breaking news
-
Varanasi: మహాదేవుని ఆశీస్సులతో ‘పహల్గామ్’పై ప్రతీకారం: ప్రధాని మోదీ
వారణాసి: ‘ఆ మహాదేవుని ఆశీస్సులతో పహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాశివుని పాదాలకు అంకితమిస్తున్నాను’ అని ప్రధాని మోదీ వారణాసి పర్యటనలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం తదితర కీలక రంగాల విస్తరణకు ఉద్దేశించిన ప్రాజెక్టులను యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.శనివారం ఉదయం 11 గంటలకు ప్రదాని మోదీ వారణాసిలో అడుగుపెట్టారు. అనంతరం దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాల వేదన నా హృదయాన్ని ద్రవింపజేసింది. బాధిత కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని నేను కాశీ విశ్వనాథుణ్ణి ప్రార్థించాను’ అని అన్నారు. #WATCH | Varanasi, UP: Prime Minister Narendra Modi lays the foundation stone and inaugurates multiple development projects worth around Rs 2200 crores. Source: DD pic.twitter.com/m7fKAvi3g5— ANI (@ANI) August 2, 2025ఈ కార్యక్రమంలో ప్రధాని.. కిసాన్ సమ్మాన్ నిధి 20వ వాయిదాను 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. దాదాపు రూ.2200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని మోదీని సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పదవిలో ఉంటూ వారణాసిని 51వ సారి సందర్శించారు. ఆయన నగరంలో దాదాపు మూడు గంటల పాటు ఉండనున్నారు. కిసాన్ నిధిని ప్రదాని మోదీ వారణాసి నుండి రైతులకు పంపిణీ చేయడం ఇది రెండవసారి. ఈరోజు ప్రధాని మోదీ రామ్కుండ్, మందాకిని, శంకుల్ధార, ఇతర ప్రాంతాలతో సహా వివిధ కుండ్లలో నీటి శుద్ధి, నిర్వహణ పనులకు పునాది రాయి వేయనున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 47 గ్రామీణ తాగునీటి పథకాలను ప్రారంభించనున్నారు. ‘కాశీ సంసద్ ప్రతియోగిత’ కింద స్కెచింగ్ పోటీ, పెయింటింగ్ పోటీ, ఫోటోగ్రఫీ పోటీ పోటీల కోసం రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్, హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ సెంటర్లకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనకు ముందు ట్విట్టర్లో ‘ఆగస్టు 2వ తేదీ కాశీలోని నా కుటుంబ సభ్యులకు చాలా ప్రత్యేకమైన రోజు. రేపు ఉదయం 11 గంటలకు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యాటకం, కనెక్టివిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నాను. అలాగే పీఎం పీఎం కిసాన్ పథకం 20వ విడత నిధులను విడుదల చేయనున్నాను’ అని పేర్కొన్నారు. -
బాత్రూంలో జారిపడిపోయిన మంత్రి.. ఆరోగ్య పరిస్థితి విషమం
రాంచీ: జార్ఖండ్లో విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, హుటాహుటిన ఆయనను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మంత్రి రాందాస్ సోరెన్ ఘటనపై తాజాగా మరో మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. రాందాస్ సోరేన్ తన ఇంట్లో కారు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం జంషెడ్పూర్లోని టాటా మోటార్స్ ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి విమానంలో తరలిస్తున్నారు. నేను ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. ఈ పరిస్థితి నుంచి రాందాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, మంత్రి రాందాస్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #WATCH | Jamshedpur: JMM leader Mangal Kalindi says, "Preparations are going on to take him to Delhi for treatment..." https://t.co/Y5ZRgUVFot pic.twitter.com/B8KSg5Teok— ANI (@ANI) August 2, 2025 -
చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ ఫైర్ అయ్యారు. కొందరు ఆకతాయిలు చేసిన చిల్లర కామెంట్లకు చెప్పు తెగుద్ది అంటూ ఆమె బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కపూరంలోని ఓ షాపింగ్మాల్ ఓపెనింగ్లో అనసూయ పాల్గొన్నారు. దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు చేరుకున్నారు. ఆమె మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు అనసూయకు వినిపించేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగుద్ది.. అంటూ గడ్డిపెట్టారు. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబసభ్యులపై ఎవరైనా ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా అంటూ ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని, వారు చాలా హానికరమన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ సమయంవలో అనసూయకు మద్ధతుగా చాలామంది నిలిచినట్లు తెలుస్తోంది.చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయమార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అసభ్యకర కామెంట్స్ చేశారని కొందరు యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ pic.twitter.com/4sw2aqA58D— Telugu Scribe (@TeluguScribe) August 2, 2025 -
జాతీయ అవార్డ్స్.. వాళ్ల కష్టానికి ఫలితం అంటూ షారుక్ ఖాన్, విక్రాంత్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. తాజాగా ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో ఆయనకు ఈ గౌరవం దక్కింది. మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్ఫుల్ యాక్టర్గా రాణిస్తున్న షారుక్ ఖాన్ ఎన్నో అవార్డ్లను అందుకున్నాడు. కానీ, జాతీయ పురస్కారాల్లో తనకు స్థానం దక్కలేదు. అయితే, తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లోని ‘జవాన్’ సినిమాతో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి విభాగంలో మరో హిందీ నటుడు విక్రాంత్ మెస్సీకీ అవార్డు దక్కింది. ఈ ఆనంద సమయంలో వారిద్దరూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.2023లో విడుదలై జవాన్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈ చిత్రానికి అవార్డ్ రావడం తనకెంతో సంతోషంగా ఉందని షారుక్( Shah Rukh Khan) చెప్పారు. ' ఎంతో సంతోషంతో ఉన్నాను.. ఈ సమయంలో మాటలు రావడం లేదు. మీరు చూపించే ప్రేమకు ఫిదా అవుతున్నాను. ఈ క్షణం జీవితాంతం గుర్తుంటుంది. ఈ అవార్డ్కు నేను అర్హుడినని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా జవాన్ సినిమా టీమ్కు ఎంతో రుణపడి ఉన్నాను. జవాన్ సినిమాను ఎంతగానో నమ్మి దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. షూటింగ్ సమయంలోనే అవార్డ్ తెచ్చిపెట్టే సినిమా అంటూ చెప్పేవారు. నా టీమ్ వల్లే ఈ అవార్డ్ దక్కింది అనుకుంటున్నాను. నా కోసం వారు ఎంతగానో కష్టపడుతుంటారు. ఒక్కోసారి నేను అసహనం చెందినా కూడా వారు భరిస్తారు. అందుకే ఈ అవార్డ్ రావడం వెనుక ప్రధాన కారణం వారేనని చెప్తాను. ఇన్నేళ్ల పాటు సినిమా పరిశ్రమలో ఉండేందుకు ముఖ్య కారణం నా కుటుంబం. ఒక్కోసారి నా భార్యతో పాటు పిల్లలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు చిరునవ్వుతోనే నా కోసం భరిస్తారు. జాతీయ అవార్డ్ మరింత బాధ్యతను గుర్తుచేస్తుంది. అభిమానుల కోసం మరిన్ని మంచి సినిమాలతో పలకరిస్తాను' అని షారుక్ అన్నారు.20 ఏళ్ల కల నిజం అయిందిఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన స్ఫూర్తిదాయకమైన బయోగ్రాఫికల్ చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’లో ఇందులో హీరోగా నటించారు విక్రాంత్ మెస్సీ( Vikrant Massey). విధు వినోద్ చోప్రాదర్శకత్వంలోని ఈ ‘ట్వెల్త్ ఫెయిల్’ ఉత్తమ చిత్రంగానూ అవార్డు కొల్లగొట్టింది. ఉత్తమ నటుడి విభాగంలో విక్రాంత్ మెస్సీ అవార్డ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇలా అన్నారు. షారుక్తో కలిసి ఈ అవార్డును పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. తన 20 ఏళ్ల కలను నిజం చేసిన చిత్ర యూనిట్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. షారుక్ వంటి గొప్ప స్టార్తో తొలి జాతీయ అవార్డును పంచుకోవడం తనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. -
టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి "ఆటోపైలట్" డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు ఈ జరిమానా విధించింది.2019లో కీ లార్గోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నైబెల్ బెనవిడెస్ లియోన్ మరణించగా, ఆమె ప్రియుడు డిల్లాన్ అంగులో గాయపడ్డాడు. ఆ సమయంలో 'జార్జ్ మెక్గీ' టెస్లా కారు నడుపుతున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ (టెస్లా కార్లలోని ఒక ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టం) ఆన్ చేసి ప్రయాణిస్తున్న సమయంలో.. తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడింది. ఆ సమయంలో వంగి ఫోన్ తీసుకున్న సమయంలో కారు రోడ్దుపై ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు తీర్పునిస్తూ 329 మిలియన్ డాలర్లు పరిగహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా చెల్లించాలని.. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పుపై టెస్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. -
రాజ్యాంగం మా రక్తం.. దాడి చేయడానికి మీరెవరు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయన్న ఆయన.. రఫేల్ డీల్లో ఎన్ఎస్ఏ-పీఎంవో కూడా జోక్యం చేసుకుంటాయని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన వార్షిక లీగల్ కన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు? అని ఎన్డీయే సర్కార్పై రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. 10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు. ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం. రఫేల్ డీల్లో పీఎంవోతో పాటు ఎస్ఎస్ఏ డీల్ చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మాకు డాక్యుమెంట్ దొరికింది’’ అని రాహుల్ అన్నారు.#WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged..."He also says, "The truth is that the election system in India is… pic.twitter.com/F9Vfsf5uH1— ANI (@ANI) August 2, 2025 -
యాపిల్లో ఇంజినీర్ కనీస వేతనం ఎంతంటే..
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ విదేశీ ఉద్యోగుల ప్యాకేజీ వివరాలను వెల్లడించింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కు సమర్పించిన వివరాల ప్రకారం వివిధ హోదాల్లో పని చేస్తున్న కంపెనీ ఇంజినీర్ల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి. ఇందులో ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్ట్లు.. ఉన్నారు.ఇంజినీరింగ్ ఉద్యోగాలు (వార్షిక మూల వేతనం యూఎస్ డాలర్లలో)సీపీయూ ఇంప్లిమెంటేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 2,64,200టెస్ట్ ఇంజినీర్ డిజైన్: 1,31,352 - 2,93,800డిజైన్ వెరిఫికేషన్: 1,03,164 - 3,12,200ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్: 1,08,160 - 2,64,200ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ / ప్రోగ్రామ్ మేనేజర్: 1,05,550 - 3,01,400ఎఫ్ఈ ఇంజినీరింగ్: 1,25,694 - 3,12,200హార్డ్ వేర్ డెవలప్మెంట్: 1,24,942 - 2,93,800హార్డ్వేర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,25,495 - 3,78,700మాడ్యూల్ డిజైన్ ఇంజినీర్: 1,08,796 - 3,29,600ఫిజికల్ డిజైన్ ఇంజినీర్: 1,01,982 - 3,41,200ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజినీర్: 1,22,800 - 2,93,800సిలికాన్ వాలిడేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 3,29,600సిస్టమ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్: 1,03,164 - 3,12,200టూల్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీర్: 1,05,602 - 2,93,800వైర్లెస్ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,28,300 - 3,12,200వైర్లెస్ సిస్టమ్స్ వాలిడేషన్ ఇంజినీర్: 1,26,672 - 3,12,200డేటా ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)డేటా ఇంజినీర్: 1,05,602 - 2,34,700డేటా సైంటిస్ట్: 1,05,550 - 3,22,400మెషీన్ లెర్నింగ్ (జనరల్): 1,26,880 - 3,29,600మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్: 1,43,100 - 3,12,200మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్: 1,14,100 - 3,12,200ఇదీ చదవండి: చెంత ఏఐ ఉందిగా..!సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)ఏఆర్/వీఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్: 1,29,805 - 3,12,200హ్యూమన్ ఇంటర్ఫేస్ డిజైనర్: 1,35,400 - 4,68,500సాఫ్ట్వేర్ డెవలపర్: 1,32,267 - 2,64,200సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్: 1,32,267 - 3,78,700సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ - అప్లికేషన్స్: 1,32,267 - 3,78,700 -
8AM TO 8PM Shift.. భగ్గుమంటున్న అధ్యాపకులు, విద్యార్థులు
న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాలు నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో, ఢిల్లీ విశ్వవిద్యాలయం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థాగత ప్రాధాన్యతలు, విద్యావేత్తల పని పరిస్థితులపై సాగుతున్న చర్చలను మరింత తీవ్రతరం చేసింది. అలాగే ఈ నిర్ణయం నిర్మాణాత్మక మార్పుల అమలుకు దోహదపడుతుందని, క్యాంపస్లలో విద్యావాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని బోధనా సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.ఢిల్లీ విశ్వవిద్యాలయం తన తాజా ఉత్తర్వులలో వర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలలు,అనుబంధ సంస్థలు సాధారణ పని దినాలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య పనిచేయాలని అధికారికంగా ఆదేశించింది. జూలై 31న జారీ చేసిన ఈ ఆదేశంలో.. వనరులను ఉత్తమంగా ఉపయోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే పని గంటలను పెంచాలనే ఈ ఆదేశం వర్శిటీలోని అన్ని విభాగాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. జూలై 12న జరిగిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ తన నోటిఫికేషన్లో పేర్కొంది.పొడిగించిన ఈ పని గంటలను సమర్థవంతంగా ఉపయోగిచుకునేందుకు అధ్యాపకులు, సిబ్బంది ముందుకు రావాలని విశ్వవిద్యాలయం సూచించింది. కొత్త విద్యా సంవత్సరానికి ముందు నుంచే ఈ విధానం అమలుకానుంది. మరోవైపు ఈ నూతన విద్యాసంవత్సరం(2025-26) నుంచే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్వైయూపీ) ప్రారంభం కానుంది. సీనియర్ రెగ్యులర్ ఫ్యాకల్టీకి నాల్గవ ఏడాది విద్యార్థులకు బోధనా బాధ్యతలు అప్పగించనున్నట్లు తాజా నోటిఫికేషన్లో వర్శిటీ పేర్కొంది.ఢిల్లీ విశ్వవిద్యాలయం జారీ చేసిన ఆదేశంపై అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అసాధ్యమని, బోధనా సిబ్బందికి, విద్యార్థులకు హానికరం అని అధ్యాపకులు అంటున్నారు. అలాగే ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కళాశాలలకు దూరంగా ఉన్న అధ్యాపకులకు, విద్యార్థులకు ఇది సమస్యగా మారనున్నదనే వాదన వినిపిస్తోంది. -
వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
రామన్నపేట : వరంగల్ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం గురువారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్లో ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. వరంగల్లోని పోచమ్మమైదాన్కు చెందిన డాక్టర్ అశోక్, సునీత దంపతుల కుమారుడు రితేశ్, అమెరికాలోని పీట్స్బర్గ్కు చెందిన జూలియాన్ మనస్సులు కలవడంతో పెద్దలను ఒప్పించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అమెరికా అమ్మాయి అయినా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడంపై అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. -
లిక్కర్ కేసులో సిట్ ‘కుట్ర’ బట్టబయలు
సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందంటూ రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు. నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డిఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసులో ‘సిట్’ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్’ లింకులు పెడుతోందన్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో చెక్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్హౌస్కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్’ చెబుతోందన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తన బెయిల్ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్’ను ఆదేశించారు. -
Lighthouse Parenting: ఒడ్డుకు చేర్చేలా మాత్రమే..!
లైట్హౌస్ అనేది సముద్రంలోని ఓడలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు లైట్హౌస్ పేరెంటింగ్ పిల్లలకు ఒక దిశను చూపుతుంది. అదే సమయంలో పిల్లలు వారి సొంత మార్గాల్లో పయనించేలా చేస్తుంది. ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు బాధ్యతాయుతంగా ఎదగ గలిగే అవకాశాలెన్నో ఉన్నట్లు నిపుణుల పరిశీలన. ఈ తరహా పేరెంటింగ్ పిల్లలు భవిష్యత్తులో బాధ్యతయుతంగా పెరగడానికి ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం.లైట్హౌస్ పేరెంటింగ్ అంటే పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడం. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూనే వారిని బాలెన్స్ చేయడం. ఈ వ్యూహాన్ని అమలు చేసే వారు తమ పిల్లలకు నిజాయితీగా మాట్లాడడానికి తగిన స్వేచ్ఛను ఇస్తారు. ఈ విధానంలో పిల్లలు తమకు ఏదైనా సాయం అవసరమైతే సంకోచించకుండా తల్లిదండ్రులను అడిగేలా పిల్లలను ప్రోత్సహిస్తుంది. తద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.ప్రయోజనాలు ఏమిటి? లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.. పిల్లల ఆత్మగౌరవంపై సానుకూల ప్రభావం చూపడం.ఆరోగ్యకరమైన హద్దులు లైట్హౌస్ పేరెంట్స్ తమ పిల్లలకు సొంతంగా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. కానీ, వారికి కొన్ని హద్దులను నిర్దేశిస్తారు. పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమపై పూర్తి నమ్మకం ఉంచుతున్నారని తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి వారికి శక్తి వస్తుంది.బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడంఈ పేరెంటింగ్ విధానానికి కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రులను విమర్శిస్తారనే భయం లేకుండా నిశ్చింతతో ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి. వారు తమ తల్లిదండ్రులను సలహాదారులుగా భావిస్తే.. ఆత్మస్థైర్య భావం పెరుగుతుంది.కోపింగ్ నైపుణ్యాలను పెంపొందించడంఈ పేరెంటింగ్ విధానం ప్రాథమికంగా పిల్లలు ఎదురుదెబ్బలను అనుభవించేలా చేస్తుంది. అవసరమైనప్పుడు సాయం కోసం అడగడంలో వారికి మద్దతునిస్తుంది. పిల్లలు తమ భావాలను, ఇబ్బందులను సొంతంగా అధిగమించగల సామర్థ్యాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలను అధిగమించేందుకు ఈ పేరెంటింగ్ ఎంతో తోడ్పడుతుంది.సవాళ్లు లైట్ హౌస్ పేరెంటింగ్ విధానంతో అనేక ప్రయోజనాలను ఉన్నప్పటికీ, ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలు ఎదుర్కొనే విషయంలో వెనుకడుగు వేయడం కష్టం. ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని తెలుసుకోవాలి. ఇందుకు చాలా సహనం అవసరం. పిల్లల ప్రత్యేక అవసరాలు, వారి పరిస్థితులపై ఆధారపడి కొంతమందికి మరింత ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం కావచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అనేదానిపై లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్
ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు సత్తా చాటుతున్న మ్యాచ్లో ఇరు జట్లు సమంగా ముందుకు వెళ్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు.ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఆటలో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ , ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూట్ను ప్రసిద్ద్ స్లెడ్జింగ్ చేయగా.. అందుకు అతడు సీరియస్గా స్పందించాడు.ప్రసిద్ద్కు భారత ఆటగాళ్లు మద్దతుగా నిలవడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. అంపైర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదంపై ప్రసిద్ద్ కృష్ణ స్పందించాడు. తను చేసిన స్లెడ్జింగ్ పై జో రూట్ స్పందన ఆశ్చర్యపరిచిందని కర్ణాటక స్పీడ్ స్టార్ వెల్లడించాడు."జో రూట్ను స్లెడ్జ్ చేయడం మా ప్రణాళికలలో భాగమే. కానీ ఆ చిన్న మాటలకు రూట్ అంత కోపంగా స్పందిస్తాడని నేను ఊహించలేదు. నేను మంచి రిథమ్లో ఉండి బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇలానే జరుగుతోంది. అంటే బ్యాటర్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు అలా చేస్తాను. నా మాటలకు రియాక్ట్ అయ్యి బ్యాటర్ ఏదైనా తప్పు చేస్తే మాకు వికెట్ వచ్చే అవకాశముంటుంది. ఇదంతా గేమ్లో భాగమే. కానీ జోరూట్ అంటే నాకు చాలా ఇష్టం. మైదానం వెలుపల మేమిద్దరం మంచి స్నేహితులం. అతొడక లెజెండరీ క్రికెటర్. ఇదొక చిన్న విషయం. ఈ విషయం ఇక్కడతో వదిలేయండి" అంటూ రెండో రోజు ఆట అనంతరం కృష్ణ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs ENG: చూస్తూ ఊరుకోవాలా? అంపైర్పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..
ఖిలా వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రితేష్ సింగ్ ఠాకూర్ అలియాస్ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్క్రీమ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్ సింగ్ ఠాకూర్ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్ప్రదేశ్కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్ సింగ్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్ సింగ్కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్ సింగ్ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్ సింగ్.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్పాషా ‡ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జే.సురేశ్ తెలిపారు. -
అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? ముఖ్యమంత్రి ఫైర్!
