక్ యాసిడ్ అనే ఈ పోషకం అన్ని రకాల ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది. ఫోలియేజ్ అంటే ఆకులు. అందుకే పాలకూర వంటి అన్ని ఆకుకూరల్లో సమృద్ధిగా లభ్యమవుతుంది కాబట్టే దీనికి ‘ఫోలిక్ యాసిడ్’ అని పేరు.బిడ్డ పుట్టాక...ఇక బిడ్డ పుట్టి నేల మీద పడ్డాక... ఆ చిన్నారి మెదడు ఆరోగ్యంగా ఎదగాడానికి అవసరమైనది ‘డొకోజా హెగ్జాయినోయిక్ యాసిడ్’ (సంక్షిప్తంగా ‘డీహెచ్ఏ’) అనే మరో రకం పోషకం అవసరం. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఒక రకం. ఈ పోషకం తల్లిసాలలో సమృద్ధిగా లభిస్తుంది. బిడ్డలు పెరిగి పెద్దయ్యా వారికి ఇదే పోషకం కావాలంటే చేపల్లో సమృద్ధిగా దొరుకుతుంది. ఇక బిడ్డల పెరుగుదల తర్వాత, వారు యుక్తవయస్కులుగా మారాక... అటు పిమ్మట కూడా ఆ మెదడు ఆరోగ్యం సక్రమంగా నిర్వహితం కావాలంటే అవసరమైన పోషకాలు ఇవి...సంక్లిష్టమైన పిండిపదార్థాలు(కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్)...మెదడు చురుగ్గానూ, అలాగే సక్రమంగానూ పనిచేస్తూ... అది చేసే పనిలో సునిశితత్వం, వేగం, చురుకుదనం ఉండాలంటే ముందుగా మొత్తం శరీరానికి శరీరం తీసుకునే శక్తిలో 15 శాతం దానికే కావాలి. అంటే మొత్తం శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్లో 15 శాతానికి తగ్గకుండా మెదడుకు సమృద్ధిగా అందుతూ ఉండాలి. అందుకోసం... ఆ శక్తిని సమకూర్చేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనకివి పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు మొదలుకొని పొట్టు తీయని అనేక ముడిధాన్యాల నుంచి ఈ కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లు అందుతాయి. శక్తి కోసం మనం తీసుకోదగ్గ వాటిలో ఇవి ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి దొరికే గ్లూకోజ్ దేహంలోకి చేరగానే తక్షణం వినియోగితమై΄ోతుంది. ఆ తర్వాత వెంటనే మళ్లీ గ్లూకోజ్ (Glucose) అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో చాలాసేపు పాటు మెదడుకు అందుతూ ఉంటుంది.అత్యవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ )...మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత కీలకమైన కొవ్వు పదార్థాలు ఇవి. అందుకే మెదడుకు అవసరమైన ఈ కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ (ఈఎఫ్ఏ) అంటారు. ఇవే ప్రధాన ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్ అయిన అల్ఫా లినోలినిక్ యాసిడ్ (ఏఎల్ఏ), ఇకోజా పెంటాయినిక్ యాసిడ్ (ఈపీఏ), డొకాజో హెగ్జాయినిక్ యాసిడ్ (డీహెచ్ఏ) వంటివి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మెదడు కణాలన్నీ కేవలం కొవ్వు కణాలే. ఒకరకంగా చూస్తే... మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను దేహం తనంతట తాను తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని ఆహారం నుంచి తీసుకోవాలి. ఆ ఎనెన్షియల్ కొవ్వుల సాయంతోనే మెదడుకు అవసరమైన కీలక కొవ్వు కణాల మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది.ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, ముఖ్యంగా సాల్మన్, మెకరెల్స్, సార్డిన్ వంటి చేపల నుంచి... ఇంకా గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి.మెదడుకు మేలు చేయని కొవ్వులు...మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని రకాల కొవ్వులూ మెదడుకు మంచి చేయవు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా మారుస్తాయి. అవి ఏవంటే... ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు. ఇవి మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ను అడ్డుకుంటాయి. తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే... ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేక్లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అవి మెదడును కాస్త మందకొడిగా చేయడంతోపాటు ఆరోగ్యానికీ అంతగా మేలు చేయవు. అందుకే చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రాన్స్ఫ్యాట్స్ను నిషేధించారు.తినుబండారాలు కొంటున్నారా... తస్మాత్ జాగ్రత్త...మనం మార్కెట్లో కొనే తినుబండారాల ప్యాకెట్లపై ఉండే పదార్థాల జాబితాను తప్పక పరిశీలించాలి. ఒకవేళ అందులో హైడ్రేజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. అదికూడా అరుదుగానే ఎప్పుడైనా తీసుకోవడం మంచిది. మెదడుకు అవసరమైన కొవ్వులు (అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు (Fishes) ఎక్కువగా తినడం అన్ని విధాలా మెదడుకు మేలు చేస్తుంది. ఎందుకంటే చేపల్లో మెదడును చురుగ్గా ఉంచడానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అమైనో యాసిడ్స్...మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ సహాయంతో సమాచారం తాలూకు ట్రాన్స్మిషన్ ఎంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు సహాయపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఇవి మనకు ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి.మన మూడ్స్ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్పైనే...మనకు కలిగే రకరకాల మూడ్స్ కూడా ఈ న్యూరోట్రాన్స్మిటర్స్పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు హాయిగా, గాఢమైన నిద్ర పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్లలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు.విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు)... మెదడు పనితీరు బాగా చురుగ్గా కొనసాగడానికి అవసరమైన పోషకాల్లో అత్యంత ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు చాలా ప్రధానమైనవి. ఇవి అమైనో యాసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్లో మార్చడంలోనూ తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి విటమిన్ బీ–కాంప్లెక్స్లోని బి–1, బి–6, బి–12 ప్రధానంగా అవసరమైవుతాయి. మళ్లీ వీటిన్నింటోనూ విటమిన్ బి–12 ఇంకా కీలకం. ఈ విటమిన్లు తాజా కూరగాయల్లో, ముదురాకుపచ్చటి ఆకుకూరల్లో, పాలలో సమృద్ధిగా దొరుకుతాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి–12 మాంసాహారంలోనే ఎక్కువ. అందుకే... ఇటీవల చాలామంది స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ (వీగన్స్)లోనూ, ఎండ అంతగా సోకనివారిలో (ఎండకు ఎక్కువగా ఎక్స్΄ోజ్ కానివారిలో) విటమిన్ ‘డి’.. ఈ రెండు రకాల విటమిన్ల లోపం కారణంగా వాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయని స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి కారణంగా ఒక్కోసారి వారు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా జరగడాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్’ / ‘సింకోపీ’ అంటారు ఇటీవల ఆధునిక జీవనశైలిలో భాగంగా ఇప్పుడీ కండిషన్ చాలామందిలో కనిపిస్తోంది. ఇలాంటివారంతా డాక్టర్ల సూచన మేరకు విటమిన్–డి సప్లిమెంట్లతోపాటు దేహంలో విటమిన్ బి–12 మోతాదులను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా మనలో విద్యలూ–నైపుణ్యాలు నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది.నీళ్లు...మెదడులోని ఘనపదార్థంలో చాలావరకు కొవ్వులే కాగా... ఇక మొత్తం మెదడులో 80 శాతం వరకు నీళ్లే ఉంటాయి. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మనం మన మూత్రం రూపంలోనూ, అలాగే మనం ఊపిరి వదులుతున్నప్పుడు (ఉచ్ఛాస్వనిశ్వాసల్లో) రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. ఇలా బయటకు పోయే నీటిని ఎప్పటికప్పుడు మళ్లీ భర్తీ చేసుకోవడం అవసరం. దీనికోసం అదేమొత్తంలో మళ్లీ నీటినీ తీసుకోవాలి. అనేక కారణాల వల్ల కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగరు. ఎంతటి తక్కువ మోతాదులో నీళ్లు తాగేవారైనా రోజులో కనీసం 1.5 లీటర్లను తప్పక తీసుకోవాలి. (మిగతా నీళ్ల మోతాదు కాస్తా మనం రోజూ తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంటుంది. ఎవరిలోనైనా వారు రోజులో తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది వాళ్ల వాళ్ల మూడ్స్పై కూడా ప్రభావం చూపేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రతిఒక్కరూ రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకుంంటూ ఉండటం మంచిది. అప్పుడు... నీటితో పాటు తీసుకునే ఆ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇక ద్రవాహారాల్లో టీ, కాఫీల వంటివి డీహైడ్రేషన్ను వేగవంతం చేస్తాయి. అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే టీ, కాఫీలూ, కెఫిన్ ఉండే పానీయాలను చాలా పరిమితంగా (అంటే రోజుకు రెండు కప్పులకు మించకుండా) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే ఆ పానీయాలు తొలుత మెదడును చురుగ్గా చేసినప్పటికీ... ఇలా వేగంగా పనిచేయించడం వల్ల మెదడు అంతే వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రింక్స్వల్ల కూడా ఇదే హాని జరుగుతుంది. మెదడుకి మేలు చేసే ఆహారాలు...మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్నవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలతోపాటు కూరగాయల్లో...పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ–ఆక్సిడెంట్స్ మెదడు కణాలను చాలాకాలం ΄ాటు ఆరోగ్యంగా ఉంచడంతో ΄ాటు అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితో ΄ాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.చేపలు...పండుగప్ప / పండు చేప, వంజరం, కనగర్తలు (మాకరెల్), సాల్మన్, హెర్రింగ్ వంటి చేపల్లో మెదడు చురుకుదనానికి సహాయపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ.నూనెల్లో...మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్త΄ోటును కూడా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అలై్జమర్స్ వ్యాధులను ఆలివ్ ఆయిల్ కొంతమేరకు నివారిస్తుందని చెప్పవచ్చు.పండ్లు...మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీ పండ్లు చాలా మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మేలు చేస్తాయి. - డాక్టర్ హరిత శ్యామ్ .బి, సీనియర్ డైటీషియన్ చదవండి: భాయిజాన్ సల్మాన్ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! -
అమెరికా వదిలేస్తే.. ట్రంప్ ఆపర్
అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని అక్రమ వలసదారుల కోసం క్రేజీ డీల్ ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు దేశాన్ని వదిలి వెళితే వారికి మూడు వేల డాలర్లు అంటే అక్షరాల రూ. 2.68 లక్షలు ఇస్తానని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఏడాది చివరి వరకే ఉంటుందని కండీషన్ విధించింది.ట్రంప్ ఈ పేరు వింటే చాలు యుఎస్లో ఉంటున్న అక్రమ వలసదారులకు కంటిమీద కులుకు ఉండదు. వారిపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బెంబేలిత్తిపోతారు. ఎందుకంటే అధికారం చేపట్టి నాటి నుంచి ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తరిమికొట్టడమే. వారిని దేశం నుంచి పంపించడానికి ట్రంప్ ఎన్నో కఠిన చట్టాలు తెచ్చారు. అయినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో వారు వెళ్లకపోవడంతో ప్రస్తుతం వారి కోసం యూఎస్ గవర్నమెంట్ ఒక డీల్ తెచ్చింది.డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు క్రిస్మస్ ఆపర్ ప్రకటించింది. యూఎస్లో ఉంటున్న అక్రమ వలసదారులు ఎవరైతే తమ దేశాన్ని విడిచి వెళ్లాలనుకుంటారో వారికి డిపార్ట్మెంట్ ఆప్ హోమ్లాండ్ సెక్యురిటీ మూడు వేల డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వారిపైన ఏవైనా జరిమానాలు, ఇతరత్రా ఏమైనా ఉన్నా రద్దు చేస్తామని పేర్కొంది.దాని కోసం ఇది వరకే రూపొందించిన సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ను ఉపయోగించాలని DHS తెలిపింది. అమెరికాను వదిలి వెళ్లాలనుకునేవారు CBP యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారి వివరాలను అందులో నమోదు చేయాలని పేర్కొంది. ఆ తర్వాత వారి ప్రయాణ ఖర్చులు తదితర విషయాలను డిపార్ట్మెంట్ ఆప్ హోమ్లాండ్ సెక్యురిటీ సంస్థ చూసుకుంటుందని తెలిపింది. అక్రమ వలసదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DHS సెక్రటరీ క్రిస్టి నోయోమ్ తెలిపారు.ఒకవేళ అక్రమంగా నివాసముంటూ తమకు పట్టుబడితే వారిని అరెస్టు చేసి బలవంతంగా వారి దేశాలకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా వదిలి అక్రమ వలసదారులకు ట్రంప్ వెయ్యి డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. -
ఆ.. మరీ అంత ఎక్కువా?
అసలు కంటే కొసరు మక్కువ అనేది నానుడి. ఒడిశా అటవీశాఖ అధికారులు చేసిన ఓ పని ఇలాగే ఉంది. అసలు కంటే కొసరు కోసం ఎక్కువ ఖర్చు చేసి వివాదంలో చిక్కుకున్నారు. డిపార్ట్మెంట్ అవసరాల కోసం 51 కార్లు కొన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కార్లు కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కార్లకు అదనపు హంగుల కోసం వెచ్చించిన ధర దాదాపు వాహనాల రేటుకు దగ్గర ఉండడంతో వివాదం రాజుకుంది. అటవీశాఖ అధికారుల కొను గోల్మాల్ బయటపడడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.అటవీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా కంపెనీకి చెందిన 51 థార్ (Thar) ఎస్యూవీలను కొనుగోలు చేసింది. ఒక్కో కారుకు రూ.14 లక్షలు చొప్పున 7 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. తమ విభాగం అవసరాలకు అనుగుణంగా ఈ కార్లలో మార్పులు చేయడానికి అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేయడంతో సమస్య మొదలైంది. మొత్తం 51 వాహనాలకు అదనపు హంగులతో కలిపి రూ. 12.35 కోట్లు వ్యయం అయినట్టు అధికార పత్రాలు ధ్రువీకరించాయి. దీంతో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.నిగ్గు తేల్చాల్సిందే..బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహూ (Arun Kumar Sahoo) గత మార్చి నెలలో ఈ అంశాన్ని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. అటవీశాఖ కొనుగోలు చేసిన వాహనాలకు అయిన ఖర్చు వివరాలు ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్లు కొనడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చయితే, అదనపు హంగులకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా స్పందించారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, నిగ్గు తేల్చాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించారు. వాహనాల కొనుగోలు ప్రక్రియతో పాటు మార్పుల కోసం అయిన ఖర్చులను కూడా పరిశీలించాలని సూచించారు. అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.అనవసరంగా ఖర్చు చేస్తే సహించంవాహనాలకు అదనపు హంగుల కోసం పెట్టిన ఖర్చు సహేతుకమా, కాదా అనేది తేల్చేందుకే ప్రత్యేక ఆడిట్ చేయాలని ఆదేశించినట్టు మంత్రి గణేష్ రామ్ సింగ్ (Ganesh Ram Singh Khuntia) తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో కొన్ని మార్పులు చేస్తుంటారని చెప్పారు. అడవుల్లో విధులు నిర్వహించేందుకు అనువుగా ఉండేలా వాహనాల్లో అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చుతారని తెలిపారు. అయితే అధికంగా లేదా అనవసరంగా చేసే ఎలాంటి ఖర్చునైనా తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు.చదవండి: త్వరలో మోదీ 3.ఓ కేబినెట్ విస్తరణ!మార్పులు అవసరంతాము కొనుగోలు చేసిన వాహనాలకు అవసరానికి మించి ఖర్చు చేశామా, లేదా అనేది ఆడిటింగ్ తేలుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. తమ శాఖ విధులకు అనుగుణంగా వాహనాలకు మార్పులు చేయడం అవసరమని వారు చెబుతున్నారు. ఫ్రంట్లైన్ సిబ్బంది పెట్రోలింగ్, దావానలం నియంత్రణ, వన్యప్రాణుల రక్షణ, కలప అక్రమ రవాణా నివారణ, పర్యాటకుల జంగిల్ సఫారీల కోసం ఈ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, సత్కోసియా టైగర్ రిజర్వ్, డెబ్రిఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సహా ఇతర ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో విధులకు ఈ కస్టమైజ్డ్ ఎస్యూవీలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. -
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది. -
నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలా?
బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా పూనవాలా వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె హై-ఎండ్ డిజైనర్ దుస్తులు, అత్యంత లగ్జరీ ఆభరణాలనే ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారామె. ఇటీవల ఆభరణాల నిపుణుడు, ఫ్యాషన్ కంటెంట్ సృష్టికర్త ధ్రుమిత్ మెరులియా ఆమె అరుదైన పింక్ డైమండ్ రింగ్పై ఫోకస్ పెట్టడమే గాక దాని ప్రత్యేకత, వెనకున్న ఆసక్తికర కథనుకూడా వివరించారు. View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) ఆ రాణికి చెందినది..ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఈ ఉంగరాన్ని మేరీ-థెరెస్ పింక్ డైమండ్ రింగ్ అని పిలుస్తారు అని ధ్రుమిత్ వెల్లడించారు. ఈ ఉంగరం ఫ్రాన్సక్వీన్ మేరీ ఆంటోయినెట్కు చెందినదని తెలిపారు. ఆ ఉంగరం కేంద్ర భాగం పది క్యారెట్ల విలువ చేసే పర్పుల్ అండ్ పింక్ డైమండ్ మోడిఫైడ్ కైట్ బ్రిలియంట్-కట్ డైమండ్. దీని చుట్టూ గుండ్రని 17 వజ్రాలతో అలకరించి నల్లటి ప్లాటినం బ్యాండ్లో ఉంది. అంతేగాదు ఆ మధ్యలోని వజ్రం 18వ శతాబ్దం కాలం నాటిదట. దీనిని క్వీన్ మేరీ ఆంటోయినెట్ కుమార్తె డచెస్ మేరీ-థెరిస్ డి'అంగోలేమ్ వారసత్వంగా పొందారు. ఈ ఉంగరం 1996లో విక్రయించబడే వరకు చాలా ఏళ్లు రాజకుటుంబం ఆభరణాల కలెక్షన్స్లో ఉండేదట.అంత ఖరీదా..?అయితే ప్రఖ్యాత ఆభరణాల డిజైనర్ జోయెల్ ఆర్థర్ రోసెంతల్ వజ్రం కోసం కొత్త బ్యాండ్ను రూపొందించారు. జూన్ 17, 2025న, ఈ ఉంగరాన్ని న్యూయార్క్లోని క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో దాదాపు రూ.125 కోట్లు పైనే అమ్ముడుపోయిందట. ఫ్రెంచ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఉంగరంగా వార్తల్లో నిలిచింది కూడా. కాగా, బిలియనీర్ అదర్ పూనవాలాను వివాహం చేసుకున్న నటాషా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంతేగాదు ఆమె విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం విల్లూ పూనవల్లా ఛారిటబుల్ ఫౌండేషన్కు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే నెదర్లాండ్స్లోని పూనావాలా సైన్స్ పార్క్ డైరెక్టర్గా, బ్రిటిష్ ఏషియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ చైర్గా కూడా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) (చదవండి: వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి..చివరికి ర్యాపిడో డ్రైవర్గా! మనసు మెలిపెట్టే భావోద్వేగ కథ) -
సంచలన అత్యాచార కేసులో నేరస్తుడికి శిక్ష రద్దు, బెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, జీవితఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేయడం సంచలనంగా మారింది.జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం సెంగర్కు బెయిల్ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా హైకోర్టు సెంగర్ను ఆదేశించింది. వీటిల్లో ఏ షరతును ఉల్లంఘించినా అతని బెయిల్ రద్దు అవుతుందని కోర్టు తెలిపింది.అత్యాచారం కేసులో సెంగర్ తన దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్లో ఉండే వరకు ఆయన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అత్యాచారం కేసులో డిసెంబర్ 2019 ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాలు చేశాడు. 2019, ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలీ చేశారు.అసలు కేసు ఏంటి?2017లో బీజేపీ నేతగా ఉన్న కుల్దీప్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ తరువాత బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ మరింత ఆందోళన రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ అతణ్ని పార్టీనుంచి తొలగించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో తన దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఇప్పటికే గణనీయమైన సమయం జైలులోగడిపినందున శిక్షను నిలిపివేయాలని కూడా కుల్దీప్ అప్పీలు చేశాడు. ఇది పెండింగ్లో ఉంది. -
‘పవన్ అంటే.. ఓవరాక్షన్.. ఇరిటేషన్.. కన్ఫ్యూజన్’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్లో ఓవరాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..పాలన చేతకాక వైఎస్సార్సీపీని తిడుతున్నాడు.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. -
పాక్ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.ఫైనల్లో పాక్ గెలుపుఏసీసీ మెన్స్ ఆసియా కప్ (యూత్ వన్డే)-2025 టోర్నమెంట్ దుబాయ్ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్- పాకిస్తాన్.. గ్రూప్-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్ దశలో పాక్ను భారత్ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్గా నిలిచింది.ఇక ఆసియా కప్ అండర్-19 టైటిల్ను భారత్ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. పాక్ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత అండర్-19 ఆటగాళ్లు టీమ్ బస్ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్ హుందాగా ప్రవర్తించడం విశేషం.ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్ ఫ్యాన్స్ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్-19 ఆసియా కప్ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్ ఎందుకు?చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.చదవండి: వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు?Pakistan’s fans are acting shamelessly and they have no sense of shame whatsoever.👀These people are booing 14-year-old Vaibhav Suryavanshi just because Pakistan won a ‘cheap’ U19 Asia Cup. They’re acting like Pakistan won the World Cup.🤦🏻This is why Pakistani people have no… pic.twitter.com/D1X6lgshr0— Mention Cricket (@MentionCricket) December 22, 2025 -
జీడీపీ డేటా కొత్త సిరీస్: కేంద్రం ప్రకటన
మార్చిన బేస్ ఇయర్తో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డేటా సిరీస్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ వెల్లడించింది. అలాగే పారిశ్రామికోత్పత్తి కొత్త సిరీస్ను మే నెల నుంచి ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.దీని ప్రకారం 2024 బేస్ ఇయర్గా (100కు సమానం) రిటైల్ ద్రవ్యోల్బణం కొత్త సిరీస్ 2026 ఫిబ్రవరి 12న విడుదల అవుతుంది. అలాగే, 2022–23 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్గా నేషనల్ అకౌంట్స్ డేటాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న, ఐఐపీ డేటా మే 28న విడుదల చేస్తారు. -
మరో టీ20 లీగ్.. ఐపీఎల్ తర్వాత ఏ లీగ్కు ఆదరణ ఎక్కువ..?
పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో లీగ్ సిద్దమైంది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL T20) ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ లీగ్ 2018లోనే ప్రారంభమైంది. అయితే వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ, చివరికి ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్దమైంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడదలైంది.APL T20 లీగ్ యూఏఈలో జరుగనున్నా, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలోనే జరుగుతుంది. తొలి ఎడిషన్ తరహాలోనే 2026 ఎడిషన్లోనూ ఐదు ఫ్రాంచైజీలు (బాల్ఖ్ లెజెండ్స్, కాబూల్ జ్వానన్, కందహార్ నైట్స్, నంగర్హార్ లియోపార్డ్స్, పక్తియా పాంథర్స్) పాల్గొంటాయి. తొలి ఎడిషన్లో బల్క్ లెజెండ్స్ విజేతగా నిలిచింది. ఈ లీగ్లో కూడా ఇతర లీగ్ల్లో లాగే భారత ఆటగాళ్లు మినహా ప్రపంచవాప్తంగా ఉండే ఆటగాళ్లు పాల్గొంటారు.ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ రీఎంట్రీ వార్త నేపథ్యంలో ప్రైవేట్ టీ20 లీగ్లకు సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఐసీసీ ఫుల్టైమ్ మెంబర్గా ఉండే ప్రతి దేశంలో ఓ ప్రైవేట్ టీ20 లీగ్ జరుగుతుంది. వీటిలో భారత్లో జరిగే ఐపీఎల్కే ఆదరణ ఎక్కువన్నది కాదనలేని సత్యం. అయితే, ఐపీఎల్ తర్వాత రెండో స్థానం ఏ లీగ్దన్నదే ప్రస్తుత చర్చ.ఆదరణ ప్రకారం చూసినా, బిజినెస్ పరంగా చూసినా ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్దే రెండో స్థానమన్నది బహిరంగ రహస్యం. ఐపీఎల్ మొదలైన మూడేళ్ల తర్వాత పురుడుపోసుకున్న ఈ లీగ్, ప్రారంభ దినాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా, క్రమంగా ఆదరణ చూరగొంది. ఈ లీగ్లో ఆస్ట్రేలియా జాతీయ జట్ల స్టార్లందరూ పాల్గొనడంతో పాటు భారత్ మినహా ప్రపంచ క్రికెట్ స్టార్లంతా పాల్గొంటారు. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్ కూడా సదీర్ఘంగా సాగుతుంది.ఐపీఎల్, బీబీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఏదంటే.. 2023లో ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్ అని చెప్పాలి. ఈ లీగ్లో కూడా బీబీఎల్ తరహాలోనే స్థానిక స్టార్లు, విదేశీ స్టార్లు పాల్గొంటారు. SA20లో ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే కావడం విశేషం. పారితోషికాల విషయంలో ఈ లీగ్ ఐపీఎల్కు దగ్గరగా ఉంటుంది. ఈ లీగ్ పుణ్యమా అని సౌతాఫ్రికా టీ20 జట్టు చాలా పటిష్టంగా తయారయ్యిందనే టాక్ ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్ తర్వాత ఇంచుమించు అదే స్థాయి ఆదరణ కలిగిన లీగ్గా ఇంటర్నేషనల్ టీ20 లీగ్కు పేరుంది. దుబాయ్లో జరిగే ILT20, సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభమైన 2023వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఈ లీగ్లో కూడా చాలావరకు ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ లీగ్ నాలుగో ఎడిషన్ నడుస్తుంది.SA20, ILT20 తర్వాత ఇప్పుడిప్పుడే యూఎస్ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ఇంగ్లండ్లో జరిగే ద హండ్రెడ్ లీగ్లకు ఆదరణ పెరుగుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ 2023లో ప్రారంభం కాగా.. హండ్రెడ్ లీగ్ 2021లో మొదలైంది. హండ్రెడ్ లీగ్ 100 బంతుల ఫార్మాట్లో జరిగినా టీ20 ఫార్మాట్ పరిధిలోకే వస్తుంది.ఈ లీగ్ల కంటే చాలా ముందుగానే ప్రారంభమైనా పాకిస్తాన్లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (2016), బంగ్లాదేశ్లో జరిగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2012), వెస్టిండీస్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (2013), శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ (2020) పెద్దగా సక్సెస్ కాలేదు. పైన పేర్కొన్న లీగ్లతో పోలిస్తే ఈ లీగ్ల్లో ఆటగాళ్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ల్లో పాల్గొనేందుకు పెద్దగా సుముఖత చూపారు. దీంతో ఆటోమేటిక్గా ఈ లీగ్లకు ఆదరణ తక్కువగా ఉంటుంది. పీఎస్ఎల్ లాంటి లీగ్ ఐపీఎల్కు తాము సమానమని జబ్బలు చరుచుకుంటున్నా, ఆ లీగ్లో ఆడేందుకు చాలామంది విదేశీ స్టార్లు ఇష్టపడరు. భద్రతా కారణాలు, సదుపాయాల లేమి, పారితోషికాలు తక్కువగా ఉండటం లాంటి కారణాల చేత విదేశీ ప్లేయర్లు ఈ లీగ్ ఆడేందుకు రారు.ఐపీఎల్తో పోలిస్తే ఆటగాళ్ల పారితోషికాలు పీఎస్ఎల్లో కనీసం పావు శాతం కూడా ఉండవు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కెమరూన్ గ్రీన్కు రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్ల భారీ మొత్తం దక్కింది. పీఎస్ఎల్లో ఇంత మొత్తంలో పది శాతం కూడా ఆ దేశ స్టార్ క్రికెటర్కు దక్కదు. -
యువతికి వేధింపులు : హౌసింగ్ సొసైటీపై రూ.62లక్షల దావా, చివరికి
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బాధిత యువతి రెడ్డిట్లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్లో వెల్లడించింది.మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.సోషల్ మీడియా ప్రశంసలుఆమె పోస్ట్లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు. -
దురంధర్ తెలుగు వర్షన్.. రిలీజ్ కాకపోవడానికి అదే కారణమా?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్ ఆడియన్స్కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్ను సౌత్ భాషల్లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.అదే కారణమా?అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అందుకే డబ్బింగ్ వర్షన్తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓటీటీలో చూడాల్సిందేనా..?ఇక సౌత్ భాషల్లో దురంధర్ను థియేటర్లలో చూసే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్ డబ్బింగ్ వర్షన్ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. -
ఆ అందాల నటి వయసు 92 ...ఆరోగ్య రహస్యం ఇదే...
చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.నాట్యమే...ఆరోగ్యంఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.మితాహారం...యోగా ధ్యానం...ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు. ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్మెంట్లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం. -
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు. -
సీఎం చిట్చాట్ల పేరుతో దాక్కోవద్దు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ల పేరుతో దాక్కోవడం కాదు దమ్ముంటే బయిటకొచ్చి కేసులపై మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం నల్గొండలో నిర్వహించిన బీర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ లీకులిస్తుందని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ గర్జిస్తే కాంగ్రెస్ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోయారని వారికి ఆ దమ్ములేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్కు లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపైనే ఉండాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడకూడదని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఆదివారం జరిగిన బీఆర్ఎస్సీఎల్పీ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు బీఆర్ఎస్కు మరింత అనుకూలంగా ఉండేవన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్కు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. దానితో పాటు 2023లో బీఆర్ఎస్ హాయాంలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా వన్ రేసు అవినీతి కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. -
Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ వన్డే టోర్నమెంట్ బరిలో దిగనున్నాడు. ఆంధ్ర జట్టుతో బుధవారం (డిసెంబరు 24) నాటి మ్యాచ్ సందర్భంగా కోహ్లి మరోసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెప్టెన్.ఇక ఐపీఎల్లో కోహ్లి ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి సొంత మైదానం అయిన.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక కావడం మరో విశేషం. కాగా 2010లో కోహ్లి చివరగా విజయ్ హజారే ట్రోఫీ (VHT) టోర్నీ ఆడాడు. సర్వీసెస్తో మ్యాచ్లో ఢిల్లీ తరఫున 16 పరుగులు సాధించాడు.వరుస సెంచరీలుఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో ధనాధన్ ఫిఫ్టీతో ఫామ్లోకి వచ్చాడు.అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగి ఆకట్టుకున్నాడు. ప్రొటిస్తో తొలి వన్డేల్లో ఏకంగా 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో వన్డేలోనూ 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 53 శతకాలతో ఆల్టైమ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రొటిస్తో మూడో వన్డేలోనూ కేవలం 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు కోహ్లి.చరిత్రకు ఒక్క పరుగు దూరంలోఅంతర్జాతీయ వన్డే కెరీర్లో 14557 పరుగులు చేసిన కోహ్లి.. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో ఓవరాల్గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రతో బుధవారం నాటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్కు ముందు చరిత్రకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి ఆంధ్రతో మ్యాచ్లో ఒక్క రన్ చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్లో 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత రెండో క్రికెటర్గా నిలుస్తున్నాడు.ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీ, భారత్-ఎ, జోనల్ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్గా ఈ లిస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 22,211 పరుగులతో టాప్లో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు👉సచిన్ టెండుల్కర్- 538 ఇన్నింగ్స్లో 21,999 రన్స్👉విరాట్ కోహ్లి- 329 ఇన్నింగ్స్లో 15,999 రన్స్👉సౌరవ్ గంగూలీ- 421 ఇన్నింగ్స్లో 15,622 రన్స్ 👉రోహిత్ శర్మ- 338 ఇన్నింగ్స్లో 13,758 రన్స్👉శిఖర్ ధావన్- 298 ఇన్నింగ్స్లో 12,074 రన్స్.చదవండి: వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు? -
అక్కడేమో సెంచరీల మోత.. ఇక్కడేమో ఇలా..!
భారత పురుషుల అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తాజాగా ముగిసిన ఆసియా కప్లో దారుణంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఈ టోర్నీలో సహచరులంతా రాణించినా (పాక్తో జరిగిన ఫైనల్ మినహా) మాత్రే ఒక్క మ్యాచ్లో కూడా సత్తా చాటలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో కలిపి 13 సగటున, 112 స్ట్రయిక్రేట్తో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో దారుణ పరాజయం వరకు మాత్రే వ్యక్తిగతంగా విఫలమైనా, జట్టును విజయవంతంగా నడిపించాడన్న తృప్తి ఉండేది. అయితే ఫైనల్లో వ్యక్తిగత వైఫల్యాలను కొనసాగించడంతో పాటు టాస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులకు మాత్రే టార్గెట్ అయ్యాడు. పిచ్ను అంచనా వేయడంలో విఫలమైన మాత్రే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై మాత్రే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్దికి భారీ పరుగులు చేసే ఆస్కారమిచ్చాడు. ఆతర్వాత లక్ష్య ఛేదనలో నిర్లక్ష్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మాత్రే వికెట్తోనే టీమిండియా పతనం మొదలైంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 156 పరుగులకే చాపచుట్టేసి 191 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ ఓటమి తర్వాత టోర్నీ మొత్తంలో వ్యక్తిగతంగా, ఫైనల్లో కెప్టెన్గానూ విఫలమైన ఆయుశ్ మాత్రేపై ముప్పేటదాడి మొదలైంది. దాయాది చేతిలో ఘెరంగా ఓడినందుకుగానూ భారత క్రికెట్ అభిమానులు అతన్ని సోషల్మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. ఎంతో గొప్ప ఆటగాడు, కెప్టెన్ అవుతాడనుకుంటే పాక్ చేతిలో ఘోరంగా ఓడి భారత్ పరువు తీశాడంటూ అభిమానులు అక్షింతలు వేస్తున్నారు. ఈ ఓటమి మాత్రే కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.వాస్తవానికి ఆయుశ్ మాత్రే స్థాయి ఇది కాదు. టెక్నికల్గా వైభవ్ సూర్యవంశీ లాంటి వారి కంటే చాలా బెటర్ బ్యాటర్. అయినా ఆసియా కప్లో మాత్రే ఎందుకో రాణించలేకపోయాడు. కొద్ది రోజుల ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్లతో పరుగుల వరద పారించిన అతను.. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చే సరికి తేలిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో మాత్రే 6 ఇన్నింగ్స్ల్లో 108.33 సగటున, 166.67 స్ట్రయిక్రేట్తో 325 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆసియా కప్కు వచ్చే సరికి మాత్రే ఈ సూపర్ ఫామ్ను కొనసాగించలేకపోయాడు. ఇది గమనించిన అభిమానులు రోజుల వ్యవధిలో ఇంత మార్పేంటని అనుకుంటున్నారు. మొత్తంగా ఆసియా కప్లో మాత్రే వ్యక్తిగతంగా, కెప్టెన్గా విఫలమై కెరీర్లో మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ఈ వైఫల్యాలు ఈ యువ బ్యాటర్పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. ముంబైకి చెందిన 18 ఏళ్ల మాత్రే ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో పేరు తెచ్చుకుంటున్నాడు. గత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన మాత్రే సీఎస్కే తరఫున మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆకట్టుకున్నాడు. ఫలితంగా సీఎస్కే అతన్ని తదుపరి సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. మాత్రే ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 660 పరుగులు.. 7 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 458 పరుగులు.. 13 టీ20ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 565 పరుగులు చేశాడు. -
రాయదుర్గం: ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కూతుళ్లను చంపిన కసాయి తండ్రి కల్లప్ప.. బళ్లారి సమీపంలోని హైలెవల్ కెనాల్లో తోసేశాడు. చిన్నారుల అనసూయ (9), చంద్రకళ (10) మృతి చెందారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఘటన జరిగింది.దైవ దర్శనం కోసమని చెప్పి ఇద్దరు కూతుళ్లను చంపిన కల్లప్పకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్గా!
ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.ఏం జరిగిందంటే.. చిరాగ్ తన పోస్ట్లో "ఇవాళ ర్యాపిడో బైక్లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్లో రాసుకొచ్చాడు."ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.Life is so unfair, man. I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff. Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025 (చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే..) -
హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. సారీ చెప్పిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో శివాజీపై మహిళ నటీమణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అనసూయ శివాజీ కామెంట్స్పై తమదైన శైలిలో స్పందించారు. సినీతారలతో పాటు నెటిజన్స్ సైతం శివాజీపై మండిపడుతున్నారు. ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ పేరును ప్రసావించకుండానే ఆయన తరఫున క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు. నిన్న రాత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఈ నాగరిక సమాజం మహిళల నిర్ణయాల, ఇష్టాలు, వారి హక్కులను పరిరక్షిస్తుందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.మంచు మనోజ్ తన నోట్లో ప్రస్తావిస్తూ.. 'హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఇలాంటి దుస్తులే మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం ఏ మాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తుల ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవ పరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం' అని రాసుకొచ్చారు. Came across some deeply disappointing comments last night. A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025 -
లగ్జరీ హోటల్లో ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య, మాజీ భర్త అరెస్ట్
దుబాయ్లోని లగ్జరీ హోటల్లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్లో క్రూ మెంబర్గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో శవమై తేలింది. దుబాయ్లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్ -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్లు లేదా 0.024 శాతం నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి.ఓమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్, ప్రిజం జాన్సన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ష్రెనిక్ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగ్లాలో మరో ఘాతుకం.. హిందూ కుటుంబంపై దాడి
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. అయితే దీనికి తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు వారి ఇళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు.బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆ దేశంలో దాదాపు 258 మైనార్టీలపై దాడుల ఘటనలు జరుగగా 27మంది దాకా ప్రాణాలు వదిలారు. వారిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అక్కడి మతతత్వవాదులు దీపు చంద్రదాస్ అనే ఓ యువకుడిని తీవ్రంగా కొట్టిచంపారు. ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరవకముందే తాజాగా అక్కడి చట్టోగ్రామ్ ప్రాంతంలో ని ఓ హిందూ కుటుంబంపై అక్కడి అల్లరిమూకలు దాడిచేశాయి.చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఒక అల్లరి మూక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారి ఇళ్లుని ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు.అనంతరం వారిని హెచ్చరిస్తూ అక్కడ ఒక నోట్ ఉంచారు అందులో " ఈప్రదేశంలో ఉండే హిందువులను మేము గమనిస్తున్నాము. మీరు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయు. వెంటనే ఆ కార్యకలాపాలు ఆపండి. లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది అని బెంగాలీ భాషలో రాశారు.ఒకవేళ మా హెచ్చరికను మీరు పాటించకపోతే హిందూ సమాజానికి చెందిన వారి ఆస్తులను, వ్యాపారాలను, నివాసాలను వేటిని వదిలిపెట్టబోమన్నారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరంటూ వారిని హెచ్చరిస్తూ రాశారు. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అలా వచ్చి నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ మరో సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్లో వచ్చిన నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడుస్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5 కూడా వచ్చేస్తోంది.స్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5లోని 5,6,7 ఎపిసోడ్లు డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులోని చివరి ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 2022లో రిలీజైన సీజన్-4 అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్గా నిలిచింది. దీంతో ఈ సిజన్పై కూడా ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్కు రాస్ డఫర్ దర్శకత్వం వహించారు. Hitman aa raha hai upside down ko seedha karne ❤️🔥Watch Stranger Things 5: Volume 2, out 26 December at 6:30 AM IST, only on Netflix.#Collab pic.twitter.com/V9F1B4izDM— Netflix India (@NetflixIndia) December 23, 2025 -
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో బాధితురాలే అరెస్ట్
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ కేసులో బాధితురాలినే పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి డైరెక్షన్లో విచారణ చేసిన పీఏను కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు.. కేసు పెట్టిన బాధితురాలినే అరెస్ట్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగంతో నిందితులను కాపాడిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్ సైబర్ క్రైమ్ అంటూ కేసు పక్కదారి పట్టించారు.మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ పై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. టీచర్గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని, లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే, లైంగికదాడి కేసులో నిందితుడు సతీష్ను ఇప్పటివరకు టచ్ చేయని పోలీసులు.. బాధితురాలినే అరెస్ట్ చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. కాగా, బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. -
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఓ బౌలర్ ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలాంటి ఫీట్ నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో గరిష్టంగా ఓ ఓవర్లో నాలుగు వికెట్ల ఫీట్ నమోదైంది. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 2019లో న్యూజిలాండ్పై నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.ఓవరాల్గా (అంతర్జాతీయం, దేశవాలీ, ప్రైవేట్ టీ20 లీగ్లు) చూస్తే.. ఓ ఓవర్లో ఐదు వికెట్ల ఘనత ఇదివరకే రెండు సార్లు నమోదైంది. దేశవాలీ టీ20 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్కు చెందిన అల్-అమిన్ హొసైన్, కర్ణాటకకు చెందిన అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించారు.చరిత్ర సృష్టించిన గెడే ప్రియందనాఅంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో, అందులోనూ తన తొలి ఓవర్లోనే ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా (పురుషులు లేదా మహిళలు) ఇండొనేషియాకు చెందిన గెడే ప్రియందనా చరిత్ర సృష్టించాడు. బాలి వేదికగా కాంబోడియాతో జరిగిన మ్యాచ్లో ప్రియందనా ఈ చారిత్రక ఘనత సాధించాడు.ఇండోనేషియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కాంబోడియా చేధించే క్రమంలో ఈ ఫీట్ నమోదైంది. కాంబోడియా స్కోర్ 15 ఓవర్లలో 106/5 వద్ద ఉండగా.. మీడియం పేసర్ అయిన ప్రియందనా ఒక్కసారిగా చెలరేగిపోయాడు. 16వ ఓవర్ తొలి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆతర్వాత నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా.. ఐదు, ఆరు బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్లను ఔట్ చేసి ఐదు వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఓవర్లో ఒక్క రన్ (వైడ్) మాత్రమే వచ్చింది. ప్రియందనా ఉన్నపళంగా కాంబోడియా ఇన్నింగ్స్ను కుప్పకూల్చడంతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ధర్మ కేసుమా విధ్వంసకర శతకంతో (68 బంతుల్లో 110 నాటౌట్) చెలరేగడంతో ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. -
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..22 మంది లొంగుబాటు
వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఏవోబీలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 22మంది నక్సల్స్ లొంగిపోయారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మావోయిస్టుల వద్ద ఉన్న 14 ల్యాండ్మైన్లను పోలీసులకు అప్పగించారు. వీరందరిపై రూ.2.18కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.మార్చి 2026 నాటికి దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయుధబలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో నక్సల్స్పై విరుచుకపడుతున్నాయి. దీంతో పెద్దఎత్తున మావోయుస్టులు ఎన్కౌంటర్లలో మరణిస్తున్నారు. అంతే స్థాయిలో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భవితత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
‘శివ’ చూసి ‘ఓం’ స్క్రిప్ట్ మొత్తం మార్చేశా: ఉపేంద్ర
తెలుగు సినిమా చరిత్ర,ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘శివ’. అప్పటివరకు తెలుగు తెరపై చూడని బొమ్మని శివలో చూపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే తెలుగు సినిమాను శివకు ముందు.. శివకు తర్వాత అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సినిమా ప్రభావం తెలుగు తెరకే పరిమితం కాలేదు.. అన్ని భాషల చిత్రాలకు మరో కొత్త మార్గం చూపించింది. ఎంతలా అంటే.. కన్నడ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ‘ఓం’ సినిమా స్క్రిప్ట్నే మార్చేసేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఓం దర్శకుడు ఉపేంద్రనే చెప్పాడు.తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను కాలేజీ రోజుల్లోనే ఒక గ్యాంగ్స్టర్ కథ రాసుకున్నాను. కానీ ‘శివ’ విడుదలైన తర్వాత నా కథ దాదాపు ఒకేలా ఉందని గ్రహించాను. ప్లాగియారిజం ఆరోపణలు రాకుండా స్క్రిప్ట్ను పూర్తిగా మార్చేశాను. రెండేళ్లు కష్టపడి కొత్త స్క్రీన్ప్లేతో ‘ఓం’ను తెరకెక్కించాను” అని చెప్పారు.శివరాజ్కుమార్ హీరోగా నటించిన ఓం కన్నడ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్గా నిలిచి, అత్యధిక సార్లు (550కు పైగా) రీ-రిలీజ్ అయిన రికార్డును సృష్టించింది. 'ఓం'కు ప్రేరణ తన స్నేహితుడు పురుషోత్తమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అని ఉపేంద్ర గతంలో వెల్లడించారు. 'శివ' చిత్రం తెలుగు సినిమాను మార్చేసినట్లే, 'ఓం' కన్నడ ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ జోనర్కు కొత్త ఒరవడి ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా తన 'సత్య' చిత్రానికి 'ఓం' నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర, శివరాజ్కుమార్ కలిసి అర్జున్ జన్య దర్శకత్వంలో ‘45’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది."When I saw #Shiva, I left that script for two years and it kept haunting me. Then I thought of making the screenplay of #OM in a different way."– #Upendra | #NagarjunaAkkineni pic.twitter.com/A6mkbLvCNQ— Whynot Cinemas (@whynotcinemass_) December 22, 2025 -
నువ్వా నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్
నటుడు శివాజీ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించాడు. హీరోయిన్ల దుస్తులు, ఆడవాళ్లు, అందం, చీర సాంప్రదాయం అంటూ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మహిళల వేషధారణపై తీవ్ర అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడాడు. మాటల్లో చెప్పలేనంతగా నోటి కొచ్చినట్టు రెచ్చిపోయాడు. దీనిపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళను ఒక మనిషిగా చూడలేని శివాజీ, వారి శరీరాలను ‘సామాను’గా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ,ఇతర సినీ సెలబ్రిటీలపై అభిమానం పేరుతో కొంతమంది ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటనపై పరోక్షంగా స్పందిస్తూ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై నటుడు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఒక ఈవెంట్కు వచ్చిన నటీమణులపై సభ్యత మరచి సంస్కార హీనంగా ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పాల్సిందిపోయి సెలబ్రిటీల వేషధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్దూరంగా నిలిచింది. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందటతినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న చందంగా అంటూ శివాజీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. పురుషాధిక్య భావజాలం, ఫ్యూడల్ మనస్తత్వంతో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. అరకొరా సినిమాలతో అల్లాడుతున్న శివాజీ బిగ్బాస్ సీజన్-7తో తిరిగి ఫామ్లోకి వచ్చాడనీ, అలా అనుకోకుండా అందివచ్చిన ఫేమ్తో వాపును చూసి బలుపు అని విర్రవీగుతున్నాడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బిగ్బాస్ హౌస్లో కూడా బూతుల పురాణంతో రెచ్చిపోయిన వైనాన్ని, హోస్ట్ నాగార్జున (Nagarjuna) గడ్డి పెట్టిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. బహిరంగ వేదికల మీద మహిళలపై హద్దూ పద్దు లేకుండా నోటికి ఎంత వస్తే మాట్లాడటం, పైగా ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటూ తెగింపు ప్రదర్శిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.గొంగట్లో తింటూసినిమాలో ఎక్స్పోజింగ్ చేయలేదా, వెర్రిమొర్రి డ్యాన్స్లు చేయలేదా, సినిమాలు లేక వాడి వీడి కాళ్లు పట్టుకుని నాలుగు అవకాశాలు రాగానే ఇలా నీతి సూక్తులు చెప్తున్నాడని మరి కొంతమంది మండి పడు తున్నారు. అసలు సంప్రదాయాల్ని, మహిళల గౌరవాన్ని మంటగలింపిందే సినిమాలు కదా అని గుర్తు చేస్తున్నారు. ఏమి అందంగా కనిపించారని అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై, వృద్ధ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, బహిరంగ వేదికలపై ఇలాంటి చెత్తను, మగ దురహంకారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భవిష్యత్తరాలకు ఏం సందేశమిస్తున్నావంటూ నిలదీస్తున్నారు. నీతి సూత్రాలు నీకు తగవు బాసూఅంతేకాదు ఎంతోమంది మహిళా నటులను వేధించిందీ, అవకాశాల కోసం వారిని లైంగికంగా వేధించిన నీ చరిత్ర మర్చిపోయావా దొరా? ఇపుడు నీతి సూక్తులు వల్లిస్తున్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహిళలు వస్త్రాధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీపై ఇప్పటికే గాయని చిన్మయి, నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. -
ఆశ్చర్యపరిచే నిర్ణయాలు!
