-
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్:వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎండలు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. -
డీల్పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హాజరుపై స్పష్టత లేదు.ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.అలాగే ఇరాన్పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.లేటెస్ట్ అప్డేట్స్:* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. * ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. * అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్లోనే ఉంది. ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. -
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
పెద్దిలో కొత్త సీన్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఆమె రోల్ అచియ్యమ్మ పాత్రపై విమర్శలొచ్చాయి. జాన్వీ కపూర్ సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో జాన్వీ కపూర్పై సన్నివేశాలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్స్ను మూవీ నుంచి తొలగించారు.అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించిన పెద్ది మేకర్స్ మరి కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. కొత్త వర్షన్లో జాన్వీ కపూర్ పాత్రపై రెండు సన్నివేశాలు, సీనియర్ నటుడు జగపతి బాబుకు సంబంధించిన ఓ సీన్ ఉంటుందని ప్రకటించారు. కొత్తగా సీన్స్ యాడ్ చేసి పెద్దిని థియేటర్లలో రన్ చేయనున్నారు. కొత్త సన్నివేశాలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తాయని మేకర్స్ ప్రకటించారు. సక్సెస్ మీట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేశాం. ఈ బుధవారం నుంచి కొత్త సీన్స్ జోడిస్తాం. మేము మొత్తం మూడు సన్నివేశాలను చేర్చాం. హీరోయిన్కు సంబంధించిన సన్నివేశాలు.. అలాగే జగపతి బాబు కోసం ఓ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాలు అచియ్యమ్మ పాత్రకు మరింత భావోద్వేగ లోతును తీసుకొస్తాయి. జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నా" అని బుచ్చి బాబు సానా అన్నారు. -
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రక్రియపై నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. రుణదాతలు, బ్యాంకింగ్ సిబ్బంది కస్టమర్లను తప్పుదారి పట్టించి ఉత్పత్తులను అంటగట్టే ‘మిస్ సెల్లింగ్’ పద్ధతులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసింది.అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?సవరించిన నూతన మార్గదర్శకాలు తొలుత జులై 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక, కార్యాచరణ మార్పులు చేసుకోవడానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ గడువును పొడిగించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.నూతన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుబ్యాంకులు ఏ రకమైన ఆర్థిక ఉత్పత్తి లేదా సేవను విక్రయించాలన్నా సదరు కస్టమర్ స్పష్టమైన ఆమోదం తీసుకోవాలి. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్కు ఎంతవరకు అనుకూలమైనదో ముందే నిర్ధారించుకోవాలి.సంతకం చేసిన డిక్లరేషన్లు, ఓటీపీ-ఆధారిత ఆమోదాలు, డిజిటల్ ధ్రువీకరణలు లేదా ఒప్పంద పత్రాలలో స్పష్టంగా పేర్కొన్న సమ్మతి నిబంధనల ద్వారా మాత్రమే ఈ అనుమతిని సేకరించాల్సి ఉంటుంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లు, యాప్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా మోసగించేలా రూపొందించే వినియోగదారు-అనుభవ పద్ధతులు లేదా డార్క్ ప్యాటర్న్స్(డిజిటల్ ప్లాట్ఫారమ్లు వినియోగదారులను మోసగించడానికి లేదా వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేయించడానికి ఉపయోగించే వ్యూహాలు) వాడకాన్ని ఆర్బీఐ పూర్తిగా నిషేధించింది.తప్పుగా విక్రయిస్తే.. పూర్తి రీఫండ్!బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిబంధనను ఆర్బీఐ ఈసారి తీసుకొచ్చింది. ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు తప్పుగా విక్రయించినట్లు రుజువైతే బ్యాంకులు ఆ విక్రయాన్ని రద్దు చేయడమే కాకుండా.. కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు, రీఫండ్ గురించిన సమాచారాన్ని కస్టమర్కు అధికారికంగా తెలియజేయడం తప్పనిసరి.ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏజెంట్లే..సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆర్థిక ఉత్పత్తులను ప్రమోట్ చేసే వారిపై కూడా ఆర్బీఐ నిఘా పెంచింది. ప్రమోషన్లు లేదా కస్టమర్లను ఆకర్షించే ప్రక్రియలో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సన్లు, అనుబంధ సంస్థలు, ఇతర డిజిటల్ మార్కెటింగ్ మధ్యవర్తులను ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లుగానే పరిగణిస్తారు. తద్వారా వారికి కూడా బ్యాంకింగ్ నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయి.ఉద్యోగుల ఇన్సెంటివ్లపై స్పష్టతబ్యాంక్ సిబ్బంది కస్టమర్లపై ఒత్తిడి తెచ్చి ఉత్పత్తులను విక్రయించకుండా చూసేందుకు ఆర్బీఐ ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. థర్డ్ పార్టీ సంస్థలు (ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి) నియంత్రిత సంస్థల/బ్యాంకుల ఉద్యోగులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడాన్ని పూర్తిగా నిషేధించారు. బ్యాంకులు లేదా నియంత్రిత సంస్థలు తమ సొంత సిబ్బందికి అంతర్గతంగా ప్రోత్సాహకాలను అందించుకోవచ్చు.గమనిక: అయితే, ఈ అంతర్గత ప్రోత్సాహక నిర్మాణాలు ఉద్యోగులను దూకుడుగా అమ్మకాలు జరిపేలా ప్రోత్సహించకూడదని, అది మిస్ సెల్లింగ్కు దారితీయకూడదని ఆర్బీఐ హెచ్చరించింది.ఈ నూతన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు తమ సొంత ప్రకటనలు, మార్కెటింగ్, అమ్మకాల ప్రక్రియల కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో మిస్ సెల్లింగ్ మోసాలకు అడ్డుకట్ట పడటంతోపాటు కస్టమర్లలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడనుంది.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
టెల్ అవీవ్: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా,ఇరాన్ల మధ్య డీల్ కుదరడంతో ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగే ఉండే అవకాశం లేదన్నారు. అది ఈ రోజైనా..రేపైనా అని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంపై ప్రస్తుతం ఇజ్రాయెల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆ దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇరాన్పై యుద్ధం విషయంలో తాను చేసింది సరైందేనని సమర్థిస్తూ మాట్లాడారు. "మనం ఏమి సాధించామని ప్రజలు నన్ను అడుగుతున్నారు? దానికి నేను సమాధానమిస్తాను - మనం ఏమి సాధించాం? మనపై ఉన్న తక్షణ వినాశన ముప్పును మనం తొలగించుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపూర్ణ వినాశనం ముప్పు నుండి కాపాడాం" అని అన్నారు. శత్రుదేశం ఇరాన్కు ఈ రోజే కాదు రేపు.. ఎప్పుడూ అణ్వాయుధాలు ఉండవు. అని నెతన్యాహు పేర్కొన్నారు.తాము ఇజ్రాయెల్ దేశం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని. గాజా, లెబనాన్ మరియు సిరియాలలో కూడా మేము ఇదే చేశామని అన్నారు. తాను ఒక నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని ఇజ్రాయెల్కు అవసరమైనంత కాలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం మేము ఈ భద్రతా మండలాల్లోనే ఉంటామని నెతన్యాహూ తేల్చి చెప్పారు.ట్రంప్తో విభేదాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్తో గల విభేదాలపై స్పందించారు. కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్కు, నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను వివేకంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.నెతన్యాహుపై విమర్శలుఇజ్రాయెల్లో నెతన్యాహు నాయకత్వాన్ని విమర్శిస్తూ విపక్ష నేత నఫ్తాలి బెన్నెట్ మాట్లాడారు. నెతన్యాహూ అధికారం అంతర్యుద్ధంతో ప్రారంభమై, అక్టోబర్ 7 నాటి మారణకాండతో కొనసాగి, ఇప్పుడు ఇరాన్పై చారిత్రాత్మక వైఫల్యంతో ముగుస్తోంది అని విమర్శించారు. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో నెతన్యాహూ వివరణ ఇచ్చారు.ఎట్టకేలకు శాంతి ఒప్పందంకాగా గత మూడు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. -
విదేశీ యువతుల వలపు వల.. యువకుడికి దేహశుద్ధి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా వెబ్సైట్ ద్వారా యువకులకు వల వేస్తున్న విదేశీ యువతుల వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. మధురవాడ, పెదవాల్తేరు సహా పలు ప్రాంతాల్లో విదేశీ యువతులన్నట్లు వైబ్సైట్లో ఫోటోలు ఉంచారు. ఇది తెలుసుకున్న ఓ క్యాబ్ డ్రైవర్ ఆ ప్రాంతానికి వెళ్లాడు. అయితే అక్కడ ఏదో వివాదం తలెత్తడంతో విదేశీ యువతులు సదరు క్యాబ్ డ్రైవర్ను చితకబాదారు. దీంతో క్యాబ్డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు. -
టీఎంసీలో మరో ట్విస్ట్.. అందుకు ఎమ్మెల్యేల నో!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు టీవీ సీరియల్లా సాగిపోతూ.. వెబ్ సిరీస్ల పూటకో ట్విస్టులను పంచుతున్నాయి. ప్రతిపక్ష తృమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత సంక్షోభం.. రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఆ పార్టీ మెజారిటీ ఎంపీలు సరికొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో ఉన్నామని చెప్పుకుంటున్న రెబల్ ఎమ్మెల్యేల వర్గ వైఖరి ఏమిటన్న ఆసక్తి నెలకొంది.టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు.. ఓ అనామక పార్టీ అయిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ‘ప్రత్యేక సిట్టింగ్’ కేటాయించమని లేఖ కూడా అందజేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది కూడా. ఈ పరిణామం మమతా బెనర్జీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. టీఎంసీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు(64 మంది) తనకే ఉందని.. తనకు తానుగా ప్రతిపక్ష నేతగా ప్రకటించుకున్నారు రితబ్రతా బెనర్జీ. రెబల్ ఎంపీల దారిలోనే పయనిస్తారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానమే వచ్చింది. ఎమ్మెల్యేల వర్గం మాత్రం ఆ నిర్ణయాన్ని అనుసరించబోదని రితబ్రతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ వర్గంలో అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చర్చకు రాలేదని, ఎన్సీపీఐలో చేరే ఆలోచన కూడా తమకు లేదని తెలిపారాయన. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతున్న రితబ్రతా బెనర్జీ.. ఎంపీల విలీన నిర్ణయం గురించి కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని అన్నారు. శాసనసభ పక్షంగా తమకు ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కాబట్టి విలీనంపై చర్చే లేదని పేర్కొన్నారు.మరోవైపు తిరుగుబాటు ఎంపీల వర్గం తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు కోరుతూ, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు సాధించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల వర్గం మాత్రం అలాంటి పనులు చేయబోమని అంటోంది. మమతా బెనర్జీనే తమ నాయకురాలని.. ఆమె మార్గదర్శకత్వంలోనే తాము ముందుకు సాగాలని అనుకుంటున్నామని రితబ్రతా చెబుతున్నారు. అయితే అధికారిక టీఎంసీ వర్గం ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ మొత్తం విలీనమైతేనే అది చట్టబద్ధమవుతుందని, కేవలం ఎంపీలు లేదంటే ఒక వర్గం విడిపోవడం ద్వారా కొత్త గ్రూప్కు గుర్తింపు ఇవ్వలేమని రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉటంకిస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అసంతృప్తి బహిర్గతమైంది. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చీలిక మొదలైంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఇదేనని చెబుతున్నారు.ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం తమకు రెండొంతులకుపైగా సభ్యుల మద్దతు ఉందని చెబుతుండగా.. అధికారిక టీఎంసీ మాత్రం పార్టీ పూర్తిగా ఏకతాటిపై ఉందని.. తిరుగుబాటు నేతల వాదనలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేస్తోంది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ మరింత పెరిగింది. -
'ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ నటన ఆకట్టుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు సామ్ భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలో చాలా సినిమాలు చేశానని.. కానీ ఈ మూవీకి వస్తున్నంత రెస్పాన్స్ ఎక్కడా చూడలేదన్నారు. తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి.. మా అమ్మ కాలేజీ దగ్గర హోర్డింగ్స్ పెట్టారని తెలిసింది. నేను ఫస్ట్ టైం ఇంత హడావిడి చూస్తున్నానని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు. . -
ఆఖరి నిమిషంలో గోల్.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా రెండుసార్లు చాంపియన్స్ అయిన ఉరుగ్వే తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. గ్రూప్-హెచ్లో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్ను ఉరుగ్వే 1-1తో డ్రా చేసుకుంది. సౌదీ అరేబియా తరఫున ఆట 41వ నిమిషంలో అబ్దులేలాహ్ అల్ అమ్రి గోల్ చేయగా, ఉరుగ్వే తరఫున ఆట 80వ నిమిషంలో మాక్సీ అరౌజో గోల్ కొట్టడంతో ఉరుగ్వే బతికిపోయింది. లేదంటే సౌదీ అరేబియాకు మరో అద్భుత విజయం ఖాతాలో పడేదే. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇరుజట్లు మ్యాచ్ డ్రా చేసుకోవడంతో చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన ఐదవ నిమిషంలోనే ఉరుగ్వే గోల్కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బాక్స్ అంచు నుంచి మాక్సీ అరౌజో కొట్టిన షాట్ను గోల్ కీపర్ మొహమ్మద్ అలోవైస్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఉరుగ్వేకు కార్నర్ లభించినా, గోల్ చేయడంలో విఫలమైంది. 18వ నిమిషంలో ఉరుగ్వే కొట్టిన మొదటి షాట్ గోల్పోస్టు తగులుకుంటూ వెళ్లిపోయింది తగిలింది. ఆ తర్వాత 30వ నిమిషంలో మరోసారి గోల్కొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి కూడా సౌదీ గోల్ కీపర్ అడ్డుగోడలా నిలబడ్డాడు. ఆ తర్వాత నుంచి సౌదీ ఆటగాళ్లు ఉరుగ్వే గోల్పోస్ట్పై దాడులు చేయడం ప్రారంభించారు.అలా మ్యాచ్ 41వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ అబ్దుల్లా అల్-అమ్రీ గోల్ కొట్టడంతో తొలి హాఫ్ ముగిసేసరికి సౌదీ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో హాఫ్లోనూ ఉరుగ్వే పలుమార్లు గోల్పోస్ట్లపై దాడులు చేసినప్పటికీ సఫలం కాలేకపోయింది. ఇక మ్యాచ్లో ఓటమి ఖాయమనుకున్న దశలో 80వ నిమిషంలో మాక్సి అరౌజ్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. -
అమెరికాలో కూలిన విమానం.. 8 మంది దుర్మరణం
అమెరికా కాలిఫోర్నియా స్టేట్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్థానికకాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 11గం.20ని. సమయంలో ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. అయితే కాసేపటికే అది ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలిన వెంటనే అగ్నికి ఆహుతి కావడంతో అందులో సిబ్బంది అగ్నికి ఆహుతి అయ్యారు. సాధారణ పరీక్షా మిషన్లో భాగంగా బీ-52 బాంబర్ బయలుదేరిందని.. ఆ వెంటనే ఈ ఘోరం జరిగిందని ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ప్రమాద స్థలానికి అత్యవసర సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఎయిర్ బేస్ను తాత్కాలికంగా మూసివేసి, అక్కడికి వచ్చే ఇతర విమానాలను మళ్లించారు.ఇఇలా ఉంటే.. 1954లో అమెరికా ఆర్మీలో అడుగు పెట్టిన బీ-52 బాంబర్.. అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల్లో ఒకటి. అణ్వస్త్రాలు సహా వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఈ విమానం అనేక యుద్ధాల్లో సేవలందించింది. -
ఎల్నినోను తట్టుకునే ఉపాయాలు!
ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్నినో ప్రారంభమైందని భారతీయ వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ. వర్షం ఎప్పుడు, ఎంత పడుతుందో తెలియదు.. వర్షాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో తెలియదు.. ఉన్నట్టుండి ఎప్పుడు కుండపోత వర్షం పడుతుందో తెలియదు.. ఇటువంటి కరువు పరిస్థితులను రైతులు కొంతమేరకైనా తట్టుకునేందుకు ఉపయోగపడే వ్యవసాయ, నీటి సంరక్షణ పద్ధతులపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.. విత్తన గుళికలుతక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవడానికి విత్తనాలను గుళికలుగా మార్చడం ఎంతో లాభదాయకం. ఈ పద్ధతిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో, రైతులు ఇప్పటికే అనుసరిస్తున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు పొరలుగా (గోనె పట్టా సహాయంతో ఒక ప్రత్యేక పద్ధతిలో) లేపనం చేయడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3–5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మట్టిలో కేవలం 10–15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25–40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగలవు. పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొన్ని రకాల నూనె గింజలు, కొన్ని రకాల కూరగాయ విత్తనాలు విత్తన గుళికల తయారీకి అనువైనవి. కచ్చితంగా 5 సెం.మీ. (2 అంగుళాల) లోతులో మాత్రమే విత్తుకోవాలి.కందకాలుకురిసిన వర్షపు నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపజేసుకుంటే పంటలకు నీటి భద్రత దొరుకుతుంది. అందుకు కందకాలు ఉపయోగపడతాయి. పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. 1 మీటరు లోతు, 1 మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున కందకం తవ్వాలి. రెండు కందకాల మధ్య 5 మీటర్లు ఖాళీ వదలాలి. తవ్విన మట్టిని కందకం లోతట్టు వైపు కట్టగా పోయాలి. ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఎర్ర చల్కా చేను సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్ల రేగడి నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సీనియర్ నేతలను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ – రిటైర్డ్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – రిటైర్డ్) 99638 19074.ఎత్తు మడులుసాగు చేసే పంట ఏదైనా సరే ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పైనే పంటలు విత్తుకోవటమే రైతుకు అన్ని విధాలా మేలని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకుంటే రైతుకు ఆదాయ భద్రత చేకూరుతుందని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. ప్రవీణ్కుమార్ రైతులకు సూచిస్తున్నారు. పత్తి + కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో పాటు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే అనావృష్టి / అతివృష్టి వంటి వైపరీత్యాల నుంచి పంటలను రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుమడులపై పంటల సాగుపై అనేక ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. అనుసరిస్తున్న రైతులు సైతం చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే ఒక పంట దెబ్బతింటే, మరో పంటైనా రైతును ఆదుకుంటుందన్నారు. ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్ను 91822 67666 నంబరులో సంప్రదించవచ్చు.లాం ఫారంలో అమ్మకానికి మేలు రకం మిరప విత్తనాలు గుంటూరు సమీపంలోని లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఎల్.సి.ఎ–625, ఎల్.సి.ఎ–643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్ముతున్నట్లు లాం ఫారం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ టి. సుశీల తెలిపారు. ఎల్.సి.ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైనది. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకంలా ఉంటాయి. బెట్టను బాగా తట్టుకొంటుంది. కొంతవరకు జెమిని వైరస్ను కూడా తట్టుకొంటుంది. నల్లతామర పురుగు ఉధృతి ఉన్నా కొద్దిపాటి పురుగు మందుల పిచికారీతో అధిక దిగుబడినివ్వగలిగిన రకం. ఎల్.సి.ఎ–625 రకం ఎండు మిరపకు అనువైనది. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటు (45,000–50,000 ఎస్.హెచ్.యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60–65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు చాలా తక్కువగా వస్తాయి.లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రోజు ఉ. 9 గం.–సా. 4 గం. లోపు రైతులు నేరుగా వచ్చి కొనుక్కోవచ్చు. ఒక్క రైతుకు 250 గ్రాముల విత్తనం మాత్రమే రూ. 300లకు అమ్ముతారు. ఇవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపితే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని డా. సుశీల విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 99898 09554 / 94405 92982సేంద్రియ సేద్యంపై ‘అక్షయకల్ప’ ఫెలోషిప్వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపు ణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ’అక్షయకల్ప –రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, నాటు కోళ్ల పెంపకం,బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరు వాత 6 నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకార వేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యం. వివరాలకు.. 89043 96761 / 91132 03476 / 70222 77155 / 89043 96761 నిర్వహణ: పంతంగి రాంబాబు,సాక్షి సాగుబడి డెస్క్ -
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
మహారాణిపేట (విశాఖపట్నం): పెందుర్తి మండలం, పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం.107/11లో ఉన్న పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమి 8.08 ఎకరాలుని ఆక్రమణదారుల నుంచి పరిరక్షించాలని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఈ మేరకు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ భూమి ఆక్రమణకు జరిగిన ప్రయత్నాలు, అధికారులు చేపట్టిన చర్యలను వివరించారు.అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ... సర్వే నం.107/11లో ఉన్న 8.08 ఎకరాల పెద్దన్న చెరువు భూమిని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులే ఆక్రమించారని పరోక్షంగా ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అతని అనుచరులపై ఆరోపణ చేశారు. వారు ఈ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. బినామీలను సృష్టించి రూ.100 కోట్ల భూమి కబ్జా లేని రైతులను సృష్టించి బినామీ పేర్లతో రిజి్రస్టేషన్ చేశారని బండారు ఆరోపించారు. గతంలో పెద్దన్న చెరువు అన్యాక్రాంతంపై తాను ఫిర్యాదు చేశానని, అప్పటి కలెక్టర్ శ్యామలరావు విచారణ జరిపి రిజి్రస్టేషన్ను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆ«దీనంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ గత రెండు నెలలు నుంచి ఆక్రమణదారులు మరలా చెరువులో పనులు మొదలుపెట్టారని, అధికార టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెరువుని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల నాయకులు కూడా ఇటీవల చెరువును పరిశీలించి అధికార పార్టీ నాయకులు చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. బినామీ రైతులను సృష్టించి రూ.100 కోట్లు విలువైన భూమిని కొట్టేయాలని చూస్తున్నారని, పరిరక్షించాలని అధికారులను కోరినట్టు బండారు తెలిపారు. -
నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023–24 స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో 60.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించగా, ఆంధ్రప్రదేశ్లో 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే పేర్కొంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించలేదని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్లో మాత్రమే 90.5 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే తెలిపింది.ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్ జగన్ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వార్షికాదాయ పరిమితిని పెంచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.1 శాతం కటుంబాలకు, పట్టణాల్లో 85.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినట్లు సర్వే పేర్కొంది. -
120 కోట్ల మంది చూశారు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సీజన్గా 2026 నిలిచింది. ఈసారి టీవీ, డిజిటల్ వేదికలపై కలిపి ఏకంగా 120 కోట్ల మంది ఐపీఎల్ను వీక్షించినట్లు టోర్నీ అధికారిక ప్రసారకర్త ‘జియో హాట్స్టార్’ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ కావడం విశేషం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చిన మ్యాచ్గా గుర్తింపు పొందింది. ఆర్సీబీ వరుసగా టైటిల్ గెలిచిన ఈ పోరును వేర్వేరు స్క్రీన్లపై కలిపి 40 కోట్ల మంది చూడటం కొత్త రికార్డుగా నమోదైంది. ప్రేక్షకుల సంఖ్య గత ఏడాదికంటే ఈ సారి టీవీల్లో 22 శాతం, డిజిటల్లో 8 శాతం పెరగగా...జియో హాట్ స్టార్ ప్రాంతీయ డిజిటల్ చానల్స్లో ఐపీఎల్ వ్యూయర్షిప్ ఏకంగా 33 శాతం పెరిగింది. తాజా రేటింగ్ అంతర్జాతీయ క్రీడల్లో ఐపీఎల్ స్థాయి ఏమిటో చూపించాయని, మున్ముందు మరిన్ని కొత్త హంగులు, టెక్నాలజీతో ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయతి్నస్తామని జియో స్టార్ సీఈఓ ఇషాన్ ఛటర్జీ పేర్కొన్నారు. -
చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైనట్టో?
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికీ తెలియరాలేదు. చిన్నారి అదృశ్యమై సోమవారానికి పదోరోజు కావడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్, ఫారెస్టు, పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురవడంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది.ఆయిల్పామ్ తోటలో పచ్చిగడ్డి తొలగిస్తే ఏమైనా ఆనవాళ్లు లభిస్తాయేమోనని గడ్డి తొలగిస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ ఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలను సమీక్షిస్తున్నారు. అనుమానితులను, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా స్థానికులను, అటుగా రాకపోకలు సాగించిన వ్యక్తులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. తమ కుమార్తె క్షేమంగా ఇంటికి వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. థర్మల్ డ్రోన్ల ప్రవేశంఅటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను గుర్తించేందుకు ఫారెస్టు అధికారులు «థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లను వినియోగించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కాకినాడ రేంజర్ శ్రీదీప్తి ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ టీమ్, ఫారెస్టు అధికారులు నాలుగు ప్రదేశాల్లో ట్రాకర్లు అమర్చారు. మరోపక్క పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు వారం రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ నివేదికపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కిడ్నాప్ కోణంలో లభించని ఆధారాలుకాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గ్రామాన్ని పరిశీలించి, చిన్నారి తల్లిదండ్రులైన సుంకర గణేష్ , భవానీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి కిడ్నాప్కు గురైందనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. పెంపుడు కుక్క మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతోందన్నారు. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువుల్లో మరింత ఆందోళన, అభద్రతా భావాన్ని పెంచుతున్నారన్నారు. ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి, అధికారిక సమాచారాన్ని చేరవేయాలన్నారు. -
అడ్డుగోడలా నిలబడి...
అట్లాంటా: ఒక జట్టేమో 17వసారి ప్రపంచకప్లో ఆడుతోంది... మరో జట్టుకేమో ఇదే తొలి ప్రపంచ కప్... అనుభవం, బలాబలాలదృష్ట్యా 17వసారి ప్రపంచకప్లో పోటీపడుతున్న జట్టు అలవోకగా గెలవాలి. కానీ అలా జరగలేదు. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా... పట్టుదలతో పోరాడితే అద్భుతం చేయవచ్చని ప్రపంచకప్లో అరంగేట్రం చేసిన జట్టు నిరూపించింది. వెరసి తాజా ఫుట్బాల్ ప్రపంచకప్లో గోల్స్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయిన మ్యాచ్గా స్పెయిన్, కేప్ వెర్డె పోరు నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ స్పెయిన్కు ఈ ప్రపంచకప్లో ఆశించిన ఆరంభం లభించలేదు. గ్రూప్ ‘హెచ్’లో భారీ విజయంతో బోణీ కొట్టాలని భావించిన స్పెయిన్కు ప్రపంచ ర్యాంకింగ్స్లో 64వ స్థానంలో ఉన్న అనామక జట్టు కేప్ వెర్డెనుంచి ఊహంచని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా కేప్ వెర్డె గోల్కీపర్, 40 ఏళ్ల వొజిన్హా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఏకంగా ఏడుసార్లు స్పెయిన్ ప్లేయర్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్ యువ సూపర్ స్టార్ లామినె యామల్ 71వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో స్పెయిన్ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆ«దీనంలో ఉంచుకున్నా కేప్ వెర్డె గోల్కీపర్ను బోల్తా కొట్టించడంలో విఫలమయ్యారు. నెదర్లాండ్స్ను నిలువరించిన జపాన్ 2–2తో మ్యాచ్ ‘డ్రా’ డాలస్: ‘ఫిఫా’ ప్రపంచకప్లో ఆసియా జట్టు జపాన్ మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. 2020 టోర్నీలో మాజీ చాంపియన్లు జర్మనీ, స్పెయిన్లను ఓడించిన జపాన్... ఈసారి మరో పటిష్ట యూరోపియన్ టీమ్ నెదర్లాండ్స్ను నిలువరించింది. జపాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. నెదర్లాండ్స్ తరఫున వాన్ విర్జిల్ (50వ నిమిషంలో), సమ్మర్విల్లే (64వ నిమిషంలో) గోల్స్ సాధించగా... జపాన్ ఆటగాళ్లలో కీటో నకముర (57వ నిమిషంలో), కమాడా డైచీ (88వ నిమిషంలో) గోల్స్ కొట్టారు. దాదాపు మ్యాచ్ చివరి వరకు నెదర్లాండ్స్ ఆధిక్యం కొనసాగించగా... కమాడా అనూహ్య హెడర్తో స్కోరును సమం చేశాడు. ప్రపంచకప్లో మూడుసార్లు ఫైనల్కు చేరినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన నెదర్లాండ్స్ తర్వాతి దశకు అర్హత సాధించే ప్రయత్నంలో గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్ను చేజార్చుకుంది. దాంతో డచ్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.వెల్డన్... స్వీడన్మరో గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్లో స్వీడన్ 5–1 గోల్స్ తేడాతో ట్యునీషియాను చిత్తు చేసింది. 2893 రోజుల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్లో స్వీడన్ గోల్స్ ఖాతా తెరిచింది. 13వ సారి ప్రపంచకప్లో ఆడుతున్న స్వీడన్ తమ తొలి మ్యాచ్లోనే ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. యాసిన్ అయారి (7వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించగా... అలెగ్జాండర్ ఇసాక్ (30వ నిమిషంలో), విక్టర్ గ్యోకర్స్ (59వ నిమిషంలో), మతియాస్ స్వాన్బెర్గ్ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ కొట్టారు. ట్యునీషియా ఆటగాళ్లలో ఒమర్ రెకిక్ (43వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. 2018లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన స్వీడన్ 2022 ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. 19 మ్యాచ్ల తర్వాత... మరోవైపు ఈక్వెడార్తో జరిగిన గ్రూప్ ‘ఇ’ పోరులో ఐవరీకోస్ట్ 1–0తో విజయం సాధించింది. కొద్ది క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా సబ్స్టిట్యూట్ అమాద్ డియాలో (90వ నిమిషంలో) చేసిన ఏకైక గోల్తో ఐవరీకోస్ట్ అనూహ్యంగా గెలిచింది. దాంతో వరుసగా 19 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన ఈక్వెడార్కు తొలి ఓటమి ఎదురైంది. 2014లో చివరిసారి ప్రపంచకప్లో ఆడి ఓ మ్యాచ్లో గెలిచిన ఐవరీకోస్ట్... 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు అర్హత పొందలేదు. -
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: గ్రేటర్ రాయలసీమ ప్రజల నీటి అవసరాలు గుర్తించి ఇప్పటికైనా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ రాయలసీమ నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీ నర్ సాకే శైలజానాథ్, సభ్యులైన పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కందుల నాగార్జునరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను శైలజానాథ్ మీడియాకు వెల్లడించారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ‘‘రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు స్వార్థంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు ప్రశ్నార్థకం చేస్తున్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు నిరి్మస్తూ కృష్ణా నీటిని తరలించుకుపోతున్నారు. మాయమాటలతో గ్రేటర్ రాయలసీమ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ద్వారా రోజూ 7 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తయితే కనీసం 130 టీఎంసీల నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమ నీటి ఇబ్బందులకు పరిష్కారం చూపినట్టవుతుందని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.1000 కోట్లతో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వివరించాం. కానీ వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అక్కసుతో రెండేళ్లుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశారు.బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గాల్లో లెక్కలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పణంగా పెడుతున్నాడు. గ్రేటర్ రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలనే డిమాండ్తో ముందుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో అనంతపురం, నెల్లూరులోని ప్రాజెక్టులను సందర్శిస్తాం’’ అని శైలజానాథ్ తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ‘‘రాయలసీమ రైతులకు చంద్రబాబు నుంచి భరోసా లభించడం లేదు. హార్టికల్చర్ హబ్గా ఉన్న ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. నీళ్లు లేక చీనీ తోటలు ఎండిపోతున్నాయి. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభలో వైఎస్ జగన్ని తిట్టడం తప్పితే, రెండేళ్లలో ఏం సాధించారో చెప్పుకోలేకపోయారు.దుబారా ఖర్చులను తగ్గించాలని పిలుపునిస్తూ ఆర్భాటపు సభలతో, జగన్ని దూషించడానికి పదుల కోట్లు ఖర్చు చేయడం అవసరమా?. రెండేళ్ల తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి పంగనామాలు పెట్టేశారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రుజువైంది. కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించలేదు. కనీసం ఒక్క కొత్త పింఛన్ ఇచి్చన పాపాన పోలేదు. ఓటేసిన ప్రజల నమ్మకానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆర్టీసీ ఆస్తులపై చంద్రబాబు కన్ను
సాక్షి, అమరావతి/బస్డాండ్ (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైఎస్సార్టీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మండిపడ్డారు. రూ.లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.మాజీ సీఎం జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే.. చంద్రబాబు మాత్రం సంస్థను దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ లీజు ప్రక్రియను విరమించుకోకపోతే ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రతి జిల్లాలో వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ స్పందన లేకపోతే మిగిలిన కారి్మకసంఘాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకున్న వైఎస్ జగన్ విజయవాడ ఆర్టీసీ హౌస్ ఏదుట వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని మండిపడ్డారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యంకు వినతి పత్రాలు అందజేశారు. -
నేటి నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం భారత యువ క్రీడాభిమానులకు అలరించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి టోర్నీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిక కావడం విశేషం. నేడు ప్రారంభం కానున్న రగ్బీ లీగ్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. పురుషుల విభాగంలో 34, మహిళల విభాగంలో 14 కలిపి 13 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల విభాగంలో 6 టీమ్లో బరిలో నిలిచాయి. చెన్నై బుల్స్ డిఫెండింగ్ చాంపియన్ కాగా...హైదరాబాద్ హీరోస్, ఢిల్లీ రెడ్స్, కోల్కతా బంగా టైగర్స్, ముంబై డ్రీమర్స్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ పోటీ పడుతున్నాయి. గత ఏడాది టోర్నీలో హైదరాబాద్ హీరోస్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇవే పేర్లతో ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు జట్లకు మహిళల విభాగంలో ప్రాతినిధ్యం లేదు. రగ్బీ సెవెన్ ఫార్మాట్లో లీగ్ను నిర్వహిస్తారు. 22 నిమిషాల పాటు జరిగే ఒక్కో మ్యాచ్ను నాలుగు క్వార్టర్లుగా నిర్వహిస్తారు. మ్యాచ్లో ఒక్కో క్వార్టర్ తర్వాత 2 నిమిషాల చొప్పున మూడు ‘బ్రేక్’లు ఉంటాయి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు సోమవారం జరిగిన కార్యక్రమంలో రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రీమియర్ లీగ్ కమిషనర్ అయిన రాహుల్ బోస్ ట్రోఫీతో పాటు టోర్నీ ప్రత్యేక బంతిని ఆవిష్కరించారు. -
సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి, నరసరావుపేట: టీడీపీ నేతలతో కలిసి పోలీసులు సివిల్ పంచాయితీల పేరిట డబ్బుల కోసం వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళిత నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. తనపై సీఐ వెంకట్రావు, స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు అక్రమ కేసులు బనాయించి డబ్బుల కోసం చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందిన పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ దళిత నేత, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ జడ సురేంద్ర సోమవారం నిద్రమాత్రలు మింగాడు.అపస్మారక స్థితిలో వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు. సెల్ఫీ వీడియోలో బాధితుడి ఆవేదన.. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు సురేంద్ర ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తాను గతంలో ఓ రెస్టారెంట్ను ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చి కొనుగోలు చేశానని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించలేదంటూ స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు, సీఐ వెంకట్రావుతో కలసి వేధించడం మొదలు పెట్టారని వాపోయాడు. పిడుగురాళ్ల పోలీసుస్టేషన్లో అక్రమంగా నిర్బంధించి రూ.30 లక్షల దాకా బలవంతంగా వసూలు చేశారని, ఆపై ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని చెప్పాడు.ఇటీవల సుబ్బారావు, సీఐ వెంకట్రావు డబ్బులు కట్టాలని మళ్లీ వేధిస్తున్నారని, ఆదివారం స్టేషన్కు పిలిపించి కులం పేరుతో దూషించి, గంజాయి కేసు పెడతానంటూ సీఐ బెదిరించారన్నాడు. స్టేషన్లో స్పృహ తప్పిపడిపోయిన తనకు చికిత్స చేయించి ఇంటికి పంపించేశారని, వీరి వేధింపులు తాళలేక నిద్రమాత్రలు మింగుతున్నానని చెప్పాడు. కాగా, తన భర్తను రెండేళ్లుగా సీఐ, సుబ్బారావు వేధిస్తున్నారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. -
డీల్తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
అన్నదాత.. ‘ఆత్మ’ఘోష!
(పంపాన వరప్రసాదరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి): రెండేళ్ల ‘కాల కూటమి’ పాలనలో అన్నదాతలు అ«ధోగతి పాలయ్యారు! నష్టాల సాగులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సాగు భారమై... బతుకు బరువై సంక్షోభంలో కూరుకుపోయారు. ఏ పంటకూ మద్దతు ధర దక్కపోవడం.. చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలకు బలైపోతున్నారు. కొనేవారు లేక.. అమ్ముకునే దారిలేక.. పెట్టుబడి ఖర్చులు దక్కక.. అప్పులు తీర్చలేక రైతన్నల బతుకు దుర్భరంగా తయారైంది. దేశానికి అన్నంపెట్టే రైతులు భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి విపత్తులో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే కాడిపారేయడంతో ఆసరా లేక, భరోసా కరువై అన్నదాతలు విగత జీవులుగా మారుతున్నారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతు ఆత్మహత్యల వార్త లేని రోజు లేదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకూ ఏ పల్లెకు వెళ్లినా ఇదే దుస్థితి. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. విత్తు నుంచి విక్రయం వరకు గతంలో ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపించిన తోడు కరువైందంటూ విలపిస్తున్నారు. మేమున్నామంటూ తమకు భరోసా ఇచ్చే నాధుడు లేకుండా పోయారంటూ వాపోతున్నారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనలో రైతుల వెతలపై అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో సుమారు 30కిపైగా పల్లెల్లో ‘సాక్షి ప్రతినిధి’ బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళావిహీనంగా సీమ పల్లెలు.. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాయలసీమ జిల్లాల్లో రైతన్నల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఉద్యాన హబ్లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. సీమలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి మొదలు టమాటా, బత్తాయి (చీని), మామిడి, బొప్పాయి, అరటి, పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ.. ఇలా ఏ పంట పండించే రైతు పరిస్థితి చూసినా దయనీయంగా ఉంది.సాగుభారమై బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోతుండడంతో సీమ పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సీజన్కు ముందే పెట్టుబడి సాయం లేదు.. అదునుకు విత్తనం లేదు.. కట్ట యూరియాకు దిక్కులేదు.. కరువు కాటకాలు, వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే పైసా పరిహారం లేదు... ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. ఏ పంటకూ మద్దతు ధర లేక, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడుతున్నారు. ఏ పంట చూసినా కన్నీళ్లే..మామిడి, బత్తాయి, అరటి, ఉల్లి, వేరుశనగ, కూరగాయలు లాంటివి రాయలసీమలో ప్రధాన పంటలు. వేరుశనగలో 90 శాతం.. పత్తి, సజ్జ లాంటి పంటలు సగానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగవుతుండగా.. జొన్న, మొక్కజొన్న సైతం 40 శాతానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి రకమైన జీ–9 అరటితో పాటు తోతాపురి మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి లాంటి పండ్లను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడం సర్కారు నిర్వాకాలకు నిదర్శనం.పత్తి మద్దతు ధర రూ.8110 కాగా మార్కెట్లో రూ.5 వేలకు మించి కొనలేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,400–1,600 మించి ఇవ్వడం లేదు. అరటి రైతులైతే ఖరీఫ్లో రూపాయికి తెగనమ్ముకోగా రబీలో రూ.5కు మించి దక్కలేదు. సజ్జ మద్దతు ధర రూ.2,750 కాగా మార్కెట్లో రూ.1,800–1,900 మధ్య అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.తోతాపురి మామిడికి కిలో రూ.4–6కు మించి దక్కలేదు. చివరికి బత్తాయికి కూడా ఖరీఫ్లో కిలో రూ.6మించి లభించలేదు. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి మరీ దారుణం. కిలో రూపాయి.. అర్ధ రూపాయి పలకడంతో చేసేదిలేక వేలాది టన్నులు రోడ్లపైనే పారబోసిన ఘటనలు కోకొల్లలు. రెండేళ్లుగా కర్భూజ, పుచ్చకాయ పంటకు ధర లేదు. చివరికి పూలకు కూడా రేటు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అన్నదాతకు సున్నం.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోతపెట్టి 46.85 లక్షల మంది భూ యజమానులకు అరకొరగా రూ.14 వేల చొప్పున రూ.6,560.18 కోట్లతో సరిపెట్టారు. రెండేళ్లలో భూ యజమానులకే రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. ఇక కౌలు రైతులకైతే రెండేళ్లూ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులుండగా ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.6,400 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. పెట్టుబడి కోసం రైతులు సీజన్లో పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.బలవన్మరణాలు..సాగు కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వర్షాభావం, వరదలు, తుపాన్లు.. ఒక్కొక్కటిగా వైపరీత్యాలు విరుచుకుపడటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు మృత్యుపాశాలుగా మారాయి.టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే నాథుడు లేక, అప్పులు తీర్చే దారిలేక 2024–25లో 150 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. ఇక 2025–26లో 393 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అత్యధికులు సీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రభుత్వం పైసా పరిహారం ఇచి్చన పాపాన పోలేదు.చేయిపట్టి నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంవిత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా గ్రామ స్థాయిలో అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి పాలనలో నిరీ్వర్యమైపోయాయి. 10,778 ఆర్బీకేలు కాస్తా రేషనలైజేషన్ పేరిట 8451 క్లస్టర్లుగా కుదించారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే సంకల్పంతో గత ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల్లో సగానికి పైగా మూతపడగా మిగిలినవి అలంకారప్రాయంగా తయారయ్యాయి. సిబ్బందిని సర్వేలు, ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆర్బీకేలకు వెళ్తే పలుకరించే నాధుడే కరువయ్యారు.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీని నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అడ్డగోలుగా కోత పెట్టారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎరువులను పక్కదారి పట్టిస్తుండడంతో రైతులకు యూరియా, డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు.మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండేళ్లలో 50–70 శాతం మేర పెరిగిపోవడంతో సాగు భారం మారింది. మత్స్యకార, పశుసంవర్ధక శాఖలకు చెందిన సాగు ఉత్పాదకాల సరఫరాకు మంగళం పాడేశారు. వరుస వైపరీత్యాలు, కరువు సాయం కలిపి దాదాపు 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు దాదాపు రూ.1,100 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.అటకెక్కిన ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం వచీ్చరాగానే మంగళం పాడేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 2023–24 సీజన్కు సంబంధించిన ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. ఖరీఫ్ 2024 సీజన్ వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకం కొనసాగగా.. రబీ–2024–25 సీజన్ నుంచి చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద నమోదు పద్ధతి తెచ్చింది.2024–25 వ్యవసాయ సీజన్తో పాటు ఖరీఫ్–2025–26 సీజన్లో ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం బకాయిలు రూ.1,095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టాయి. రబీ –2025–26 సీజన్లో కనీసం బీమా పోర్టల్ కూడా తెరవలేదు. ఫలితంగా ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా బీమా చేయించుకోలేకపోయారు. ఇక రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీని రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మద్దతు ధర కోసం ఆందోళనలు.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ధరల స్థిరీకరణ నిధి కింద పైసా ఇచి్చన పాపాన పోలేదు. ఉల్లి, టమాటా, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, కోకో, మామిడి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 2024–25 సీజన్లో 75 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకు రూ.1,150–1,450కి మించి దక్కలేదు.2025–26లో 75 కేజీల బస్తాకు రూ.1,777 దక్కాల్సి ఉండగా రూ.1,250 నుంచి రూ.1,500 మధ్య దక్కింది. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగారు. 2023–24లో క్వింటా రూ.27 వేలకు పైగా పలికిన మిర్చి రైతుకు గతేడాది రూ.6–8 వేలకు మించి దక్కలేదు. మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,400 అయితే రైతులకు దక్కింది కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యే. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితి రెండేళ్లుగా దారుణంగా ఉంది. పైసా సాయం అందలేదు.. గత ఖరీఫ్లో 10 ఎకరాల్లో శనగ, మినుము, నాటుపొగాకు సాగు చేశా. దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పత్తి తెగుళ్ల బారిన పడింది. నాటు పొగాకు కొనేవారు లేకుండా పోయారు. శనగ, మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు రాసుకుని వెళ్లారే గానీ పైసా సాయం అందలేదు. – సుద్దాల సుబ్బరాయుడు, కొనకుంట్ల, నంద్యాల జిల్లారూ.60 లక్షలు నష్టపోయా.. 4 ఎకరాల్లో దానిమ్మ, మరో 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. ముంపునీటి బారిన పడి గతేడాది అరటి పంట దెబ్బతింటే.. ఈ ఏడాది బాక్టీరియల్ బ్లైట్ తెగులు బారిన పడి దానిమ్మ పూర్తిగా నాశనమైంది. మరో 15–20 రోజుల్లో పంట కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తెగులు సోకింది.చెట్టుకు 28 కేజీలకు తక్కువ కాకుండా ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. బెంగళూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. ఆ లెక్కన రూ.60 లక్షల వరకు నష్టపోయా. ఇది వాణిజ్య పంట కాబట్టి మీకు పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యాన పంటలన్నింటికి ఉచితంగా బీమా పరిహారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పైసా సాయం లేదు. – ధర్మవరపు రవిశేఖర్రెడ్డి, కందుకూరు, అనంతపురం జిల్లాపరిస్థితి దారుణంగా ఉంది.. ఐదెకరాల్లో మొక్క జొన్న, వేరుశనగ వేశా. మొక్కజొన్నకు ఎకరాకు రూ.లక్ష, వేరుశనగకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కజొన్న 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,500కి మించి ధర రాలేదు. క్వింటాకు రూ.900 చొప్పున దాదాపు రూ.1.13 లక్షల మేర నష్టపోయా. వేరుశనగ అకాల వర్షాల బారిన పడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రూ.8 లక్షలు అప్పు మిగిలింది. వైఎస్ జగన్ హయాంలో పైసా కట్టించుకోకుండా రూ.లక్షన్నరకు పైగా పంటల బీమా పరిహారం ఇచ్చారు. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం ఇచ్చేవారు. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. – మన్నెపూల శివశంకర్, మద్దాలపురం, అనంతపురం జిల్లాపాడి రైతులకు దగా.. మాకు మూడు ఆవులున్నాయి. రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తాయి. మా గ్రామంలో లీటర్ గేదె పాలకు రూ.40, ఆవుపాలకు రూ.20 మించి ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే వెన్న శాతం లేదంటారు. గత ప్రభుత్వ హయాంలో మంచి రేటు వచ్చేది. అమూల్ కేంద్రాల్లో పాలు పోసేవాళ్లం. లీటర్ గేదె పాలకు రూ.80, ఆవుపాలకు రూ.50కిపైగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలా అయితే పాడి రైతులు బతికేదెలాగో అర్ధం కావడం లేదు. – ఎం.జానకమ్మ, మద్దాలపురం, అనంతపురం జిల్లాపరిహారం లేదు.. వితంతు పింఛనూ ఇవ్వరు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ (35) తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని గత ఖరీఫ్లో మొక్కజొన్న, శనగ సాగుచేశాడు. పెట్టుబడి కోసం నాలుగు తులాలు బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాడు. తీరా పంట చేతికొచ్చే సరికి మద్దతు ధరలేక పెట్టుబడి కూడా రాలేదు.అప్పులు రూ.5 లక్షలకు చేరుకోవడంతో ఒత్తిళ్లు భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నట్లు సురేష్ భార్య సునీత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోవడంలేదంటూ వాపోయింది. పిల్లలతో కలిసి కూలి పనులకు పోతున్నా.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు మజర కోసనా పల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కురువ రామచంద్రుడు (45)కి సొంతంగా 2.5 ఎకరాలు, మరో 2 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. రెండు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి, పొగాకు సాగు చేసినా పంటలు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాడు.ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పులు కాస్తా వడ్డీలతో రూ.12 లక్షలకు చేరుకున్నాయి. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఉల్లి, తెగులు నివారణకు తెచ్చిన పురుగుల మందు తాగి గతేడాది సెప్టెంబర్ 14న ఆత్మహత్యకు ఒడిగట్టడంతో రామచంద్రుడి కుటుంబం దిక్కుతోచక అల్లాడుతోంది. ఇద్దరు కుమార్తెలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్నానంటూ రామచంద్రుడు భార్య లక్ష్మీ వాపోయింది. తనకు భర్తకు కౌలు కార్డు లేదనే సాకుతో పరిహారం రాదు పొమ్మంటున్నారని.. అప్పులోళ్లు భూమిని లాగేసుకున్నారని.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది.భూములు అమ్ముకుంటున్న అన్నదాతలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసులుడికి గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉల్లి, శనగ, వేరుశనగ, బంతి, చామంతి సాగు చేస్తారు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో గ్రామంలో 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చేదారిలేక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న భూములను తెగనమ్ముకుంటున్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఇప్పటికే 500 ఎకరాలకు పైగా అమ్ముకున్నామంటూ వాపోతున్నారు.వేరుశనగకు దూరమైన పల్లెలు.. ఈ ఫొటోలో ఉన్నవారంతా అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 95 శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా చీడపీడలతో దిగుబడులు తగ్గిపోవడం.. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు ఏ ఒక్క సీజన్లోనూ మద్దతు ధర దక్కక పోవడంతో ప్రతీ ఒక్కరూ రూ.లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీంతో వేరుశనగ సాగుకు గ్రామం పూర్తిగా దూరమైంది. ప్రత్యామ్నాయ పంటలు సైతం కలసి రావడం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద ఒక్క అనంతపురం, కర్నూలు జిల్లాలకే రూ.1,000 కోట్లకు పైగా పరిహారం దక్కింది. దాదాపు ప్రతీ రైతు రూ.లక్ష నుంచి రూ.నాలుగైదు లక్షల వరకు పరిహారం అందుకున్నారు. కానీ రెండేళ్లుగా తమ పరిస్థితి దారుణంగా ఉందంటూ గ్రామానికి చెందిన రైతు టి.నారాయణ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీలతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్ అకృత్యాలకు అద్దంపడుతోంది. ఓ ఎన్ఆర్ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.అరాచకానికి కేరాఫ్ అడ్రస్ చింతమనేని అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్చల్ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ రౌడీరాజ్యంగా మార్చివేశారు.అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? – ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణికబ్జాల ప్రత్తిపాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్ సిటీ సెంటర్ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్ఆర్ఐ మురళీమోహన్ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేశ్కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్ యజమానులను బెదిరించారు.ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబునరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా సృష్టించారు.ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. కేజీబీవీ ప్రిన్సిపాల్కు కూన రవికుమార్ వేధింపులు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్కు రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి గత ఏడాది చెక్పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. -
ఎగుమతులు భేష్..!