‘ది కేరళ స్టోరీ’ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డులు రావడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ‘‘మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు గౌరవాన్ని కల్పించడం అనేది సంఘ్పరివార్ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డు జ్యూరీ కమిటీ సమర్థించినట్లే. అలాగే మత సామరస్యానికి చిరునామా అయిన కేరళను అవమానించినట్లే. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు... ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ బాధించే అంశం. రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ స్వరం విప్పాలి’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు విజయన్ .By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal hatred, the jury of the #NationalFilmAwards has lent legitimacy to a narrative rooted in the divisive ideology of the Sangh Parivar. Kerala, a…— Pinarayi Vijayan (@pinarayivijayan) August 1, 2025 -
అయిననూ పోయి రావలె.. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్.. రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీకి 50 సార్లు చక్కర్లు కొట్టినా.. ఫలితం మాత్రం సున్నా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ సెటైర్లు వేశారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశ్యం కాంగ్రెస్కు, సీఎంకు లేదన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..50 TRIPS – ZERO RESULTS !హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!రెండో పని – ఢిల్లీకి పోవడం!మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం!రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు..రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు...సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ..కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదుబనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదురెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదురుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదుతులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదుగురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదుకానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు“ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్రకానీ తెచ్చింది ఏమీ లేదు!శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు అయిననూ పోయి రావలె హస్తినకు!కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ…దానికి బదులు దక్కింది మాత్రం...👉 ఫోటో షూట్లు, వీడియోలు 👉 విందు రాజకీయాలు!రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ ఘాటు విమర్శలు చేశారు. 50 TRIPS – ZERO RESULTS !హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:మొదటి పని –… https://t.co/FaCLYRgY0n— KTR (@KTRBRS) August 2, 2025 -
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
భారీగా పెరిగిన బంగారం ధరలు
ధరలు తగ్గుతున్నాయని సంబరపడేలోపే.. బంగారం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నేడు గరిష్టంగా రూ. 1530 పెరిగిన ధరలు పసిడి ప్రియులను అవాక్కయేలా చేసింది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు (శనివారం) పసిడి రేటు తారాజువ్వలా పైకి లేచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వైఎస్సార్సీపీ యాప్తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
33 ఏళ్ల తర్వాత బాద్షాకు ఆదాబ్..!
ముప్పై మూడు ఏళ్ల సుదీర్ఘ నటనానుభవం తర్వాత షారుక్ ఖాన్ను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడిగా గుర్తించింది. ‘దీవానా’ (1992) నుంచి షారుక్ ఖాన్ బాలీవుడ్లో ప్రవేశించి ‘కింగ్ ఖాన్’గా ప్రేక్షకుల అభిమానం పొందుతూ, దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందుతున్నా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మాత్రం రాలేదు. ఇన్నాళ్ల తర్వాత అదీ మన సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించిన ‘జవాన్’ సినిమాకు వరించింది. అయితే అది కూడా పూర్తి అవార్డు కాదు. సగమే. మరో సగాన్ని యువ నటుడు విక్రాంత్ మాసేతో (ట్వల్త్ ఫెయిల్ సినిమాకు) పంచుకోవాలి. అంటే ఈసారి ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరు నటులకు ప్రకటించారు. సినిమా రంగంలో ఎటువంటి ఘరానా వంశాల మద్దతు లేకపోయినా ఢిల్లీ నుంచి మధ్యతరగతి యువకుడిగా వచ్చి జెండా ఎగుర వేసిన వాడు షారుక్. తనతరం హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పోటీ పడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వేగమైన శరీర కదలికలు, వినూత్నమైన డైలాగ్ డెలివరీ, అల్లరి చిల్లరిగా కనిపిస్తూనే లోతైన భావాలు పలికించడం ప్రత్యేకతగా షారుక్ ప్రేక్షకులకు నచ్చాడు. ‘బాజీగర్’, ‘డర్’ సినిమాల్లో నెగెటివ్ కేరెక్టర్లు వేసినా యువత అతణ్ణి హీరోగానే చూసింది. ఆ తర్వాత ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995)తో పూర్తి సూపర్స్టార్గా అవతరించాడు. ‘పర్దేశ్’, ‘దిల్తో పాగల్ హై’, ‘దిల్ సే’, ‘కభీ ఖుషీ కభీ గమ్’.. అన్నీ హిట్గా నిలిచాయ్. దర్శకుడు కరణ్ జొహర్, జూహీ చావ్లాలతో చాలా హిట్స్ సాధించాడు షారుక్. దిలీప్ నటించిన ‘దేవదాసు’ పాత్రను మళ్లీ పోషించి మెప్పించాడు. ‘కల్ హోనా హో’, ‘వీర్జారా’, ‘చక్దే ఇండియా’ వంటి సినిమాలు అతడి ప్రతిభను పదేపదే నిరూపించాయి. స్టార్గా ఉండి కూడా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లో బుద్ధిమాంద్యం ఉన్న హీరోగా నటించాడు. ‘ఓమ్ శాంతి ఓమ్’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. షారుక్కు ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిన ‘జవాన్’ను 300 కోట్లతో నిర్మిస్తే 1100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ షారుక్ బాలీవుడ్ కా బాద్షాగానే కొనసాగుతున్నాడు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
ఆర్బీఐ కొత్త ప్రతిపాదన
బ్యాంకులు తమ డిజిటల్ ఛానళ్లపై థర్డ్ పార్టీ (ఇతర సంస్థలకు చెందిన) ఉత్పత్తులను ప్రదర్శించరాదంటూ ఆర్బీఐ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, బ్యాంక్ గ్రూపు సబ్సిడరీలు/జేవీలు/అసోసియేట్లకు సైతం ఇది వర్తించనుంది.రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాన్ని బ్యాంక్లు అమల్లోకి తీసుకురావాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల లావాదేవీల తీరును అధ్యయనం చేయడం, అసాధారణ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల ఆమోదాన్ని ముందస్తుగా పొందడం వంటివి కొత్త రిస్క్ నిర్వహణ విధానం కింద ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆగస్ట్ 11 వరకు వీటిపై భాగస్వాముల నుంచి సలహా, సూచనలను ఆహ్వానించింది. -
'ఊరు' పాటకు కిరీటం
జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లె పద సౌందర్యం మెరుపై మెరిసింది. తళుక్కున వెలిగింది. ‘బలగం’ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ‘ఊరు పల్లెటూరు’ ఆ సినిమా విడుదలైనప్పుడే తెలుగు వారందరి మనసును తాకింది. పల్లె జీవనం అందరికీ ఇష్టమే కాబట్టి, ఆ పల్లెను మిస్సయ్యి పట్నవాసం, ప్రవాసం ఉండక తప్పదు కాబట్టి పాటలోని పల్లెతనాన్ని వినగానే అందరి ప్రాణం లేచివచ్చింది. కాసర్ల రచనకు భీమ్స్ అందించిన సంగీతం, మంగ్లి–రామ్ మిరియాల అందించిన గళం, దర్శకుడు వేణు ఎల్దండి దృశ్యరూపం అన్నీ కలిసి పాటను నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆ పాట గెలిచి తెలంగాణ గ్రామీణ సౌందర్యానికి అందిన వందనం స్వీకరించింది. ప్రయివేట్ గీతాల నుంచి జాతీయ పురస్కార గ్రహీతగా..‘ఊరు పల్లెటూరు’ పాటతో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం అందుకోనున్న కాసర్ల శ్యామ్ది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. తండ్రి మధుసూదన్ రావు రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో నటుడు కావాలనే ఆకాంక్ష శ్యామ్ చిన్నతనం నుంచే ఉండేది. అయితే సాహిత్యం పట్ల తనకున్న అభిలాషతో జానపద పాటలు రాయడం, పాడడంలో అనుభవాన్ని సంపాదించారు. వరంగల్ శంకర్, సారంగపాణి బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాలేజీ పిల్ల చూడరో.. యమ ఖతర్నాక్గుందిరో..’ శ్యామ్ రాసిన తొలి జానపద సాంగ్. ఆ తర్వాత సుమారు 50పైగా ఆల్బమ్స్కు పాటలు రాశారు. ఆ సమయంలోనే మిత్రుల సాయంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా.. ‘చంటిగాడు’(2003) సినిమాలో తొలి అవకాశం వచ్చింది. బాలాదిత్య, సుహాసిని జోడీగా బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో, సిగ్గులొలికే సీతాలు’ పాటలతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘మహాత్మ’, ‘పటాస్’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘డీజే టిల్లు ‘అల వైకుంఠపురములో’... వంటి పలు సినిమాల్లో సుమారు 800కుపైగా పాటలు రాశారు శ్యామ్. తెలంగాణ మాండలికం, యాస, మాస్తోపాటు మెలోడీ గీతాలు రాయడంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తన అభిమాన రచయిత చంద్రబోస్ అని చెబుతుంటారాయన. ఆయన భార్య రాధిక ఆర్కిటెక్ట్. ‘బలగం’ సినిమాలోని అన్ని పాటల్నీ కాసర్ల శ్యామ్ రాయగా ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ రచయితగా తొలి జాతీయ అవార్డు అందుకోనున్నారు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
చెంత ఏఐ ఉందిగా..!
కృత్రిమ మేధ సహాయంతో కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసాధారణ పెట్టుబడి వ్యూహాలు ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా అందుకు తగినట్లుగా మారాలని చెప్పారు. అందుకు కృత్రిమ మేధను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. అందుకోసం కంపెనీ అంతర్గతంగా కొన్ని మోడల్స్ను ఆవిష్కరించినట్లు చెప్పారు.‘ఉత్పాదకతను పెంచడానికి మనం మరింత సాధించాలని అనుకుంటున్నాను. మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గూగుల్ ప్రస్తుత పనితీరుపై ఆశావహంగా ఉన్నాను’ అని సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల (ఎస్డబ్ల్యూఈ) కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొన్ని సాధనాలను వివరించారు. కంపెనీ అవసరాలను తీర్చడానికి కృత్రిమ మేధను మరింత వేగంగా, అత్యవసరంగా కోడింగ్ వర్క్ఫ్లోలో అమలు చేయాలని చెప్పారు. దీనిద్వారా పనిలో వేగం పెరుగుతుందన్నారు.ఇదీ చదవండి: మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనంగూగుల్ ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల కోసం టెక్నికల్ ఫౌండేషన్ బృందాలకు నేతృత్వం వహిస్తున్న బ్రియాన్ సలుజో ‘ఏఐ-సావీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఏఐ సావీ గూగుల్.. కోర్సులు, టూల్కిట్లు, ప్రొడక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ సెషన్లను అందించే ఒక అంతర్గత వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో గూగుల్ జెమినీ మోడల్స్తో ఇంజినీర్లకు సహాయపడటానికి డీప్ మైండ్తో అభివృద్ధి చేసిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
స్త్రీ వాణి రాణించింది..!
స్త్రీల జీవితాల్లోని అంతఃప్రవాహాలువారిని లైంగికంగా పీడించి ఓడిపోయిన పిశాచాలు...స్త్రీలకు స్త్రీలే తోడుగా నిలిచిన కథనాలు...శుక్రవారం ప్రకటించిన జాతీయ సినీ పురస్కారాలు2023లో వెండితెర చూపించిన మహిళా సంఘర్షణలను మరోసారి జ్ఞప్తికి తెచ్చాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాఈసారి గుర్తింపు పొందిన నటీమణులు, గాయనులువారి అభిమానులను ఆనందపరిచారు. మొత్తంగా ఈ అవార్డులు స్త్రీల దృష్టికోణంలో ప్రత్యేకమైనవి. రాణి ముఖర్జీకి ఉత్తమనటి పురస్కారం దక్కింది. ఆమె నటించిన ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రానికి గానూ ఆమెకు ఈ పురస్కారం అందింది. ‘గులామ్’ (1998) నుంచి రాణి ముఖర్జీ నటిస్తూ ఉన్నా జాతీయనటిగా గుర్తింపు దక్కడం ఇన్నాళ్లకు గాని సాధ్య పడలేదు. ఆమెకు ఈ పురస్కారం రావడం పట్ల అభిమానులే కాదు... విమర్శకులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే స్త్రీల దృష్టికోణంలో ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చాలా శక్తివంతమైన సమస్యను చర్చించింది. నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ గొప్పగా నటించిందన్న ప్రశంసలు పొందింది. జాతీయ పురస్కారం వచ్చిందన్న వార్త వెలువడగానే ‘నా ముప్పై ఏళ్ల నటనా జీవితానికి ఇది వేలిడేషన్గా భావిస్తున్నా’ అని ఆమె స్పందించింది.ఎన్నో కలికితురాయిలుబెంగాల్ నుంచి బాలీవుడ్కు వచ్చిన రాణి ముఖర్జీ ‘ఆతీ క్యా ఖండాలా’ పాట ఉన్న ఆమిర్ ఖాన్ ‘గులామ్’తో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత షారుక్తో నటించిన ‘కుచ్ కుచ్ హోతాహై’తో స్టార్డమ్కు చేరుకుంది. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘కభి ఖుషీ కభి గమ్’, ‘సాథియా’, ‘వీర్ జారా’... తదితర సినిమాలు ఆమె ప్రతిభను చాటాయి. అయితే అమితాబ్తో కలిసి నటించిన ‘బ్లాక్’ సినిమాలో తను కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని, ప్రతిభ ఉన్న నటి అని నిరూపించింది. 2014లో దర్శకుడు ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంత దూరమైనా ఇటీవల ‘మర్దానీ’, ‘మర్దానీ2’, ‘హిచ్కీ’, ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రాలతో తెరతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వేభారతీయ తల్లులకు పిల్లలను ఎలా పెంచాలో తెలుసు. పాలు ఇచ్చే పద్ధతి, పాలబువ్వ తినిపించే పద్ధతి, నీళ్లు ΄ోయడం, జోలపాడటం... ప్రతిదీ తెలుసు. కాని ఈ పద్ధతి తప్పు అంది నార్వే ప్రభుత్వం. అక్కడి బాలల సంరక్షణ అధికారులు అక్కడ నివసిస్తున్న భారతీయ జంట అనురూప్ భట్టాచార్య, సాగరికల నుంచి వారి ఇద్దరు పిల్లలను 2011లో అధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు కారణం నార్వే బాలల సంరక్షణ చట్టాలు. అక్కడ నివసిస్తున్న పౌరుల ఇళ్లలో పిల్లలు ఉంటే వారిని క్రమ విరామాలలో పరిశీలిస్తారు అధికారులు. అలా పరిశీలనకు వచ్చిన ప్రతిసారీ భారతీయ పద్ధతులకు పెడర్థాలు తీసి అనురూప్, సాగరికల పిల్లలు ప్రమాదంలో ఉన్నారని మూడేళ్ల కొడుకును, సంవత్సరం వయసు కుమార్తెను తమ అధీనంలోకి తీసుకెళ్లారు. ఆ పిల్లల కోసం సాగరిక చేసిన పోరాటాన్ని రాణి ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ సినిమాలో పునఃప్రతిష్ట చేసింది.నటి ఊర్వశికి ఉత్తమ సహాయ నటి పురస్కారంతెలుగువారికి చిరపరిచితమైన నటి ఊర్వశికి 2023 జాతీయ పురస్కారాల్లో ‘ఉల్లుజుక్కు’ (అంతఃప్రవాహం) సినిమాకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. ఇదే సినిమాకు మలయాళం నుంచి ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం కూడా లభించింది. ‘ఉల్లుజుక్కు’లో ఊర్వశి అత్తగారి పాత్రలో నటించింది. ఆమె కుమారుడు పెళ్లయిన కొన్నాళ్లకే జబ్బు వల్ల మరణిస్తాడు. కోడలు ఆ పెళ్లికి ముందే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. కాని అనివార్యమై ఈ పెళ్లి చేసుకుంటుంది. భర్త మరణించే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతమైన వానలు కురిసి వరద సంభవిస్తుంది. పైకి కనిపించే ఆ వరదలో లోపలి ప్రవాహపు వేగం ఎంతో ఎవరికీ తెలియదు. అలాగే అత్తగారు, కోడలు తమ జీవితాల్లో ఏయే లోపలి గాథలతో సతమతమవుతున్నారో ప్రేక్షకులకు మెల్లగా తెలుస్తూ వస్తుంది. సినిమా ముగింపు సమయానికి కోడలు అత్తను వీడి వెళ్లే పరిస్థితి ఉన్నా చివరకు ఆమె తన ప్రియుణ్ణి కాదని అత్త వద్దకు చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో అత్తగా ఊర్వశి, కోడలిగా పార్వతి తిరువోతు నటించగా ఊర్వశికి పురస్కారం దక్కింది.సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైజాతీయ పురస్కారాలలో మనోజ్ బాజ్పాయ్ నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాకు ఉత్తమ డైలాగ్ రైటర్ పురస్కారం దక్కింది. ఈ సినిమా జాతీయ పురస్కారాల పట్టికలో కనిపించడం చాలా ముఖ్యమైన విషయం. దీనికి కారణం బాబాల చెరలో చిక్కి బలైపోతున్న చిన్నారి ఆడపిల్లల కోసం న్యాయం వైపు నిలబడితే న్యాయం దక్కి తీరుతుందని ఇందులోని కథానాయకుడు తన న్యాయవాద వృత్తి ద్వారా నిరూపిస్తాడు. ఆడపిల్లలకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో, వారి మీద లైంగిక దాడి జరిగితే ఎన్ని విధాల వొత్తిళ్లు వస్తాయో ఈ సినిమా చూపుతుంది. టీనేజ్ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ, వారి కోసం పథకాలు రచించే కపట స్వాములకు ఈ సినిమా హెచ్చరిక. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
‘ఆపరేషన్ అఖల్’లో ఉగ్రవాది హతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ ఉగ్రవాదల ఏరివేతకు భారత్ నడుంబిగించింది. తాజాగా కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించి అందిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపధ్యంలోనే ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.రాత్రిపూట అడపాదడపా కాల్పులు కొనసాగాయని, అప్రమత్తమైన దళాలు దాడులను కొనసాగిస్తూ, ఉగ్రవాదులకు ఉచ్చు బిగించాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ ‘ఆపరేషన్ అఖల్’కు సంబంధించిన తాజా విజయాన్ని వెల్లడించింది. కుల్గామ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిఘా సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు తమ ఆపరేషన్ ప్రారంభించాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి.జమ్మూలోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో దీనికి ముందు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు చొరబాటు యత్నంలో హతమయ్యారు. ఈ ఘటన అనంతరం దేగ్వార్ సెక్టార్లోని కల్సియన్-గుల్పూర్ ప్రాంతంలో తాజా ఆపరేషన్ ప్రారంభమైంది. ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత సైనిక దళాలు జూలై 28న శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ సమీపంలోని లిద్వాస్ అడవిలో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. -
వర్కవుట్లు చేస్తుండగా ఆగిన గుండె
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిమ్లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు.. స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది. జిమ్.. జాగ్రత్తలుజిమ్లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదికుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి. #Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ— Atul singh (@atuljmd123) August 2, 2025 -
అప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట! నీవు మారవా అఫ్రిది?
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్తో జరగాల్సిన సెమీఫైనల్ను ఇండియా ఛాంపియన్స్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా యువరాజ్ సింగ్ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే విషయంపై పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.ఇండియా జట్టు తీసుకున్న నిర్ణయం తమను నిరాశపరిచిందని అఫ్రిది అన్నాడు. కాగా ఈ లెజెండ్స్ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు తొలుత పాకిస్తాన్తో లీగ్ స్టేజి మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. దీంతో మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే యాదృఛ్చికంగా భారత్-పాకిస్తాన్ జట్లు తొలి సెమీఫైనల్లో తలపడాల్సి వచ్చింది.అయితే లీగ్ స్టేజిలో పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసిన భారత జట్టు.. కీలకమైన సెమీస్లో ఆడుతుందా? అన్న సందేహం నెలకొంది. అంతలోనే సెమీస్కు ముందు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు యువీ అండ్ కోనే కాకుండా ప్రతీ భారత పౌరుడికి కూడా ఆక్రోశం తెప్పించింది. ‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. అందుకు కౌంటర్గా కొద్ది గంటల్లోనే సెమీఫైనల్ను బహిష్కరిస్తూ భారత జట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే అప్పుడు భారత జట్టుపై విషం చిమ్మిన అఫ్రిది.. ఇప్పుడు మొసలి కన్నీరు కరుస్తున్నాడు."ఇరు దేశాల మధ్య దౌత్యాన్ని అభివృద్ధి చేయడానికి క్రికెట్కు మించిన క్రీడా మరొకటి లేదు. గతంలోనూ భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంత మంచిగా లేవు. కానీ క్రీడల్లో మాత్రం ఎటువంటి తారతామ్యాలు కన్పించేవి కావు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలి.క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి వ్యాఖ్యలు భారత క్రికెట్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. నీవు మారవా అఫ్రిది అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా శనివారం జరగనున్న ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్, పాక్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.Shahid Afridi's Statement after India 🇮🇳 Champions refused to play against Pakistan 🇵🇰 Champions in WCL Semi Final 🧐A must watch video 👇🏻 pic.twitter.com/dCwxEs02iF— Richard Kettleborough (@RichKettle07) August 1, 2025 -
చిన్ని Vs కొలికిపూడి.. టీడీపీలో కోల్డ్ వార్!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ ఇసుక రవాణా పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.వివరాల ప్రకారం.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా ఏపీ బోర్డర్ దాటేస్తోంది. అనంతరం, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలించి ఎంపీ అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ వెనుక ఎంపీ ముఖ్య అనుచరుడు మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో, అక్రమ ఇసుక వ్యవహారం స్థానికంగా హాట్టాపిక్గా మారింది.మరోవైపు.. పెద్దవరంలో నిల్వచేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులే దగ్గరుండి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారురు. అందుకే బోర్డర్లో సీసీ కెమెరాలు పెట్టలేదన్నారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్లో మాట్లాడిన కొలికపూడి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందన్నారు. ఆ గంజాయి బ్యాచ్కు పోలీసులు సహకరిస్తున్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. -
శ్రీలంకలో వరలక్ష్మీ .. ఎందుకో తెలుసా?