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.ఓ ప్రభుత్వం మరోసారి ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోబోతోంది. యువతను ప్రోత్సహించేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. యువ నాయకత్వంపై మోదీ సర్కారు ఫోకస్ పెంచింది. ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర కేబినెట్లో యువ నేతలకు మరిన్ని కొలువులు కట్టబెట్టడానికి కసరత్తు చేస్తోంది. మోదీ 3.ఓ కేబినెట్లో యువతరానికి త్వరలో తగిన ప్రాధాన్యం దక్కబోతోంది. దీనికి కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో కమలనాథులు ఫుల్ జోష్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిల్లోనూ ఇదే జోరు చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యాచరణలోకి దిగిపోయారు. వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మధ్యలో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీదీని నాలుగోసారి సీఎం కాకుండా అడ్డుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు బెంగాల్ పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగాల్లో సభలు నిర్వహిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఆశ్చర్యపరిచే నిర్ణయాలుపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ సర్కారు ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు 'ది సండే గార్డియన్స్ నివేదించింది. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 45 ఏళ్ల నితిన్ నబీన్ను (Nitin Nabin) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి అందరినీ బీజేపీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే విధంగా బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవరూ ఊహించని నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.యువతకు పెద్దపీటపార్టీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి కేంద్ర కేబినెట్లో పెద్దపీట వేయనున్నారని సమాచారం. ఒకవేళ బెంగాల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆ రాష్ట్రం నుంచి మరికొంత మందికి కేబినెట్ బెర్త్లు దక్కే చాన్స్ ఉంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన పనితీరు కనబరిస్తే.. ఇద్దరు పూర్తిస్థాయి కేంద్ర మంత్రులను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమచారం.పనితీరే గీటురాయిజాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ను ఎంపిక చేయడానికి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో దాదాపు వాటినే కొత్త మంత్రుల ఎంపికలో పాటిస్తారని తెలుస్తోంది. ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడంతో పాటు ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టగల యువ నాయకులకు అవకాశం ఇస్తారని సమాచారం. పార్టీకి ఎక్కువ కాలం పాటు బాధ్యతలు చేపట్టగల సామర్థ్యంతో పాటు, స్థిరమైన సంస్థాగత పనితీరుతో మంచి ఫలితాలు రాబట్టగలిగే యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూనే.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా ఎంపికలు ఉంటాయని సమాచారం.చదవండి: కలిసి వస్తున్నాం.. కాస్కోండి!కేబినెట్లో 10 ఖాళీలు!ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 72 మంది మంత్రులు ఉన్నారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 81 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత కేబినెట్లో 9 ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) బీజేపీ ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో కేబినెట్లో ఖాళీల సంఖ్య 10కి చేరుతుంది. ప్రధానిగా తన రెండవ హయాంలో 78 మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించారు. దీని ప్రకారం చూసుకున్నా ప్రస్తుత మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి బెంగాల్ ఎన్నికలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో! -
60లో కూడా సల్మాన్లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్ఖాన్కి ఈ డిసెంబర్ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్గా ఫిట్గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్నెస్ ఐకాన్' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుల.అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్ఓ.డైట్ ఎలా ఉండాలంటే..ఉదయం: 5 ఎగ్వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.చదవండి: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే.. -
వైభవ్.. దూకుడు ఒక్కటే కాదు!
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే విధ్వంసకర బ్యాటింగ్తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొన్న యువ సంచలనం అతడు. ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయష్కుడైన ఆటగాడిగా నుంచి.. అండర్-19 స్థాయిలో మెరుపు సెంచరీలు బాదడం వరకు అతడి ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. అయితే అంతర్జాతీయ అరంగేట్రానికి అడుగు దూరంలో నిలిచిన వైభవ్.. కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. వైభవ్కు అద్భుతమైన టాలెంట్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జూనియర్ క్రికెట్కు సీనియర్ క్రికెట్కు చాలా తేడా ఉంటుంది.హిట్టింగ్ ఒక్కటే కాదు..క్రికెట్ ఒక చదరంగం వంటిది. ఎక్కడ ఎత్తుకు పై ఎత్తు వేయాలో.. ఎక్కడ తగ్గాలో స్పష్టంగా తెలియాలి. సీనియర్ స్ధాయిలో రాణించాలంటే కేవలం హిట్టింగ్ చేసే సత్తా ఉంటే సరిపోదు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచినప్పటికి.. తమ శైలికి విరుద్దంగా ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియాకప్నే ఉదాహరణగా తీసుకుందాం.యూఏఈ, మలేషియా వంటి పసికూనలపై విధ్వసంకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డ వైభవ్.. కీలకమైన ఫైనల్లో పాకిస్తాన్పై మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జట్టుకు కావాల్సింది ఇది కాదు. నిలకడగా ఆడి తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవాలి. అప్పుడే జట్టు విజయాల్లో సదరు ఆటగాడు భాగం అవుతాడు. వైభవ్ త్వరగా ఔట్ కావడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదే వైభవ్ ఒక పది పదేహేను ఓవర్ల పాటు కాస్త ఆచితూచి ఆడి క్రీజులో నిలబడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. పరిస్థితికి తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. ఎప్పుడు డిఫెన్సివ్గా ఆడాలి.. ఎప్పుడు ఎటాక్ చేయాలో తెలుసుకోవాలి. ఈ విషయంలో అతడు ఇంకా పరిణితి చెందాలి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం,షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో సూర్యవంశీ ఇంకా మెరుగుపడాలి.టాలెంట్ ఉంటే సరిపోదు..క్రికెట్ వంటి జేంటిల్ మ్యాన్ గేమ్లో నిలదొక్కకోవాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు.. మన ప్రవర్తన కూడా ముఖ్యం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ బౌలర్ అలీ రాజా- వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైభవ్ను ఔట్ చేసిన అనంతరం అలీ రాజా స్లెడ్జ్ చేశాడు. అయితే తన సహనాన్ని కోల్పోయి వైభవ్.. తన కాలి షూ వైపు చూపిస్తూ దుర్భాషలాడాడు. ఈ విషయంపై బీసీసీఐ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మైదానంలో దూకుడు అవసరమే కానీ.. అది హుందాతనాన్ని దాటకూడదు.హద్దు దాటకూడదు..కాగా క్రికెటర్గా చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను, డబ్బును హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. వైభవ్ అతి పిన్న వయస్సులోనే రాజస్తాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు ఓవర్నైట్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. అంతేకాకుండా పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి ఒక హోదా పొందిన వైభవ్ తన కెరీర్ పక్క త్రోవపట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. పృథ్వీ షాను తన కెరీర్ ఆరంభంలో భారత క్రికెట్కు మరో సచిన్ టెండూల్కర్ దొరికాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో అతడి పేరు మారుమ్రోగింది. కానీ కొన్నాళ్లకే తన లభించిన డబ్బును, కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేక ఒక సాధారణ క్రికెటర్గా మిగిలిపోయాడు.జైశ్వాల్ ఒక రోల్ మోడల్..వైభవ్ సూర్య వంశీ.. తన రాజస్తాన్ రాయల్స్ టీమ్ యశస్వి జైశ్వాల్ను ఆదర్శంగా తీసుకోవాలి. జైశ్వాల్ అతి తక్కువ కాలంలోనే ఒక స్టార్ క్రికెటర్గా ఎదిగినా.. తన వినయాన్ని, ఆటపై ఫోకస్ను ఎప్పుడూ కోల్పోలేదు. ఐపీఎల్ అనేది ఒక వేదిక మాత్రమే.. అదే చివరి లక్ష్యం కాదని వైభవ్ గుర్తించాలి. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన జైశ్వాల్ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ అతడు ఎక్కడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి వన్డేలో సెంచరీతో సత్తాచాటి భారత్కు సిరీస్ను అందించాడు. ఇది కదా ఒక ఛాంపియన్ క్రికెటర్ లక్షణం.ఓవర్ కాన్ఫడెన్స్ వద్దు..వైభవ్ ఆటలో అతి విశ్వాసం కన్పిస్తోంది. అయితే సిక్స్.. లేదంటే అవుట్ అనే ధోరణిలో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నంలో అతడు తన వికెట్ను కోల్పోతున్నాడు. కానీ క్రికెట్ వంటి మాస్టర్ మైండ్ గేమ్లో అది ఏ మాత్రం పనికిరాదు. వికెట్ విలువ తెలిసి ఆడినవాడే గొప్ప బ్యాటర్ అవుతాడు. కఠినమైన బంతులను ఆచితూడి ఆడుతూ.. సులువైన బంతులను ఫనిష్ చేసేవాడే వరల్డ్ క్లాస్ బ్యాటర్ కాగలడు. -
వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో నలుగురు ఆల్రౌండర్లకు చోటు దక్కింది.పేస్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, శివం దూబే.. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరికి తోడు టాపార్డర్లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), తిలక్ వర్మ (Tilak Varma) .. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్ కూడా అవసరమైన వేళ బౌలింగ్పరంగానూ సేవలు అందించగలరు.ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్లో ఫినిషర్గా సత్తా చాటిన జితేశ్ శర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. మరి వరల్డ్కప్ టోర్నీలో టీమిండియాకు ఉన్న ఫినిషింగ్ ఆప్షన్లు ఏవి?రింకూ సింగ్ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే రింకూ.. నయా ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. లోయర్ ఆర్డర్లో ధనాధన్ దంచికొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఐపీఎల్-2023లో కేకేఆర్ తరఫున గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో యశ్ దయాళ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ఇందుకు ఉదాహరణ.ఇటీవల సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడిన జట్టులో రింకూకు చోటే లేదు. అయితే, ఫినిషర్గా అతడు సత్తా చాటగలడు కాబట్టి ప్రపంచకప్ జట్టులో సెలక్టర్లు అతడికి స్థానం కల్పించారు. అయితే, తుదిజట్టులో చోటు కోసం అతడు ఎదురుచూడకతప్పదు. ఇప్పటికి టీమిండియా తరఫున 35 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 550 పరుగులు చేశాడు.శివం దూబేఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న శివం దూబే.. సాధారణంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. అయితే, టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ వచ్చిన తర్వాత ఎక్కువగా లోయర్ ఆర్డర్లోనే అతడి సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.ఇటీవలి కాలంలో ఈ ముంబై ఆల్రౌండర్ కేవలం బ్యాటింగ్కే పరిమితం కాకుండా.. స్లో మీడియం పేస్తో బౌలింగ్తోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్గా శివం దూబే మంచి ఆప్షన్. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్లో సత్తా చాటి ఫామ్లో ఉండటం అతడికి సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్లలో విఫలమైనా.. (11, 1, 10 నాటౌట్, 10 నాటౌట్, రెండు వికెట్లు) తర్వాత ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.హార్దిక్ పాండ్యాపరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు నెంబర్ వన్ ఫినిషర్ అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గాయం నుంచి కోలుకుని.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్రౌండర్.. సూపర్ ఫామ్లో ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్లోనే 142 పరుగులు సాధించాడు. ముఖ్యంగా సఫారీలతో ఆఖరి టీ20లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. మొత్తంగా 25 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.గతే ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలవడంలో హార్దిక్ పాండ్యాదే కీలక పాత్ర. మూడు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 89 రన్స్ చేసిన పాండ్యా.. మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత ప్రదర్శన (3/20) కనబరిచాడు. ఈసారి కూడా ఫినిషర్గా హార్దిక్ పాండ్యానే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు. ఇక పై ముగ్గురు పిచ్, మ్యాచ్ పరిస్థితులను బట్టి ఐదు నుంచి ఏడో స్థానంలో బరిలోకి దిగుతారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
ఢిల్లీలో త్వరలో ‘దర్పణ్ 2.0’ ప్రారంభం!
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్బోర్డ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసింది.ఏమిటీ ‘దర్పణ్ 2.0’?దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.ఫీచర్లు ఇవే..వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.ప్రభుత్వ పథకాల స్టేటస్ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్లో వీటిని ట్రాక్ చేయవచ్చు.ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.అమలు ఎప్పుడంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్బోర్డ్కు అనుసంధానిస్తారు.భవిష్యత్ లక్ష్యాలుడిజిటల్ ఇండియా విజన్లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్బోర్డ్లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్బోర్డ్ అందుబాటులో ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా వాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది. -
సంక్రాంతి బరిలో 'డబ్బింగ్' రిస్క్ అవసరమా?
సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి సీజన్ బంగారు బాతులాంటిది. దీన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ప్రతి పండక్కి ఒకటి రెండు లేదంటే మూడు మూవీస్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి లిస్టు చాలా పెద్దగా ఉంది. తెలుగులోనే బోలెడు చిత్రాలు అనుకుంటే తమిళ డబ్బింగ్లు పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎవరికీ రిస్క్?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)ఈసారి సంక్రాంతికి మొదటగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ నటించిన ఈ మూవీ.. లెక్క ప్రకారం డిసెంబరులో రానుందని ప్రకటించారు. కొన్నిరోజులకే ప్లాన్ మార్చేసి పండగ బరిలో దింపారు. జనవరి 9న థియేటర్లలో రిలీజ్. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి పోటీగా తమిళ హీరో విజయ్ చివరి మూవీ 'జన నాయగణ్' ఉంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అనే టాక్ బలంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలుగులో జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే తమిళనాడులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడాలి?ఈ రెండొచ్చిన మరుసటి రోజు అంటే 10వ తేదీన 'పరాశక్తి' రాబోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. జయం రవి, అధర్వ కీలక పాత్రలు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ లేదు. తెలిసిన ముఖాలు ఉన్నాయి తప్పితే ఒకవేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఎంతమేరకు ఆకట్టుకుంటుందో? ఈ రెండు మాత్రమ సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ బొమ్మలు.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)వీటి తర్వాత 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న వాటిలో ప్రభాస్ది తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్గా చేసుకుని తీసిన చిత్రాలే. కాబట్టి వీటిలో ఒకటి రెండయినా హిట్ అయ్యే అవకాశముంది. అన్ని సక్సెస్ అందుకున్న మంచిదే. ఒకవేళ అదే జరిగితే మాత్రం తమిళ డబ్బింగ్లని ఎవరూ ఆదరించారు.అయితే జన నాయగణ్, పరాశక్తి చిత్రాల్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. కాస్త ఆలస్యం రిలీజ్ చేయడం లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి ఈసారి లిస్టు అయితే దాదాపు ఏడు సినిమాలతో చాలా పెద్దగా ఉంది. మరి వీటిలో ఎవరు ఎవరిని రిస్క్లో పెడతారు? ఎవరు పైచేయి సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?) -
భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే..
న్యూఢిల్లీ: తరచూ దుందుడుకు చర్యలకు పాల్పడే చైనాకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సరిహద్దు వెంబడి భారత్ మరో భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఉత్తరాఖండ్లోని నీలపాణి నుండి ములింగ్ లా వరకు 16,134 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో 32 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న‘మెగా రోడ్డు’ పనులను భారత్ ముమ్మరం చేసింది. అన్ని వాతావరణాలను తట్టుకునేలాంటి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 104 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చేపడుతున్న ఈ ప్రాజెక్టు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)వద్ద భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది.ప్రస్తుతం ములింగ్ లా బేస్ క్యాంపు చేరుకోవాలంటే సైనికులు ఐదు రోజుల పాటు కఠినమైన కొండ మార్గాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తున్నది. శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతుంటుంది. దీంతో కేవలం హెలికాప్టర్ల ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈ నూతన రహదారి పూర్తయితే, ఐదు రోజుల ప్రయాణం కేవలం కొద్ది గంటల్లోనే ముగియనుంది. తద్వారా దళాల మోహరింపు, రేషన్, ఇంధనం, యుద్ధ సామగ్రిని ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా సరిహద్దుకు చేరవేసే అవకాశం కలుగుతుంది.ఒకప్పుడు సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే చైనా చొరబడుతుందని భారత్ భావించింది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి,‘కనెక్టివిటీయే బలం’ అనే దిశగా అడుగులు వేస్తోంది. టిబెట్ ప్రాంతంలో చైనా ఇప్పటికే భారీగా రోడ్డు, రైలు నెట్వర్క్ను నిర్మించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత, సరిహద్దుల్లోని చివరి మైలు వరకు సైనిక కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా మెగా రోడ్డు పనులు జరుగుతున్నాయి.హిమాలయాల్లోని అత్యంత కఠినమైన భూభాగంలో సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా పెద్ద సవాలుతో కూడుకున్నది. ఈ రహదారి పూర్తయితే వాయు సేనపై ఆధారపడే అవసరం తగ్గి, రక్షణ వ్యయం గణనీయంగా ఆదా కానుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉంటేనే, వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమని భారత్ భావిస్తోంది. తద్వారా సరిహద్దు ప్రాంతాలు మరింత సుస్థిరంగా ఉంటాయని రక్షణ నిపుణులు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో చైనా చొరబాట్లకు భారత్ సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలదని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు? -
మరిది.. నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉంది!
తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కిల్ స్కాం.. కేసు కొట్టివేతకు బాబు మాస్టర్ ప్లాన్!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుకుగా ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. పూర్తి సహకారం అందిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కాం కేసు మూసివేతకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అందుకు, చంద్రబాబు అడుగులకు సీఐడీ కూడా మడుగులొత్తుతున్నది. స్కిల్ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తోంది.ఈ క్రమంలో క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్ఎస్డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్ స్కాం కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు.. 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఫైబర్నెట్ కేసు క్లోజ్! -
హీరోయిన్ల డ్రెస్పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
హీరోయిన్లు ధరించే దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్స్ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఎలాంటి దస్తులు ధరించాలో ఆయన చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.తప్పు డ్రెస్సింగ్లో లేదని.. చూసే చూపులోనే ఉందంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సింగర్ చిన్మయి అయితే శివాజీనీ ఏకంగా పోకిరీల హీరో అని విమర్శించారు. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ..ముందుగా జీన్స్, హూడీ ధరించకుండా ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ చిన్మయి కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.(చదవండి: మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది: చిన్మయి)ఇక తాజాగా నటి, యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) కూడా తన యాంకర్ శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రత్యేక్షంగా శివాజీని విమర్శించకపోయినా.. పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ..‘ఇది నా శరీరం.. నీది కాదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ కొంతమంది నెటిజెన్లు అనసూయ కి సపోర్ట్ గా నిలిచారు. మరికొంతమంది ఏమో శివాజీ మంచి సలహానే ఇచ్చారంటూ అనసూయని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. శివాజీ ఏమన్నారంటే.. ?శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబం«ధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే..
చాలామంది విద్యార్థులు మంచి యూనివర్సిటీ డిగ్రీ, పీజీలు చేశాక ఉద్యోగ వేటలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అప్పుడే తెలుస్తుంది ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదని. అచ్చం అలాంటి పరిస్థితిని ఎదర్కోని ఎన్నో చిన్న చితకా ఉద్యోగాలతో విసిగివేసారి.. చివరికి లక్షల కోట్లు విలువ చేసే కంపెనీకి సీఈవో రేంజ్కి ఎదిగాడు గేమింగ్ ఫ్లాట్ఫామ్ రోబ్లా సీఈవో డేవిడ్ బస్జుకి. పైగా విద్యార్థులకు తనలా చేయొద్దంటూ తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు కూడా. మరి అతడు ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో సవివరంగా చూద్దామా..!స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి అయిన 62 ఏళ్ల డేవిడ్ బస్జు అక్కడ విద్యార్థులతో తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా గందరగోళానికి గురయ్యానని, పలు ఉద్యోగాల ఇంటర్వ్యూలో రిజెక్షన్లు, దాంతో తన అర్హతకు సరిపడని ఏవేవో ఉద్యోగాలు చేసి చాలా నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యానంటూ వివరించాడు. చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారని అన్నారడు. ఎందుకంటే సరిగ్గా మనం వచ్చేటప్పటికే ఉద్యోగ మార్కెట్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం సంపాదించడం అన్నది కష్టాసాధ్యమైన విషయంగా మారిపోతుందన్నారు. అలాగే ఆ సమయంలో మనకు సలహాలిచ్చే వాళ్లు కూడా ఎక్కువైపోతారు, పైగా అవి వినబుద్ధి కూడా కాదని అన్నారు. ఆ కష్టకాలంలో తాను తన అంతరదృష్టిపై ఫోకస్ పెట్టి అస్సలు తానేం చేయాలనుకుంటున్నాడు, ఏదైతే తన కెరీర్ బాగుంటుంది అనే వాటి గురించి ప్రశాంతంగా ఆలోచించేవాడని చెప్పారు. తన అంతరంగా చెబుతున్నదాన్ని, ఇష్టపడుతున్నదాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేశానని, అలాగే తాను అంతకుముందు చేసిన చెత్త ఉద్యోగాలతో పొందిన అనుభవం కూడా దీనికి హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్టాన్ఫోర్డ్ విద్యార్థిని అన్న పేరు..మంచి కెరీర్ని సంపాదించుకోవడానికి హెల్ప్ అవ్వలేదని అంటాడు ఈ టెక్ దిగ్గజం డేవిడ్. ఎందుకంటే కాలేజ్ చదువు పూర్తి అయిన తర్వాత కెరీర్ ఒక్కసారిగా స్థంభించిపోయినట్లు అయిపోయిందంటూ నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తన డ్రీమ్ జాబ్ సంపాదించలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావని వాపోయాడు. చివరికి ఆ కష్ట సమయంలో సమ్మర్ టైంలో తన సోదరులతో కలిసి కిటికీలు శుభ్రంచేసే పనికి సైతం వెళ్లినట్లు తెలిపాడు. ఈ చిన్ని చిన్ని ఉద్యగాలుచేయలేక సతమతమవుతున్న తరుణంలోను తన అంతరంగం చెబుతున్న దానివైపు మళ్లాడానికి చాలా ధైర్యం కావలి కూడా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో తిరస్కరణలు చూశాక..అస్సలు మనపై మనకు నమ్మకం ఉండదు. కానీ సక్సెస్ కావాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయకుడదు, అలాగే నీ సామర్థ్యంపై నమ్మకం సడలకూడదు. అప్పుడే విజయం ఒడిలోకి వచ్చివాలుతుందని అంటాడు డేవిడ్. అంతేగాదు తన మనసు ఏకంగా తొమ్మిది రకాల కెరీర్ ఆప్షన్లు ఇచ్చిందని, అయితే వాటిలో ఏది బెటర్, ఏది మంచిది కాదు అని అంచనా వేసుకుంటూ..కెరీర్ని నిర్మించుకున్నానని చెప్పాడు. అలా సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువచేసే గేమింగ్ ఫ్లాట్ఫామ్ రోబ్లాక్స్కి నాయకత్వం వహించే రేంజ్కి వచ్చానంటూ తన విజయ రహస్యాన్ని విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు డేవిడ్ ఏకంగా రూ. 4 వేల కోట్ల నికర విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్న కుభేరుడు కూడా.(చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
సాక్షి కార్టూన్ 23-12-2025
-
liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు?