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు మేలో పటిష్ట పనితీరు చూపించాయి. ఆరు నెలల గరిష్ట స్థాయిలో 45.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 10 శాతం పెరిగి 73.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులను మించి దిగుమతుల విలువ పెరగడం కారణంగా ఏర్పడేది) 28.21 బిలియన్ డాలర్లకు ఎగిసింది. గతేడాది మే నెలలో వాణిజ్యలోటు 21.88 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముడి చమురు, ఎరువుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావడం దిగుమతుల బిల్లు పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు మెరుగైన వృద్ధిని చూసినట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. మరోవైపు మేలో సేవల ఎగుమతులు 36.76 బిలియన్ డాలర్లు, సేవల దిగుమతులు 19.06 బి. డాలర్లుగా ఉండొచ్చన్నది ప్రభుత్వం అంచనా. మొదటి రెండు నెలల్లో మంచి పనితీరు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 16.09 శాతం పెరిగి 88.91 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 15.14 శాతం జంప్ చేసి 145.35 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు ఎక్కువే.. ఏప్రిల్, మే నెలలో 9.40 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 60 శాతం పెరిగాయి. పసిడి, వెండి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఇటీవలే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. ముడిచమురు దిగుమతుల విలువ సైతం 16.5 శాతం పెరిగి 41.3 బిలియన్ డాలర్లకు చేరింది. పశ్చిమాసియాకు మెరుగైన ఎగుమతులు పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రాంతానికి మే నెలలో ఎగుమతులు గతేడాది మే స్థాయికి చేరినట్టు రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. 2025 మేలో 5.38 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈ ఏడాది అదే నెలలో 5.30 బిలియన్ డాలర్ల మేర ఆ ప్రాంతానికి ఎగుమతయ్యాయి. ఒమన్కు చెందిన దుక్్మ, సోహార్, సలాలా పోర్టుల ద్వారా భారత్ తన ఎగుమతులను పెంచుకుంది. -
మంత్రుల సింగపూర్ పర్యటన ఖర్చు 1.01 కోట్లు
సాక్షి, అమరావతి: సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, దేశాధ్యక్ష నాయకత్వంపై శిక్షణ కోసం ఏడుగురు రాష్ట్ర మంత్రులు ఏప్రిల్ 21 నుంచి 27 వరకు వారం రోజులపాటు సింగపూర్లో పర్యటించిన విషయం తెలిసిందే. వారి పర్యటనకు రూ.1.01 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.మంత్రులు సింగపూర్ పర్యటనకు తొలుత రూ.95.19 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మరో రూ.6.27 లక్షల అదనపు బడ్జెట్ను విడుదల చేస్తూ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రుల సింగపూర్ పర్యటనకు రూ.1.01 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేశారు. -
భాగస్వామ్యం సమున్నతంగా
బ్రటిస్లావా: జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’స్థాయికి ఉన్నతీకరిస్తున్నట్లు చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక రంగాల్లో పరస్పర సహకారం, వాణిజ్యం బలోపేతమే లక్ష్యంగా 11 కీలక ఒప్పందాలను ఇరుదేశాల అగ్రనేతలు కుదుర్చుకున్నారు. వలసలు, డిజిటల్ సాంకేతికత, రక్షణ, ఉన్నత విద్య, క్వాంటం కమ్యూనికేషన్స్ మొదలు పలు రంగాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధం పటిష్టతే లక్ష్యంగా వీలైనంత త్వరగా ఇండియా–యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు కృషిచేయాలని ఇరు నేతలు అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక, బహుముఖ సహకారం మరింత పెరగాలి. అందుకే బంధాన్ని సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నాం. సమగ్ర భాగస్వామ్యం అనేది మన రెండు దేశాల ఉమ్మడి విశ్వాసాలు, ప్రాధమ్యాలు, ఉమ్మడి భవిష్యత్కు ప్రతీక. తాజా చర్చలు రెండు దేశాల బంధాన్ని మరింత సమున్నత శిఖరాలకు చేర్చాయి. అణు శక్తి, జియోథర్మల్ విద్యుత్ వంటి ఇంధన వనరుల ద్వారా ఇంధన భద్రత, సుస్థిరత, స్వావలంభన సాధిద్దాం. మన ఉమ్మడి సామర్థ్యం అమోఘం. మన సంకల్పాలు అత్యున్నతం. ఆటోమొబైల్స్, రైల్వేలు, అధునాతన తయారీకేంద్రాలు, హరిత సాంకేతికతలకు అధిక ప్రాధాన్యతనిద్దాం. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కలిసి ముందడుగువేద్దాం. భారత్–ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి స్లోవేకియా సమ్మతి తెలిపింది. ఒప్పందం అమల్లోకి వస్తే ఇరుదేశాల్లోని పరిశ్రమలు, అంకుర సంస్థలు, వాణిజ్యం మునుపెన్నడూలేనంతగా ప్రయోజనం పొందటం ఖాయం’’అని మీడియా సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ అన్నారు. రక్షణరంగంలో సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ(ఎల్ఓఐ)పై నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి వంటి ఉమ్మడి వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు అంగీకారానికొచ్చాయి. ఇరుదేశాల మధ్య కారి్మకులు, వలసదారుల తరలింపుపైనా ఒప్పందం కుదిరింది. కారి్మకుల సంక్షేమ భద్రతా ఒప్పందాన్ని రెండు దేశాలు కుదుర్చుకున్నాయి. స్లోవేకియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీయే కావడంతో ఆదివారం రాత్రి దేశ రాజధానిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. హోటల్ వద్ద విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానర్ సాదరంగా ఆహ్వానించారు. -
కాపు యువకుడిది లాకప్ డెత్తేనా!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు, చినబాబు రెడ్బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న.. కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా? లాకప్లో చంపేశారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా ఎత్తుచికెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతుండగా, అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో, లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛలను కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వలేకపోతే, సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు? సమాధానాలు లేని ప్రశ్నలు ఈ వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూకీ కనుగొని తన ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లే సాయికృష్ణ వారి అదుపులో లేకపోతే, అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడు? అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా అలాగే పోలీసు శాఖపైనా ఉంది. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీలోపు తన ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. స్వతంత్ర విచారణకు ఆదేశించాలి చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తోందన్నది ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారనే అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసర పరిష్కారంగా ‘హెబియస్ కార్పస్ పిటిషన్’ను తన ప్రజల ముందు ఉంచింది. అలాంటి పరిస్థితి ఏర్పడటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక హెచ్చరికగా చూడాలి. ఇలాంటి పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ సమస్య ఒక్క సాయికృష్ణ గురించే కాదు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఎలా అమలవుతోంది? పోలీసుల చర్యలపై పర్యవేక్షణ ఎంత సమర్థంగా ఉంది? పౌర హక్కులకు ఎంత విలువ ఇస్తున్నారు? అనే తీవ్ర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పోలీసు శాఖ చట్టానికి మాత్రమే విధేయంగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆచూకీపై హైకోర్టు పదేపదే జోక్యం చేసుకోవాల్సి రావడం పరిపాలనా వైఫల్యంగా కనిపిస్తోంది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు త్వరితగతిన, విశ్వసనీయ సమాధానం రాకపోతే, ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మరింత తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. సీఐ బెదిరించారంటున్న తల్లి ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’ అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9, 10 తేదీలలో మార్కాపురం నుండి తన కుమారుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఎవరికి చెప్పకుండా స్టేషన్కు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రతికి ఉంటే కోర్టుముందు హాజరుపరచండి.. లేదంటే మృతదేహాన్ని అప్పగించండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతుండడం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.ఈ విషయమై ఆమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవహక్కుల కమిటీ చైర్మన్ను సంప్రదించి, తనకు న్యాయం చేయాలని అర్థించారు. ‘మే నెలలో కృష్ణలంక పోలీసులు నా ఇంటివద్దకు వచ్చారు. సీఐ పోలీసుస్టేషన్కు రమ్మంటున్నారంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ నా సెల్ఫోన్ను లాక్కొని, కొద్దిరోజులు వారి వద్దే ఉంచుకొన్నారు. ఫోన్ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా, రోజుల తరబడి తిప్పించుకొన్నారే తప్ప తిరిగి ఇవ్వలేదు’అంటూ ఆమె చెబుతున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల అరాచకాన్ని కళ్లకు కడుతోంది. తన కొడుకును చంపేసి ఉంటారని ఆమె హైకోర్టు ధర్మాసనం సాక్షిగా ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘నా కొడుకును చంపేశారేమోనని చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి కూడా వెళ్లి చూశా’ అన్న ఆమె ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సాయికృష్ణను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందేకృష్ణలంక పోలీసులకు 29 వరకు గడువు పొడిగించిన హైకోర్టువిజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, పోలీసులు చంపేసి ఉంటారన్న అనుమానాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేశారు.సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29 వతేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కొంత కాలంగా మార్కాపురంలో ఉంటున్నాడు.అయితే పలు కేసులు ఉన్నాయన్న కారణంతో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఇటీవల మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారని, ఆ తరువాత నుంచి ఆచూకీ తెలియడంలేదని, తన కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ నెల 15న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.సోమవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీపీ కృష్ణ ప్రణీత్ వాదనలు వినిపిస్తూ, సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని, అందుకే అతడిని కోర్టు ముందు హాజరుపరచలేదని తెలిపారు. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరింత సమయం కావాలని కోరారు. విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్తో డీల్పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్ను కూల్చినందుకు ఇరాన్పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సర్’లో టీడీపీ చొరబాటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్వోలకు బ్లాక్ అండ్ వైట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.టీడీపీ కార్యాలయంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్పోర్టు’లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్లవారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటరు బూత్ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.టీడీపీ రూపొందించిన యాప్లో ‘సర్’ విభాగం ఒక్కో టీడీపీ బీఎల్ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరతీశారు.ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్ఏ 50 వరకు ఫారం –7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బీఎల్వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది. ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్తో పాటు లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవా మిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతిపరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్లైన్లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. -
ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న లేదా మూడో ప్రపంచ దేశాలుగా పిలిచే దేశాల నుంచి భారీ స్థాయిలో వలసదారులను అనుమతిస్తే, అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో స్పందిస్తూ.. మూడో ప్రపంచ దేశాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే, చాలా త్వరగా మన దేశం కూడా మూడో ప్రపంచ దేశంలా మారిపోతుంది. దాన్ని ఆపడానికి మనమేమీ చేయలేమని పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)ను ప్రస్తావించారు.కాగా, ట్రంప్ రాజకీయ ప్రయాణంలో వలసల నియంత్రణ, జాతీయ గుర్తింపు, సరిహద్దు భద్రత వంటి అంశాలు కీలక అజెండాలుగా కొనసాగుతున్నాయి. తాజా వ్యాఖ్యలు కూడా అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇటీవల హెచ్-1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధించే తన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆ ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.దీనిపై స్పందించిన ట్రంప్, ఫెడరల్ న్యాయమూర్తులు మా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్నది ఆశ్చర్యకరం. ఇది దేశానికి నష్టం చేస్తోందని విమర్శించారు.మరోవైపు, జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) అంశంపై కూడా ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రసవం ద్వారా పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని కొందరు వలసదారులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలకు ఆయన మద్దతు పలికారు.ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలస విధానాలపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ట్రంప్మద్దతుదారులు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నారని చెబుతుండగా, విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను వలసదారులపై ప్రతికూల అభిప్రాయాలను ప్రోత్సహించేవిగా అభివర్ణిస్తున్నారు. -
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!!
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!! -
కారుచౌకగా కట్టబెట్టేశారు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కల్పిస్తుందని చెబుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టింది. ఇదే ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న భూమిని దారి కోసం ఓ రైతు నుంచి అదే కంపెనీ ఎకరం రూ.75 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఆ వెనకే టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) అధీనంలో ఉన్న 72 ఎకరాల భూమిని ఎకరం కేవలం రూ.21 లక్షల చొప్పున రూ.15.12 కోట్లకే ప్రభుత్వం ధారాదత్తం చేయడం గమనార్హం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు ఫుడ్పార్క్లో జరిగిన ఈ తంతుపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతుండగా..ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు చక్రం తిప్పారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి లక్ష్యంగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతంలో జామ, మామిడి, అరటి, కొబ్బరి, ఆయిల్పామ్ తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో బుగ్గపాడులో ఫుడ్పార్క్కు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రైతుల నుంచి 203 ఎకరాలు సేకరించి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఆపై భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించారు. ఫుడ్పార్కులో అన్ని వసతులున్నా.. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొక్కజొన్న, మామిడి, కొబ్బరిపీచు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అంత తక్కువ ధరకు ఎలా? బుగ్గపాడు ఫుడ్పార్క్లో 72 ఎకరాల భూమి కేటాయిస్తే రూ.650 కోట్ల వ్యయంతో చేపలు, రొయ్యల దాణా తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతులకు మరో పరిశ్రమ ఏర్పాటుకు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్కు చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. దీని యజమాని అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం కాగా..దీని ప్రధాన కార్యాలయం పూర్వపు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, బొమ్ములూరు గ్రామంలో ఉంది. విజయవాడలో కూడా వీరికి సంబంధించిన కార్యాలయం ఉండగా, మచిలీపట్నం, ఏలూరు, విశాఖపట్నంలో కూడా వీరి యూనిట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఒకరు..ఫుడ్ పార్క్లో ఎకరం రూ.21 లక్షలకే కేటాయించేలా చేశారని తెలుస్తోంది. సదరు మంత్రి తనయుడు బుగ్గపాడు ప్రాజెక్టులో స్లీపింగ్ పార్ట్నర్ అనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. కాగా పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ భూమిలోకి త్వరగా చేరుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో ఒప్పందం కన్నా ముందే రోడ్డు ఎదురుగా ఉన్న ఎకరం భూమిని ఓ రైతు వద్ద రూ.75 లక్షలకు ఆ కంపెనీ కొనుగోలు చేయడం గమనార్హం. కాగా అంత విలువున్న ఆ భూమిని ఆనుకుని ఉన్న టీజీఐఐసీ భూమిని ఎకరం రూ.21 లక్షలకు సదరు కంపెనీకి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి టీజీఐఐసీ ఎకరం ధర రూ.40.47 లక్షలుగా నిర్ణయించింది. మరోవైపు ఆ కంపెనీ రైతు నుంచి ఎకరం ఏకంగా రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఈ రెండూ కాదని రూ.21 లక్షల ధర ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అభివృద్ధి చేసిన విలువైన భూమిని ఈ విధంగా తక్కువ ధరకు అమ్మడంపై ప్రజాసంఘాలు, బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. రెండేళ్ల తర్వాత కంపెనీ ఆస్తే.. ఏపీ కంపెనీకి 72 ఎకరాలు ఇవ్వగా.. డీపీఆర్ ప్రకారం పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తే రెండేళ్ల తర్వాత కంపెనీ పేరుతో సేల్డీడ్ అవుతుంది. అంటే సదరు భూమి కంపెనీదే అవుతుందన్న మాట. స్థానికంగా రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్న నల్లరేగడి భూముల ఎకరం ధర బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా సీతారామ ప్రాజెక్టు జలాలు అందే అవకాశముంది. సదరు కంపెనీ కూడా రైతుల భూములు ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీజీఐఐసీ ఇటీవల ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు తమ అ«దీనంలో ఉన్న భూములకు చదరపు మీటర్ చొప్పున ధర నిర్ణయించగా.. బుగ్గపాడు భూమి ధర రూ.1,000గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరా కనీసం రూ.40.47 లక్షలకు కేటాయించాలని, అలా కాకుండా సగం ధరకే ఏకంగా 72 ఎకరాలు కట్టబెట్టడం వెనుక ‘మంత్రాంగం’ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరూ ముందుకు రానందుకే.. కంపెనీ డీపీఆర్ను పరిశీలించాకే 72 ఎకరాల భూమి కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రెండేళ్లలో పూర్తిస్థాయి పరిశ్రమల ఏర్పాటుతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్లో పేర్కొన్నారు. బుగ్గపాడు ఫుడ్పార్క్లో అన్ని వసతులు కల్పించి ఎకరం ధర రూ.40 లక్షలుగా నిర్ణయిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడి భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్థాయిలో ఏపీ కంపెనీకి ఎకరం రూ.21 లక్షలకు అప్పగించాలని నిర్ణయం జరిగింది. – అజ్మీరా స్వామి, జోనల్ మేనేజర్, టీజీఐఐసీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి -
ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు యాక్టివిస్టులు దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్లో ప్రభుత్వ రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకం కలిగించడంతో పాటు, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆర్టీఐ కార్యకర్తకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు మీరేమైనా ఉన్నతాధికారా? అని ఈ సందర్భంగా పిటిషనర్ను నిలదీసింది. పంజాబ్లో రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడమే కాకుండా, పర్యవేక్షిస్తున్న అధికారిని, కార్మికులను బెదిరించి, కులం పేరుతో దూషణలకు దిగారన్న ఆరోపణలపై రమేశ్ కుమార్ బెహ్ల్ అనే ఆర్టీఐ కార్యకర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలివ్వాలంటూ అతడు తొలుత పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ధర్మాసనం పిటిషనర్ తీరును తప్పుబట్టింది. ‘ఆర్టీఐ కార్యకర్తలుగా చలామణి అవ్వడం ఇప్పుడు ఓ కొత్త వ్యాపారంగా మారిపోయింది. కేంద్రం నిధులు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది. అసలు మీరెవరు? మీరొక ఆర్టీఐ కార్యకర్తా? ఇదొక ఎల్లో జర్నలిజం‘అని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. అనంతరం జస్టిస్ బిష్ణోయ్ కలుగజేసుకుంటూ.. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి మీరేమైనా ఉన్నతాధికారా? అని పిటిషనర్ను ప్రశ్నించారు. -
కిషన్రెడ్డే అడ్డుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా, రా ష్ట్రంలో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి కుట్రపూరితంగా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘ఒప్పందం ప్రకారం తొలి దశ ప్రాజెక్టు స్వాదీనానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి అవసరమైన రుణం విడుదలకు జూన్ 15 చివరి రోజు. బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఈ రోజు కిషన్రెడ్డి రుణం విడుదల చేయిస్తడా? చేయించడా? చివరకు రిజర్వ్ బ్యాంకు నుంచీ గ్యారెంటీ తెచ్చి ఇచ్చాం. ఇక ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. రుణం ఆపడానికి కారణం ఏమిటో చెప్పండి. రుణం విడుదల చేయించడానికి మీరు మాట్లాడతరా? మాట్లాడరా? రెండో విడత మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం నిధుల వాటాతో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు వస్తదా? రాదా? ముందుకు రాకపోతే రాష్ట్రమే పూర్తి వ్యయంతో కట్టుకోవడానికి కేంద్రం ఎన్ఓసీ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్కు కూడా మెట్రో ఇచ్చారు. విశ్వనగరం హైదరాబాద్కు ఇవ్వడం లేదంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్వోసీ ఇస్తే మీ వాటా అవసరం లేదు.. ‘మెట్రో తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి అవసరమైన రుణం కోసం ఐఆర్ఎఫ్సీని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వం పెట్టుబడి వాటాగా రూ.1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ.84 కోట్ల పేపర్ ఫీజు కట్టింది. ఐఆర్ఎఫ్సీ రూ.13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉండగా, కరెక్టుగా ఈ సమయంలోనే (గతనెల 20న) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన కిషన్రెడ్డి.. ఇంత సులువుగా మీరు రేవంత్రెడ్డికి అప్పులు ఇస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసివేయాలా? అని తిరకాసు పెట్టడంతో రుణం విడుదల చేయకుండా కేంద్రం పీటముడి వేసుకుని కూర్చుంది.’ అని సీఎం ఆరోపించారు. ‘రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్వోసీ ఇస్తే ఐఆర్ఎఫ్సీ నుంచి 4 శాతం వడ్డీతో మళ్లీ రూ.40 వేల కోట్ల రుణం తెచ్చుకుంటాం. మీ 50 శాతం నిధుల వాటా అవసరం లేదు..’ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు ‘ఎవరితో సంబంధం లేకుండా రేవంత్రెడ్డి 122 కి.మీ.ల మెట్రో కట్టుకుంటే మోదీ, కిషన్రెడ్డి, కేంద్ర ప్రభుత్వం గురించిన చర్చ ఉండదు. అప్పుడు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఛిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ఖట్టర్ను కలవడానికి వెళ్లినప్పుడు కిషన్రెడ్డి నన్నెందుకు తీసుకునిపోడు? వరంగల్ ఎయిర్పోర్టు కొలిక్కి వచ్చాక కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడిని కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు? అశ్వినీ వైష్ణవ్ను కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు?..’ అని సీఎం నిలదీశారు. కేసీఆర్ వల్ల రూ.7 వేల కోట్ల నష్టం ‘నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 2009లో మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వైఎస్ అకాల మరణం తర్వాత నాటి సీఎం రోశయ్య రూ.15 వేల కోట్లతో 70 కి.మీ.ల కారిడార్తో 2017లోగా మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయడానికి ఎల్అండ్టీ సంస్థతో పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. అయితే 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక చారిత్రిక కట్టడాల పేరుతో మూడు మార్గాల్లో అలైన్మెంట్ మార్చాలని ఎడతెగని పేచీ పెట్టడంతో పనులు ఆలస్యమై 2020కి కానీ పూర్తి కాలేదు. మూడేళ్ల జాప్యంతో వ్యయం రూ.22వేల కోట్లకు పెరిగింది. షరతులపై షరతులు పెట్టిన కేంద్రం మెట్రో రైలు రెండో దశకు అనుమతి, నిధులివ్వాలని మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే, ఆర్థిక శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశా. ఎల్అండ్టీని భాగస్వామిని చేస్తేనే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ షరుతు పెడితే ఎల్అండ్టీ తిరస్కరించింది. గత ప్రభుత్వం పనులు స్తంభింపజేయడంతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలంటూ కేంద్రం మరోసారి మెలిక పెట్టగా, ఆ సంస్థ మళ్లీ తిరస్కరించింది. దీంతో ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలు కొనుగోలే ఏకైక ప్రత్యామ్నాయం అని కేంద్రం చెప్పింది. ఇందుకు ఎల్అండ్టీని ఒప్పించి, మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాం..’ అని సీఎం వివరించారు. నేను అండగా ఉంటా కేసీఆర్ను భయపెట్టు ‘రెండో దశ విస్తరణకు 50శాతం నిధుల వాటా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని కిషన్రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవముంటే కాగితం చూపించాలి. తెలంగాణ తరఫున కేంద్ర కేబినెట్ ర్యాంకు మంత్రివి నువ్వు ఒక్కడివే. మంత్రివర్గం భేటీలో పీఎం మోదీతో నువ్వే మాట్లాడాలి. కేసీఆర్కు భయపడి, లొంగిపోయి కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్ను భయపెట్టు. కిషన్రెడ్డికి అంత తెలివి లేదు. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడి వేషం వేసుకుని అందరినీ బెదిరించినట్టు.. ‘నీ సంగతి చూస్తా ’అని రామచందర్రావు నన్ను బెదిరిస్తుండు. నేను భడేభాయ్(మోదీ)ను కూడా కలిసా. కింద(రాష్ట్రంలో) సమస్యలుంటాయి..అవి ఏందో చూడు అన్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చాలా మందిని కలిసి వచ్చిన. వారితో జరిగిన చర్చను బయటపెట్టడం అనైతికమని కొన్ని విషయాలు చెప్పుకోదలుచుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. కేంద్రం ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది.. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కిషన్రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ మోదీ అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ (వికలాంగ ప్రభుత్వం). ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది. స్పష్టమైన మెజారిటీ లేదు. నాకు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపై ఆధారపడలేదు. నన్ను రిజైన్ చేయమని అడిగే నైతిక హక్కు వారికి లేదు. అయినా మోదీ చేస్తే నేనూ రాజీనామా చేయడానికి సిద్ధం..’ అని సీఎం స్పష్టం చేశారు. -
సువేందు స్కెచ్కు ఆర్ఎస్ఎస్ బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించి, బెంగాల్ పీఠాన్ని దక్కించుకున్న తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఆ జోష్తోనే టీఎంసీని మరింతగా దెబ్బతీయాలని, ఆ పార్టీకి చెందిన అసంతృప్త ఎంపీలు, ఎమ్మెల్యేలను కమలం గూటికి చేర్చాలని సువేందు స్కెచ్వేశారు. అయితే, సీఎం స్పీడ్కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గట్టి బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. టీఎంసీ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించే ప్రతిపాదనను సంఘ్ ససేమిరా అనడంతో బెంగాల్ బీజేపీలో కొత్త చర్చ మొదలైంది. టీఎంసీ తిరుగుబాటు నేతలను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్ ఎన్నికల్లో తిరుగుండదని సువేందు భావించారు. ఇప్పటికే పలువురు టీఎంసీ కీలక నేతలతో సువేందు అధికారి చర్చలు జరిపి, చేరికలకు లైన్ క్లియర్ చేసుకున్నారు. సంఘ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ‘తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే, పార్టీ సిద్ధాంతాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన సొంత క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. తొందరపాటు రాజకీయ చేరికల కంటే దీర్థ కాలికంగా పార్టీని బలోపేతం చేసుకోవడమే ముఖ్యం’అని ఆర్ఎస్ఎస్ పెద్దలు సువేందుకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ మేరకు తాజాగా 20మంది టీఎంసీ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లోవిలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి సువేందు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలుస్తోంది. -
ఈజిప్ట్ ఓన్ గోల్.. బెల్జియంను కాపాడిన లుకాకు
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా ఈజిప్ట్తో ఇవాళ (జూన్ 16) జరిగిన గ్రూప్-జి మ్యాచ్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న బెల్జియంకు తృటిలో పరాభవం తప్పింది. సియాటెల్లో జరిగిన ఈ మ్యాచ్లో ఈజిప్ట్ అద్భుత పోరాటాన్ని ప్రదర్శించి 1-1తో డ్రా చేసుకుంది. ఓటమి అంచుల వరకూ వెళ్లిన బెల్జియంను ఆ జట్టు స్టార్ స్ట్రైకర్ రొమేలు లుకాకు కాపాడాడు.మ్యాచ్ ఆరంభం నుంచే ఈజిప్ట్ ఆధిపత్యం ప్రదర్శించింది. కోచ్ హొస్సమ్ హసన్ వ్యూహాలు ఫలించడంతో బెల్జియం స్టార్ ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మొహమ్మద్ సలాహ్ను మధ్యభాగంలో ఆడించాలన్న నిర్ణయం విజయవంతమైంది.19వ నిమిషంలో సలాహ్ అందించిన అద్భుత పాస్ను అందుకున్న ఇమామ్ అషోర్ బాక్స్ వెలుపలి నుంచి శక్తివంతమైన షాట్తో గోల్ సాధించి ఈజిప్ట్కు 1-0 ఆధిక్యం అందించాడు. అంతర్జాతీయ కెరీర్లో అతనికి ఇదే తొలి గోల్ కావడం విశేషం.మొదటి అర్ధభాగంలో బెల్జియం వద్ద బంతి ఎక్కువసేపు ఉన్నప్పటికీ ఒక్క షాట్ను కూడా లక్ష్యంపైకి పంపలేకపోయారు. స్టార్ ఆటగాడు కెవిన్ డి బ్రూనే పెద్దగా ప్రభవం చూపలేకపోయాడు.రెండో అర్ధభాగంలో ఈజిప్ట్ మరింత ప్రమాదకరంగా కనిపించింది. ముస్తఫా జికో, సలాహ్ చేసిన ప్రయత్నాలను బెల్జియం గోల్కీపర్ థిబాత్ కర్టోయిస్ అద్భుతంగా తిప్పికొట్టడంతో స్కోరు మారలేదు.అయితే 66వ నిమిషంలో లుకాకును బరిలోకి దింపిన వెంటనే మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం 28 సెకన్లలోనే అతని ఒత్తిడికి లోనైన ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హనీ పొరపాటున ఓన్ గోల్ చేయడంతో బెల్జియం స్కోర్ను సమం చేసుకుంది.ఆ తర్వాత విజయం కోసం గట్టిగా ప్రయత్నించినా ఈజిప్ట్ రక్షణ గోడను ఛేదించలేకపోయింది. చివరకు మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. జూన్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్ల్లో ఈజిప్ట్ న్యూజిలాండ్తో, బెల్జియం ఇరాన్తో తలపడనుంది. -
ఫీజులు ఎందుకు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: మీరు కోరినంత ఫీజులు ఎందుకు పెంచాలి? అన్ని ఖర్చులూ విద్యార్థుల నుంచే వసూలు చేయడం సరైనదేనా? కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలున్నాయని చెప్పేందుకు ఆధారాలేంటి? మూడేళ్లుగా కొత్తగా తీసుకొచ్చిన లేబోరేటరీలెన్ని? లైబ్రరీలెన్ని?.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) వేసిన ప్రశ్నలివి. కోర్టు ఆదేశంతో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంపై ఎఫ్ఆర్సీ సోమవారం విచారణ చేపట్టింది. తొలిరోజు ఆరు కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు.వాస్తవానికి ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ ఫీజులను కమిటీ సమీక్షిస్తుంది. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరంలో ఫీజులను ఖరారు చేసింది. అయితే కాలేజీల ఆడిట్ రిపోర్టులపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గత ఏడాది ఫీజుల ఖరారును నిలిపివేసింది. తిరిగి విచారణ చేపట్టిన అనంతరం కొన్ని కాలేజీలకు ఫీజులు పెంచారు. మరికొన్ని కాలేజీలకు తగ్గించారు. దీంతో ఫీజులు తగ్గించిన కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన కోర్టు మరోసారి పరిశీలించాలని ఎఫ్ఆర్సీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా కాలేజీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుండగా.. ప్రభుత్వం కోర్టుకు నివేదించనుంది. నిర్వహణ ఖర్చు పెరిగింది: కాలేజీలు కాలేజీల నిర్వహణ ఖర్చు విపరీతంగా పెరిగిందని కాలేజీల యాజమాన్యాలు ఎఫ్ఆర్సీ ముందు వాదించాయి. తాజా ఆడిట్ రిపోర్టులను కమిటీకి అందించాయి. వీటిని పరిశీలించిన కమిటీ సభ్యులు పలు ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్యోగాల కోసం ఇచ్చే శిక్షణను, పాలనాపరమైన అవసరాలకు వెచి్చంచే మొత్తాన్ని, జాతీయ ర్యాంకుల కోసం ఖర్చు చేసే వ్యయాన్ని ఆడిట్లో పొందుపర్చడం సరికాదని అభిప్రాయపడినట్టు తెలిసింది. జాతీయ ర్యాంకులే రాని కాలేజీలు, ఫ్యాకల్టీ కోసం ఎంతమాత్రం ఖర్చు చేయని కాలేజీల వైఖరిని ప్రశ్నించినట్టు సమాచారం.అయితే మూడేళ్ళల్లో ఒకసారి ర్యాంకులు రానంత మాత్రాన దాన్ని కొలమానంగా తీసుకోవడం సరికాదని కాలేజీలు అంటున్నాయి. ప్రతి ఏటా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు పెంచుతున్నామని, ఫీజులు తగ్గించడం వల్ల వేతనాల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి వచి్చందని చెబుతున్నాయి. ఇప్పటికే నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని కమిటీ దృష్టికి తెచ్చాయి. ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎఫ్ఆర్సీ కాలేజీల అభిప్రాయాలను తెలుసుకున్న ఎఫ్ఆర్సీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని యాజమాన్యాలకు తెలిపింది. ఆడిట్ నివేదికలను నిపుణుల పరిశీలనకు ఇవ్వాలని భావిస్తోంది. మంగళవారం మరికొన్ని కాలేజీల వాదన విన్న తర్వాత అన్నిటినీ నిపుణులకు అందజేయనుంది. అవసరమైతే అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల ప్రతినిధులతో కలిసి కాలేజీలను తనిఖీ చేయాలని, మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీని పరిశీలించిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయానికి రావాలని ఎఫ్ఆర్సీ భావిస్తున్నట్టు తెలిసింది. -
ఇరాన్ ఫుట్బాల్ అభిమానులకు ఎదురుదెబ్బ
ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్లకు ఇరాన్ విప్లవానికి ముందు ఉపయోగించిన జెండాను తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది. దీంతో ఆ జెండాను స్టేడియాల్లో అనుమతించాలని కోరిన ఇరానియన్ మూలాలున్న అభిమానులకు ఎదురుదెబ్బ తగిలింది.FIFA అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం రాజకీయ, వివక్షపూరిత లేదా వివాదాస్పద చిహ్నాలను ప్రపంచకప్ వేదికల్లోకి అనుమతించరాదు. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ వాయిస్ ఆఫ్ లిబర్టీ’ అనే సంస్థతో పాటు దాని సభ్యుడు సామ్ కెర్మానియన్ కోర్టును ఆశ్రయించారు.1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు, మొహమ్మద్ రెజా పహ్లావి పాలనలో ఉపయోగించిన ఇరాన్ జెండాను ప్రదర్శించడం ద్వారా ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకతను, ప్రజాస్వామ్య సంస్కరణలకు మద్దతును తెలియజేయాలనుకుంటున్నామని పిటిషనర్లు వాదించారు. అయితే ఆ జెండాను అనుమతిస్తే అభిమానుల మధ్య ఘర్షణలు, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫిఫా పేర్కొంది.లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి కర్టిస్ కిన్ ఇందుకు సంబంధించి తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఫిఫా నిషేధం కొనసాగనుంది. ఈ నిర్ణయం ఇరాన్-న్యూజిలాండ్ ప్రపంచకప్ మ్యాచ్కు కొద్ది గంటల ముందు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సైన్యానికి హైదరాబాదీ డ్రోన్లు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే–250ఈ రకం డ్రోన్లను అందజేసింది. రూ. 72 కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ డ్రోన్లను నాసిక్లోని సదరన్ కమాండ్ అధికారులకు అందించినట్లు సంస్థ సీఈవో యశ్వంత్ బొంతు సోమవారం తెలిపారు. మిగిలిన డ్రోన్ల సరఫరాను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు దేశీయ రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయనుంది.డ్రోగో ఏరోస్పేస్ రూపొందించిన జేకే–250ఈ రకం డ్రోన్లు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 3 గంటలపాటు నిరంతరాయంగా గగనతలంలో ప్రయాణించగలవు. నిఘా, పర్య వేక్షణతోపాటు ఇతర సైనిక అవసరాలకు ఇవి ఉప యోగ పడతాయి. హైదరాబాద్లోని మాదాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రోగో డ్రోన్స్ ఇటీవల తన పేరును డ్రోగో ఏరోస్పేస్గా మార్చుకుంది. డ్రోన్ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, ఏరోస్పేస్ సాంకేతికతల అభివృద్ధి, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అందించే సంస్థగా విస్తరించింది.రక్షణ, నిఘా వ్యవస్థలు, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం డ్రోగో ఏరోస్పేస్కు నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా డ్రోన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కొత్త ప్లాంట్ ప్రారంభంతో మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు యశ్వంత్ బొంతు వివరించారు. -
కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను: సునీల్
‘‘ఇసాకపట్నం’ సిరీస్ చాలా వాస్తవంగా ఉంటుంది. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. ఈ సిరీస్లో నేను ఇప్పటి వరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను’’ అని సునీల్ పేర్కొన్నారు. ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో, సునీల్, నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల ఇతర పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’.గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రోడక్షన్స్ పై రాహుల్ తమడా, సెదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్గా రూ పొందిన ఈ సిరీస్ జూలై 2 నుంచి తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ–‘‘పవర్, సంఘర్షణతో నిండిన ప్రపంచంలో ధైర్యం, బలహీనత, ఆత్మవిశ్వాసంతో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే పాత్ర నాది.ఈ పాత్రను పోషించడం ప్రత్యేకమైన అనుభవం’’ అని చెప్పా రు. ‘‘ఇసాకపట్నం’ ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీగా ఉంటాయి’’ అని గ్యారీ బీహెచ్ తెలిపారు. ‘‘ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళతారనే విషయాన్ని ఈ కథ బలంగా చెబుతుంది’’ అన్నారు సముద్రఖని. నటులు నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్ మాట్లాడారు. -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.44 వరకు, తదుపరి విదియ తె.4.22 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: ఆరుద్ర రా.7.30 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.57 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు,అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.వృషభం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం.... నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు, సోదరుల నుంచి కీలక సమాచారం. భూవివాదాల పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కర్కాటకం.... రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.సింహం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.కన్య.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.తుల... మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మీదపడతాయి.వృశ్చికం.... పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు...... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పూర్వవైభవం.మకరం.....శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కుంభం...పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం. -
బై బై చికాగో
హీరో, హీరోయిన్లు షూటింగ్స్తో ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఓ వైపు షూటింగ్స్, మరోవైపు ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంటుంటారు. షూటింగ్స్కి ఏ మాత్రం విరామం దొరికినా చాలు సేద తీరేందుకు విదేశాల్లో వాలిపోతుంటారు. కుటుంబ సభ్యులతోనో, స్నేహితులనో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు.తమ అనుభూతులను, మధురమైన జ్ఞాపకాలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా తాజాగా చికాగో వెకేషన్ని పూర్తి చేశారు. వరుణ్ ధావన్ హీరోగా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా డేవిడ్ ధావన్ తెరకెక్కించిన చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’. ఈ నెల 5న ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొన్నారు మృణాళ్.ఈ మూవీ రిలీజ్ తర్వాత వెకేషన్ కోసం చికాగో వెళ్లారామె. అక్కడ తనదైన శైలిలో సందడి చేసిన ఈ బ్యూటీ తిరిగి ఇండియాకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ‘‘బ్యాగులు మొత్తం సర్దేశాను.. చికాగో సిటీని వదిలే సమయం వచ్చింది. నిజం చెప్పా లంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది’’ అంటూ ఓ ఎమోషనల్ ఎమోజీతో పాటు తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. -
గొల్ల నాకొ.. మిమ్మల్ని చంపితే ఎవరొస్తారు?
ఒంగోలు వన్టౌన్: ‘‘గొల్ల నాకొ..ల్లారా మిమ్మల్ని చంపితే ఎవరొస్తారురా’’ అని దూషిస్తూ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు యాదవులను టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గడ్డపారతో హత్యాయత్నం చేయడంపై సోమవారం బీసీలు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీలు, యాదవులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ మధుబాబు అనే వ్యక్తి గొర్రెలు కాసుకోవడానికి ఈదుమూడి గ్రామం మీదుగా వెళుతుంటే అధికార పార్టీ సామాజికవర్గం వారు దాడి చేశారని పేర్కొన్నారు.అనిల్ అనే యువకుడిపైనా అదే రోజు దాడి చేశారన్నారు. అనంతరం వీరిని గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారన్నారు. బాధితులు సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేస్తే.. చిన్న కేసు పెట్టిన పోలీసులు, నిందితులు ఫిర్యాదు చేస్తే బాధితులపై ఎదురు కేసు నమోదు చేశారని, సీఐ నిందితులకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.ఈదుమూడి గ్రామాన్ని సీఎం చంద్రబాబు పీ–4 గ్రామంగా స్వయంగా దత్తత తీసుకున్నారని, ఇదే గ్రామంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు యాదవులు, బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈదుమూడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. అసలేం జరిగిందంటే.. బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలేనికి చెందిన గొర్రెల కాపరులు ఎల్లావుల అనిల్, వడ్లమూడి మధు వేసవిలో గొర్రెల మేత కోసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి తమ మందతోపాటు వెళ్లి ఇక్కడే ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. ఈ నెల 7న ఆదివారం గొర్రెలు బీడు భూముల్లో తిరుగుతుండగా ఆ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకులు ‘‘ఎవడ్రా నా కొ... మా ఊరిలో.. మా పొలాల్లో గొర్రెలు మేపడానికి’’ అంటూ కులం పేరుతో దూషిస్తూ వారిపై దాడి చేశారు.అదేరోజు సాయంత్రం గొర్రెలను తోలుకుని వెళ్తున్న బాధితులను అధికార పార్టీకి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, సుబ్రమణ్యం, కావూరి నాగార్జున, రంగారావు, వెంకట్రావు, ప్రసాద్ టీడీపీ కార్యాలయంలోకి ఈడ్చుకెళ్లి వెళ్లి కర్రలు, గడ్డపార, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ‘‘మేం అధికారంలో ఉన్నాం.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే చంపేస్తాం గొల్ల నా కొ...’’ అంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘సర్’లో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో టీడీపీ సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సోమవారం సచివాలయంలో కలిశారు. ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓటర్ల కులం, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను అధికార టీడీపీ సేకరించడంపై ఫిర్యాదు చేశారు.అనంతరం వారంతా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సచివాలయం ఐదో బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగా, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా మరో బ్లాక్ ఎదుట మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకోవడం, సచివాలయ ఆవరణలో మాట్లాడకుండా నిరోధించటాన్ని వైఎస్సార్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపించారు. సచివాలయం బయట మాట్లాడాలని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత ప్రతిపక్షంగా తాము ఏం చెప్పామో వివరాలు వెల్లడించకూడదా? అంటూ నిలదీశారు. తాము ఎమ్మెల్సీలమని, సచివాలయంలో ఎమ్మెల్సీలను మీడియాతో మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సచివాలయం ఐదో బ్లాక్ ముందు మెట్లపై బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. మైక్లు లేకుండానే వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ‘సర్’ తొలిరోజే డేటా చోరీ..⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా ⇒ ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వ్యక్తిగత వివరాల సేకరణ ⇒ సీఈవోను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేశాంరాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెర తీసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. సహచర ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తితో కలిసి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి వివేక్యాదవ్ని కలిసి సర్ ప్రక్రియ సందర్భంగా టీడీపీ చేస్తున్న అక్రమాలు, ఓటర్ల డేటా గోప్యతలో లోపాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యాప్ ద్వారా సేకరిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ఒక్కో ఓటరును మీరు ఏ రాజకీయ పార్టీ? ఏ కులం? అని అడుగుతూ ఓటర్ల వివరాలను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం సేకరించి ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు ప్రయతి్నస్తున్నారు.ఎన్నికల కమిషన్, అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితాలు టీడీపీకి చెందిన బీఎల్ఏల చేతుల్లో కనిపిస్తున్నాయి. మాకు కూడా అలాంటి జాబితాలు ఇవ్వాలని అడిగాం. యాప్ లను అనుమతించే అవకాశం ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యాప్లను వినియోగించుకుంటుందని చెప్పాం. మ్యాపింగ్ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి.కానీ చాలాచోట్ల బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను నమోదు చేశారు? ఎన్ని ఓట్లు మ్యాప్ చేశారు? ఎన్ని కాలేదు? అనే వివరాలు ఆన్లైన్లో పెట్టాలని సీఈవోను కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు’ అని అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదా..? రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తరహాలో కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నేతలు దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా? నియంత రాజ్యంలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అధికారులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ఎవరినీ అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎన్ని నిర్భంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం’ అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
చందా కోత.. వాటా ఎగవేత!
భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 73 మంది పనిచేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, ఎల్రక్టీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సబ్ స్టాఫ్ కేటగిరీలో 2023 ఆగస్టు నుంచి పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో చేర్చారు. ఆ తర్వాత మరో ఏజెన్సీని ఎంపిక చేశారు. ప్రస్తుత ఏజెన్సీ కూడా ఈ రెండు కేటగిరీల్లోని బకాయిలు, చందా చెల్లింపును నిలిపివేసింది. దీంతో వారి ఈఎస్ఐ, పీఎఫ్ పరిస్థితి గందరగోళంగా మారింది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి సంకటంలో పడింది. ఉద్యోగుల వేతనం నుంచి నెలవారీగా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కల్పించే పీఎఫ్ ఖాతా లెక్కలు గాడి తప్పుతున్నాయి. పీఎఫ్ చందా చెల్లించడంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్య వైఖరి, తీవ్రమైన జాప్యం, పర్యవేక్షించాల్సిన అధికారుల ఉదాసీనత.. వెరసి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల ఆసరాగా నిలిచే పీఎఫ్ పరిస్థితి ఆగమాగంగా మారింది.ఉద్యోగుల వాటా కింద క్రమం తప్పకుండా నగదు మినహాయించుకుంటున్న ఏజెన్సీలు ఈ మొత్తానికి సమానంగా తమ వాటా కలిపి ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి ఎగనామం పెడుతున్నాయి. ఈపీఎఫ్ ఖాతా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగులు.. ఈపీఎఫ్ వడ్డీ, సర్వీసు ఆధారిత పెన్షన్కు అర్హత, బీమా వంటి కీలక ప్రయోజనాలకు దూరం అవుతున్నారు. ఏజెన్సీల ఇష్టారాజ్యంరాష్ట్ర ప్రభుత్వంలోని 31 విభాగాల్లో 4,93,820 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటోంది. అయితే ఉద్యోగులకు వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు కాకుండా ఏజెన్సీకి చెల్లించడం.. ఏజెన్సీ తిరిగి ఉద్యోగుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతోంది. ఈ మధ్యవర్తిత్వ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పాటు వారికి నెలవారీగా చెల్లించాల్సిన పీఎఫ్ అలాగే ఈఎస్ఐ పథకాల చందాను కూడా సకాలంలో చెల్లించడం లేదు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఏజెన్సీలు ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత నష్టమో..! ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో నెలవారీగా చందా తప్పనిసరిగా జమ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీపై ఉంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మందికి నెలవారీగా చెల్లింపులు జరగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల ఏటా ఈపీఎఫ్ఓ మంజూరు చేసే వడ్డీ జమ కావడంలో అవరోధాలు ఏర్పడతాయి. ⇒ పీఎఫ్ ఖాతాలో నగదు జమకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ క్రమం తప్పుతుండడంతో వాస్తవ వడ్డీ అందే పరిస్థితి ఉండదు. ⇒ జాతీయ బ్యాంకులు, ఇతర ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ ఇస్తున్న సంస్థ ఈపీఎఫ్ఓ. దీంతో ఉద్యోగికి ఆర్థికంగా నష్టం తీవ్రంగానే ఉంటుంది. ⇒ ఈపీఎఫ్ఓ అమలు చేసే మరో పథకం పెన్షన్. సర్వీసు పూర్తయిన తర్వాత ఈ పథకం అమలు కానున్నప్పటికీ... నెలవారీ చందా ఆధారంగానే సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. చందా చెల్లింపు క్రమం తప్పకుండా జర గకపోతే సర్వీసు పరిగణనలో ఇబ్బందులెదురవుతాయి. ⇒ సర్వీసులో ఉన్న ఈపీఎఫ్ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి రూ.7.5 లక్షల గరిష్ట బీమా నగదు అందుతుంది. కానీ చందా చెల్లించకపోవడం, చెల్లింపుల్లో జాప్యం నెలకొంటుండడంతో బీమా పథకానికి అర్హత ప్రశ్నార్థకంగా మారుతుంది. ⇒ ఈఎస్ఐ పరిధిలోని ఉద్యోగికి కేంద్ర కారి్మక శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తారు. ఈఎస్ఐ ద్వారా అమలయ్యే ఈ పథకానికి ప్రతి నెలా క్రమం తప్పకుండా చందా జమ చేస్తేనే అర్హత సాధిస్తారు. ఎలాంటి జాప్యం నెలకొన్నా అర్హత కోల్పోతారు. అధికారుల నిర్లక్ష్యమే శాపం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వేతన నిధులు సదరు శాఖాధిపతుల ద్వారా ఏజెన్సీకి విడుదల అవుతున్నప్పటికీ..అవి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన విధంగా అందుతున్నాయో? లేదో? అనే పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదు. కేవలం నిధుల విడుదలకే పరిమితమవుతున్న అధికారులు.. ఆ తర్వాత ఏజెన్సీ ద్వారా జరగాల్సిన ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఉద్యోగులు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే తప్ప అడుగు ముందుకు పడటం లేదు.ఏజెన్సీల ఎంపిక జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో శాఖాధిపతికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉండడంతో ఫిర్యాదుల పరిష్కరానికి సుదీర్ఘ సమయం పడుతోంది. ఇక ఈపీఎఫ్ పథకం అమలుకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ఈపీఎఫ్ఓలో ఫిర్యాదు చేయాలి. కానీ ఉద్యోగులకు దీనిపై సరైన అవగాహన ఉండటం లేదు. లిఖితపూర్వక ఫిర్యాదులపై తప్పకుండా స్పందిస్తామని ప్రావిడెంట్ ఫండ్ అధికారులు చెబుతున్నారు.⇒ ఎం.లలిత 2022 సంవత్సరం నుంచి నాగర్కర్నూల్ జిల్లా డిగ్రీ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆమె నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసేవారు. దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా ఆమె ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో పైసా నిధి జమ కాలేదు. బదిలీ క్రమంలో ఆమె సర్వీసు ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో పీఎఫ్ బకాయిలు ఎవరు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లలిత ఎన్నోసార్లు ఏజెన్సీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పీఎఫ్ చెల్లించకపోవడంతో తన నాలుగేళ్ల సర్వీసు కోల్పోతాననే ఆందోళనకు గురవుతున్నారు.⇒ కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండేళ్ల పాటు వార్డు బాయ్గా పనిచేసిన కోలా అనుదీప్ అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు. అతని ఈపీఎఫ్తో పాటు ఈఎస్ఐ చందా ఏజెన్సీ చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్కు అర్హత లేకుండా పోయింది. దీంతో అతని కుటుంబం పెన్షన్ పథకానికి దూరమైంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏజెన్సీల దోపిడీపై ప్రత్యేక విచారణ చేయించాలిరాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపుల్లో చాలా సమస్యలున్నాయి. నెలవారీగా చేయాల్సిన చెల్లింపులు ఆర్నెల్ల కంటే ఎక్కువ జాప్యంతో జరుగుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ... ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం ఇష్టానుసారంగా చెల్లింపులు చేస్తున్నాయి. పీఎఫ్ చెల్లింపుల్లో జాప్యం వల్ల ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రయోజనాలు అందవు. ఈఎస్ఐ చెల్లింపులు ఆపితే ఉద్యోగికి వైద్య సదుపాయాలు నిలిచిపోతాయి. ఇది ఉద్యోగికి చాలా నష్టం కలిగిస్తుంది. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ చేపట్టాలి. ఏజెన్సీల అక్రమాలను వెలికితీయాలి. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
చారిత్రక ప్రాంతాల్లో యోగా డే
న్యూఢిల్లీ: హరిద్వార్లోని గంగానది తీరం నుంచి హంపి శిథిలాలు, ఢిల్లీలోని ఎర్రకోట వరకు.. దేశవ్యాప్తంగా గల 12 చారిత్రాత్మక వేదికలు ఈ ఏడాది ’అంతర్జాతీయ యోగా దినోత్సవం’ వేడుకలకు వేదికలు కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 21న కోల్కతాలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. అదేసమయంలో, 12 ప్రాంతాలలో జాతీయ స్థాయి యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా విశిష్టతను చాటేందుకు కేంద్ర ఆయుష్ శాఖ యోగా డే నిర్వహణను ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ చారిత్రక కట్టడాల తరహాలోనే, యోగా కూడా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తూ ఎన్నో తరాలుగా సమాజానికి తోడ్పడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎంపిక చేసిన 12 ప్రాంతాలివే.. ఢిల్లీలోని ఎర్రకోట, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ హర్ కీ పౌరీ, ఒడిశాలో కోణార్క్ సూర్య దేవాలయం, కర్ణాటకలో హంపి కట్టడాలు, లద్దాఖ్లో లేహ్ ప్యాలెస్, తమిళనాడులో మహాబలిపురం తీర ఆలయం, ఉత్తరప్రదేశ్లో సార్నాథ్, అసోంలో కంచరి కోట, హైదరాబాద్లో చార్మినార్, ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా, బిహార్లో నలంద మహావిహార, అహ్మదాబాద్లో సబర్మతీ తీరం. ప్రతీ ప్రాంతం దేశ సాంస్కృతిక ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి చెప్పారు. సార్నాథ్, నలంద దేశ జ్ఞాన సముపార్జన, ధ్యాన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేవి కాగా, కోణార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం తీర దేవాలయం కళాత్మకత, అద్భుత నిర్మాణ కౌశలానికి శాశ్వత చిహ్నాలుగా నిలిచాయన్నారు. హరిద్వార్లోని హర్ కీ పౌరీ, అహ్మదాబాద్లోని సబర్మతి ఆధ్యాత్మికతకు ప్రతీకలు కాగా, ఎర్రకోట, చార్మినార్, గేట్వే ఆఫ్ ఇండియా, లేహ్ ప్యాలెస్లు దేశ చారిత్రక ప్రస్థానంలో కీలకమైన మైలురాళ్లను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. సరిహద్దులతో ప్రమేయం లేకుండా అందరినీ ఏకం చేయగల ప్రత్యేక సామర్థ్యం యోగాకు ఉందని చెప్పడమే కార్యక్రమ లక్ష్యమని మంత్రి చెప్పారు. లద్వాఖ్లోని హిమాలయ పర్వత సానువులు, హరిద్వార్లోని గంగానతీ తీరం, హంపి శిథిలాలు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాలు..ఇలా ఏప్రాంతమైనా తరాలను దాటి ప్రజలను అనుసంధానించే ఒక ఏకీకృత శక్తిగా యోగా నిలుస్తుందని జాదవ్ అన్నారు. భౌగోళికంగా, భాషాపరంగా వేరైనప్పటికీ ఈ చారిత్రక ప్రదేశాలన్నీ యోగా ద్వారా ఆరోగ్యం, సామరస్యం అనే ఒకే లక్ష్యంతో ఏకం కానున్నాయని ఆయన వివరించారు. -
రిజిస్ట్రేషన్లు యథాతథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎప్ప టిలాగానే జరుగుతున్నాయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. వాస్తవంగా కూడా భూ ముల విలువల సవరణకు ముందు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే పెద్దగా మార్పు ఏమీ లేదని అర్థమవుతోంది. సవరణకు ముందు రోజుకు సగటున ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగేవో, సవరణ తర్వాత కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భూముల విలువలు సవరించిన తర్వాతి పరిస్థితులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. విలువల సవరణ జరిగి పదిరోజులు పూర్తవుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఆరా తీసింది.ఈ మేరకు నాలుగైదు రోజుల క్రితమే జిల్లా రిజిస్ట్రార్లకు సచివాలయం నుంచి సమాచారం వెళ్లింది. విలువల సవరణ అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్న దానిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా వివరాలు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. ఈ నేపథ్యంలో విలువల సవరణ అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్య కలాపాలు గాడిలో పడ్డాయని, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించామని అధికారులు తెలిపారు. తగ్గేదే లేదు..!స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం జూన్ నెలలో ఇప్పటివరకు 50 వేల లావాదేవీలు జరిగాయి. అయితే ఇందులో దాదాపు 24 వేల వరకు తొలి 4 రోజుల్లోనే జరిగాయి. భూముల విలువలు పెరుగుతాయన్న కారణంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపడంతో ఆ నాలుగు రోజులు భారీగా లావాదేవీలు జరిగాయి. భూముల విలువలు సవరించిన 10 రోజుల కాలంలో మరో 26 వేల లావాదేవీలు జరగడం గమనార్హం. సెలవు రోజులను మినహాయిస్తే రోజుకు సగటున 2,700 వరకు లావాదేవీలు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ సంఖ్య గతంలో ప్రతిరోజూ జరిగే సగటు లావాదేవీలతో సమానంగా ఉందని, ఈ నేపథ్యంలో కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో పెద్దగా మార్పులేదని అర్థమవుతోంది. వ్యవసాయ భూముల విషయానికి వస్తే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 18 వేల లావాదేవీలు జరిగాయి. అయితే మే నెలలో తొలి పదిరోజుల్లో కేవలం 13,500 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
కల నిజమాయెగా..!
నోయిడా/లక్నో: మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి తమ భూములిచ్చిన జెవార్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులతో కూడిన మొట్టమొదటి విమానం లక్నోకు బయలుదేరింది. ఈ బృందంలో 28 మంది మహిళలతోపాటు 170 మంది గ్రామస్తులున్నారు. వీరందరినీ యూపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ వెంటబెట్టుకెళ్లారు. లక్నోలోని తన నివాసం వద్ద వీరందరికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. వీరంతా గౌతమబుద్ధ నగర్లోని జెవార్ ప్రాంతానికి చెందిన వారు. వీరిలో 99 శాతం మంది రైతులు గతంలో ఎన్నడూ విమానంలో ప్రయాణం చేయని వారే. ఈ సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. విమానంలో ప్రయాణించాలన్న తమ చిరకాల కోరిక సాకారమైందన్నారు. ‘ఈ అరుదైన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ సంతోషాన్ని మాటల్లో వరి్ణంచలేం. మా భూముల్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో ఎందరికో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించడం చూసి సంతోషంగా ఉంది’అని వారు సీఎం యోగికి చెప్పారు. తమ భూములకు తగిన పరిహారం అందించేలా చేయడంతోపాటు, తమకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం యోగికి వారు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, లక్నోకు మొదటిసారిగా బయలుదేరిన ఇండిగో విమానంలో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ‘తమ కష్టార్జితంతో ఈ భూమిని సాగు చేసి, అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతులు.. ఈ రోజు అదే స్థలం నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇది పరస్పర నమ్మకం, భాగస్వామ్యం, ప్రగతికి ఒక నిదర్శనం’అని ఎమ్మెల్యే సింగ్ ప్రకటించారు. ఒక్కటే రన్ వే లక్నోలో రైతులతో ఏర్పాటైన సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, సీఎం సలహాదారు అవనీశ్ కుమార్ అవస్థి, మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, అదనపు ప్రధానకార్యదర్శి(పౌర విమానయాన) దీపక్ కుమార్, యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో రాకేశ్ సింగ్, ఇండిగో, నోయిడా విమానాశ్రయం ప్రతినిధులు పాల్గొన్నారు. 2021 నవంబర్ 25వ తేదీన ప్రధాని మోదీ ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రారంభించారు. ప్రస్తుతానికి ఒకటే రన్వే ద్వారా ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో ఐదు రన్వేలతో 22.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలయ్యేలా విస్తరించనున్నారు. -
‘టిమ్స్’కు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేదలకు చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను సాధారణ మల్టీ స్పెషాలిటీ కేంద్రాలుగా కాకుండా, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హబ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో టిమ్స్కు ఒక ప్రధాన స్పెషాలిటీని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి అనుబంధంగా మరో కీలక విభాగాన్ని జోడించి మొత్తం ఆరు సూపర్ స్పెషాలిటీ సేవలను ఒక సమగ్ర వైద్య వ్యవస్థగా అందుబాటులోకి తేనుంది.నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి (అటానమస్) కలిగిన సంస్థలుగా ఈ టిమ్స్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతూ, అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.మల్టీ–ఆర్గాన్ వ్యాధులపై ప్రత్యేక దృష్టిమారుతున్న జీవనశైలి, పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకొని, ఒకే అవయవానికి పరిమితమైన వైద్య సేవల కంటే పరస్పరం సంబంధం ఉన్న అవయవాల చికిత్సలను ఒకేచోట అందించాలనే ఆలోచనతో ఈ ప్రణాళిక రూపొందుతోంది. గుండె, కిడ్నీ, మెదడు, మానసిక ఆరోగ్యం, జీర్ణకోశం, మూత్రపిండాల వ్యాధుల మధ్య ఉన్న అనుసంధానాన్ని పరిగణనలోకి తీసుకొని కొత్త స్పెషాలిటీ కాంబినేషన్లను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది.సనత్నగర్ టిమ్స్కు కార్డియో–రీనల్ సెంటర్సనత్నగర్ టిమ్స్ను కార్డియాలజీతోపాటు నెఫ్రాలజీకి ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. గుండె జబ్బులతో బాధపడే అనేక మందిలో కిడ్నీ సమస్యలు కూడా ఉండటంతో ఈ రెండు విభాగాల సేవలు ఒకేచోట అందితే రోగులు వేర్వేరు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అత్యాధునిక కార్డియాక్, డయాలసిస్ సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్ టిమ్స్లో న్యూరో–మెంటల్ కేర్అల్వాల్ టిమ్స్ను న్యూరాలజీతోపాటు సైకియాట్రీ లేదా జెరియాట్రిక్స్ సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడే రోగులకు మానసిక, పునరావాస సేవలు కూడా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో సమగ్ర న్యూరో కేర్ అందించేలా ప్రణాళిక రూపొందుతోంది.కొత్తపేట టిమ్స్లో గ్యాస్ట్రో–యూరో కాంబినేషన్కొత్తపేట టిమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీతోపాటు యూరాలజీ సేవలను అందుబాటులోకి తేనున్నారు. జీర్ణకోశ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్, మూత్రనాళ సమస్యలకు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు ఒకే కేంద్రంలో లభించనున్నాయి.గాంధీ, ఉస్మానియా, నిమ్స్పై తగ్గనున్న ఒత్తిడిఈ మూడు టిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్లపై ఉన్న రోగుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జిల్లాల నుంచి వచ్చే రిఫరల్ కేసులను ఆయా వ్యాధుల స్పెషాలిటీని బట్టి నేరుగా టిమ్స్లకు తరలించే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రోగులకు వేగంగా చికిత్స అందడంతోపాటు పెద్ద ఆస్పత్రుల్లో రద్దీ కూడా తగ్గనుంది.మెడికల్ టూరిజంపై సర్కారు ఫోకస్హైదరాబాద్ను అంతర్జాతీయ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మెడికల్ టూరిజంపైనా దృష్టి సారించింది. మూడు టిమ్స్లలో విదేశీ రోగుల కోసం ఒక్కో ఆస్పత్రిలో 50 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆధునిక మౌలిక వసతులతో విదేశీ రోగులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్గా నిలబెట్టే వ్యూహానికి ప్రభుత్వం పదును పెడుతోంది. -
‘సివిల్’కు మళ్లీ స్వర్ణయుగం..!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా దూసుకొచ్చిన కృత్రిమ మేధ(ఏఐ) ఇంజినీరింగ్ కోర్సుల ఎంపికపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికలు మారుతున్నాయి. ప్రస్తుతం తొలి ప్రాధాన్య ఎంపికగా కంప్యూటర్ సైన్సే కొనసాగుతోంది. అయితే, సివిల్ ఇంజినీరింగ్ పట్ల విద్యార్థులు మొగ్గుచూపడం తాజా ట్రెండ్. 2026 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో ప్రాధాన్యతలను బట్టి చూస్తే ఈ కోర్సుకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, నిర్మాణ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఐటీ ఉద్యోగాలపై ఏర్పడిన అనిశ్చితి వంటివి కూడా సివిల్ ఇంజినీరింగ్ వైపు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. మారుతున్న ప్రాధామ్యాలు.. గత దశాబ్దకాలంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అత్యధిక డిమాండ్ ఉంది. ఇటీవల ఏఐ ఆధారిత సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందడంతో సంప్రదాయ సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో దీర్ఘకాలిక స్థిరత్వం కలిగిన రంగాలపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో రహదారులు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. దీంతో సివిల్ ఇంజినీర్లకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయన్నది విద్యార్థుల తాజాగా అంచనా వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇదే సివిల్ ఇంజినీరింగ్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తోందని విద్యా రంగ వర్గాలు చెబుతున్నాయి. సివిల్ ఇంజినీరింగ్పై విద్యార్థుల ఆసక్తి ఎంతగా పెరిగిందో ఐఐటీల ప్రారంభ ర్యాంకులే చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి టాప్ ర్యాంకర్లు కూడా సివిల్ను ఎంపిక చేసుకోవడం విశేషం. గత ఏడాది ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్ ఎంపికకు ప్రారంభ ర్యాంకు 2,666 కాగా, ఈ ఏడాది ప్రారంభ ర్యాంకు 385గా ఉంది. ఇక ఐఐటీ ఢిల్లీలోనూ గత ఏడాది సివిల్ ఇంజినీరింగ్ ప్రారంభ ర్యాంకు 3,030గా ఉండగా, ఈ ఏడాది అది 179కి మారింది. ఈ గణాంకాలు సివిల్ ఇంజినీరింగ్ను గతంతో పోలిస్తే మరింత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంచుకుంటున్నారని సూచిస్తున్నాయి. భారీ అవకాశాల గని.. దేశంలో ప్రస్తుతం లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలవుతున్నాయి. భారతమాల, సాగర్మాల, హైస్పీడ్ రైలు మార్గాలు, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ పార్కులు వంటి ప్రాజెక్టులు సివిల్ ఇంజినీర్లకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిర్మాణ నిపుణుల అవసరం పెరుగుతుండటం కూడా విద్యార్థులను ఈ కోర్సు వైపు ఆకర్షిస్తోంది. గత పదేళ్లుగా కంప్యూటర్ సైన్స్, ఐటీ శాఖలు విద్యార్థుల మొదటి ఎంపికగా కొనసాగాయి. అధిక వేతనాలు, విదేశీ అవకాశాలు, స్టార్టప్ సంస్కృతి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉండేవి. అయితే ఇటీవల జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందడంతో సంప్రదాయ కోడింగ్ ఉద్యోగాలపై చర్చ మొదలైంది. కొన్ని సంస్థలు తక్కువ స్థాయి ప్రోగ్రామింగ్ పనులను ఏఐతో నిర్వహించే దిశగా అడుగులు వేస్తుండటంతో విద్యార్థులు దీర్ఘకాలిక స్థిరత్వం ఉన్న రంగాలపై దృష్టి పెడుతున్న ధోరణి కనబడుతోంది.ఇప్పటికీ తగ్గని క్రేజ్.. మరో వైపు, కంప్యూటర్ సైన్స్పై విద్యార్థుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త విభాగాల కారణంగా ఈ రంగం మరింతగా విస్తరిస్తోంది. ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్ వంటి అగ్రశ్రేణి ఐఐటీల్లో టాప్–100, టాప్–200 ర్యాంకర్లలో అత్యధికశాతం మంది ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్నే ఎంచుకుంటున్నారని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమల అంచనాల ప్రకారం 2026 నాటికి దేశంలో సుమారు 10 లక్షల ఏఐ నిపుణుల అవసరం ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఆరోగ్యం, తయారీ, ఈ–కామర్స్, రక్షణ, విద్య తదితర రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులకు అవకాశాలు కొనసాగనున్నాయి. -
ఎస్ఐఆర్... ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
హిమాయత్నగర్ (హైదరాబాద్): ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రభు త్వం ఓటర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ నైతికతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశా రు.బలహీన వర్గాల ఓటు హక్కుకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన, శాస్త్రీయత లేని ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు వల్ల తన విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. సోమవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోవాలి: కూనంనేని ఎస్ఐఆర్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కూనంనేని ఆరోపించారు. ఓట్ల తొలగింపే ప్రధాన ఎజెండాగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని, దీనికి సూత్రధారులు ఢిల్లీలోని కేంద్ర పాలకులేనని విమర్శించారు. తెలంగాణలో 80 లక్షల వరకు దొంగ ఓట్లు గుర్తించామని చెబుతున్నారని, ఆ పేరుతో చెల్లుబాటయ్యే ఓట్లను కూడా తొలగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని చెప్పారు. ఎన్నికల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఓటర్ల పేర్లను తొలగించే ముందు సహజ న్యాయ సూత్రాలను పాటించాలని, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు అ«దీనంలోకి తెచ్చుకునేందుకే... భావప్రకటన స్వేచ్ఛను వినియోగించి ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. ప్రశ్నించే వారిని కేసులతో భయపెట్టే ధోరణి పెరుగుతోందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ నామినేషన్ను కేసులు లేకున్నా తిరస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర పాలకులు తాము చేసేదే శాసనమనే భావనలో ఉన్నారని ధ్వజమెత్తారు.రాజ్యాంగ వ్యవస్థలను తమ అ«దీనంలోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఎస్ఐఆర్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలని, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంస్కరణలు అమలు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ సిగ్నల్?
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న విడుదల కానుంది. దీంతో తన తర్వాతి సినిమా కోసం వరుసగా కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ.ఇప్పటికే దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదట. కాగా తమిళ దర్శకుడు హరి ఓ యాక్షన్ కథను సిద్ధం చేశారని, ఈ స్క్రిప్ట్కి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయన భావించారట. ప్రస్తుతం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా.తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలతో దర్శకుడు హరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మరి.. హరి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
వేగం లేని వాహన్ం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రవాణా శాఖ సేవలకు ఆన్లైన్లో దాదాపు 28 వేల స్లాట్స్ బుక్ కాగా,సర్వర్ డౌన్ కావడంతో అధికారులు చేతులెత్తేశారు. సోమవారం నాటి స్లాట్స్ను మంగళవారానికి మార్చామని చెప్పడంతో వేల మంది ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఇది ఏ ఒక్కరోజో జరుగుతున్న తతంగం కాదు.. ఇటీవల కాలంలో తరచూ సర్వర్ మొరాయిస్తుండటంతో రవాణాశాఖలో వాహనదారుల లావాదేవీలకు పదేపదే తీవ్ర అంతరాయం కలుగుతోంది. కానీ ఈ సాంకేతిక సమస్యను సరిచేయడం రాష్ట్రపరిధిలో లేదు. సామర్థ్యాన్ని మించి భారం... ఇటీవలి వరకు తెలంగాణ రవాణా శాఖ ఆన్లైన్ సేవలు పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. కానీ తాజాగా కేంద్ర రవాణాశాఖ అధీనంలోని వాహన్–సారథి క్లౌడ్ డేటాబేస్ అధీనంలోకి రాష్ట్రం వెళ్లింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ‘వాహన్–సారథి’కేంద్రీకృత క్లౌడ్ సాఫ్ట్వేర్ (వెర్షన్ 4.0)ను ప్రారంభించింది. ఇందులో తెలంగాణ ఆరు నెలల క్రితమే చేరింది. ఇప్పుడు రవాణాశాఖ సేవలన్నీ ఈ వాహన్–సారథి క్లౌడ్ పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయి.సాధారణంగా రోజుకు సగటున రెండున్నర కోట్ల లావాదేవీలను తట్టుకునే ప్రాథమిక సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేశారు. కానీ అన్ని రాష్ట్రాలు దీనిలోనే అనుసంధానమై ఉండటంతో పీక్ అవర్స్లో సర్వర్పై లోడ్ దాని సాధారణ పరిమితి కంటే 4 రెట్లు పెరుగుతోంది. సెకనులో లక్షల మంది యూజర్లు ఆధార్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ అప్ లోడ్, ఫీజుల చెల్లింపు తదితర లావాదేవీలు చేస్తుండటంతో సర్వర్లలోని డేటాబేస్ క్వెరీలు లాక్ అయిపోయి వెబ్సైట్ పూర్తిగా స్తంభించిపోతోంది.ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో 100కుపైగా రవాణా శాఖ సేవలు అందించలేని పరిస్థితి నెలకొంటోంది. భారీ ట్రాఫిక్ను తట్టుకునేలా ఏపీఐ ఇంటిగ్రేషన్ ఉన్నా, కొన్ని భద్రతా లేయర్లు, పేమెంట్ గేట్ వేలు స్లోగా ఉండటం వల్ల సర్వర్ రెస్పాన్స్ టైమ్ పెరిగిపోతోంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ క్లౌడ్ డేటాబేస్ను పర్యవేక్షిస్తుండటం వల్ల తెలంగాణలో సమస్య తలెత్తినా దాన్ని ఎన్ఐసీ సరిదిద్దాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు... ఇటీవల నిపుణుల కమిటీతో సమీక్షలు జరిపి చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న ఒకే నేషనల్ క్లౌడ్పై భారం తగ్గించడానికి, అదనపు లార్జ్స్కేల్ క్లౌడ్ సర్వర్లలోకి డేటాను విభజించే ప్రక్రియను ప్రారంభించింది. దేశాన్ని నాలుగు జోన్లుగా విభజించి ప్రాంతీయంగా లోడ్ బ్యాలెన్సర్ సర్వర్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దక్షిణాదిలో ట్రాఫిక్ ఒత్తిడి ఢిల్లీ ప్రధాన సర్వర్పై నేరుగా ప్రభావం చూపకుండా స్థానిక జోనల్ సర్వర్లే నియంత్రిస్తాయి.పీక్ అవర్స్లో యూజర్ల సంఖ్య పెరిగినప్పుడు దానంతట అదే సర్వర్ సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచుకునే ఆటో–స్కేలింగ్ ఫీచర్ను సాఫ్ట్వేర్లో అప్గ్రేడ్ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రివేళల్లో ప్రత్యేక షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తూ పాత డేటాను ఆరై్కవ్ చేస్తోంది. ఏకకాలంలో ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూఐడీఏఐ సర్వర్లతో బ్యాండ్విడ్త్ను పెంచుతోంది. -
HI నాన్న
ప్రతి స్టేజీ మీద అవార్డ్ అందుకునే చేతుల వెనుక, ఆ చేతుల్ని చిన్నప్పుడు స్కూల్ గేట్ దగ్గర వదిలిపెట్టి, వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న ఒక జత కళ్లు ఉంటాయి. ఆ కళ్ల పేరే నాన్న. ఆటగాడు స్టేడియంలో సిక్స్ కొడితే కెమెరా అతడి మొహం చూపిస్తుంది. కానీ గ్యాలరీలో సీట్ దొరక్క నిలబడి, ‘వాడు మా అబ్బాయిరా’ అని పక్కవాడి భుజం తడుతూ గర్వంగా చెప్పే మనిషిని చూపించదు. ఆ మనిషి నాన్న.అమ్మాయి ఐ.ఏ.ఎస్ అయ్యి వార్తల్లోకి వస్తే, ‘మా ఊరి అమ్మాయి’ అని ఊరంతా సంబరపడుతుంది. కానీ ఆ అమ్మాయిని రాత్రిళ్లు దీపం కింద కూర్చోబెట్టి, తోడుగా కునికిపాట్లు పడుతూ కూచున్న నీడని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ నీడ పేరు నాన్న.నాన్న ‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు.పిల్లల విజయం వెనుక అమ్మ ఉంటుంది నిజమే. కానీ ఆ అమ్మ చేతిలో గరిటె ఆగకుండా తిప్పడం వెనుక, ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ తొక్కుతూ డ్యూటీకి వెళ్లిన, ఫ్యాక్టరీలో ఓవర్టైం చేసిన, ఎండలో ఆటో నడిపిన ఒక మనిషి చెమట ఉంటుంది. ఆ మనిషి నాన్న.ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.రోజుకో నాన్నకి నమస్కరించుకుందాం.ఫోటోలో కనిపించని, ఫ్లెక్సీలో పేరు లేని, అవార్డ్ అందుకోని నాన్నలందరికీ... ఈ కాలమ్ అంకితం.నాణెం కాదు ప్రాణంగొంతెమ్మె కోరికలు కోరకు.. ఉన్నదాంట్లో సర్దుకో..అన్నమాటను చిన్నప్పుడు మనమంతా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. మరీ ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈమాట సర్వసాధారణం.. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా, కేసరపాత్ గ్రామంలో నివసించే బజరంగ్ రామ్ భగత్ది అలాంటి కుటుంబమే. అతను గుడ్లు, శెనగలు అమ్ముతూ వ్యవసాయం చేసుకునే ఒక సన్నకారు రైతు. అతని కుమార్తె చంపా భగత్ బీకామ్ చదువుతోంది. తనకేమో స్కూటీ నడపాలని, కాలేజ్కి వెళ్లాలని చాలా ఆశ. పదేపదే స్కూటీ కావాలని చంపా నాన్నని అడిగేది. కాని స్కూటీ ధర అక్షరాలా లక్ష. అంత డబ్బు భగత్ దగ్గర లేదు. అప్పు చేసే ధైర్యం లేదు. అలాగని కూతురు మనసుని నొప్పించాలనీ లేదు. అందుకే ప్రతిరోజూ వ్యాపారంలో మిగిలే పది, ఇరవై రూపాయల నాణేలను పోగు చేశాడు. అలా దాదాపు ఏడు నెలలు పోగు చేశాక కూతురుని వెంటబెట్టుకుని బైక్ షో రూమ్కి వెళ్లాడు. అక్కడ సంచుల నిండా ఉన్న నాణేలను తెరచి నేలమీద పోయడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు నాణేలను లెక్కపెట్టగా నలభైవేలకు తేలింది. ఆ మొత్తాన్ని అక్కడ డౌన్ పేమెంట్గా కట్టి కుమార్తెకు స్కూటీని కొనిచ్చాడు. స్కూటీ నడపాలన్న ఆశను కుటుంబ ఆర్థిక స్థోమత సవాల్ చేసినా, కూతురు మీదున్న ఆ తండ్రి ప్రేమ పేదరికాన్ని జయించి చూపింది.నాన్నేనెట్వర్క్పిల్లల కోసం తండ్రులు ఎంతటి త్యాగానికైనా... కష్టానికైనా వెనుతీయరనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణ కర్ణాటకలోని బల్లక్క గ్రామంలో నారాయణ అనే రైతు తన కూతురు చదువు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. గ్రామంలో నెట్వర్క్ లేకపోవడంతో నారాయణ కూతురు గ్రామం బయటకు వెళ్లి ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేది. నెట్వర్క్కి తోడుగా ఒకరోజు ఊరిలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు క్లాసులకు హాజరు కావడం మరింత జటిలంగా మారింది. అయినా సరే తన కూతురు క్లాసులకు మిస్ కాకూడదని నారాయణ కూడా వచ్చి ఇలా గొడుగుపట్టుకుని నిలబడ్డాడు. ఒకవైపు కూతురు తడవకుండా చూసుకుంటూ మరోవైపు తను తడుస్తూ నిలుచున్నాడు. ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన స్థానిక జర్నలిస్ట్ మహేష్ పుచ్చప్పాడి తన కెమెరాలో క్లిక్మనిపించి ట్విట్టర్లో పెట్టాడు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు నారాయణ తన కూతురు ఆన్లైన్ క్లాసుల కోసం ఇదే ప్రదేశానికి తీసుకువస్తున్నాడని, మారుమూల ప్రాంతంలో నెట్వర్క్ లేక ప్రజలు పడుతున్న అవస్థలకు ఇదొక ఉదాహరణ అంటూ పేర్కొన్నాడు.స్విగ్గీ డాడీకొన్ని నెలల కిందట వైరల్ అయిన ఫొటో ఇది. స్విగ్గీలో పని చేస్తున్న ఓ వ్యక్తి తనతో పాటు కూతుర్ని కూడా తీసుకెళ్లాడు. ఓ అపార్ట్మెంట్లో డెలివరీ ఇచ్చాక కాస్త సమయం దొరికింది. అపార్ట్మెంట్ మెట్లు దిగుతూ ఓ చోటు చూసుకుని కూర్చుని పుస్తకం తీసి తన కూతురికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చక్కటి దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే..కొన్ని గంటల్లోనూ వేలాది లైకులు, కామెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. కూతురు కోసం కష్టపడుతున్న తండ్రిని శభాష్ అని మెచ్చుకుంటూ రియల్ హీరో స్విగ్గీ డాడీ అంటూ పోస్ట్లు చేశారు. తండ్రి అన్నవాడు ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా అదంతా బిడ్డ కళ్లల్లో ఆనందం చూడ్డానికేనని, బిడ్డకి మంచి భవిష్యత్ ఇవ్వడానికేనని ఈ ఫొటో నిరూపించింది. నిర్వహణ : శ్రావణ్ జయ -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేరిట నామకరణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేసిన ఈ రోడ్డును ఈ నెల 23న సీఎం అధికారికంగా ప్రారంభిస్తారు. భారతదేశంలో అమెరికా రాయ బారి సెర్జియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ట్రంప్ పేరిట నా మకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థల సేవల ను గుర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తు న్నట్లు సమాచారం.తెలంగాణను ఆవిష్కరణల కు కేంద్రంగా, ప్రపంచ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా వ్యూహాత్మ క భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్పీఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు. -
ఇక్కడి నుంచే సొసైటీ ఈక్వాలిటీ!
స్కూల్ గ్రౌండ్లో క్రికెట్.. అబ్బాయిలు బ్యాట్ పట్టుకున్నారు. ఒక అమ్మాయి ‘నేను కూడా ఆడతా’ అంది. జవాబు ‘బాల్ అందించు చాలు’. క్లాస్ లీడర్ ఎలక్షన్.. ‘అబ్బాయిలు ఎవరైనా నిలబడండి’ అంది టీచర్. ‘మేడమ్ నేను’ అన్న అమ్మాయికి నవ్వులు. ఇది 2026. అమ్మాయిలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. కానీ కొందరి ఆలోచనలు పాతగానే ఉన్నాయి. బడిలోనే ‘తేడా’ మొదలైతే రేపు సమాజంలో అది ‘వివక్ష’ అవుతుంది. సమభావనే సిసలైన చదువు.కేస్ స్టడీ 1: కెప్టెన్ కావ్యకావ్యకి కబడ్డీ పిచ్చి. కానీ పీఈటీ సార్ ‘అమ్మాయిలు కబడ్డీ ఆడకూడదు, దెబ్బలు తగులుతాయి’ అని తేల్చేశాడు. కావ్య ఊరుకోలేదు. ప్రిన్సిపాల్కి లెటర్ రాసింది... ‘సార్, దెబ్బ తగిలితే డెటాల్ రాసుకుంటాను. కానీ ఆడకుండా ఆపితే అసలైన గాయం అవుతుంది’. ప్రిన్సిపాల్ దిగొచ్చాడు. స్కూల్లో మొదటిసారి ‘గర్ల్స్ కబడ్డీ టీం’ పుట్టింది. కావ్య కెప్టెన్ . ఆ టీం జిల్లా లెవెల్లో కప్ కొట్టింది. ఒక్క అమ్మాయి ‘ఎందుకు కాదు?’ అని అడిగితే, వందమంది అమ్మాయిలకు ‘ఆడొచ్చు’ అనే దారి దొరికింది.కేస్ స్టడీ 2: వంటగది వరుణ్వరుణ్ వాళ్లమ్మ జాబ్ చేస్తుంది. ఒకరోజు అమ్మకి జ్వరం. 9వ తరగతి వరుణ్ స్టవ్ వెలిగించి చపాతీ చేశాడు. స్కూల్కి క్యారేజ్లో అదే తెచ్చాడు. ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు... ‘ఏందిరా ఆడపిల్లలా వంట చేశావా?’. వరుణ్ తల దించుకోలేదు. ‘మా అమ్మ రోజూ నాకు అన్నం పెడుతున్నప్పుడు, నేను ఒక్కరోజు మా అమ్మకి ఎందుకు పెట్టకూడదు?’ అన్నాడు. క్లాస్ టీచర్ అది విని మరుసటి రోజు ‘లైఫ్ స్కిల్’ పీరియడ్ పెట్టింది. అబ్బాయిలతో ఉ΄్మా చేయించింది, అమ్మాయిలతో సైకిల్ టైర్కి పంక్చర్ వేయించింది. ఆ రోజు నుంచి ఆ క్లాస్లో ‘ఆడపని, మగపని’ అనే బోర్డ్ పీకేసి, ‘నా పని’ అనే బోర్డ్ పెట్టారు.పిల్లలకు పెద్ద మాటలు కూడా అర్థమవుతాయి. క్లాస్లో సబ్జెక్ట్ చెబుతూనే మధ్యలో ‘జెండర్ సెన్సిటివిటీ’ అంటే ఏంటి? అని అడగండి. వాళ్లు ‘అంటే ఏంటో చెప్పండి టీచర్’ అంటారు. అప్పుడు ఇలా చెప్పాలి:‘జెండర్ సెన్సిటివిటీ’ అంటే అబ్బాయిలూ అమ్మాయిలూ సమానమని గుండె లోతుల్లో నమ్మడం. అబ్బాయిలకు కొమ్ములు, అమ్మాయిలకు రెక్కలు విడిగా మొలవవని తెలుసుకోవడం. ఇద్దరికీ మెదడు ఒకటే, గుండె ఒకటే, కలలు కనే హక్కు ఒకటే అనే అవగాహన కలిగి ఉండటం. స్కూల్, ఇల్లు ఏం చేయాలి? EQUAL రూల్ పాటించాలి→E- EXAMPLESమార్చండిపుస్తకాల్లో ఇప్పటికీ ‘అమ్మ వంట చేస్తుంది, నాన్న ఆఫీస్కి వెళ్తాడు’ అని ఉంటుంది. దాన్ని చెరిపేయండి. ‘అమ్మ ఇస్రోలో సైంటిస్ట్... నాన్న పిల్లలకు క్యారేజ్ కడతాడు’ అని చెప్పండి. గోడ మీద ‘గుడ్ హ్యాబిట్స్’ చార్ట్లో అబ్బాయి మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టు, అమ్మాయి డ్రిల్ మెషీన్ పట్టుకున్నట్టు బొమ్మలు పెట్టండి. పిల్లలు చూసేదే నమ్ముతారు.Q- QUASTIONS అడగనివ్వండి‘మేడమ్, అబ్బాయిలు బ్రైట్ కలర్స్ వేసుకోకూడదా? అమ్మాయిలు షార్ట్ హెయిర్ ఉంచుకోకూడదా?’ అని పిల్లలు అడిగితే ‘సిల్లీ క్వశ్చన్ ’ అని నోరు మూయించకండి. ‘నీ ఇష్టం. ఛాయిస్ నీది. సమాజం కోసం నటించక్కర్లేదు’ అని గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి. పిల్లల డౌట్ తీరితేనే రేపటి డిస్క్రిమినేషన్ పోతుంది. ప్రశ్నని చంపితే, ఆలోచనని చంపినట్టే.U-UNIFORM పనిక్లాస్ లీడర్, డస్టర్ దులిపే డ్యూటీ, రంగు కాగితాలు అంటించడం, అసెంబ్లీలో మాట్లాడటం – అన్నీ లిస్ట్ రాసి చీటీలు తీయించండి. పనులు అబ్బాయిలకు వచ్చినా అమ్మాయిలకు వచ్చినా చేయాలి. అమ్మాయి లీడర్ అయితే క్లాస్ ఇంకా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ‘నేను తగ్గేదేలే’ అని ప్రూవ్ చేసుకోవాలనే కసి వాళ్లలో ఎక్కువ. ఆ కసే రేపు దేశాన్ని నడిపిస్తుంది.A-ABUSEకి జీరో టాలరెన్స్‘ఆడపిల్లలా ఏడుస్తావా?’, ‘అమ్మాయిగా ఉంటూ రౌడీ వేషమా?’ – ఈ మాటలు మీ నోటి నుంచి రాకుండా స్కూల్ గేట్ దగ్గరే చెక్ చేసుకోండి. టీచర్ అయినా, ఫ్రెండ్ అయినా, పేరెంట్ అయినా ఇలాంటి మాటలు అంటే స్టాఫ్ రూంలో వార్నింగ్, మళ్లీ అంటే ఫైన్ .L-LEARN FORM KIDSపిల్లలకి పుట్టుకతో బయాస్ ఉండదు. ఒకటవ క్లాస్ పాపకి పక్కన కేవలం అమ్మాయిలతో ఆడుకోవాలా లేదంటే అబ్బాయిలతో ఆడుకోవాలా అనేది ఉండదు. మనమే బుర్రలో పురుగు పెడతాం. పిల్లల్ని చూసి మనం ‘అన్ లెర్న్’ అవ్వాలి. వాళ్ల ప్రపంచంలో ‘మంచి మనిషి’, ‘చెడ్డ మనిషి’ తప్ప ‘ఆడ మనిషి’, ‘మగ మనిషి’ అనే తేడా లేదు. ఆ స్వచ్ఛతని మనం పాడుచేయకూడదు.→ పేరెంట్స్కి స్పెషల్ నోట్కొడుకు దెబ్బ తగిలి ఏడిస్తే ‘గట్టిగా ఉండరా, మగాడివి కదా’ అని కన్నీళ్లు ఆపకండి. ఏడవనివ్వండి. ఫీలింగ్స్కి జెండర్ అంటించకండి. కూతురికి సైకిల్ కొనిస్తే ‘వేగంగా తొక్కకు, పడిపోతావ్’ అని కాళ్లకి సంకెళ్లు వేయకండి. ‘హెల్మెట్ పెట్టుకో, నువ్వు గెలవగలవు’ అని రెక్కలు కట్టండి. కొడుకుకి బ్యాంక్ అకౌంట్తో పాటు పొయ్యి వెలిగించడం, కూతురికి వంటతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం నేర్పండి.→ చివరిగా...బడి అంటే ‘మార్కుల ఫ్యాక్టరీ’ కాదు, ‘వ్యక్తిత్వాలు తయారయ్యే ఒడి’. ‘ఎవరు ఏమవ్వాలి’ అని మనం శాసనాలు రాయకూడదు, ‘ఏమైనా అవ్వగలరు’ అని శ్వాస ఇవ్వాలి. బడిగంట మోగింది. ఇక వివక్షకి చెల్లు. సమానత్వానికి స్వాగతం.– కె. -
‘టికెట్ దొంగ’ ఎవరు!