ఎదగడానికైనా, ఎదిగిన తరువాత అయినా ప్రచారం ముఖ్యంగా మారిన రోజులివి. ప్రస్తుతం అలాంటి ప్రచారంలో ఉన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్(Varalaxmi Sarathkumar). ఈమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మీ నటించిన పాత్రలు అంత బలంగా ఉంటాయి. 2012లో పోడాపోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె శరత్కుమార్ వారసురాలు అన్నది తెలిసిందే. అయితే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా, అలాంటి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకిగానూ నటించడమే ఈమె ప్రత్యేకత. అలా ఎలాంటి పాత్రకైనా రెడీ అనే వరలక్ష్మీ బహుభాషా నటి కూడా. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కారణాలేమైన ఇప్పుడీమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారనే చెప్పవచ్చు. అందులో భాగంగా శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. శ్రీలంకలో చిన్నమోన్ లైఫ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ప్రాంతంలో ఈమె ఫొటో షూట్ నిర్వహించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఫొటోల్లో తనకే సొంతమైన అందంతో పాటు ధైర్యాన్ని వ్యక్తం చేసేలా వరలక్ష్మీ కనిపించడం విశేషం. పలు చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వరలక్ష్మీ ఇటీవల నటించిన ది వెర్డిక్ట్ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలను అందుకున్నారు. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా ముద్ర వేసుకున్న ఈ భామ మరిన్ని వైవిధ్యభరిత కథా పాత్రల View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
డేట్ ఫిక్స్.. ఇండియాలో టెస్లా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అక్కడే
అమెరికన్ కార్ల దిగ్గజం 'టెస్లా' భారత మార్కెట్లో తమ మొట్టమొదటి షోరూమ్ను ప్రారంభించింది. కాగా ఇప్పుడు మొదటి ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించడానికి సన్నద్ధమైంది. టెస్లా వై కారును ఆవిష్కరించిన తరువాత.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.టెస్లా భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ను ఆగస్టు 4న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారభించనుంది. కొత్త టెస్లా ఛార్జింగ్ హబ్లో మొత్తం ఎనిమిది ఛార్జింగ్ యూనిట్లు ఉంటాయి. ఇందులో నాలుగు వీ4 సూపర్చార్జర్లు (DC ఫాస్ట్ ఛార్జర్లు), నాలుగు డెస్టినేషన్ ఛార్జర్లు (AC ఛార్జర్లు).వీ4 సూపర్చార్జర్లు kWhకి రూ.24, డెస్టినేషన్ ఛార్జర్లు kWhకి రూ.14 చొప్పున ఛార్జ్ ఉంటుంది. V4 సూపర్చార్జర్లు మోడల్ Y కి 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల పరిధిని అందించడానికి కావాల్సిన ఛార్జ్ చేయగలదని టెస్లా పేర్కొంది. అంటే టెస్లా వై కారుకు 15 నిముషాలు సూపర్చార్జర్ ద్వారా ఛార్జ్ చేస్తే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం& గేట్వే ఆఫ్ ఇండియా మధ్య ఐదు ట్రిప్పులు తిరగవచ్చని కంపెనీ వెల్లడించింది.టెస్లా మోడల్ వైభారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
అంత సీన్ లేదు.. ఎక్కడున్నారో మరచిపోయారా?: ట్రంప్కు రష్యా కౌంటర్
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అమెరికా చర్యలకు రష్యా కౌంటరిచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమవద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.🚨 BREAKING: Russian lawmaker Viktor Vodolatsky says Russia has enough nuclear submarines to counter the 2 U.S. subs recently repositioned by President Trump. The move follows provocative remarks from former Russian President Medvedev. #Defense #NuclearSubmarines #USRussia pic.twitter.com/QnsGLdx4Q5— India Defence Daily (@IndiaDefDaily) August 2, 2025మరోవైపు.. గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు.మెద్వెదెవ్ కామెంట్స్..ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్..‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించాను’ అని వివరించారు.ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. -
చూస్తూ ఊరుకోవాలా? అంపైర్పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్
ది ఓవల్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఆటతో పాటు మాటలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. రెండో రోజు ఆట సందర్బంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ను ఔట్ చేసిన అనంతరం ఆకాష్ దీప్ అతడి భుజంపై చెయ్యి వేసి మరి సెంఢాప్ ఇవ్వడం.. మైదానంలో ప్రశాంతంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జో రూట్, ప్రసిద్ధ్ కృష్ణతో గొడవపడడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం ఆన్ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో మాటల యుద్దానికి దిగాడు.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జో రూట్.. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో రూట్ వైపు చూస్తూ ప్రసిద్ద్ ఏదో అన్నాడు. దీంతో రూట్ కూడా బదులుగా కృష్ణపై సీరియస్ అయ్యాడు.అంతేకాకుండా రూట్ అంపైర్కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసిద్ద్ మద్దతుగా కేఎల్ రాహుల్ నిలిచాడు. గొడవ దేని గురించి అని తెలుసుకోవడానికి కుమార్ ధర్మసేనతో రాహుల్ మాట్లాడాడు. కానీ ధర్మసేన ఇచ్చిన సమాధానంపై కేఎల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు అంపైర్తో రాహుల్ వాదించాడు. ఆ తర్వాత ఎవరి ఫీల్డింగ్ స్దానాలకు వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అంపైర్-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..రాహుల్: మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి గొడవ పడితే నీకు నచ్చుతుందా రాహుల్? ప్రసిద్ద్ అలా చేయడం కరక్ట్ కాదు. మనం అలా ప్రవర్తించకూడదు.రాహుల్: అవతలి వ్యక్తి మమ్మల్ని దూషిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లమంటారా?ధర్మసేన: మ్యాచ్ ముగిశాక మనం మాట్లాడదాం. నువ్వు అలా మాట్లాడడం మాత్రం సరికాదుఈ సంభాషణంతా స్టంప్ మైక్లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’
న్యూఢిల్లీ: భారత లెగ్స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ ఇటీవలే అధికారికంగా విడిపోయారు. అయితే విడాకులకు ముందు తాను తీవ్ర మానసిక వేదనను అనుభవించానని చహల్ చెప్పాడు. కొందరు తనను మోసగాడిగా చిత్రీకరించారని, తాను ఎప్పుడూ మోసం చేయలేదని...తాను ప్రేమించిన వ్యక్తి పట్ల విధేయతతోనే ఉన్నానని అతను పేర్కొన్నాడు. ‘నా విడాకుల తర్వాత నన్ను కొందరు మోసగాడు అన్నారు. కానీ నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. నేను ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతో ఎక్కువ విధేయతను ప్రదర్శించాను. మనసారా ప్రేమించాను’ అని చహల్ వ్యాఖ్యానించాడు. ధనశ్రీతో విడాకుల దాకా పరిస్థితి వచ్చినప్పుడు మానసికంగా బాగా దెబ్బ తిన్నానని అతను గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఎలాంటి వేదనను అనుభవించానో నా సన్నిహితులకు బాగా తెలుసు. జీవితం పట్ల అలసిపోయినట్లు అనిపించింది. రోజులో రెండు గంటలు మాత్రమే పడుకుంటే రెండు గంటల పాటు ఏడుస్తూనే ఉండేవాడిని. ఇది దాదాపు నలభై రోజులు సాగింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించా’ అని ఈ స్పిన్ బౌలర్ వెల్లడించాడు. అధికారికంగా విడాకులు తీసుకునే వరకు బయటపడవద్దని...అప్పటి వరకు కలిసే ఉన్నట్లుగా బయట కనిపించేందుకు తాము ప్రయతి్నంచినట్లు అతను చెప్పాడు. మరో వైపు ఇతర అమ్మాయిలతో తనకు ఏదో బంధం ఉన్నట్లుగా వచి్చన వదంతులు మరింతగా బాధపెట్టాయని చహల్ వివరించాడు. ‘ఎవరితోనైనా కనిపిస్తే చాలు సంబంధం అంటగట్టేస్తూ వచ్చారు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు’ అని చహల్ చెప్పాడు. చహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్షైర్ తరఫున ఆడుతున్నాడు. -
మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనం
కృత్రిమ మేధస్సు(ఏఐ) విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ హంటింగ్ అనూహ్య స్థాయికి చేరుకుంది. ఓపెన్ఏఐ అగ్ర నిపుణులను ఆకర్షించడానికి మెటా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.870 కోట్లు) బోనస్ను సైతం ఆఫర్ చేస్తున్న తరుణంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ వైరల్గా మారింది. మెటా వంటి పోటీదారుల నుంచి వచ్చే వేతన ఆఫర్లు కంపెనీల సంస్కృతిని నాశనం చేస్తాయని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు.ఇతర కంపెనీలు ఆఫర్ చేసే ఆర్థిక ప్రోత్సాహకాల కంటే ఆంత్రోపిక్ తన మిషన్ పట్ల నిబద్ధతగా వ్యవహరించాలని ఆయన ఉద్యోగులను కోరారు. మెటా అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే తప్పుడు ఆలోచనతో ఉందన్నారు. మెటా తీరు ఇతర కంపెనీల సంస్కృతిని నాశనం చేసేలా ఉందని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు. ఆంత్రోపిక్ ఉద్యోగులకు వేతన ఆఫర్ల కంటే కంపెనీ మిషన్ ప్రధానమని చెప్పారు. మెటా ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల కారణంగా సంస్థాగత సమగ్రతను కాపాడుకుంటూ కీలక ప్రతిభావంతులను నిలుపుకోవడంపై పరిశ్రమలో ఇతర కంపెనీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
'సార్ మేడమ్' మూవీ రివ్యూ.. అందరికీ కనెక్ట్ అవుతుందా..?
టైటిల్: సార్ మేడమ్నటీనటులు: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్, యోగిబాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్ తదితరులునిర్మాణ సంస్థలు: సత్య జ్యోతి ఫిలిమ్స్నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్దర్శకత్వం: పాండిరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్విడుదల తేది: ఆగస్టు1, 2025సరికొత్త కథలను ప్రేక్షకుల దగ్గరచేయడంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ వంటి స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే భారీ అంచనాలు ఉంటాయి. ఈ జోడీ నటించిన కొత్త చిత్రం 'సార్ మేడమ్'.. భార్యాభర్తల అనుబంధం నిత్య జీవితంలో ఎలా ఉంటుందో దర్శకుడు పాండిరాజ్ చూపించారు. తమిళ్లో జులై 25న 'తలైవన్ తలైవి' పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 1న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేటంటే..ఏడడుగుల బంధం ఎలా ఉంటుందో 'సార్ మేడమ్' చిత్రంలో చూపించారు. పెళ్లైన వారందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) సొంత గ్రామంలోనే పరోటా మాస్టర్గా ఒక హోటల్ నడుపుతుంటాడు. ఇందులో చేయి తిరిగిన పరోటా మాస్టర్గా ఆయనకు పేరు ఉంటుంది. తనుకు పెళ్లి చెయ్యాలని రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. పెళ్లి చూపుల్లోనే ఇరుకుటుంబాలు ఒప్పుకుంటాయి. ఎలాగైన తమ కుమారుడికి పెళ్లి చేయాలని పదో తరగతి మాత్రమే చదవిన వీరయ్య డబుల్ MA చేశాడని ఆపై ఇల్లు తమ సొంతమని కొన్ని అబద్దాలు చెబుతారు. అయితే, వీరయ్య కుటుంబ నేపథ్యం గురించి నిజం తెలుసుకున్నాక ఆ సంబంధం వద్దనుకుంటారు. కానీ, పెళ్లి చూపుల్లోనే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య, రాణి పెద్ద వాళ్లను కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సంతోషంగా హోటల్ రన్ చేసుకుంటూ వారి సంసార జీవితాన్ని గడుపుతారు. రాణిని మొదటి మూడు నెలలు అత్తమామలు, ఆడపడుచుతో సహా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే, ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలౌతుంది. రాణిపై అత్త పెత్తనంతో పాటు ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. దీంతో తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒకరోజు అవి తారాస్థాయికి చేరుకుంటాయి. దీంతో వీరయ్య, రాణి ఇద్దరూ విడిపోవాలని విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్న ఆ జంట విడిపోయేందుకు కారణాలు ఏంటి..? భార్యాభర్తల గొడవలకు ఎవరు కారణం అయ్యారు..? రాణి అన్నయ్యతో వీరయ్యకు ఉన్న గొడవ ఏంటి..? సంతోషంగా ఉన్న కాపురంలో మొదట అగ్గిరాజేసింది ఎవరు..? అనేది అసలు కథ.ఎలా ఉందంటే.. భార్యాభర్తల బంధం బలంగా నిలబడాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహనతో కూడి ఉండాలి. పొరపాట్లు జరగడం సహజం. అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.. ఆపై క్షమాపణ చెప్పడానికి వెనుకాడకూడదు. 'సార్ మేడమ్' సినిమా కూడా ఇలాంటి మెసేజ్నే ఇస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని నిలుపుకునేందుకు వారు పడే పాట్లు కష్టంగానే ఉన్నా చూసే వారికి అందంగానే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికే పెళ్లైన, పెళ్లి చేసుకోవాలనకునే వారందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా సీరియస్నెస్ ఉంటుంది. కానీ, దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా అందరినీ ఆలోచింపచేసేలా నవ్విస్తూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్కు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. భార్యభర్తల మధ్య తరుచూ కనిపించే గిల్లికజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి.భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా తండ్రికి తెలియకుండా కూతరు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అత్తమామలు చేసే ప్రయత్నం నుంచి కథ ఆరంభం అవుతుంది. అలా వారి గతాన్ని చాలా ఫన్నీగా చెబుతూ.. మొదట వీరయ్య, రాణిల పెళ్లి ఎలా అయింది..? పెళ్లి తర్వాత రాణిపై అత్త, ఆడపడుచు ఆధిపత్యం చేయడం. కోడలిపై మామగారికి ఉన్న అభిమానం. భార్యపై భర్తకు ఉన్న ప్రేమ.. ఇలా ఒకటేంటి ఎన్నో ఈ కథలో మనకు కనిపిస్తాయి. సంతోషంగా సాగుతున్న సంసారంలో కొన్నిసార్లు గొడవలు సహజం. ఆ గొడవల మధ్యలోకి అత్తమామలు దూరితే సంఘర్షణ డబుల్ అవుతుంది. సినిమా అంతా బాగున్నప్పటికీ ఈ కథ ఎక్కువగా రెండు పాత్రల చుట్టూ తిరగడం కాస్త మైనస్, పదేపదే గొడవ పడటం వంటి అంశాలు రిపీటెడ్గా అనిపిస్తాయి. అంతే తప్పా ఇందులో మైనస్లు పెద్దగా లేవు. కొన్ని సీన్లు ఎక్కువగా సాగదీశారనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఆకాశ వీరయ్యగా విజయ్ సేతుపతి, రాణి పాత్రల్లో నిత్యా మేనన్ ఫుల్ ఎనర్జిటిక్గా మెప్పించారు. వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. సినిమాలో అప్పుడప్పుడు కనిపించే యోగిబాబు తన పంచ్లతో నవ్విస్తాడు. సరైన సమయంలో తన పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో బాగా అనిపిస్తుంది. ఆపై విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టేశాడు. అటు తల్లికి... ఇటు భార్యకు నచ్చచెబుతూ తను మాత్రం ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. ఒక సామాన్యుడి జీవితానికి వీరయ్య పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. ఆపై అత్తింటి వాళ్లతో పాటు భర్తతో గొడవపడేటప్పుడు రాణి పాత్రలో నిత్యా మేనన్ దుమ్మురేపింది. అదే సమయంలో తన పుట్టింట్లో భర్త గురించి గొప్పగా చెప్పుకున్న సీన్ ప్రతి అమ్మాయి జీవితాన్ని తాకుతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవల్లోకి కుటుంబ సభ్యులు, చుట్టాలు ఎలా ఎంట్రీ ఇస్తారో ప్రీ క్లైమాక్స్లో అర్థం అయ్యేలా దర్శకుడు బాగా చూపించాడు. కథకు తగ్గట్టుగా సంగీతం బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా పూర్తి అయిన తర్వాత ఈ కథకు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు నవ్వుతూనే ఆలోచిస్తారు. జీవితం అంటే ఇదే కదా అంటూ బయటకు వచ్చేస్తారు. -
ట్యూబెక్టమీ చేస్తే ప్రాణాలు పోయాయి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో ట్యూబెక్టమీ (కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స) చేయించుకున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే, కాకినాడ జగన్నాథపురానికి చెందిన పలపాల సుధారాణి(21)ని సోమవారం కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. మంగళవారం ఆమెకు ట్యూబెక్టమీ నిర్వహించారు. అనంతరం ఆమెను జీఐసీయూకి తరలించారు. ఆ సమయంలో పల్మనరీ ఎడీమా సంభవించి ఉదరం నుంచి పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి చేరాయి. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై అనుసంధానం చేశారు. రెండు రోజుల పాటు వైద్యులు ఆమెను రక్షించేందుకు శ్రమించగా శుక్రవారం ఉదయం 6.53 సమయానికి కార్డియాక్ అరెస్ట్ సంభవించి ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే సుధారాణి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.కూతురికి పేరు పెట్టకుండానే...సుధారాణికి దుర్గాప్రసాద్తో 2017లో వివాహం అయింది. దుర్గాప్రసాద్ కార్పెంటర్ కాగా అతడికి చేదోడు వాదోడుగా సుధారాణి పలుచోట్ల పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడంతో తోడుగా నిలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల బాబు వీర లోకేష్ కాగా, నెలన్నర క్రితం పుట్టిన కుమార్తెకు కనీసం పేరు కూడా పెట్టలేదు. తన కుమార్తెకు మంచి పేరు పెట్టాలని సుధారాణి అందరినీ అడిగిందని, మంచి పేరు సూచించాలని కోరిందని, పండంటి బిడ్డకి పేరు పెట్టకుండానే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణం వివాదాస్పదమైన తరుణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు త్రి సభ్య కమిటీని నియమించారు. సర్జరీ హెచ్వోడీ డాక్టర్ పి.నరేష్కుమార్, పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుజీవ స్వప్న, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రాజేష్కుమార్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. సుధారాణి మృతదేహానికి శుక్రవారం పోస్ట్మార్టం నిర్వహించారు. అంతకుముందు జీఐసీయూలో సుధారాణి మృతదేహాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ మెహర్ పరిశీలించారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,353 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.65 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ప్రజెంట్ సార్... అర్ధనగ్నంగా సెల్ఫీ దిగి..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ కార్యదర్శులు నిత్యం డీఎస్ఆర్ యాప్లో సెల్ఫీ దిగి తమ హాజరును నమోదు చేయాలి. అనంతరం గ్రామంలో చేపట్టే పనుల ఫొటోలు పోస్టు చేయాలి. కానీ తంగళ్లపల్లి, సారంపల్లి గ్రామాల కార్యదర్శి మహ్మద్ సమీర్ జూలై 29, 30 తేదీలలో ఒంటిపై బట్టలు లేకుండా.. తన ఇంటిలోనే సెల్ఫీ దిగి హాజరు పూర్తిచేసినట్లు గుర్తించారు. దీనిపై తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. పంచాయతీ కార్యదర్శుల డీఎస్ఆర్ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇలాంటివి జరిగినట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. సీఎం ఫొటోతో హాజరుపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జగిత్యాల కలెక్టర్బుగ్గారం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోతో ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదుపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు.. ఇటీవల ప్రత్యేక పరిశీలన జరిపారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ హాజరు నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. చంద్రయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న ఏకంగా ముఖ్యమంత్రి ఫొటోనే వాడి డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్)యాప్లో హాజరు నమోదు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల పరిశీలనలో విషయం బయటపడడంతో.. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై బుగ్గారం ఎంపీడీవో అఫ్జల్మియాను వివరణ కోరగా.. హాజరు నమోదుకు సంబంధించి కారోబార్ చేసిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. -
ఉజ్వల భవిష్యత్తు కోసం.. ఎల్ఐసీ స్కీమ్: నెలకు రూ.7000 అకౌంట్లోకి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'ఎల్ఐసీ బీమా సఖి యోజన'ను ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటంటే.. మహిళలకు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని అందించడం మాత్రమే కాకుండా.. దీని ద్వారా వారికి సాధికారత కల్పించడం, బీమా అవగాహన.ఎల్ఐసీ బీమా సఖి యోజన గురించిదేశవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా.. ఎల్ఐసీ బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో మహిళలు బీమా సఖీలుగా మారడానికి శిక్షణ ఇస్తారు.ఎల్ఐసీ బీమా సఖి పథకం మహిళలు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సాధికారత వైపు అడుగులు వేయడానికి వీలు కల్పిస్తుంది. బలమైన మహిళలు, బలమైన భవిష్యత్తు అంటూ.. ఎల్ఐసీ ఇండియా ట్వీట్ చేసింది.దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలుకనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.కావలసిన డాక్యుమెంట్స్➤జనన ధ్రువీకరణ పత్రం➤అడ్రస్ ప్రూఫ్➤విద్యా అర్హత సర్టిఫికేట్స్➤లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోలుస్టైఫండ్ వివరాలుఎల్ఐసీ బీమా సఖి యోజన పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7000, రెండో ఏడాది రూ.6000, మూడో ఏడాది రూ.5000 ఉంటుంది. అంతే కాకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్లు అందిస్తారు. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుప్రస్తుత ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగుల దగ్గర బంధువులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు), పదవీ విరమణ చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.Strong Women, Stronger Futures!LIC's Bima Sakhi scheme helps women build a brighter future, enabling them to take steps towards self-reliance and empowerment.Swawalambi Naari,Khushhali Hamari#LIC #BimaSakhi #WomenEmpowerment pic.twitter.com/cVuY3Xha42— LIC India Forever (@LICIndiaForever) July 17, 2025 -
రష్యాతో భారత్ కటీఫ్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది మంచి చర్య.. భారత్ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens..." says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12— ANI (@ANI) August 1, 2025జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు..మరోవైపు, తాజా పరిణామాలపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తాం. పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్, అమెరికా దేశాలు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఇందులో ఇరు దేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకే ముఖ్యమైన ఎజెండాపైనే మేము దృష్టి సారించాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. భారత్, అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి బలోపేతమయ్యాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.నిలిచిన కొనుగోళ్లు..ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అయితే, చమురు కొనుగోలుపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. కాగా, దీన్ని ఓ కారణంగా చూపుతూ ఇటీవల ట్రంప్.. భారత్పై పెనాల్టీలు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.భారత్కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే, దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..