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్పై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో జరిగిన రూ. మూడువేల కోట్ల మద్యం కుంభకోణంలో చైతన్యకు వాటా మొత్తంగా రూ. 200 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకూ అందినట్లు ఏసీబీ తన ఏడవ అనుబంధ చార్జిషీట్లో పేర్కొంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చైతన్య ఎక్సైజ్ శాఖలో వసూళ్ల రాకెట్ను (సిండికేట్) ఏర్పాటు చేయడంలో చైతన్య కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.సుమారు 3,800 పేజీల ఈ సమగ్ర చార్జిషీట్లోని వివరాల ప్రకారం నిందితుడు అన్వర్ ధేబర్ బృందం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని తరలించడానికి చైతన్య తన వ్యక్తిగత నెట్వర్క్ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం వ్యాపారి త్రిలోక్ సింగ్ ధిల్లాన్కు చెందిన వివిధ సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ మొత్తాన్ని బ్యాంకింగ్ మార్గాల ద్వారా తన కుటుంబ వ్యాపారాలకు తరలించడంతో పాటు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టినట్లు చార్జిషీట్లో వివరించారు.ఈ కుంభకోణం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లగా, మద్యం సిండికేట్ సభ్యులు మాత్రం అక్రమంగా సంపన్నులయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)స్పష్టం చేసింది. చైతన్య తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో ఈ నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు ప్రయత్నించారని ఏజెన్సీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 18న జరిగిన సోదాల అనంతరం.. చైతన్యను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు, విచారణలో వెల్లడైన కీలక అంశాలను తాజా చార్జిషీట్లో పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఈ తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం -
ప్రశ్నిస్తే బెదిరింపులా?.. మీ భాషేంటి?: బొత్స సీరియస్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల భాష ఏ మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైఎస్సార్సీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల భాష, ఆలోచన విధానాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోటి సంతకాల సేకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా?. జనంలోకి వెళ్లి అడిగితే ఎంత మంది మెడికల్ కాలేజీల కోసం సంతకాలు చేశారో అర్ధం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. అప్పుడు వాళ్ళే సమాధానం చెబుతారు. మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారో వారిపై మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం..20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తారో.. చస్తారో పక్కన పెడితే గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసింది. రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వలసలు మొదలవుతాయి. పేదలకు అన్నం దొరకలేని దయనీయ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖలోకే వస్తుంది కదా కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. చంద్రబాబుకి పేదలు అవసరం లేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా అవసరం లేదు. చంద్రబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలేదు.ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నారు కదా పవన్.. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు?. అధికారం, గెలుపు ఓటములు సహజం. సిద్దాంతం, ఆలోచన ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే.. శాంతి భద్రతలు లేవు. హాస్టల్ పిల్లలు మధ్యాహ్నం మంచి భోజనం తినే పరిస్థితి లేదు.. పవన్ వ్యాఖ్యలు విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఉక్రెయిన్లో యుద్ధం జరిగి ఏపీలో యూరియా కొరత వస్తే.. మిగతా రాష్ట్రాల్లో యూరియా ఎలా వచ్చింది?. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నింటిలో యూరియా కొరత లేదు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఆయన టీమ్ కన్ను పడింది. ఇక్కడున్న భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా?. భూ కేటాయింపులు అన్నింటిని తిరగదోడుతాం. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. సీ పోర్టుల్లో చూస్తే అక్రమ రవాణా?. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నా?. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు వెనకాడుతున్నారు. ప్రతీ రోజూ రాష్ట్రంలో అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఏదో ఒక సమస్య చూస్తున్నాం. పెద్ద ఎత్తున అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేశారంటే సమాధానం లేదు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు?.ఫీజురియింబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందింది. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 15వ ఆర్ధిక నిధులు వినియోగానికి బ్రేకులు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్కు ఆ విషయం తెలుసా?. ఉన్నప్పుడు ఏం పీకారని పవన్ అడుగుతున్నారు.. ఏంటి ఈ మాటలు. మాటలు ఎక్కువ మాట్లాడే వారికి చేతనైంది తక్కువ. రెండేళ్ల పాలనపై ఈ ప్రభుత్వానికి, మంత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. సంక్రాంతికల్లా గోతులు కప్పేయాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ ఏ సంక్రాంతో చెప్పడం లేదు. గోతులు కప్పడానికి నిధులు ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టంది. పిల్లల అవసరాలను తీర్చండి’ అని హితవు పలికారు. -
బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?
సినిమా అనేది ఓ మాధ్యమం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారా సందేశం ఇస్తారా అనేది హీరోలు, దర్శకనిర్మాతల ఇష్టం. సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గానీ చెడు మాత్రం చేయకూడదు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఈ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడుకునే బూతుల్ని పలు సినిమాల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. మరి వీటిని జనాలకు అలవాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే అసలేం చేద్దామనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)తెలుగు సినిమాలు కొన్నాళ్ల ముందు వరకు మరీ అంత కాకపోయినా కాస్త పద్ధతిగా ఉండేవి. ఫ్యామిలీ, కామెడీ స్టోరీలతో తీసిన మూవీస్ ఎప్పటికప్పుడు వస్తుండేవి. ఆడియెన్స్ కూడా చాలావరకు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేవారు. కానీ లాక్డౌన్, ఓటీటీల రాకతో ట్రెండ్ మారిపోయింది. నిజంగానే మారిందా లేదంటే దర్శకనిర్మాతలు పరిస్థితులకు తగ్గట్లు మార్చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కాని విషయం.ఓటీటీ కంటెంట్కి సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాబట్టి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ పెట్టకోవచ్చు. అందుకే 'మీర్జాపుర్' లాంటి సిరీస్లు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్తో తీశారు. కానీ బూతులు, యాక్షన్ సన్నివేశాలు దారుణంగా ఉంటాయి. ఈ తరహా కంటెంట్ ఇష్టపడేవాళ్లు వీటిని చూశారు. మిగిలిన వాళ్లు లైట్ తీసుకున్నారు. ఓటీటీ కంటెంట్ వేరు సినిమా కంటెంట్ వేరు. కానీ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో నాని 'ద ప్యారడైజ్' సినిమా అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ చివరలో ఉపయోగించిన ఓ బూతు పదం విని షాకయ్యారు. తల్లిని దూషించేలా ఉండే ఆ పదాన్ని సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించారో తెలీదు కానీ ప్రమోషనల్ వీడియోలో పెట్టడం మాత్రం అవసరమా అనే కామెంట్స్ కొన్ని వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్థన' టైటిల్ వీడియో లాంచ్ చేశారు. ఇందులోనూ రక్తపాతం, చివరలో బూతుపదాన్ని పెట్టారు.తెలంగాణ కల్చర్ అంటే పలువురు దర్శకులు మందు తాగడాన్ని చూపించినట్లు.. మాస్ సినిమాలనగానే కొందరు డైరెక్టర్స్, బూతుల్ని యదేచ్ఛగా వాడేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాదు గతంలో ఇదే విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి'లోనూ బూతులు ఉంటాయి. విశ్వక్ సేన్ 'ఫలక్నుమా దాస్'లోనూ అలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేసే పనిలో ఉన్నారా అనే సందేహం రావడం గ్యారంటీ!(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
బిడ్డను చూపాలంటే రూ.30 లక్షలు ఇవ్వు
మైసూరు: భార్య వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు ఆలనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జిల్లా టి. నరసిపుర తాలూకా నివాసి, ప్రైవేటు కంపెనీ ఇంజనీర్ ఉమేష్ (34), మైసూరులోని సిద్ధార్థ బరంగే నివాసి చన్నబసవేగౌడ కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్న భార్యాభర్తలు తరువాత తరచుగా గొడవ పడుతుండేవారని ఉమేష్ తండ్రి గురుమల్లెగౌడ తన ఫిర్యాదులో తెలిపాడు. గత 2 సంవత్సరాలుగా, ఉమేష్ తన చిన్నారి కూతురిని చూడలేక పోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బిడ్డను చూడాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆమె వేధించేది. ఇది తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేవాడు. డిసెంబర్ 19న, భార్యకు వీడియో కాల్ చేసి, తన కూతురిని చూపించమని అడిగాడు. అయితే, రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేసింది. దీంతో ఆవేదన చెందిన ఉమేష్ తన బాడుగ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య రమ్య, అతని తల్లిదండ్రులపై చన్నబసవేగౌడపై అలనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది: స్టార్ క్రికెటర్
ఉపఖండ దేశాల్లో క్రికెట్కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా అఫ్గనిస్తాన్లోనూ క్రికెట్, క్రికెటర్లకు క్రేజ్ ఎక్కువ. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ముఖ్యంగా క్రికెట్ను మతంగా భావించే భారత్లో విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి దిగ్గజాలను నేరుగా కలవాలని పిచ్లోకి దూసుకువెళ్లి... ఇబ్బందులపాలైన వీరాభిమానులను ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఒక్కోసారి అభిమానం శ్రుతిమించితే సదరు ఆటగాళ్లకు కూడా కష్టమే.లండన్లోనే కోహ్లిఅందుకే కోహ్లి తన పిల్లలు ఇద్దరినీ లండన్లోనే ఎక్కువగా పెంచుతున్నాడు. ఇంత వరకు వాళ్ల ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. సోషల్ మీడియాకు దూరంగా.. సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా సాధారణ పిల్లల మాదిరే వారిని పెంచుతున్నాడు. కోహ్లి సైతం లండన్ వీధుల్లో ఎలాంటి ఇబ్బంది, హంగూ ఆర్భాటాలు లేకుండా స్వేచ్చగా తిరగగలుగుతున్నాడు.తన పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే అంటున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan). సొంత దేశంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలన్నా అతడికి భయమే. అయితే, కోహ్లి మాదిరి కేవలం క్రేజ్ కారణంగా మాత్రమే అతడికి ఈ పరిస్థితి తలెత్తలేదు. దేశంలోని అనిశ్చితులు ఇందుకు ప్రధాన కారణం.నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందిఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో మాట్లాడుతూ రషీద్ ఖాన్ ఈ విషయం గురించి స్పందించాడు. అఫ్గనిస్తాన్ వీధుల్లో స్వేచ్ఛగా విహరించగలవా? అని పీటర్సన్ అడుగగా.. ‘‘లేదు. నేనసలు అఫ్గన్ వీధుల్లో నడవలేను. నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది. అందులోనే బయటకు వెళ్తా’’ అని రషీద్ ఖాన్ బదులిచ్చాడు.‘‘కాబూల్లో బుల్లెట్ ప్రూఫ్ కారా? ఎందుకు?’’ అని పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ‘‘భద్రతా కారణాల దృష్ట్యా నేను ఆ కారునే వాడతాను. ఉండకూడని సమయంలో.. ఉండకూడని చోట ఉంటే అంతే సంగతులు.అయినా అఫ్గనిస్తాన్లో ఇవన్నీ సాధారణమే. దాదాపు ప్రతి ఆటగాడి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది’’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. తద్వారా తనకు కారు అనేది కేవలం విలాస వస్తువు కాదని.. వ్యక్తిగత భద్రత కోసం తప్పక వాడతానని స్పష్టం చేశాడు. కాగా అఫ్గన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ప్రపంచ స్థాయి స్పిన్నర్గా ఎదిగాడు రషీద్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లలో ప్రస్తుతం తిరుగులేని బౌలర్గా సత్తా చాటుతున్నాడు. ఇక అఫ్గన్ తరఫున రషీద్ ఖాన్ 117 వన్డేలు, 108 టీ20లు, 6 టెస్టులు ఆడి.. 210, 182, 45 వికెట్లు కూల్చాడు.చదవండి: ఆ ముగ్గురిని వాడుకోవాల్సింది: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్ -
పాక్ చేతిలో ఓటమి.. టీమిండియాపై బీసీసీఐ సీరియస్
అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత యువ జట్టు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమైన ఆయూష్ మాత్రే అండ్ కో.. ఏకంగా 191 పరుగుల తేడాతో ఘోర పరాభావన్ని మూటకట్టుకుంది.దాయాది చేతిలో ఓటమి పాలవ్వడాన్ని భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ ఘోర ఓటమిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా సీరియస్ అయింది. ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 22న వర్చవల్గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు హెడ్ కోచ్ హృషికేష్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే, టీమ్ మేనేజర్ నుండి బోర్డు వివరణ కోరనున్నట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని బోర్డు తప్పుబడుతోంది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్ల ప్రవర్తనపై వచ్చిన నివేదికలు కూడా బీసీసీఐ దృష్టిలో పడినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కూడా ఆటగాళ్లతో బీసీసీఐ చర్చిస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు."గతంలో భారత జట్లు క్రికెట్ను గౌరవించేవి. కానీ ఇప్పుడు అలా లేదు. భారత జట్ల ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. తమ సీనియర్ ఆటగాళ్లనే జూనియర్స్ కూడా ఫాలో అయ్యారు.కాగా ఈ తుది పోరులో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలు ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. పాక్ పేసర్ అలీ రజా వీరిని ఔట్ చేశాడు. ఔటైన తర్వాత వైభవ్, ఆయుష్.. పాక్ బౌలర్ను దుర్భాషలాడారు. ముఖ్యంగా వైభవ్ అయితే తన షూను చూపిస్తూ ఫైరయ్యాడు. అయితే వీరికి భారత అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ బౌలర్ స్లెడ్జ్ చేయడంతోనే వైభవ్ అలా ప్రవర్తించాడని పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు భారీ షాక్ -
కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం
సంభల్: ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్ఘాట్కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ -
చిన్నస్వామిలో మ్యాచ్లపై సమీక్ష
బెంగళూరు: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే! -
‘బ్యాడ్ గాళ్స్’ లాంటి సినిమాలు తప్పక ఆడాలి: మారుతి
‘‘సినిమా టైటిల్ మాత్రమే ‘బ్యాడ్ గాళ్స్’. కానీ, మూవీ అంతా పాజిటివ్గా ఉంటుంది. నేటితరం అమ్మాయిలు ఎలా ఉన్నారు? వాళ్ల ఆలోచనా విధానం ఏంటి? వాళ్లు ఏమి కోరుకుంటున్నారు? వంటి మంచి కాన్సెప్ట్తో, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిన ‘బ్యాడ్ గాళ్స్’తప్పక ఆడాలి’’ అని డైరెక్టర్ మారుతి ఆకాంక్షించారు. ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మోయిన్, రోహన్ సూర్య ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ఫణి ప్రదీప్ ధూళిపూడి(మున్నా) దర్శకత్వం వహించారు. ప్రశ్విత ఎంటర్టైన్ మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్ ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా నెల 25న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ను మారుతి విడుదల చేసి, ‘‘ఫణి ప్రదీప్ నాకు మిత్రుడు. ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపూ చంద్ర దాస్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. #WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG— ANI (@ANI) December 23, 2025దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్పై ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 జరగాలంటూ వీహెచ్పీ డిమాండ్ చేసింది. #WATCH | Delhi | Vishva Hindu Parishad and other hindu organisations protest near the Bangladesh High Commission against the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das pic.twitter.com/aKo0T3BUs2— ANI (@ANI) December 23, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్లో బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. #WATCH | Bajrang Dal and other Hindu organisations protest over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh, in BhopalA Bajrang Dal member says,"Bajrang Dal has protested against the Bangladesh government today. We demand that… https://t.co/O134zU9B9p pic.twitter.com/1xVG722dxQ— ANI (@ANI) December 23, 2025 -
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ
బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్లో గల హెర్టీ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బతీస్తూ, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను బీజేపీ కాలరాస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇది కేవలం భారతీయుల ఆస్తి మాత్రమే కాదని, ప్రపంచ సంపద అని రాహుల్ అభివర్ణించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగే దాడిగానే పరిగణించాలని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుని, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, వాటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. This battle is no longer just about elections. It’s about protecting the foundation of our Constitution and Democracy - One Person, One Vote. pic.twitter.com/QjecwCtjxr— Congress (@INCIndia) December 22, 2025దేశంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ (ఈడీ), సీబీఐ (సీబీఐ)ల పనితీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ఈ సంస్థలను నిర్మించడంలో సహకరించినప్పటికీ, బీజేపీ మాత్రం వాటిని తమ సొంత ఆస్తులుగా వాడుకుంటూ, ప్రతిపక్షాలపై రాజకీయ కేసులు పెడుతోందని విమర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని తాము నిరూపించామని, అలాగే మహారాష్ట్ర ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని తాము భావించడం లేదని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక విధానాలనే బీజేపీ ముందుకు తీసుకెళ్తోందని, ప్రస్తుత మోదీ ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయిందని రాహుల్ అన్నారు. దేశంలోని సంస్థాగత వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రతిఘటన వ్యవస్థను రూపొందిస్తున్నాయన్నాయన్నారు. కేవలం ఎన్నికల లోపాలను ఎత్తిచూపడమే కాకుండా గెలుపు వైపు నడిచే పద్ధతిని సిద్ధం చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.ఇండియా కూటమి పార్టీల మధ్య వ్యూహాత్మక విభేదాలు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తామంతా చాలా ఐక్యంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటులో ప్రతిరోజూ ప్రతిపక్షాల ఐక్యత కనిపిస్తున్నదని, తమకు సమ్మతం లేని చట్టాలపై బీజేపీని గట్టిగా నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం! -
టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ప్రపంచకప్ టోర్నమెంట్కు సన్నద్ధమయ్యే క్రమంలో పిచ్చి ప్రయోగాలతో ఆటగాళ్లను గందరగోళానికి గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం రెండు నుంచి మూడు నెలల కాలం వృథా చేశారంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరును తప్పుబట్టాడు.గిల్పై వేటుఅసలు విషయమేమిటంటే.. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బీసీసీఐ ఇటీవలే తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ (Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. జితేశ్ శర్మను కూడా జట్టు నుంచి తప్పించింది.గిల్, జితేశ్ స్థానాల్లో రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)లను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకీ కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ స్పందిస్తూ.. గిల్ విషయంలో మేనేజ్మెంట్ చేసిన తప్పును ఎత్తి చూపాడు.సెలక్టర్లు తప్పు చేశారు‘‘మెరుగైన ఆటగాళ్లు ఎవరో వాళ్లకు (సెలక్టర్లకు) ముందుగానే తెలుసు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్కు ఎవరు సరిపోతారో వారికి ఓ అవగాహన ఉంది. గిల్ కంటే పొట్టి క్రికెట్లో బాగా ఆడే వాళ్లున్నారని వాళ్లకు తెలుసు. అయినప్పటికీ సెలక్టర్లు తప్పు చేశారు.వారి తప్పు వల్ల భారత క్రికెట్ వెనుకబడింది. గత రెండు- మూడు నెలలుగా గిల్కు బదులు వాళ్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మలను ఎక్కువగా ఆడించాల్సింది’’ అని కైఫ్ పేర్కొన్నాడు.కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో గిల్ టీ20 జట్టులో పునరాగమనం చేయగా.. ఓపెనింగ్ జోడీగా ఉన్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లను విడదీయాల్సి వచ్చింది. సంజూ స్థానంలో గిల్ ఓపెనర్గా వచ్చి వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.భవిష్య సారథినే తప్పించారుఈ క్రమంలో అనూహ్య రీతిలో గిల్పై వేటు వేసిన యాజమాన్యం.. ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను తిరిగి నియమించింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే జట్లకు గిల్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కూడా భవిష్య సారథిగా అతడే ఉంటాడని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. కానీ బ్యాటర్గా వరుస మ్యాచ్లలో విఫలమైన నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడిని జట్టు నుంచే తప్పించడం గమనార్హం.చదవండి: కెప్టెన్గా ఇషాన్ కిషన్ -
విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు భారీ షాక్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దాదాపు ఏడు నెలల తర్వాత ఓ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో తొమ్మిది లీగ్ మ్యాచ్లకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో డిసెంబర్ 24న ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లి(Virat kohli), రిషబ్ పంత్ స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లిని మళ్లీ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే విఎచ్టి మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మ్యాచ్లకు సుమారు 2,000 నుండి 3,000 మంది వరకు అభిమానులను అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో జరిగిన విషాద ఘటన దృష్ట్యా సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపుల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను నిలిపివేశారు. అయితే ఇటీవలే చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఈ దేశవాళీ వన్డే టోర్నీలోని గ్రూపు-డి మ్యాచ్లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది.కానీ కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని కేసీఎ భావించింది. ఈ క్రమంలోనే గ్రూపు-డి మ్యాచ్ల వేదికను అలూర్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు మార్చారు.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై
కొందరు సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే నోరు అదుపులో ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంటారు. తాము చెప్పదలుచుకున్నది మంచి విషయమే కావొచ్చు. కానీ ఎలా చెబుతున్నమనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నటుడు శివాజీ.. సోమవారం జరిగిన 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా రెండు బూతు పదాల్ని స్టేజీపై బహిరంగంగా అనడం చర్చనీయాంశమైంది. స్పందించిన సింగర్ చిన్మయి.. ఆగ్రహంతో ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)శివాజి ఏమన్నాడంటే?'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు' అని శివాజీ అన్నాడు. అయితే ఇందులో ఓ బూతు పదంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకునే సామాను అనే చిల్లర పదం ఉపయోగించడం ఇక్కడ వివాదాస్పదమైంది.సింగర్ చిన్మయి రెస్పాన్స్ శివాజీ పబ్లిక్గా స్టేజీపై చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది. 'తెలుగు నటుడు శివాజీ.. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసర సలహా ఇచ్చాడు. ఆయా పదాల్ని ఎక్కువగా పోకిరీలు ఉపయోగిస్తారు. ఓ అద్భుతమైన సినిమాలో శివాజీ విలన్గా నటించాడు. తద్వారా పోకిరీలకు హీరో అయిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్గా ఇలాంటి పదాలు వాడటం. ఆయనేమో జీన్స్, హూడీ వేసుకున్నాడు. మరి ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలిగా. ఒకవేళ ఆయనకు పెళ్లయి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది' అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం!