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్టీసీలో కండక్టర్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని టికెట్ జారీ చేయలేదు. తనిఖీ సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. దీంతో విచారణ జరిపిన అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంకో ఘటనలో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ సిబ్బంది సోదా చేశారు. ఓ ప్రయాణికుడి వద్ద టికెట్ లేదు. తాను డబ్బులిచ్చినా కండక్టర్ టికెట్ ఇవ్వలేదని అతను బుకాయించాడు.తోటి ప్రయాణికులను విచారించగా, అతను టికెట్ తీసుకోలేదని, కండక్టర్కు డబ్బు ఇచ్చిన విషయం వాస్తవం కాదని తేలింది. దీంతో అతనికి ఫైన్ విధించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో ఇలాంటివి తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్రయాణికుల వద్ద టికెట్ లభించని తరుణంలో విచారణ జరిపితే కొన్ని సందర్భాల్లో కండక్టర్లదే తప్పని, మరికొన్ని సందర్భాల్లో ప్రయాణికులే దోషులని తేలుతోంది. ఆర్టీసీ ఇప్పుడీ అంశం చర్చనీయాంశమయ్యింది. కండక్టర్ల ఉద్యోగ భద్రతపై కార్మీక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈడీల భేటీలో తీవ్ర చర్చ కొందరు ప్రయాణికులు డబ్బులు మిగుల్చుకునేందుకు టికెట్ తీసుకోవడం లేదని, చెకింగ్ సిబ్బంది వచ్చినప్పుడు కండక్టర్పై నిందమోపుతున్నారని, ఇది కండక్టర్ల ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీలో కూడా రైల్వే తరహా విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ లేని పక్షంలో ప్రయాణికులనే బాధ్యులను చేయాలనేది వారి వాదన. రెండు రోజుల క్రితం ఈడీల కమిటీతో జరిగిన చర్చలో కూడా ఇది ప్రధాన అంశంగా మారింది. కార్మీకుల సమ్మె డిమాండ్లపై చర్చించి పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం ఈడీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.కాగా కమిటీ భేటీ మూడున్నర గంటలపాటు జరిగితే, కండక్టర్ ఉద్యోగ భద్రతకు ముప్పుగా మారిన ‘టికెట్’అంశంపైనే గంటపాటు చర్చించడం గమనార్హం. అయితే కమిటీ ఇందుకు వెంటనే ఆమోదం తెలపలేదు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి సిబ్బంది అనుభవాలు, డిపో మేనేజర్ల దృష్టికి వచ్చిన ఉదంతాలు తదితరాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఉండే మరో కమిటీని నియమిస్తామని పేర్కొనటం విశేషం. ఎందుకింత ఆందోళన? గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అవకతవకలకు కారకులయ్యారనే కారణంతో దాదాపు 1,000 మందికి పైగా ఉద్వాసనకు గురయ్యారు. వీరిలో సగం మంది కండక్టర్లే కావడం గమనార్హం. అయితే తాము చేయని తప్పునకు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని, ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా తమపై నేరం మోపారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొందరు కండక్టర్లు ఉద్దేశపూర్వకంగానే టికెట్లు ఇవ్వడం లేదని, దూర ప్రాంత బస్సుల్లో కొన్ని సందర్భాల్లో టికెట్ జారీ చేయకుండా ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసు కుని స్వాహా చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.ఈ విధంగా నేరం గుర్తించిన వారిని మా త్రమే ఉద్యోగాల నుంచి తొలగించామని చెబుతున్నారు. అయితే ఉద్వాసనకు గురైనవారు పలుమా ర్లు ప్రభుత్వానికి విన్నవించుకోవటంతో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగాలిచ్చారు. ప్రయాణికులకు టికెట్ జారీ చేయాల్సిన బాధ్యత కండక్టర్లదేనని, టికెట్ ఇవ్వని పక్షంలో ప్రయాణికులు డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బస్సులో రద్దీ కారణంగా టికెట్ తీసుకోని వారిని గుర్తించే పరిస్థితి ఉండదని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. కండక్టర్లు–ప్రయాణికులు మిలాఖత్! కొందరు కండక్టర్లు–ప్రయాణికులు మిలాఖత్ అయి టికెట్ జారీ కాకుండా ఆర్టీసీని నష్టపరుస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. టికెట్ చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తున్న కొందరు కండక్టర్లు దాన్ని జేబులో వేసుకుంటున్నారు. తనకు సగం డబ్బులు మిగులుతున్నాయన్న ఉద్దేశంతో ప్రయాణికులు టికెట్ తీసుకోవటం లేదు. తనిఖీ జరిగినప్పుడు ఇది కండక్టర్ ఉద్యోగానికి ముప్పు తెస్తోంది. ఆర్టీసీకి నష్టం జరుగుతోందనేది ఒక అంశం కాగా కార్మిక సంఘాలు కండక్టర్ల ఉద్యోగ భద్రత అన్న కోణంలో ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో దీనిపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. -
ఫిఫా ప్రపంచకప్లో సంచలనం.. స్పెయిన్కు షాక్
ఫిఫా ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ జట్టుకు వరల్డ్కప్లో తొలిసారి అడుగుపెట్టిన 'కేప్ వెర్డే' జట్టు గోల్రహిత డ్రాతో (0-0) నిలువరించి, ఊహించని షాకిచ్చింది. అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ (గ్రూప్-హెచ్) ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత గొప్ప అప్సెట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం ఆరు లక్షల జనాభా కలిగిన అట్లాంటిక్ ద్వీప దేశం కేప్ వెర్డే, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకటైన స్పెయిన్ను అడ్డుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయింది.స్పెయిన్ 24 షాట్లు కొట్టినా కేప్ వెర్డే రక్షణ గోడను దాటలేకపోయింది. ముఖ్యంగా 40 ఏళ్ల గోల్కీపర్ జోసిమర్ డయాస్ అద్భుత ప్రదర్శనతో స్పెయిన్ దాడులను తిప్పికొట్టాడు. ఫెర్రన్ టోర్రెస్, మిఖెల్ ఒయార్జబాల్, అమెరిక్ లాంపోర్టే ప్రయత్నాలను వరుసగా అడ్డుకుని హీరోగా నిలిచాడు.మ్యాచ్ చివరి నిమిషాల్లో కేప్ వెర్డే ఫుట్బాల్ చరిత్రలోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసే దిశగా వెళ్లింది. పసికూన చేతిలో స్పెయిన్కు పరాభవం తప్పదని అంతా అనుకున్నారు. 90వ నిమిషంలో డినే బోర్జస్ హెడ్డర్ను స్పెయిన్ గోల్కీపర్ ఉనయ్ సైమన్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం ర్యాన్ మెండెస్కు కూడా గెలుపు గోల్ చేసే అవకాశం లభించినా అది ఫలించలేదు. -
డీఆర్డీవో క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరో ఘనత సాధించింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్ఆర్ఎల్ఏసీఎం)ను ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది.ఈ ప్రయోగంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను క్షిపణి విజయవంతంగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ పరిశోధన విభాగం వెల్లడించింది. ఎల్ఆర్ఎల్ఏసీఎం ఒక సబ్సోనిక్ ఉపరితల-ప్రయోగ క్రూయిజ్ క్షిపణి. ఇది చాలా దూరంలో ఉన్న భూభాగ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తక్కువ ఎత్తులో భూభాగ ఆకృతులను అనుసరిస్తూ ప్రయాణించే ఈ క్షిపణి శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాన్ని చేరుకోగలదు.టర్బోజెట్ ఇంజిన్, అధునాతన ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ, ఉపగ్రహ ఆధారిత మార్గనిర్దేశక సాంకేతికత, టెర్రెయిన్ మ్యాచింగ్ సామర్థ్యాలు దీనిలో ప్రత్యేకతలు.రక్షణ వ్యూహాత్మక దృష్ట్యా ఈ క్షిపణి భారత్కు కీలక బలంగా మారనుంది. శత్రు భూభాగంలో లోతుగా ఉన్న అధిక ప్రాధాన్య లక్ష్యాలపై సుదూర దాడులు నిర్వహించే సామర్థ్యాన్ని ఇది అందిస్తుంది. భారీ స్థాయి సైనిక చర్యలకు వెళ్లకుండా ఖచ్చితమైన స్టాండ్-ఆఫ్ దాడులు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ), యాంటీ-షిప్ సామర్థ్యాలను ప్రదర్శించే మూడు వరుస క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన భారత్, ఇప్పుడు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ పరీక్షతో తన రక్షణ రంగ పురోగతిని మరోసారి ప్రపంచానికి చాటింది. -
దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లు
గిరిజన అభివృద్ధి నిరంతర పురోగతితో సాగిన ప్రయాణం కాదు. ఇది పాలన విధానాలు, ఆలోచనా విధానాలు, రాజ్యాంగ హామీల మధ్య జరిగిన మార్పులతో రూపుదిద్దుకున్న క్లిష్టమైన ప్రయాణం. ఇందులో రక్షణ, సమగ్రత, స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ జోక్యం, సాంస్కృతిక గుర్తింపు, ఆర్థిక అభివృద్ధి మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంఘ ర్షణే కనిపిస్తుంది. బయటకు అభివృద్ధి కనిపించినప్పటికీ, లోపల అనేక నిర్మాణాత్మక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణించి పాలన అమలు చేశారు. 1874లో ‘షెడ్యూల్డ్ జిల్లాలు’, 1919లో ‘వెనుకబడిన ప్రాంతాలు’, 1935లో ‘మినహాయించ బడిన’, ‘కొంతమేరకు మినహాయించబడిన ‘ ప్రాంతాలు అనే వర్గీక రణలు చేశారు. ఇవి గిరిజనులను రక్షించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, వాస్తవానికి పరోక్ష దోపిడీకి మార్గాన్ని సుగమం చేశాయి.కేవలం అధ్యయనాంశమా?1924లో వచ్చిన ఏజెన్సీ రూల్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు విస్తృత అధికారాలను ఇచ్చారు. పరిపాలన, న్యాయ అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండేవి. ఈ విధానం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కొంతవరకు కనిపిస్తున్నది. రక్షణ పేరుతో గిరిజన ప్రాంతాలు వేరుపడిపోయాయి. దాంతో వ్యాపారులు, మధ్య వర్తులు, కాంట్రాక్టర్లు గిరిజనులను దోచుకున్నారు. గిరిజనులు భూములను కోల్పోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు లేక అభివృద్ధికి దూరమయ్యారు.20వ శతాబ్దం ప్రారంభంలో తక్కర్ బాపా వంటి సంస్కరణ వాదులు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. 1941లో మినహాయించ బడిన ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గిరిజనులను కేవలం అధ్యయనానికి సంబంధించిన ప్రజలుగా కాకుండా, గౌర వంతో బాటు అభివృద్ధికి అర్హులైన పౌరులుగా చూడాలని చెప్పారు. ఆయన ఆలోచనలు ఆ తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో ప్రతిబింబించాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగం గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ కింద ప్రత్యేక పరిపాలన క్రిందికి తీసుకు వచ్చింది. గిరిజనులను ప్రధాన సమాజంలో కలపాలా? లేక వేరుగా ఉంచాలా? అనే పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. కలపడం వల్ల వారి సంస్కృతి దెబ్బతింటుంది; వేరుగా ఉంచడం ప్రజాస్వామ్య సమా నత్వానికి విరుద్ధం. జవహర్లాల్ నెహ్రూ ‘పంచశీల సూత్రాల’ ద్వారా సమతుల్య మార్గాన్ని సూచించారు. గిరిజనుల స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి; వారి భూమి, అడవి హక్కులు, సంప్రదాయ సంస్థలకు రక్షణ అవసరం అని చెప్పారు. అభివృద్ధిని కేవలం డబ్బు లేదా ఆర్థిక వృద్ధితో కాకుండా, మానవ గౌరవంతో బాటు సామర్థ్యాల పెరుగుదలతో కొలవాలని చెప్పారు. 1969లో శీలు ఆవో కమిటీ ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని సూచించింది. కానీ తరువాతి కాలంలో విధానాలు ఈ ఆదర్శాల నుండి దూరమయ్యాయి.ఐదవ పంచవర్ష ప్రణాళిక తరువాత ట్రైబల్ సబ్ ప్లాన్, ఐటీడీఏల వంటివి మొదలయ్యాయి. ఇవి కొంత సంక్షేమాన్ని అందించినప్పటికీ, గిరిజన ప్రాంతాలను మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద, అడవులు, నీటి వనరులు పెద్ద ప్రాజెక్టులు, గనులు, పరి శ్రమల కోసం ఉపయోగించారు. అభివృద్ధి పేరుతో అనేక మంది గిరిజనులు తమ భూములు, జీవనాధారాలను కోల్పోయారు. 1947 నుండి 2010 వరకు భారత్లో 6 నుండి 6.5 కోట్ల మంది గిరిజనులు అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభాలో కేవలం 8.6% మాత్రమే గిరిజనులు ఉన్నప్పటికీ, స్థానచలనం చెందిన వారిలో దాదాపు 40% వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, అనేక షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ భూములు గిరిజ నేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. ఐదో షెడ్యూల్, ఆర్టికల్ 46, పెసా చట్టం (1996) గిరిజన హక్కులు, గ్రామసభల స్వపరి పాలనకు బలమైన రక్షణ ఇస్తున్నాయి. కానీ గ్రామసభలు చాలా చోట్ల కేవలం పేరుకే ఉన్నాయి. భూములు కోల్పోవడం కొనసాగుతూనే ఉన్నది. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం మాత్రమే కాదు. అది అసమానతలను తగ్గించాలి;సంస్కృతిని కాపాడాలి; ప్రజలను శక్తిమంతం చేయాలి.భాగస్వాములను చేసినప్పుడే...గిరిజన సమాజాలు ప్రకృతితో కలిసి జీవించే విధానాన్ని అనుసరిస్తాయి. భూమి, అడవులు వారికి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు; అవి వారి సంస్కృతి, జీవన విధానాలకు గుర్తింపు. అందుకే భూములు కోల్పోవడం అంటే కేవలం ఆర్థిక నష్టమే కాదు, సాంస్కృతిక నష్టం కూడా. పెసా చట్టం గ్రామస్థాయి స్వపరి పాలనకు ముఖ్యమైన అడుగు. కానీ దాని అమలు అత్యంత బల హీనంగా ఉన్నది. అధికార యంత్రాంగమే ఇంకా కేంద్రీకృతంగా పనిచేస్తున్నది. నిజమైన స్వపరిపాలన కోసం ప్రభుత్వం గిరిజన సమాజాలపై నమ్మకం ఉంచాలి; అధికారాలను పంచుకోవాలి.భారతదేశ గిరిజన అభివృద్ధి ప్రయాణంలో పురోగతి ఉన్న ప్పటికీ, లోపాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథ కాలు మాత్రమే సరిపోవు; గిరిజనులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి; భూమి, అడవులపై నిజమైన హక్కులు ఇవ్వాలి; గ్రామ సభలను బలపరచాలి; అభివృద్ధి ప్రక్రియలో బాధ్యతాయుత వ్యవస్థలు ఉండాలి. గిరిజన ప్రాంతాలను కేవలం సహజ వనరుల నిల్వలుగా కాకుండా, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం కలిగిన ప్రాంతాలుగా గౌరవించాలి. రాజ్యాంగ హామీలు నిజం కావాలంటే కేవలం చట్టాలు సరిపోవు. అభివృద్ధి విధానాలే రాజ్యాంగ విలువ లకు అనుగుణంగా మారాలి. అప్పుడే గిరిజన సమాజాలు నిజమైన భాగస్వాములుగా భారత ప్రజాస్వామ్యంలో స్థానం పొందుతాయి.పి. వేణుగోపాల్ రెడ్డివ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
డిసెంబరులో...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్స్టోరీ మూవీ ‘ఫౌజి’. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ సినిమా కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.కాగా ‘ఫౌజి’ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో దసరాకు రిలీజ్ కావడం లేదని తెలిసింది. డిసెంబరు మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో దేశభక్తి అంశాలు ఉండటంతో ఆగస్టు 15కి ‘ఫౌజి’ టీజర్ను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.మరి.. ‘ఫౌజి’ డిసెంబరులోనే థియేటర్స్కు వస్తుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ‘కల్కి 2’ రిలీజ్ డేట్పై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్తో పాటు పలు నగరాలపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు.ఈ దాడుల్లో చారిత్రక డార్మిషన్ కేథడ్రల్ భారీగా దెబ్బతింది. డ్రోన్ నేరుగా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ కేథడ్రల్ ఉక్రెయిన్ ఆర్థడాక్స్ క్రైస్తవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన కేంద్రంగా భావిస్తారు.ఈ దాడులపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యుద్ధాన్ని కొనసాగించాలన్న రష్యా ఉద్దేశాన్ని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, ఉక్రెయిన్కు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని జీ-7 దేశాలను కోరారు.ఈ దాడుల అనంతరం జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్, రష్యా వర్గాలు వెల్లడించాయి. -
ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్తో, గులాబీ రంగు సూట్లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్తో పాటు వింటేజ్ లుక్ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్ బెబో అని ఎందుకంటారు? తన లుక్ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. -
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 13,343 అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచింది.ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 8,19,372 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్లో సాధించిన మార్కులు తుది ర్యాంకుల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది. -
హర్మూజ్పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్హద్లో నిర్వహించి, అదే రోజు ఇమామ్ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. -
‘రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బిజేపి పార్టీ,కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయని,ఆ రెండు పార్టీలు ఒక్కటై,తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రతో,ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎస్ఐఆర్ నిర్వహించి సుమారు 90 లక్షల ఓట్లు తొలగించి,మమత బెనర్జీ పార్టీని ఓడించారని తెలిపారు. బిజేపి అధికారంలోకి వచ్చాక అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.మాజీ మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యిందని, బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కూడా ఓటు వినియోగించలేకపోయారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమరుపాటుగా ఉంటే మన ఓటు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారం నింపిన తర్వాత, వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు,ఓటు తొలగించాలంటే ఖచ్చితంగా నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు. అంతేకాకుండా 326 ప్రకారం ఎవరైనా వ్యక్తులు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే, రిప్రజెంటేషన్ ఈఫ్ పీపుల్ యాక్ట్ 1950 లోని సెక్షన్ 17,18 ప్రకారం ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.2028లో కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి,నూతన ఓటు నమోదు చేయడానికి ఫారం 6 నింపి ఇవ్వాలని, బిజేపి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బిఎల్ఓ లను ప్రభావితం చేసి,దొంగ ఓట్లు వేయిస్తే,వెంటనే అధికారులకు ఫిర్యాది చేసి, ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని సూచించారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు, మ్యాపింగ్ టెక్నాలజీ ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా, వెంటనే అభ్యంతరాలు తెలుపుతూ,ఫారం 8 ద్వారా సరిచేసుకోవాలన్నారు.తెలంగాణలో అభివృద్ధి పథంలో నడవాలంటే,తిరిగి కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని,అందుకోసం ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితంగా మన బూత్ లో ఉండే అన్ని కుటుంబాలను కలిసి అందరి ఓట్లు నమోదయ్యేలా చూడాలని,నిరంతరం బిఎల్ఓలను వెంట ఉండి ఓట్లు పోకుండా చూడాలన్నారు. తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి మల్లయ్య యాదవ్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నీట్ పోర్టల్లో మరో కలకలం
న్యూఢిల్లీ: నీట్ (NEET-UG) పరీక్ష నిర్వహణలో ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో మరోసారి కలకలం రేగింది. నీట్ అధికారిక పోర్టల్లోకి అక్రమంగా చొరబడిన 19 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్ 150 మంది అభ్యర్థులకు చెల్లించాల్సిన రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. అహ్మదాబాద్ పోలీసులు నిందితుణ్ని బిహార్లో అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయకుండా, ఇప్పటికే చెల్లించిన ఫీజులో భాగంగా రీఫండ్ అందించేందుకు ఎన్టీఏ ప్రత్యేక రీఫండ్ మాడ్యూల్ను ప్రారంభించింది.ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇదే ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్న నవీన్ యాదవ్, పోర్టల్లోని భద్రతా లోపాలు,బలహీనమైన పాస్వర్డ్లను ఉపయోగించి విద్యార్థుల ఖాతాల్లోకి చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు.పోలీసుల దర్యాప్తులో బిహార్ గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ సుమారు 350 మంది అభ్యర్థుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని, వారిలో 150 మందికిపైగా ఖాతాల్లోకి విజయవంతంగా ప్రవేశించాడు. ఇందుకోసం బ్రూట్ ఫోర్స్ అటాక్ పద్ధతిని ఉపయోగించాడు. అంటే పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్ను ఊహిస్తూ అన్ని సాధ్యమైన కాంబినేషన్లను వరుసగా ప్రయత్నించడం. అలా పాస్వర్డ్లను గుర్తించిన అనంతరం నిందితుడు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాల స్థానంలో తన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక్కో అభ్యర్థికి చెల్లించాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తం అతని ఖాతాలో జమైంది.ఎన్టీఏ పోర్టల్లో నగదు లావాదేవీల్లో అవకతవకలు జరగడంతో అధికారులు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రీఫండ్ లావాదేవీల్లో అసాధారణ మార్పులు గుర్తించారు. అనంతరం ఎన్టీఏ నుంచి బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించి డబ్బు బదిలీలను ట్రాక్ చేసి నిందితుడిని బీహార్లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ.. పోర్టల్లోని భద్రతా లోపాలను నిందితుడు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం అతను ఇతర సైబర్ నేరాల్లో కూడా పాల్గొన్నాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.నీట్ అభ్యర్థులకు చుక్కలు ఇదిలా ఉండగా, జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లింక్ సరిగా పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అడ్మిట్ కార్డుల విడుదల ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం నాటికి కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే వాటిని డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్పై అధిక భారం కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంది.ఈ సమస్యల పరిష్కారానికి తమ సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తోందని, అతి త్వరలో అన్ని అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఏ తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది -
ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ అద్భుత ఆటగాడని.. అతడిని వన్డే వరల్డ్కప్-2027లో ఆడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే, అందుకోసం ముందుగా జడేజా సెలక్టర్లను ఒప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.ఈ ఏడాది మూడు వన్డేలు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవర్కు ఆరు చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్కు జడ్డూ ఎంపిక కాలేదు. యువ ఆల్రౌండర్ హర్ష్ దూబే తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడగా.. నితీశ్ కుమార్ రెడ్డి అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ 37 ఏళ్ల జడ్డూ భవిష్యత్తు గురించి మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే.. ‘‘జడేజాను ఇప్పుడే లెక్కలోంచి తీసేయొద్దు. అతడు ఇప్పటికీ అద్భుతమైన క్రికెటరే. నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే.. నితీశ్కు బదులు అతడే జట్టులో ఉంటాడు.ఇక హార్దిక్తో పాటు జట్టులో ఉన్న మరో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే. అతడు ప్రపంచకప్ వరకు కొనసాగితే బాగుంటుంది. అయితే, అందుకు జడ్డూ తన ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించాల్సి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్లో లేకపోవచ్చు. కానీ జట్టు నుంచి పూర్తిగా తప్పిస్తామంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిక్కా పేర్కొన్నాడు.ఫామ్లోకి వస్తేనేకాగా 2027లో జరిగే వన్డే వరల్డ్కప్లో దిగ్గజ బ్యాటింగ్ ద్వయం విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ ఆడతారా లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక అరుదుగా జట్టుకు దూరమయ్యే కోహ్లి.. తొడకండరాల గాయంతో అఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు.. ఫిట్నెస్ సాధించి తిరిగి వచ్చిన రోహిత్ అఫ్గనిస్తాన్తో తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 16 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో చిక్కా మాట్లాడుతూ.. రోహిత్ ఫామ్లోకి వస్తేనే ప్రపంచకప్ జట్టులో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. లేదంటే అతడికి చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ -
మేము టీఎంసీని వీడలేదు: 20 మంది రెబల్ ఎంపీలు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం మాత్రం మాట మార్చారు.అరూప్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. “మేము టీఎంసీని వీడలేదు. టీఎంసీలోనే ఉన్నాం. పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు దెబ్బతిన్నదన్న చర్చ జరగడం లేదు. పార్టీ గుర్తు కోసం మేము పోరాడతాం. మా వద్ద 20 మంది సభ్యులు ఉన్నారు. గుర్తు కోసం ఎందుకు పోరాడకూడదు?” అని తెలిపారు.రాజకీయ, న్యాయ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికిందని చక్రవర్తి అన్నారు. “కొత్త ఆట మొదలైంది. ఖేలా హోబే” అని ఆయన అన్నారు. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 20 మంది రెబల్ టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము ఎన్సీపీఐలో విలీనమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ అరూప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సమావేశంలో ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నుంచి శాసనసభ్యుల స్థాయిలో తమ విభజనను అధికారికంగా ప్రకటించినట్టైంది.కోర్టును ఆశ్రయిస్తాం ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ తిరుగుబాటు వర్గంలో చేరారు. తమదే నిజమైన టీఎంసీ అని నిరూపించేందుకు, పార్టీ జంట పువ్వుల ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. పార్టీ వాదన ప్రకారం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య చెల్లదు. రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీ ముందుగా విలీనం కావాలి లేదా విడిపోవాలి. ఆ తర్వాతే శాసనసభ్యులు అనర్హత నిబంధనల నుంచి మినహాయింపు కోరగలరని చెప్పారు.ఎక్స్లో చేసిన పోస్టులో ఘోష్ స్పందిస్తూ.. “2/3 వంతుల మెజారిటీ, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంపై భారీ స్థాయిలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. పదో షెడ్యూల్, సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. పార్లమెంట్ వెలుపల ఉన్న రాజకీయ పార్టీనే ముందుగా విడిపోవాలి లేదా విలీనం కావాలి. పార్లమెంట్లో కూర్చున్న పార్టీ ప్రతినిధులు కాదు. ఈ షరతు నెరవేరిన తర్వాతే 2/3 మంది విడిపోయినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు” అని తెలిపారు.సీనియర్ టీఎంసీ నేత సౌగత రాయ్ కూడా తిరుగుబాటు నేతలపై విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు వారు ద్రోహం చేశారని ఆరోపించారు. “ఇప్పుడు మమతా బెనర్జీ అధ్యక్షురాలిగా ఉన్న అఖిల భారత తృణమూల్ కాంగ్రెసే అసలైన పార్టీ అని స్పష్టమైంది. ఎన్నికల గుర్తు రెండు పువ్వులు. భారతీయ జనతా పార్టీని ఓడించడమే దాని లక్ష్యం” అని ఆయన చెప్పారు.“టీఎంసీ గుర్తుపై ఎన్నికైన 20 మంది ఎంపీలు తమ ఓటర్లకు ద్రోహం చేస్తూ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పెద్దగా గుర్తింపు లేని పార్టీలో చేరారు. చట్టవిరుద్ధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(4) నిబంధనల నుంచి తప్పించుకోవడానికే వారు ఇలా చేశారు. ప్రజలు ఈ వార్తను గమనిస్తున్నారు” అని రాయ్ అన్నారు.మమతా బెనర్జీపైన కూడా చక్రవర్తి నేరుగా విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆమె ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. “మమతా బెనర్జీ భయపడుతున్నారు. పార్టీ సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో కూడా సమావేశం నిర్వహించలేకపోయారు” అని ఆయన చెప్పారు. -
కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!
బంగారం ధరలు పెరుగుతాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' మరోసారి హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మొత్తానికి బంగారం తన కదలికను ప్రారంభించింది. ఒక్క రోజులోనే 100 డాలర్లు దాటింది. మీరు దీనిని గమనించారా?. ఒకవేళా గమనించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసిడి ధర పెరుగుదల ఇప్పుడే మొదలైంది. ఈ రోజు బంగారం ఔన్సుకు 4300 డాలర్ల వద్ద ఉంది. అయితే 2025 నాటికి ఇది 35,000 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుంది. అందుకే "క్యాష్ ఈజ్ ట్రాష్'' అని వ్యాఖ్యానిస్తూ, కేవలం డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు రూపంలో డబ్బును నిల్వ ఉంచడం కంటే.. విలువను నిలబెట్టుకునే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటున్నారు.బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియం, చమురు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం మంచిదని కియోసాకి సలహా ఇస్తున్నారు. తాను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగదును ఈ ఆస్తులుగా మార్చుకుంటూ వచ్చానని, వాటినే 'నిజమైన డబ్బు'గా భావిస్తున్నానని చెప్పారు.అయితే ఇది కియోసాకి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పెట్టుబడుల విషయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రిస్క్లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ విషయంలో పెట్టుబడిదారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి.GOLD began its move…finally.Over &100 in a day.Did you catch the move?If you did not. Do not worry. The ascent of gold has just begun.Today gold is at $4300 an ounce.I am confident it will be $35,000 an ounce by 2035. Nice dates and numbers that start and end…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 15, 2026 -
భట్టి బర్త్డే: ఓయూ విద్యార్థులకు స్టడీ చైర్ల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్టడీ చైర్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడం, మెరుగైన అధ్యయన వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమాన్ని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) మరియు బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సంయుక్తంగా నిర్వహించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోటీ పరీక్షలు మరియు ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అధ్యయన సౌకర్యాలను అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భట్టి విక్రమార్క సామాజిక న్యాయం, విద్యా అభివృద్ధి, వెనుకబడిన మరియు అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. సమాన అవకాశాల సమాజ నిర్మాణానికి విద్యలో పెట్టుబడి అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు. -
'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్మనీ
ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రిస్క్'. జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పుడీ చిత్రంలోని 'దేవుడు వరమందిస్తే' అంటూ సాగే మెలోడీ పాటని దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)ఈ పాటకు సంబంధించి హుక్ స్టెప్తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: సిమ్రాన్-విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు) -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం
న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం అందుకుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో పర్యాటక కివీస్ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్ 17) నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగారెండో టెస్టు మొదలుకానుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. నైట్క్లబ్ వివాదం నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ బెన్స్టోక్స్పై వేటు వేసిన బోర్డు.. అతడి స్థానంలో రెండో టెస్టుకు వెటరన్ ప్లేయర్ జో రూట్ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇద్దరి అరంగేట్రంఇక కివీస్తో రెండో టెస్టు సందర్భంగా తమ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నట్లు ఈసీబీ వెల్లడించింది. వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్, హాంప్షైర్ ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్ టెస్టుల్లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది.కాగా జోర్డాన్ ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున మూడు వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్లు ఆడాడు. మరోవైపు.. బేకర్ ఇప్పటికి రెండు వైట్బాల్ మ్యాచ్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, చివరగా అతడు 2025లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక జోర్డాన్ ఎనిమిది నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇదిలా ఉంటే.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా రెండో టస్టు సందర్భంగా జట్టుతో చేరుతున్నాడు. కాగా నైట్క్లబ్ వివాదంలో స్టోక్స్తో పాటు ఆల్రౌండర్ గస్ అట్కిన్సన్ మీద కూడా వేటు పడింది. ఇక ఓలీ రాబిన్సన్ను విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో జోర్డాన్, బేకర్, ఆర్చర్ తుదిజట్టులోకి వచ్చారు.న్యూజిలాండ్తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మ్యాట్ ఫిషర్, ఎమీలియో గే, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.చదవండి: శ్రీలంకప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ.. -
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్కి చెందిన చాలామంది విజయ్ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
కారులో స్టెప్నీ టైర్.. చిన్నగా ఉండటానికి ఇదే అసలు కారణం!
కార్లలో ఉండే స్టెప్నీ (Spare Tyre) సాధారణంగా.. మిగతా టైర్ల కంటే కొద్దిగా చిన్నగా ఉండటం చాలా మంది గమనించి ఉంటారు. కొందరు దీనిని తయారీ లోపంగా భావించినప్పటికీ, వాస్తవానికి ఇది ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో భాగంగా తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయం. ఈ చిన్న స్టెప్నీని సాధారణంగా 'స్పేస్ సేవర్' లేదా 'డోనట్ టైర్' అని పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉపయోగించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తారు.బరువును తగ్గించడంస్టెప్నీ టైర్ చిన్నగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాహనం బరువును తగ్గించడం. కారు ఎంత తక్కువ బరువు ఉంటే అంత తక్కువ ఇంధనం వినియోగిస్తుంది. దీంతో మైలేజ్ మెరుగుపడటమే కాకుండా పర్యావరణానికి హానికరమైన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ప్రతి కారులో పూర్తి పరిమాణం గల అదనపు టైర్ను ఉంచితే వాహనం బరువు పెరిగి ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.స్థలాన్ని ఆదా చేయడంమరో ముఖ్యమైన కారణం స్థలాన్ని ఆదా చేయడం. చిన్న పరిమాణంలోని స్టెప్నీ కారు డిక్కీలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ప్రయాణికులు తమ లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కార్లలో డిక్కీ స్థలం పరిమితంగా ఉండటం వల్ల ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఖర్చు తగ్గించడంఖర్చును తగ్గించడం కూడా మరో కారణం. చిన్న టైర్, రిమ్ తయారీకి తక్కువ ముడిసరుకు అవసరం అవుతుంది. ఫలితంగా తయారీ ఖర్చు తగ్గుతుంది. స్టెప్నీని రోజువారీ వినియోగం కోసం కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఖరీదైన పూర్తి పరిమాణం గల టైర్ను అందించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల వాహన ధర కూడా కొంత వరకు నియంత్రణలో ఉంటుంది.తాత్కాలిక ఉపయోగం కోసంఅయితే ఈ చిన్న స్టెప్నీని ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగించకూడదు. సాధారణంగా 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తారు. అలాగే గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. దీని ప్రధాన ఉద్దేశం సమీపంలోని టైర్ రిపేర్ సెంటర్ లేదా సర్వీస్ స్టేషన్ వరకు సురక్షితంగా చేరుకోవడమే.సులభ వినియోగంచిన్న స్టెప్నీ తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల దానిని మార్చడం కూడా సులభం. రోడ్డుపై టైర్ పంక్చర్ అయినప్పుడు డ్రైవర్లు లేదా ప్రయాణికులు పెద్దగా శ్రమ లేకుండా స్టెప్నీని అమర్చగలుగుతారు. పూర్తి పరిమాణం గల టైర్తో పోలిస్తే దీనిని ఎత్తడం, అమర్చడం చాలా సులభంగా ఉంటుంది.అయితే.. చిన్న స్టెప్నీ వాడుతున్నప్పుడు వాహనం గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండ్లింగ్లో స్వల్ప మార్పులు రావచ్చు. అందువల్ల జాగ్రత్తగా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిది. స్టెప్నీ అనేది స్వల్ప దూరం ప్రయాణించడానికి మాత్రమే అనే విషయం మర్చిపోకూడదు. -
బంగారు పంట పండింది!
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాలా కాసుల వర్షం కురిసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) 2020-21 సిరీస్-3 ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఈ సిరీస్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా ప్రిమెచ్యూర్ రిడంప్షన్ ధరను ప్రకటించింది. జూన్ 16, 2026 నుంచి ఈ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. గడచిన మూడు ట్రేడింగ్ రోజుల్లోని బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా.. ఈ విడత ప్రిమెచ్యూర్ రిడంప్షన్ ధరను గ్రాముకు రూ.14,774 గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయిన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రిమెచ్యూర్ రిడంప్షన్కు అవకాశం ఉంటుంది.ధర ఎలా లెక్కిస్తారంటే..ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన రేట్ల ప్రకారం... రిడంప్షన్ తేదీకి ముందు ఉన్న మూడు వ్యాపార రోజుల్లో 999 స్వచ్ఛత (24 క్యారెట్ల) బంగారం ముగింపు ధరల సాధారణ సగటును పరిగణనలోకి తీసుకొని ఈ ధరను ఖరారు చేశారు.పెట్టుబడిదారులకు ఎంత రాబడి వస్తుంది?ఈ సిరీస్ జారీ చేసిన సమయంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 తగ్గింపుతో రూ.4,627 లభించగా, ఆఫ్-లైన్ ఇన్వెస్టర్లకు రూ.4,677 గా ఉంది. ప్రస్తుత రిడంప్షన్ ధర రూ.14,774గా ఉంది. దాంతో నికరంగా 215.88% శాతం లాభం చేకూరినట్లయింది.గమనిక: ఈ లాభం బాండ్లపై లభించిన 2.5% వార్షిక వడ్డీ భాగం కాకుండా కేవలం బంగారం ధరల పెరుగుదల ద్వారా వచ్చిన నికర లాభం మాత్రమే.రూ.లక్ష పెట్టుబడి.. రూ.3.19 లక్షలు!ఈ లెక్కన 2020 జూన్లో ఈ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఆన్లైన్ ఇన్వెస్టర్ ప్రస్తుత పెట్టుబడి విలువ ఏకంగా రూ.3.19 లక్షలకు పైగా పెరిగింది. దీనికి అదనంగా గడచిన ఐదేళ్లలో ఏటా లభించిన 2.5 శాతం వడ్డీ ఆదాయం అదనం.పన్ను నిబంధనల్లో మార్పులుఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను నిబంధనలను సవరించినందున ఇన్వెస్టర్లు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి.ప్రైమరీ ఇష్యూ (మొదటగా ఆర్బీఐ వద్ద కొనుగోలు చేసిన) చందాదారులు కూడా ఐదేళ్ల తర్వాత ప్రిమెచ్యూర్ రిడంప్షన్ చేసుకుంటే వచ్చే లాభాలపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఎస్జీబీ నిబంధనల ప్రకారం లభించే పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనం.. కేవలం 8 ఏళ్ల కాలపరిమితి ముగిసే వరకు బాండ్లను ఉంచుకునే అసలు చందాదారులకు మాత్రమే పరిమితం చేశారు.స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసిన వారు ఆ బాండ్లను మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు హోల్డ్ చేసినప్పటికీ.. సవరించిన నిబంధనల ప్రకారం వారికి ఇకపై పన్ను రహిత విముక్తి (Tax-free Redemption) లభించదు. వారు కూడా పన్ను చెల్లించాల్సిందే.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
క్యూట్ పూజా స్మైల్.. సమంత చీరకట్టు
నవ్వుతూ మాయ చేస్తున్న పూజా హెగ్డేపట్టుచీరలో అందంగా హీరోయిన్ సమంతదేవకన్యలా మెరిసిపోతున్న దివ్యభారతిపింక్ డ్రస్లో గ్లామరస్గా శిల్పాశెట్టిపట్టుచీరలో మెప్పించేస్తున్న శివానీచెన్నై షూటింగ్ జ్ఞాపకాలతో మాళవిక View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika) -
పసిపాపతో మహిళ బిల్డింగ్పై నుంచి దూకిన కేసు.. భర్తకు రిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత తీవ్రంగా మారితే? అదే జరిగింది. మియాపూర్లో ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేస్తుండగా, ఆమె పసిపాప భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఆమె భర్తను రిమాండ్కు తరలించారు.కేసు ఏంటి? ఓ మహిళ తన ఆరు నెలల పాపతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్లోని మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద చోటుచేసుకుంది. తన ఆరు నెలల పాపతో ఆరో అంతస్తు నుంచి దూకిన ఈషా సాహు (37) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పాప. రెండో కూతురు పుట్టిందని ఈషా సాహును భర్త భూపేంద్ర సాహు వేధించడమే ఈ ఘటనకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సాహును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్కు దిగగా.. భారత్కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
జూన్ 30 డెడ్లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!
భారతదేశంలో ఎల్పీజీ సబ్సిడీలను పారదర్శకంగా.. సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లక్షలాది ఎల్పీజీ వినియోగదారులు, ముఖ్యంగా 'ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన' (PMUY) లబ్ధిదారులు, తమ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను 2026 జూన్ 30లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ వంటి సంస్థల ద్వారా వచ్చే సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.ఈకేవైసీ ప్రక్రియ సులభంగా ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్ఆయిల్ వన్ యాప్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ద్వారా, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు హెచ్పీ పే యాప్ లేదా ఆధార్ ఫేస్ఆర్డీ యాప్ ద్వారా ఈకవైసీ పూర్తి చేయవచ్చు. ఇందులో ఓటీపీ ధృవీకరణ, ఆధార్ లింకింగ్, ఫేస్ అథెంటికేషన్ వంటి దశలు ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పరిధిలో లేని వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి కాదు. అయితే అయితే అర్హులైన వారు సమయానికి పూర్తి చేయకపోతే సబ్సిడీ ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి గడువు (జూన్ 30)లోపు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవడం ఉత్తమం.एलपीजी सब्सिडी का लाभ बिना किसी रुकावट के प्राप्त करते रहें।30 जून 2026 से पहले अपना eKYC पूरा करें। यह प्रक्रिया सरल, सुरक्षित और पूर्णतः निःशुल्क है। आप इसे इंडियनऑयल ONE ऐप, अपने इंडेन वितरक या एलपीजी डिलीवरी कर्मी के माध्यम से आसानी से पूरा कर सकते हैं।आज ही eKYC करवाएँ… pic.twitter.com/E7bukytXWA— Indian Oil Corp Ltd (@IndianOilcl) June 12, 2026 -
హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్
తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే తెలుగులో 'కలివనం' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది గానీ ఇదొకటి రిలీజైందనే సంగతి కూడా చాలామందికి తెలియదు! ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలోనే నాగదుర్గనే మెయిన్ హీరోయిన్. 'లవ్ ఓ లవ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే హీరోయిన్ పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రియుడితో ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మోడ్రన్ అమ్మాయిగా నాగదుర్గ కనిపించనుంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు.ఇప్పటికే తమిళంలో గౌరిప్రియ, శ్రీదివ్య లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగదుర్గ, వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు కూడా తమిళంలోకి వెళ్లిపోతున్నారు. మరి తమిళంలో వీళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు మాత్రం వీళ్లని పెద్దగా పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ నియామకం
ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.12 మందితో బోర్డు ఏర్పాటుదీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.అప్సైడ్ అగ్రిమెంట్ వివరాలుఈ విలీన పథకంలో భాగమైన ‘అప్సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
మెట్రోకు అనుమతి లేకపోవడం సీఎం అసమర్థతకు నిదర్శనం.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్లో ఫేజ్-2కు అనుమతులు లభించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెట్రో ఫేజ్-2 అనుమతులు దక్కకపోవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు (సోమవారం) కేటీఆర్ కౌంటరిచ్చారు. అధికారం పొందిన నాటి నుంచి 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా బజెపి రేవంత్ను పట్టించుకోవడం లేదన్నారు.ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించలేక పోతున్నారని, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం లేక ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని... 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును కాంగ్రెస్ చిక్కుల్లో వదిలేస్తే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని గుర్తుచేశారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతుందని ఆరోపించారు.అంతకు ముందు మెట్రో ఫేజ్-2 అనుమతుల విషయంలో సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్లపై మండిపడ్డారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా కేటీఆర్ దానికి కౌంటరిచ్చారు. -
‘బీజేపీ అంటే సీఎం రేవంత్ భయపడుతున్నారు’
హైదరాబాద్: తమ పార్టీ అంటే సీఎం రేవంత్రెడ్డి భయపడిపోతున్నారన్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు ఎద్దేవా చేశారు. అందుకే కిషన్రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన రాంచందర్రావు.. హైదరాబాద్ వ్యక్తిగా కిషన్రెడ్డితో పాటు తాసు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుకుంటామని, రేవంత్కు హైదరాబాద్ అభివృద్ధి జరగాలని లేదని విమర్శించారు. బీజేపీ బలం పుంజుకుంటోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదు. మీరు టెక్నికల్ గా తప్పులు ఇస్తే తప్ప. మీ చేతగాని తనాన్ని మా మీద తోయాలని చూస్తున్నావు. మోదీ గురించి మాట్లాడే స్థాయి రేవంత్ది కాదు. మోదీ ముందు రేవంత్ చిన్నపిల్లాడు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది. సీఎం మాట ఎవరు వినట్లేదు’ అని ఆరోపించారు. -
సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు: అంబటి
తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.అతని మీద 94 కేసులు మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు? లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు. -
'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుందని అన్నారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ భారత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్లో శ్రీలంక అఫ్గనిస్తాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
సయోనీ సూపర్ ట్విస్ట్.. అస్సలు ఊహించలేదు!