ఓవల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు. తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అధిపత్యం చెలాయించినప్పటికి.. లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు.ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. మొదటి సెషన్లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండో సెషన్లో మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.మొత్తంగా 16.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్, 86 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.భారత్ ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.బుమ్రా రికార్డు బద్దలు..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు. సిరాజ్ మియా ఇప్పటివరకు ఇంగ్లండ్లో 11 టెస్టులు ఆడి ఆరు సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు. 2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. ఆ తర్వాత 2022లో ఎడ్జ్బాస్టన్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. అదేవిధంగా ప్రస్తుత సిరీస్లో బర్మింగ్హామ్లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన సిరాజ్.. మళ్లీ ఇప్పుడు ఓవల్ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ రేర్ ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై 5 సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు.అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన ఏషియన్ బౌలర్గానూ వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఇంగ్లండ్ గడ్డపై 6 సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.చదవండి: గ్రాహం థోర్ప్కు నివాళిగా... -
ఆఖరి మజిలీకి చచ్చే చావు..!
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు కొత్తూరి రాజిరెడ్డి (90) గురువారం మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన వైకుంఠధామం గ్రామ శివారులోని చలివాగు పక్కన ఉంది. కానీ, పొలాల వెంబడి దారంతా బురద, గుంతలమయం కావడంతో శుక్రవారం అంత్యక్రియల నిర్వహణకు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో మృతుని బంధువులు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయారు. ‘ఆ నలుగురు’మాత్రమే అష్ట కష్టాలు పడి శవాన్ని వైకుంఠధామానికి చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. వైకుంఠధామాలకు రోడ్డు సక్రమంగా వేయించలేని పాలకులు.. పల్లెలను ఎలా అభివృద్ధి చేస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిని పంచుకుని అమ్మను గెంటేశారుమద్దూరు: ఆస్తి మొత్తం లాక్కొని.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇంటి నుంచి గెంటేశారు కుమారులు. దీంతో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ తల్లి.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన మద్దూరు మండలం ఖాజీపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన 83 ఏళ్ల నాగమ్మ, వడ్ల రాములు భార్యాభర్తలు. వీరికి భీములు, వెంకటయ్య, చంద్రమౌళి, ఒక కూతురు లక్ష్మమ్మ ఉన్నారు. భర్త వడ్ల రాములు ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆయన పేరుమీద ఉన్న 14 ఎకరాల భూమితో పాటు, రూ.4 లక్షల నగదును గ్రామ పెద్దల సమక్షంలో పంపకాలు చేపట్టారు. నాగమ్మకు రూ.40 వేలు అందజేసి భూమి, మిగిలిన డబ్బులను కుమారులకు పంచారు. అయితే తల్లి నాగమ్మను ముగ్గురు కుమారులు ఏడాదికి ఒకరు చొప్పున చూసుకోవాలని పెద్దలు చెప్పినా, భూములు, డబ్బులు చేతికందడంతో నాగమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు కుమారులు. దీంంతో నాగమ్మ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో కుమారులను ఆశ్రయించగా, తల్లిపై జాలి లేకుండా నానా మాటలు తిట్టి పంపించారు. దీంతో తనకు న్యాయం చేయాలని, భర్త ఆస్తి తనకు దక్కేలా చూడాలని ఆ తల్లి తహïసీల్దార్ మహేశ్గౌడ్ను ఆశ్రయించింది. -
పాక్లో రైలు ప్రమాదం.. 30 మందికి గాయాలు
లాహోర్: పాకిస్తాన్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.పాకిస్తాన్ రైల్వేలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం లాహోర్ నుండి రావల్పిండికి వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్.. షేక్పురాలోని కాలా షా కాకు వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. 🚨🇵🇰 Train Derailment in Pakistan⚠️ Islamabad Express derailed near Kala Shah Kaku (Muridke).🚑 Over 40 passengers injured, rescue teams on site.📍 Cause of derailment under investigation.#Pakistan #TrainAccident #Breaking pic.twitter.com/O6yhz5aBKR— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) August 1, 2025ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. లాహోర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన అరగంటకు రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసి వెంటనే రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా విచారణ ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు. -
మంత్రి కారే అడ్డుగా ఉందంటావా ?
హైదరాబాద్: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్ సెన్స్ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్ మనోహర్తో పాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్ భవన్ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ సాయి ప్రకాశ్ డ్రైవర్కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్ చెప్పడంతో ట్రాఫిక్ సీఐకి డ్రైవర్కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు. కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్ డీసీపీ గోవర్ధన్ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ రామ్ మనోహర్ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తా, సస్పెండ్ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లు
మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించి రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ రూ.6,017 కోట్ల విలువ చేసేవి వెనక్కి తిరిగి రాలేదు. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. 2023 మే 19 నాటికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల వలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 2025 జూలై 31 నాటికి రూ.6,017 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐనాడు చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో 98.31 శాతం వెనక్కి వచ్చినట్లు తెలిపింది. తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ఇష్యూ ఆఫీసుల వద్ద వీటిని మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. తమ వద్దనున్న 2,000 నోట్లను బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కు పోస్ట్ ద్వారా పంపొచ్చు. -
‘పెద్ద లగేజీ మెట్లపై అమాంతం పడగానే..’: ఢిల్లీ విషాదంపై రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: కుంభమేళా సమయంలో ఢిల్లీ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విషాదానికి దారితీసిన కారణాలపై రాజ్యసభలో ఒక సభ్యుడు అడిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. స్టేషన్లో అత్యంత రద్దీగా ఉన్న సమయంలో మెట్లపై నుంచి వస్తున్న ఎవరో ప్రయాణికుని తలపై నుంచి భారీ లగేజీ పడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నదని తెలిపారు.2025 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. అది ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న సమయం కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మంత్రి అశ్విని వైష్ణవ్ తన లిఖిత పూర్వక సమాధానంలో.. నాటి దురదృష్టకర ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ అందించిన నివేదిక వివరాలను తెలియజేశారు.రైల్వే మంత్రి ఆ ఘటనను ‘తొక్కిసలాట’ అని పేర్కొననకుండానే వివరాలు అందించారు. విషాదం జరిగిన రోజున, రైల్వే స్టేషన్లో 49 వేల జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది రోజువారీ సగటు కంటే 13 వేలు ఎక్కువ అని వైష్ణవ్ గత మార్చిలో లోక్ సభకు తెలియజేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆయన ఆరోజు స్టేషన్కు అధిక సంఖ్యలో చేరుకున్న ప్రయాణీకులను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని, రాత్రి 8.15 గంటల తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరిగింది. వీరిలో చాలామంది ప్రయాణికులు పెద్ద లగేజీలను తలపై మోస్తున్నారు. ఇది ప్రయాణికుల కదలికలను అమితంగా ప్రభావితం చేసింది.ఇంతలో ప్రయాణికులలోని ఒకరి తలపై నుండి పెద్ద లగేజీ అమాంతం కింద పడిపోవడంతో దుర్ఘటన సంభవించింది. మెట్లపై ఉన్న ప్రయాణికులు జారిపడ్డారు. ఈ ఘటన రాత్రి 8.48 గంటలకు జరిగిందని మంత్రి చెప్పారు. పెద్ద లగేజీ ఒక్కసాగిగా పడగానే ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. లక్ష పరిహారం అందించామని, మొత్తం 33 బాధిత కుటుంబాలకు రూ. 2.01 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వైష్ణవ్ తన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటన దరిమిలా రైల్వేలు భద్రత కోసం నూతన చర్యలను అమలులోకి తెచ్చాయి. శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలు, విశాలమైన ఫుట్ ఓవర్బ్రిడ్జిలు, సీసీటీవీ కెమెరాలు, ప్రధాన స్టేషన్లలో వార్ రూమ్లు ఏర్పాటు చేశారని చెప్పారు. -
రియల్ ఎస్టేట్ సంస్థలకు.. భూ సమర్పయామి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఖరీదైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని ఖేఖాతరు చేస్తోంది. కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఐటీ కంపెనీల ముసుగులో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టింది.👉బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపునకు మధురవాడ హిల్ నెంబర్–4లో 30 ఎకరాలను ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో 50 శాతం ఐటీ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన 50 శాతం రిటైల్, గృహ నిర్మాణం వంటి రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకో వచ్చని, ఇందుకు విశాఖపట్నం మెట్రోపా లిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రూపాందించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.👉ఇదే విధంగా కపిల్ చిట్స్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎండాడ వద్ద 10 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ఇందులో 40 శాతం భూమిని అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అసోసియేట్ ఇన్ఫ్రా పేరిట ఉద్యోగులకు గృహ సముదాయాలు, రిటైల్, వినోదం, మెడికల్, ఎడ్యుకేషన్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది.ఏఎన్ఎస్ఆర్కు 99 పైసలకే 10.29 ఎకరాలు..👉ఇక బెంగళూరుకు చెందిన మరో సంస్థ ఏఎన్ఎస్ఆర్కు మధురవాడ హిల్ నెంబర్–3లో 2.5 ఎకరాలు, హిల్ నెంబర్–4లో 7.79 ఎకరాలు మొత్తం 10.29 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాక.. ఐటీ ఇన్ఫ్రా డెవలపర్ కేటగిరీ కింద పలు రాయి తీలు కల్పించనున్నట్లు అందులో పేర్కొన్నారు.👉సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్కు మధురవాడ హిల్ నెంబర్–3లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలతో పాటు పరదేశీపాలం వద్ద ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీచేసింది.👉అలాగే, ఫినోమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కు మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో 0.45 ఎకరాలు, రుషికొండ హిల్ నెంబర్–4లో మరో నాలుగు ఎకరాలను ఎకరా రూ.4.05 కోట్లు చొప్పున కేటాయించింది. వీటితో పాటు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని విడుదల చేస్తూ కాటంనేని భాస్కర్ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
ఇతర భాషల్లో సినిమాలు చేస్తే దివ్యాంగుల్లా అనిపిస్తుంది: మురుగదాస్
కోలీవుడ్లో దీన, రమణ, గజనీ, తుపాకీ, సర్కార్ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుల లిస్ట్లో ఏఆర్.మురుగదాస్ చేరిపోయారు. ఈయన తెరకెక్కించిన గజనీ చిత్రాన్ని హిందీలో అమీర్ఖాన్ హీరోగా చేసి విజయాన్ని సాధించారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవి హీరోగా స్టాలిన్ పేరుతో ఒక సినిమా చేశారు. ఇటీవల సల్మాన్ఖాన్ హీరోగా సికిందర్ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. దీంతో నెటిజన్లతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా దర్శకుడితోపాటు యూనిట్ సభ్యులపై విమర్శలు గుప్పించారు. కాగా మురుగదాస్ ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా మదరాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను ఇతర భాషల్లో చిత్రాలు చేసేటప్పుడు దివ్యాంగుల్లా భావన కలుగుతుందన్నారు. అదే మాతృభాషలో చిత్రం చేయడం చాలా బలం అని అన్నారు. కానీ, తెలుగులో మాత్రం అలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఎందుకంటే తెలుగు భాష కూడా ఇంచుమించు మన భాషలానే ఉండడంతో పట్టు దొరుకుతుందన్నారు. భాష తెలియని ప్రాంతంతో చిత్రం చేయడం దివ్యాంగుల మాదిరి భావన కలుగుతుందనే అభిప్రాయాన్న మురుగదాస్ వ్యక్తం చేశారు. కాగా హిందీలో రెండు చిత్రాలు చేసిన ఆయన ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో తెరకెక్కించిన సికిందర్ సినిమా డిజాస్టర్ కావడం వల్లనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. -
భారత్లో యాపిల్కు రికార్డు స్థాయిలో ఆదాయం
జూన్ త్రైమాసికంలో భారత్ సహా ఇరవై నాలుగు మార్కెట్లలో రికార్డు స్థాయిలో ఆదాయాలు సాధించినట్లు అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్లు, మ్యాక్, సర్వీసులు మొదలైన విభాగాలు ఇందుకు దోహదపడినట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ ఐఫోన్ల విక్రయాలు పెరిగాయని, భారత్తో పాటు దక్షిణాసియా, బ్రెజిల్లాంటి వర్ధమాన మార్కెట్లలో రెండంకెల స్థాయి వృద్ధి నమోదైందని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ‘ఏఐకి అంత సీన్ లేదు’మరోవైపు, అమెరికా టారిఫ్ల అంశం తీసుకుంటే 800 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త టారిఫ్లేమీ లేకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 1.1 బిలియన్ డాలర్లకు చేరొచ్చని కుక్ వివరించారు. జూన్ త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 10 శాతం పెరిగి 94.04 బిలియన్ డాలర్లకు, లాభం 9.2 శాతం పెరిగి రూ.23.42 బిలియన్ డాలర్లకు చేరింది. -
‘షార్’ డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ నూతన డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా బదిలీ కావడంతో బెంగళూరులోని ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈఎస్ పద్మకుమార్ను షార్ నూతన డైరెక్టర్గా నియమించారు. పద్మకుమార్ బెంగళూరు ఐఐఎస్సీలో సిస్టం సైన్స్ అండ్ ఆటోమేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, 1996లో ఇస్రోలో ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు. ఆయన ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ ప్రయోగ వాహనాలతో పాటు మార్స్ ఆర్బిటార్ మిషన్, చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు. -
‘వరికూటి’పై పోలీసుల దాడి
రేపల్లె/బాపట్ల/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి ఆశోక్బాబుపై రేపల్లె పట్టణ పోలీసులు దౌర్జన్యం చేశారు. సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు. వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టాయి. పోలీసుల దాడిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన పోరాడుతున్న అశోక్బాబుపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై వేమూరు, రేపల్లె వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండిపడుతున్నాయి.రైతులకు మద్దతిచ్చినందుకు కక్షగట్టి..వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు. అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు అంబులెన్స్లో వరికూటిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ పార్టీ శ్రేణులు ఆస్పత్రి ఎదుట సైతం ఆందోళనకు దిగాయి. చివరకు రేపల్లె పట్టణ ఎస్ఐ జోక్యంతో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి. వెన్ను, నడుముపై పిడిగుద్దులు గుద్దారు..రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ఈ సందర్భంగా అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి తన వెన్నుపూస, నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రైతులకు అండగా తన ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. కాగా, వరికూటి అశోక్ బాబుపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అధిష్టానం ఈ ఘటనను సీరియస్గా తీసుకుందన్నారు. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావులు ఖండించారు. రైతులకు అండగా నిలిచినందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన పోలీసులు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టొద్దు
చెన్నై: రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు జీవించి ఉన్న రాజకీయ నేతల పేర్లు పెట్టడం లేదా ప్రభుత్వ ప్రచార సామగ్రిలో మాజీ ముఖ్యమంత్రులు లేదా సైద్ధాంతిక నాయకుల ఫోటోలను ఉపయోగించవద్దని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రకటనల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు, కంటెంట్ మార్గదర్శకాలను ఉదహరించింది. ఇటీవలే, తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరును కలుపుకొని ‘ఉంగలుడన్ స్టాలిన్’, ‘స్టాలిన్ విత్ యు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అదే పేరుతో ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీవీ షణ్ముగం పిటిషన్ దాఖలు చేశారు. సంక్షేమ పథకాల్లో రాజకీయ ప్రముఖులను పొందుపరచి రాష్ట్రం ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులను, ప్రభుత్వ ప్రకటన మార్గదర్శకాలు–2014ను ఉల్లంఘించిందని వాదించారు. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఆపడం లేదని, ఈ తీర్పు వాటిని ఎలా ప్రచారం చేస్తున్నారనే దానిపైనేనని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. -
లద్దాఖ్లో ఇస్రో ‘హోప్’ మిషన్
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను 2027 నాటికి అంతరిక్షంలోకి, 2040 నాటికి చంద్రుడిపైకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాంతోపాటు మరిన్ని కీలక అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరీక్షల కోసం జమ్మూకశ్మీర్లోని లద్ధాఖ్ను ఇస్రో ఎంపిక చేసింది. దేశంలో మొట్టమొదటి అనలాగ్ మిషన్ను ఇక్కడే చేపట్టబోతోంది. అచ్చంగా అంతరిక్షంలో, ఇతర గ్రహాలపై ఉండే భౌతిక, వాతావరణ పరిస్థితులను ఇక్కడ సృష్టిస్తారు. అందులో వ్యోమగాములు ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా వారిలో కలిగే మార్పులను అధ్యయనం చేస్తారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పరీక్షించబోతున్నారు. ఈ మిషన్కు హిమాలయన్ ఔట్పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్(హోప్) అని నామకరణం చేశారు. → లద్ధాఖ్లో ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 14,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఆక్సిజన్ లభ్యత 40 శాతమే. చలి కూడా అధికం. అంగారక గ్రహంతోపాటు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా ఉన్న పరిస్థితులను లద్ధాఖ్లో గుర్తించారు. అందుకే హోప్ మిషన్కు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. → ఇద్దరు నివసించేలా ఒక ఇంటిని నిర్మిస్తారు. ఇది స్పేస్క్రాఫ్ట్ లాగే ఉంటుంది. ఆహారం వండుకోవడానికి వసతులుంటాయి. ఇతర వనరులు పరిమితంగానే కల్పిస్తారు. వ్యోమగాములు 10 రోజులపాటు నివసించాలి. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేశారు. ఒకరు ప్లానెటరీ సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, మరొకరు పీహెచ్ పరిశోధకుడు. 135 మంది దరఖాస్తు చేసుకోగా ఇద్దరికి అవకాశం దక్కింది. → సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు రోజుల తరబడి జరుగుతుంటాయి. క్లిష్టమైన పరిస్థితులకు తగ్గట్టుగా వ్యోమగాములు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందస్తుగానే పరీక్షలు నిర్వహిస్తుంటారు. → అనలాగ్ మిషన్ అనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్న విధానం. వ్యోమగాముల ఆరోగ్యంపై పర్యవేక్షణ, ఎమర్జెన్సీ డ్రిల్స్తోపాటు ప్రతికూల పరిస్థితుల్లో కమ్యూనికేషన్లను పరీక్షించడానికి వాడుతున్నారు. → హోప్ ప్రాజెక్టులో ఐఐటీ–బాంబే, యూనివర్సిటీ ఆఫ్ లద్ధాఖ్తోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. → అనలాగ్ మిషన్తో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అడుగు ముందుకు వేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు. -
చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిన రష్యా మహిళ..