ఆస్ట్రేలియా ప్రభుత్వం బోండి బీచ్ ఉగ్రవాద ఘటన దరిమిలా దేశవ్యాప్తంగా తుపాకీ సంస్కరణల దిశగా ముందడుగు వేసింది. మూడు దశాబ్దాల అనంతరం అత్యంత భారీస్థాయిలో ‘గన్ బైబ్యాక్’ పథకాన్ని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు. బోండి బీచ్లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి నేపథ్యంలో, తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసి, దేశ పౌరుల భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నాటి ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండలలో ..దేశంలో 1996లో జరిగిన ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండ తర్వాత ఆస్ట్రేలియా చేపడుతున్న అతిపెద్ద ఆయుధ సేకరణ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. నాడు టాస్మేనియాలోని పోర్ట్ ఆర్డర్ ద్వీపంలో ఒక సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 35 మంది మృతిచెందారు. ఈ ఘటన దరిమిలా ఆస్ట్రేలియా ప్రభుత్వం తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేసింది. అప్పట్లో సుమారు ఏడు లక్షల ఆయుధాలను తొలగించగా, ప్రస్తుతం ఈ పథకం ద్వారా లక్షలాది తుపాకులను సేకరించాలని ఆస్ట్రేలియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.మూడు విధాలుగా సేకరణలైసెన్స్ కలిగిన యజమానుల వద్దనున్న మిగులు ఆయుధాలను లేదా కొత్తగా నిషేధించిన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తే, వారికి తగిన పరిహారం చెల్లించనున్నారు. ఈ భారీ ఆపరేషన్ను అటు ఫెడరల్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. రాష్ట్ర పోలీసులు, అధీకృత డీలర్లు తుపాకీలను సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆయుధాల నాశనాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తారు. దీనివల్ల నిధుల వినియోగం, భద్రతలో లోపాలు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.40 లక్షలకు పైగా తుపాకులుబోండి బీచ్లో ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని అల్బనీస్.. ప్రస్తుతం దేశంలో 40 లక్షలకు పైగా తుపాకులు చెలామణిలో ఉన్నాయని, ఇది పోర్ట్ ఆర్థర్ సమయం కంటే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తుపాకీ నియంత్రణకు ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు. ఈ ‘బైబ్యాక్’లో ప్రధానంగా మూడు రకాల ఆయుధాలను సేకరించనున్నారు.తుపాకీ నియంత్రణకు సమగ్ర ప్యాకేజీకొత్తగా నిషేధించిన అత్యాధునిక ఆయుధాలు, ఇప్పటికే చట్టవిరుద్ధంగా ముద్ర వేసినవి, యజమానులు ఇకపై తమకు అవసరం లేదని భావించే అదనపు ఆయుధాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా అనవసరంగా ఇళ్లలో ఉండే ఆయుధాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కేవలం బైబ్యాక్ మాత్రమే కాకుండా, తుపాకీ నియంత్రణ కోసం ఒక సమగ్ర ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని తుపాకులు కలిగి ఉండాలనే దానిపై కఠినరీతిలో పరిమితులు విధిస్తారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గల తుపాకీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘నేషనల్ గన్ రిజిస్టర్’ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది.పౌర స్వేచ్ఛావాదుల విమర్శలు2026 మధ్య నాటికి తుపాకీ నియంత్రణ కొత్త చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానాన్ని న్యాయవాదులు, కాల్పుల బాధితులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయుధాల సంఖ్య తగ్గితేనే సమాజం సురక్షితంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు తుపాకీ యజమానులు, పౌర స్వేచ్ఛావాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టబద్ధంగా ఆయుధాలు కలిగిన వారు ఈ నిర్ణయంతో ఇబ్బంది పడతారని వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశంలో భద్రతా ముప్పు దృష్ట్యా ఇది ఒక తప్పనిసరి చర్య అని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.ఇది కూడా చదవండి: ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు -
ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత
శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారుఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేతపూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.దీపారాధన: 26న పూజ అనంతరం.మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.హరివరాసనం: 27న రాత్రి 11:00PM.ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారు(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..) -
యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. మంత్రులకు సంబంధించిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు వైకుంఠ ద్వారం దగ్గర ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పటికీ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ శ్రేణులు తాజాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రులకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలను పెట్టారు. అయితే, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం ఉన్నప్పటికీ ఎలా పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. అనంతరం, వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయించి నిరసనలు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నాయకులను పీఎస్కు తరలించారు. కాగా, గతంలోనూ మంత్రుల పర్యటన సందర్భంగా ఇష్టారీతిన కాంగ్రెస్ కార్యకర్తల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈవో మద్దతుగా ఉంటూ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం, ఆలయం చుట్టూ ఫ్లెక్సీల ఏర్పాటుపై గతంలోనే నిషేధం విధించారు. అయినప్పటికీ ఈ నిషేధాన్ని కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించారు. కాగా, కాంగ్రెస్ శ్రేణుల ఓవరాక్షన్తో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు సైతం నిరసనలకు, ధర్నాలకు సిబ్బమైనట్టు తెలిపారు. -
క్రిఫ్టో కరెన్సీ ఇస్తా అంటూ..దృష్టి మరల్చి కోటి రూపాయలతో ఉడాయింపు
హైదరాబాద్ : నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మబలికి దృష్టి మరల్చి రూ కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ (35) అనే వ్యాపారవేత్తకు ఇటీవల సోమవారం సాయంత్రం బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాము క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు.దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో కోటి రూపాయల నగదును అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు.ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఉమర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
కెప్టెన్గా ఇషాన్ కిషన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26కు కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా కిషన్ ఎంపికయ్యాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇప్పుడు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో తన జట్టును విజయ పథంలో నడిపించేందుకు కిషన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ టోర్నీలో కిషన్కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో విరాట్ సింగ్, అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ వంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్లో డిసెంబర్ 24న కర్ణాటకతో తలపడనుంది.ఇక టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన ఈ పాకెట్ డైన్మైట్ 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో కూడా సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు అతడు ఎంపికయ్యాడు.విజయ్ హాజారే ట్రోఫీకి జార్ఖండ్ జట్టుఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, కుమార్ కుషాగ్రా (వైస్ కెప్టెన్), రాబిన్ మింజ్, అనుకుల్ రాయ్, శరణదీప్ సింగ్, శిఖర్ మోహన్, పంకజ్ కుమార్, బాల కృష్ణ, మహ్మద్ కౌనైన్ ఖురైషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, అభినవ్ శరణ్, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజందీప్ సింగ్, శుభమ్ సింగ్.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
ఇవాళే థంక అంకి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..
శబరిమలలో మండల కాలంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటైన థంక అంకి (స్వర్ణ వస్త్రం)తో కూడిన దీపారాధన డిసెంబర్ 26 సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. అయితే అంతకంటే ముందు జరిగే ఈ థంక అంకి ప్రదక్షిణ లేదా ఊరేగింపు ఈ రోజు నుంచే మొదలవ్వుతుంది. ఇంతకీ అసలేంటి థంక అంకి ఊరేగింపు, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!థంక అంకి ప్రదక్షిణ అంటే ..శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజకు ముందు జరిగే పవిత్ర బంగారు వస్త్రాల ఊరేగింపు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.ఎప్పుడు జరుగుతుందంటే..శబరిమలలో అయ్యప్ప మండల పూజకు నాలుగు రోజుల ముందు ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది.ముందుగా పతనంతిట్టలోని అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరుతుంది. నిలక్కల్ పంప మీదుగా శబరిమల సన్నిధానానికి చేరుతుంది. ఇక "థంక అంకి" అనేది అయ్యప్ప విగ్రహానికి అలంకరించే బంగారు వస్త్రం. ఇందులో కిరీటం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, పీఠం వంటి ఆభరణాలు ఉంటాయి.ప్రాముఖ్యతఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతుంది అక్కడి వాతావరణం. వృశ్చికరాశి కాలంలో జరిగే మండల పూజలో అయ్యప్ప స్వామిని థంక అంకితో అలంకరించడం ఒక అనాదికాలపు సంప్రదాయం. థంక అంకిని దర్శించడం, ప్రదక్షిణలో పాల్గొనడం భక్తులకు మహా పుణ్యప్రదం అని నమ్మకం.చరిత్ర:ఈ థంక అంకిని 1973లో అప్పటి ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి చెందిన దివంగత చిత్తిర తిరునాళ్ బాలరామ వర్మ మహారాజు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సమర్పించారు. అరణ్ముల పార్థసారథి ఆలయం నుంచి భవ్యమైన ఊరేగింపుగా తీసుకురాబడే థంక అంకి డిసెంబర్ 26 సాయంత్రం సుమారు 5 గంటలకు శరన్ గుత్తికి చేరుతుంది.ఆ రోజు సాయంత్రం దేవాలయం తెరచిన తరువాత తంత్రిగారు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర మాలలను అలంకరించిన అనంతరం థంక అంకిని స్వాగతించేందుకు బృందాన్ని పంపుతారు. సాంప్రదాయ వాద్యబృందాలు , కఠినమైన పోలీసు భద్రత మధ్య ఈ ఊరేగింపు సన్నిధానానికి చేరుతుంది.18 పవిత్ర మెట్లు ప్రారంభంలో దేవస్వం బోర్డు అధ్యక్షులు, సభ్యులు థంక అంకిని స్వీకరించి సోపానం వరకు తీసుకువెళ్తారు. అక్కడ తంత్రి, మెల్సాంతి థంక అంకిని ఆచారపూర్వకంగా స్వీకరించి అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరిస్తారు. తదనంతరం దీపారాధన నిర్వహిస్తారు. ఈ ఘడియలోనే మండల కాలంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సన్నిధానంలో చేరుతారు.థంక అంకి ఊరేగింపు మార్గం, సమయాలుడిసెంబర్ 23–24 (మొదటి రోజు మార్గం)మూర్తిత్త గణపతి ఆలయం – 7:15 AMపున్నంథొట్టం దేవి ఆలయం – 7:30 AMచవిట్టుక మహాదేవ ఆలయం – 7:45 AMతిరువంచంకావు ఆలయం – 8:00 AMనెడుంప్రయార్ తేవరశేరి దేవి ఆలయం – 8:30 AMనెడుంప్రయార్ జంక్షన్ – 9:30 AMకోజెంచెరి పట్టణం – 10:00 AMఅయ్యప్ప మండపం (కాలేజ్ జంక్షన్) – 10:15 AMపంపడిమోన్ అయ్యప్ప ఆలయం – 10:30 AMకరిమ్వేలి – 11:00 AMఎలంతూర్ ఎడతావళం – 11:15 AMఎలంతూర్ భగవతీకున్ను ఆలయం – 11:20 AMఎలంతూర్ గణపతి ఆలయం – 11:30 AMఎలంతూర్ నారాయణమంగళం – 12:30 PMఆయతిల్ మలానాడ జంక్షన్ – 2:00 PMఆయతిల్ గురుమండిరం జంక్షన్ – 2:40 PMమెఝువేలి ఆనందభూతేశ్వర ఆలయం – 2:50 PMఎలవుంథిట్ట దేవి ఆలయం – 3:15 PMఎలవుంథిట్ట మలానాడ – 3:45 PMముట్టత్తుకోణం SNDP మందిరం – 4:30 PMకైథవాన దేవి ఆలయం – 5:30 PMప్రకణం ఎడనాడ దేవి ఆలయం – 6:00 PMచీకనల్ – 6:30 PMఉప్పమోన్ జంక్షన్ – 7:00 PMఒమల్లూర్ శ్రీరక్తకంఠ స్వామి ఆలయం – 8:00 PMడిసెంబర్ 24 – రెండో రోజు (ఉదయం 8 గంటలకు ఒమల్లూర్ నుండి ప్రారంభం)కొడుంతర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం – 9:00 AMఅఝూర్ జంక్షన్ – 10:00 AMపథనంతిట్ట ఉర్మన్ కోవిల్ – 10:45 AMపథనంతిట్ట ఆలయం – 11:00 AMకరింపనక్కల్ దేవి ఆలయం – 11:30 AMశారదామఠం ముండుకొట్టక్కల్ SNDP హాల్ – 12:00 PMకడమణిట్ట భగవతి ఆలయం – 1:00 PMకొట్టపారా కల్లెలిముక్కు – 2:30 PMపెరుంకాడ SNDP హాల్ – 2:45 PMమైకోజూర్ ఆలయం – 3:15 PMమైలాప్ర భగవతి ఆలయం – 3:45 PMకుంబఝా జంక్షన్ – 4:15 PMపలమత్తూర్ అంబలముక్కు – 4:30 PMవెట్టూర్ మహావిష్ణు ఆలయం (గోపురప్పడి) – 5:30 PMఎలకొల్లూర్ మహాదేవ ఆలయం – 6:15 PMచిత్తూర్ముక్కు – 7:15 PMకొన్నీ పట్టణం – 7:45 PMకొన్నీ చిరైక్కల్ ఆలయం – 8:00 PMకొన్నీ మురింగమంగళం ఆలయం – 8:30 PMడిసెంబర్ 25 – మూడో రోజు (ఉదయం 7:30 – మురింగమంగళం నుండి)చిత్తూర్ మహాదేవ ఆలయం – 8:00 AMవెట్టూర్ ఆలయం – 9:00 AMమైలాడుంపారా – 10:30 AMకొట్టముక్కు – 11:00 AMమలయాలపుఝ ఆలయం – 12:00 PMమలయాలపుఝ తాళం – 1:00 PMమన్నరకులంజి ఆలయం – 1:15 PMరన్నీ రామపురం ఆలయం – 3:30 PMఇదక్కులం ఆలయం – 5:30 PMవడశేరిక్కర చేరుకావు – 6:30 PMప్రయార్ మహావిష్ణు ఆలయం – 7:00 PMమడమోన్ ఆలయం – 7:45 PMపెరునాడ్ ఆలయం – 8:30 PMడిసెంబర్ 26 – తుది రోజు (ఉదయం 8:00 – పెరునాడ్ నుండి)లాహా – 9:00 AMప్లప్పల్లి – 10:00 AMనిలక్కల్ మహాదేవ ఆలయం – 11:00 AMపంప – 1:30 PMశరణ్కుట్టి – 5:00 PMఅనంతరం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి థంక అంకి చేరుకుంటుంది. ఇక మండల పూజ అనంతరం థంక అంకి వస్త్రాన్ని అరన్ముల పార్థసారథి ఆలయానికి తీసుకెళ్లి దేవస్వామ్లోని స్ట్రాంగ్రూమ్లో ఉంచుతారు. తొలినాళ్లలో కొట్టాయం నుంచి హంస రథంలో ఈ థంక అంకి వస్త్రాన్ని సన్నిధానానికి తీసుకెళ్లేవారు. అయితే గత కొన్నేళ్లుగా లక్షలాది మంది భక్తులు థంక అంగీ, దీపారాధన ఊరేగింపును చూసేందుకు భారీగా తరలివస్తుండటం విశేషం. ఇక ఈ ఏడాది కూడా మండలపూజకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. (చదవండి: శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సాద్య..! ఈ విందలో ఏం ఉంటాయంటే..) -
విశాఖ గోమాంసం కేసులో ట్విస్ట్
సాక్షి, తగరపువలస (విశాఖపట్నం): విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో పట్టుబడిన 189 టన్నుల గో మాంసాన్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ బోర్డు, పశు సంవర్థకశాఖ, రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో పూడ్చివేయనున్నట్టు లా అండ్ ఆర్డర్ డీసీపీ – 1 వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. సోమవారం ఆయన ఆనందపురంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గోవులను వధించి వాటి మాంసాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్న నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఇటీవల గుజరాత్, కోల్కతా, విశాఖ పోర్టుల్లో తనిఖీ చేసిన సమయంలో శొంఠ్యాం శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజీని కూడా తనిఖీ చేశారని తెలిపారు. నవంబరు 3న విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, ఆనందపురం పోలీసులు కోల్డ్ స్టోరేజీకి వెళ్లేసరికి గేదె మాంసం పేరుతో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ విదేశాలకు పంపించడానికి సిద్ధంగా ఉన్న వాటి నుంచి ఆరు శాంపిళ్లు తీసి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారన్నారు.87,945 కిలోల నుంచి తీసిన మూడు శాంపిళ్లలో ఆవు మాంసం, 37,656 కిలోల నుంచి తీసిన రెండు శాంపిళ్లలో ఎద్దు మాంసం, 18,720 కిలోల నుంచి తీసిన ఒక శాంపిల్లో గేదె మాంసం ఉన్నట్టు తేలిందన్నారు. మిగిలిన 45,416 కిలోల మాంసం నుంచి ఎనిమిది శాంపిళ్లను కూడా ల్యాబ్కు పంపించినట్టు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో ఎక్కువ భాగం ఆవు మాంసం ఉండడంతో... ఆవులను వధించడం చట్టరీత్యా నేరమైనందున అదే రోజు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం 189 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారని పేర్కొన్నారు.ఎగుమతిదారుడు, ఇద్దరు సరఫరాదారుల అరెస్ట్ విచారణలో భాగంగా గో మాసం ఎగుమతిదారుడైన మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని మహమ్మద్ ఫర్హాన్ను అరెస్ట్ చేశామని, ఆవు మాంసం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసే రాకెట్లో ఉన్నవారిని కూడా గుర్తించామన్నారు. మహారాష్ట్రలోని లోనావాలాకు చెందిన గోమాంసం సరఫరాదారుడు మన్సూర్ ఆలీని ప్రధాన నిందితుడిగా, ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మరో సరఫరాదారుడు రషీద్ ఖురేషీని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ విచారణ చేపట్టామన్నా రు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆవులను వధించి తప్పుడు ఇన్వాయిస్లు, వే బిల్లులు, హెల్త్ సర్టిఫికెట్లు సృష్టించి గేదె మాంసం పేరుతో విశాఖ పోర్టు ద్వారా ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఈ నెట్వర్క్లో మొత్తం 9 మంది వున్నారని, మిగిలిన నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి తెలిసే ఉంటుంది. ఆయన కొడుకు రాజీవ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కాకపోతే ఒక్కటి కూడా హిట్ కాలేదు. 2021లో చిరంజీవి చేతుల మీదగా ఓ మూవీని లాంచ్ చేశారు. అయితే ఆ చిత్రం చాన్నాళ్లుగా థియేటర్లో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించిన సినిమా '11:11'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీశారు. అయితే ఆర్థిక కారణాలా లేదా మరే కారణమో తెలీదు గానీ గత రెండు మూడేళ్లుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయారు. ఎలాగోలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి సైలెంట్గా తీసుకొచ్చేశారు. తెలుగులో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా' చిత్రాలు బుధ, గురువారాల్లో వరసగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు కూడా డిజిటల్గా అందుబాటులోకి రానున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2' ఈ శుక్రవారం ఓటీటీలోకి రానుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
Sangareddy: అతివేగంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విలువ తగ్గినా మంచికే!
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం అనేది సాధారణంగా ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. అయితే, ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే దీనివల్ల భారత ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని కీలకమైన సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అదెలాగంటారా? ముఖ్యంగా ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, దేశీయ తయారీ రంగంపై దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఎలాగో చూద్దాం.ఎగుమతులకు లభించే ప్రోత్సాహంరూపాయి విలువ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గుతాయి. అంటే విదేశీ కొనుగోలుదారులకు మన ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. చైనా వంటి దేశాలతో పోటీ పడేటప్పుడు తక్కువ ధర కలిగిన భారతీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశీ కరెన్సీలో (డాలర్లలో) వచ్చే ఆదాయాన్ని రూపాయల్లోకి మార్చినప్పుడు ఎగుమతిదారులకు మునుపటి కంటే ఎక్కువ మొత్తం అందుతుంది. ఇది ఐటీ, ఫార్మా, వస్త్ర పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుంది.ప్రవాస భారతీయుల నుంచి రెమిటెన్స్లుప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుంచి నిధులను పొందే దేశం భారత్. రూపాయి విలువ పడిపోవడం ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఒక వరం లాంటిది. వారు ఇండియాకు పంపే ప్రతి డాలర్కు ఇప్పుడు ఎక్కువ రూపాయలు వస్తాయి. దీనివల్ల వారి కుటుంబాల వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేస్తుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతందిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. విదేశీ వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు స్వదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఇది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. విదేశీ కంపెనీలు భారత్లో కార్యాలయాలను లేదా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం మునుపటి కంటే చౌకగా మారుతుంది. దీనివల్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI) పెరిగే అవకాశం ఉంది.పర్యాటక రంగం అభివృద్ధివిదేశీ పర్యాటకులు భారత్లో పర్యటించేందుకు మరింత తక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డాలర్ విలువ పెరగడం వల్ల విదేశీయులు తక్కువ ఖర్చుతోనే భారతదేశంలో ఎక్కువ రోజులు గడపవచ్చు. ఇది హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు ఆదాయాన్ని పెంచుతుంది.ప్రభుత్వానికి ఆదాయందేశంలో దిగుమతి చేసుకునే వస్తువుల విలువ రూపాయల్లో పెరగడం వల్ల వాటిపై విధించే కస్టమ్స్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల ద్వారా లాభపడే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి అధిక డివిడెండ్లు అందే అవకాశం ఉంది.రూపాయి విలువ తగ్గడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతుల భారం పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ సరైన విధానాలతో ఎగుమతులను, దేశీయ ఉత్పత్తిని పెంచుకుంటే భారత్ దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఎగుమతి ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు బలహీనమైన రూపాయి ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేస్తుంది.ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా.. -
పూర్ణిమా..వాడిని వదిలేయ్!