కోల్కతా: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నేతలను కాదని సినిమా తారలను అందం ఎక్కించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తగిన శాస్తి జరిగిందని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గుర్తించాలని కోరుతున్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ఎన్డీఏ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అధినేత్రి తీరుపై పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా సయోనీ ఘోష్ (Saayoni Ghosh).. రెబల్ ఎంపీల వర్గంలో చేరడం టీఎంసీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.గుణపాఠం నేర్పారుమమతా బెనర్జీకి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సయోనీ ఘోష్.. టీఎంసీని వీడతారని ఊహించలేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. స్థాయికి మించి అవకాశాలు కల్పించినా ఆమె పార్టీని వీడడం జీర్ణించుకోలేపోతున్నామని చెబుతున్నారు. “సయోనీ ఘోష్ రెబల్ వర్గంలో చేరుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఆమెను అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మమతా బెనర్జీ కూడా ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాయకురాలిగా ఎదిగే అవకాశం కల్పించారు. ఇది మమతా, అభిషేక్లకు కూడా ఒక పాఠం. పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతల కంటే సినీ రంగం నుంచి వచ్చిన వారిపైనే ఎక్కువగా నమ్మకం ఉంచారు” అని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.మహువా మెయిత్రా భావోద్వేగంపార్టీని వీడి, రెబల్ గ్రూపు ఎంపీలతో సయోనీ ఘోష్ చేతులు కలపడం తనను బాధించిందని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా వ్యాఖ్యానించారు. “సయోనీ నాకు చెల్లెలిలాంటిది, కూతురితో సమానం. ఆమె పార్టీని విడిచిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఎంతో కష్టపడి ఎదిగింది. డబ్బు కోసం లేదా వ్యక్తిగత లాభం కోసం పనిచేసే వ్యక్తి కాదు. గత ఐదేళ్లలో పార్టీ ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి వ్యక్తి పార్టీని వీడాలని ఆలోచించడం చాలా బాధాకరం. భయాన్ని జయించి ముందుకు సాగాలని నేను ఆమెకు చెప్పాలనుకుంటున్నాను” అని మహువా మొయిత్రా పేర్కొన్నారు.సయోనీ స్థానంలో అర్నాబ్టీఎంసీలో సంక్షోభం నేపథ్యంలో రెబల్ ఎంపీల వర్గంలో సయోనీ ఘోష్ చేరినట్టు గత వారం వార్తలు వచ్చాయి. ఎన్డీఏకు మద్దతుగా లోక్సభ స్పీకర్కు రెబల్ ఎంపీలు సమర్పించిన లేఖలో ఆమె కూడా సంతకం చేసినట్టు తెలియడంతో కలకలం రేగింది. దీనిపై గత వారాంతంలో ఢిల్లీలో ఆమె స్పందిస్తూ.. “సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను” అని పేర్కొన్నారు. తాజాగా ఆమెతో పాటు పలువురు రెబల్ ఎంపీలతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో తామంతా విలీనమైనట్లు ప్రకటిస్తూ పార్లమెంట్లో ప్రత్యేక గ్రూప్గా గుర్తింపు ఇవ్వాలని కోరారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి సయోనీ ఘోష్ను తొలగించి, ఆమె స్థానంలో అర్నాబ్ బెనర్జీ (Arnab Banerjee)ని మమత నియమించారు.చదవండి: తాను రాఘవ్ చద్దాను కాదంటూనే.. ఝలక్!సయోనీ రాజకీయ ప్రస్థానం2021 అసెంబ్లీ ఎన్నికల ముందు సయోనీ ఘోష్ అధికారికంగా టీఎంసీలో చేరారు. అంతకుముందు ఆమె బీజేపీపై విమర్శలు చేస్తూ వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదే ఏడాది ఆసన్సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆమె ఎన్నికల ప్రచారంలో చూపిన చురుకుదనం టీఎంసీ అధిష్ఠానాన్ని ఆకట్టుకుంది. ఎన్నికల అనంతరం అభిషేక్ బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగిస్తూ జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ యువ నాయకురాలిగా సయోనీ వేగంగా ఎదిగారు. ప్రస్తుతం జాదవ్పూర్ లోక్సభ నియోజవర్గానికి ప్రాతినిథ్యవం వహిస్తున్నారు. -
వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది
'పెద్ది' సినిమాకు బోలెడంత హైప్ రావడానికి, అలానే చిన్నపాటి వివాదానికి 'చికిరి చికిరి' సాంగ్ ఎంతలా కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు నెలల క్రితం దీని లిరికల్ వీడియో రిలీజైనప్పుడు వెంటనే శ్రోతలకు నచ్చేసింది. అదే టైంలో 'సరకు సామాను' అనే లిరిక్స్పై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసి థియేటర్లో కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. చిరు, రామ్ చరణ్ ఘనత)'సరకు సామాను' అని ఉన్న చోట 'సొగసు సింగారం' అని మార్చారు. ఇకపోతే మూవీలో జాన్వీ కపూర్ పాత్ర, అందచందాలని చూపించిన తీరుపైన చాలానే విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు.. క్షమాపణ కూడా చెప్పాడు. అలానే సదరు సన్నివేశాల్ని కూడా తొలగిస్తామని పేర్కొన్నాడు. బుధవారం నుంచి ఇందుకు సంబంధించిన కొత్త వెర్షన్స్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇంతలోనే చికిరి చికిరి పూర్తి వీడియోని యూట్యూబ్లో విడుదల చేశారు. ఇకపోతే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో తెగ కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనిపించలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట) -
పర్మినెంట్ రెసిడెంట్ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం
అమెరికా ఆంక్షలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు మరో షాక్ తగిలింది. కెనడాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పీఆర్ కార్డ్) పొందాలనుకునే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి మానిటోబా ప్రావిన్స్ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ల కోసం ఉన్న ఒక కీలకమైన వలస మార్గాన్ని మూసివేసింది. మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్పీ)ని, అంతర్జాతీయ విద్యా విభాగం (ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్) కింద ఉన్న కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే (సీఈపీ)ని తక్షణమే రద్దు చేసింది. చదువు పూర్తైన విద్యార్థులు నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు ఇప్పటివరకు ఎంతో సులభంగా ఉపయోగపడుతున్న ఒక కీలకమైన ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఆ ప్రావిన్స్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు జూన్ 11న సంచలన ప్రకటన చేసింది. ఇలా చేసిన మొట్టమొదటి కెనడియన్ ప్రావిన్స్ మానిటోబానే. దీంతో ఉత్తర అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం స్టూడెంట్ వీసా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్న భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విస్తీర్ణం పరంగా కెనడాలో అతిపెద్ద ఆరో ప్రావిన్స్ మానిటోబా, భారతదేశంతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రోజురోజుకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. దీని రాజధాని విన్నిపెగ్లో, టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉంటుంది, అదే సమయంలో చక్కటి ప్రభుత్వ యూనివర్శిటీలు యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్ఆర్సి పాలిటెక్ వంటి సంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు పీఆర్ చాలా త్వరంగా, సులువుగా వస్తుందనే కారణంతో వేలాది మంది తెలుగువారితో పాటు 80కి పైగా దేశాల నుండి దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇటే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థుల వాటా గణనీయంగా ఉంది. 2021లో, 5,240 మంది భారతీయులు స్టడీ పర్మిట్ హోల్డర్లు న్నారు.మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (MPNP) ప్రకారం మానిటోబా ప్రావిన్స్లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం ఏడాది పాటు చదివి, చదువు పూర్తి కాగానే తమ రంగానికి సంబంధించిన ఒక అర్హత కలిగిన ఉద్యోగ ఆఫర్ సంపాదిస్తే చాలు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా పీఆర్కు దరఖాస్తు చేసుకునే లీగల్ అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుండి కెనడా వెళ్లి అక్కడ వన్-ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీఆర్ సాధించి ప్రయోజనం పొందేవారు. ప్రస్తుతం ఈ విండోను పూర్తిగా మూసివేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవంభారతదేశం నుండి 5,485 మంది కొత్త శాశ్వత నివాసితులు న్నారు. ఇది మొత్తం ప్రవేశాలలో 33.1శాతం., CEP కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల ఈ భారతీయ విద్యార్థులు ప్రభావితమవుతారు. వీరు శాశ్వత నివాసం కోసం విద్యా అర్హతల కంటే పని అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ కార్యక్రమాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!రద్దయిన సీఈపీ ప్రకారం, దరఖాస్తుదారులు మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల స్టడీ ప్రోగ్రామ్ను పూర్తి చేసి ఉండాలి. కనీసం కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్మార్క్ (CLB) 7 స్థాయి భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రావిన్సులో తమ దీర్ఘకాలిక వృత్తి అవకాశాలను వివరిస్తూ ఒక కెరీర్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్ను కూడా సమర్పించాల్సి ఉండేది , కొన్ని సందర్భాల్లో, తమ వద్ద తగినంత స్థిరపడే నిధులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉండేది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?కానీ మారిన నియమాల ప్రకారం మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, జాబ్ హిస్టరీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత కలిగిన పూర్తికాల, దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్ను స్వీకరించడానికి ముందు, ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ (Skilled Worker in Manitoba) ప్రోగ్రామ్ ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల నిరంతర పూర్తికాల పనిని పూర్తి చేయాలి. ఆ అనుభవ పత్రాలను సమర్పిస్తేనే పీఆర్ నామినేషన్కు అర్హత సాధిస్తారు. అయితే దీనికి ప్రత్యేక విద్యా అర్హత అవసరం లేదు. బదులుగా, భాషా అవసరాలు వృత్తి డిమాండ్లకు, మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల దరఖాస్తు దారుడి సామర్థ్యానికి ముడిపడి ఉంటాయి. అలాగే ఒక సెటిల్మెంట్ ప్లాన్ను సమర్పించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ షరతులేదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి ద్వారా లేదా పూర్తికాలం చదువుతున్నప్పుడు పొందిన వర్క్ ఎక్స్పీరియన్స్ను పరిగణనలోకి తీసుకోరు. ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి! -
‘కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడింది’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనలో కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో పనిచేస్తుందని విమర్శించారు. ఏపీ విభజనలో వారసత్వపు ఆస్తుల వివాదాలు ఇంకా అలానే ఉన్నాయని, తెలంగాణలో తన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. 12 ఏళ్లు అయినా ఇప్పటికీ తెలంగాణ అమరులను గుర్తించలేదన్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు( సోమవారం, జూన్ 15వ తేదీ) పవన్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ ధ్వజమెత్తారు. ‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. -
రెచ్చిపోతున్న కాల్ మనీ కీచకులు.. రూ.5కోట్లకు వడ్డీ రూ.25కోట్లు
సాక్షి,కృష్ణ: విజయవాడలో కాల్మనీ ఆగడాలు కొనసాగుతున్నాయి.రూ.5 కోట్లు ఇచ్చి రూ.21 కోట్లు వడ్డీ కట్టించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. మరో రూ.5 కోట్లు కట్టాలంటూ వ్యాపారికి కాల్మనీ ముఠా బెదిరింపులకు దిగింది. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు.దీంతో తన న్యాయం చేయాలని బాధితురాలు హోంమంత్రి అనితను కలిశారు. తనపై కాల్మనీ ముఠా దాడి చేసిందని ఆరోపించారు. ప్రామిసరీ నోట్పై సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాల్మనీ వ్యాపారులు వెనిగళ్ల హర్షవర్ధన్, హరినాథ్లకు..టీడీపీ పెద్దల అండదండలున్నాయని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, దేవినేని చందు అండతో కాల్మనీ ముఠా రెచ్చిపోతుందని బాధితురాలు పోయారు. -
కోల్కతాలో కామెడీ క్లైమాక్స్.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు వర్గానికి చెందిన ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కుమారుడు బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తీసుకున్న ఓ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి తాను అందుకున్న అన్ని కానుకలను తిరిగి ఇస్తానని బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్లో తెలిపారు. రెండేళ్ల క్రితం తన పెళ్లి సందర్భంగా తన భార్యకు మమతా బెనర్జీ ఇచ్చిన బంగారు హారం, దుర్గాపూజ సమయంలో తనకు ఇచ్చిన పంజాబీ-పైజామా దుస్తులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీసింది.ఇది తన మనస్సాక్షికి సంబంధించిన విషయం అని బైద్యనాథ్ ఘోష్ చెప్పారు. "ఆ ఆప్యాయతకు నేను కృతజ్ఞుడిని. అయితే ఇటీవలి పరిణామాల దృష్ట్యా, నా మనస్సాక్షి చెప్పింది విని ఈ కానుకలను తిరిగి ఇవ్వడం సముచితమని భావిస్తున్నాను" అని పోస్టులో బైద్యనాథ్ ఘోష్ పేర్కొన్నారు."ఆ హారం బ్యాంకు లాకర్లో ఉంది. గత రెండేళ్లలో ఆ బంగారు హారం విలువపై వచ్చిన వడ్డీకి సమానమైన మొత్తాన్ని జత చేసి ఈ కానుకలన్నీ తిరిగి ఇస్తాను. వీలైనంత త్వరగా వాటిని ఆమె కాళీఘాట్ నివాసానికి పంపిస్తాను" అని తర్వాత మీడియాతోనూ చెప్పారు.మమతతో పాటు సౌగత రాయ్, కల్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, సోనాలి గుహ సహా కొందరు టీఎంసీ నేతలు తనపై, తన కుటుంబంపై పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని బైద్యనాథ్ ఆరోపించారు. తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల విషయంలో మమత, టీఎంసీకి చెందిన పలువురు సీనియర్ నేతలను బహిరంగ క్షమాపణ కోరుతూ న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.ఈ వివాదంపై స్పందించిన సౌగత మాట్లాడుతూ.. "కాకోలి కుమారుడు చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపిల్లల తరహాలో ఉన్నాయి, ఆధారరహితమైనవి. మమతా బెనర్జీకి కానుకలు తిరిగి ఇవ్వాలన్న అతని నిర్ణయం హాస్యాస్పదం. నాకు ఏదైనా న్యాయపరంగా నోటీసు వస్తే, తగిన విధంగా స్పందిస్తాను" అని అన్నారు.బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్లో చేసిన పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. కానుకలు తిరిగి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టైమింగ్పై ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు ఈ చర్యను హాస్యాస్పదంమని పేర్కొనగా, మరికొందరు ఇది రాజకీయ ప్రేరణతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. బైద్యనాథ్పై చాలామంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.I am returning the gold necklace gifted to my wife at our wedding and the kurta-pyjama gifted to me during Durga Puja by @MamataOfficial.I remain grateful for the gesture, but in view of recent events and as a matter of personal conscience , appropriate to return these gifts.— Dr Baidyanath Ghosh (@DrBaidyanathGh1) June 14, 2026Stupidity at its peak.... Showing off to people that u r returning the gifts, what's the use of it .... Tell ur mother to return the MP seat also.... But at that ur morality will doom.... Ur family gained soooo many things in all those years & u r acting here.... Have some shame— Dr Madzzz (@DrMadzz0708) June 15, 2026Are you also returning all those cut money collected during her tenure as the MP ? just curious to know— Fish Oil (@machertel) June 14, 2026 -
భారత్లో మరో టెస్లా కారు.. డెలివరీ షురూ!
టెస్లా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది.మోడల్ YLలో 16-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. ఇది 250 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 288 కి.మీ వరకు ప్రయాణించగల ఛార్జింగ్ పొందగలరు. -
బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాల వృద్ధికి రూ.10 కోట్ల విరాళం
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.కట్టుదిట్టమైన భద్రతఉదయం 10:00 గంటలకు ముఖేష్ అంబానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బద్రీనాథ్ హెలిప్యాడ్కు చేరుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ దాదాపు 20 నిమిషాల పాటు బద్రి విశాల్ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10 నిమిషాల పాటు సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.కమిటీతో భేటీ - విరాళంపూజా కార్యక్రమాల అనంతరం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పుణ్యక్షేత్రాల మౌలిక వసతులు, అభివృద్ధి, నిర్వహణ పనుల నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం 10:40 గంటలకు బద్రీనాథ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:15 గంటలకు కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.జై శ్రీరామ్ నినాదాలతో..కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి
జైపూర్ : కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్పై దాడి చేసిన వారిని పట్టుకుని.. కాక్రోచ్ కార్యకర్తలు చితక బాదారు. సీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) జైపూర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పరీక్ష పత్రికా లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు జైపూర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే హాజరయ్యారు. దీంతో పార్టీ మద్దతుదారులు ఆయనను భూజాలపై ఎత్తుకొని ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం జరిగింది. కాగా నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో జైపూర్లో నిర్వహించిన నిరసనల్లో ఆయనపై దాడి జరిగింది.కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. ये तो नहीं होना चाहिए था...कॉकरोच पार्टी के संस्थापक के जयपुर में पड़ा थप्पड़! @abhijeet_dipke@CJP_2029 @CJP_for_India pic.twitter.com/WEYa73Wijd— Deepak kumawat (@Danny_deepz) June 15, 2026 -
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్తో ఏకైక టెస్టు ఆడింది శుబ్మన్ గిల్ సేన. ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్తో టెస్టు మ్యాచ్లో గుర్నూర్ బ్రార్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. -
థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..
సోలోగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవ్వరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అలాంటిది ఒక పనిమనిసి దేవం కానీ దేశంలో సోలోగా పర్యటించింది, రికార్డు చేసి తన ట్రావెల్వ్లాగ్లో షేర్ చేసింది. అది నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టడమే కాదు..అక్కా మొట్టమొదటి వ్లాగ్ సూపర్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆమె ఏ దేశం వెళ్లింది..అక్కడ ఎలా తనను తాను పరిచయం చేసుకుందంటే..ఆ వీడియోలో ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అనీష్ భగత్ వద్ద పనిచేసే రేష్మా అతనితో కలిసి థాయ్లాండ్కు ప్రయాణించడం కనిపిస్తుంది. తన తొలి అనుభవాలను చిత్రీకరించి ట్రావెల్ వ్లాగ్లో షేర్ చేసిది. ఇదే తొలి ట్రావెల్ వ్లాగ్ వీడియో అని తెలిపింది. తాను ఒక పనిమనిషిగా మగతోడు లేకుండా భారతదేశం దాటి బయటకు రావడం ఇదే మొదటసారి అని వీడియోలో పేర్కొంది. తాను అనీష్ సోదరుడుతో కలిసి థాయ్లాండ్ చేరుకున్న తర్వాత ఒంటరిగా ఒకరోజంతా గడపమని చెప్పినట్లు తెలిపింది. అలాగే తన తొలి వాగ్లో, అనీష్ తనకు ఆసక్తి ఉన్న పనులు చేయమని అడిగాడని రేష్మా పంచుకుంది. అయితే తనకు దేనిపై ఆసక్తి ఉందో ఎప్పుడు ఆలోచించలేదు, పైగా అంత తీరిక కూడా దొరకలేదని చెప్పింది. అయితే తాను కేవలం పనమ్మాయినని, తనకు ఇక్కడ భాష రాదు, అలాగే చదవడం రాదని చెప్పింది. కానీ వంట చేయడం వచ్చు. అందుకే స్నేహితులను చేసుకునేందుకు బొబ్బట్లు చేసుకుని వెళ్లినట్లు తెలిపింది. అక్కడ ఎలా స్పెండ్ చేసిందంటే..రేష్మా తనకు ఇష్టమైన చీర కట్టుకుని ఒంటరిగా థాయ్లాండ్ను అన్వేషించడానికి బయలుదేరడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశంలో కొత్త స్నేహితులను చేసుకోవడానికి ఆమె బొబ్బట్లతో నిండిన టిఫిన్ బాక్స్ను తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అందమైన ఆలయానికి చేరుకుని ఒక జర్మన్ వ్యక్తిని కలిసి బొబ్బట్లు ఇచ్చి స్నేహితుడిని చేసుకుంటుంది. ఆ తర్వాత రేష్మా ఒక 7-ఎలెవెన్ను సందర్శించింది, అక్కడ ఆమెకు పోపో అనే మహిళా ఇన్ఫ్లుయెన్సర్ పరిచయమైంది. ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఇద్దరూ వెళ్లే దారిలో కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం ఆస్వాదించారు. ఆ తదనంతరం ఆమె ఇలా పేర్కొంది. బాధ్యతల కారణంగా మన ఆడవాళ్ళం తరచుగా మన గురించి మనం ఎందుకు మరచిపోతామో నాకు తెలియదు.సినిమాల్లో లాగా ఒక పుస్తకం చదువుతూ, ఒక గిన్నెడు మామిడి స్టిక్కీ రైస్ తింటూ ఆమె ఆ రోజును ముగించింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె తనలో తాను, “రేష్మా, నీ గురించి నాకు గర్వంగా ఉంది,” అని అనుకోవడం చూడొచ్చు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ, స్పందన రావడమే గాక, ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత హృద్యమైన ట్రావెల్ వ్లాగ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) (చదవండి: నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడితే..నేడు అందరూ మెచ్చే చెఫ్గా..!) -
టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. తండ్రి, తనయుల ఘనత..!
రామ్ చరణ్ పెద్ది మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల రాబట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా ఘనత సాధించింది.తండ్రి, తనయుల అరుదైన రికార్డ్..అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సైతం బాక్సాఫీస్ వద్ద నిలిచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓకే ఏడాది తండ్రి, తనయులు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్ల సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Peddi grosses over 393 CRORES WORLDWIDE IN 11 DAYS 🔥🔥Running successfully all over in its second week 💥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/bayNZVZzB3— PEDDI (@PeddiMovieOffl) June 15, 2026 -
64 శాతం భారీ లోటు : విస్తృత వర్షాలెక్కడ? షాకింగ్ అంచనాలు
దక్షిణ, మధ్య ప్రాంతాల్లోకి ఇటీవల రుతుపవనాలు విస్తరించినప్పటికీ, దేశంలోని చాలా ప్రాంతాలలో అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదు. మురిపించినట్టే మురిపించిన మేఘాలు తగినతంగానే వర్షించకుండానేమాయమైపోతున్నాయి. ఇదే విషయాన్ని ఉపగ్రహ చిత్రాలుకూడా వెల్లడిస్తున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాలు ఎందుకు దోబూచులాడుతున్నాయనే ఆందోళన నెలకొంది. ఐఎండి (IMD) గణాంకాల ప్రకారం, జూన్ 4 నుండి జూన్ 15 మధ్య సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి బదులుగా కేవలం 19.2 మి.మీ. మాత్రమే నమోదైంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షపాతంలో 64 శాతం లోటు ఏర్పడింది. అంటే భారతదేశ నైరుతి రుతుపవనాలు దాదాపుగా అదృశ్యమైనట్లు కనిపిస్తోంది. శాటిలైట్ అండ్ ఐఎండి (IMD) డేటా ప్రకారం, భారతదేశంలోని చాలా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. ఈ వారం చివర్లో వర్షపాతం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, ఎగువ వాతావరణంలోని గాలుల కారణంగా రుతుపవనాల కార్యకలాపాలు గణనీయంగా నిలిచిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ 14 , 15 తేదీలలో తీసిన INSAT-3DS ఉపగ్రహ చిత్రాలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. నైరుతి రుతుపవనాలు కరుణించకపోవడంతో అటు రైతులు, ఇటు సామాన్యులు ఆకాశం వైపు చూస్తూన్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, వర్షం ఎందుకు కురవడం లేదు? అనే మీమాంసలో పడిపోయారు. భారీ వర్షపాత లోటుజూన్ 4 నుండి జూన్ 15 మధ్య కాలంలో సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి గానూ దేశంలో కేవలం 19.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏకంగా 64శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఐఎండీ (IMD) మ్యాప్ ప్రకారం మధ్య, దక్షిణ , తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందంటున్నారు.ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!సాధారణంగా రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నప్పుడు దేశమంతటా దట్టమైన మేఘాలు వ్యాపించి ఉంటాయి. కానీ జూన్ 15 నాటి INSAT-3DS ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ద్వీపకల్ప (పెనిన్సులర్), మధ్య భారతదేశ ఆకాశం అసాధారణంగా నిర్మలంగా కనిపిస్తోంది. మేఘాల కదలికలు కేవలం హిమాలయాలు, ఈశాన్య భారత్, ఇండో-గంగా మైదానాల ఉత్తర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అరేబియా సముద్రం వైపు రుతుపవన శాఖ బలహీనపడింది. ఇటీవలి రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగినప్పటికీ ఈ మందగమనం చోటుచేసుకుంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సమస్య చుట్టుపక్కల సముద్రాలపై తేమ కొరత వల్ల కాదు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల పైన జరుగుతున్న ఒక పెద్ద వాతావరణ సంఘర్షణ వల్ల ఏర్పడింది.ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి!రుతుపవనాలు మందగమనానికి కారణాలుసముద్రాలలో తగినంత తేమ ఉన్నప్పటికీ, వాతావరణంలో ఎగువ పొరల్లో జరుగుతున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రుతుపవనాల సమయంలో ఇది ఉత్తరానికి వెళ్లాల్సి ఉండగా, ఈసారి అసాధారణంగా దక్షిణం వైపునకు మరలిపోతున్నాయి. ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ పై ప్రభావమే కారణమా? ఈ బలమైన పశ్చిమ గాలులు (Westerlies), రుతుపవనాలకు ఇంజిన్లా పనిచేసే తూర్పు గాలుల (Easterlies) మెకానిజంను అణచివేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమ ఉన్నప్పటికీ, మేఘాలు ఏర్పడటానికి మరియు వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు లభించడం లేదు. అయితే వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఈ వారం చివర్లో జెట్ స్ట్రీమ్ సరళి బలహీనపడి, రుతుపవన వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అప్పటి వరకు, నైరుతి రుతుపవనాలిచ్చే విస్తృత వర్షాల కోసం భారతదేశంలోని చాలా ప్రాంతాలు వేచి ఉండవలసిందే.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా? -
బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు
హైదరాబాద్: బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి సీతక్క సమక్షంలో ప్రభుత్వం, తరుణి సంస్థ మధ్య ఎంఓయూ కుదిరింది. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ‘‘బాల్య వివాహం-బతుకు ఆగం’’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనుంది ప్రభుత్వం.సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ‘‘బాల్య వివాహం కుటుంబ సమస్య మాత్రమే కాదు.. సామాజిక సమస్య. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాల్య వివాహాల వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతుంది. బాల్య వివాహాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. బాలికల ఆర్థిక స్వావలంబనపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని మరింత విస్తరిస్తాం. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. బాలికలకు హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పిస్తాం. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందిస్తాం. బాల్య వివాహాల దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే వాతావరణం కల్పించాలి. బాల్య వివాహాలకు ముగింపు పలకడానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు. -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990ల్లో ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్కి దర్శకుడు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశాల ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాసించే జనన రేట్లు ఊహించని విధంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల్లోని ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పౌరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అపర కుబేరులలాగా నగదు పంపిణీలు, పన్ను మినహాయింపులు, ఉచిత గృహ వసతి, భారీ కుటుంబ ప్రయోజనాలతో పాటు భావోద్వేగ విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ, ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు నానాటికీ దిగజారుతూనే ఉంది.ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రపంచ అనుభవాల నుంచి రేపటి మేటి శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలి? అనే అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.బేబీ బోనస్ ప్రయోగం: చేతులెత్తేసిన దేశాలుపడిపోతున్న జనన రేట్లను తిప్పికొట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి దక్షిణ కొరియా ఒక ఉదాహరణ. 2006లో తక్కువ సంతానోత్పత్తి నివారణకు ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశం నగదు ప్రోత్సాహకాలు, ఉచిత పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి చికిత్స రాయితీలు, తల్లిదండ్రుల సెలవులు, గృహ సహాయం వంటివాటి కోసం ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినా ఫలితం ఏంటి? 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయి 0.72 కి పడిపోయింది. 2024లో 0.75, 2025లో 0.8 గా ఇది స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా స్థిరమైన జనాభాకు అవసరమైన భర్తీ రేటు అయిన 2.1 కంటే ఇది ఎంతో దూరంలో ఉంది.ఇతర దేశాలు ఇలా..ఇదే బాటలో నడిచిన సింగపూర్ 2001లో ‘బేబీ బోనస్’ పథకాన్ని తెచ్చింది. పదేపదే రాయితీలు పెంచినా అక్కడా జననాల రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలోనే ఉంది. జపాన్, చైనా, హంగేరీ, రష్యా, పోలాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత మార్పును సాధించలేకపోయాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం కొంతవరకు మాత్రమే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, పిల్లలను కనడం అనేది కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని ఈ దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి.డబ్బు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు?ప్రభుత్వాల ఆలోచన ప్రకారం.. పిల్లల పెంపకం ఖరీదైనది, కాబట్టి నగదు ఇస్తే ప్రజలు పిల్లలను కంటారు. కానీ నిజ జీవితంలో ఈ తర్కం పనిచేయడం లేదు. ‘సంతానోత్పత్తి నిర్ణయాలు అనేవి వన్-టైమ్ ఫైనాన్షియల్ లావాదేవీలు కావు. పిల్లలను కలిగి ఉండటం అనేది గృహనిర్మాణం, ఉపాధి భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక సామర్థ్యాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక బేబీ బోనస్లు తల్లిదండ్రులు ఎదుర్కొనే వ్యవస్థాగత ఒత్తిళ్లను దూరం చేయలేవు’ అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు.నిజమైన ఖర్చులు ఇవే..పరిశోధకుల ప్రకారం.. సమస్య ప్రసవానికి అయ్యే ఖర్చు కాదు, ఒక కుటుంబాన్ని సగర్వంగా సమాజంలో నిలబెట్టడానికి అయ్యే విస్తృత సామాజిక-ఆర్థిక ఖర్చులు.పెరుగుతున్న గృహాల ధరలుకుటుంబం ఏర్పడటానికి ప్రధాన అడ్డంకి గృహ స్థోమత. UNFPA (ఐక్యరాజ్యసమితి జనాభా నిధి) 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 19% మంది తమకు కావలసిన సంఖ్యలో పిల్లలు లేకపోవడానికి గృహ సంబంధిత సమస్యలే కారణమని తేల్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మార్చి 2025 నివేదిక సైతం దక్షిణ కొరియా, చైనా (బీజింగ్, షాంఘై), సింగపూర్ల్లో విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు యువత పెళ్లిళ్లను వాయిదా వేయడానికి, తక్కువ సంతానోత్పత్తికి దారితీస్తున్నాయని స్పష్టం చేసింది.ఆలస్యమవుతున్న వివాహాలుఆసియా సంస్కృతిలో ప్రసవం అనేది వివాహ బంధంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం యువత ఉన్నత విద్య, స్థిరమైన కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వివాహ వయస్సు పెరుగుతోంది. వివాహ రేట్లు పడిపోతున్నాయి. తక్కువ వివాహాలు అంటే తక్కువ జననాలే కదా!ఆధునిక మహిళ - పని వాతావరణంనేటి మహిళలు విద్యావంతులు, ఆర్థిక స్వతంత్రులు. వారు తమ ఆకాంక్షలను త్యాగం చేయాల్సి వచ్చే కుటుంబ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. ‘కార్యాలయాల్లో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు పిల్లల పెంపకం భారం మహిళలపైనే పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చాలామంది మహిళలు పిల్లలను వద్దు అనుకుంటున్నారు’ అని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్ అన్నారు.ఇంటెన్సివ్ పేరెంటింగ్నేటి కాలంలో పిల్లల సంఖ్య కంటే, ఉన్న ఒక్క బిడ్డకు బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ధోరణి పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడం, పోటీ ప్రపంచంలో సీట్ల కోసం పడే పాట్లు చూసి ఇద్దరు పిల్లల కంటే ఒకరికే పరిమితమవుతున్నారు లేదా పేరెంట్హుడ్ను పూర్తిగా వాయిదా వేస్తున్నారు.గ్లోబల్ సర్వే ఏం చెబుతోంది? (UNFPA 2025 డేటా)యంగ్ జనరేషన్ కేవలం పిల్లల కోసం కాకుండా కెరీర్ గ్రోత్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. వారు ఆశించే కుటుంబ పరిమాణాన్ని అడ్డుకుంటున్న కారకాలను కింది పట్టిక వివరిస్తుంది.అడ్డంకులు/కారణాలుశాతం (%)ఆర్థిక పరిమితులు39%ఉద్యోగ అభద్రత21%గృహ సమస్యలు19%సరిపోని పిల్లల సంరక్షణ సదుపాయాలు12%మనం నేర్చుకోవాల్సిన పాఠాలుభారతదేశం ప్రస్తుతం తూర్పు ఆసియా తరహా తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కోవడం లేదు కానీ, మన దేశ సంతానోత్పత్తి సరళి వేగంగా మారుతోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-6 (2023-24) నివేదిక ప్రకారం..భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 2.0 గా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 సర్వే ప్రకారం.. దేశ జాతీయ టీఎఫ్ఆర్ 1.9 కు పడిపోయింది.1960లలో ఒక భారతీయ మహిళకు సగటున ఆరుగురు పిల్లలు ఉండగా నేడు విద్యా ప్రమాణాలు పెరగడం, గర్భనిరోధక సాధనాల లభ్యత వల్ల కుటుంబాలు చిన్నవయ్యాయి. అయితే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోయి వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుంటే, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జనన రేట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్ ఏం చేయాలి?సంతానోత్పత్తి తగ్గడాన్ని ఒక సంక్షోభంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం కంటే సరసమైన చైల్డ్ కేర్, మెరుగైన ప్రసూతి/పితృత్వ సెలవులు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఇంకా వివాహ బంధ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే వంధ్యత్వం (Infertility), గృహాల ధరలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారుతున్నాయి. సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విధానాలు రూపొందించాలి.ఇదీ చదవండి: మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం -
భారీ వర్షం.. పిడుగులు.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (సోమవారం) పలు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ నేపథ్యంలో పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్డ్ , అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచే అవకాశం ఉందని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెట్లకింద, పలు హోర్డింగుల దగ్గర నిల్చోకూడదని తెలిపింది. -
‘చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది’
తాడేపల్లి : రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. దీనిపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శైలజానాథ్. ఈరోజు(సోమవారం, జూన్ 15వ తేదీ) రాయలసీమ లిఫ్టు నిలిపివేతపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నేతలు సమావేశమయ్యారు. దీనికి సాకే శైలజానాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్వరలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపునకు దిగారు. దీనిపై రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం. తొలుత అనంతపురం, నెల్లూరు జిల్లాలో తొలుత పర్యటిస్తాం. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం. మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. కృష్ణా, తుంగభద్ర మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారుతోంది. చంద్రబాబు తక్షణం స్పందించాలి.వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్టును ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని ఆపేశారు. రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను పనంగా పెట్టారు. ఏపీ హక్కులను కాలరాశారు. అదేమంటే బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే రాయలసీమ లిఫ్టును పూర్తి చేయకుండా బనకచర్ల అంటారెందుకు?, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక పడిన ప్రాంతాల కన్నీటితో రాజధానిని కడతారా?, రాజధానిలో జరుగుతున్న అవినీతికి అడ్డూ అదుపు లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలకంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయటం వెనుక భారీ అవినీతి ఉంది. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టినా మావిగన్, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేదే లేదు’ అని ధ్వజమెత్తారు. -
కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!
డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియా పిల్లల జీవితాల్లో కీలక భాగంగా మారింది. అయితే, దీని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్ స్టార్మర్ (Keir Starmer) నేతృత్వంలోని యూకే ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా సైట్లను నిషేధిస్తానని, గేమింగ్, లైవ్స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లపై పరిమితులు విధిస్తానని నిర్ణయించింది. పిల్లల సంక్షేమాన్ని కాపాడటానికి కఠిన చర్యలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల సంవత్సరాలలో టెక్నాలజీ కంపెనీలపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వయస్సు నిర్ధారణ వ్యవస్థలు, అల్గారిథమ్లలో మార్పులు, అనుచిత చిత్రాలను పంచుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కంపెనీలను ఆదేశించింది. అయితే.. ఇప్పుడు కేవలం నియంత్రణలతో సరిపోదని భావించిన ప్రభుత్వం, పూర్తి నిషేధం వైపు అడుగులు వేస్తోంది.బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రేలియాను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. గత ఏడాది ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్) వినియోగాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచింది.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువతతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు.. రాత్రి సమయాల్లో వినియోగ పరిమితులు, యాప్లకు సమయ పరిమితులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే డిజైన్ ఫీచర్లపై ఆంక్షలు వంటి అంశాలను పరిశీలించింది.ఈ సంప్రదింపుల్లో లక్షకు పైగా స్పందనలు వచ్చాయి. అందులో 83 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు.. ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 90 శాతం మంది సోషల్ మీడియా వాడేందుకు కనీస వయస్సు 16 సంవత్సరాలు ఉండాలని మద్దతు తెలిపారు.అయితే.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు కేవలం నిషేధం విధించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అంటున్నారు. పిల్లలకు డిజిటల్ అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంపై విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: క్యాష్ ఈజ్ ట్రాష్.. పెట్టుబడిదారులకు కియోసాకి హెచ్చరిక! -
ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి?
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ.. చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.10,200 కొత్త కోర్సులు పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది. అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి. అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30%కి పైగా మార్పులు చోటుచేసుకున్నాయి.ఈ విభాగాల్లో కోర్సులు ఔట్ ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి. చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ విభాగాలను కాలం చెల్లినవిగా భావిస్తున్నారు.ఇక కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు చైనా ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు, 9 విశ్వవిద్యాలయాలు "ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్"ని ప్రారంభించాయి. ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక యంత్రాలు లేదా రోబోట్లు పరిసరాలను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే కృత్రిమ మేధ విధానం.పనికిరాని కోర్సులు ఎందుకు? తదుపరి తరం కృత్రిమ మేధను వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వేగంగా కలపాలనే జాతీయ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా మారిపోతుండటంతో విశ్వవిద్యాలయాలపై మార్పులు చేపట్టాలనే ఒత్తిడి పెరిగింది. పట్టభద్రుల సంఖ్య రికార్డు స్థాయికి చేరినా, చాలామందికి వారి డిగ్రీలు ఉద్యోగాలు సంపాదించటంలో పెద్దగా ఉపయోగపడటం లేదు.ఉదాహరణకు, షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది తన ఉత్పత్తి రూపకల్పన కోర్సులో ప్రవేశాలను నిలిపివేసింది. ఆ కోర్సు వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ఒక కారణం. మోడలింగ్, రెండరింగ్ వంటి అనేక ప్రధాన పనులను ఇప్పుడు కృత్రిమ మేధే నిర్వహిస్తోంది.మాధ్యమ విద్యపై దృష్టి సారించిన బీజింగ్లోని ప్రతిష్ఠాత్మక కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా కూడా పలు కోర్సులను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సినిమాటోగ్రఫీ కోర్సును ఫిల్మ్ అండ్ టెలివిజన్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ కోర్సుతో విలీనం చేసింది.పూర్వ విద్యార్థులు ఏమంటున్నారు? ఈ మార్పు సాంకేతిక, మార్కెట్ పరిణామాలకు సహజ ప్రతిస్పందన అని విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 2012లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వీడియోగ్రాఫర్ సాంగ్ సాంగ్ మాట్లాడుతూ.. తాను చదివిన కాలంలో ఫిల్మ్ నుంచి డిజిటల్ సాంకేతికత వైపు మార్పు జరిగిందని చెప్పాడు.“ప్రత్యక్ష ప్రసారాలు, చిన్న వీడియోలు పెరగటంతో కెమెరామెన్ నైపుణ్య అవసరాలు సంప్రదాయ టెలివిజన్ వార్తల చిత్రీకరణతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి” అని సాంగ్ అన్నాడు. విద్యలో మార్పులు తప్పనిసరి అని తెలిపాడు.అయితే ఒక కోర్సు స్థానంలో మరో కోర్సును ప్రవేశపెట్టటం తాత్కాలిక పరిష్కారమే అవుతుందని, వేగంగా మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యలో మరిన్ని మార్పులు అవసరమని జాతీయ విద్యా శాస్త్రాల సంస్థ సీనియర్ పరిశోధకుడు చు జావోహుయ్ హెచ్చరించారు.విశ్వవిద్యాలయాలు తొలగించిన అనేక కోర్సులు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని చు పేర్కొన్నారు. అందువల్ల అభివృద్ధి చెందటానికి తగిన సమయం కూడా వాటికి దొరకలేదని తెలిపారు.ఒక ప్రధానాంశం స్థానంలో మరొకటి మార్చటం కన్నా, విద్యార్థులకు తమ కోర్సులను తామే ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చే సౌకర్యవంతమైన విధానాన్ని విశ్వవిద్యాలయాలు అవలంబించాలని చు సూచించారు.“దీంతో విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు, భిన్న వృత్తి మార్గాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకుని, తమకంటూ ప్రత్యేక మేధో స్వరూపాన్ని నిర్మించుకుంటారు” అని చు అన్నారు. ఉద్యోగ విపణి మరింత అనిశ్చితంగా మారుతున్న వేళ చైనాలో చాలామంది అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా చూడటం ప్రారంభించారు. -
చహల్ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు!
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ బ్యాట్తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ‘రికార్డు’ను బద్దలుకొట్టాడు.ఇంతటి పవర్ హిట్టరా? చహల్ ఇంతటి పవర్ హిట్టరా? ఎప్పుడూ అతడి బ్యాటింగ్ చూడలేదే! అంటూ ఆశ్చర్యపోతున్నారా?!.. ఆగండాగండి.. చహల్ శతక్కొట్టింది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నిర్వహించే ఓ యూట్యూబ్ చాలెంజ్ షోలో!..శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే..అవును.. పీటర్సన్ నిర్వహించే ఈ యూట్యూబ్ షోలో ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. డివిలియర్స్ 30 బంతుల్లో శతకం చేయగా.. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇక భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల 25 బంతుల్లో శతక చాలెంజ్ను పూర్తి చేశాడు.తాజాగా చహల్ కూడా ఈ చాలెంజ్ను స్వీకరించాడు. యాభై బంతుల్లో సెంచరీ కొట్టాలని పీటర్సన్ సవాలు చేశాడు. ఇక తొలి బంతి గంటకు 51 మీటర్ల వేగంతో వస్తుందని.. అయితే, ఆ తర్వాత ప్రతీ బంతికి 1 మీటర్ వేగం మేర పెరుగుతుందని పీటర్సన్ షరతు విధించాడు. అంతేకాదు.. చహల్ కోసం బౌండరీని 40 మీటర్లకు కుదించాడు.14 బంతుల్లోనే 50 పరుగులుఈ క్రమంలో మొదటి బంతికే సిక్సర్ బాదిన చహల్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మధ్యలో చాలాసార్లు ఫీల్డర్లు అతడి క్యాచ్ జారవిడవడంతో లైఫ్ పొందిన చహల్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే 50 పరుగులు మార్కు అందుకున్నాడు చహల్.29వ బంతికి సిక్సర్ బాది శతకంఆ తర్వాత కవర్స్ మీదుగా సిక్సర్ బాదే క్రమంలో చహల్ ఫీల్డర్కు దొరికిపోయాడు. అయితే, ఇందుకు ప్రతిగా అతడి స్కోరులో ఐదు పరుగుల కోత విధించిన పీటర్సన్.. తర్వాత ఆటను కొనసాగించాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో 90 పరుగులు పూర్తి చేసుకున్న చహల్.. 29వ బంతికి సిక్సర్ శతక మార్కు అందుకున్నాడు.చహల్ విధ్వంసకర ఇన్నింగ్స్లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక పీటర్సన్ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే షరతు విధించగా.. ఈ స్పిన్ బౌలర్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే.. అంటే 29 బంతుల్లో శతక్కొట్టడం మరో విశేషం. చదవండి: IND vs SL: కొంప ముంచేశాడు! -
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
గ్లోబల్ మార్కెట్లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.ఎఫ్ఏఆర్ పరిధి విస్తరణప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.బ్యాంకులకు ఊరటవిదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్ను తగ్గించడానికి ఆర్బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 3 నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ గల ‘విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్’ (ఎఫ్సీఎన్ఆర్-బీ) డిపాజిట్ల కోసం ఆర్బీఐ స్వాప్ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ యూఎస్ డాలర్ డిపాజిట్లను ఆర్బీఐతో మార్చుకోవచ్చు. తద్వారా మారకపు విలువల్లో వచ్చే కరెన్సీ ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, సెప్టెంబర్ 30 వరకు బాహ్య వాణిజ్య రుణాలను (ఈసీబీ) పెంచుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్! -
టీచర్స్ స్కామ్.. అభిషేక్ బెనర్జీపై ప్రశ్నల వర్షం
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. స్కామ్ నేపథ్యంపశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అక్రమాల కోసం OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని, అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. -
సాయికృష్ణ బతికే ఉన్నాడా?.. లేదంటే చంపేశారా?