న్యూఢిల్లీ: భర్త నుంచి విడిపోయిన రష్యా మహిళ, చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిపోవడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు తలంటింది. పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మండిపడింది. మైనర్ను రష్యా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు అక్కడి భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. చిన్నారి కస్టడీ విషయంలో రష్యా మహిళ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం మే 22వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ, ఆమె దేశం విడిచి నేపాల్ మీదుగా రష్యా వెళ్లిపోయినట్లుగా తెలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల పూర్తి నిర్లక్ష్యం, వైఫల్యమని పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులతోపాటు విదేశాంగ శాఖ కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వ్యాఖ్యానించింది. కానీ, చిన్న వివాదం ఏమాత్రం కాదని పేర్కొంది. ‘ఆ బిడ్డను ఈ కోర్టు కస్టడీ నుంచి తల్లి తీసుకుంది. ఇది పిల్లలు తల్లిదండ్రుల మధ్య కస్టోడియల్ వివాదం కేసు కాదు. ఆ బాలుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి, తల్లికీ కూడా అప్పగించలేదు. దేశం తరఫున అతడి సంరక్షకుడిగా ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నాం. ఆ పిల్లవాడు ప్రస్తుతం కోర్టు కస్టడీలో ఉన్నాడు’అని ధర్మాసనం వెల్లడించింది. ఈ పరిణామానికి కారణమైన స్థానిక స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్వో), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లనే కాదు, అవసరమైతే పోలీస్ కమిషనర్కు సైతం సమన్లు జారీ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ‘తల్లి కదలికలపై కన్నేసి ఉంచేందుకు మహిళా పోలీసు అధికారులను నియమించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానికుల సాయంతో, పారదర్శకతతో వ్యవహరిస్తూ ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించడానికి సైతం అనుమతిచ్చాం. అయినప్పటికీ ఆమె బిడ్డతోపాటు ఇంటిని ఎలా వదిలి వెళ్లగలిగింది?’అని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. నేపాల్, యూఏఈ, రష్యా వైమానిక సంస్థలను సంప్రదించగా వారు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమంటూ ఎలాంటి సమాచారమూ తమకు ఇవ్వలేదని ఐశ్వర్య భాటి తెలిపారు. ‘నేర పూరిత చర్యలకు వ్యక్తిగత గోప్యతనేది వర్తించదు. ఢిల్లీ నుంచి బిహార్ ద్వారా అతి కష్టమైన రోడ్డు మార్గం ద్వారా నేపాల్కు చేరుకుంది. అక్కడ నాలుగు రోజు లు మకాం వేసింది. అయినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. కోర్టు వద్ద అసలైన పత్రాలుండటంతో ఆమె ఫోర్జరీ పత్రాలతో నేపాల్ వెళ్లినా ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేదు’అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ విషయంలో ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని, అవస రమైన ఆదేశాలను తాము జారీ చేస్తామని ఐశ్వర్య భాటికి తెలిపింది. చిన్నారిని వెనక్కి తీసుకువచ్చే విషయంలో తీసుకున్న చర్యల పురోగతిపై పది రోజుల్లో నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. రష్యా మహిళ చిన్నారి సహా దేశం విడిచి నేపాల్, షార్జాల మీదుగా వెళ్లిపోయి ఉంటుందని జూ లై 21న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేపథ్యమిదీ..భారత్కు చెందిన వ్యక్తి రష్యా మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019 నుంచి ఎక్స్–1 వీసాపై ఢిల్లీలోనే ఉంటోంది. కుమారుడు పుట్టాక వారి మధ్య విభేదాలొచ్చాయి. కోర్టు సూచన మేరకు బాలుడి సంరక్షణ బాధ్యతను వారంలో చెరి సగం పంచుకున్నారు. కొన్నాళ్లు సరిగానే ఈ వ్యవహారం నడిచినా అకస్మాత్తు గా ఆ మహిళ, చిన్నారి సహా కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. -
పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది.. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా.. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ.. జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించాడనే విషయంతోపాటు, తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. అందుకు సంబంధించిన ఓ వీడియో చూసి, మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య సాగిన సంభాషణ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం.. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా అని ఆరా తీయడం.. తమకూ చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం.. కూటమి పారీ్టల్లో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధానాంశాలు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం. జనసేన కీలక నేత కరాటం రాంబాబు: ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయింది. ఉమా: సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉందిగా? కరాటం: నాలుగేళ్లు ఉండటమేమిటండీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఇంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. ఉమా గారు.. మీరు ఎక్కడ ఉన్నారండీ.. ఉమా: నా మీద 82 కేసులున్నాయి కదా.. కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చాను. ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు. కరాటం: ఇబ్బందిగానే ఉందండి. మాకున్నదే దానం చేశాం.. ఎప్పడూ చెయ్యి చాచడం అంటే తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుంది. ఉమా: ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలుస్తుంది కదా.. కరాటం: ఏమోనండి.. మరీ ఏం జరుగుతుందో.. ఉమా: మిమ్మల్ని కూడా అడగటం లేదా? కరాటం: ఇప్పటి వరకు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఉమా: అసలు రాంబాబు గారు ఎలా ఉన్నారని గానీ, ఏమిటని గానీ.. కరాటం: ఇప్పటి వరకు అసలు ఏ ఫోన్ రాలేదు. వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గానే ఉన్నానండి. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టాను. ఆ సోంబాబు ఏం చేశాడు కోటి రూపాయలు తీసుకున్నానని పెట్టాడు. ఉమా: ఆ.. అదంతా పట్టించుకోకండి.. కరాటం: జైలులోకి వెళ్లిపోతాడంటే కాపాడింది నేనండి.. ఉమా: అవునండీ.. నాకు తెలుసండీ.. కలుద్దాం.. అటు వైపు వచ్చినప్పుడు కలుద్దామండీ.. కరాటం: అలాగేనండీ.. -
సెల్ ఫోన్ను సైతం మోయలేనని అనిపించింది..!
వాషింగ్టన్: యాగ్జియం స్పేస్ మిషన్ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని భార రహిత స్థితిలో గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత భూగురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడే క్రమంలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గురుత్వాకర్షణ శక్తి ఎంత అవసరమో భూమిని వీడాకనే తమకు తెలిసిందన్నారు. ‘ఒక్కసారిగా భార రహిత స్థితిలోకి మారిపోగా దానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అదేవిధంగా, భూమికి తిరిగొచ్చాక కూడా తిరిగి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాల్సి వచ్చింది’ అని వివరించారు. క్యాప్సూ్యల్లోంచి బయటకు వచ్చాక సెల్ ఫోన్ సైతం పట్టుకోలేనంత బరువుగా మారిపోవడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు. భూమి పైకి వచ్చిన కొన్ని వారాల తర్వాత సైతం అడ్జెస్ట్ కావడం కష్టమవుతుందని, పడిపోకుండా నిలబడటం, అడుగులు వేయడం సైతం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు. అందుకే, వ్యోమగాములకు ప్రత్యేక రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా బలం కూడదీసుకోవడం, శరీర అవయవాల సమన్వయం, బ్యాలెన్స్ వంటివి ఒక్కటొక్కటిగా అలవాటయ్యాయన్నారు. అంతరిక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే వదిలేసిన ల్యాప్టాప్ గాల్లోనే తేలియాడుతుందని భావించి, రూంలోనే దాన్ని పడేశాన ని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ శక్తిలో అన్నీ తేలియాడుతూనే ఉంటాయి. అటువంటి భారరహిత స్థితిలోనే తనకు అప్పగించిన ప్రయోగాలన్నిటినీ విజయవంతంగా నెరవేర్చానన్నారు. ‘ఇప్పుడంతా మునుపటిలాగానే మారిపోయింది. మరో స్పేస్ మిషన్కు సిద్ధంగా ఉన్నా’అంటూ ఆయన ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష కేంద్రంలో ఉంటూ చేపట్టిన ప్రయోగాల డేటా, సేకరించిన నమూనాలు ఇప్పటికే అమెరికా నుంచి భారత్లోని పరిశోధన శాలలకు చేరాయి. త్వరలో భారత్కు రానున్న శుభాంశు శుక్లా ఆ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలకు వివరించనున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు రాష్ట్రపతి తాజాగా ఆమోదముద్ర వేశారు. తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ వచ్చే వారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.ఇదీ తుహిన్ నేపథ్యం..తుహిన్ కుమార్ది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామం. తల్లిదండ్రులు.. సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్, విశాఖ ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య ఆయన హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
జట్టుగా కృషిచేస్తే సమష్టి విజయం
చినుకు చినుకు కలిస్తే ప్రవాహం అయినట్టు చేయీ చేయీ కలిపితే విజయం చేరువ అవుతుందని అంటున్నారు కొందరు మహిళా గ్రూప్ సభ్యులు. ఇంటి వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసే యాభై మంది మహిళలు వాట్సప్ ద్వారా ఒక జట్టుగా కలిశారు. ఒకరి కష్టనష్టాలను మరొకరితో పంచుకున్నారు... వ్యాపార మెళకువలను కలబోసుకున్నారు. నాలుగేళ్లుగా తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పంచుకుంటూనే వ్యాపారాలలో విజయాలు సాధిస్తున్నారు. రేపు ఆదివారం వీరంతా కలిసి సికింద్రాబాద్లోని ఎక్స్ పోచాణక్యలో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న విషయాలు..హస్తకళలు, క్లీనింగ్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్, ఫొటోగ్రఫీ, హెల్త్కేర్ సర్వీసెస్, ఈవెంట్ ΄్లానర్స్, స్నాక్స్ మేకర్స్, గిఫ్ట్ డీలర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లు.. ఇలా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యాభైమంది మహిళలు ఒకచోట చేరి జట్టుగా విజయాలు సాధిస్తున్నారు. తమతోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి, రెండేళ్ల క్రితం ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను. రోజూ ఉదయం మేమంతా రెండు గంటలసేపు ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా కలుసుకుంటాం. ఎవరికైనా ఏదైనా సమాచారం అవసరం ఉంటే.. ఆ విషయాలను పంచుకుంటాం. వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేసే స్టార్టప్ని రన్ చేస్తున్నాను. మా గ్రూప్లో ఎవరికైనా నా వర్క్ అవసరం ఉంటే వాళ్లు షేర్ చేస్తారు. నా వర్క్కి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే, మా గ్రూప్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటాను. ఏడాదికి ఒకసారి పెట్టే స్టాల్ ద్వారా నాకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి నా డెస్క్ వద్ద రాస్తాను. ఎవరికైనా ఆ స్కిల్ ఉంటే, వర్క్లో జాయిన్ కావచ్చు. వారి వద్ద ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే మాకు అందజేయవచ్చు. ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే గృహిణులు, బయటకు రావాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు.. ఈ వేదిక ద్వారా ప్రయోజనాలు ΄÷ందాలనుకున్నాం. శిక్షణాతరగతులు కూడా నిర్వహిస్తుంటాం. మహిళల వ్యాపార వృద్ధికి జట్టుగా చేసే కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది. – లక్ష్మీ మోపిదేవి, ముగ్దా క్రియేటివ్స్, హైదరాబాద్వ్యాపార విస్తరణకు సరైన మార్గంవైష్ణో ఎంటర్ప్రైజెస్ పేరుతో హెల్తీ స్నాక్స్ తయారు చేస్తుంటాను. మిల్లెట్స్తో చేసే ఈ స్నాక్స్ని ఆర్డర్ మీద సప్లయ్ చేస్తుంటాను. నా వర్క్స్ గురించి ఈ గ్రూప్లోని స్నేహితులు స్టేటస్ పెడుతుంటారు. నేనూ వారి వర్క్స్ని స్టేటస్గా పెడుతుంటాను. దీని ద్వారా మా బంధుమిత్రులకు కూడా వారి వర్క్స్ చేరువవుతుంటాయి. మూడేళ్ల క్రితం ఈ విమెన్ గ్రూప్లో చేరాను. గ్రూప్ సభ్యులుగా వర్క్షాప్స్లో కలుస్తుంటాం. ఒకరికి ఒకరం సాయంగా ఉంటాం. మహిళలు ఒకరిగా కన్నా ఇలా సమష్టి్టగా కలిస్తే విజయాలు సులువుగా సాధించగలరు. – శైలబాల, వైష్ణో ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్సృజనాత్మక పనికి చేయూతనేను బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేస్తాను. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసే నా గిఫ్ట్ ఐడియాస్లో ఫొటో ఫ్రేమ్స్, స్క్రాప్ బుక్స్, ఫొటో ఆల్బమ్స్, వెడ్డింగ్ ఈవెంట్కి కావల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. రెండేళ్ల క్రితం ఈ మహిళా గ్రూప్లో స్నేహితుల ద్వారా జాయిన్ అయ్యాను. నా వర్క్ని నా గ్రూప్లో ఉన్నవారే ప్రమోట్ చేస్తుంటారు. నేనూ ఈ గ్రూప్లోని కొంతమంది సభ్యులతో కొలాబరేట్ అయ్యి నా బిజినెస్ను పెంచుకుంటున్నాను. ప్రతి యేటా జరిగే ఈ ఎక్స్΄ోలో నా స్టాల్ ఉంటుంది. దీని ద్వారా నా వర్క్ మరింతమందికి రీచ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. – నాగవాణి, హైదరాబాద్కాంటాక్ట్స్ పెరిగాయిఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వేణీ, రిటర్న్ గిఫ్ట్స్.. వంటివి తయారు చేస్తుంటాను. తెలిసిన వారి ద్వారా ఈ మహిళా గ్రూప్లో చేరాను. దీంతో నాకు కాంటాక్ట్స్ పెరిగాయి. మిగతావారితో కలిసి నా బిజినెస్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చో తెలిసింది. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. వర్క్షాప్స్ కూడా నిర్వహించుకుంటాం. లోన్ మేళా, హెల్త్క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంటాం. – దుర్గ గరిమెళ్ళ,విపంచిక ట్రెండ్స్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలుగు చిత్రం మెరిసింది
71వ జాతీయ సినీ అవార్డులను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. 2023లో జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని, ఈ అవార్డులను ప్రకటించారు. అశుతోష్ గోవారీకర్ అధ్యక్షుడిగా, పదకొండు మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ ఫీచర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను నిర్ణయించింది. నాన్–ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డుల విజేతలను ప్రకటించిన జ్యూరీకి పి. శేషాద్రి చైర్పర్సన్గా వ్యవహరించారు. అవార్డుల్లోని ప్రధాన విభాగాల్లో హిందీ సినిమా జోరు కనిపించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి... ఇలాంటి ప్రధాన విభాగాల్లో నార్త్ సినిమా హవా కనిపించగా, టెక్నికల్ విభాగాల్లో దక్షిణాది సినిమాలకు అవార్డులు వచ్చాయి. కాగా తెలుగు చిత్రసీమ ఏకంగా ఏడు అవార్డులు దక్కించుకుని మెరిసింది.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం విశేషం. మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్ఫుల్ యాక్టర్గా రాణిస్తున్న షారుక్ ఖాన్కు తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లోని ‘జవాన్’ సినిమాతో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి విభాగంలో మరో హిందీ నటుడు విక్రాంత్ మెస్సీకీ అవార్డు దక్కింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన స్ఫూర్తిదాయకమైన బయోగ్రాఫికల్ చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’లో హీరోగా నటించారు విక్రాంత్ మెస్సీ. విధు వినోద్ చోప్రాదర్శకత్వంలోని ఈ ‘ట్వెల్త్ ఫెయిల్’ ఉత్తమ చిత్రంగానూ అవార్డు కొల్లగొట్టింది. ఇక తన బిడ్డల కోసం ఓ తల్లి చేసిన అసాధారణ పోరాటం ఆధారంగా రూపొంది, ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలోని నటనకుగాను రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడి అవార్డు ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు గాను సుదీప్తో సేన్కు దక్కింది. ఇక తెలుగు సినిమాకి దక్కిన అవార్డుల విషయానికొస్తే... 2023 దసరాకి విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘భగవంత్ కేసరి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇక 2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో అవార్డులు వచ్చాయి. ‘హను–మాన్ (నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, యానిమేటర్–వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జెట్టి వెంకట్ కుమార్లు అవార్డులు అందుకుంటారు. అలాగే స్టంట్ కొరియోగ్రఫీకి సంబంధించి నందు, పృథ్వీ అవార్డులు అందుకుంటారు. ‘బేబీ’ సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. మంచి స్క్రీన్ప్లేను సమకూర్చి యువత పల్స్ పట్టుకున్న ఈ చిత్రదర్శకుడు సాయిరాజేశ్కు స్క్రీన్ప్లే రైటర్ (ఒరిజినల్)గా, ఇదే చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా...’ పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎస్ఎన్ రోహిత్కు అవార్డులు వచ్చాయి. జాతీయ వ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘యానిమల్’ సినిమాకు ఆర్ఆర్ అందించిన హర్షవర్థన్ రామేశ్వర్కు అవార్డు దక్కింది. ఇక ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటను రాసినందుకు గాను బెస్ట్ లిరిక్ రైటర్గా కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది. ఉత్తమ బాలనటి విభాగంలో ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించగా, వారిలో తెలుగు నుంచి ప్రముఖ దర్శక – నిర్మాత సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఉన్నారు. ‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి అవార్డు లభించింది. 2023లో విడుదలైన సినిమాలకే అవార్డులను ప్రకటించారు. కానీ... ‘హను–మాన్’ సినిమా 2024లోవిడుదలైంది కదా అనే సందేహం రావొచ్చు. కానీ ఈ సినిమాకు 2023లో సెన్సార్ పూర్తయింది. ఇంకా పలు విభాగాల్లో పలు భాషలకు చెందిన అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఆ అవార్డుల జాబితా ఈ విధంగా... → ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ – జవాన్ → నటుడు: విక్రాంత్ మెస్సీ – ‘ట్వెల్త్ ఫెయిల్’ → నటి: రాణీ ముఖర్జీ – మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రం → సహాయ నటుడు: విజయరాఘవన్ – ‘పోక్కాలమ్’ (మలయాళం); ముధుపెట్టయి సోము భాస్కర్ – ‘పార్కింగ్’ (తమిళ చిత్రం) → సహాయ నటి: ఊర్వశి – ఉళ్లోళుక్కు (మలయాళ చిత్రం); → జంకీ బోడివాల – ‘వశ్ (గుజరాతీ చిత్రం) → చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి – (గాంధీ తాత చెట్టు → కబీర్ ఖాండరి – జిప్సీ (మరాఠీ మూవీ) → త్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ – నాల్ 2 (మరాఠీ మూవీ) → మేల్ ప్లేబ్యాక్ సింగర్: ప్రేమిస్తున్నా.. (పీవీఎన్ ఎస్ రోహిత్) – బేబీ మూవీ → ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: చెలియా.. (శిల్పరావు సింగర్) – జవాన్ → సినిమాటోగ్రఫీ: ప్రసంతను మొహపాత్ర – ది కేరళ స్టోరీ → ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – బేబీ: సాయిరాజేశ్ నీలం → పార్కింగ్: రాంకుమార్ బాలకష్ణన్ → డైలాగ్ రచయిత: దీపక్ కింగక్రాని: సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై → తమిళ చిత్రం – పార్కింగ్ → పంజాబీ చిత్రం – గొడ్డే గొడ్డే చా → ఒడియా చిత్రం– పుష్కర → మరాఠీ చిత్రం – శ్యాంచీ ఆయ్ → మలయాళ చిత్రం – ఉళ్లోళుక్కు → కన్నడ చిత్రం – కందిలు → హిందీ చిత్రం: కాథల్ → గుజరాతీ చిత్రం: వశ్ → బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్ → అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982 → యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) – హనుమాన్ , స్టంట్ కొరియోగ్రాఫర్: నందు, పృథ్వి → స్పెషల్ మెన్షన్ : యానిమల్ (రీ రికార్డింగ్ మిక్సర్) – ఎమ్ఆర్ రాజకృష్ణన్భగవంత్ కేసరిబాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఇతర పాత్రలు పోషించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా 2023 అక్టోబర్ 19న విడుదలైంది. ‘భగవంత్ కేసరి’ కథేంటంటే... నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) ఒక ఊచకోత కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. మంచితనంతో అక్కడి జైలర్కు (శరత్ కుమార్) దగ్గరవుతాడు. జైలర్ కుమార్తె విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల)తో మంచి అనుబంధం ఏర్పడుతుంది భగవంత్ కేసరికి. విజ్జి పాపని ఆర్మీలో చేర్చాలనేది జైలర్ కల. అయితే అనూహ్య పరిస్థితుల్లో జైలర్ మరణించే క్రమంలో విజ్జి పాపని ఆర్మీలో చేర్పించమని భగవంత్ కేసరిని కోరతాడు. దీంతో ఆ పాప బాధ్యతల్ని భగవంత్ కేసరి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా తయారు చేసి, ఆర్మీలో జాయిన్ చేయాలని శిక్షణ ఇప్పిస్తుంటాడు. అయితే ఆర్మీలో చేరడం విజ్జి పాపకు ఇష్టం ఉండదు. కానీ, ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపం చెంది, శిక్షణ తీసుకుంటుంది. పోలీసాఫీసర్ అయిన భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? విజ్జి పాప మిలిటరీలో జాయిన్ అయిందా? లేదా? కేసరిని ఇష్టపడిన సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) భగవంత్కి చేసిన సాయం ఏంటి?