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు. ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్లో అశోక్ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఆసీస్ జట్టులో ఊహించని మార్పులు.. నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. అయితే ఆసీస్ జట్టులో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడి స్దానంలో తిరిగి వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. అనారోగ్యం కారణంగా మూడో టెస్టుకు ఆఖరి నిమిషంలో దూరమైన స్మిత్.. తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇక కమ్మిన్స్తో పాటు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా అందుబాటులో లేడు.అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో లియోన్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడు. మాట్ కుహ్నెమాన్, కోరీ రోచిసియోలి వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మర్ఫీ వైపే మొగ్గు చూపారు. ఈ విక్టోరియన్ ఆఫ్ స్పిన్నర్ గతంలో లియోన్ గైర్హాజరీలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక కమ్మిన్స్ స్ధానంలో జే రిచర్డ్సన్కు చోటు దక్కింది. ఈ వెస్ట్ ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ చివరగా ఆసీస్ తరపున టెస్టు మ్యాచ్ 2021లో ఆడాడు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. కాగా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్.. యాషెస్ సిరీస్ను ఇప్పటికే 3-0 తేడాతో సొంతం చేసుకుంది.బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేజర్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్ -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు నష్టంతో 26,144 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 128 పాయింట్లు దిగజారి 85,434 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 23-12-2025(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బస్సు బోల్తా.. 16 మంది మృతి
జకార్తా: ఇండోనేసియాలోని ప్రధాన దీవి జావాలో జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున సెమరంగ్ నగరంలోని క్రప్యక్ టోల్ ప్లాజా సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..ఇండోనేషియాలో పురాతన నగరం యోగ్యకర్త నుంచి రాజధాని జకార్తాకు వస్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులున్నారు. వేగంగా వస్తున్న బస్సు మలుపులో అదుపుతప్పి కాంక్రీట్ గోడను ఢీకొని, పల్తీ కొట్టింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దాదాపు 40 నిమిషాలకు పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.ప్రమాద తీవ్రతకు నుజ్జయిన బస్సులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 10 మంది తుదిశ్వాస విడిచారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగాను, మరో 13 మంది ఆందోళనకరంగాను ఉందని పోలీసులు తెలిపారు. బస్సును నడుపుతున్న అసిస్టెంట్ డ్రైవర్ కూడా క్షతగాత్రుల్లో ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🚌 At least sixteen people were killed early Monday in a #bus accident at the intersection of the Krapyak toll exit in Semarang city, #Indonesia's Central Java province, local authorities reported. #BusAccident pic.twitter.com/v6gAj2medT— A Ahmed (@_AAhmed004) December 22, 2025 -
'ధురంధర్' కలెక్షన్స్లో మాకు వాటా ఇవ్వాలి: పాక్ ప్రజలు
'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతం బ్యాక్డ్రాప్లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. అయితే వసూళ్లలో తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ.. 'ధురంధర్' వసూళ్లలో కనీసం సగానికి సగమైనా సరే లయరీ ప్రజలకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరైతే రూ.5 కోట్లు, రూ.20 కోట్లు అని నోటికొచ్చినట్లు మొత్తాన్ని చెప్పారు. మరోవ్యక్తి మాత్రం కలెక్షన్స్లో కొంత మొత్తంతో ఆస్పత్రి కట్టించి ఇవ్వాలని అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఒకవేళ దర్శకుడు ఇవ్వాలనుకున్నా సరే తమకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదని తమ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఈ సినిమాని పాకిస్థాన్లో బ్యాన్ చేశారు. అయినా సరే అక్కడి ప్రజలు పైరసీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అలా ఏకంగా 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ, పెళ్లిళ్లలో వీటినే ప్లే చేస్తూ పాక్ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా దాయాది దేశంలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పొచ్చు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాని.. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్.. రహస్యంగా పాక్ వెళ్లి అక్కడి గ్యాంగ్లో చేరి వాళ్లనే ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్తో తీశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో యాక్టింగ్ అదరగొట్టేశారు. మ్యూజిక్, సాంగ్స్ కూడా సూపర్ ఉండటంతో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)BREAKING: Pakistanis want @AdityaDharFilms to give Lyari a portion of Dhurandhar's profits"Kam se kam yeh toh theek karwa lein"🤣🤣🤣🤣 pic.twitter.com/djlvJrLaJi— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2025 -
ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు
బలూచిస్తాన్లో ఇంతవరకూ తమ ఇంటిలోని పురుషుల అదృశ్యాలతో గుండెకోతకు గురైన మహిళలు.. ఇప్పుడు నిత్యం వారే పాక్ దళాల కిడ్నాప్కు బలి అవుతున్నారు. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం పోరాడుతున్న బలూచ్ మహిళల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అపహరణలు, నిర్బంధాల రూపంలో పాక్ సాగిస్తున్న ఈ అణచివేత ఒక జాతి మనుగడను, ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. మరోవైపు గడప దాటి బయటకు వచ్చి, న్యాయం అడుగుతున్న ఆడబిడ్డల గొంతు నొక్కే ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. బలూచ్ పోరాట పటిమను నీరుగార్చాలనే పాక్ కుట్రలు ఆ ప్రాంతాన్ని కన్నీ సంద్రంగా మార్చివేస్తున్నాయి. గతంలో బలూచ్ సంప్రదాయాల దృష్ట్యా మహిళలను నిర్బంధించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ మానవ హక్కుల మండలి (హెచ్ఆర్సీబీ)నివేదిక ప్రకారం.. మహిళలను అపహరించడం అనేది పాకిస్తాన్ భద్రతా దళాలైన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)లకు ఒక దైనందిన కార్యక్రమంగా మారింది. హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను భయపెట్టడం ద్వారా, బలూచ్ ప్రతిఘటనను అణచివేయడమే పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.హెచ్ఆర్సీబీ వెల్లడించిన కేసుల్లో కొన్ని..గుల్జాది.. ఒకే ఏడాదిలో మూడుసార్లు వేధింపులు.. మానవ హక్కుల కార్యకర్త అయిన గుల్జాది జీవితం నేటి బలూచిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 2025, ఏప్రిల్ 7న క్వెట్టాలో ఆమెను సిటిడి బలగాలు కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకెళ్లాయి. మార్చిలో రెండుసార్లు ఆమె ఇంటిపై దాడి చేసిన బలగాలు.. చివరికి ఆమెపై 16 తప్పుడు కేసులు బనాయించాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆమెను 3-MPO (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) కింద జైలులో నిర్బంధించారు. ఒక సామాన్య మహిళను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హెచ్ఆర్సీబీ పేర్కొంది.మహజబీన్ బలోచ్.. విద్యార్థిని అని కూడా చూడకుండా.. యూనివర్శిటీ ఆఫ్ బలూచిస్తాన్లో బీఎస్సీ లైబ్రరీ సైన్స్ చదువుతున్న 24 ఏళ్ల మహజబీన్, 2025, మే 29న క్వెట్టా సివిల్ హాస్పిటల్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అర్ధరాత్రి మూడు గంటలకు హాస్టల్ గదుల్లోకి చొరబడిన బలగాలు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాయో నేటికీ వెల్లడి కాలేదు. బలూచ్లో విద్యార్థినులకు కూడా రక్షణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.రొబినా బలోచ్.. ఆరోగ్య కార్యకర్తపై అమానుషం.. 2025, జూన్ 30న టర్బత్లోని ఓవర్సీస్ కాలనీలో నివసిస్తున్న ప్రభుత్వ హెల్త్ విజిటర్ రొబినా ఇంటిని ఫ్రాంటియర్ కార్ప్స్ ధ్వంసం చేసింది. ఆమెను ఎటువంటి కారణం లేకుండా అపహరించి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసి విడుదల చేశారు.సఫియా బీబీ.. సామూహిక శిక్షకు బలి2025, అక్టోబర్ 5న ఖుజ్దార్లోని జెహ్రీలో భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. ఆ ఊరంతా కర్ఫ్యూ విధించి, ఇంటింటిలో సోదాలు చేసిన బలగాలు సఫియా బీబీని రహస్య ప్రదేశానికి తరలించారు. గ్రామాన్ని మొత్తం ముట్టడించి భయాందోళనకు గురిచేయడంలో భాగంగానే ఈ అపహరణ జరిగింది.నజియా షఫీ.. కస్టడీలో మృతి..2025, అక్టోబర్ 28న పంజ్గూర్లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా నిలిచింది. తల్లి పారి బలోచ్, కుమార్తె నజియాలను పాక్ బలగాలు తుపాకీతో బెదిరించి తమతో పాటు తీసుకెళ్లాయి. మరుసటి రోజు నజియాను తీవ్ర గాయాలతో ఆసుపత్రి సమీపంలో పడేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇది నేరుగా ప్రభుత్వ కస్టడీలో జరిగిన హత్యేనని హెచ్ఆర్సీబీ చెబుతోంది. మృతురాలి తల్లి పారి బలోచ్ కూడా బలగాల చేతుల్లో చిత్రహింసలకు గురైన తర్వాత విడుదలైంది.నస్రీన్.. 15 ఏళ్ల బాలిక అదృశ్యం అవరాన్కు చెందిన నస్రీన్ అనే 15 ఏళ్ల మైనర్ బాలికను నవంబర్ 22న హబ్ చౌకీ వద్ద అపహరించారు. సిటిడి, మిలిటరీ ఇంటెలిజెన్స్ బలగాలు ఆమెను అపహరించాయి. చిన్నపిల్లలపై ఈ తరహా దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.ఫర్జానా జెహ్రీ.. బహిరంగంగా కిడ్నాప్ 2025, డిసెంబర్ 1న ఖుజ్దార్లో ఆసుపత్రి నుండి వస్తున్న ఫర్జానాను దారి మధ్యలో పాక్ బలగాలు అపహరించాయి. ఇది జరిగింది ఎక్కడో గదుల్లోనే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేసింది.రహిమా: గృహిణులు కూడా టార్గెట్ 2025, డిసెంబర్ 9న దల్బందిన్లో 20 ఏళ్ల గృహిణి రహిమాను, ఆమె 18 ఏళ్ల తమ్ముడిని అర్ధరాత్రి దాడుల్లో భాగంగా తీసుకెళ్లారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు.చట్టం కనుమరుగు.. అణచివేత రాజ్యంపాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 (వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 10 (నిర్బంధంపై రక్షణ), ఆర్టికల్ 14 (మానవ గౌరవం)లను భద్రతా సంస్థలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. మహిళల హక్కుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థల, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఏమాత్రం గౌరవించడం లేదు. మానవ హక్కుల కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని, చివరకు గృహిణులను కూడా వదలని ఈ నిరంకుశ పోకడలు బలూచిస్తాన్ను ఒక బహిరంగ జైలుగా మారుస్తున్నాయి. జవాబుదారీతనం లేని బలూచ్లో న్యాయం కనుమరుగవుతోంది. ఈ దుర్భర స్థితిపై అంతర్జాతీయంగా వచ్చే స్పందన కోసం వివిధ మానవహక్కుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం -
క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా పెంచిన బీసీసీఐ
దేశవాళీ మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తీపి కబురు అందించింది. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవాళీ స్థాయిలోనూ పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు వేతనాలు అందుకోనున్నారు. గతంతో పోలిస్తే మ్యాచ్ ఫీజులు దాదాపు 2.5 రెట్లు పెరిగాయి. సోమవారం (డిసెంబర్ 22) వర్చువల్గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.కొత్త ఫీజుల ప్రకారం.. సీనియర్ మహిళా క్రికెటర్లు వన్డే, బహుళ రోజుల టోర్నీలలో ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటే ఇకపై రోజుకు రూ. 50 వేలు అందుకుంటారు. ప్రస్తుతం ఇది రూ. 20 వేలుగా ఉంది. అంటే దాదాపు రూ. 30 వేలు పెరిగింది. తుది జట్టులోని లేని సభ్యులకు ఒక్కో మ్యాచ్కు రూ. 25,000(ప్రస్తుతం రూ.12,500) లభించనుంది.అదే విధంగా సీనియర్ క్రికెటర్లు టీ20ల్లో ఇకపై రోజుకు రూ.25 వేలు మ్యాచ్ ఫీజుల రూపంలో లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీజు పది వేలుగా ఉంది. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రూ.12.500 లభిస్తాయి. గతంలో ఒక సీనియర్ మహిళా క్రికెటర్ అన్ని ఫార్మాట్లలో కలిపి లీగ్ మ్యాచ్లు ఆడితే దాదాపు రూ.3 లక్షలకు వరకు సంపాదించేవారు. ఇప్పుడు ఆ మెత్తం గణనీయంగా పెరగనుంది.జూనియర్లకు బంపరాఫర్..జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ల జీతాలు కూడా బీసీసీఐ పెంచింది. జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ల(వన్డే, మల్టీ డేస్)లో ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్న ఆటగాళ్లకు ఒక రోజు ఆడితే రూ. 25,000 అందుకోనున్నారు. ప్రస్తుతం ఇది పది వేలుగా ఉంది. రిజర్వ్ ఆటగాళ్లకు రూ. 12,500 లభిస్తాయి. అదేవిధంగా టీ20 మ్యాచ్లలో ఆడే ఆటగాళ్లకు రూ. 12,500, రిజర్వ్ ఆటగాళ్లు రూ. 6250 అందనుంది.కేవలం ఆటగాళ్లకే కాకుండా అంపైర్లు, మ్యాచ్ రెఫరీల ఫీజులను కూడా బీసీసీఐ పెంచింది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. లీగ్ మ్యాచ్ల కోసం రోజుకు రూ.40,000, నాకౌట్ మ్యాచ్ల కోసం రోజుకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు అందుకోనున్నారు.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
చచ్చినా చావను..!
చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపించి ఉంటుందిలెండి. మందుమాకులతో చచ్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన వాళ్లూ కొంతమంది ఉన్నారు. అయితే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తాను 2039 నాటికల్లా చావును జయిస్తానంటున్నాడు బ్రయన్ జాన్సన్. ఎవరీ బ్రయన్? ఏమిటీ దీని వెనుక బ్రెయిన్?బ్రయన్ జాన్సన్ (Bryan Johnson) ఒక బయో హ్యాకర్. అంటే రకరకాల రసాయనాలు, పోషకాలతో శరీరం వయసు పెరక్కుండా చూసుకుంటూంటాడు. ఆ మధ్య న్యూఢిల్లీకి వచ్చి... వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక వెళ్లిపోయాడు కూడా. తాజాగా 48 ఏళ్ల బ్రయన్ ఇంకో సంచలన ప్రకటన చేశాడు. కృత్రిమ మేధ సాయంతో 2039 నాటికి చావును జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఎలా? అని అడిగితే ఆయనిస్తున్న సమాధానం ఏమిటంటే...కొన్ని పద్దతులను కచ్చితంగా ఉపయోగించడం మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని బ్రయన్ నమ్మకం. ఇందుకు రోజూ వంద వరకూ ట్యాబ్లెట్లు. బోలెడన్ని పౌడర్లు, ద్రవాలు మింగుతూంటాడు.వీటిల్లో మల్టీ విటమిన్స్, నాచు నుంచి తీసిన ఒమెగా-3, కొలేజన్ మిశ్రమాలు, పాలిఫినాల్లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్, దీర్ఘాయుష్షు ఇస్తాయని అతడు నమ్మే 13 రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కాకుండా.. మెదడు, గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలూ రోజూ తీసుకుంటూంటాడు. ఇందుకోసం ఈ మిలియనీర్ పెట్టే ఖర్చు ఏడాదికి 20 లక్షల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే 166 కోట్లు!. వీటన్నింటి కారణంగానే ఏమో... 48 ఏళ్ల బ్రయన్ జాన్సన్ చూసేందుకు మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. అయితే అతగాడు ఇప్పుడు అంత సంతృప్తిగా ఏమీ లేడు. వందేళ్లు కాదు.. ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు.సులువుగా సరికొత్త మందులు...ఐదేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న ఏఐ టెక్నాలజీ చావును జయించేందుకు కూడా కీలకమని బ్రయన్ విశ్వాసం. ఏఐ ద్వారా బయోటెక్, అవయవాల క్లోనింగ్, కొత్త కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని ఫలితంగా అంతం లేని ఆయుష్షు కూడా సాధ్యమే అంటాడు బ్రయన్. ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్షును జయించాయని, జెల్లీఫిష్, హైడ్రా, కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు. ఇప్పుడు తాను తీసుకుంటున్నట్లే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం, వైద్యుల పర్యవేక్షణలతో దీర్ఘాయుష్షు సాధ్యమంటాడు. కృత్రిమ మేధ ద్వారా అవయవాల క్లోనింగ్ సులువైతే ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త మందులను చాలా వేగంగా అభివృద్ధి చేయవచ్చునని, ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ... శాస్త్రవేత్తలు కొందరు మాత్రం బ్రయన్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. శరీరం వయసు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ.. మొత్తానికి నిలిపేయడం అంటే చావును జయించడం ఊహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చావు లేకుండా చేయవచ్చు అన్న భావనకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అమరత్వం (Immortal) సిద్ధించినా.. అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైతేనేం.. బ్రయన్ జాన్సన్కు జై! అమరత్వం జిందాబాద్! -
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
ఎందుకు ఇచ్చారు..? ఎవరు ఇమ్మన్నారు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన వ్యూహం మార్చింది. ఓ పక్క సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలోని కార్యాలయంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును విచారిస్తోంది. మరోపక్క ఆయనకు పదవీ విరమణ అనంతరం ఎక్స్టెన్షన్ లభించడం, సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీనికి వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తోంది. ఈ విషయం నిగ్గు తేల్చడానికి అప్పట్లో కీలక బాధ్యతల్లో పని చేసిన అధికారులను ప్రశి్నస్తోంది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, నిఘా విభాగం మాజీ చీఫ్ నవీన్ చంద్లకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణిస్తూ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా పని చేసిన వారితో పాటు కొందరు సలహాదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25 వరకు ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ విచారణ చేపట్టాలని సిట్ భావిస్తోంది. వచ్చే నెల 16న సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చే సమయానికి కొత్తగా మరికొన్ని కీలకాంశాలను గుర్తించాలని, న్యాయస్థానానికి నివేదించడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్రావు 2016లో ఎస్ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఆయన మాత్రం ఎస్ఐబీ చీఫ్గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబీని మాత్రం వదల్లేదు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్టెన్ష¯Œన్పై కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఎక్స్టెన్షన్ కోసం నిఘా విభాగాధిపతి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతోనే ప్రధాన కార్యదర్శి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి వరకు చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కుమార్తో పాటు 2016 సెపె్టంబర్ నుంచి 2020 నవంబర్ వరకు నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్చంద్ వాంగ్మూలాలూ ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రభాకర్రావు కొనసాగింపు వెనుక పెద్దల ప్రమేయం, ఒత్తిడి ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలోనూ వీరిద్దరినీ విచారించింది. ప్రభాకర్రావుకు ఎక్స్టెన్సన్ ఎందుకు ఇచ్చారు? అలాంటి ప్రతిపాదనలు రూపొందించమని ఎవరు చెప్పారు? ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ ప్రక్రియ జరిగింది? తదితర అంశాలను ప్రశి్నంచారు. త్వరలోనే మరికొందరినీ ప్రశి్నంచడానికి సిట్ సన్నాహాలు చేస్తోంది. సోమేష్కుమార్, నవీన్ చంద్ ఇచి్చన వాంగ్మూలాల్లోని అంశాల ఆధారంగా గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అడగాల్సిన ప్రశ్నల్ని సిట్ సిద్ధం చేస్తోంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి«నిధులకు సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలిసింది. -
ఉగాండా జాతీయురాలి డిపోర్టేషన్
సాక్షి, హైదరాబాద్: ఉగాండా నుంచి టూరిస్ట్ వీసాపై వచ్చి... వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటూ డ్రగ్ సప్లయర్స్తో కలిసి తిరుగుతున్న జూలిన విక్టర్ నబితకను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సోమవారం డిపోర్టేషన్ విధానంలో ఆమె స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపింది. ఫారెనర్స్ రీజనల్ రిజి్రస్టేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సోమవారం వెల్లడించారు. జూలీనా ఉగాండాలో విద్యనభ్యసించింది. ఆపై టూరిస్ట్ వీసాపై 2024 ఫిబ్రవరి 12న ముంబై వచ్చింది. అక్కడి నుంచి చెన్నై, ముంబై, బెంగళూరుల్లో కొన్నాళ్లు నివసించింది. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు కొందరు డ్రగ్ పెడ్లర్లు, సప్లయర్లతో జట్టు కట్టింది. వారి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలను సప్లయర్స్ నుంచి తీసుకురావడం, కస్టమర్లకు అందించడం మొదలుపెట్టింది. ఇందు కోసమే తరచూ హైదరాబాద్కు రాకపోకలు సాగించేది. ఇటీవల టోలిచౌకీ ప్రాంతంలో కొందరు డ్రగ్ పెడ్లర్స్తో ఉన్న జూలీనాను హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలోని బృందం పట్టుకుంది. మిగిలిన వారిని అరెస్టు చేయగా... ఆమె వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించకపోవడంతో లోతుగా ఆరా తీసింది. దీంతో ఆమె పాస్పోర్టు గడువు 2033 వరకు ఉన్నప్పటికీ వీసా మాత్రం ఈ ఏడాది జనవరి 18న ఎక్స్పైర్ అయినట్లు తేలింది. దీంతో విషయాన్ని ఎఫ్ఆర్ఆర్ఓకు తెలిపిన హెచ్–న్యూ ఆమెను డిటెన్షన్ సెంటర్లో ఉంచింది. డిపోర్టేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసి ఆదివారం ఉగాండాకు తిప్పి పంపింది. 2022 నుంచి ఇప్పటి వరకు హెచ్–న్యూ దాదాపు 40 మంది విదేశీయులను పట్టుకుని, వారి దేశాలకు డిపోర్టేషన్ చేసింది. వీరిలో నైజీరియా, సూడాన్, ఘనా, ఐవరీ కోస్ట్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. -
బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్కు ఎక్స్ప్రెస్ వే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్ నుంచి ఫిల్మ్నగర్ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి గచి్చ»ౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ తాజాగా టెండర్లను ఆహా్వనించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్రింగ్రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ మీదుగా ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు. ఔటర్ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్పాస్లను నిరి్మంచనున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. మరోవైపు షేక్పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. ష్క్పేట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్రింగ్రోడ్డుకు, అలాగే ఔటర్రింగ్రోడ్డు నుంచి అన్ని వైపు లా రీజనల్ రింగ్రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. -