సాక్షి,విజయవాడ: నెల రోజుల క్రితం ఆచూకీ గల్లంతయిన గాదె సాయి కృష్ణ కేసుపై ఏపీ హైకోర్టులో ఈవాళ విచారణ జరిగింది. విచారణలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29లోగా బాధితుణ్ని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. నెల రోజుల క్రితం ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో ఆమె న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల (మే)9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.తన సెల్ఫోన్ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశించింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 736.38 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 76,264.33 వద్దఎం నిఫ్టీ 231.00 పాయింట్లు లేదా 0.98 శాతం లాభంతో 23,853.90 వద్ద నిలిచాయి.మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్, ఎక్సీకామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్, గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శార్దూల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎక్సారో టైల్స్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, రవీందర్ హైట్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టెక్నో థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో జరిగే ఓ స్టోరీతో వెబ్ సిరీస్ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈయన కొడుకు వీర్ హిరానీ ఇందులో లీడ్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీసిన ఈ సిరీస్ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వీర్ హిరానీ లీడ్ రోల్ చేయగా.. అర్షద్ వార్షీ, విక్రాంత్ మస్సే, బొమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని పెడ్రో(అర్షద్ వార్సీ) అనే పోలీస్ అధికారి.. ఓ కేసు కారణంగా మంత్రి దెబ్బకు సైబర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. మరోవైపు ప్రీతమ్ అనే కుర్రాడు టెక్నాలజీలో జీనియస్. 15 నిమిషాల్లోనే సెల్టవర్ని హ్యాక్ చేయగలడు. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముతుంటాడు. అయితే పెడ్రో ట్రాన్స్ఫర్కి కారణమైన మంత్రి కొడుకు కిడ్నాప్ అవుతాడు. రూ.23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇదంతా చేసింది పేరు మోసిన మరో హ్యాకర్ అని పెడ్రో, ప్రీతమ్ తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన) -
ఇప్పట్లో అయ్యేలా లేదే.. ఎనిమిదేళ్లయినా లభించని మోక్షం..!
కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ధృవ నక్షత్రం. 2018లో మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. ఇటీవలే జూన్ 15 లోపు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు కూడా చెప్పింది. కానీ అలా జరగలేదు. ఈ సినిమా విడుదలకు మరింత సమయం కావాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలకు అదనంగా 30 రోజులు కావాలని అభ్యర్థించారు. దీంతో ధృవ నక్షత్రం ఇప్పుడే రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లే కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి మరింత టైమ్ కావాలని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ హైకర్ట్ను కోరారు. ఈ మూవీ రిలీజ్కు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జూన్ 15, 2026 లోపు థియేటర్లలోకి తీసుకురావడం తన వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని లావాదేవీలు 'కొండడువోమ్ ఎంటర్టైన్మెంట్' పేరుతో నిర్వహించే ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే జరగాలని.. అలాగే కోర్టు నియమించిన పరిశీలకులు ప్రతి ఆర్థిక లావాదేవీని పర్యవేక్షించాలని గత ఉత్తర్వుల్లో ఆదేశించింది. నిర్ణీత గడువులోగా సినిమాను విడుదల చేయలేకపోతే, అదనపు సమయం కోరే స్వేచ్ఛను కూడా కోర్టు మీనన్కు కల్పించింది.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్తో పాటు రితూ వర్మ, వినాయకన్, ఆర్. పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. 2017లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన అడ్డంకులతో 2023లో షూటింగ్ పూర్తయింది. నవంబర్ 2023లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ను నిలిపివేశారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరింత అదనపు సమయం కోరడంతో రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. -
నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడి.. నేడు అందరూ మెచ్చే చెఫ్గా!
జీవితం ఎప్పుడు అందరికీ ఒకేలాంటి కష్టాలు, సవాళ్లను ఇవ్వదు. ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కొందరికి పెద్దయ్యాక కష్టాలు వెంటాడితే మరికొందరికి పుట్టుకతో కష్టాలు వెంటాడతాయి. అంతేగాదు ఆ దుర్భరమైన జీవితం సాగించలేక కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయ్. అయినా తట్టుకుని నిలబడిన వాడికే మంచిజీవితం లభిస్తుంది, గొప్ప స్థాయికి చేరుకుంటారు అనేందుకు ఈ ఢిల్లీ మహిళ కథే ఉదాహరణ. ఈమె కథ వింటే 'బిచ్చగాడు' మూవీలోని ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడంజానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడంకడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నమనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా అన్న పాట గుర్తొస్తుంది. మరి ఆమె పడ్డ కష్టాలు..ఎలా వాటిని అధిగమించి ఉన్నతస్థాయి చేరుకుందో సవివరంగా చూద్దామా.!.ఆ మహిళే లిలీమా ఖాన్. ఢిల్లీలోని తైమూర్ నగర్కు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఒక సోదరుడు. తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవారు. అయినప్పటికీ..మూడేళ్ల వయసున్న లిలీమా తన తండ్రి ఇరుగుపొరుగు వారి కోసం ప్రేమగా వండే కిచిడీ, రోటీ వంటి సాదాసీదా భోజనం వండటం చూసేది. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితం ఆకస్మికంగా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మొదట 2001లో, లిలీమాకు కేవలం ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి కన్నుమూశారు. ఆరు నెలల తర్వాత, ఆమె తల్లి క్షయ వ్యాధితో మరణించింది. ఆ తర్వాత తన కళ్లముందే అక్క వైవాహిక సమస్యలతో మరణించడం చూసింది. ఈ వరుస కష్టాలు ఆమెను కుంగదీస్తుంటే..మరోవైపు సోదరుడు డ్రగ్స్కి బానిసై దొంగతనాలకు అలవాటుపడటంతో జైలుపాలయ్యాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిపోయింది లిలీమా. అయితే ఆమె అత్త తన తమ్ముడిని చేరదీసింది గానీ ఆమెను మాత్రం దగ్గరకు తీసుకోలేదు. దాంతో అనాధగా మిగిలిన లిలీమాను తైమూర్ నగర్ మురికివాడలకు చెందిన ఒక మహిళ ఆశ్రయం ఇచ్చినా..ఒక పూట భోజనం కోసంతెల్లవారుజామున ఫ్రెండ్స్ కాలనీ వీధుల్లో చెత్త ఏరడానికి ఇతర పిల్లల తోపాటు పంపేది. అక్కడ మాల్స్, మెక్డొనాల్డ్స్ వంటి ప్రాంతాల్లో చెత్తబుట్టల్లో వెతుకుతూ, మిగిలిపోయిన చికెన్ లేదా మటన్ ఎముకలు, సగం తిన్న బర్గర్లను తింటూ గడిపేది. అలా కష్టాలు పడుతున్న లిలీమాను 11 ఏళ్ల వయసులో ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) సహాయం అందించి, చదువు చెప్పించడంతో ఆమె పరిస్థితి మెరుగవ్వడం ప్రారంభమైంది. అయితే కొద్దికాలానికే తిరిగి వచ్చి..తన అత్త, తమ్ముడి వద్దకు వచ్చి..అక్కడే ఉండేందుకు ఇష్టపడింది. అయితే లిలీమా అత్త ఆమెను అక్కడ షుఫ్యాక్టరీలో పనికి పెట్టింది. ఆ వ్యక్తి రాకతో చిగురించిన జీవితం..సరిగా పనిచేయకపోతే అత్త చేతిలో దెబ్బలు తింటూ మళ్లీ కష్టాల కడలిలో చిక్కుకుంది. ఆ తర్వాత ఎన్జీవో కార్యకర్త హర్ష్ మందర్ను సంప్రదించింది. ఆయన కాశ్మీరీ గేట్లోని బాలికల అనాథాశ్రమమైన కిల్కారి రెయిన్బో హోమ్లో చేరడానికి సహాయం చేశారు. అక్కడే ఉన్న సమయంలో లిలీమాకు వంటపై ఆసక్తి కలిగింది. అయితే 2015లో, అనాథాశ్రమానికి తరచుగా వచ్చే ఒక సందర్శకుడు లిలీమా వంట నైపుణ్యాలను గమనించి, ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. అక్కడ సిబ్బందికి భోజనం తయారుచేయడమే లిలీమా ఉద్యోగం. అందుకు రూ. 7000లు జీతం ఇచ్చేవారు. అలా తన వంట నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో అక్కడుండే హెడ్ చెఫ్ వద్ద మ్యాష్డ్ పొటాటోస్ తయారుచేయడం, బర్గర్లు, సలాడ్లను చేయడం వంటి ప్రాథమిక విషయాలను నేర్చుకుంది. 2019లో, లిలీమా 'డియర్ డోనా'లో చెఫ్ డి పార్టీగా చేరి, ఒక్క ఏడాదిలోనే సూస్ చెఫ్గా పదోన్నతి పొందింది. ఇవాళ ఆమె 35 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె తయారు చేసే ప్రత్యేక వంటకాల్లో రిసోటో, రావియోలీ, సాల్మన్ గ్రావ్లాక్స్, రౌలేడ్, బీఫ్ వెల్లింగ్టన్ తదితరాలు ఉన్నాయి. తన అభిరుచినే బలంగా మార్చుకుని ముందుకు సాగి జీవితాన్ని అందంగా మలుచుకుంది. మన నైపుణ్యం, ఆసక్తులే మనల్ని మందుకు నడిపించే ఆస్తులనే లిలీమా కథ చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్గా కరీనా కపూర్! ఏకంగా రూ. 1.3 లక్షల..) -
విరాట్ కోహ్లికి అహంకారం ఎక్కువే!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి గ్రౌండ్లో దిగిన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోతాడు. ప్రత్యర్థి కవ్వింపు చర్యలకు దిగితే వారి శైలిలోనే వారికి సమాధానం చెబుతాడు. స్లెడ్జింగ్కు దిగిన వారికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తాడు.ఇక అదే సమయంలో అంతే సరదాగానూ ఉండటం కోహ్లికే చెల్లింది. అయితే, కొంతమంది మాత్రం విరాట్ కోహ్లి (Virat Kohli)ని అహంకారి అని.. దూకుడు ఎక్కువని.. అతి చేయడం సరికాదంటూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇదే తరహాలో కోహ్లిని విమర్శిస్తూ ఓ పోస్టు ప్రత్యక్షమైంది.అది నిజమే.. విరాట్ కోహ్లి అహంకారిఇందుకు టీమిండియా మాజీ హెడ్కోచ్, కోహ్లితో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. వన్8 చానెల్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘‘అహంకారి.. అతి గారాబం వల్ల చెడిపోయిన అల్లరిపిల్లాడు. దూకుడు.. కోహ్లి గురించి వాళ్లు అన్న ప్రతీ మాట నిజమే. అయితే, ఇదంతా క్రికెట్ మైదానంలో ఉన్నంత వరకే. మైదానం వెలుపల కోహ్లి ఇందుకు పూర్తి విభిన్నం. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’’ అని రవిశాస్త్రి కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు.ప్రత్యేక అనుబంధంకాగా రవిశాస్త్రి హెడ్కోచ్గా.. కోహ్లి కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా మంచి విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో నంబర్ వన్గా నిలిచి సత్తా చాటింది. ఈ ఇద్దరు తర్వాతి కాలంలో తమ తమ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ.. వారి మధ్య అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం నిరూపితమైంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఫైనల్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడు. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. ఇక రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతూ.. తనదైన శైలి వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు.చదవండి: IND vs SL: కొంపముంచేశాడు! -
ఆ సినీనటుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.మహేశ్కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.‘‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. -
ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!
ఐవీఎఫ్ పేరుతో కొంతమంది వైద్యుల ఆగడాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం రేపుతోంది. తమకు పుట్టిన పిల్లల డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో గురుగ్రామ్కు చెందిన దంపతులు లబోదిబో మన్న వైనం వెలుగులోకి వచ్చింది.గురుగ్రామ్కు చెందిన రాహుల్ రాథోడ్, అతని భార్య మీనూ రాథోడ్ సంతానంకోసం గత ఏడాది ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఎంచుకున్నారు. జనవరిలో మీనూ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు తమ పోలికలతో అస్సలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి, పిల్లల డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. టెస్ట్ రిపోర్ట్స్లో వారు షాకయ్యే నిజం తెలియడంతో పిల్లలు పుట్టారన్న సంతోషం కాస్తా పీడకలగా మారిపోయింది. మరొక జంటకు చెందిన పిండాన్ని (embryo) మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఆరోపణపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?दिल्ली में IVF से जन्मे जुड़वां बच्चों का DNA माता-पिता से नहीं हुआ मैच, FIR दर्ज #Delhi | @PallavMishra11 pic.twitter.com/sxyWJZSH5T— NDTV India (@ndtvindia) June 14, 2026ఏం జరిగింది?ద్వారకాలోని ఒక ఆసుపత్రి తమను ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఉన్న ఒక ఇన్ఫెర్టిలిటీ (సంతానలేమి) క్లినిక్కు ఐవీఎఫ్ చికిత్స కోసం పంపిందని, అక్కడ డాక్టర్ శివానీ సచ్దేవ్ ఈ కేసును పర్యవేక్షించారని రాహుల్ రాథోడ్ తెలిపారు. గత ఏడాది జనవరి 9న వైద్యులు ఆ మహిళకు ఐవీఎఫ్ సంబంధిత పరీక్షలు నిర్వహించి, భర్త వీర్యం, అండం ఉపయోగించే పిండాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలా అభివృద్ధి చేశామని చెప్పిన పిండాన్ని మే 14న మీనూ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ట్విన్స్ పోలీకలపై అనుమానంతో టెస్ట్ చేయించారు. చివరికి వారు అనుమానించినట్టుగానే ఆ పిల్లలు బయోలాజికల్గా వారిద్దరికీ పుట్టినవారు కాదని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో తేలింది. దీంతో క్లినిక్ వాళ్లే ఏదో మాయ చేశారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం ఆసుపత్రిలోని ఐవీఎఫ్ రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా, సీసీటీవీ (CCTV) ఫుటేజీలను భద్రపరచాలని ఆయన కోరారు. తమలాగే ఐవీఎఫ్ క్లినిక్ల వల్ల మోసపోయిన పలు దేశాలలోని దంపతులనుండి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ రాథోడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి! -
ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు
సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం (జూన్ 15) ఎస్ఐఆర్లో పలు సమస్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్ సీఈవోకి లేఖ ఇచ్చారు.అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన
తెలుగులో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు గుర్తుండే ఉంటాడు. చాన్నాళ్లుగా తెరపై పెద్దగా కనిపించని ఇతడు.. ట్రెండ్కి తగ్గట్లే ఓ యాక్షన్ మూవీ చేశాడు. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతడే నటించాడు. కాకపోతే థియేటర్లలో రిలీజైన తొలి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్)సహాయ నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసిన రవిబాబు.. 'అల్లరి' మూవీతో దర్శకుడిగా మారాడు. అవును, అనసూయ, అమరావతి లాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. అప్పట్లో ఇవి ఉన్నంతలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ట్రెండ్కి తగ్గట్లు కంటెంట్ మార్చుకోలేక మూవీస్ చేయడం తగ్గించుకుంటూ వచ్చేశాడు. 'రేజర్' పేరుతో తీసిన యాక్షన్ చిత్రాన్ని గత నెల 8న థియేటర్లలో రిలీజ్ చేశాడు. దీని ప్రమోషన్లలో సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వాటిని అందరూ బాగానే చూశారు గానీ మూవీని ఒక్కడూ పట్టించుకోలేదు.ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆడియెన్స్ దీన్ని థియేటర్లలో పట్టించుకోలేదు. మరి ఓటీటీలోనైనా పట్టించుకుంటారేమో చూడాలి? ఇకపోతే ఈ వారం దీనితోపాటు దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.'రేజర్' విషయానికొస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును.. పెట్ గ్రూమింగ్ చేసే రుద్ర ప్రతాప్ (రవిబాబు) కాపాడతాడు. తర్వాత హోంమంత్రి గ్యాంగ్ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో అఫ్గన్ జట్టు డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ ఆల్రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
ఇథనాల్తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే?
భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఇది ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.కంపెనీ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన సమయంలో ధరలను ప్రకటించలేదు. అయితే తాజాగా సంస్థ ఈ వాహనం ధరను రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ ZXi+ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్ ఉంది. అయితే ధర మాత్రం జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ కంటే రూ. 86,000 ఎక్కువ.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుంది. అంటే ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నప్పటికీ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది. అంతేకాకుండా.. చెరకు వంటి పంటల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్లుఅయితే.. ఈ వాహనం ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. కమర్షియల్ విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యాగన్ ఆర్ టూర్ H3తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న 1.2 లీటర్ ఇంజిన్ మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. టూర్ H3లో 1.0 లీటర్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.పనితీరు విషయానికి వస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లో పవర్ లేదా టార్క్ పరంగా ఎటువంటి పెరుగుదల లేదు. ఈ 1.2 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 90.9 హార్స్పవర్, 113.7 న్యూటన్ మీటర్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి!
కట్టుకున్న భర్త వేధింపులకు గురిచేసి, అత్యంత దారుణంగా హింసించిన కేసు ఒకటి కలకలం రేపుతోంది. ఎర్రగా కాలిన ఇనుప రాడ్తో వాతలు పెట్టి హింసించాడు. మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతనైతే పోలీసుల దగ్గరకు వెళ్లమని సవాలు విసిరాడు. కట్ చేస్తే... క్రైమ్ థిల్లర్లా సాగిన ఈ కథలో చివరికి ఆమె పోలీసుల వద్దకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత తిట్టడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకించడంతో ఆమెపై క్రూరంగా దాడి చేశాడు.కర్రతో బాదాడు, చెంపదెబ్బలు కొట్టాడు, బెదిరించాడు. ఆ హింసను భరించలేక, మాంగీబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చింది.మొదటిసారి దొరికిపోయిందిగంటల తరబడి నడుచుకుంటూ ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు వెడుతుండగానే, ఒక గుడి సమీపంలో ఆమె భర్త ఆమెను అడ్డుకుని, మళ్లీ దాడి చేసి, బలవంతంగా గ్రామానికి తీసుకువెళ్లాడు. మరింత క్రూరంగా మారిపోయాడు. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసులేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి,తాళం వేశాశాడు. ఇప్పుడు చూస్తాను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లి నాపై ఎలా ఫిర్యాదు చేస్తావో, ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో అంటూ బెదిరిస్తూ పదే పదే కొట్టాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్ను వేడి చేసి, ఆమె శరీరంపై కాల్చాడని ఆమె తెలిపింది. ఆమె నడుము, నడుము కింది భాగం, కుడి తొడపై ఈ వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా, ఎవరూ సాయం చేసేవారే లేకపోయారు. 24 గంటలు బయటకు వెళ్లనివ్వలేదు, ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టాలని తాళం బయటకు వెళ్లాడు. అతగాడి క్రూరత్వం,జరగబోయే హింసను ఊహించి భయంతో, రాజీకి అంగీకరించినట్లు నటించింది. కానీ మనసులో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూసింది.తీవ్ర అలసటతో, ఒళ్లంతా గాయాలతో, ముళ్ళు గుచ్చుకుని తెగిపోయిన పాదాలతో, తనను బంధించడానికి వాడిన ఇనుప గొలుసు ఇంకా మెడలోనే వేలాడుతుండగా చివరికి పోలీసు స్టేషన్ గడప తొక్కింది. సాహసోపేతమైన తప్పించుకునే ప్రయత్నం, చివరకు ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ అరెస్టుకు దారితీసింది. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్దారి చూపిన రాయిపంచాయతీ కోసం భర్త బయటికి వెళ్లగానే చుట్టూ సాయంకోసం వెదికింది. మాంగీబాయి కళ్ళు అక్కడ ఉన్న ఒక రాయిపై పడ్డాయి. అంతే దాన్నితీసుకుని తాళంపై ఒకటి, రెండుసార్లు పదే పదే తాళం పగిలే దాకా కొడుతూనే ఉంది. చివరకు తాళం విరిగింది. గొలుసు తెగిపోయింది, బందీఖానానుంచి విముక్తి లభించింది. క్షణం కూడా వృధా చేయకుండా, ఆమె ఇంటి నుండి పరుగులు తీసి ఖిల్చిపూర్ వైపు నడవడం ప్రారంభించింది.చీకట్లో ఆరు కిలోమీటర్ల ప్రయాణంచుట్టూ చీకటి.. మెడలోఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా.. మాంగీబాయి నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాలు, గరుకు మార్గాల గుండా నడక మొదలు పెట్టింది. ఒక పక్కన ముళ్ళు గుచ్చుపోయి, కాళ్ళు రక్కుకుపోయి రక్తం కారిపోతున్నా ఆమె పయనం ఆగలేదు. ముందుకు సాగుతూనే ఉంది. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నారు. కానీ ఎవరూ కనీసం ఆగి ప్రశ్నించలేదు. అయితే, ఒక బాటసారి ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఏదైనా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కు తన ప్రయాణాన్ని కొనసాగించింది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవంషాక్కు గురైన పోలీసులురాత్రి 10 గంటల ప్రాంతంలో మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే అక్కడున్న పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. మెడలో తాళం వేసిన గొలుసు, శరీరంపై వాతలు , తీవ్ర భయాందోళలో గజ గజ వణికిపోతూ స్టేషన్కు చేరుకున్న ఆమె కన్నీరుమున్నీరై, జరిగినదంతా వివరించింది. పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె శరీరంపై గాయాలు, వాతలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఒక పోలీసు బృందం గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఛావా నటి బలవన్మరణం
ప్రముఖ బుల్లితెర నటి సంచితా ఉగలే(22) బలవన్మరణానికి పాల్పడింది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన ఆమె ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది. ఆమె చివరిసారిగా ఓ రీల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సంచితా హిందీలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా నటించారు. 'కుంకుమ్ భాగ్య', 'సాజన్ ఘర్', 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ' లో కనిపించారు. టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కుంకుమ్ భాగ్య' సీరియల్లో దియా టాండన్ పాత్రకు ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా 'వాగ్లే కి దునియా' సీరియల్లో రుచితా.. జైట్లీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ'లో సోరబ్ బేడీ సరసన సుకూన్ అనే ప్రధాన పాత్రను పోషించింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మూవీలో ఆమె తారాబాయి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Sanchita Ugale (@sanchita_ugale) -
ఎన్డీఏ నుంచి వైదొలగిన టీఎంసీ(ఎం)
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీ వైదొలగింది. ఈ విషయాన్ని టీఎంసీ (ఎం) అధ్యక్షుడు జీకే వాసన్ ప్రకటించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య బాధ్యులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. 12 ఏళ్ల క్రితం స్థాపితమైన తమ పార్టీ గతంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని ఆయన చెప్పారు.ఎన్డీఏలో ప్రాధాన్యత లేదు: నేతల ఆగ్రహంచైన్నె ఎగ్మోర్లో ఆదివారం జీకే వాసన్ అధ్యక్షతన టీఎంసీ (ఎం) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మెజారిటీ నాయకులు ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన కనీస ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని, కాబట్టి కూటమి నుండి తక్షణమే వైదొలగాలని జీకే వాసన్ను కోరారు. మరికొందరు నేతలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ప్రత్యామ్నాయాల వైపు చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు.అవకాశవాద రాజకీయాలు పెరిగాయినాయకుల అభిప్రాయాలను విన్న అనంతరం జీకే వాసన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న వారు, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఏదో ఒక పార్టీ గుడ్డిగా సాహసం చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన.. వారే ఎల్లకాలం విజయం సాధిస్తారని తాను భావించడం లేదన్నారు.చదవండి: విజయ్ ప్రభుత్వంపై రజినీకాంత్ సతీమణి నో కామెంట్ఒక పార్టీ స్థిరంగా రాణించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు సరైన సంకీర్ణం అవసరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎప్పుడో బలహీనపడిందని, టీఎంసీ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా అంతర్గతంగా కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే ఒక్క ఎన్నికలలోనూ గెలవలేక పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నామని, అందుకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తామని, బలోపేతం దిశగా వెళ్తామన్నారు. -
పాక్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్
బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్కు చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ అబ్బాస్.. అమీషా పటేల్కు బర్త్డే విషెస్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక పాత రొమాంటిక్ డ్యాన్స్ వీడియో అది. జూన్ 9న అమీషా పటేల్ బర్త్డే. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆమెకు విషెస్ తెలియజేస్తూ..గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘క్రాంతి’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘దిల్ మే దర్ద్ సా జగా హై’ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పుని ఇన్స్టాలో షేర్ చేశాడు. గతంలో వీరిద్దరూ ఒక ఈవెంట్ నిమిత్తం బహ్రెయిన్లో కలుసుకున్నప్పుడు ఈ వీడియోను చిత్రీకరించారు. ‘నాకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటైన ఈ సాంగ్కు నీతో కలిసి వీడియో చేయడం మర్చిపోలేని అనుభూతి’ అంటూ ఇమ్రాన్ అబ్బాస్ ఈ వీడియోను షేర్ చేస్తూ అమీషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాకిస్తానీ నటుడితో అమీషా పటేల్ అంత క్లోజ్గా మూవ్ అవ్వడం, రొమాంటిక్ వీడియోలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గతంలో నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని అమీషా, ఇమ్రాన్ అబ్బాస్తో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె గతంలోనే స్పందించారు. తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఇద్దరం ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని, వాటిని చూసి నవ్వుకున్నానని ఆమె కొట్టిపారేశారు. ఏదేమైనప్పటికీ, భారత్-పాక్ సరిహద్దులను దాటిన వీరి స్నేహం, ఈ క్యూట్ రొమాంటిక్ వీడియో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్తో పాటు ఇరు దేశాల సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో ట్రెండింగ్గా మారింది. View this post on Instagram A post shared by Mera FM 107.4 (@merafmofficial) -
మెట్రో ఫేజ్ -2 ను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డే..? సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు. ఈ రోజు (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ హాయంలోనే హైదరాబాద్లో మెట్రో రైలుకు టెండర్లు పిలిచారని రేవంత్ తెలిపారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మెట్రో ఫేజ్-2 పనులకు కిషన్ రెడ్డి సహకరిస్తే ఒక మెట్లో స్టేషన్కు ఆయన పేరు పెడతామని తెలిపారు. కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాబట్టి నిధుల అంశం ఆయనను అడుగుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కేంద్రమంత్రులను వ్యక్తిగతంగా కలిసి పరిస్థితులు వివరించాను. మెట్రోకు నష్టాలు రాకుండా లాభాల కోసం రకరకాల సంస్థలను సంప్రదించామని. ఫేజ్-1 వరకూ యజమానులు మీరయితే ఫేజ్-2 అనుమతులు ఈజీగా వస్తాయని కేంద్రం చెప్పిందని అయినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదన్నారు. హైదరాబాద్ని విశ్వనగరమని చెప్పుకుంటుంన్నాం దానికి తగ్గట్లు అంతర్జాతీయ నగరానికి ఉండేలా సదుపాయలు కూడా ఉండాలి. ఫేజ్-2 అనుమతి కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం మరో 122 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ జరగాలని కోరాం. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్కు రూ. 350 కోట్ల ఖర్చువుతుందని ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోటి 34 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. -
అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పశ్చిమాసియాలో జరిగిన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుంది. ఈ అవగాహన అమలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా వాణిజ్య నౌకా మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారిస్తుందని మేము ఆశిస్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. మిగిలిన అంశాలపై.. అమెరికా–ఇరాన్ మధ్య జరిగే చర్చలు స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని కూడా మోదీ ఆకాంక్షించారు.I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries. India hopes that the implementation of this understanding will…— Narendra Modi (@narendramodi) June 15, 2026ప్రస్తుతం మోదీ స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు.. వందేమాతరంతో ఘన స్వాగతం లభించింది.ఇక.. ఇరాన్-అమెరికా డీల్కు సంబంధించి కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఫ్రేమ్వర్క్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం, తాత్కాలిక ఆంక్షల సడలింపు, అలాగే ఇరాన్కు నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగమని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో.. ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు, ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆస్తి కోసం కొడుకు కుట్ర.. బుద్ధి చెప్పిన కలెక్టర్!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ వృద్ధ దంపతులు తమ సొంత ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది. న్యాయపోరాటాలు, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న 71 ఏళ్ల ఎంజం రమణారెడ్డి, ఆయన భార్య 66 ఏళ్ల చంద్రకళకు చివరకు న్యాయం జరిగింది. నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ‘తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007’ కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి వారి చిన్న కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు.మిర్యాలగూడ హౌసింగ్బోర్డు కాలనీలో నివసించే రమణారెడ్డి, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, కుమార్తెకు వివాహమైంది. ఉద్యోగం లేని చిన్న కుమారుడు దయాకర్రెడ్డికి దాదాపు నాలుగు ఎకరాల భూమిని ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. అంతేకాకుండా అతని భార్య, కుమార్తెలు జీవనోపాధి పొందేందుకు నేరేడుచర్ల మండలం ఎంజంవారిగూడెంలోని తమ ఇంట్లో ఉండే అవకాశం కూడా కల్పించారు. తమ జీవిత పొదుపులతో రమణారెడ్డి దంపతులు మిర్యాలగూడ హౌసింగ్బోర్డు కాలనీలో ఓ ఇల్లు నిర్మించడంతో పాటు పక్కనే మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. పిల్లల చదువుల కోసం అంటూ దయాకర్రెడ్డి తన కుటుంబంతో ఆ ఇంట్లోకి వచ్చి నివసించడం ప్రారంభించాడు. అయితే 2022 అక్టోబర్లో దయాకర్రెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి, ఆ ఇంటిని తన భార్యకు విక్రయించినట్లు చూపించాడని దంపతులు ఆరోపించారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాము మిర్యాలగూడ ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా, తమను ఇంటి నుంచి బలవంతంగా వెళ్లగొట్టినట్లు తెలిపారు. స్థానికులు కూడా న్యాయపరమైన ఇబ్బందుల భయంతో తమకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు తిరిగి గ్రామంలోని పాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.చంద్రకళ మాట్లాడుతూ.. తమ కుమారుడు రైతుబంధు సాయం కూడా నిలిపివేశాడని, గ్రామస్తులు తమ భూములను కౌలుకు తీసుకోకుండా బెదిరించాడని ఆరోపించారు. దీంతో తమకు ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయని చెప్పారు. అంతేకాకుండా కట్న వేధింపులు, భూవివాదాలు వంటి తప్పుడు ఆరోపణలతో వివిధ కోర్టుల్లో తమపై 22 కేసులు పెట్టాడని, వాటి విచారణల కోసం తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వృద్ధ దంపతులు వాపోయారు. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.వృద్ధ దంపతుల ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టి, ‘తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007’ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దయాకర్రెడ్డిపై కేసు నమోదు కాగా, తాజాగా కలెక్టర్ ఆదేశాలతో వృద్ధ దంపతులు తమ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రమణారెడ్డి ఇటీవల పక్షవాతానికి గురికావడంతో తరచూ వైద్య చికిత్స అవసరమవుతోంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, వృద్ధాప్య సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ప్రతి నెలా దాదాపు రూ.15 వేల వరకు మందులు, వైద్య పరీక్షలకే ఖర్చవుతోందని చంద్రకళ తెలిపారు.ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులు తమ కుమార్తె, అమెరికాలో స్థిరపడిన పెద్ద కుమారుడు పంపుతున్న ఆర్థిక సహాయంతో జీవనం సాగిస్తున్నారు. 2022 జూన్లో చివరిసారిగా భారత్కు వచ్చిన పెద్ద కుమారుడు తల్లిదండ్రులను చూసేందుకు మళ్లీ రావాలనుకుంటున్నప్పటికీ, తమ్ముడు సృష్టించిన న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటాననే భయంతో వెనుకడుగు వేస్తున్నాడని చంద్రకళ పేర్కొన్నారు. తమ మిగిలిన ఆస్తులను కూడా తమ పేర్ల నుంచి బదిలీ చేయించుకునేందుకు దయాకర్రెడ్డి గతంలో కొంతమంది రౌడీలను పంపించి ఒత్తిడి తెచ్చాడని, పొలంలో పని చేస్తున్న సమయంలో తమపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఆరోగ్యం క్షీణించడం, నివసించేందుకు భద్రమైన స్థలం లేకపోవడంతో వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని, మిర్యాలగూడలోని ఇంటిని తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ దయాకర్రెడ్డిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ సిటిజన్స్ విభాగానికి చెందిన ఎం. నాగిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో మిర్యాలగూడలోని ఇంటిని అధికారికంగా వృద్ధ దంపతులకు అప్పగించినట్లు తెలిపారు.“మేము కష్టపడి సంపాదించిన ఇళ్లు, భూములను సమాధి వరకు తీసుకెళ్లం. చివరకు అవన్నీ పిల్లలకే చెందుతాయి. అయినప్పటికీ ఆస్తి కోసం మా చిన్న కుమారుడు మమ్మల్ని ఇంత దారుణంగా ఎందుకు వేధించాడో అర్థం కావడం లేదు” అని రమణారెడ్డి, చంద్రకళ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మిర్యాలగూడ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ, గ్రామంలోని తమ ఆస్తిపై కూడా దయాకర్రెడ్డి కన్నేశాడనే భయం వారిలో ఇంకా ఉంది. గ్రామంలోని ఇంటి తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకుంటానని అతడు బెదిరించినట్లు వారు ఆరోపించారు.ఈ విషయాన్ని నల్గొండ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని వృద్ధ దంపతులు నిర్ణయించుకున్నారు. -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్! -
పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్గా కరీనా కపూర్!
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కెరీర్లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిపోయింది ‘లగాన్. ఈ మూవీ ఒకవైపు దేశభక్తిని, మరోవైపు యువతను విశేషంగా ఆకర్షించే క్రికెట్ సన్నివేశాల మేళవింపుతో భావోద్వేగభరితంగా తెరకెక్కించిన క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దర్శకుడు అశుతోష్ గోవారికర్ (Ashutosh Gowariker) తెరకెక్కించిన ఈ మూవీ 2001 జూన్ 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్తో దూసుకుపోతూ.. సూపర్ హిట్గా నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సరిగ్గా ఈ నెల 15తో 25 ఏళ్లు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా ఈ మైలురాయిని పురస్కరించుకుని, నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ జూన్ 13న ముంబైలో ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్, సల్మాన్ ఖాన్తో సహా బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ తనదైన గ్లామరస్ లుక్తో అలరించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే బేబో పింక్ కుర్తాలో గులాబీలా మెరిసింది. ఈ వేడుకలో ఆమె ధరించి డ్రస్, హైహిల్స్ ధర వింటే విస్తుపోవాల్సిందే. ఇది ఎకాయ బనారస్ బ్రాండ్కి చెందిన సిల్క్ కుర్తా. డిజైనర్ అమృత గిల్ షేర్ రూపొందించారు. కరీనా డిజైనర్వేర్పై క్లిష్టమైన, చేనేత కట్వర్క్ బనారసీ డిజైన్లు ఉన్నాయి. ఫ్లేర్డ్ కుర్తాను స్ట్రెయిట్ ప్యాంట్లు, దానికి సరిపోయే షీర్ దుపట్టాతో జత చేశారు. ఈ లుక్ని మరింత అందంగా కనిపించేలా అక్వాజురా హీల్స్ను ఎంచుకుంది. ఇక కరీనా ధరించిన ఈ అందమైన కుర్తా ధర వచ్చేసి రూ. రూ. 41,000 కాగా, హీల్స్ ధర వచ్చేసి ఏకంగా రూ. 92,000 పైనే పలుకుతుందట. ఇక హెయిర్స్టైల్ కోసం క్లాసిక్ నీట్ బన్ను ఎంచుకున్నారు. అలాగే సింపుల్ మేకప్ టోన్స్, గ్రీన్ కళ్లు అందంగా కనిపించే కాజల్, చిన్న బొట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేశారామె. అంతేగాదు ఈ బ్యూటీ బేబో స్టైలిష్గా ఆకర్షణీయంగా కనపించే అవకాశాన్ని ఎప్పుడు వదులుకోదామె. ఎల్లప్పుడూ ఓ కొత్తలుక్తో కరీనా తన అభిమానులను ఆశ్చర్యపరస్తుంటుందామె. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?) -
పాకిస్థాన్లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. ఒక పోలీసు అధికారి చేసిన పొరపాటుతో పదేళ్ల ముక్కపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దొంగతనానికి సంబంధించిన ముఠాను ఛేదిస్తున్న క్రమంలో జరిపిన కాల్పుల్లో పోరపాటున విదేశీయులకు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన బాలిక అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక పోలీసు అధికారిని అరెస్టు చేశారు.పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం, దోపిడీ జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అనుమానితులు కుటుంబ కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక కుటుంబానికి చెందిన వాహనాన్ని అడ్డగించారు. వారు ఆపకపోవడంతో అధికారి పొరపాటుగా భావించి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అయితే ఈకాల్పుల ఘటనలో దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాకు చెందిన 10 ఏళ్ల హానియా అనే బాలిక మరణించగా, ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారని తెలిపారు. దీంతో ఈ కాల్పులకు కారణమైన అధికారని పోలీసులు అరెస్టిు చేశారు.కాగా ఆస్ట్రేలియా పెర్క్కు సంబంధించిన బాధితులు పాకిస్థాన్లోని తమ బంధువులను కలవడానికి వచ్చారని ఆ సమయంలో కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్ట్రేలియ ప్రధాని ఆంటోనియా ఆల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై పారదర్శకమైన విచారణ జరగాలని కోరారు. గాయపడిన వారికి ఆస్ట్రేలియా కాన్సులేట్ సహాయం అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.An Australian family's been caught up in a horror shooting while on holidays in Pakistan. Police opened fire, killing a nine-year-old girl and wounding her father and brother, apparently mistaking them for thieves. pic.twitter.com/zAZxr1ccou— 7NEWS Sydney (@7NewsSydney) June 13, 2026 -
మానవ జల నిర్మాణాల్లో.. ఇది కూడా ఒక అద్భుతం!
ఈ భూమిపై ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అందులో కొన్ని సహజంగా ఏర్పడినవయితే, మరికొన్ని మానవ మేధస్సుతో నిర్మితమైనవి. మారుతున్న కాలానుగుణంగా నూతన పరిఙానంతో కూడిన మానవ నిర్మాణాల్లో 'పనామా కాలువ' కూడా ఒకటి. దీని గురించి చూసినట్లయితే..ప్రపంచంలో మానవులు నిర్మించిన జలమార్గాల్లో ఇదొక అద్భుత నిర్మాణం. ఇది (Panama Canal) మధ్య అమెరికాలోని పనామా దేశంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అలాగే, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ 82 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్న జలమార్గం. పొడవు సుమారు 82 కిలోమీటర్లు, వెడల్పు సాధారణంగా 91 మీటర్ల నుండి 300 మీటర్ల వరకు మారుతుంది. లోతు సుమారు 12 నుండి 15 మీటర్లు. మూడు ప్రధాన లాక్ప్.. గాటూన్ లాక్స్, పెడ్రో మిగెల్ లాక్స్, మిరాఫ్లోరెస్ లాక్స్ సిస్టమ్ ని కలిగిఉంది. ప్రయాణ సమయం.. 8 నుండి 10 గంటలు పడుతుంది.ఎలా పనిచేస్తుందంటే?పనామా కాలువ కేవలం లాక్స్ సిస్టంతోనే పనిచేస్తుంది. ఈ కాలువ వద్ద భూమి సముద్రమట్టం కంటే ఎత్తుగా ఉండగా.. ఈ నిర్మాణంతో ఓడలు పైకెత్తడం, కిందకు దించుతారు. కాలువలో పెద్ద పెద్ద నీటి గదులు లాక్స్ రూపంలో ఉంటాయి. ఇవి ఓడలు వచ్చినప్పుడు వాటి పరిమాణం తగ్గట్టుగా అటూ, ఇటూ జరుగుతుంటాయి. ఓడ ఒక లాక్ చాంబర్లోకి వెళ్లగానే గేట్లు మూసేస్తారు. మరో పక్కనుంచి నీటిని చాంబర్లోకి వదులుతూ, నీటి స్థాయి పెరిగేలా చేసి ఓడను పైకెత్తుతారు. ఈ విధంగా మూడు ప్రధాన లాక్స్ ద్వారా ఓడను పైకెత్తి.. సమాంతర స్థానానికి చేరగానే నీటి సహాయంతో ప్రయాణించేలా చేస్తారు.తరువాత అట్లాంటిక్ నుంచి బయలు దేరిన ఓడలను చివరగా పసిఫిక్ వైపుగా దిగేలా చేస్తారు. ఈ కాలువ నీటి వంపులను వినియోగించకుండా కేవలం గురుత్వాకర్షణతోనే పనిచేయబడుతుంది. అంటే నీరు ఒక లెవెల్ నుంచి మరో లెవెల్ కు సహజంగా ప్రయాణించేలా దీని నిర్మాణం చేయబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక నీటి ఎలివేటర్ లాంటిదన్నమాట. సముద్ర మట్టాలు రెండు వైపులా వేరుగా ఉండటం, అలాగే, మధ్యలో ఎత్తైన భూభాగం ఉండటం వల్ల దీనిని 'లాక్ సిస్టమ్' ద్వారా నిర్మించారు. ఓడలు లాక్ల ద్వారా దాదాపు 85 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. తరువాత గటూన్ సరస్సుపైగుండా ప్రయాణిస్తూ, అవతలి వైపు సముద్రమట్టానికి చేరుకుంటాయి. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత అట్లాంటిక్–పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఇదివరకున్న 9500 కిమీ కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడమే కాకుండా వాణిజ్య వ్యాపారాలకు సమయం ఆదా చేయడంలో ఈ పనామా కాలువ ఎంతగానో ఉపయోగపడుతుంది. -
నితిన్-లికితా జోడికి స్వర్ణం
పుణే వేదికగా జరిగిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు సత్తా చాటారు. హైదరాబాద్లోని సుచిత్రా బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన నితిన్ కుమార్-లికితా శ్రీవాస్తవ జోడీ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకం సాధించింది. టోర్నీలో పాల్గొన్న టాప్ జోడీ షట్లర్లను ఓడించిన ఈ జోడీ తొలి స్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది.కాగా నితిన్-లికితా జోడికి ఇది వరుసగా రెండో మిక్సడ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఇటీవలే మరో జాతీయ టోర్నీలోనూ ఈ జోడీ గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. మహిళల డబుల్స్ విభాగంలో లికితా శ్రీవాస్తవ తన పార్టరర్ శ్రేయ బాలాజీతో కలిసి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఓవరాల్గా హైదరాబాద్లోని సుచిత్రా బ్యాడ్మింటన్ అకాడమీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టేలా చేయడంలో విజయవంతమయ్యింది. -
Income Tax: ‘ఇన్కం స్టేట్మెంట్’ ఇలా తయారు చేయండి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. అంటే.. వచ్చే నెలాఖరులోపలే. ఈ రోజు నాటికి ఫారం 1,2 అలాగే ఫారం 4 దాఖలు చేయడానికి అన్ని యుటిలిటీలు రెడీగా ఉన్నాయి. రిటర్నులు దాఖలు అవుతున్నాయి. అయితే, 1 గానీ 2 గానీ 4 గానీ ముందుగా మీరు ‘ఇన్కం స్టేట్మెంట్’ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ తయారు చేసుకోవడం చాలా సులువైన పని. ఇంకేం.. రంగంలోకి దూకండి. ఆదాయంపరంగా ఆలోచిస్తే, మీరు మీ ఆదాయం ఏయే ‘సోర్స్’ ద్వారా వస్తుందో ఒక పట్టిక/జాబితా చేయండి. ఉదాహరణకి 🔸 జీతం/వేతనం 🔸 పెన్షన్ 🔸 కొన్ని నెలలు జీతం, మిగతా నెలలు పెన్షన్ 🔸 యాన్యుటీలు 🔸 ప్రతి నెలా వచ్చే ఇంటద్దెలు. మీ సౌలభ్యం కోసం మీరు మీరు అద్దెకిచ్చిన ప్రాపర్టీల జాబితా తయారు చేసుకోండి. క్రమసంఖ్య, ఇంటి నంబరు, ప్లాట్ నంబరు, లొకేషన్, ఊరి పేరు, పట్నం పేరు మొదలైన వివరాలు ఉండాలి. ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి చూడండి. ఓనర్షిప్.. సింగిలా/జాయింటా? వాడుకలో మాది మాది అని అంటాం, ఎప్పుడు కొన్న ప్రాపర్టీ అనేది వివరాలు గుర్తుండవు. అప్పట్లో బ్యాంకర్లు (ఇప్పుడూ అనుకోండి) అప్పు ఎక్కువ రావడానికి మీ జీవిత భాగస్వామిని/కుటుంబ సభ్యులను కో–అప్లికెంటుగా ఇరికిస్తారు లేక మీరే ట్యాక్స్ ప్లానింగ్కని ఇద్దరూ కలిసి జాయింటుగా రాస్తారు. ఇవన్నీ ఓనర్షిప్కి పనికి వస్తాయి. తర్వాత చెల్లించిన మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు, బ్యాంకులు, జమలు, నగదు వసూళ్లు, అద్దెలోకి వస్తాయి. 🔸ప్రతినెల మీ బ్యాంకు ఖాతాలో జమయ్యే వడ్డీలు. 🔸 మీ చేతికి నెల నెలా రాకపోయినా మీ ఎఫ్డీఆర్కి క్రెడిట్ అయ్యేవి, మెచ్యూరిటీ రోజు నాటికి మొత్తం అసలు, వడ్డీ జమ అవుతాయి. కానీ మీరు సంవత్సరానికి వచ్చిన వడ్డీనే తీసుకోవచ్చు. 🔸 జమ అయ్యే వడ్డీలు, అలాగే జమ కానివి, నగదు రూపేణా వచ్చేవి. 🔸 డివిడెండ్లు, బ్యాంకులో జమ అవుతాయి. 🔸 ఇతర ఆదాయాలు 🔸 వ్యవసాయ ఆదాయాలు. బ్యాంకు అకౌంట్ స్టేట్మెంటు/పాస్బుక్లో ప్రతి జమ, ఎందుకొచి్చందో విశ్లేషించండి. వివరించండి. 🔸 ముందుగా విత్డ్రా చేసి, ఖర్చులు పోను, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి.. అది మీ ఆదాయం కాదు. 🔸 మీకు ఎవరైనా అప్పు తీర్చి ఉంటే, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే, అది ‘ఆదాయం’ కాదు. కానీ ఇలాంటి వ్యవహారాలు ‘శల్యపరీక్ష’కు గురవుతాయి. 🔸 ఆస్తులు, షేర్లు, సెక్యూరిటీలు, బంగారం, ఆభరణాల్లాంటి విలువైన వస్తువులను అమ్మగా వచి్చన డిపాజిట్లు. వీటి మీద క్యాపిటల్ గెయిన్స్ పడే అవకాశం ఉంది. విశ్లేషణ, వివరణ చేసుకోండి. 🔸 పీఎఫ్ విత్డ్రాయల్స్, ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ మొత్తం, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ, చిట్ఫండ్లో చేరి పాట పాడగా వచ్చిన మొత్తం, పూర్తి విశ్లేషణ, సమగ్రంగా వివరణ అవసరం 🔸 మీరు వ్యాపారస్తులైతే ప్రత్యేకంగా అకౌంట్స్ నిర్వహించండి. వ్యాపారపు కరెంటు ఖాతా నుంచి మీ ఎస్బీ అకౌంటుకు చేసిన జమలు.. అవి సొంత వాడకాలా... జీతమా లేక అప్పు తీర్చడమా.. విశ్లేషించుకోండి. 🔸 వీలున్నంత వరకు కరెంటు ఖాతా, మరియు ఎస్బీ అకౌంటును విడివిడిగా నిర్వహిస్తూ, రెండింటి మధ్య వ్యవహారాలు, తక్కువగా ఉండేలా చూసుకోండి. అనివార్యమైతే, సరిగ్గా విశ్లేషణ, వివరణ రెడీగా పెట్టుకోండి. 🔸 ఏ జమ పడినా వివరణ ఉంచుకోండి. చివరిగా, మీ అన్ని బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి. వివరాలు పొందుపర్చండి. జీతం నిమిత్తం 12 జమలు ఉండాలి. తక్కువ, ఎక్కువ అయితే, ఆరా తీయండి. అద్దె జమలు 12 రసీదులకు తగ్గినా, ఎక్కువయినా ఆరా తీయండి. అద్దె విషయంలో అడ్వాన్స్లను జాగ్రత్తగా సర్దుబాటు చేయండి. 2026 మార్చి 31 తర్వాత కూడా 2025–26కి సంబంధించిన వ్యవహారాలు జమ కావొచ్చు. అలాగే, ఏప్రిల్ 2025లో 2024–25కి సంబంధించినవి జమ కావొ చ్చు. ఇప్పుడు మీ చేతిలో ‘జమలు’ ఉన్నాయి. వాటి సాయంతో ‘స్టేట్మెంట్’ చేయడానికి ఉపక్రమించండి. -
నిక్కరుతో నడిరోడ్డుపై ‘టీఎంసీ పుష్ప’ ఊరేగింపు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కొన్ని సంచలన దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేత, ‘పుష్ప ఆఫ్ ఫాల్తా’గా పేరొందిన జహంగీర్ ఖాన్ను పోలీసులు నడుముకు తాడు కట్టి, కేవలం ఒక నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు. అరెస్ట్ అయినప్పటి నుండి ఆయనను ఇలా బహిరంగంగా వీధుల్లో తిప్పడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, ప్రజలకు చేతులు జోడించి ఆయన క్షమాపణలు కోరుతున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.అరెస్ట్ వెనుక అసలు కథదౌర్జన్యాలు, వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై జహంగీర్ ఖాన్ను జూన్ 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగాల్ కోర్టు ఆయనకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఉత్తర బెంగాల్లోని భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పానిటంకి ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఈ డైమండ్ హార్బర్ నేత, మే 21న జరిగిన ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు. VIDEO OF SYMBOL OF POLITICAL MUSCLE JAHANGIR KHAN ALIAS "PUSHPA" AND ABHISHEK BANERJEE'S CLOSE ASSOCIATE.Jahangir Khan alias “Pushpa” (for threatening IPS officer Ajay Pal Sharma) and TMC Diamond Harbour leader being led through the streets barefoot, in shorts, with a rope… pic.twitter.com/N0GAv0bwSc— Rahul Shivshankar (@RShivshankar) June 15, 2026కోర్టు రక్షణ ఎత్తివేతజహంగీర్ ఖాన్పై ఫాల్తా పోలీస్ స్టేషన్లో ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో మే 21న జరిగే రీ-పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి, ప్రచారం చేసుకోవడానికి వీలుగా కలకత్తా హైకోర్టు మే 18న ఆయనకు అరెస్ట్ నుండి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. అయితే ఊరట లభించిన మరుసటి రోజే తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఖాన్ బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత మే 24న ఎన్నికల ఫలితాలు వెలువడగా, మే 26న కలకత్తా హైకోర్టు ఆయనకు ఇచ్చిన తాత్కాలిక రక్షణను పూర్తిగా రద్దు చేసింది.పోలీస్ కస్టడీలో పరాభవంకోర్టు రక్షణ ఎత్తివేసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించిన జహంగీర్ ఖాన్ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుండి ఈ నేతను నిక్కరుతో, నడుముకు తాడు కట్టి పోలీసులు రోడ్డుపై నడిపించడం సంచలనంగా మారింది. గతంలో అధికార బలంతో అహంకారంగా వ్యవహరించిన ఈ నేత, ఇప్పుడు దీనస్థితిలో ప్రజలకు క్షమాపణలు చెబుతూ కనిపించడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. -
ప్రమాదంలో ఇరాన్–అమెరికా డీల్?!
పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్కు ససేమీరా చెబుతూ.. లెబనాన్పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది. -
పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్లోనూ దానిని కంటిన్యూ చేసింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.చదవండి: ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్! -
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
రాజభవనం టూ జైలు.. యువరాణి కుమారుడికి నాలుగేళ్ల శిక్ష
ఒస్లో: నార్వే రాజ కుటుంబాన్ని గత రెండేళ్లుగా కుదిపేస్తున్న లైంగిక దాడుల కేసులో కీలక తీర్పు వెలువడింది. నార్వే యువరాణి మెట్టే మారిట్(Mette-Marit) కుమారుడైన మారియస్ బోర్గ్ హోయిబీ(Marius Borg Hoiby)పై నమోదైన అత్యాచారం, గృహహింస, బెదిరింపులు తదితర కేసుల్లో ఓస్లో జిల్లా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, ఈ కేసు నార్వే చరిత్రలో రాజ కుటుంబానికి సంబంధించిన అత్యంత వివాదాస్పద నేర విచారణల్లో ఒకటిగా నిలిచింది. నెలల తరబడి సాగిన దర్యాప్తు, ఆరు వారాలకు పైగా కొనసాగిన విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది.ఎవరు మారియస్?మారియస్ బోర్గ్ హోయిబీ నార్వే యువరాణి మెట్టే-మారిట్కి మొదటి వివాహం ద్వారా జన్మించాడు. 2001లో ఆమె యువరాజు హాకోన్ను వివాహం చేసుకుంది. అనంతరం, మారియస్ కూడా రాజకుటుంబంలో భాగమయ్యాడు. అయితే అతనికి రాజవంశ వారసత్వ హక్కులు లేదా అధికారిక రాజకుటుంబ హోదా లేవు. అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే రాజకుటుంబ సభ్యుడిగా ప్రజల దృష్టిలో ఉన్నాడు.ఏయే ఆరోపణలు ఎదుర్కొన్నాడు?ప్రాసిక్యూషన్ ప్రకారం, మారియస్పై మొత్తం 40 వరకు క్రిమినల్ ఆరోపణలు నమోదయ్యాయి. వాటిలో.. నాలుగు అత్యాచార ఆరోపణలు, మహిళలపై లైంగిక దాడులు, గృహహింస, బెదిరింపులు, నిరోధాజ్ఞ (Restraining Order) ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసులు ఉన్నాయి. దీంతో, ప్రాసిక్యూటర్లు అతడికి 7 సంవత్సరాల 7 నెలల జైలు శిక్ష విధించాలని కోరగా, కోర్టు చివరకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది.కోర్టు ఏం తేల్చింది?కోర్టు రెండు అత్యాచార కేసుల్లో మారియస్ను దోషిగా నిర్ధారించింది. మరికొన్ని అత్యాచార ఆరోపణల నుంచి అతడికి విముక్తి లభించినప్పటికీ, గృహహింస మరియు ఇతర నేరాల్లో కూడా దోషిగా తేలాడు. విచారణ సమయంలో బాధిత మహిళల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్ డేటా, సందేశాలు, వీడియో ఆధారాలు తదితర అంశాలను కోర్టు పరిశీలించింది. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు నార్వే సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి.మరోవైపు.. మారియస్ అత్యాచార ఆరోపణలను ఎప్పటి నుంచో ఖండిస్తున్నాడు. తాను అత్యాచారాలకు పాల్పడలేదని, అయితే కొన్ని చిన్న నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, దాడి వంటి ఆరోపణలను మాత్రం అంగీకరించాడు. తీర్పుపై అప్పీల్ చేసే హక్కు అతనికి ఉంది.రాజ కుటుంబంపై తీవ్ర ప్రభావంఈ కేసు నార్వే రాజ కుటుంబ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. విచారణ సమయంలో రాజ్యాంగ రాజరిక వ్యవస్థపై ప్రజల మద్దతు కూడా తగ్గిందని సర్వేలు సూచించాయి. అయితే ఇటీవలి నెలల్లో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ పరిణామాల మధ్య యువరాణి మెట్టే-మారిట్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ప్రస్తుతం ఊపిరితిత్తుల మార్పిడి (Lung Transplant) కోసం వేచి ఉన్నట్లు సమాచారం. తన తల్లి ఆరోగ్య పరిస్థితి కారణంగా తాత్కాలిక విడుదల కోరిన మారియస్ అభ్యర్థనను కూడా అప్పీల్ కోర్టు తిరస్కరించింది.నార్వేలో చర్చనీయాంశంరాజ కుటుంబానికి సమీప వ్యక్తి అయినప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని మహిళా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. రాజకీయ, సామాజిక వర్గాలు కూడా నార్వే న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశంసిస్తున్నాయి. -
బీబీసీలో ఉద్యోగాల కోత.. 2,000 మందికి ఉద్వాసన?
లండన్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన బ్రిటన్ వార్తా సంస్థ ‘బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ) సంస్థలోని ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా వచ్చే వారం నుండి వందలాది ఉద్యోగాలను తొలగించనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తు నిధుల కేటాయింపులపై సంస్థలో చర్చలు చివరి దశకు చేరిన తరుణంలో ఈ సంచలన నిర్ణయం వెలువడింది.వార్తా విభాగానికి భారీ దెబ్బసంస్థలో దాదాపు 10 శాతం మేర ఖర్చులను తగ్గించుకోవాలని బీబీసీ అంతర్గత బృందాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏకంగా 2,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అయితే ఈ లేఆఫ్స్ ప్రభావం మొదటగా బీబీసీ ప్రధాన వార్తా విభాగంపైనే పడనుంది. మొత్తం 20,000 మందికి పైగా సిబ్బంది ఉన్న ఈ సంస్థలో, కేవలం వార్తా విభాగంలోనే పావువంతు మంది పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం బడ్జెట్ జీతాలకే కేటాయిస్తుండటంతో, వచ్చే వారం ప్రకటించబోయే తొలి విడత తొలగింపుల్లో న్యూస్ టీమ్ నుండే వందలాది మంది సిబ్బందిని తొలగించనున్నట్లు సమాచారం.పొదుపు చర్యలు.. డిజిటల్ వైపు అడుగులుకంటెంట్ విభాగాల్లో సిబ్బందిని తొలగించకుండా ఇతర మార్గాల్లో ఖర్చులు తగ్గించుకునే వీలున్నప్పటికీ, న్యూస్ టీమ్లో మాత్రం ఉద్యోగాల కోత తప్పడం లేదు. అయితే ఈ మార్పుల వల్ల కొన్ని రేడియో కార్యక్రమాలు, ఇతర సేవల్లో వీక్షకులు మార్పులను గమనించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థవ్యాప్తంగా కొత్త నియామకాలు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు కాన్ఫరెన్స్లు, అవార్డు వేడుకల ఖర్చులను కూడా తగ్గించారు. ప్రస్తుత నిర్వహణ ఖర్చులను తగ్గిస్తూనే, భవిష్యత్తు ప్రాజెక్టులైన ‘ఐప్లేయర్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్, యూట్యూబ్ లలో డిజిటల్ ఉనికిని బలోపేతం చేయడం కోసం ఈ పొదుపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.గ్లోబల్ మీడియాలో లేఆఫ్స్ ట్రెండ్ప్రస్తుతం బ్రిటన్లో లైవ్ టీవీ లేదా బీబీసీ ఐప్లేయర్ చూడాలంటే లైసెన్స్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. కానీ నెట్ఫ్లిక్స్ వంటి ప్రైవేట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లకు ఇది వర్తించదు. దీంతో ప్రభుత్వం ఈ లైసెన్స్ ఫీజు నమూనాను సవరించే యోచనలో ఉంది. ఇదిలావుండగా మీడియా రంగంలో ఉద్యోగాల కోత ఒక్క బీబీసీకే పరిమితం కాలేదు. ఇటీవలే అమెరికాకు చెందిన ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ (ఏపీ) విజువల్ రిపోర్టింగ్పై దృష్టి పెడుతూ, 20 మంది జర్నలిస్టులను తొలగించింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ సైతం తన సిబ్బందిలో ఏకంగా మూడో వంతు మేర తగ్గించుకోవడం గమనార్హం. -
కట్లపాము కాటు.. క్షణాల్లో ప్రాణాపాయం!
శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో పాముకాటు మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోనే పాముకాట్లు అధికంగా ఉంటున్నాయి. ఏటా రెండు వేల మందికిపైగా పాముకాటుకు గురవుతున్నారు. అందులో 400 మంది వరకూ మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రైతులే కావడం బాధాకరం. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములు ప్రాణాలు బలిగొంటున్నాయి. జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు కూ డా ఉన్నాయి. వేడి వాతావరణాన్ని తట్టుకోలేక విష జంతువులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్తున్న వారిని కాటు వేస్తున్నాయి. అందుకే రైతులు, శ్రమజీవులు పొలాలకు వెళ్లినప్పడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.పాముకాటు వేసిన వెంట నే సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణా లు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవెలెంట్ యాంటీ వినమ్’ శాసీ్త్రయంగా నిరూపితమైన మందు. దాదాపు అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అందుబాటులో ఉంచిన ట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలున్నాయి. సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది. కానీ మొదటి 5–10 డోసుల వరకూ ఉంటుంది. అటు తర్వాత జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి వెళితే ఉపశమనం దక్కుతుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వీనమ్ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లాలో 60 పీహెచ్సీలతోపాటు 108, 104 వాహనాల్లో యాంటీ వినమ్ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచితే పాముకాటు మృతులను తగ్గించవచ్చు. కొన్ని ఘటన●ఈ నెల 10న ఎల్ఎన్పేట మండలం జాడుపేట గ్రామానికి చెందిన కరణం సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు.●గత ఏడాది నవంబరు 10న జలుమూరు మండలం యాతపేట గ్రామానికి చెందిన వాడ సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.●గత ఏడాది సెప్టెంబరు 11న ఎల్ఎన్పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.●గత ఏడాది జూలైలో ఒక్క ఎల్ఎన్పేట మండలంలోనే 26 మంది పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు విష నాగుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.ఇలా చేయాలి!పొలాల గట్లపై నడిచేటప్పుడు కర్రతో చప్పుడు చేయడం మంచిది. రాత్రి పూట పొలానికి వెళితే కచ్చితంగా టార్చ్లైట్ వినియోగించాలి.ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి.పాముకాటు బాధితులకు దైర్యం చెప్పాలి. భ యంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.కొందరు కాటు వేయగానే కత్తి, బ్లేడుతో గాట్లు పెడుతుంటారు. అలాంటివి చేయకూడదు.గాయం పైభాగాన్ని వస్త్రంతో గట్టిగా కట్టి ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.ఆస్పత్రికి తీసుకెళ్లాలిపాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాటువైద్యం పేరుతో జాప్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ప్రభుత్వాస్పత్రు ల్లో యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి వీలైనంత త్వరగా చేరిస్తే ప్రాణాలు కాపాడగలం.– పి.సాయికుమార్ వైద్యాధికారి, హిరమండలం -
జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.కలిగే లాభాలు..జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. అలాగే ఈ పండులో విటమిన్ సీ, లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..) -
ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే.. బీజేపీ బ్యాన్ ?
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గనుక ప్రస్తుతం బ్రతికి ఉంటే బీజేపీని దేశంలో బ్యాన్ చేసేదన్నారు. జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటరిచ్చింది.జైపూర్లో ఓ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన అశోక్ గెహ్లాత్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ "ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు గత 50 ఏళ్లుగా నేను చూడలేదు. ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు ఈ రోజు జీవించి ఉంటే, ఆమె బీజేపీ లాంటి పార్టీని నిషేధించి ఉండేవారు. నేటి వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉందని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. దేశం ఇప్పటికీ మేల్కొనకపోతే, భవిష్యత్తులో ఈ దేశ ప్రజలే ఈ మతవివక్ష మూలంగా ఏర్పడే పర్యవసానాలను అనుభవిస్తారు." అని ఆయన అన్నారు.దేశంలోనే అత్యధిక చట్టసభల స్థానాలు కలిగిఉన్న ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు కనీసం సీట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీరు సెక్యులర్ పార్టీ అని దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఐదు సీట్లు ఇచ్చి ఉండవచ్చు. కానీ మీది మతతత్వ పార్టీ అని 'మేము పూర్తిగా హిందుత్వ పార్టీ' అని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కేవలం హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించడమే ఆలోచనగా ఉన్నవారికి టికెట్లు ఇచ్చారన్నారు. మీరు కేవలం హిందుత్వ ఎజెండాతోనే పార్టీని నడుపుతారా? కేవలం హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? అని ఆయన బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.కాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇది హిందువుల పట్ల, హిందుత్వ పట్ల కాంగ్రెస్కు ఉన్న ద్వేషాన్ని మాత్రమే చూపిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు."కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందుత్వను ద్వేషిస్తుంది. దీనికి నిదర్శనం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలేనని తెలిపింది. హిందుత్వం అంటే మతం కాదు అది ఒక జీవన విధానమని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం చెప్పింది. మరి ఇందిరా గాంధీ దానిని ఎందుకు నిషేధిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
విజయ్ ప్రభుత్వంపై.. నో కామెంట్స్
సాక్షి, చెన్నై: రజనీకాంత్ గొప్ప నాయకుడు అని, ఆయన 2021లో రాజకీయాలలోకి రాక పోవడం తనకు కొంచెం బాధ కలిగించిందని ఆయన సతీమణి లతా రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. ఆమె తమిళనాట ఓ సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో ఆదివారం ఆమె ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీ కాంత్ గొప్ప నాయకుడు అని ఆయన రాజకీయాలలోకి రాక పోవడం పెద్ద లోటుగా వ్యాఖ్యలు చేశారు. 2021లో ఆయన రాలేదన్న కారణం పక్కన పెడితే కొంత బాధగా అనిపించిందన్నారు. ఆయన వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అని్పస్తున్నదన్నారు. ఎందు కంటే ఆయన లో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని, ఆయనలో ఎన్నోకలలు ఉన్నాయని పేర్కొంటూ దురదృష్ట వశాత్తు కోవిడ్ కాలంలో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.ఒక రాష్ట్రం ఎలా ఉండాలోఆయన ప్రణాళిక వేసుకున్నారని, ఆయన దార్శనికత తనకు తెలుసునని, మనం ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయామని్పస్తుందన్నారు. నో కామెంట్స్ తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని 30 రోజుల ప్రభుత్వంపై తాను ఇప్పడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వ్యాఖ్యానించారు. ఒక సాధారణ పౌరురాలిగా, తాను తమిళనాడులో జరుగుతున్న అన్ని రాజకీయ, సామాజిక పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉన్నానని, అయితే, ప్రభుత్వం ఏర్పాటై చాలా తక్కువ సమయం మాత్రమే అయ్యిందన్నారు. ఇంత తక్కువ సమయంలో తాను ఈ ప్రభుత్వం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను.. చేయను కూడ్ఙా అని ఆమె పేర్కొన్నారు. -
పీఎఫ్ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..
రిటైర్మెంట్ అనంతరం మెరుగైన జీవనం కోసం ఉద్యోగులు తమ సర్వీసు కాలమంతా పీఎఫ్ సొమ్మును పొదుపు చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వచ్చే భారీ మొత్తంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగుతుందని భావిస్తారు. అయితే ఇలాగే పొదుపు చేసుకున్న పీఎఫ్ సొమ్మును అందుకున్న ఓ ఉద్యోగిని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ఈపీఎఫ్వో నోటీసు ఇచ్చింది. దీనికిపై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లగా ఏం జరిగిందంటే..పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈపీఎఫ్వో (EPFO) కోరడం చట్టబద్ధం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే, వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్దేనని, ఉద్యోగిదికాదని కోర్టు తేల్చిచెప్పింది.జస్టిస్ నగేష్ భీమాపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నెం. 6276పై ఈ తీర్పు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి జె.వి. నృపేందర్ రావుకు ఈపీఎఫ్వో జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది. అయితే సదురు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్వోకు ఇచ్చింది.రూ.2.5 కోట్ల చెల్లింపుతో మొదలైన వివాదంజె.వి. నృపేందర్ రావు పనిచేసిన సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్ట్కు 1981 నుంచే ‘ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్’ హోదా ఉండేది. అయితే సంస్థ 2023 మార్చి 1 నుంచి ఆ హోదాను సరెండర్ చేసింది. అనంతరం 2023 జూలై 21న రావుకు రూ.2.50 కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించింది. మరో రూ.70 లక్షలు యెస్ బ్యాంక్ బాండ్లలో నిలిచిపోవడంతో తర్వాత చెల్లిస్తామని తెలిపింది.సంస్థ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో భాగంగా యెస్ బ్యాంక్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చర్యల కారణంగా ఆ బాండ్లు నిలిచిపోవడంతో కొంత మొత్తం విడుదల కాలేదు. దీంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు జరిగాయి.ఈపీఎఫ్వో రికవరీ నోటీసుఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత పీఎఫ్ ట్రస్ట్ ఉద్యోగికి నేరుగా చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్వో అభిప్రాయపడింది. ఉద్యోగి అందుకున్న రూ.2.5 కోట్లను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని దీంతో 2025 ఫిబ్రవరి 17న నోటీసు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.కోర్టు ఏమంది?ఈపీఎఫ్ చట్టం ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక భద్రత చట్టమని హైకోర్టు పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్వోకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా యజమాన్య సంస్థ, దాని ట్రస్ట్పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగి తనకు చట్టబద్ధంగా రావలసిన మొత్తాన్ని స్వీకరించినందుకు అతనిపై రికవరీ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.అంతేకాకుండా ఉద్యోగిపై మోసం, తప్పుడు సమాచారం లేదా కుమ్మక్కు ఆరోపణలు ఏవీ లేవని కోర్టు గమనించింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి నుంచి డబ్బు వసూలు చేయడానికి చట్టంలో స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది. రికవరీ నోటీసు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈపీఎఫ్వో జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.అయితే పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందా? లేదా? అన్న అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అవసరమైతే ఈపీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్వోకు స్వేచ్ఛ ఇచ్చింది.సొంత పీఎఫ్ ట్రస్ట్ అంటే ఏమిటి?సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్ చందాలు నేరుగా ఈపీఎఫ్వోకు వెళ్తాయి. కానీ కొన్ని సంస్థలు అనుమతి తీసుకుని తమ సొంత పీఎఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాయి. ఉద్యోగుల, యజమాని చందాలను ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది. -
స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవం
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు విద్యార్థులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మరియు రక్షణ రంగ సంస్థలతో గూగుల్ ఒప్పందాలకు నిరసనగా కొంతమంది విద్యార్థుల బృందం సభ నుండి బయటకు వెళ్ళిపోయి నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ, రక్షణ సంబంధిత పనులలో ప్రధాన టెక్ సంస్థల ప్రమేయంపై యూఎస్ క్యాంపస్లలో విద్యార్థులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ నిరసన చోటు చేసుకోవడం గమనార్హం.సాధారణంగా విద్యార్థుల ఆనందోత్సాహాలు, సాధించిన విద్యా విజయాలతో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన ఈ వేడుక విద్యార్థుల వాకౌట్తో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. ప్రసంగం కొనసాగుతుండగా పలువురు గ్రాడ్యుయేట్లు ఒకేసారి లేచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా'స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా', 'నో టెక్ ఫర్ అపార్తీడ్' వంటి సామాజిక సంస్థలు ఈ నిరసన చేపట్టాయి. దీంతో పిచాయ్ తన ప్రసంగాన్ని టెక్నాలజీ అంశాలపై లోతైన చర్చకు దూరంగా, పట్టభద్రులకు సాధారణ సలహాలకే పరిమితం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ విభాగాలతో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఈ నిరసన చేపట్టారు.Stanford grads walk out as Google CEO Sundar Pichai takes the stage as commencement speaker. No mention of AI, unlike other uni speakers getting booed down this year. Story for @sfgate shortly pic.twitter.com/qvS2rJ91Ip— Matt Brown (@maattttbrown) June 14, 2026మరోవైపు ఇటీవల ఇతర యూనివర్సిటీల్లో ఇలాంటి విషయాలపై టెక్ ప్రముఖుల ప్రసంగాలకు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2015 నుండి గూగుల్కు నాయకత్వం వహిస్తున్న, స్టాన్ఫర్డ్ పూర్వ విద్యార్థి పిచాయ్, తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా సాంకేతిక రంగ పరిణామాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?సుందర్ పిచాయ్ సందేశంపిచాయ్ ప్రసంగాన్ని చాలా సరళంగా, వ్యక్తిగత విషయాలకే పరిమితం చేశారు. 1990లలో కాలిఫోర్నియాలో తన తొలి రోజుల నాటి ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అలాగే ఈ వేదికపై "ఏం మాట్లాడకూడదో" తనకు చాలా సలహాలు వచ్చాయంటూ కాస్త హాస్యాన్ని జోడించారు. డిగ్రీ పూర్తి చేసుకుని కొత్తగా కెరీర్ ప్రారంభించబోయే విద్యార్థులు ఎల్లప్పుడూ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్ -
నీట్ రీ ఎగ్జామ్కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్
ముజఫర్పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్కు కౌంట్డౌన్ ప్రారంభమైన వేళ బీహార్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మాకు డబ్బులు అందాయి, నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పంపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ నెట్వర్క్ను పోలీసులు చేధించారు.సోషల్ మీడియా వేదికగా ఫేక్ పేపర్ల దందాబీహార్లోని ముజఫర్పూర్లో పట్టుబడిన ఈ ముఠా.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా నీట్ అభ్యర్థులను ట్రాప్ చేసినట్లు ఎస్ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ, అవే అసలైన పేపర్లు అని నమ్మించి నిందితులు ఆన్లైన్ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని ఆపై చేతులెత్తేయడం ఈ ముఠా ప్రధాన వ్యూహం.మనీష్ ఇచ్చిన సమాచారంతో గ్యాంగ్ అరెస్ట్ఈ నెల జూన్ 2వ తేదీన సికింద్పూర్ పోలీసులు మనీష్ అనే వ్యక్తిని నకిలీ పేపర్లు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ నీట్ ఫేక్ పేపర్ల స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. మనీష్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ముజఫర్పూర్ పోలీసులు.. హర్ష్, అమన్ కుమార్, కన్హయ్య కుమార్, హర్ష్ కనేడియా అనే మరో నలుగురు నిందితులను వేటాడి పట్టుకున్నారు.జూన్ 21న కట్టుదిట్టంగా నీట్ రీ-ఎగ్జామ్మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా రద్దయిన ఈ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష పారదర్శకత కోసం అధికారులు ‘పరీక్ష కర్మయోగి’ అనే ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. -
ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్వీడన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎఫ్లో భాగంగా సోమవారం స్వీడన్ 5-1 తేడాతో ట్యునీషియాతోను చిత్తు చేసింది. 22 ఏళ్ల మిడ్ఫీల్డర్ యాసిన్ అయారి సంచలన ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ప్రారంభమైన ఏడు నిమిషాలకే యాసిన్ అయారి గోల్ కొట్టి స్వీడన్కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆట 30వ నిమిషంలో అలెగ్జాండర్ ఐసాక్ గోల్ కొట్టడంతో స్వీడన్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ట్యునీషియా ఆటగాడు ఒమర్ రెకిక్ ఆట 43వ నిమిషంలో గోల్ కొట్టడంతో ట్యునీషియా ఖాతా తెరిచింది. అయితే రెండో హాఫ్లో పదే పదే ట్యునీషియా గోల్ పోస్టుపై స్వీడన్ దాడులు చేసింది. ఈ క్రమంలో విక్టోర్ (ఆట 59వ నిమిషం), మాట్టియస్ (ఆట 84వ నిమిషం)లో గోల్స్ కొట్టడంతో స్వీడన్ 4-1తో మరింత ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా యాసిన్ అయారి మరో గోల్ కొట్టి స్వీడన్కు 5-1తో మరిచిపోలేని విజయాన్ని అందించాడు.సంబరాలకు దూరంగా యాసిన్స్వీడన్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ జట్టు మిడ్ఫీల్డర్ యాసిన్ అయారి సంబరాలకు దూరంగా ఉండిపోవడం వెనుక బలమైన కారణముంది. అదేంటంటే యాసిన్ అయారికి ట్యునీషియాతో మంచి సంబంధాలున్నాయి. యాసిన్ స్వీడన్ దేశస్తుడైనప్పటికీ అతడి తండ్రి మాత్రం ట్యునీషియాలోనే పుట్టి పెరిగాడు. తండ్రికి చెందిన దేశంపై గెలిచినందునే తాను సెలబ్రేషన్స్కు దూరంగా ఉన్నట్లు యాసిన్ అయారి మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. 2023లో స్వీడన్ జాతీయ ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన యాసిన్ అయారి అప్పటినుంచి జట్టు తరఫున సంచలన ప్రదర్శనలు కనబరుస్తూ కీలక ఆటగాడిగా మారిపోయాడు.GOAL Alexander Isak! Sweden 2-0 vs Tunisia 🇸🇪 pic.twitter.com/mEKataxFFz— Swedish Football News (@SwefootballEN) June 15, 2026చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ -
దెందులూరు ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత అర్ధరాత్రి న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటి వద్ద అనుచరులతో హల్చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో చింతమనేని అక్రమాల బాగోతాన్ని బయటపెట్టిన లాయర్ శ్రీనివాసపైనే టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది.లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో చింతమనేనికి క్లీన్ చిట్ లభించినట్లయ్యింది. ఇదిలా ఉంటే.. శ్రీనివాసబాబు గతంలో చింతమనేని తరఫున కేసులు వాదించడం గమనార్హం. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విబేధాలు నడుస్తున్నాయి. చింతమనేని నియోజకవర్గంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారంటూ శ్రీనివాస్ పార్టీకి నివేదికలు పంపే ప్రయత్నాలు చేశారు.ఇది తెలుసుకున్న చింతమనేని.. శ్రీనివాస్ తనను, తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆరోపణలకు దిగారు. గత రాత్రి జేసీబీలతో సహా శ్రీనివాసబాబు ఇంటికి చేరుకుని ఇంటి ముట్టడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తీవ్ర ఆగ్రహంతో “నన్ను ఆపుతారేంటి?.(పోలీసులను ఉద్దేశించి..).. కూల్చు.. కూల్చు(జేసీబీ డ్రైవర్లను ఉద్దేశించి..). వాడో నేనో తేలాల్సిందే” అంటూ బహిరంగంగా హెచ్చరించారు. ఆ సమయంలో చింతమనేనిని కూడా శ్రీనివాస్ గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు.. నానా హంగామా చేసిన చింతమనేనిని రాచమర్యాదలతో ఇంటికి పంపించారు. మరోవైపు శ్రీనివాసబాబును, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ తీసుకున్న చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ క్రమశిక్షణ చర్యగా పార్టీ చెబుతున్నప్పటికీ, చింతమనేని అరాచకాలకు మద్దతు పలకడం ఏంటని? కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు.. శ్రీనివాస్ భార్య మీడియా ముందుకు వచ్చి జరిగింది చెప్పి వాపోతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తన భర్త, తన కొడుకును టార్గెట్ చేశారని.. పోలీస్ స్టేషన్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లిద్దరితో పాటు తనను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలకు దిగారామె. -
బాబూ.. పవన్, లోకేశ్ వెళ్తే సరిపోతుందా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.స్టీల్ ప్లాంట్ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
అలా వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా, పాగల్, రెడ్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో అలరించిన బ్యూటీ నివేదా పేతురాజ్. 2023లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీలో కనిపించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన సింగ్ గీతంలో మెరిసింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అనుకున్నాననని తెలిపింది. 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి తన ప్లాన్ అంతా రాంగ్ రూట్లోనే వెళ్లిందని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సింగ్ గీతంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. కానీ నాగ్ అశ్విన్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. లేదంటే ఇప్పటికే హిమాలయాల్లో ఉండేదాన్నేమోనని కామెంట్స్ చేసింది. కాగా.. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. నాగ్ అశ్విని నిర్మించారు.చదవండి: పెళ్లి రద్దుపై తొలిసారి స్పందించిన హీరోయిన్ -
అప్పుడు మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్ చేశారు: సమంత
సమంత.. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఆమె హీరోయిన్గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమంత. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం ఓ అభిమాని గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత ఏం జరిగిందో వివరించింది.ఆంధ్రప్రదేశ్ని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని సమంత కోసం 2023లో ఓ గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుడి కట్టారనే విషయం తెలిసి తాను కూడా షాకయ్యానంటోంది సమంత.‘గుడి కట్టించుకునేంత అర్హత నాకు లేదు. నేనేం స్పెషల్ కాదు. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. అంతేకాని నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. ఇలా గుడి కట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఆ అభిమానితో నేను మాట్లాడాను. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ఆ గుడి కట్టి పూజలు చేశాడట. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే గుడి కట్టిన విసఁం తెలిసిన తర్వాత మాత్రం మా ఇంట్లోవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నీకోసం గుడి కట్టారట అంటూ ఇంట్లో వాళ్లే ట్రోల్ చేశారు(నవ్వుతూ..)’ అని సమంత చెప్పుకొచ్చింది. -
నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.అయితే, ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఎంపీల జంప్పై.. అఖిలేష్కు ఒవైసీ సూటి ప్రశ్న!
బహ్రైచ్: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)అధినేత అసదుద్దీన్ ఒవైసీ సరికొత్త కలకలం రేపారు. బహ్రైచ్ జిల్లాలోని మటేరా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు పార్టీని వీడటంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఓవైసీ సంధించిన ప్రశ్న ఇప్పుడు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అఖిలేష్ యాదవ్కు సూటి ప్రశ్నబహ్రైచ్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓవైసీ స్థానిక సమాజ్వాదీ పార్టీ ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. ‘మీరు ఓట్లేసి గెలిపించిన ఎస్పీ నాయకులు ఈ ప్రాంతానికి ఏం చేశారు? కనీసం ఒక ఆస్పత్రి కూడా నిర్మించలేదు’ అని ఆరోపించారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నుండి ఎంపీలు పార్టీలు మారిన ఉదాహరణను గుర్తు చేస్తూ.. ‘అఖిలేష్ యాదవ్.. మమతా బెనర్జీకి చెందిన 20 మంది ఎంపీలు పార్టీని ఎందుకు వీడి వెళ్లారో చెప్పండి? దీనిపై విపక్షాలు ఎందుకు మాట్లాడవు?’ అని ఒవైసీ ప్రశ్నించారు.గౌరవప్రదమైన కూటమికే మొగ్గుబీజేపీని ఓడించేందుకు ప్రయత్నించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒవైసీ స్పష్టం చేశారు. అయితే ఏ కూటమి అయినా 'గౌరవం, సమానత్వం' ఆధారంగానే సాగాలని, కేవలం ఎవరి కిందో ఉండి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో సమాన వాటా గురించే చర్చలు జరగాలన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వని ఎస్పీ తీరును ఆయన తప్పుపట్టారు.యోగీ ప్రభుత్వంపై ఎన్కౌంటర్ల అస్త్రంయూపీలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతల పేరుతో రాష్ట్రంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాలన అనేది చట్టబద్ధంగా సాగాలని హితవు పలికారు. సంభల్, వారణాసి మసీదు వివాదాలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి చర్యల వల్ల ఏ సమాజపు విశ్వాసం బలహీనపడదని అన్నారు. రాబోయే 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళిత-ముస్లిం ఐక్యత కోసం బీఎస్పీతో పొత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఒవైసీ సంకేతాలిచ్చారు.ఇది కూడా చదవండి: కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ! -
కీచక ఎస్ఐ: భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేళ్లుగా..!
వరంగల్ క్రైం: ఓ వివాహితకు న్యాయం చేస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన సీసీఎస్ విభాగ ఎస్సై రాజ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆదివారం వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఓ యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022 మార్చిలో బాధితురాలు తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాజ్కుమార్ బాధితురాలికి న్యాయం చేస్తానని నమ్మించాడు. తనకు పరిచయం ఉన్న న్యాయవాది ద్వారా ఆమెకు భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు.ఈ క్రమంలో బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధం కారణంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రాజ్కుమార్ నిరాకరించినట్లు బాధితురాలు ఆరోపించింది.తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితుడు రాజ్కుమార్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
పెద్ది సక్సెస్.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో అతడేనా?
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో మహేశ్బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఫిఫా షాక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ఒమర్ ఆర్టాన్
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్కప్లో మ్యాచ్లను నిర్వహించాల్సిన ఓ రిఫరీకి ఊహించని అవమానం ఎదురైంది. సోమాలియాకు చెందిన ప్రముఖ రిఫరీ ఒమర్ అబ్దుల్కదీర్ ఆర్టాన్కు అమెరికాలోకి ప్రవేశం నిరాకరించారు. అందుకు సరైన కారణాలేవీ చూపించకపోవడమూ తీవ్ర దుమారం రేపింది. దీంతో.. ఆయన ప్రపంచకప్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ పరిస్థితుల్లోనూ ఆయనోక బంపర్ ఆఫర్ తగిలింది.. సోమాలియా రిఫరీ ఓమర్ ఆర్టాన్కు అమెరికాలో ఊహించని షాక్ ఎదురైంది. మియామీ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన్ని.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయన్ని ఆపేసి విచారణ పేరుతో 11 గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన ప్రయాణ ఉద్దేశ్యం, ప్రపంచకప్లో తన అధికారిక బాధ్యతలు, అలాగే సోమాలియాలోని రాజకీయ పరిస్థితులు, భద్రతా నేపథ్యం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోమాలియాలో క్రియాశీలంగా ఉన్న అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణ అనంతరం అధికారులు ఆయనను ‘అమెరికాలో ప్రవేశానికి అనర్హుడు’ (inadmissible)గా ప్రకటించి.. తిరిగి పంపించారు. జూన్ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు పాస్పోర్ట్ వెరిఫికేషన్, భద్రతా డేటా మ్యాచ్ లేదంటే వెట్టింగ్ ప్రాసెస్లో వచ్చిన సందేహాల ఆధారంగా తీసుకుంటారు. అయితే ఆర్టాన్ విషయంలో ఖచ్చితమైన కారణాన్ని అధికారులు బహిర్గతం చేయకపోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో తమ వైపు నుంచి వివరణ ఇస్తూ అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్.. ఇది సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమేనని, అవసరమైన వెట్టింగ్ ప్రక్రియ కారణంగానే ప్రవేశం నిరాకరించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతర్జాతీయ ఈవెంట్ అధికారుల విషయంలో కూడా భద్రతా ప్రోటోకాల్లు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్బాల్ వర్గాల్లో విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్కు అధికారికంగా ఎంపికైన రిఫరీకి ఇలా ప్రవేశం నిరాకరించడం సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడ్డారు.అయితే.. వరల్డ్కప్లో అంపైరింగ్ చేసే అవకాశం కోల్పోయినా, ఒమర్ ఆర్టాన్ కెరీర్ అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో ప్రవేశం నిరాకరించబడటంతో ఆయనకు ప్రపంచకప్ మ్యాచ్లను ఆఫిషియేట్ చేసే అవకాశం దక్కలేదంతే. కానీ ఆయన అనుభవం, ప్రతిభను గుర్తించిన యూరప్ ఫుట్బాల్ సంస్థ యూఈఎఫ్ఏ ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది. దీని ప్రకారం ఆర్టాన్కు యూఈఎఫ్ఏ సూపర్ కప్ మ్యాచ్లో రిఫరీగా పనిచేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ సాధారణంగా యూరప్లోని రెండు ప్రధాన క్లబ్ టోర్నమెంట్ల విజేతల మధ్య జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్లబ్ మ్యాచ్లలో ఒకటిగా పరిగణిస్తారు.34 ఏళ్ల ఆర్టాన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ రిఫరీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2025లో ఆఫ్రికా ఫుట్బాల్ సమాఖ్య(CAF కాఫ్) రిఫరీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతకుముందు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్, కాఫ్ చాంపియన్స్ లీగ్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్లకు ఆయన రిఫరీగా వ్యవహరించారు.ఫిఫా షాక్తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆర్టాన్కు సోమాలియాలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వందలాది అభిమానులు, అధికారులతో కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టాన్ మాట్లాడుతూ వచ్చే వరల్డ్కప్లో తప్పకుండా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. “దేవుని ఆశీస్సులతో తదుపరి టోర్నమెంట్లో ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు. -
హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, బ్యాటింగ్లో రూథర్ఫోర్డ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలాగె (43 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, కమిల్ మిశారా (28), నిస్సాంక (26) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 5 వికెట్లు తీయగా, అకిల్ హొసెన్, మాథ్యూ ఫోర్డె, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. 53 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ను రోవ్మెన్ పావెల్ (33), రూథర్ఫోర్డ్ (54 నాటౌట్) చక్కదిద్దడమే గాక జట్టును విజయంవైపు నడిపించారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న క్రమంలో పావెల్ ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (5 బంతుల్లో 21 నాటౌట్) మూడు భారీ సిక్సర్లు బాది వెస్టిండీస్ను గెలిపించాడు. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా, వెల్లలాగె, దుష్మంత చమీర, తీక్షణ తలా ఒక వికెట్ తీశారు. షమర్ జోసెఫ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలుచుకున్నాడు. 2024 తర్వాత వెస్టిండీస్ తమ సొంతగడ్డపై టీ20 సిరీస్ నెగ్గడం విశేషం. ఇరుజట్ల మధ్య జూన్ 25 నుంచి అంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగనుంది.మ్యాచ్లో నమోదైన పలు రికార్డులు..👉ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సబీనా పార్క్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. గతంలో ఈ మైదానంలో ఐర్లాండ్కు బౌలర్ అలెక్స్ కుసాక్ (4/11) అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జోసెఫ్ బద్దలు కొట్టాడు.👉టీ20 క్రికెట్లో వెస్టిండీస్ తరఫున ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న రెండో బౌలర్గా జోసెఫ్ నిలిచాడు. గతంలో ఓషెన్ థామన్ ఈ ఫీట్ సాధించాడు.👉శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ టీ20 క్రికెట్లో 50 వికెట్ల మార్క్ పూర్తి చేసుకున్నాడు.చదవండి: శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో -
నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల ఆహారం, కనీసం వ్యాయామం అవసరమని ఆరోగ్యనిపుణులు నిరంతరం చెప్పేమాట. దాదాపు 93 ఏళ్ల వయసులోనూ సగం వయసున్న వారి కంటే ఎక్కువ ఫిట్నెస్తో జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలనే అబ్బుర పరిచిన ఇటలీకి చెందిన ఎమ్మీ మరియా మజ్జెంకా (Emma Maria Mazzenga) ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం.ఇటలీలోని పాడువా నగరానికి చెందిన 92 ఏళ్ల ఎమ్మీ మరియా మజ్జెంకా ఒక రిటైర్డ్ హైస్కూల్ సైన్స్ టీచర్. 90-94 ఏళ్ల విభాగంలో పలు ప్రపంచ రికార్డులను సృష్టించిన ఎలైట్ స్ప్రింటర్ (పరుగు పందెం క్రీడాకారిణి). ఆమె శారీరక దృఢత్వంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి.ఆమె శరీరం ఆక్సిజన్ను గ్రహించి, కండరాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం 30 ఏళ్ల యాక్టివ్ యువతులలో ఉన్నంత శక్తివంతంగా ఉంది. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా (Mitochondria) పని తీరు 20 ఏళ్ల యువతలో ఉన్నంత బలంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యాయామం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను పూర్తిగా మార్చేయవచ్చని ఎమ్మీ జీవితం నిరూపిస్తోందని వ్యాయామ ఫిజియాలజిస్ట్ సిమోన్ పోర్సెల్లి పేర్కొన్నారు.ఎమ్మీ ఫిట్నెస్ వ్యూహం గంటల తరబడి కష్టపడే మారథాన్లపై ఆధారపడలేదు. ఆమె కేవలం క్రమశిక్షణ (Consistency) ను నమ్ముకున్నారు.వర్కౌట్ ప్లాన్ఆమె వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. ప్రతి సెషన్ గంట లోపే ఉంటుంది. ఆమె సుదీర్ఘ పరుగు పందాల్లోనూ పాల్గొనరు.తేలికపాటి జాగింగ్తో వార్మప్, కొన్ని షార్ట్ స్ప్రింట్స్ (వేగవంతమైన పరుగు), ప్రతిరోజూ అవుట్డోర్ వాకింగ్, అప్పుడప్పుడు తేలికపాటి రెసిస్టెన్స్ వ్యాయామాలు అంతే ఆమె రొటీన్.ఇక ఆహార నియమాలువిషయానికి వస్తే..పెద్దగా నియంత్రణలు కూడా ఏమీలేవు. కఠినమైన డైట్ జోలికి వెళ్లరు. కానీ చాలా తేలికపాటి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, గుడ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. అయితే, తనకు నచ్చినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మాంసం కూడా తింటూ సమతుల్యతను కాపాడుకుంటారు.90 ఏళ్ల వయసు దాటినా కూడా శరీరం వ్యాయామానికి ఎంతో అద్భుతంగా స్పందిస్తుందని ఎమ్మీ మరియా మజ్జెంకా జీవితం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మీ జీవనశైలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.WHO ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన రూల్స్ వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ-తీవ్రత కలిగిన వ్యాయామం, లేదా 75 నుండి 150 నిమిషాల కఠినమైన వ్యాయామం .శారీరక సమతుల్యత , కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలను వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేయడం వల్ల కింద పడకుండా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.కదలికలు లేకుండా కూర్చునే అలవాట్లను మానుకుని, కేవలం తేలికపాటి వాకింగ్ చేసినా కూడా వృద్ధాప్యంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా? -
'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ మంచి స్ఫూర్తిదాయకమైన కథలను, కమనీయ ప్రదేశాల గురించి షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఈసారి ప్రకృతి రమ్యతకు, నిశబ్దమైన గంభీరతకు ఆలవాలమైన ఒక కమనీయ ప్రదేశం ఫోటోలను షేర్చేస్తూ..దాని గురించి రాసుకొచ్చారు. అంతగా చూడని, గమనించని అందమైన ప్రదేశం అంటూ..ఆ పర్యాటక అందాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంతకీ ఆ పర్యాటక ప్రదేశం ఎక్కడ ఉందంటే..కర్ణాటక తీరప్రాంతంలోని హొన్నవార్ అందాలకు ఫిదా అవ్వుతూ దాని గొప్పతనం గురించి సోషల్ మీడియా ఎక్స్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. శ్రద్ధ అనే పదానికి అర్హమైన అపురూపమైన ప్రకృతి రత్నంగా అభివర్ణించారు. తాను ప్రజలు అంతగా అన్వేషించని, రద్దీ తక్కువగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నానంటూ రాశారు. అంతా కేరళ బ్యాక్వాటర్స్(బ్యాక్ వాటర్స్ (Backwaters) అనగా నదులు, సరస్సులు లేదా సముద్రపు తీరాలకు సమీపంలో నీటి ప్రవాహం మందగించడం వల్ల ఏర్పడే నిశ్చలమైన జలాలు. )ని ప్రశంసిస్తుంటాం. కానీ కర్ణాటక తీరంలో అలాంటి బ్యాక్వాటర్కి సంబంధించిన అద్భుతమైన ప్రదేశం ఒకటి ఉందని అన్నారు. జోగ్జలపాతంపై ఘోషించే శరావతి నది చివరకు హొన్నవార్ వద్ద నిశ్శబ్దంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదోక మాయ ప్రదేశం. మడ అవడవులు, వంకరటింకరగా ప్రవహించే జలమార్గాలు, అద్దంలాంటి బ్యాక్వాటర్స్, ఎవ్వరినైన కట్టిపడేస్తాయని అన్నారు. మడ అడవులు ప్రకృతి అత్యంత సమర్థవంతమైన తీర రక్షకులలో ఒకటి కాబట్టి..హోన్నవార్ అందానికి పర్యావరణ ప్రాముఖ్యత కూడా తోడైన రమ్యమైన ప్రదేశంలా ఉంటుంది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్చేశారు. అందుకు నెటిజన్లు కూడా మద్దతిస్తూ..తమకు లిసిన తెలిసిన అద్భుత పర్యాటక ప్రదేశాల గురించి పంచుకున్నారు. కొందరు కేరళ తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ భారతదేశ తీరప్రాంతం దాగి ఉన్న అద్భుత కళాఖండాలతో నిండి ఉంది. అసాధారణంగా ఉండటానికి అందానికి జనసమూహం అవసరం లేదని మనకు గుర్తుచేసే ప్రదేశాలలో హొన్నవార్ ఒకటిగా కనిపిస్తుంది.Continuing my search for underexplored & less crowded destinations….We often celebrate Kerala’s backwaters. But on Karnataka’s coast is a hidden gem that deserves equal attention.The same river that roars over Jog Falls, the Sharavathi River, finally and quietly merges with… pic.twitter.com/N9himujjg1— anand mahindra (@anandmahindra) June 14, 2026 (చదవండి: ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..! తయారీకే ఏకంగా..) -
లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..!
అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా కూడా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఎటువంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ఈనెల 8వ తేదీన మోకా పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన యువకుడుని ఎవరు చంపారన్న దానిపై తీవ్రంగా చర్చానీయాంశమైంది. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ దిశానిర్దేశంతో స్థానిక డీవైఎస్పీ, సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో బసవన గౌడ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవన గౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లకు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ)ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని సోమవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తిరువనంతపురంలోని తంబానూర్ బస్ టెర్మినల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, మహిళా ప్రయాణికులకు సరికొత్త కానుకను అందించారు.ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభంఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ రిబ్బన్ కట్ చేసి, ఈ సేవలను ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా, కేరళవ్యాప్తంగా ఉన్న అన్ని కేఎస్ఆర్టీసీ డిపోల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. VIDEO | Kerala: Chief Minister VD Satheesan formally inaugurates the state government’s flagship ‘Priyadarshini’ free travel scheme for women and transgender individuals.This scheme is part of the UDF government’s ‘Indira Guarantee’ initiative that opens up free transit across… pic.twitter.com/r8ABPsSSS8— Press Trust of India (@PTI_News) June 15, 2026గుర్తింపు కార్డులు అవసరం లేదుఈ పథకానికి సంబంధించి రవాణా సంస్థ నిబంధనలను వెల్లడించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందడానికి మహిళలు లేదా ట్రాన్స్జెండర్లు ఎలాంటి గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రయాణం ఉచితమే అయినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య, రికార్డుల కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ‘జీరో-ఫేర్’ టికెట్ను మాత్రం తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, పథకం అధికారికంగా ప్రారంభమైన సమయం నుంచే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.3,125 బస్సుల్లో ఉచిత సేవలుప్రస్తుతానికి కేరళ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 3,125 కేఎస్ఆర్టీసీ సాధారణ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు ఈ బస్సులను సులభంగా గుర్తించేందుకు వీలుగా, వీటికి ప్రత్యేకంగా ‘ప్రియదర్శిని’ అనే స్టిక్కర్లను కూడా అంటించారు. కేరళ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా లోకం నుంచి హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఈ పథకంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సుల యూనియన్ల నుంచి సమ్మె హెచ్చరికలు కూడా వస్తున్నాయి. -
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
బేకరీలోకి వెళ్తే మీకు కేకులు, కూల్డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ ఓ షాప్లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు!ఉత్తరప్రదేశ్లోని మీరట్ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్లో షాక్లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి.చివరికి పామును అడవిలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ షాప్ మాత్రం ఒక్క రోజుకే “స్వీట్ షాప్” నుంచి “స్నేక్ షాక్ 🐍”గా ఫేమస్ అయిపోయింది!. స్వీట్స్ కోసం వెళ్లిన వాళ్లకి ‘స్వీట్ బిల్’ కాదు… జీవితాంతం గుర్తుండే షాక్ బిల్ పడింది! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.#मेरठ: दुकान में घुसा विशाल अजगरसिविल लाइन क्षेत्र में मची दहशतकर्मचारियों में मची अफरा-तफरीवन विभाग ने चलाया रेस्क्यूतीन घंटे बाद पकड़ा गया अजगरसुरक्षित रेस्क्यू के बाद राहत#Meerut #UPNews #BreakingNews #Python #Rescue #ForestDepartment #LocalNews #UPNow pic.twitter.com/RamOTx0ko5— UP NOW (@UPNOWTV) June 14, 2026 -
వింత కేసు: పుంజు పెట్ట వద్దకు వెళ్లిందని గొడవ!
కాకినాడ: ఇదో కోళ్ల పంచాయితీ.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పెట్ట వద్దకు మరో సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పుంజు వచ్చిందంట. అందుకు మండిపడిన కోడి పెట్ట యజమాని పుంజు కాలిపై గాయపరిచాడనేది పుంజు యజమాని ఆవేదన. తన పుంజును ఎందుకు కొట్టావని ప్రశి్నస్తే.. అతని కుటుంబ సభ్యులంతా కలసి అకారణంగా దూషించారట. దీంతో పుంజు యజమాని.. పెట్ట కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెలువలపల్లి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు పక్క పక్క ఇళ్లలో నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం ఒకరికి చెందిన పుంజు, మరొకరికి చెందిన పెట్ట వద్దకు ప్రకృతి సిద్ధంగా వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. మరి ఈ పంచాయితీని పోలీసులు ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి. -
ఓటీటీల్లో ఏకంగా 14 సినిమాలు.. ఆ మూవీపైనే అందరి కళ్లు..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మై అమెరికాస్ స్వీట్హార్ట్స్ (వెబ్సిరీస్:సీజన్3) జూన్ 16డ్రింకింగ్ బడ్డీస్ -(హాలీవుడ్ మూవీ) జూన్ 15ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సిరీస్)- జూన్ 18వాయిస్మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19జియో హాట్స్టార్కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16 సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు వెబ్సిరీస్) జూన్ 19అమెజాన్ ప్రైమ్యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21లయన్స్ గేట్ ప్లే..అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19సోని లివ్..అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19 -
భట్టికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలుతో వర్ధిల్లాలని కోరుకుంటూ’ విషెస్ చెప్పారు. Heartiest birthday greetings to Deputy Chief Minister Shri Mallu Bhatti Vikramarka garu. Wishing you a long, healthy, and happy life.@Bhatti_Mallu pic.twitter.com/8ExVWBQud7— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2026 -
‘ఎయిర్ ఇండియా’ ప్రమాదం.. అసలు నిజాలు దాచారా?
న్యూఢిల్లీ: గత ఏడాది దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదికపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదానికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో తీవ్ర లోపాలు ఉన్నాయంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) సంచలన లేఖ రాసింది. ఈ నివేదికలోని కాలక్రమం (టైమ్లైన్) పూర్తిగా తప్పుగా ఉందంటూ తరిగి విచారణకు డిమాండ్ చేసింది.ఆ 18 సెకన్ల మిస్టరీ.. పైలట్ల అనుమానాలుఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానంలో ఇంధన సరఫరా నిలిచిపోయిన తర్వాతే అత్యవసర ‘రామ్ ఎయిర్ టర్బైన్(ఆర్ఏటీ) యాక్టివేట్ అయిందని ప్రభుత్వ దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే పైలట్ల సంఘం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఫ్లైట్ సిమ్యులేటర్ డేటా ప్రకారం ఇంధన సరఫరా ఆగిపోయిన తర్వాత ఆర్ఏటీ విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి కనీసం 18 సెకన్ల సమయం పడుతుంది. కానీ అధికారిక నివేదికలో మాత్రం ఇది కేవలం 4 నుండి 5 సెకన్లలోనే జరిగినట్లు చూపించారు. సాంకేతికంగా ఇది సాధ్యం కాదని, విమానంలో అంతకంటే ముందే ఏదైనా విద్యుత్ లోపం తలెత్తి ఉండవచ్చని పైలట్లు అనుమానిస్తున్నారు.సీసీటీవీ విజువల్స్.. రన్వే పైనే బయటపడ్డ లోపంఈ ప్రమాదానికి సంబంధించి అహ్మదాబాద్ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే మరో షాకింగ్ నిజం బయటపడిందని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం తెలిపింది. విమానం రన్వే పైనుంచి గాల్లోకి లేవడానికి (రొటేషన్) ముందే ఈ అత్యవసర ఆర్ఏటీ సిస్టమ్ తెరుచుకున్నట్లు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇంధన స్విచ్ మార్చడం వల్ల కాకుండా, విమానంలో అంతకుముందే వ్యవస్థాగత లోపం ఉందనడానికి ఇదే బలమైన ఆధారమని వారు వాదిస్తున్నారు.పేలుడు శబ్దం.. డిమ్ అయిన లైట్లువిమానం టేకాఫ్ కావడానికి ముందే క్యాబిన్ లోపల లైట్లు డిమ్ అవ్వడం, ఓ పెద్ద పేలుడు వంటి శబ్దం రావడం, అలాగే పైలట్లకు ముందే అందిన మల్టిపుల్ మెయింటెనెన్స్ అలర్ట్ మెసేజ్లను ఈ నివేదికలో విస్మరించారని ఎఫ్ఐపీ ఆరోపించింది. విమానం వెనుక భాగంలోని ఫ్లైట్ రికార్డర్ దెబ్బతిన్న తీరును, ఈ సంకేతాలను కలిపి విశ్లేషించాల్సి ఉందని పేర్కొంది. విమాన నివేదికలోని వేగ పరిమితి (యాక్సిలరేషన్) డేటాను స్వతంత్రంగా పునఃపరిశీలించాలని, హైడ్రాలిక్ పవర్ ఉత్పత్తికి, ఇంధన నియంత్రణకు ఉన్న లింక్ను తేల్చాలని దర్యాప్తు సంస్థను పైలట్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో చీర ఆర్డర్.. రీఫండ్ లింక్తో రూ.37 వేల టోకరా
హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో
శ్రీలంక పర్యటనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో విజయవంతంగా కొనసాగుతుంది. ట్రై సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ మరోసారి నిరాశపరిచాడు. మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ వైభవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సాహన్ అరాచిగే బౌలింగ్లో వనుజా సాహన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో 14 పరుగులు చేసిన వైభవ్ ఆఫ్గన్తో మ్యాచ్లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. తాజాగా లంకతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజులో ఎక్కువసేపు నిలుస్తాడనుకున్నప్పటికీ విఫలమయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్తో రెచ్చిపోయారు. ‘వన్డే క్రికెట్లో వైభవ్ సూర్యవం ప్లాఫ్ షో కొనసాగుతోంది’.. ‘టీ20 ఆట వన్డేల్లో పనికిరాదు’.. ‘ఓవర్ హైప్ వల్ల ఆడలేకపోతున్నాడు’ అంటూ కామెంట్లు చేశారు.ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత-ఏ జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తిలక్ వర్మ తెలిపాడు. యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ తుదిజట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, విషెన్ హలంబాగే, సదీర సమరవిక్రమ, అహన్ విక్రమసింఘే, సహన్ అరాచ్చిగే(కెప్టెన్), వనుజా సహన్, విజయకాంత్ వియస్కాంత్, కుగతస్ మతులన్, చమిక కరుణరత్నే, మహ్మద్ షిరాజ్. -
వెల్డర్గా చేరాడు.. జాక్పాట్తో కోటీశ్వరుడిగా..
ఉద్యోగంలో భాగంగా కంపెనీ ఇచ్చిన కొన్ని షేర్లు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పే ఉదాహరణలు కార్పొరేట్ ప్రపంచంలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. తాజాగా అమెరికాలో అలాంటి కథే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు గంటకు 28 డాలర్ల వేతనంతో పనిచేసిన స్పేస్ఎక్స్ మాజీ వెల్డర్ జువాన్ హెర్నాండెజ్.. కంపెనీ ఇచ్చిన సుమారు 10,000 డాలర్ల (దాదాపు ₹9.5 లక్షలు) స్టాక్ గ్రాంట్ కారణంగా ఇప్పుడు దాదాపు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు ₹10 కోట్లు) సంపదకు యజమానిగా మారాడు.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ ఇటీవల చరిత్రాత్మక ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఐపీఓకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. సంస్థ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజే గణనీయంగా పెరగడంతో ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల వద్ద ఉన్న షేర్ల విలువలు అమాంతం ఎగబాకాయి. దీంతో, కొందరి పంట పండినట్టు అయ్యింది.సాధారణ ఉద్యోగమే అనుకున్నా..మెక్సికోకు చెందిన జువాన్ హెర్నాండెజ్ 2015లో స్పేస్ఎక్స్లో వెల్డర్గా చేరాడు. అప్పట్లో అతను గంటకు 28 డాలర్ల వేతనం పొందేవాడు. స్పేస్ఎక్స్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతుందని తాను ఊహించలేదని జువాన్ మీడియాకు తెలిపాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కంపెనీ ఇతర ఉద్యోగుల మాదిరిగానే అతనికి కూడా స్టాక్ ఆప్షన్లు, షేర్ గ్రాంట్లు ఇచ్చింది. అయితే, ఆ సమయంలో వాటి విలువ కేవలం 10,000 డాలర్ల వరకే ఉండేది. సాధారణంగా చాలామంది ఉద్యోగులు చేసేలా వాటిని పట్టించుకోకుండా ఉంచేశానని ఆయన చెప్పారు.From $28/hr welder to MILLIONAIRE thanks to SpaceX! 😳Mexican immigrant Juan Hernandez joined in 2015 knowing NOTHING about the company. Got $10k in stock as a full-time worker... now his shares are worth over $1M after the IPO! 💰 pic.twitter.com/37Y0IyAJwy— Arthur🇳🇬🇬🇧🇸🇳 (@AjMachalaa) June 14, 2026పదేళ్లలో మారిన పరిస్థితి..గత పదేళ్లలో స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలు సాధించింది. పునర్వినియోగ రాకెట్లు, ఉపగ్రహ ప్రయోగాలు, స్టార్షిప్ ప్రాజెక్టు, స్టార్లింక్ సేవలు వంటి కార్యక్రమాలతో సంస్థ విలువ వేగంగా పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన ఐపీఓలో పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందన రావడంతో షేర్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో జువాన్ వద్ద ఉన్న వేలాది షేర్ల విలువ ఒక్కసారిగా 1 మిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది.వెల్డర్ నుంచి కోటీశ్వరుడిగా..స్పేస్ఎక్స్లో వెల్డర్గా ప్రారంభమైన జువాన్ కెరీర్ తర్వాత సూపర్వైజర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆయన మరో ఏరోస్పేస్ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, స్పేస్ఎక్స్లో సంపాదించిన షేర్లే అతనికి జీవితకాల ఆర్థిక భద్రతను కల్పించాయి. ఈ సంపద వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం మానేయాలనే ఆలోచన లేదని జువాన్ పేర్కొన్నాడు. డబ్బు వచ్చినంత మాత్రాన జీవితం మారిపోదని, కష్టపడి పనిచేయడం కొనసాగిస్తానని చెప్పాడు. తన పిల్లలకు పెట్టుబడులు, పొదుపు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విలువను నేర్పించాలనుకుంటున్నానని వెల్లడించాడు.వేలాది మంది ఉద్యోగులకు జాక్పాట్జువాన్ ఒక్కరే కాదు. స్పేస్ఎక్స్ ఐపీఓ వల్ల వేలాది మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు భారీగా లాభపడ్డారని అంచనా. నివేదికల ప్రకారం.. 4,000 మందికిపైగా ఉద్యోగులు మిలియనీర్లుగా మారినట్లు తెలుస్తోంది. వెల్డర్లు, మెకానిక్లు, టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు వంటి వివిధ స్థాయిల ఉద్యోగులు కంపెనీ షేర్ల ద్వారా గణనీయమైన సంపదను సొంతం చేసుకున్నారు. -
కోరిక తీర్చాలంటూ నటికి వేధింపులు.. కేసు నమోదు!
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో నటించినందుకు పారితోషికం ఇవ్వకుండా లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడిపల్లికి చెందిన ఒక యువతి(21) సినీనటిగా రాణిస్తోంది. ఓ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం ప్రసాద్ ఆమెను సంప్రదించాడు. అందుకు రూ.90 వేల పారితోషికం ఇస్తామని చెప్పాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత తన పారితోషికం పాటు క్యాబ్ ఖర్చులు రూ. 30 వేలు ఇవ్వాలని సదరు నటి ప్రసాద్ని కోరింది. డబ్బుల విషయంమై మాట్లాడడానికి ఫిబ్రవరి 18న సాగర్ సొసైటీకీ పిలిపించిన ప్రసాద్, ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతే మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని వేధించాడు. దీంతో బాధితురాలు తప్పించుకుంది. నటి తల్లి కూడా ప్రసాద్ను నిలదీయగా..డబ్బులు ఇచ్చేది లేదని, గతంలోనూ ఇలాగే యువతులను వాడుకొని రూ. 3 కోట్లు సంపాదించానని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లీ, కూతుళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు
తెలంగాణ వ్యాప్తంగా బడి గంట మోగిన వేళ.. విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందన్న ఆసక్తి వేదిక వద్దే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది.స్థానిక రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్కు కార్యక్రమం గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేరుగా కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో రాజకీయ వేడి కనిపించింది.అనంతరం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు పాలు, రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్అవుట్ రేటును తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.హైదరాబాద్ నగర వ్యాప్తంగా తొలి దశలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అయితే విద్యార్థుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కంటే.. కార్యక్రమం ప్రారంభానికి ముందే చెలరేగిన ప్రోటోకాల్ వివాదమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సమక్షంలోనే ఎంపీ అధికారులను నిలదీయడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. -
19న జెనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ, ఇప్పుడు ట్రంప్ ఎటువంటి మెలిక పెడతారో, చివరి నిముషంలో ఏం చేస్తారో అనే సందేహం ప్రపంచవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. అలాగే ఆయన జనీవా రాకపై సస్పెన్స్ నెలకొంది. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే ఈ కీలక ఒప్పందంపై వచ్చే జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో సంతకాలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఒప్పందాన్ని తన ప్రభుత్వ దౌత్య విజయంగా భావిస్తున్నప్పటికీ, ఆయన నేరుగా వేదికపైకి వస్తారా అనే విషయంలో ట్రంప్ వైఖరి ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు.ఈ సస్పెన్స్కు మరింత బలాన్ని చేకూరుస్తూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము ఇంకా దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ వివరాలను పరిశీలిస్తున్నామని, తాను కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూనే, అధ్యక్షుడు ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు దక్కిన విజయమని, దీనివల్ల దీర్ఘకాలంలో ఇంధన ధరలు భారీగా తగ్గి, మిడిల్ ఈస్ట్లో కొత్త శకానికి నాంది పడుతుందని వాన్స్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ రాకపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం దౌత్య వర్గాలలో చర్చనీయాంశమైంది.మరోవైపు, ఇరాన్ సైతం జూన్ 19న ఒప్పందం జరగనుందనే విషయాన్ని ధృవీకరిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంతకాల కార్యక్రమాన్ని వర్చువల్ (రిమోట్) పద్ధతిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని గతవారమే స్పష్టం చేసింది. టెహ్రాన్ తరఫున ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాగర్ గాలిబాఫ్ లేదా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీలలో ఒకరు హాజరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి రిమోట్ సైనింగ్ ఆప్షన్ తెరపైకి రావడం కూడా ట్రంప్ స్వయంగా జెనీవా రావడంపై సస్పెన్స్ను మరింత పెంచేలా చేసింది.అన్నింటికంటే ముఖ్యంగా, ట్రంప్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఒప్పందంలో పెద్దగా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇరాన్ తన యురేనియం సంపదను అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా, తమ అణు కార్యక్రమం కేవలం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ వాదిస్తోంది. ఈ వివాదాస్పద అణు సమస్య అలాగే ఉండిపోవడం, దీనికి తోడు హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని తొలగించడం, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను పునరుద్ధరించడంపై వాషింగ్టన్ వైఖరిని పరిశీలించేందుకు ఇరాన్ 60 రోజుల డెడ్లైన్ విధించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యూహాత్మక ఉత్కంఠల నడుమ, ఒప్పందాన్ని ఖరారు చేసిన ట్రంప్ జూన్ 19న జెనీవా వేదికపై ప్రత్యక్షంగా కనిపిస్తారా లేదా అనేదే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. -
అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు (Today Gold Rate) అమాంతం దూసుకెళ్లాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ భారం తప్పలేదు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్లో విలువైన పరుగులు, బౌలింగ్లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్లో ఒక రనౌట్ చేసి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేసింది. తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్తో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. థాయ్లాండ్కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్లాండ్కు చెందిన ఒన్నిచా కమ్చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు), ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎసల్స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లోనూ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది.5/10 – దీప్తి శర్మ vs పాకిస్తాన్, బర్మింగ్హామ్, 2026, 5/11 – జులన్ గోస్వామి vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం, 20125/15 – రేణుకా సింగ్ vs ఇంగ్లాండ్, గ్కెబెర్హా, 20235/16 – ప్రియాంక రాయ్ vs పాకిస్థాన్, టౌంటన్, 20095/19 – దీప్తి శర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్బర్గ్, 202628 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.మహిళల టీ20 ప్రపంచ కప్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:5/5 – డియాండ్రా డాటిన్ (వెస్ట్ ఇండీస్) వర్సెస్ బంగ్లాదేశ్, ప్రొవిడెన్స్, 20185/8 – సునే లూస్ (దక్షిణాఫ్రికా) వర్సెస్ ఐర్లాండ్, చెన్నై, 20165/10 – దీప్తి శర్మ (భారతదేశం) వర్సెస్ పాకిస్తాన్, బర్మింగ్హామ్, 2026, ఈరోజు*5/12 – ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) వర్సెస్ న్యూజిలాండ్, పార్ల్, 20235/15 – రేణుకా సింగ్ (భారత్) వర్సెస్ ఇంగ్లండ్, గ్వేబెర్హా, 2023ఇక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దీప్తి మాట్లాడుతూ ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందని చెప్పింది. తన విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణమని పేర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లు తనకు ప్రత్యేకమైనవని, అలాంటి వేదికలపై ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లపై బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తన విజయ రహస్యమని వివరించింది.BIG NEWS 🚨 India Women Team defeats Pakistan by 64 runs in #T20WC2026 opener!Deepti Sharma wins Player of the Match.She picked up a career-best 5/10 with the ball to restrict Pakistan to 106."Special Thanks to Hanuman ji" - DEEPTI 🔥 pic.twitter.com/h4VZqnXtgJ— News Algebra (@NewsAlgebraIND) June 14, 2026 -
90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్వర్క్తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ అమాంతం ఎగిశాయి. ఉదయం 9:41 గంటల సమయానికి నిఫ్టీ 326.10 పాయింట్లు లేదా 1.38 శాతం పెరిగి 23,949.00 వద్ద, సెన్సెక్స్ 1,063.64 పాయింట్లు లేదా 1.41 శాతం పెరిగి 76,591.59 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో నాలుగు నెలల పాటు జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి వాషింగ్టన్, టెహ్రాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా, ఇరాన్ రెండూ అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో బ్రెంట్ క్రూడ్ జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 3.5 శాతం తగ్గి బ్యారెల్ కు 83.79 డాలర్లుగా ఉంది. యూఎస్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కీలకమైన ఇంధన సరఫరా జలమార్గం హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నందున పెట్టుబడిదారుల ఆందోళలు సడలాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.4 శాతం, 1.7 శాతం పెరిగాయి.సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భర్తను వదిలి రా.. మనం పెళ్లి చేసుకుందాం..!
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడు. భర్తను వదిలి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళలో ‘నిపా’: తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్
చెన్నై: పొరుగు రాష్ట్రమైన కేరళలోని కోజికోడ్లో నిపా వైరస్ అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని నీలగిరి జిల్లా యంత్రాంగం నిఘా చర్యలను చేపట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా జరిగే రాకపోకల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలునీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. తాళూర్, నాడుగని, నంబియార్కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులలో నిపా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని నిశితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, ఉపాధి నిమిత్తం ప్రతిరోజూ కేరళకు వెళ్లి వచ్చే సరిహద్దు గ్రామాల ప్రజలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.ఆస్పత్రులకు అత్యవసర ఆదేశాలుపరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులను యంత్రాంగం అప్రమత్తం చేసింది. నిపా వైరస్ లక్షణాలతో కూడిన ఏ ఒక్క అనుమానిత కేసు వచ్చినా, వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేరళ నుండి వచ్చే వారికి జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే స్వచ్ఛందంగా వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఆందోళన చెందవద్దుతమిళనాడులో ఇప్పటివరకు ఎలాంటి నిపా వైరస్ ముప్పు నిర్ధారణ కాలేదని, ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆమె కోరారు. కేరళలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం సమీక్షిస్తున్నామని, జిల్లా యంత్రాంగం ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉందని తెలిపారు.ఇది కూడా చదవండి: నోయిడా ఎయిర్పోర్ట్: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం.. -
ఆర్చర్ ధీరజ్కు వైఎస్ జగన్ అభినందనలు
భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ధీరజ్కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విజయవాడకు చెందిన 24 ఏళ్ల ధీరజ్ ముందుగా మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్తో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో బంగారు పతకం గెలిచిన ధీరజ్... ఆ తర్వాత రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ధీరజ్ ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్కప్ ఫైనల్స్కు కూడా అర్హత సాధించాడు. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ధీరజ్–కుంకుమ్ (భారత్) ద్వయం 5–1 (37–36, 37–36, 39–39) సెట్ పాయింట్ల స్కోరుతో కిమ్ జె డియోక్–ఒహ్ యెజిన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించి బంగారు పతకం గెల్చుకుంది. నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించడం విశేషం.Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra… pic.twitter.com/QWlyRJkLi9— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2026 -
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.తర్వాత టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్.వినోద్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం. -
జ్ఞానేశ్వరి కేసు: కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం నివేదిక
తుని రూరల్: చిన్నారి అడుగుజాడలు ఇంకా చిక్కలేదు.. తొమ్మిది రోజులైనా ఎటువంటి ఆధారాలు లభించలేదు.. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ రాఫిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్, ఎస్డీఆర్ఎఫ్, సబ్ డివిజన్ పోలీసు బృందాల సభ్యులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్లతో అణువణువూ పరిశీలించారు. అడవి జంతువులు సమీప చెరువులు, కుంటల వద్దకు తాగునీటికి వచ్చినప్పుడు దాడి జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. అయితే అలాంటి జాడలేమీ కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కాదని, చిట్టడవి కావడంతో క్రూర మృగాలు సంచరించే అవకాశం లేదన్నారు. అడవి, ముళ్ల పందులు, కొండ చిలువలు, ప్రమాదకర పాములు సంచరించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో అడవి జంతువులతో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. అడవిలో తప్పిపోవడం, అడవి జంతువుల వల్ల చిన్నారికి ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లభించలేదన్నారు. వేర్వేరుగా నియమించిన వివిధ బృందాలు పలు కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దారితప్పిన జ్ఞానేశ్వరిని కంచె వద్ద చూసిన వ్యక్తి నేరుగా తమకు చెప్పకుండా గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంపై చిన్నారి తల్లి సుంకర భవానీ అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా తమ బిడ్డ ఇంటికి చేరుతుందన్న నమ్మకంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లి అనుమానం, అటవీశాఖ అధికారుల అంచనాల ప్రకారం జ్ఞానేశ్వరి అడవిలో తప్పిపోలేదని, ఎవరో అపహరించి ఉంటారని భావిస్తున్నారు. కుక్క కళేబరానికి పోస్టుమార్టం చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమై మూడు రోజుల తర్వాత ఇంటికి చేరిన పెంపుడు కుక్క శనివారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కుక్క కళేబరాన్ని ఎన్.సూరవరం వెటర్నరీ ఆస్పత్రికి తరలించి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నమూనాలు సేకరించి విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.దీనిపై ఎక్స్లో స్పందించిన లారెన్స్.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.Hi everyone,I would like to clarify a misunderstanding regarding my recent press meeting.I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading. All I… pic.twitter.com/576GhWsI61— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. -
బరువెక్కిన హృదయంతో వైదొలగుతున్నా!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కు ప్రముఖ నటి గౌతమి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రా థమిక సభ్యత్వంతో పా టు ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పంపినట్లు గౌతమి ప్రకటించారు. వివరాలు.. గౌతమి గతంలో సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల బీజేపీకి రాజీనా మా చేసిన ఆమె, ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరా రు. పార్టీ ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదాలో కీలకమైన ప్రచార సంయుక్త కార్యదర్శి పదవిని కూడా అప్పగించింది. రాజపాళయం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధిష్టానం ఖాతరు చేయలేదు. అయినా, ఆమె పార్టీ కోసం ప్రచారంలో విస్తృతంగానే ఎన్నికల సమయంలో దూసుకెళ్లారు. కాగా ఆదివారం గౌతమి చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలకు షాక్గా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి తన లేఖలో పేర్కొన్నారు. ఈనెల 14(ఆదివారం) నుండి అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే పార్టీ ప్రచార సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో తాను మరింత స్వేచ్ఛగా సామాజిక సేవ చేయడానికి వీలుగా.. బరువెక్కిన హృదయంతో పార్టీ నుండి తప్పుకుంటున్నానని గౌతమి స్పష్టం చేశారు. పారీ్టలో చేరిన నాటి నుండి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆమె తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
జాబ్స్ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.గతంలో డిజిటల్ టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్ లూప్"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. "ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్ మోడల్" కాకుండా "ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.https://t.co/vLmiBKTtX3— Satya Nadella (@satyanadella) June 14, 2026ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. -
‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్తో మాకు అనవసరం’
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఫిఫా ప్రపంచకప్కు కూడా పాకిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి, జట్టు అధికారుల్లో కొందరికీ ఎంట్రీ నిరాకరించడం, ఇరాన్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను అమెరికా రద్దు చేయడం, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంప్ను కూడా అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాకు తరలించుకోవడం చూసి అసలు ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ ఆడుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ వాటన్నింటికీ తెర దించుతూ ఇరాన్ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో ల్యాండ్ అయింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న అమెరికా యుద్ధంలో ఉండడం, అదే యుద్ధంలో ఉన్న ఇరాన్కు ఆతిథ్యం ఇవ్వనుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇక అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరాన్ ఫుట్బాల్ కోచ్ అమీర్ ఘలేనోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము ఇక్కడికి మ్యాచ్లు ఆడేందుకు వచ్చాం. మా చుట్టూ జరుగుతున్న హడావిడి, ఇతర విషయాల గురించి పట్టించుకోము. ట్రంప్తో మాకు అనవసరం. ఆ దేశంతో చర్చలు, ఒప్పందాలు అనేవి రాజకీ అంశాలు.ఇప్పుడు మా దృష్టంతా ఫిఫా ప్రపంచకప్పైనే ఉంది. సహజంగానే ప్రతీ జట్టుకు వారి దేశంలో అనేక సమస్యలు ఉంటాయి. అంతేకాదు అవి ఆటకు సంబంధం లేకుండా ఉంటాయి. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ నెలకొని ఉండొచ్చు. కానీ అవి ఆటతో ముడిపెట్టలేం. మేము రాజకీయ వ్యక్తులం కాదు.. ఫుట్బాల్ ఆటగాళ్లం.' అని చెప్పుకొచ్చాడు. ఇక ఫిఫా ప్రపంచకప్లో ఇరాన్ ఎన్నడూ నాకౌట్ రౌండ్కు చేరలేదు. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్కు న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్ రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అమెరికా తమపై దాడులు చేస్తున్న కారణంగా తొలుత ఫిఫా ప్రపంచకప్ ఆడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ దేశానికి వస్తే ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని రెండు దేశాలు అధికారిక ప్రకటన విడుదల చేయడంతో కొంత సానుకూలాంశం. ఇరాన్ స్వేచ్ఛగా మ్యాచ్లు ఆడేందుకు ఇది అవకాశం కల్పించనుంది.ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. చదవండి: ‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’ -
తెరపైకి సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర.. హీరో ఇతనే!
నేతాజీగా భారత పౌరుల గుండ్లెలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మింనుంది. ఇందులో టైటిల్ పాత్రను యువ నటుడు ఆర్యన్శ్యామ్ పోషించనున్నారు. ఈ భారీ బ్రహ్మాండ కథా చిత్రానికి ఆనంద్ వి.ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ సుభాష్ చంద్రబోస్ అసాధారణ జీవిత పయనాన్ని ఆవిష్కరించే ఈ చిత్రానికి సుబాష్ అనే పేరును నిర్ణయించినట్లు తెలిపారు.స్వాతంత్య్ర సమరంలో ఆయన భాగస్వామ్యం, పోరాట లక్ష్యం వంటి విషయాలను విరివిగా పరిశోధించి బలమైన కథనంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. భారత సైనిక దళంలో ( ఐఎన్ఏ) కెప్టెన్గా బాధ్యతలను నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ విధుల సేవల గురించి, ఆయన జీవితంలో ముఖ్య అధ్యాయాల గురించి, దేశ చరిత్రలో ఆయన ఏర్పరచిన ఉద్రేగం వంటి అంశాలతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం ఇది అని చెప్పారు. ఈ చిత్రంలో చరిత్ర కారుడైన సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించనుండటం అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు నటుడు ఆర్యన్ శ్యామ్ పేర్కొన్నారు. ఈ పాత్రను పోషించడంతో తన బాధ్యత పెరిగిందన్నారు. కాగా బ్రిటీష్ పాలనలో భారతీయుల ఆర్ధిక పరిస్ధితులను పెంపొందించడానికి ఇండియన్ బ్యాంకును ప్రారంభించిన వీ.కృష్ణస్వామి అయ్యర్ మునిమనవడే ఈ ఆర్యన్శ్యామ్ కావడం గమనార్హం. చిత్ర దర్శకుడు ఆనంద్ వీ.ప్రసాద్ పేర్కొంటూ ఈ తరం యువత చాలా మంది మంచి ఆదాయం చేకూరే టెక్నాలజీని నేర్చుకుని,విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళుతున్నారన్నారు. దీంతో సైనిక రంగంలో యువత కొరత నెలకొందన్నారు. సుభాష్ చిత్రం చూసిన తరువాత కనీసం వెయ్యి మంది అయినా సైనికా రంగంలో చేరతారనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం,తెలుగు, కన్నడం,మలయాళం,హింది అంటూ పలు భాషల్లో రూపొందించబోతున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. -
హోండా కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ .2.15 లక్షలు డిస్కౌంట్!
దేశీయ కార్ల మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్యూవీ, సెడాన్ విభాగాల్లో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ తన ప్రముఖ మోడళ్లైన ఎలివేట్, అమేజ్, సిటీ కార్లపై భారీ తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్లు, లాయల్టీ బెనిఫిట్లు, పొడిగించిన వారంటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. అయితే నగరం, డీలర్షిప్, స్టాక్ లభ్యత ఆధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది.ఎక్కువ తగ్గింపు ఎలివేట్కే..హోండా లైనప్లో ఈ నెల అత్యధిక ప్రయోజనాలు ఎలివేట్ ఎస్యూవీపై అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ ఎంటీ, జెడ్ఎక్స్ సీవీటీ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్ బోనస్లు, కార్పొరేట్ ప్రయోజనాలు, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం డ్యాష్క్యామ్ వంటి యాక్సెసరీ ప్యాకేజీలను కూడా కంపెనీ అందిస్తోంది. మిడ్ వేరియంట్లైన వి అపెక్స్, వీఎక్స్ మోడళ్లపై కూడా రూ.1.5 లక్షలకు పైగా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎలివేట్ హోండాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీగా నిలుస్తోంది.కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొత్త తరం అమేజ్ జెడ్ఎక్స్ ఎంటీ వేరియంట్పై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, వీఎక్స్, వి వేరియంట్లపై వరుసగా రూ.48,000, రూ.28,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఎంపిక చేసిన వేరియంట్లకు ఆమోదిత సీఎన్జీ కిట్ అమర్చించుకునే వినియోగదారులకు రూ.20,000 వరకు రీయింబర్స్మెంట్ను హోండా కొనసాగిస్తోంది.ప్రీమియం సెడాన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు హోండా సిటీపై కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. ప్రీ-ఫేస్లిఫ్ట్ సిటీ పెట్రోల్ వేరియంట్లపై రూ.1.56 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్ MY25 స్టాక్పై గరిష్ఠంగా రూ.1.97 లక్షల వరకు తగ్గింపులు అందిస్తున్నట్లు సమాచారం. తాజా ఫేస్లిఫ్ట్ సిటీ మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో పాత స్టాక్ క్లియరెన్స్ కోసం ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న వేళ, హోండా ఆఫర్లు వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పటికే టాటా మోటర్స్, హ్యూందాయ్ వంటి కంపెనీలు కూడా భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ లేదా ప్రీమియం సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల మంచి అవకాశంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
యుద్ధానికి బ్రేక్.. అసలు ముప్పు పొంచి ఉందా?
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement)తో యుద్ధ భయాలు కొంత మేర తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఇది ఉపశమనం కలిగించినప్పటికీ, సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, ఈ ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు సడలింపులు, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల, కొత్త ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేస్తామని అంగీకరించినట్లు సమాచారం.డాలర్ బలహీనం.. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా అధికారులు భిన్న ప్రకటనలు చేయడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయి. యుద్ధ భయాలు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ముప్పు తప్పలేదు.. కాగా, ఒప్పందం కుదిరిందనే కారణంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉంది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు వంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇజ్రాయెల్ అంశం.. ఇజ్రాయెల్ అంశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే, ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ, మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా–ఇరాన్ తదుపరి అడుగుల వైపే ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే, ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. -
భారత విజ్ఞానం: జెండాపై కపిరాజు...
జెండాపై కపిరాజు అంటే ఆంజనేయుడు.... ఆయన చిరంజీవి కనుక త్రేతా యుగం నాటి రామాయణ కాలంలోనే కాదు.... ద్వాపర యుగంలో జరిగిన మహా భారత యుద్ధంలోనూ ఆంజనేయుడు కన బడతాడు. శ్రీకష్ణుడుని కోరిక మేరకు అర్జునిని రధం పై ఉండే జెండాలో కొలువై ఉంటాడు. ఇలా కొలువై ఉండేందుకు కారణం కూడా ఉంది. మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడు. ఒకసారి భీముడికి గర్వభంగం జరిగిన సందర్భంలో... మరోసారి కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది.΄ాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధికా పుష్పాలు కావాలని భీముడిని కోరుతుంది. ఈ పూలు తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డుతప్పుకోమని భీముడు కోరతాడు. తాను ముసలివాడినని, తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్లమని భీముడికి చెబుతాడు. అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని గ్రహించి, శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మరో సందర్భంలో కోతిరూపంలోనే అర్జునుడిని కలుస్తాడు ఆంజనేయుడు.త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారధిని చూసి దీని నిర్మాణానికి కోతులసహాయం ఎందుకు? నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలుమోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు.ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ నుంచి చివరి వరకూ అర్జునుని రథ జెండాపై ఉంటాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకూ జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది.ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పటివరకూ నీ రథంపై హనుమంతుడు ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవీ ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యేదని చెబుతాడు. అందుకే జెండపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దుష్టశక్తులు దరిచేరవని, విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ఏది ఏమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం, ఇలాంటి ఆంజనేయుని జెండా తమ కూడా ఉంటే విజయం తమనే వరిస్తుందన్న సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది. - సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
లగాన్@25 : క్రికెట్ ఆటతో చరిత్ర సృష్టించిన ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘లగాన్’ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయింది. ఆమిర్ ఖాన్, గ్రేసీ సింగ్, రెచల్ షెల్లీ, పాల్ బ్లాక్థోర్న్ ప్రధాన తారాగణంగా అశుతోష్ గోవారీకర్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా 2001 జూన్ 15న విడుదలైంది. ఈ సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రంలో విలన్గా నటించిన హాలీవుడ్ నటుడు పాల్ బ్లాక్థోర్న్ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ నుంచి రావడం విశేషం.(చదవండి: ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే) ‘‘భారతీయ సినిమాపై, ఇక్కడి ప్రేక్షకులపై నాకు ఉన్న అమితమైన ప్రేమే పాతికేళ్ల తర్వాత కూడా నేను ముంబై రావడానికి కారణమయ్యాయి’’ అని పాల్ పేర్కొన్నారు. ఇంకా ఈ వేడుకలకు ఆమిర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, ఆమిర్ ఖాన్కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న గౌరీ స్ప్రాట్ సైతం హాజరయ్యారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్, కుమార్తె ఐరా సందడి చేశారు. అలాగే ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్, కాజోల్, కరీనా కపూర్, జూహీ చావ్లా... ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. రూ. 25 కోట్ల బడ్జెట్తో...‘లగాన్’ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 25 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 70 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఎనిమిది జాతీయ అవార్డులు లభించాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకున్న మూడో భారతీయ చిత్రంగా ‘లగాన్’ చరిత్ర సృష్టించింది. ‘లగాన్’ సినిమాకు ముందు ‘మదర్ ఇండియా, సలామ్ బాంబే’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమిర్ ఖాన్ నిర్మించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బేనర్పై ఆమిర్ నిర్మించిన తొలి సినిమా ఇదే.లగాన్ కథేంటంటే.. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలోని చంపానేర్ అనే గ్రామం నేపథ్యంలో ‘లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా’ సాగుతుంది. 1893లో చంపానేర్లో తీవ్రమైన కరువు ఏర్పడంవల్ల ఆ గ్రామవాసులు బ్రిటిష్వారికి భూమి పన్ను చెల్లించలేకపోతారు. తమ గ్రామ రాజు పూరణ్ సింగ్ను పన్ను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. అయితే బ్రిటిష్ సైన్యాధికారి ఆండ్రూ రస్సెల్ ఆ గ్రామ ప్రజలకు ఓ సవాల్ విసురుతాడు. బ్రిటిష్ క్రికెట్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడి, చంపానేర్ క్రికెట్ టీమ్ గెలిస్తే పన్ను మాఫీ చేస్తానని చెబుతాడు. ఓడిపోతే మూడు రెట్లు అదనంగా పన్ను కట్టాల్సి ఉంటుందని కూడా షరతు విధిస్తాడు. ఆండ్రూ చేసిన ఈ సవాల్ను చంపానేర్ గ్రామవాసి యువకుడు భువన్ స్వీకరిస్తాడు. క్రికెట్ అంటేనే తెలియని భువన్ అండ్ టీమ్ బ్రిటిష్ జట్టుపై ఎలా విజయం సాధించింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