ప్రాజెక్ట్ వి కోసం ప్రయత్నాలు చేస్తున్న బిలియనీర్ రాహుల్ సంఘ్వీతో (అర్జున్ రాంపాల్) భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏంటి వంటి అంశాలు ఈ సినిమాలో ఆసక్తిగా అనిపిస్తాయి. అంతేకాదు.. అమ్మాయిలపై గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పిన అంశం ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రధాన కారణం.‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవడం గర్వంగా ఉంది. ఈ గౌరవం మా చిత్ర బృందానికి చెందుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిచ్చి, మరిన్ని శక్తిమంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరిచింది. – బాలకృష్ణ, నటుడుట్వెల్త్ ఫెయిల్ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా తెరకెక్కింది. మధ్యప్రదేశ్లోని చంబల్ లోయ ప్రాంతమైన మౌర్యానాకి చెందిన మనోజ్ కుమార్ శర్మది నిరుపేద కుటుంబం. చదువులో మనోజ్ బిలో యావరేజ్ స్టూడెంట్. అయితే ఓసారి మనోజ్ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అవ్వమని స్టూడెంట్స్కు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ దుష్యంత్ ప్రిన్సిపాల్ను జైలుకు పంపుతాడు. నిజాయితీగా చదివి పాస్ కావడంలోనే అసలైన గెలుపు ఉందని, మనల్ని మనం మోసం చేసుకోకూడదని డీఎస్పీ దుష్యంత్ స్టూడెంట్స్కు చెబుతాడు. ఇక మనోజ్ ఏమో ట్వెల్త్ ఫెయిల్ అవుతాడు. కానీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న మనోజ్ నిజాయితీగా చదివి ట్వెల్త్ పాస్ అవుతాడు. సివిల్స్వైపు అడుగులు వేస్తాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొంటాడు? రీ స్టార్ట్ అంటూ... ఫైనల్గా మనోజ్ ఎలా కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు? అన్నదే ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా కథ.ఏడు అవార్డులు రావడం సంతోషం71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు ఏడు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపికవడంపై బాలకృష్ణకి, తెలంగాణలోని పల్లె ఆ΄్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన ‘బలగం’లోని పాటల్లో ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ జాతీయ అవార్డుకు ఎంపికైన కాసర్ల శ్యామ్కు అభినందనలు. ‘బేబీ, హను–మాన్’ చిత్రాలకు రెండేసి అవార్డులు రావడం, ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి సుకృతి వేణి బాలనటిగా ఎంపికవడం అభినందనీయం. తెలుగు సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిజాతీయ ఉత్తమనటుడు అవార్డు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఈ అవార్డుకు నేను అర్హుడిని అని నమ్మిన జ్యూరీకి, కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ.. ఇలా అందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి, నాకు అవకాశం కల్పించిన అట్లీసార్ అండ్ టీమ్కి థ్యాంక్స్..అట్లీసార్ చెప్పినట్లు...మాస్!. సినిమాల కోసం నేను మరింత కష్టపడాలన్న దానికి ఈ అవార్డు ఓ రిమైండర్ వంటిది. – షారుక్ ఖాన్, నటుడుమా ‘హను–మాన్’కి రెండు ప్రతిష్టాత్మక విభాగాలైన యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో అవార్డు వచ్చినందుకు మా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ చిట్టికి అభినందనలు. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీలో నందు, పృథ్వీ మాస్టర్లకు ఈ అవార్డు వచ్చింది.. వారికీ అభినందనలు. మా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా తర ఫున చాలా థ్యాంక్స్. మా సినిమాకి ఈ గుర్తింపు ఇచ్చిన జ్యూరీ సభ్యులకు మా యూనిట్ తరఫున ధన్యవాదాలు. –ప్రశాంత్ వర్మ, డైరెక్టర్మా ‘బేబీ’ బెస్ట్ స్క్రీన్ప్లే, బెస్ట్ మేల్ సింగర్ విభాగాల్లో రెండు అవార్డులకి ఎంపికవడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ముఖ్యంగా స్క్రీన్ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఒక్కటే చెబుతాను. ఎస్కేఎన్ నమ్మకపోతే ఇది జరిగేది కాదు. చిన్న సినిమాలు తీసుకునే నన్ము నమ్మి ‘బేబి’ సినిమా నిర్మించి, నాకు ఈ గౌరవం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.. అలాగే నా టీమ్కి కూడా అభినందనలు. మా సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాతో తనకు పెద్ద బ్రేక్ రావడం గర్వంగా ఉంది. – సాయి రాజేశ్, డైరెక్టర్జాతీయ అవార్డు సాధిస్తాననుకోలేదు. నాకు అవార్డు వచ్చిన విషయం తెలిసి దర్శకుడు సందీప్గారు హ్యాపీ ఫీలయ్యారు. ‘యానిమల్’ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడ్డాం. మనకు దక్షిణాదిలోనే చాలా పోటీ ఉంటుంది. అలాంటిది ఉత్తరాది వెళ్లి, అవార్డు అందుకోవడం అనేది దేవుడి దయ, కొంచెం అదృష్టం, నా కష్టం... ఇవన్నీ కలిసి నా కల నిజమై నట్లుగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి సందీప్రెడ్డిగారితో నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్గారి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాం. – హర్షవర్ధన్ రామేశ్వర్, సంగీత దర్శకుడురెండోసారి జాతీయ అవార్డు వచ్చినందుకు హ్యాపీగా ఉంది (గతంలో ‘సూరరై పోట్రు’కు వచ్చింది). ‘వాత్తి’ (తెలుగులో ‘సార్’గా విడుదలైంది) సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు నన్ను ఎంచుకున్న ‡హీరో ధనుష్కి ధన్యవాదాలు. నన్ను నమ్మి ప్రోత్సహించిన దర్శకుడు వెంకీ అట్లూరి, నాగవంశీ, త్రివిక్రమ్గార్లతో పాటు టీమ్ అందరికీ «థ్యాంక్స్. – జీవీ ప్రకాశ్, సంగీత దర్శకుడు -
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవర్తమానాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.అష్టమి ఉ.5.49 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.9.36 నుండి 11.22 వరకు,దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు,అమృత ఘడియలు: రా.8.14 నుండి 10.03 వరకు.సూర్యోదయం : 5.42సూర్యాస్తమయం : 6.30రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం... పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. కళాకారులకు సన్మానాలు.వృషభం.. కాంట్రాక్టులు దక్కుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారుమిథునం.... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆకస్మిక ప్రయాణాలు. లేనిపోని చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.కర్కాటకం.... వ్యవహారాలలో ఆటంకాలు. శుభవార్తలు. వస్తు, వస్త్రలాభాలు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.సింహం.... నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో అనుకూలం.కన్య.... కుటుంబంలో చికాకులు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు.తుల.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.వృశ్చికం...... అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.ధనుస్సు... ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలలో అనుకూలత.ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం.... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.కుంభం.... ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.మీనం...... ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. దూర ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. ఉద్యోగాలలో పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. -
విద్యుత్ చార్జీల 'వీర బాదుడు'
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యుల నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెలకానెల విద్యుత్ చార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. అది చాలదన్నట్లు తాజాగా రూ.12,771 కోట్ల చార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఇదేనా బాబు సంపద సృష్టి?వెన్నుపోటు పొడవడంలో పేటెంట్ తీసుకున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ, తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టారు. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్లను జోడించారు. ఇది చాలదన్నట్లు ఇటీవల మరో రూ.3629.36 కోట్ల చార్జీల బాదుడుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి... అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీనిని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్కు రూ.0.40 చొప్పున వేసి వసూలు చేయడం కూడా కూటమి అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు జనం నుంచి వసూలు చేసేశారు. మొత్తం రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేయడం గమనార్హ. మరో రూ.842.17 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరగా, దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. ఇవన్నీ కలిపితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజల నెత్తిన మోపినట్లైంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఇదేనా సంపద సృష్టి’’ అని ప్రజలు నిలదీస్తున్నారు.జనం సొమ్ముతో రూ.12,771 కోట్ల లోటు భర్తీఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ రూ.7,790.16 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ రూ.1,935.29 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,046.51 కోట్ల చొప్పున లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్సీకి తాజాగా సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతివ్వాలని కమిషన్ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్ ప్రజలు తమ అభ్యంతరాలను ఆగస్టు 14వ తేదీలోగా ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 29లోగా డిస్కంలు బదులివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కనికరం లేకుండా ప్రభుత్వం చార్జీలు పెంచుతూనే ఉంది. నిజానికి డిస్కంల లోటు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించడం పరిపాటి. కానీ, దానిని కూడా ప్రజల సొమ్ముతోనే భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండడం అన్యాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ చార్జీలపై వ్యతిరేకంగా పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు పదో రోజు సైతం యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉభయసభల్లో నిరసనలు, నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోకపోవడంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ను పారామిలటరీ దళం అదుపులోకి తీసుకుందని మండిపడ్డారు. మరోవైపు లోక్సభలో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కానిస్టిట్యూయెన్స్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు–2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్ ఓం బిర్లాకు విపక్షాల లేఖ బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తక్షణమే లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష సభ్యులు లేఖ రాశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సవరణ ప్రక్రియ నిర్వహించడంపై వారు అనుమానాలు వ్యక్తంచేశారు. దేశంలో గతం ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం సంకేతాలిస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ఉద్దేశం పట్ల సందేహాలున్నాయని వెల్లడించారు. స్పీకర్కు రాసిన లేఖపై రాహుల్ గాం«దీ(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ), లాల్జీ వర్మ(సమాజ్వాదీ పార్టీ) తదితరులు సంతకాలు చేశారు. హరివంశ్కు మల్లికార్జున ఖర్గే లేఖ రాజ్యసభలో వెల్లో భద్రతా సిబ్బంది తమను అడ్డుకోవడం పట్ల విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది కనిపించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు ఖర్గే శుక్రవారం లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపే హక్కుకు కాలరాసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది రాజ్యసభ వెల్లోకి రాకుండా నియంత్రించాలని హరివంశ్ను కోరారు. పార్లమెంట్ ఉభయసభల లోపల భద్రతపై ప్రభుత్వానికి సంబంధం లేదని, అది సభాపతుల పరిధిలోని అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. -
సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
సాక్షి, అమరావతి: హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టడం.. ఒకటీ అరా అరకొరగా అమలు చేసి అంతా చేసేశామని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమని రాష్ట్రంలో విస్తృత చర్చ నడుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇటీవల తల్లికి వందనం పథకమైనా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకమైనా కోతల మయమేనని స్పష్టమవుతోంది. అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏటా ప్రతీ రైతుకు తామే రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నేతలంతా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్ము రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే సాయం అంటూ నాలుక మడతేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది. అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం రూ.5 వేలు పీఎం కిసాన్ 20వ విడత సాయం రూ.2 వేలతో కలిపి శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీకి తూట్లుఎన్నికల హామీ మేరకు పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఏటా రూ.26 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ లెక్కన 2023–24లో అర్హత పొందిన 53.58 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,716 కోట్లు అవసరం. కానీ 2024–25లో ఇదిగో.. అదిగో అంటూ తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. గతేడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.21,432 కోట్లు జమ చేస్తుందని రైతులు భావించారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తుందని భావించారు. కనీసం ఈ ఏడాది రూ.20 వేలు చొప్పున ఇవ్వాలన్నా రూ.10,716 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. కానీ 2025–26 బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. దీంతో వడపోత అనంతరం 46.86 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. అంటే వైఎస్సార్సీపీ హయాంతో పోల్చుకుంటే 6.72 లక్షల మందికి కోత పెట్టారు. కాగా, అర్హత పొందిన వారికి పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున రూ.831.51 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లు కలిపి రూ.3,174.43 కోట్లు తొలి విడత సాయం జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. పైగా ఎన్నికల హామీకి విరుద్ధంగా మూడు విడతల్లో జమ చేస్తామని చెప్పింది. తొలి విడత సాయం ఏప్రిల్లో, మే లో అంటూ తుదకు ఆగస్టులో అరకొరగా అదీ పీఎం కిసాన్తో ముడిపెట్టి నేడు జమ చేసేందుకు సన్నద్ధమైంది. కాగా, స్థానిక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాల్లో కేవలం పీఎం కిసాన్ సొమ్ము మాత్రమే జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ సొమ్మును ఎన్నికల కోడ్ ముగిశాక ఇస్తారు.కౌలు రైతులకు ఇస్తారో.. ఇవ్వరో..భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీ కౌలుదారులకు 2019–23 మధ్య ఏటా వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేది. ఏటా సగటున 1.64 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగు దారులైన కౌలు రైతులందరికీ భూ యజమానులతో పాటు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పెద్దలు ఎన్నికల్లో గొప్పగా ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి సీసీఆర్సీ కార్డులతో పాటు ఈ పంట నమోదు తప్పనిసరి అని మెలిక పెట్టారు. ఏటా ఏప్రిల్–మే నెలల్లోనే ప్రత్యేక మేళాల ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేసేవారు. కానీ ఈ ఏడాది జూన్ మూడో వారంలో కానీ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది 10 లక్షల కార్డుల జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3 లక్షల మందికి మించి కార్డులివ్వలేదు. సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు సాయం అందిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్లూ క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తాము అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి రాగానే అన్నదాతలను మరింత ఉదారంగా ఆదుకోవాలన్న సంకల్పంతో హామీ కంటే మిన్నగా రూ,12,500కు బదులు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని ప్రకటించారు. ఆ మేరకు తొలి ఏడాది నుంచి రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు సాయం చేశారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సొంతంగా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులందరికీ పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచారు. ఏటా 1.64 లక్షల మంది కౌలుదారులతో పాటు 94 వేల మంది అటవీ సాగుదారులకు కూడా పెట్టుబడి సాయం అందించి తన పెద్దమనసును చాటుకున్నారు. నాడు వెబ్ల్యాండ్ పరిధిలో లేని వారితో పాటు వివిధ కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేని వారు, ఈ కేవైసీ రిజక్ట్ అయిన వారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ వారు, తప్పుడు ఆధార్ సీడింగ్ అయిన వారు, కుటుంబంలో పన్ను చెల్లింపుదారులున్న సాగుదారులు, చనిపోయిన వారి కుటుంబాలలో నామినీలకు.. ఇలా అర్హత ఉన్న ప్రతి రైతుకూ వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి చేకూర్చారు. -
అణు బాంబు లాంటి సాక్ష్యం ఉంది
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఓట్ల చోరీని నిరూపించడానికి తమ వద్ద అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందని స్పష్టంచేశారు. ఈ అణు బాంబు పేలితే దాక్కోవడానికి ఈసీకి దేశంలో ఎక్కడా చోటు దొరకదని అన్నారు. ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న అధికారులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓట్ల చౌర్యంపై తమ వద్ద 100 శాతం సాక్ష్యం ఉందన్నారు. బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐర్) పూర్తయ్యి ముసాయిదా జాబితాను విడుదల చేసిన రోజే ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు గుప్పించడం గమనార్హం. కొందరి ఓట్లు తొలగించడం, కొత్తగా ఓటర్లను చేరి్పంచడం సాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసమే ఈ తతంగం సాగుతోందన్నారు. 2023లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, గత ఏడాది జరిగిన లోక్సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఓట్ల చౌర్యం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట ఎన్నికల ముందు కొత్తగా కోట్లాది మంది ఓటర్లను జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం స్పందించలేదని విమర్శించారు. అందుకే తామే సొంతంగా ఆరు నెలలపాటు పరిశోధన చేశామని, అణు బాంబు లాంటి సాక్ష్యం లభించిందని వ్యాఖ్యానించారు. ఓట్లను దొంగతనం చేయడం దేశ ద్రోహం కంటే తక్కువేమీ కాదన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు పదవీ విరమణ చేసి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటామని తేల్చిచెప్పారు. దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులకు శిక్ష తప్పదన్నారు. రాహుల్ ఆరోపణలు పట్టించుకోవద్దుఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వరుస ప్రకటనలపై ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు పట్టించుకోవద్దని.. పారదర్శకంగా, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని తమ అధికారులకు సూచించింది. ఓట్ల చౌర్యం అంటూ ప్రతిరోజూ వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలి్చచెప్పింది. ఆరోపణల గురించి పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని ఈసీ పేర్కొంది. దేశంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు స్పష్టంచేసింది. -
‘ఎఫ్–35’ కొనుగోళ్లు బంద్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్కు ఇబ్బందికరంగా మారాయి. అమెరికాతో చర్చలు జరుపలేదు రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది. -
రష్యా సమీపంలోకి... అణు జలాంతర్గాములు!