గడువులోగా మెట్రో స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: నిరీ్ణత గడువులోగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీలు, న్యాయపరమైన అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఐడీబీఐ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. మరోవైపు మెట్రో రైళ్ల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలపైన అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు త్వరలో టెక్నికల్ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మెట్రో స్వా«దీనప్రక్రియ పురోగతిపై మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ‘సాక్షి’తో ముచ్చటించారు. మరో వారం పది రోజుల్లో టెక్నికల్ కన్సల్టెన్సీ నియామకం పూర్తవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కియోలిస్ సంస్థ ఆధ్వర్యంలోనే మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, రైళ్ల నిర్వహణ తదితర అంశాలను కియోలిస్ పర్యవేక్షిస్తోంది. మరో ఏడాది పాటు ఈ సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంది. కానీ మొదటిదశతో పాటు భవిష్యత్తులో నిర్మించనున్న రెండో దశ మెట్రో కూడా పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగా అవతరించనున్న దృష్ట్యా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మొత్తం రైళ్ల నిర్వహణపై ఈ సాంకేతిక అధ్యయనం దిశా నిర్దేశం చేయనుందని ఎండీ చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రో మొదటి దశ నుంచి వైదొలగనున్నట్లు ఎల్అండ్టీ ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వం కూడా మొదటి దశను స్వా«దీనం చేసుకునేందుకు సన్నద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కూడా ఏర్పాటైంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో మెట్రో స్వా«దీన కమిటీ పని చేస్తోందని ఆయన వివరించారు. భూములు, భవనాలు స్వాదీనం... ఒప్పందానికి అనుగుణంగా మెట్రో మొదటి దశలో భాగంగా రవాణా ఆధారిత అభివృద్ధి కోసం ఎల్అండ్టీకి అప్పగించిన భూములు, భవనాలు, మాల్స్ను త్వరలో స్వాధీనం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం 212 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయన్నారు.అలాగే మూడు కారిడార్లలోని మాల్స్, ఇతర ఆస్తులను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఒప్పందం మేరకు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం రూ.2000 కోట్లు అందజేయవలసి ఉంది.అలాగే బ్యాంకుల్లో ఉన్న మరో రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకోనున్న ఆస్తులు, భూముల విక్రయాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కియోలిస్ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రో రైళ్లనిర్వహణను అదే సంస్థతో యథావిధిగా కొనసాగించినా, లేదా మరో సంస్థను ఎంపిక చేసినా అందుకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేయవలసి ఉంటుంది. అలాగే ప్రయాణికుల రద్దీ, డిమాండ్కు అనుగుణంగా కొత్త కోచ్ల కొనుగోలు అంశం కూడా ప్రతిపాదనలో ఉంది.సకాలంలో రెండో దశ..మెట్రో రెండో దశకు కేంద్రం సానుకూలంగా ఉందని, సకాలంలోనే అన్ని కారిడార్లలో ఒకేసారి పనులను చేపట్టే అవకాశం ఉందని ఎండీ తెలిపారు. గతంలో కేంద్రానికి అందజేసిన డీపీఆర్ల ఆధారంగానే రెండో దశ ప్రాజెక్టుపైన ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వమే స్వాదీనం చేసుకుంటున్నందు వల్ల రెండో దశ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పరిధిలో రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన ఆస్తుల సేకరణ దాదాపుగా పూర్తయినట్లు ఎండీ చెప్పారు. మొత్తం 880 నిర్మాణాలను గుర్తించగా, ఇప్పటి వరకు సుమారు 700 ఆస్తులను సేకరించి కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రెండో దశలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు నిరి్మంచనున్న కారిడార్లో కూడా భూసేకరణ చేపట్టవలసి ఉందని, మిగతా కారిడార్లలో పెద్దగా భూసేకరణ అవసరం లేకుండానే రెండో దశ ప్రాజెక్టును నిరి్మంచబోతున్నామని సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు. -
క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' తెలుగు ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.. తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలామందికి తెలుసు. ద డార్క్ నైట్స్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ లాంటి క్రేజీ టైమ్ ట్రావెల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాడు. ఇతడి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. ఈ చిత్ర ట్రైలర్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ది కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)సాధారణంగా నోలన్ తీసే సినిమాలన్నీ ఫిజిక్స్, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఉంటాయి. కానీ కెరీర్లో తొలిసారి వార్ మూవీ తీస్తున్నాడు. ట్రైలర్లో పెద్దగా స్టోరీ ఏం రివీల్ చేయలేదు గానీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉండబోతున్నాయని హింట్ అయితే ఇచ్చాడు. వచ్చే జూలై 17న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ కూడా తీసుకురాబోతున్నారు. విచిత్రం ఏంటంటే మూవీ విడుదలకు ఏడాది ముందే టికెట్ బుకింగ్స్ తెరిస్తే అవి నిమిషాల్లో సేల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?) -
భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్కు విలియమ్సన్ను దూరంగా ఉండనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు. గత నెలలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్తో టెస్టు సిరీస్లో మాత్రం మాడాడు. మౌంట్మంగనూయ్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు."ఒక్కో సిరీస్కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు. -
బంగ్లాదేశ్లో దాస్ హత్య.. ముందే ఫోన్ చేస్తే బతికేవాడు
సాక్షి, నేషనల్ డెస్క్: బంగ్లాదేశ్లో మతోన్మాదుల చేతిలో నిస్సహాయంగా మూక హత్యకు గురైన హిందూ మైనారిటీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ ఉదంతానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన పని చేసిన కంపెనీ వర్గాలతో పాటు సహచరులే హత్యలో పాత్రధారులుగా మారినట్టు పోలీసులు వెల్లడించారు! దాంతో బంగ్లాదేశ్లోని మైనారిటీ వర్గాలన్నీ మరోసారి భగ్గుమంటున్నాయి.బంగ్లాదేశ్లో మైమెన్సింగ్ పట్టణంలోని ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికునిగా పని చేస్తున్న 27 ఏళ్ల దాస్ డిసెంబర్ 16న దారుణ హత్యకు గురవడం తెలిసిందే. కంపెనీ ఆవరణ బయటే మతోన్మాద మూక ఆయనను అతి దారుణంగా కొట్టిచంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఢాకా–మైమెన్గంజ్ హైవే మీదికి లాక్కెళ్లి బాహాటంగా తగలబెట్టింది. మత దూషణకు పాల్పడ్డాడన్నది దాస్పై ప్రధాన ఆరోపణ. అయితే అందుకు అసలు ఆధారాలే లేవని పోలీసులు ఇప్పుడు తీరిగ్గా చెబుతున్నారు. పైగా దాస్ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) స్పష్టం చేయడం విశేషం. అంతేకాదు, దాస్ను దారుణంగా కొట్టిచంపడంలో ఏకంగా ఆయన సహోద్యోగులు కూడా మూకతో చేతులు కలిపినట్టు ఆర్ఏబీతో పాటు స్థానిక మీడియా కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్ఏబీ ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. అనంతరం పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అసలేం జరిగింది? దాస్ మతదూషణకు పాల్పడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినట్టు డిసెంబర్ 16న ఉదయం నుంచే జోరుగా పుకార్లు షికారు చేశాయి. విషయం తెలియని ఆయన ఎప్పట్లాగే విధులకు హాజరయ్యాడు. అదే ఆయన పాలిట మృత్యువుగా పరిణమించింది. సాయంత్రానికల్లా సహోద్యోగులే ఆయనను దూషించడం మొదలుపెట్టారు. వారించాల్సిన పై అధికారులు పట్టించుకోకపోగా, దాస్తో బలవంతంగా రాజీనామా పత్రంపై సంతకం చేయించారు.మరోవైపు మధ్యాహ్నం నుంచే కంపెనీ బయట ఉన్మాద మూక పోగడం మొదలుపెట్టింది. సాయంత్రానికల్లా దాస్పై ఫ్యాక్టరీ ఆవరణలోనే తొలి దాడి జరిగినట్టు ఆర్ఏబీ–14 క మాండర్ నయీముల్ హసన్ వెల్లడించారు! ‘‘ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్చార్జి దాస్తో బలవంతంగా రాజీనామా చేయించడమే గాక ఆవేశంతో ఉడికిపోతున్న మూకకు ఆయనను స్వయంగా అప్పగించాడు. రాత్రి 8:30 గంటల వేళ, సరిగ్గా తర్వాతి షిఫ్ట్ కార్మికులు చిన్న గేట్ గుండా లోపలికొస్తున్న సమయంలో, బయట మూగిన మూక చూస్తుండగా దాస్ను బలవంతంగా లాక్కెళ్లి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ రూములో ఉంచాడు.అంతే! ఆ వెంటనే మూక లోనికి దూసుకొచ్చి దాస్ను బయటికి లాక్కెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే విచక్షణారహితంగా కొట్టిచంపింది. దాస్ సహోద్యోగులు కూడా వారితో చేతులు కలపడం ఈ ఉదంతంలో మరో విషాదం’’అని హసన్ వివరించారు. అంతేకాదు, ‘‘ఇంత ఉద్రిక్తత నెలకొన్నా రాత్రి 8 గంటల దాకా ఫ్యాక్టరీ బాధ్యులు తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. సకాలంలో ఒక్క ఫోన్ కాల్ చేసుంటే దాస్ బతికేవాడే’’అని చెప్పుకొచ్చారు. ‘‘ఫోన్ రాగానే మేం హుటాహుటిన బయల్దేరినా కిలోమీటర్ల కొద్దీ విపరీతంగా ట్రాఫిక్ జామై సకాలంలో ఘటనా స్థలికి చేరలేకపోయాం. మేం వెళ్లేసరికే అంతా అయిపోయింది’’అన్నారు.కంపెనీ అంగీకారం! దాస్ హత్యోదంతంలో ఫ్యాక్టరీ తప్పేమీ లేదని సీనియర్ మేనేజర్ షకీబ్ మహ్మూద్ బుకాయించినా, సహోద్యోగుల్లో కొందరు సాయంత్రానికల్లా దాస్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారంటూ వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు! అంతేకాదు, దాస్ దైవదూషణకు పాల్పడ్డట్టు ఎలాంటి రుజువులూ దొరకలేదని కూడా అంగీకరించాడు. ‘‘మూకను శాంతింపజేసేందుకు దాస్తో ఉత్తుత్తి రాజీనామా చేయించాం. కానీ ఆ చర్యతో మూక కాదు కదా, సహోద్యోగులు కూడా శాంతించలేదు’’అంటూ హంతకుల్లో తమ ఉద్యోగులు కూడా ఉన్నట్టు పరోక్షంగా చెప్పాడు. -
‘ఒక్క ఓటుతో ఓడినా.. సర్పంచ్ నేనే’
నార్కట్పల్లి: మండల పరిధిలోని చిన్ననారాయణపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మెరుగు అనితకు, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనితకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనిత గెలుపొందినట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రీకౌంటింగ్ నిర్వహించగా.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెరుగు అనిత ఒక ఓటుతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిపై గెలిచినట్లు ధ్రువీకరణ చేశారు. అయితే సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయినా.. సర్పంచ్ నేనే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు. కాగా గ్రామ పంచాయతీలో 8 వార్డులకు గాను ఐదు వార్డులు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. ముగ్గురు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉప సర్పంచ్, బీఆర్ఎస్ బలపర్చిన వార్డు సభ్యులు హాజరు కాలేదు. దీంతో కేవలం సర్పంచ్తోపాటు ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులతో మాత్రమే ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. -
‘అర్థరాత్రి రోడ్లపై..’ శశి థరూర్ వ్యాఖ్యల కలకలం
పట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన బిహార్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. నలంద సాహిత్య ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రశంసించడం విశేషంగా మారింది.బిహార్లో గతంతో పోలిస్తే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా మొదలైన సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలు నిర్భయంగా రోడ్లపై తిరగగలుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బిహార్లో ప్రత్యర్థి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ఇక్కడ జరిగిన అభివృద్ధిని గుర్తిస్తూ, థరూర్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో విలేకరులు థరూర్ను రాజకీయ అంశాలపై స్పందించమని కోరగా, ఆయన ‘నన్ను రాజకీయాల్లోకి లాగకండి, ఇక్కడి పురోగతిని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రశంసలు బిహార్ ప్రజలకు, వారి ప్రతినిధులకు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీలోని మంచిని గుర్తించాలనే తన ధోరణిని మరోసారి బయటపెట్టారు. అయితే ఇటీవల సీఎం నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలి హిజాబ్ విషయంలో ప్రవర్తించిన తీరును థరూర్ తప్పుబట్టారు.బిజెపి-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమర్థించడం, పాకిస్తాన్పై సైనిక దాడుల నిర్వహణను మెచ్చుకోవడం తదితర అంశాల కారణంగా థరూర్కు, పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదనే వార్తలు వినిపించాయి. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకుంటూనే, తమ పార్టీ సిద్ధాంతాలకు భంగం కలిగినప్పుడు విమర్శించడంలో థరూర్ తన శైలిని బయటపెట్టారు. తాజాగా బిహార్ పర్యటనలో థరూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.ఇది కూడా చదవండి: నేటికీ శతాబ్దాల నాటి యుద్ధ వ్యూహాలు.. వీడియో వైరల్ -
బడిలో.. కిరాణా షాపులో.. చెట్ల కింద..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. మొత్తంగా 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిచోట్ల పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో, కొన్నిచోట్ల భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో ఓ చోట కిరాణా షాపులో, మరోచోట ఆరుబయట, ఇంకోచోట చెట్ల కింద సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల కొలువుదీరిన మొదటి రోజునుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేయడం విశేషం.కిరాణా షాపులో అధ్యక్షా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్గా ఎన్నికైన పావని తన కిరాణా దుకాణంలోని సగభాగంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాలకవర్గ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు.చెట్ల నీడలోనే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలంలోని నల్లబండబోడు, చింతలతండా గ్రామపంచాయతీల భవనాలు నిర్మాణంలో ఉండటంతో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు చెట్ల కిందే టెంట్ నీడలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇదే మండలం గురువాగుతండా, శంభునిగూడెం, సాయిరాంతండా, గాం«దీనగర్ల్లో సొంత భవనాలు లేక పాఠశాల భవనాల్లో పాలకవర్గాలు ప్రమాణం చేశాయి. మద్యపాన నిషేధంతో మొదలు మెదక్ ఎంపీ రఘునందన్రావు స్వగ్రామం, సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్పేట మండలం బొప్పాపూర్లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు సంపూర్ణ మద్య నిషేధంపై తొలి తీర్మానం చేశారు. బెల్ట్షాపులపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. తర్వాత స్వచ్ఛ బొప్పాపూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పని చేసి.. ప్రమాణం చేశారు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని కొంపల్లి నూతన సర్పంచ్ జంగాల సాలమ్మ ప్రమాణస్వీకారానికి ముందు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి చీపురుపట్టి వీధులను శుభ్రపరిచారు. ఆ తరువాత పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ప్రమాణం చేశారు. అద్దె ఇల్లు తీసుకుని.. సిద్దిపేట జిల్లా గాంధీనగర్, బంజేరుపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో సర్పంచ్లు అద్దె ఇల్లును తీసుకున్నారు. ఇది అనువుగా లేకపోవడంతో ఆరుబయటే ప్రమాణం చేశారు. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంతో పాటు వంగపల్లి, హనుమతండా, రెడ్యానాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఓ చోట టెంట్ వేసి ప్రమాణం చేశారు. బడిలో ‘పంచాయతీ’ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో నడిమితండా, సీతానగర్ పంచాయతీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గదిలో కొనసాగుతుండగా, గొల్లకుంట తండా పంచాయతీ కార్యాలయం ఓ ఇంట్లో నిర్వహిస్తున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలను స్కూళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసి ప్రమాణం చేశారు. గుర్రంపై వచ్చిన సర్పంచ్ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ పటేల్ ప్రమాణ స్వీకారానికి గుర్రంపై వచ్చాడు. బ్యాండుమేళాలతో పెళ్లి బారాత్ ఊరేగింపు మాదిరిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. రంగుల ‘పంచాయితీ’ కాంగ్రెస్ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణం చేయబోమని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు, అధికారులు వచ్చి సర్దిచెప్పారు.అంబులెన్స్లోనే ప్రమాణం జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్గా గెలుపొందారు. రెండు రోజుల క్రితం అలేఖ్య అనారోగ్యం బారినపడి అస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఉపసర్పంచ్గా ఆమె తండ్రి చండి పర్శయ్య, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్పత్రిలో ఉన్న అలేఖ్య అంబులెన్స్లో గ్రామానికి రాగా.. అధికారులు అందులోనే అలేఖ్యతో ప్రమాణం చేయించి సంతకాలు తీసుకున్నారు.పురిటి నొప్పులతో వచ్చి.. నారాయణపేట జిల్లా ఊట్కూరు సర్పంచ్గా గెలుపొందిన రేణుకకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులు ఆమెను పంచాయతీ కార్యాలయానికి తీసుకురాగా కార్యదర్శి శ్రీనివాసరావు ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్గా ఎన్నికైన బోయపల్లి రాజేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన తండ్రి మాజీ సర్పంచ్ బోయపల్లి సురేందర్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ప్రమాణం వాయిదా పడకూడదని భావించిన రాజేష్ బాధను దిగమింగుతూ బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకాలు చేశారు.కింద కూర్చునే బాధ్యతల స్వీకరణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) కొత్త పంచాయతీ. కార్యాలయానికి పాఠశాల ఆవరణలోని ఓ గదిని కేటాయించారు. కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరసనగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కింద కూర్చునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఒక గ్రామం.. ఇద్దరు సర్పంచ్లు! సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయ తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో మొత్తం 1,268 ఓట్లు ఉండగా.. 1,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సనప సుజాతకు 549 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న నూనావత్ స్వాతికి 552 ఓట్లు వచ్చినట్లు ఫలితాల సందర్భంగా అధికారులు ప్రకటించారు. దీంతో స్వాతికి గెలుపుపత్రం ఇచ్చారు. సుజాత రీకౌంటింగ్ కోరగా.. తిరిగి ఓట్లను లెక్కించారు. స్వాతికి 549 ఓట్లు, సుజాతకు 550 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. ముందుగా స్వాతికి ఇచ్చిన గెలుపు పత్రం వెనక్కి తీసుకోకుండానే... రిటర్నింగ్ అధికారి సుజాతకు మరో గెలుపు పత్రం అందజేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం కోసం ఇరువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో పంచాయతీ కార్యాలయానికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సుజాత గెలిచినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రకటించి ప్రత్యేకాధికారి మంగీలాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.95 ఏళ్ల వయస్సులో సర్పంచ్గా తిరుమలగిరి (తుంగతుర్తి): 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్తో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.ర్యాలీలో ఉద్రిక్తత మర్రిగూడ (చింతపల్లి): నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య తన ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రత్యర్థి వర్గీయులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంబడించడంతో వారు పరారయ్యారు. పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
అప్పటివరకు భయపడ్డా.. హర్మన్ చాలా సపోర్ట్ చేసింది: వైష్ణవి
అరంగేట్రంలోనే ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆటతీరు పట్ల సంతృప్తిని వెలిబుచ్చింది. విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిని తొలి టీ20 మ్యాచ్లో 20 ఏళ్ల పంజాబీ స్పిన్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో అదరగొట్టింది. పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 16 పరుగులే ఇచి్చంది. వికెట్ తీయలేకపోయినప్పటికీ టి20లో ఇంత పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా గొప్ప విషయం.పైగా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఆమె స్పెల్ (4–0–16–0) దోహదపడింది. మెయిడిన్ ఓవర్ లేకపోయినా... ఓవర్కు 4 పరుగుల ఎకానమీ రేట్ టి20ల్లో కచ్చితంగా ఉత్తమ ప్రదర్శనే అవుతుంది. ఇంత బాగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కకపోవడం ఏమాత్రం నిరాశ కలిగించలేదని వైష్ణవి పేర్కొంది.జట్టు సహచరులు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంతా సానుకూల దృక్పథాన్ని అలవర్చిందని చెప్పుకొచ్చింది. మంగళవారం ఇదే వేదికపై భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య రెండో టి20 జరుగనుంది. సిరీస్లో ప్రస్తుతం హర్మన్ప్రీత్ కౌర్ సేన 1–0తో ఆధిక్యంలో ఉంది. హర్మన్ ప్రోత్సహించింది!"నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. వికెట్ తీయలేదన్న నిరాశ ఏ మూలన కూడా లేదు. నిజం చెబుతున్నా నేననుకున్న విధంగా నా ప్రణాళికల్ని అమలు చేయగలిగాను. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించాను. ఒక్క మ్యాచ్తోనే అయిపోలేదుగా... ఇంకా నాలుగు మ్యాచ్లున్నాయి. మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు కాస్త భయపడిన మాట వాస్తవమే! కానీ జాతీయ గీతం ఆలాపించాకా ఆ బెరుకు, భయం తొలగింది. మనసు నిర్మలమైంది. అందువల్లేనేమో నా పని నేను సానుకూల దృక్పథంతో చేసుకోగలిగాను. కెపె్టన్ హర్మన్ప్రీత్, జట్టు మేనేజ్మెంట్ నన్నెంతగానో ప్రోత్సహించారు" అని వైష్ణవి శర్మ వివరించింది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త కెప్టెన్లు..? -
చంద్రబాబుకు కొత్త టెన్షన్..!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికం.. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరీ్టజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. -
హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా?
ఎప్పుడో ఏదో కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యే తెలుగు నటుడు శివాజీ.. ఇప్పుడు హీరోయిన్లకు డ్రస్సింగ్ సెన్స్ గురించి సలహా ఇచ్చాడు. ఏ బట్టలు పడితే అవి వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే సలహా ఇవ్వడం బాగానే ఉంది కానీ వీటిలో మధ్యలో ఉపయోగించిన ఒకటి రెండు పదాలు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించాయి.గతంలో తెలుగులో హీరోగా, సహాయ నటుడిగా పలు సినిమాలు చేసిన శివాజీ.. చాన్నాళ్ల పాటు టాలీవుడ్లో కనిపించలేదు. 90స్ వెబ్ సిరీస్, కోర్ట్ సినిమాతో హిట్స్ అందుకుని ఇప్పుడు వరస మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'దండోరా'. ఈ గురువారం (డిసెంబరు 25) థియేటర్లలోకి రానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్లో జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ హీరోయిన్లకు సలహా ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. హీరోయిన్లు అందరూ ఏమనుకోవద్దు. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతారు గానీ.. దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని అనాలపిస్తుంది లోపల కానీ అనలేం. మళ్లీ అంటే స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ.. చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనబడతా ఉంటుంది. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన వేషభాషల నుంచే గౌరవం పెరుగుతుంది' అని శివాజీ చెప్పుకొచ్చాడు.ఈ మొత్తం స్పీచ్లో సామాను, దరిద్రపు ము** అనే పదాలు ఉపయోగించడం కాస్త అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో దీన్ని బూతు అర్థం వచ్చేలా మాట్లాడతారు. బయట ఎవరో దీన్ని అన్నారంటే ఏమోలే అనుకోవచ్చు గానీ పబ్లిక్గా స్టేజీపై ఓ నటుడు ఈ పదాలు ఉపయోగించడం అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న.(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్) -
నేటికీ శతాబ్దాల నాటి యుద్ధ వ్యూహాలు.. వీడియో వైరల్
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఆధునిక సాంకేతికతకు తోడు శతాబ్దాల క్రితం నాటి యుద్ధ వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్కు చెందిన 92వ పదాతిదళ బ్రిగేడ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో రష్యన్ సైనికులు గుర్రాలపై పరుగులు తీస్తుండగా, ఉక్రెయిన్ డ్రోన్ వారిని వెంబడించి దాడి చేయడం కనిపిస్తుంది. కాగా రష్యా దళాలు తమ సైనిక పరికరాలను వేగంగా కోల్పోతుండటంతో, వారు గత్యంతరం లేక రవాణా కోసం గుర్రాలను ఆశ్రయిస్తున్నారని ఉక్రేనియన్ సైన్యం చెబుతోంది.వీడియోలో కనిపిస్తున్న దాడిలో డ్రోన్ నేరుగా గుర్రంపై ఉన్న సైనికుడిని లక్ష్యంగా చేసుకుంది. బాంబు పేలుడు తీవ్రతకు గుర్రం కిందపడిపోగా, సైనికుడు అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు. అనంతరం ఆ గుర్రం అక్కడి నుండి ప్రాణభయంతో పరుగులు తీయగా, సైనికుడు మాత్రం అక్కడే చిక్కుకుపోయాడు. ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. రష్యన్ స్థావరాలను ట్రాక్ చేసేందుకు, దాడులు కొనసాగించేందుకు ప్రస్తుతం మానవరహిత డ్రోన్ వ్యవస్థలపైనే పూర్తిగా ఆధారపడుతోందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. Earlier today, Ukrainian forces repelled a Russian cavalry assault in Donetsk Oblast. Cavalry, in this case, actually using horses. pic.twitter.com/WUlDyWachc— OSINTtechnical (@Osinttechnical) December 22, 2025సుమారు 600 మైళ్ల యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ తన నిఘా కోసం, బాంబులు వేసేందుకు రకరకాల డ్రోన్లను ఉపయోగిస్తోంది. రష్యా సైన్యం కూడా డ్రోన్ దాడుల నుండి తప్పించుకునేందుకు మోటార్ సైకిల్ యూనిట్లు వంటి తక్కువ సాంకేతికత కలిగిన పద్ధతులను ప్రయత్నిస్తోంది. చారిత్రాత్మకంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో గుర్రాలను వాడారు. ఇప్పుడు ఈ 2025 నాటి హైటెక్ డ్రోన్ల కాలంలోనూ గుర్రాలను ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.మరోవైపు రష్యాలోని మయామీలో యుద్ధ శాంతి చర్చలు జరిగిన కొద్ది గంటలకే అక్కడి మాస్కోలో ఒక సీనియర్ రష్యన్ జనరల్ కారు బాంబు దాడిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా లోపల, ఆక్రమిత ప్రాంతాల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటువంటి దాడులను కొనసాగిస్తూనే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: రష్యన్ జనరల్ హత్య.. ఉక్రెయిన్ ప్రమేయం? -
ప్రకృతి సేద్యం పొలాల్లోంచి వర్సిటీల్లోకి!
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రయోగశీలురైన రైతు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆచరిస్తూ వస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలను చూసి తోటి రైతులు నేర్చుకుంటూ వచ్చారు. మొదట్లో సంశయించిన ప్రభుత్వమే తదనంతరం ప్రకృతి వ్యవసాయం బహుముఖ ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నియత వ్యవసాయ విద్యలోకి ప్రకృతి వ్యవసాయం చేరింది. దేశంలో 4 యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి. మరికొన్ని యూనివర్సిటీల్లో ప్రకృతి వ్యవసాయం ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులను విధిగా ప్రారంభించాలని సూచిస్తూ భారతీయ వ్యవసా య పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జన రల్ ఎం.ఎల్. జాట్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ హ యాంలో నడుస్తున్న, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యా లయాలన్నిటికీ ఇటీవల లేఖ రాశారు. ‘సుస్థిర వ్యవసాయం, రైతుల సంక్షేమం సాధించే క్రమంలో ప్రకృతి వ్యవసాయం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరో డీన్ల కమిటీ సిఫారసులు, జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ప్రకృతి సేద్యం కోర్సు పాఠ్యప్రణాళి కను రూపొందించి, ఆమోదించి, అన్ని యూనివర్సిటీలకూ పంపాం. ఇప్పటి కే కొన్ని యూనివర్సిటీలు కోర్సులు ప్రారంభించా యి. మిగతా యూనివర్సిటీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని ఆశిస్తు న్నాను’ అని డా. జాట్ పేర్కొన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. విపత్తులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు, భూమి ఆరోగ్యం పునరు ద్ధరణకు, తక్కువ ఉద్గారాలను వెలువరించే వ్యవ సాయ పద్ధతులకు ఆదరణ పెరుగుతున్నందున ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రకృతి సేద్య సంబంధమైన కోర్సుల ప్రాధా న్యం ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాంకేతి కతలో నిష్ణాతులైన నవతరం శాస్త్ర వేత్తలు, విస్తరణ సిబ్బంది, ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేసే బృహత్ కార్యంలో విశ్వవిద్యాలయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నానని డా. జాట్ పేర్కొ న్నారు. ఈ విషయంలో ఐసీఏఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. లాభదాయకతే గీటురాయి చెయ్యాలిప్రకృతి వ్యవసాయంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రారంభించమని ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కోరటం సంతోషదాయకమని ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ దేవేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. అయితే, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఆఖరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చేపట్టే ఫీల్డ్ వర్క్ను కేవలం లాంఛనప్రాయంగా మిగల్చ కూడదు. ఫీల్డ్ వర్క్లో భాగంగా స్వయంగా ప్రకృతి వ్యవసాయం ఆచరించి, అందులో లాభదాయకతను నిరూపించుకున్న విద్యార్థులకు మాత్రమే డిగ్రీని ప్రదానం చెయ్యటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు. -
ఐదడుగుల అరటి!
తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి ‘కావేరి వామన్’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఎస్ఆర్సీబీ) సంయుక్తంగా ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్ నైన్ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్తో బార్క్ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రశంసించారు.బార్క్ డైరెక్టర్ వివేక్ భాసిన్ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్ నైన్ అరటిని పండించే రైతులకు కావేరి వామన్ విడుదల ఒక వరం వంటిదన్నారు. బార్క్ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ నైన్ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి. -
డాక్టరా?.. దండపాణా?
సిమ్లా: ప్రాణం పోయాల్సిన చోట.. ప్రాణభ యం నీడలా వెంటాడింది. రోగికి అండగా ఉండాల్సిన వైద్యుడే.. యమధర్మరాజులా విరుచుకుపడ్డాడు. సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)లోని అ త్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ వైద్య కళాశాల (ఐజీఎంసీ) ఆసుపత్రి ఒక అమాన వీయ ఘటనకు వేదికైంది. ఊపిరి అందక విలవిల్లాడుతున్న రోగికి వైద్యం అందించాల్సింది పోయి, రౌడీలా మారి ముష్టిఘాతా లు కురిపించాడొక వైద్యుడు. ప్రస్తుతం సోష ల్ మీడియాను కుదిపేస్తున్న ఆ వీడియోను చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది! అసలేం జరిగిందంటే.. అర్జున్ పవార్ అనే వ్యక్తి ఎండోస్కోపీ పరీక్ష కోసం ఐజీఎంసీకి వచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక అతనికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆయాసంతో ఊపిరాడక, కాస్త ఉపశమనం కోసం పక్కనున్న వార్డులోని ఒక ఖాళీ బెడ్పై పడుకున్నాడు. అదే అతను చేసిన ’నేరం’. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యుడు అక్కడికి వచ్చి, ’నా బెడ్ మీద ఎందుకు పడుకున్నావు?’ అంటూ రోగితో వాగ్వాదానికి దిగాడు. వైద్యానికి బదులు.. దెబ్బల వర్షం రోగి పరిస్థితిని అర్థం చేసుకోవలసింది పోయి, ఆ వైద్యుడు దురుసుగా వ్యవహరించాడు. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన సదరు వైద్యుడు, రోగిపై భౌతిక దాడికి దిగాడు. అస్వస్థుడైన ఆ రోగిని కనికరం లేకుండా కొట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఈ దృశ్యాలన్నీ ఎవరో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఈ దాడి వార్త తెలియగానే బాధితుడి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సదరు వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మరింత తీవ్రరూపం దాలి్చంది. విచారణకు సీఎం ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనను.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు తీవ్రంగా పరిగణించారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు స్పందిస్తూ.. దీనిపై అంతర్గత విచారణ కమిటీని వేశామని, తప్పు తేలితే కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఆ విచారణ నివేదికలో ఏం తేలుతుందో.. ఆ ’ముతక’ వైద్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి. -
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్కు సూచించారు. -
మోదీ ప్రభుత్వమే నన్ను కాపాడాలి
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లాడు. అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్ఫోన్కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు. యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు. -
‘ఆహార’ పరిశ్రమలకు కేంద్రంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో వ్యవసాయ, ఆహారశుద్ధి సంబంధిత పరిశ్రమలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు ఎగుమతుల వృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపుదలపై దృష్టిపెట్టనుంది. రాష్ట్రంలోని పంటల వైవిధ్యం, రైతుల సంఘటిత శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ పార్కులు, ప్రాసెసింగ్ జోన్లు తదితరాలను అనువుగా మలుచుకొని జాతీయ స్థాయిలో వ్యవసాయ, ఆహార సంబంధిత పరిశ్రమలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలకు ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. మెగా ఫుడ్ పార్కులను బలోపేతం చేయడం, చిన్నతరహా పరిశ్రమల మధ్య పోటీతత్వం పెంచడం, పంటల ఆధారిత మార్కెటింగ్ వసతులు, ఆధునాతన నిల్వ సదుపాయాలు, శీతల గిడ్డంగుల నెట్వర్క్ విస్తరణ కోసం సమగ్ర విధానం తేవాలని నిర్ణయించింది. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా.. పరిశ్రమల శాఖ అధీనంలోని ‘తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ’(టీజీఎఫ్పీఎస్) ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఫుడ్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ గ్రాంట్ల ద్వారా చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించి రిటైల్ విక్రయాలతోపాటు ఎగుమతులను ప్రోత్సహించనుంది. చిన్న పరిశ్రమలకు ఆర్థిక చేయూత ఇచ్చి ఈ–కామర్స్ వేదికలపై ఉత్పత్తుల విక్రయాలకు చోటు కల్పించనుంది. ప్రాసెసింగ్ యూనిట్లకు నిరంతరం కూరగాయలు, పండ్ల సరఫరా జరిగేలా 110 టన్నుల సామర్థ్యంగల మైక్రో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది. టీజీఐఐసీ, మార్కెటింగ్ శాఖల ద్వారా ఈ మైక్రో కోల్ట్ స్టోరేజీలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనుంది. బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లు.. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారుల కోసం బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపడుతోంది. ధాన్యం, పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలను ప్రాసెసింగ్ సెంటర్లకు తరలించడం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పనతోపాటు మెగా ఫుడ్ పార్కులకు ముడి సరుకుల లోటు లేకుండా సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు రైతులు, రైతు సంఘాలను అనుసంధానించనుంది. పోషకాహార ఫుడ్ పార్కుల స్థాపన.. ఫార్మా, ఫుడ్ కంపెనీల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ‘న్యూట్రాసూటికల్ ఫుడ్ పార్కులు’ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫుడ్ పార్కుల్లో జరిగే కార్యకలాపాల కోసం యూనివర్సిటీలు, ఇతర అభివృద్ది, పరిశోధన సంస్థలు పనిచేస్తాయి. ఆహార శుద్ధి పరిశ్రమల్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం నేషనల్ సెంటర్ ఫర్ ఫుడ్ ఇన్నోవేషన్ (ఎన్సీఎఫ్ఐ)ను ఏర్పాటు చేయడం ద్వారా ఆహార శుద్ధి రంగం బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఆహార శుద్ధి ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించి ఎగుమతులను ప్రోత్సహించేందుకు టీజీఎఫ్పీఎస్ ద్వారా సరి్టఫికేషన్ ఇవ్వనుంది.ఫుడ్ ప్రాసెసింగ్లో ఆధునిక సాంకేతికత.. మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రమాణాలు పెంచేందుకు ఆధునిక ఐటీ సాంకేతికతను కూడా వినియోగించే ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పంటల సాగు, దిగుబడి, శుద్ధి దశల్లో ఏఐ, ఇతర సాంకేతికతలను మేళవిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించే బాధ్యతను సంబంధిత శాఖలకు అప్పగించింది. రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు పేరొందిన ప్రాంతాలను అనుసంధానిస్తూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మామిడి, మి ర్చి, పసుపు, సోయాబీన్, కందులు, వరి, పత్తి, మొక్కజొన్న, తృణధాన్యాలు తదితరాల ప్రాసెసింగ్కు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహించనుంది. -
గెలిచినా గంప దింపలేదు!
పుణె జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్ లోనావాలా.. పర్యాటకులకు స్వర్గధామం. కానీ ఇప్పుడా ప్రాంతం ఒక సామాన్య మహిళ పోరాటానికి, నిరాడంబరతకు చిరునామాగా మారింది. ముంబైకి కూతవేటు దూరంలోని ఈ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగ్యశ్రీ జగ్తాప్ అనే మహిళ సాధించిన విజయం.. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయం వరించినా.. వేరు మరువలేదు సాధారణంగా ఎన్నికల్లో గెలవగానే నాయకులు పూలమాలలు, ఊరేగింపులు, బాణసంచా హడావిడిలో మునిగిపోతారు. కానీ భాగ్యశ్రీ స్టైలే వేరు.. ఆదివారం ఫలితాలు వచ్చాయి.. భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. సోమవారం ఉదయాన్నే అందరూ ఆమె ఇంటికి అభినందనలు తెలపడానికి వద్దామనుకుంటే.. ఆమె మాత్రం ఎప్పటిలాగే రోడ్డు పక్కన తన పండ్ల దుకాణం దగ్గర ప్రత్యక్షమైంది. కౌన్సిలర్ హోదాను ప్రదర్శించడం కంటే, తన కుటుంబాన్ని పోషిస్తున్న పండ్ల గంపే ఆమెకు దైవంగా కనిపించింది. ‘గెలిచాం కదా అని వ్యాపారాన్ని వదిలేస్తామా?.. మా కుటుంబానికి జీవనాధారం ఇదే’.. అంటూ ఆమె పండ్లను సర్దుతున్న తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. హేమాహేమీలను ఓడించి.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన భాగ్యశ్రీ, తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యరి్థని ఏకంగా 608 ఓట్ల తేడాతో ఓడించింది. పౌర సమస్యలపై ఆమెకున్న అవగాహన, సామాన్యులతో అనుబంధమే.. ఈ భారీ విజయానికి కారణమని లోనావాలా వాసులు స్పష్టం చేస్తున్నారు. దేని పని దానిదే.. పదవి గురించి భాగ్యశ్రీ మాటల్లో ఎక్కడా గర్వం కనిపించదు. ‘పండ్లమ్మడం మా వంశపారంపర్య వ్యాపారం. కౌన్సిలర్గా ప్రజల సమస్యలపై పోరాడతాను, వారి బాధలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను. అదే సమయంలో నా పండ్ల దుకాణాన్ని కూడా నడుపుతాను. ఈ వ్యాపారమే నాకు గుర్తింపునిచి్చంది’.. అని ఆమె స్పష్టం చేసింది. భర్త మహదేవ్ జగ్తాప్ కూడా ఆమె నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆమె ప్రజా సేవలో నిమగ్నమైతే, తాను వ్యాపార బాధ్యతలు చూసుకుంటానని సగర్వంగా చెబుతోంది. శభాష్ భాగ్యశ్రీ రాజకీయాల్లో విజయం సాధించాక నేలమీద నడవని నేతలున్న కాలంలో.. నిరాడంబరతే ఆభరణంగా భాగ్యశ్రీ సాగిపోతోంది. తన కష్టాన్ని, వృత్తిని నమ్ముకున్న ఈ ’పండ్లమ్మే కౌన్సిలర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరోగా నిలిచింది. గెలిచాక వాగ్దానాల ‘గంప’దించేసే నాయకుల మధ్య.. గెలిచినా గంపను నమ్ముకున్న ఈ ’భాగ్యశ్రీ’ నిజంగా అభినందనీయురాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుంతకల్లు.. పేకాట ఫుల్లు
ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం నేడు పేకాటకు కేరాఫ్గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా వెశాయి. జూదం ద్వారా కమీషన్లు ఫుల్లుగా వస్తుండటంతో శిబిరాలు విస్తరించుకుంటూ వెళ్తున్నారు. స్థానిక పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా ముఖ్య ప్రజాప్రతినిధే చూసుకుంటుండటంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.గుంతకల్లు: సులువుగా సంపాదించడం కోసం కొందరు జూదం బాట పడుతున్నారు. సంపాదన మొత్తం ఇందులో తగలేసి కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. జూదంలో ఒకటైన పేకాట కోసం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వారు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి, రాయచూర్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది. పేకాట స్థావరాలు స్థానికంగా ఉంటే వ్యాపారం మరింత ఎక్కువగా సాగుతుందని, నిర్వాహకులకు కావల్సినంత ఆదాయం సమకూరుతుందని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు – ప్రజాప్రతినిధులు ఆలోచించినట్టుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే గుంతకల్లు నియోజకవర్గాన్ని పేకాట స్థావరంగా మార్చేశారు.ఆదాయం భారీగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన వారు పోటీపడి పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గుంతకల్లు పట్టణం, మండలంతో పాటు గుత్తి, పామిడి మండలాల్లోనూ విస్తరించారు. ఇప్పుడు రాయలసీమతో పాటు బళ్లారి నుంచి సైతం జూదరులు పేకాట ఆడేందుకు గుంతకల్లుకు వస్తున్నారు. దీంతో పేకాట మూడు పువ్వులు– ఆరు కాయలుగా వరి్ధల్లుతోంది. పేకాట ఆడేందుకు వచ్చిన వారికి అక్కడే మందు, మాంసాహారం, సిగరెట్లు తదితర సకల సౌకర్యాలూ సమకూర్చడంతో ఒక్కో శిబిరం వద్ద రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు సాగుతున్నాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న పేకాట శిబిరాలకు ‘స్థానిక పోలీసుల’ నుంచి ఇబ్బందులు రాకుండా తనే మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. దాడులతో అలజడిగుంతకల్లు నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెలిసిన పేకాట శిబిరాలు, స్థానిక పోలీసుల ఉదాసీనత గురించి ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సారథ్యంలోని ఎస్ఓజీ స్క్వాడ్ ఇటీవల పలు చోట్ల దాడులు చేయడంతో స్థానికంగా అలజడి రేగింది. గుంతకల్లు మండలం ఎన్.వెంకటాంపల్లి శివారులో మెరుపుదాడులు నిర్వహించి, దాదాపు రూ.19 లక్షల నగదు స్వా«దీనంతో పాటు 17 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం కసాపురం సమీపంలో మొబైల్ స్థావరంపై కసాపురం పోలీసుస్టేషన్ ఎస్ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిపిన దాడిలో రూ.1.70 లక్షల నగదుతోపాటు ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. గుత్తి మండలం జక్కలచెరువు, పూలకుంట, తొండపాడు గ్రామాల్లో ఇటీవల పోలీసులు దాడులు జరిపి రూ.2 లక్షల కు పైగా నగదు స్వా«దీనంతో పాటు 30 మందికి పైగా పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. అలాగే పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న, సహకారం అందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.పోలీసులను ఏమారుస్తారిలా..పేకాట నిర్వాహకులు పోలీసులను ఏమార్చేందుకు శిబిరాలను ఒక చోట నుంచి మరొక చోటుకు మార్చుకుంటూ పోతున్నారు. అలా గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో మొబైల్ పేకాట శిబిరాలుగా రూపాంతరం చెందాయి. ఎక్కడా రెండు రోజులకు మించి శిబిరం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే శిబిరాలు ఎక్కడ ఉంటాయో జూదరులకు ఎప్పటికప్పుడు నిర్వాహకులు సమాచారం చేరవేస్తూ వస్తున్నారు. అలా ఎవరైనా పోలీసులు నామ్కే వాస్తుగా దాడులు చేయాలనుకున్నా దొరక్కుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం(2026–27)లో దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) దరఖాస్తులు ఆహ్వానించింది. అనుమతుల కోసం ఈ నెల 29 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ ఎల్.రాఘవ్ సోమవారం అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, డీఎంఈలకు లేఖ రాశారు. వచ్చే నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని లేఖలో స్పష్టం చేశారు. ఎన్ఎంసీ అధికారిక వెబ్పోర్టల్ ద్వారా వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, అదనపు సీట్ల పెంపుపై 2023లో ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)– మినిమమ్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్(ఎంఎస్ఆర్) మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తి ప్రాతిపదికన అనుమతులు లభిస్తాయి. అదేవిధంగా కళాశాలల్లో గరిష్టంగా 150 సీట్లు దాటకూడదని అప్పట్లో షరతు విధించారు. ఈ నిబంధనలను 2026–27 విద్యా సంవత్సరానికి నిలుపుదల చేసినట్టు ఎన్ఎంసీ స్పష్టం చేసింది.వచ్చే ఏడాది లేనట్టేమాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్కు కట్టబెడుతోంది. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే అన్ని కళాశాలల్లో తరగతులు ప్రారంభమై ఉండాలి. అయితే, చంద్రబాబు నిర్ణయాలతో తరగతులు ప్రారంభం కాలేదు. 2026–27 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 28తో కళాశాలలు ప్రారంభించేందుకు దరఖాస్తు గడువు ముగియనుంది.ఇదిలా ఉండగా తొలి దశలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు వైద్య శాఖ టెండర్లు పిలిచింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు ముగిసే నాటికి టెండర్ ప్రక్రియ ముగిసే అవకాశం లేదు. ఈ లెక్కన వచ్చే విద్యా సంవత్సరం కూడా వైద్య కళాశాలలు అందుబాటులోకి రావు. ఇప్పటికే చంద్రబాబు చేసిన కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1,750 కలిపి మొత్తం 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. -
మరో విజయం లక్ష్యంగా...
సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ గెలుచు కొచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు శ్రీలంకతో మొదలైన టి20 సిరీస్లో శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే జోరుతో వరుస విజయాలతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. తద్వారా సిరీస్లో పట్టు సాధించాలని చూస్తోంది. మరోవైపు లంక అమ్మాయిలు పటిష్టమైన భారత్కు ఎలాగైనా కళ్లెం వేయాలని, ఈ మ్యాచ్లో గెలిచి 1–1తో సమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. గట్టి ప్రత్యరి్థని ఓడించేందుకు పకడ్బందీ ఎత్తుగడలను అమలు చేయాలని లంక జట్టు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరంలోనే జరిగే ఈ రెండో టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. ఫీల్డింగ్తోనే సమస్య హర్మన్ప్రీత్ బృందం మొదటి మ్యాచ్లో బాగానే ఆడింది. ప్రత్యరి్థని ఓడించింది. ఐదు టి20ల సిరీస్లో శుభారంభం చేసింది. అంతమాత్రాన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ప్రత్యరి్థకంటే అగ్రగామిగా ఉందనుకుంటే పొరపాటు. బౌలింగ్, బ్యాటింగ్ బాగున్నప్పటికీ ఫీల్డింగ్ చాలా ఘోరంగా ఉంది. తొలి మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్తో విసుగు తెప్పించింది. సులువైన క్యాచుల్ని నేలపాలు చేసింది. అంతిమంగా విజయమే ముఖ్యమైనా... ఘోరమైన ఫీల్డింగ్ను అది మూసి పెట్టలేదు. ఇదే విషయాన్ని కెపె్టన్ హర్మన్ సైతం అంగీకరించింది. తప్పకుండా ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతామని, నెట్స్లో క్యాచింగ్పైనే అతిగా ప్రాక్టీస్ చేశామని కూడా చెప్పింది. బ్యాటింగ్లో స్మృతి మంధాన మెరుగ్గా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ విలువైన అర్ధసెంచరీతో అజేయంగా నిలిచింది. వీరితో పాటు షఫాలీ వర్మ కూడా రాణిస్తే పరుగులకు, భారీస్కోరుకు ఏమాత్రం ఇబ్బంది వుండదు. బౌలింగ్లో క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, శ్రీచరణి ఆకట్టుకున్నారు. కొత్తమ్మాయి వైష్ణవి శర్మ అరంగేట్రంలోనే అదరగొట్టింది. వికెట్ తీయలేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. సమం చేసే పనిలో... సొంతగడ్డపై భారత్ పైచేయిగా ఉన్నప్పటికీ... ఆతిథ్య జట్టులోని లోపాలను సొమ్ము చేసుకొని సిరీస్ రేసులో నిలవాలని శ్రీలంక చూస్తోంది. భారత్ ఆధిక్యాన్ని ఇక్కడే సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ చమరి ఆటపట్టు, నీలాక్షికల వైఫల్యం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్లో రెండు, మూడు ఓవర్లు చాలు మ్యాచ్గతినే మార్చడానికి. అందరు ఆడాల్సిన పనిలేదు. ఏ ఇద్దరు దంచేసినా చాలు ఆతిథ్య జట్టుకు గట్టి బదులు ఇవ్వొచ్చని శ్రీలంక ఆశిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్జోత్, అరుంధతి, క్రాంతి గౌడ్, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), విష్మీ గుణరత్నే, హాసిని, హర్షిత, కవీషా, ఇమేశ దులాని, నీలాక్షిక, కౌశిని, ఇనోక రణవీర, మాల్కి మదర, కావ్య, శషిని.