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించా’’అని వివరించారు. ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిగ్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. భూమిపై ఎక్కడైనా కొట్టగల క్షిపణి: రష్యా మాస్కో: అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో వాటిని బెలారస్లో మోహరించే యోచన ఉందని తెలిపారు. రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జండర్ లుకషెంకోతో కలిసి సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ క్షిపణులకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంవత్సరాంతానికి ఉత్పత్తి్త మొదలవుతుంది. ఉక్రెయిన్తో యుద్ధంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఒరెíÙ్నక్, దానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థలను గత అక్టోబర్లో పుతిన్ రంగంలోకి దించారు. ఆ సందర్భంగా ఒరెషి్నక్ సామర్థ్యాలను ప్రస్తుతించారు. ‘‘సంప్రదాయ, అణు వార్హెడ్లు రెండింటినీ మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకత. లక్ష్యం భూమిపై ఎక్కడున్నా ఇప్పటికైనా ఈ క్షిపణులు ఆదుకోవాల్సిందే. ఇవి దాదాపుగా మాక్10 వేగంతో దూసుకెళ్తాయి. -
25 శాతం సుంకాలు ఇక అధికారికం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తంపులమారి ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్పై తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అంతేగాక పదుల కొద్దీ దేశాలపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. తద్వారా అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య కల్లోలానికి తెర తీశారు. తాజా జాబితాలో లేని దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అత్యధికంగా సిరియాపై 41 శాతం, పలు దేశాలపై అత్యల్పంగా 10 శాతం టారిఫ్లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాకిస్తాన్పై మాత్రం టారిఫ్లను 29 నుంచి 19 శాతానికి తగ్గించడం విశేషం. తాజాగా టారిఫ్లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. మరిన్ని దేశాలు తమతో చర్చలు జరుపుతున్నా, వాటి ప్రతిపాదనలు పరస్పర వర్తక లోటును పూడ్చేలా లేవంటూ ట్రంప్ పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని టారిఫ్ పెంపుదలలు ఉంటాయని వైట్హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యక్షుడే ప్రకటన చేస్తారన్నారు. ఉత్తర అమెరికా వర్తక ఒప్పందం కింద అమెరికాలోకి ప్రవేశించే కెనడా, మెక్సికో ఉత్పత్తులకు సుంకాల బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలోకి ఫెంటానిల్ భారీ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతోందని వైట్హౌస్ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్పత్తులపై టారిఫ్లను 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. మెక్సికోకు మాత్రం పలు ఉత్పత్తులపై విధించిన 30 శాతం టారిఫ్లను సంప్రదింపులకు వీలుగా 90 రోజుల గడువిచ్చారు. అయితే ఆటోయేతర, లోహేతర వస్తువులకు మాత్రం గడువు ఇవ్వలేదు. మెక్సికో నుంచి ఉక్కు, అల్యుమినియం, రాగిపై 50 శాతం టారిఫ్లు, ఆటో ఉత్పత్తులపై 25 శాతం తప్పవని వైట్హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ కొద్ది నెలల క్రితం ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావడం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయమైనది అంటూ బుధవారం ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మన ఎగుమతులపై 25 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ఆయన పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ప్రకటించిన పెనాల్టీ శాతాన్ని మాత్రం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని అంగీకరించేందుకు భారత్ ఇప్పటికే ససేమిరా అనడం తెలిసిందే. అమెరికాపై భారత్ సుంకాలు దారుణంగా ఉన్నాయంటూ ట్రంప్ ఇటీవలే విమర్శించడం, దేశ ప్రయోజనాలను అన్ని రకాలుగా కాపాడతామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల నడుమ చర్చలు కొనసాగుతుండగానే బుధవారం ట్రంప్ 25 శాతం సుంకాలు బాదారు. ఇక అమెరికాకు ఎగుమతులపై 15 శాతం టారిఫ్లకు దక్షిణ కొరియా ఇప్పటికే అంగీకరించింది. వాటిపై 25 శాతం బాదుడు తప్పదంటూ ట్రంప్ తొలుత హెచ్చరించారు. దాంతో ఆయన నిర్ణయించే అమెరికా ప్రాజెక్టుల్లో 350 బిలియన్ల మేరకు పెట్టుబడికి ఒప్పుకుంది. ఇక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాపై టారిఫ్లను ట్రంప్ ఏ మేరకు నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12 నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఆ దేశానికి ఆయన ఇప్పటికే అలి్టమేటమివ్వడం తెలిసిందే. ఇరు దేశాల నడుమ పలు అంశాలపై వర్తక విభేదాలు కొనసాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు కాపాడతాం: కేంద్రం ట్రంప్ వ్యాఖ్యలు, తాజా ఉత్తర్వులపై కేంద్రం ఆచితూచి స్పందించింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఇరు దేశాలు విశ్వసించే ఎజెండాకు కట్టుబడి ఉన్నాం. ఈ బంధం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతీకారంగా జరిమానా విధిస్తామన్న ట్రంప్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా ఈ విషయంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
భారత వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది. ‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది. టారిఫ్ల ప్రభావం అధిగమించొచ్చు.. భారత కంపెనీలపై అమెరికా టారిఫ్ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్పై 25 శాతం టారిఫ్లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం. దేశీ మార్కెట్పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది. -
టారిఫ్ల భారం.. సగమే!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 25 శాతం టారిఫ్లు విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల దాదాపు సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎక్స్పోర్ట్స్పై సుంకాల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నాయి. టెక్స్టైల్స్/క్లోతింగ్ (10.3 బిలియన్ డాలర్లు), రత్నాభరణాలు (12 బి.డా.), రొయ్యలు (2.24 బి.డా.), లెదర్.. ఫుట్వేర్ (1.18 బి.డా.), రసాయనాలు (2.3 బి.డా.), ఎలక్ట్రికల్.. మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) రంగాలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించాయి. అమెరికాకు 5.33 బిలియన్ డాలర్ల విలువైన అపారెల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఒక ఎగుమతిదారు తెలిపారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్ గూడ్స్లాంటి సుమారు సగం పైగా పరిశ్రమలు మినహాయింపు కేటగిరీలో ఉన్నందున మిగతా సగం కేటగిరీలపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024–25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) నమోదైంది. ఏపీఐలు, సర్క్యూట్లకు మినహాయింపులు.. ఫినిష్డ్ ఫార్మా ఉత్పత్తులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), అలాగే ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైన్డ్ ఇంధనాలు, బొగ్గు, విద్యుత్లాంటి ఎనర్జీ ఉత్పత్తులు, కీలకమైన లోహాలు, ఎల్రక్టానిక్స్.. సెమీకండక్టర్లు మొదలైన వాటికి 25 శాతం టారిఫ్ల నుంచి మినహాయింపు ఉంటుందని జీటీఆర్ఐ తెలిపింది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే రవాణాలో ఉన్నవి, ఆగస్టు 7 నాటికల్లా అమెరికాకు చేరేలా ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. టారిఫ్ల వల్ల ఫ్యాక్టరీలు మూతబడకుండా నడిపించడానికి, ఉద్యోగులను తీసివేయకుండా ఉండటానికి ఎగుమతిదారులు.. ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఏఈపీసీ చైర్మన్ సు«దీర్ సెఖ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకాలపరమైన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులు కూడా ఇతరత్రా మరిన్ని మార్కెట్లకు విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
యూపీఐ సరికొత్త రికార్డ్
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జూలైలో సరికొత్త రికార్డులకు చేరాయి. 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.20.64 కోట్లతో పోల్చిచే 20 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది మే నెలలో నమోదైన 18.67 బిలియన్ లావాదేవీలు (విలువ రూ.25.14 లక్షల కోట్లు) ఇంతకుముందు వరకు గరిష్ట రికార్డుగా ఉంది. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు 85 శాతంగా ఉన్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులోకి రావడం గమనార్హం. యూపీఐపై కొత్త పరిమితులు యూపీఐ నెట్వర్క్పై రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్పీసీఐ కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాలోఎంత బ్యాలన్స్ ఉందన్నది రోజులో 50 సార్ల వరకే పరిశీలించుకోగలరు. ఇంతకుముందు ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. యూపీఐ లింక్డ్ అకౌంట్లను సైతం 25 సార్లే చూసుకోగలరు. ఒక మొబైల్ నంబర్కు లింక్ అయి, 12 నెలలకు పైగా ఇనాక్టివ్గా ఉన్న (కార్యకలాపాలు లేని) యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. -
ఏసీఏ ఎన్నికల క్రీజులో బైలా డకౌట్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాజకీయ రంగు పులుముకుని భ్రష్టు పట్టింది. క్రికెట్ అభివృద్ధికి, పారదర్శకతకు నిలువునా పాతరేయడంతో దశాబ్దాల ఏసీఏ ప్రతిష్ట మంటగలిసింది. కూటమి నేతలు చట్టాలకు తూట్లు పొడవడంతో ఎన్నికల క్రీజులో బైలా డకౌటైంది. క్రికెట్తో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఏసీఏ వెళ్లిపోవడంతో భావి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా కొనసాగుతున్న ఏసీఏలో.. కార్యవర్గం పదవీ కాలం గరిష్టంగా మూడేళ్లు. ఆ గడువు ఈ ఏడాది చివరితో ముగియనుంది. అయితే, బీసీసీఐను అనుసరించి ఏసీఏ రాసుకున్న బైలాస్ ప్రకారం ఏటా సెపె్టంబర్ 30లోగా వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇందులోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దీనిలో ప్రధానమైనది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్, అఫీస్ బేరర్ల ఎన్నిక. ఏజీఎంలో తప్పితే మరే సమయంలోనూ పదవీ కాలం పూర్తయిన తర్వాత మరో కొత్త కార్యవర్గాన్ని ఎన్నికోవడానికి బైలాలోని నిబంధనలు అంగీకరించవు. కానీ, కూటమి ప్రభుత్వంలో ఏసీఏ పాలక వర్గం ‘వార్షిక జనరల్ బాడీ మీటింగ్’ అర్థాన్నే మార్చేసింది. ఏడాదికి ఒక సారి మాత్రమే నిర్వహించే ఏజీఎంను రెండోసారి నిర్వహించేందుకు అందులో కొత్త కార్యవర్గ కోసం ఎన్నికలు చేపట్టేందుకు సమాయత్తమవుతుండడం, దీనికోసం నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. హడావుడిగా ఏజీఎం.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏసీఏ కూటమి నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. మంత్రి లోకేశ్ అండతో గత ప్రభుత్వంలో ఏర్పడిన ఏసీఏ కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేయించి ఆ పదవుల్లోకి కూటమి నేతలు దూరిపోయారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ఫ్రాంచైజీలనూ చేజిక్కించుకునే కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పాత ఫ్రాంచైజీలకు గడువు ఉన్నా.. వారిని తొలగిస్తూ కొత్త ఫ్రాంచైజీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఇక్కడే ఏపీఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి. దీని కోసం సెపె్టంబర్లోగా నిర్వహించాల్సిన ఏజీఎంను ముందుకు జరిపేశారు. జూన్1 ఏజీఎం నిర్వహిస్తున్నట్టు ఈ ఏడాది మే 12న ఏసీఏ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం జూన్లో ఏసీఏ కార్యవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది. కానీ, అప్పుడు ఎన్నికల అంశం అజెండాలోకి రాలేదు. ఈ ఎన్నిక చెల్లుబాటేనా? వాస్తవానికి ఏసీఏ బైలా ప్రకారం ఏడాదికి ఒక సారి మాత్రే వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇది జూన్లోనే ముగిసింది. ఒక వేళ అది ఏజీఎం కానప్పుడు ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్గా గుర్తించాలి. కానీ, ఏసీఏ సెక్రటరీ తన సర్క్యులర్లో స్పష్టంగా ఏజీఎం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ఏజీఎంలో మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఏసీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికలు బీసీసీఐ రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ పైగా ఏసీఏ ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికే సక్రమం కాదంటూ కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఏజీఎంకు నాలుగు వారాల ముందు ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల అధికారిని నియమించుకుని.. ఏజీఎంలో దానిని రాటిఫై చేసుకోవాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. జూన్లో అసలు ఎన్నికల అధికారి నియామకం అజెండానే పెట్టలేదు. కానీ, జూలైలో అపెక్స్ కౌన్సిల్ కూర్చుని ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ను నియమించినట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్ని గందరగోళాల మధ్య ఎన్నికలు జరిపితే ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా, బీసీసీఐ అంబుడ్స్మెన్ను ఫిర్యాదు చేసినా ఎన్నికలు చెల్లుబాటు కావని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు. నచ్చనోళ్ల ఓట్ల తొలగింపు.. ఈ నెల 3న ఏసీఏ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ నోటిఫికేషన్ ఇచ్చారు. 6న పరిశీలన, 7న అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల, 11 వరకు ఉపసంహరణ, 16న ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే, గత కార్యవర్గమే మరోసారి పీఠంపై కూర్చునే కుట్రతో తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి ఓట్లను తొలగించింది. పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఏసీఏ మాజీ అధ్యక్షుడు మనవడిని ఏసీఏ సస్పెండ్ చేసింది. అయితే, కోర్టుకు వెళ్లడంతో ఓటు తిరిగి పొందారు. కానీ, ఎన్నికల్లో పోటీకి మాత్రం అర్హత లేకుండా పోవడం గమనార్హం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవడం ఒక్క కూటమి పాలనలోనే చెల్లుతోంది. దీనికి తోడు ఏసీఏ దోపిడీలను ప్రశ్నిస్తున్న గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్నూ అబయన్స్లో పెట్టి ఓటు లేకుండా చేశారు. ఒక ప్రాంత వ్యక్తిని మరో జిల్లాలో సభ్యుడిగా చూపించి ఓటు కల్పించారు. ఇలా తమకు నచ్చినోళ్లకు ఓటు హక్కు కల్పించి నచ్చనోళ్లను తొలగించారు. వ్యతిరేకులు ఎవరూ నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓట్ల కోసమే..ఓ మూడు జిల్లాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ప్రలోభపెట్టి ఏసీఏ నుంచి పనులు ఇచ్చి నిధులు దోచిపెడుతున్నారు. -
యాంత్రిక రిమాండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి : యాంత్రిక రిమాండ్ల విషయంలో మేస్ట్రేట్లకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ గత నెల 5న జారీ చేసిన సర్క్యులర్ను హైకోర్టు కొంత మేర సవరించింది. యాంత్రికంగా రిమాండ్లు ఇస్తున్న మేజి్రస్టేట్లపై కోర్టు ధిక్కార చర్యలు కాకుండా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజి్రస్టార్ జ్యుడీషియల్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లే కాకుండా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే అన్ని కేసుల్లో కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పక అమలు చేసి తీరాల్సిందేనని మేజిస్ట్రేట్లను ఆదేశించింది.‘ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే, విచారణకు స్వీకరించదగ్గ నేరాల్లో పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3)ను అనుసరించేలా చూడాలి. ఏడేళ్ల వరకు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ ఉత్తర్వులు వెలువరించే ముందు మేజిస్ట్రేట్లందరూ.. పోలీసులు అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించారా? లేదా? అన్నది పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేయాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఇదే విషయానికి సంబంధించి గతంలో జారీ చేసిన సర్క్యులర్ను కఠినంగా అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారు’ అని తేల్చి చెప్పింది. గతంలో జారీ చేసిన సర్క్యులర్లో తమ ఆదేశాలను పాటించకుంటే దానిని చాలా తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్న వాక్యాన్ని తొలగించింది. ధిక్కార చర్యలు సరికాదంటూ పిటిషన్ జూన్ 5న హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్లో తమ ఆదేశాలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తప్పవని పేర్కొనడాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది జయంతి ఎస్సీ శేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్క్యులర్లోని పదజాలం మేజి్రస్టేట్లను బెదిరించేలా ఉందని ఆయన అందులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం కూడా సరికాదన్నారు. ఈ వ్యాజ్యంపై గత నెల 9న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైకోర్టు రిజిస్ట్రార్ గత సర్క్యులర్ను కొంత మేర సవరించారు. -
కొత్తవి ఇస్తామంటూ.. పాత పింఛన్ల కోత
సాక్షి, అమరావతి: పింఛన్ల సంఖ్యను తగ్గించడానికి కూటమి సర్కారు కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్తవి ఇస్తామంటూ పాతవాటికి కోత వేస్తోంది. దివ్యాంగులందరికీ పింఛను నిధులు విడుదల చేశామని ప్రకటిస్తూనే.. వేలాదిమందికి పంపిణీ చేయవద్దని అధికారులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదలు పింఛను మంజూరుకు కొత్తగా అర్హత వచ్చినా కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, అతడి భార్యకు స్పౌజ్ కేటగిరిలో కొత్తగా పింఛను ఇవ్వాలంటే.. ఉన్న పింఛనుదారులకు కోత పెట్టడం ద్వారా భారం తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చే పింఛన్లు దాదాపు ఐదులక్షలు తగ్గిపోగా.. స్పౌజ్ కేటగిరిలో మూడు, నాలుగు నెలలుగా ఇదిగో ఇస్తున్నామంటూ ఊరించి, ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేసేందుకు 1.09 లక్షల మందికి కొత్తగా మంజూరు చేసింది. వాటిని అలా మంజూరు చేసిందో లేదో.. ఇప్పటివరకు ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు, మంచం నుంచి కదల్లేని స్థితిలోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కేటగిరిలో ఉన్నవారికి వేలసంఖ్యలో పింఛన్లు నిలిపేసింది. నోటీసులకు స్పందించలేదనే సాకు చెబుతోంది. సంఖ్యపరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఆగస్టులో పంపిణీ చేయకూడదని నిలిపివేసిన వారితో కలిపి అందరికీ డబ్బులు విడుదల చేసినట్టు ప్రకటించారు. కానీ వారికి పంపిణీ చేయవద్దని జిల్లా అధికారులు, పంపిణీ సిబ్బందికి ఉన్నతాధికారులు ముందే ఆదేశించారు. కదలలేని స్థితిలోనో లేదంటే మంచానికే పరిమితమై ఉండే పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత తరహా రోగులతోపాటు దివ్యాంగులు ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు.రాష్ట్రంలో ఈ తరహా పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 మంది అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ పరిశీలనకు రాలేదని వేలాదిమందికి ఈ నెలలో పింఛను ఇవ్వవద్దని అధికారులను ఆదేశించింది. ఎంతమందికి పింఛన్లు ఆపేశారన్నది అధికారికంగా చెప్పకపోయినా ఈ సంఖ్య 50 వేలకు పైనే ఉంటుందని అనధికారిక సమాచారం.1.09 లక్షల పింఛన్లు మంజూరు చేస్తే.. ఆ మేరకు సంఖ్య పెరగలేదే? ఈ నెల ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 మందికి కొత్తగా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ నెలకు ప్రభుత్వం విడుదల చేసినట్టు ప్రకటించిన మొత్తం పింఛన్ల సంఖ్యలో మాత్రం ఆ మేరకు పెరుగుదల కనిపించలేదు. జూలై నెలలో జరిగిన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం 62.81 లక్షల మందికి డబ్బులు విడుదల చేయగా 61.24 లక్షల మందికే పంపిణీ చేశారు. గత నెలలో ప్రభుత్వం విడుదల చేసిన 62.81 లక్షల పింఛన్లకు ఇప్పుడు కొత్తగా మంజూరు చేసినట్టు ప్రకటించిన 1.09 లక్షల పింఛన్లను కూడ కలిపితే ఈ నెలలో 63.90 లక్షల మందికి డబ్బులు విడుదల కావాలి. కానీ.. ప్రభుత్వం 63.71 లక్షల మందికి మాత్రమే డబ్బులు విడుదల చేసింది.పింఛన్ల సొమ్ము రూ.15.59 లక్షలు స్వాహానలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి చేతివాటంప్రత్తిపాడు: లబ్దిదారులకు ప్రతి నెలా పంపిణీ కాకుండా మిగిలిన పింఛన్ల సొమ్మును నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి కాజేశారు. రూ.15,59,750 మెక్కేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఈ బాగోతం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన బదిలీల సందర్భంగా ఉద్యోగుల బకాయిలు పరిశీలిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయట పడింది. మండలంలోని గోకవరం, చినశంకర్లపూడి, గజ్జనపూడి, ధర్మవరం గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఒమ్మంగి పంచాయతీ కార్యదర్శి ఈ అవినీతికి పాల్పడ్డారు.గ్రామాల్లో పింఛన్లు బట్వాడా చేయగా మిగిలిన సొమ్మును ఏ నెలకు ఆ నెల డీఆర్డీఏ (డి్రస్టిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ)కు జమ చేయాలి. జమ చేశారో లేదో ఆయా గ్రామాల కార్యదర్శులు పర్యవేక్షించాలి. కానీ ఇప్పటి వరకూ కార్యదర్శులు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. డీఆర్డీఏలో పింఛన్ల విభాగానికి చెందిన సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) అధికారుల నిర్లిప్తత, ఆడిట్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని అవకాశంగా తీసుకుని చినశంకర్లపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గొంప శివాజీ (ప్రస్తుతం ఏలేశ్వరం మండలం భద్రవరం పంచాయతీకి బదిలీ అయ్యారు) అత్యధికంగా రూ.7,46,250 స్వాహా చేశారు. గోకవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈపీ వెంకటేశ్ (ఈయన ఏలేశ్వరం మండలం పేరవరం పంచాయతీకి బదిలీ అయ్యారు) రూ.2,03,250, ధర్మవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎం.విజయ్ కుమార్ రూ.1,90,250, గజ్జనపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ముదర సూరిబాబు (ఇదే మండలం చినశంకర్లపూడి పంచాయతీకి బదిలీ అయ్యారు) రూ.45 వేలు, ఒమ్మంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి దడాల నాగ మహేశ్ రూ.3.75 లక్షలు మెక్కేశారు. అందరూ కలిపి మొత్తం రూ.15,59,750 స్వాహా చేశారు. వీరికి నోటీసులు జారీ చేశామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్బాబు చెప్పారు. -
చెప్పినట్టు వినకపోతే... ట్రాక్టర్లతో తొక్కి చంపేస్తాం
పొదిలి రూరల్: అధికార మదంతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. పట్టా భూముల్లో సాగు చేసిన కంది పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్తో ధ్వంసం చేసి దున్నేశారు. ఇది తమ ప్రభుత్వమని, చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లుతో తొక్కి చంపేస్తాం అని బెదిరించారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని అన్నవరం గ్రామ పరిధి సర్వే నంబరు 75లో 40 ఎకరాల బీడు భూమి ఉంది. గ్రామ పెద్దలు ఆ భూమిని రెండు భాగాలుగా విడగొట్టి 20 ఎకరాలు వైఎస్సార్సీపీ వారికి, మరో 20 ఎకరాలు టీడీపీ వాళ్లకు సమానంగా పంచి ఇద్దరికి ఒప్పందం చేసి సాగు చేసుకోమన్నారు. 2018లో ఆ భూమికి వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన 16 మంది రైతులకు అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 75లో కొత్తపులి రమణమ్మ, కొత్తపులి రమణయ్య, కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి వెంకటేశ్వర్లు, కొత్తపులి కోటిరెడ్డి, లక్కు వెంకట లక్షి్మ, కొత్తపులి పరమేశ్వరమ్మ, కొత్తపులి సులోచన, కొత్తపులి ఓబులురెడ్డి(ఓబులేసు), కొత్తపులి నాగిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (అచ్చిరెడ్డి), కొత్తపులి పెదవెంకటేశ్వర్లు, కొత్తపులి రమణమ్మ (మాలకొండయ్య), పులిబాల కోటిరెడ్డి, కొత్తపులి ఓబులురెడ్డి (ఓబులురెడ్డి), ఇతరులు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై తమకూ ఈ భూముల్లో వాటా ఉందంటూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం టీడీపీకి చెందిన పులి చిన నాగిరెడ్డి, వెన్నపూస చిన సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, యర్రంరెడ్డి రమణయ్య, యర్రంరెడ్డి నాగిరెడ్డి, దమ్మిడి చెన్నయ్య ట్రాక్టర్లుతో వచ్చి సర్వేనంబరు 75లో మాకు ఇంకా 10 ఎకరాల భూమి ఉందంటూ వాదనకు దిగారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పట్టా భూముల్లో కొత్తపులి వెంకటరెడ్డి సాగు చేసుకున్న 4 ఎకరాల కంది పంటను నాశనం చేశారు. విషయం తెలుసుకున్న ఈసర్వే నంబరులోని మిగిలిన రైతులు అక్కడికి వచ్చారు. తమ భూమిని ఆక్రమించుకొని టీడీపీ వర్గీయులు భయభ్రాంతులకు గురి చేశారని, అడ్డం వచి్చన వాళ్లను చంపేస్తామని బెదిరించి అసభ్యంగా దూషించినట్టు బాధిత రైతులు వాపోయారు. తమకు పట్టాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
రిక్త హస్తాలతో సింగపూర్ నుంచి..
సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు అన్న సామెతను నిజం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన సాగింది. భారీ బృందంతో వెళ్లి రిక్తహస్తాలతో తిరిగొచి్చంది. సీఎం చంద్రబాబు , మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారుల బృందంతో ఐదు రోజుల పాటు విహార యాత్రలాగా పర్యటన చేశారే కానీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక్క కీలక ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటికే అనేకసార్లు చూసిన సింగపూర్కు మళ్లీ వెళ్లి అవే పోర్టులు, భవనాలను చూసి ఆ దేశ వైభవం గురించి 2014–19 మధ్య చెప్పినట్టే ఇప్పుడూ అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్ఫ్రంట్ నగరం కడతాను అంటూ కబుర్లతో కాలక్షేపం చేశారు. సాధారణంగా ఏదైనా దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ వివరాలను సుదీర్ఘంగా వివరించడం చంద్రబాబుకు అలవాటు. అలాంటిది ఈసారి విలేకరుల సమావేశం పెట్టకుండా సమీక్షలతో సరిపెడుతూ ముఖం చాటేశారు. దీన్నిబట్టే సింగపూర్ పర్యటన ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. – సాక్షి, అమరావతిమీకో నమస్కారం.. కలిసి పనిచేయలేం..రాష్ట్ర ప్రభుత్వంతో అధికారికంగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మీతో స్నేహం చేసిన తర్వాత మా దేశ మంత్రి ఏకంగా అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, అలాంటివారితో ఇక తాము కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పింది. అతిథిలాగా గౌరవించి ముఖస్తుతి కోసం మీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారే కానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చివరకు చంద్రబాబు చేసేది ఏమీ లేక నవంబరులో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రండి అంటూ ఆహ్వానించి మెల్లగా జారుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఎప్పటిలాగానే తన అనుకూల మీడియాలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, ఏపీ బ్రాండ్ను చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారంటూ పేజీల పేజీల కొద్దీ కథనాలు వండివార్చి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు.బాబూ ఇదేమి చిత్రం చిత్రం, జయం, నిజం వంటి పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగువాడైన తేజతో ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సింగపూర్లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అక్కడి కంపెనీలు ముందుకురాకపోవడంతో తేజ డైరెక్టర్గా ఉన్న టెజారాక్ట్ యూఎస్ ఐఎన్సీతో కంటెంట్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాగా, సీఎం బృందం సింగపూర్ పర్యటనలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్రాయిస్ సింగపూర్ యూనిట్లో తెలుగు అమ్మాయి ఏఐ క్లౌడ్ టీమ్లో ఉద్యోగం చేస్తోంది. ప్రవాసాంధ్రుల ముఖాముఖిలో ఆమె మాట్లాడుతూ రోల్స్ రాయిస్ను ఏపీకి తెచ్చే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయంతో మాట్లాడతానని చెప్పడం, ఆ విషయాన్ని ఇక్కడి పత్రికలు రోల్స్ రాయిస్ ఏపీకి వచ్చేస్తున్నట్లు కథనాలు ప్రచురించడం గమనర్హం. ఇదంతా సరిపోయారు ఇద్దరకు ఇద్దరు అన్న చందంగా ఉందంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. రోల్స్ రాయిస్ వంటి ప్రసిద్ధ సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టే పెట్టుబడిపై ఒక సాధారణ ఉద్యోగి మాట్లాడే అవకాశం ఉంటుందా? కానీ, అలాంటి వ్యాఖ్యలకు కూడా పచ్చ మీడియాలో భారీ ప్రచారం కల్పించారంటే తమ వాళ్ల ప్రచార పిచ్చికి అది పరాకాష్ఠ అని టీడీపీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. దావోస్ సదస్సుకు ముందు సైతం పెట్టుబడుల కోసం వేట అంటూ ప్రచారం కల్పించారని, ఇప్పుడు కూడా సింగపూర్ పర్యటనపై ఊదరగొట్టారని పేర్కొన్నారు. తీరా చూస్తే అప్పటిలాగానే ఖాళీ చేతులతో తిరిగిరావడంతో కూటమి నేతలు నైరాశ్యంలోకి జారిపోయారని వివరించారు. కాగా, సింగపూర్ పర్యటనపై మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్లో పోర్టులు, రియల్ ఎసేŠట్ట్, భవనాలు, డేటా సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పడం కొసమెరుపు. -
సంకల్పానికి ‘సెల్యూట్’
సాక్షి, అమరావతి/అచ్యుతాపురం/దత్తిరాజేరు: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షల్లో విశాఖపట్నానికి చెందిన గండి నానాజీ 168 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. విజయనగరానికి చెందిన జి.రమ్యమాధురి 159 మార్కులతో రెండో స్థానంలో, రాజమహేంద్రవరానికి చెందిన మెరుగు అచ్యుతరావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 3,580 సివిల్ కానిస్టేబుల్, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొత్తం.. 6,100 పోస్టుల భర్తీ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా ప్రిలిమినరీ, దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షల అనంతరం తుది ఫలితాలను పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత తుది ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వారిలో అర్హత సాధించిన 38,914 మందికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా.. 33,921 మంది అర్హత సాధించారు. రిజర్వేషన్ల వారీగా ఎంపికైన 6,100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 3,580 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 1,063 మంది మహిళలున్నారు. కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోలీసు నియామక మండలి వెబ్సైట్ www.slprb.ap. gov.in లో అందుబాటులో ఉంచారు. వివరాల కోసం అభ్యర్థులు 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని, లేదా slprb@ap.gov.in కు మెయిల్ చేయాలని అధికారులు సూచించింది. ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోం మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎంపికైన కానిస్టేబుళ్లకు సెపె్టంబర్ నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పోలీస్ నియామక మండలి చైర్మన్ ఆర్కే మీనా, అదనపు డీజీ ఎన్.మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేకల కాపరి కుమారుడికి స్టేట్ ఫస్ట్ మేకలు కాస్తూ తండ్రి అయ్యబాబు పడుతున్న కష్టాన్ని చూసి ఆ యువకుడు మధనపడేవాడు. ఏదో ఒకటి సాధించి తీరాలని తపన పడేవాడు. చివరికి అనుకున్నది సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన గండి నానాజీ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తల్లి జయమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పరీక్షకు శిక్షణ ఇప్పించింది. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నతోద్యోగం సాధించి తీరతానని నానాజీ చెప్పాడు. అదరగొట్టిన ‘ఆశా’ కుమార్తె విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన గొర్లె రమ్యమాధురి 159 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. రమ్యమాధురి తండ్రి రమణ తన చిన్నతనంలోనే మృతి చెందగా.. ఆశా కార్యకర్త అయిన తల్లి జయమ్మ, పూల దుకాణంలో పనిచేసే అన్నయ్య గౌరీశంకర్ ఆమెను చదివించారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పోలీస్ కావాలన్న లక్ష్యంతో కాకినాడలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నానని, అత్యధిక మార్కులతో లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉన్నట్టు రమ్యమాధురి చెప్పింది. -
వీఆర్ కూడా పోస్టింగేనా.. జీతాలేవి మరి..!
సాక్షి, అమరావతి: ‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉండటం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్ పోస్టే’ అని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖ సిబ్బంది, అధికారులు వారి కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘వీఆర్లో ఉండటం కూడా పోస్టింగే అయితే... మరి జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కుట్రలతో దేశ చరిత్రలోనే ఎన్నడూలేని రీతిలో భారీగా ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని అత్యున్నతాధికారి అయిన డీజీపీ గుప్తా బహిరంగంగా సమరి్థంచడంపై మండిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మల్లా పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ గుప్తా వ్యాఖ్యలు ఆ శాఖలో హాట్టాపిక్గా మారాయి.వేధించడం ఏవిధంగా సమర్థనీయం డీజీపీ..!?పోలీసుల సంక్షేమం, గౌరవాన్ని పరిరక్షించాల్సిన డీజీపీ గుప్తా మాత్రం చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్రను వెనకేసుకురావడంపై పోలీసువర్గాలు గళం విప్పుతున్నాయి. వీఆర్ శాంక్షన్ పోస్టే అయితే వారికి ప్రతినెలా జీతం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కనీసం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఈ ఐదు నెలల్లో అయినా వీఆర్లో ఉన్న పోలీసు అధికారులకు జీతాలు చెల్లించారా.. అని సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రభుత్వంలో ఏ ఇతర శాఖలో లేని రీతిలో భారీ సంఖ్యలో అధికారులను వెయిటింగ్లో ఉంచడం, జీతాలు చెల్లించకుండా వేధించడం ఏవిధంగా సమర్థనీయమో డీజీపీ గుప్తానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారిన డీజీపీ కనీసం ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా ఉండాల్సిందని, పోలీసులు కీలు బొమ్మలు కాదని అభిప్రాయపడుతున్నాయి. వీఆర్లో పోలీసు అధికారులకు పోస్టింగులు ఇప్పించే బాధ్యత తీసుకోలేకపోయినా కనీసం వారికి నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం డీజీపీ స్థాయి అధికారికి తగదని విమర్శిస్తున్నాయి. 199 మంది పోలీసు అధికారులకు వీఆర్!దేశ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయిలో వేధింపులు గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం మీద 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్లో ఉంచింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ సంఖ్యలో పోలీసు అధికారులను వీఆర్లో ఉంచలేదు. నెలల తరబడి పోలీసు అధికారులను అవమానానికి గురి చేసింది. వారికి జీతాలు చెల్లింపు నిలిపివేసింది. అంతే కాదు వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాలని, వెయిటింగ్ హాల్లో రోజంతా నిరీక్షించి సాయంత్రం 5 గంటలకు సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం విభ్రాంతి కలిగించింది. ఇప్పటికీ ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామ్రెడ్డి, వై.రవిశంకర్రెడ్డి, పి.జాషువా, వై.రిషాంత్ రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు వీఆర్లోనే ఉన్నారు. పోలీసు అధికారులను దీర్ఘకాలం వీఆర్లో ఉంచొద్దని రాజస్థాన్ హైకోర్టు కూడా ఇటీవల తీర్పు/నిచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కుట్రతో వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది. -
మెడి'కిల్స్'
మీకు తల నొప్పి వస్తుందా?.. తరచూ జ్వరం బారినపడుతున్నారా?.. కడుపు, ఒళ్లు నొప్పులతో భరించ లేకపోతున్నారా?.. నిద్ర పట్టడం లేదా?.. మీకు భయమేమీ లేదు.. అనారోగ్య సమస్య గురించి చెబితే చాలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులు ఇచ్చేస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. ఏ మందు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదో ఓ సారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపు కోవడం విమర్శలకు తావిస్తోంది.చిత్తూరు రూరల్ (కాణిపాకం): డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. సేమ్ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.. అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 1,500 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులున్నాయి. అలాగే చాలామంది క్లినిక్లోనే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5 వేల నుంచి రూ.లక్ష దాకా వ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారం ఇష్టానుసారంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తారుమారు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు– 1940, ఫార్మసీ యాక్టు– 1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తి గత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదోరకమైన దందా.. జనరిక్, నాన్ జనరిక్ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్తో కొత్తరోగాల బారిన పడుతున్నారు. ఇక బెంగళూరు నుంచి పలు రకాల బ్రాండ్ల పేరుతో అనధికారికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇవీ తక్కువ రేటుకు ఇస్తుండడంతో మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో రెండు నెలలకు క్రితం చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధిలోని రెండు మెడికల్ షాపులపై డ్రగ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో విక్రయానికి అనుమతి లేని మందులను గుర్తించారు. మందులు, మాత్రల విక్రయాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేవని తెలుసుకున్నారు. దీంతో ఆ షాపును సీజ్ చేయగా..మరో షాపునకు నోటీసులు ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు.. ఇలా వందల సంఖ్యలో మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. -
సాగర్ సొగసు చూడతరమా..!
విజయపురిసౌత్: నాగార్జున సాగర్కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేప«థ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్కో ఎస్ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది. చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, పంక్షన్లకు శాంతిసిరి గంటకు రూ.10,000లు, అగస్త్య లాంచీ గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్ను సంప్రదించవచ్చు. గత ఆనవాళ్లకు చిరునామా అనుపు నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్షా్వకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాథస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం. భక్తుల కోర్కెలు తీర్చేసాగర్మాత విజయపురిసౌత్లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకతను నెలకొంది. -
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
కిన్ డబుల్ ధమాకా..
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ ఆరో రోజు స్టార్ స్విమ్మర్లు లాన్ మర్చెండ్ (ఫ్రాన్స్), టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ (కెనడా) బరిలో లేకపోవడంతో... ఐదు వేర్వేరు దేశాలకు చెందిన స్విమ్మర్లు పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం పోటీల్లో నెదర్లాండ్స్, చైనా, హంగేరి, అమెరికా, ఇంగ్లండ్కు చెందిన స్విమ్మర్లు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో మ్యారిట్ స్టీన్బెర్గన్ (నెదర్లాండ్స్) పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్ రేసులో స్టీన్బెర్గన్ 52.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మొల్లీ ఓ కల్లాఘన్ (52.67 సెకన్లు; ఆ్రస్టేలియా), టారీ హుస్కే (52.89 సెకన్లు; అమెరికా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. 2024లో దోహా వేదికగా జరిగిన పోటీల్లో సైతం విజేతగా నిలిచిన స్టీన్బెర్గన్... చివరి 50 మీటర్లలో జోరు పెంచి చాంపియన్గా అవతరించింది. ఆ్రస్టేలియా, అమెరికా స్విమ్మర్ల నుంచి కఠిన పోటీ ఎదురైనా... ఆఖర్లో ఆధిక్యం కనబర్చింది. ‘దోహాలో సునాయాసంగా విజయం సాధించా. కానీ ఈ సారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఈ విజయం చాలా సంతృప్తినిచి్చంది’ అని పోటీ అనంతరం స్టీన్బెర్గన్ పేర్కొంది. ఆరో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా, ఆ్రస్టేలియా ఐదేసి స్వర్ణ పతకాలతో పట్టిక అగ్రస్థానంలో నిలిచాయి. ఓవరాల్గా అమెరికా 20 పతకాలు సాధించగా... ఆ్రస్టేలియా 13 పతకాలు ఖాతాలో వేసుకుంది. కిన్ విన్ పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో చైనా స్విమ్మర్ కిన్ హైయాంగ్ విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కిన్ 2 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పీ వటనబె (2 నిమిషాల 7.70 సెకన్లు; జపాన్) రజతం గెలుచుకోగా... కాస్పర్ కారŠూబ్య (2 నిమిషాల 7.73 సెకన్లు; నెదర్లాండ్స్) కాంస్య పతకం నెగ్గాడు. ఈ విభాగంలో రెండేళ్ల క్రితం ప్రపంచ రికార్డు (2 నిమిషాల 5.48 సెకన్లు) తనపేరిట రాసుకున్న కిన్... విజయం అనంతరం ‘ఇదో అద్భుతం’ అని వ్యాఖ్యానించాడు. 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లోనూ పసిడి నెగ్గిన కిన్... 200 మీటర్లలోనూ జోరు కనబర్చి డబుల్ ధమాకా మోగించాడు. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ హబర్ట్ (హంగేరి) పసిడి పతకం గెలిచాడు. 1 నిమిషం 53.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పీటర్ కోట్జీ (1 నిమిషం 53.36 సెకన్లు; దక్షిణాఫ్రికా), యోహాన్ బ్రౌర్డ్ (1 నిమిషం 54.62 సెకన్లు; ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్... అమెరికాకు ఐదో స్వర్ణం అందించింది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో 2 నిమిషాల 18.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్ కావడం విశేషం. చికునోవా (2 నిమిషాల 19.96 సెకన్లు) రజతం గెలుచుకోగా.. కైలెన్ కార్బెట్, అలీనా ముసుకా (2 నిమిషాల 23.52 సెకన్లు) ఒకే సమయంలో లక్ష్యాన్ని చేరి కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 4–200 ఫ్రీస్టయిల్ రిలేలో బ్రిటన్ జట్టు 6 నిమిషాల 59.84 సెకన్ల టైమింగ్తో స్వర్ణం పసిడి గెలుచుకుంది. చైనా (7 నిమిషాల 0.91 సెకన్లు), ఆ్రస్టేలియా (7 నిమిషాల 0.98 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన 12 ఏళ్ల స్విమ్మర్ యూ జిడి ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగంలో చైనా జట్టులో సభ్యురాలైన యూ జిడి కాంస్యం గెలుచుకుంది. ఆ్రస్టేలియా, అమెరికా బృందాలు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గారు. 200 మీటర్ల బటర్ఫ్లై, 200 మీటర్ల మెడ్లీ వ్యక్తిగత విభాగాల్లోనూ యూ జిడి పతకానికి దగ్గరగా వచ్చింది. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకానికి దూరమైంది. 400 మీటర్ల విభాగం యూ జిడి ఇంకా పోటీ పడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత స్విమ్మర్ల నిరాశజనక ప్రదర్శన ఆరో రోజు కూడా కొనసాగింది. పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో రోహిత్ 47వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
ఫైనల్కు లక్కీ
ఏథన్స్ (గ్రీస్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ లక్కీ పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 110 కేజీల విభాగంలో లక్కీ ఫైనల్కు దూసుకెళ్లాడు. జపాన్, ఇరాన్కు చెందిన రెజ్లర్లపై విజయాలతో లక్కీ ముందంజ వేశాడు. జపాన్ రెజ్లర్ హంటో హయేషిపై టెక్నికల్ సూపీరియారిటీతో విజయం సాధించిన లక్కీ... తదుపరి రౌండ్లో 8–0తో ముర్తాజ్ బగ్దవద్జె (జార్జియా)పై గెలుపొందాడు. ఇక హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో లక్కీ 15–7 పాయింట్ల తేడాతో ఇరాన్కు చెందిన అమీర్ హుసేన్పై నెగ్గాడు. 65 కేజీల విభాగంలో గౌరవ్ పూనియా తొలి రెండు రౌండ్లలో టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించినా... క్వార్టర్స్లో ఓడి ఇంటిబాట పట్టాడు. -
గొర్రెల స్కామ్ రూ.1,000 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే గోల్మాల్ జరిగినట్టు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 200లకు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు కలిసి సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్టు ఈడీ వెల్లడించింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్కుమార్, కొందరు వినియోగదా రులు, మరో మధ్యవర్తి ఇంట్లో ఈ సోదాలు చేసినట్టు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా 200 డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్ బుక్స్, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను స్వాధీనంచేసు కున్నట్టు తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు జరి గిన లావాదేవీల లింకులను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీ పథ కంలో కొల్లగొట్టిన కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకు బెట్టింగ్ యాప్స్ను ఉప యోగించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. రూ.2.1 కోట్లతో మొదలై.. రూ.వందల కోట్లకుగొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం (షీప్ రియరింగ్ డెవలప్మెంట్ స్కీం–ఎస్ఆర్డీఎస్) కేసు ఆది నుంచి కీలక మలుపులు తిరుగుతోంది. తమ వద్ద కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.1 కోట్ల డబ్బు తమకు ఇవ్వకుండా పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అక్రమంగా ఇతర అకౌంట్లకు మళ్లించారని కొందరు గొర్రెల విక్రేతలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్యాదవ్కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. ఈ రెండు కేసుల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కల్యాణ్కుమార్ సహా ఫిష్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రాంచందర్నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్రావు, బ్రోకర్లు సహా మొత్తం17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్–2002) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో తొలుత రూ.2.1 కోట్ల మేర అవినీతి బహిర్గతమైంది. ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికతో రూ.253.93 కోట్లకు ఈ కుంభకోణం చేరింది. తాజాగా ఈడీ అధికారుల సోదాల్లో లభించిన ఆధారాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కలిపి మొత్తం రూ.వెయ్యికోట్లకుపైనే అవినీతి జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ చేయకుండానే..నిధులు పంచుకుతిన్నారు గొర్రెల పంపిణీ పథకంలో ‘నీకిది నాకది’(కిక్బ్యాక్) తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగ్లు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలను గుర్తించింది. గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారుల్లో చాలామంది ఈ పథకం ప్రారంభానికి ముందు గొర్రెల వ్యాపారంలో లేరని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఎటువంటి కొనుగోలు, అమ్మకాలు జరగలేదని గుర్తించారు. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు, నకిలీ వాహనాలు, లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధులను నకిలీ సరఫరాదారుల ఖాతాల్లోకి మళ్లించారని తేల్చారు. నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు, గొర్రెలను మళ్లీమళ్లీ చూపించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టి భారీ అక్రమాలకు తెర తీసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా వాహనాల బిల్లు, చెల్లింపుల రికార్డులు, ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజా సోదాల్లో కీలక ఆధారాలు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బుధవారం దిల్సుఖ్నగర్లోని జి.కల్యాణ్కుమార్ ఇంటితోపాటు రాంచందర్నాయక్, రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్రావు, లోలోనా ది లైవ్ కాంట్రాక్ట్ సంస్థ యజమానులు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇళ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన కల్యాణ్కుమార్ ఇంట్లో పలు కీలక ఆధారాలు ఈడీ అధికారులు గుర్తించారు. డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్బుక్స్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో కల్యాణ్కుమార్తోపాటు మరో ఇద్దరిని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. వారిని వేర్వేరుగా విచారించారు. కల్యాణ్కుమార్ అరెస్టుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. బెట్టింగ్యాప్ వ్యవహారంతో కొత్త మలుపు ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు..గొర్రెల పంపిణీ పేరిట లబ్ధిదారులకు చేరకుండానే నిధుల మళ్లింపునకు పరిమితమైన ఈ కుంభకోణంలో ఈడీ తాజా తనిఖీలతో బెట్టింగ్యాప్ల లింక్ బయటపడింది. గొర్రెల కొనుగోలు కుంభకోణం నిధుల మళ్లింపునకు వాడిన డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్బుక్స్, డెబిట్ కార్డులు ఓ ఆన్లైన్ బెట్టింగ్యాప్తో లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలు డబ్బును విదేశాలకు చేర్చేందుకు లేదంటే దారి మళ్లించేందుకు ఈ బెట్టింగ్ యాప్స్ను వాడుకున్నారా? అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
భారత్ ఫుట్బాల్ కోచ్గా జమీల్
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చాన్నాళ్ల తర్వాత స్వదేశీ కోచ్ను నియమించారు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత్కు చెందిన ఖాలిద్ జమీల్కు జాతీయ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కోచ్ పదవి కోసం విదేశీ కోచ్లు స్టీఫెన్ కాన్స్టంటైన్, స్టీఫాన్ టర్కోవిచ్లు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరిని వెనక్కినెట్టిన 48 ఏళ్ల జమీల్ భారత్ హెడ్ కోచ్గా నియమితులయ్యారు. 13 ఏళ్ల తర్వాత జాతీయ ఫుట్బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ శిక్షణ ఇవ్వనున్నారు. చివరి సారిగా భారత్కే చెందిన సావియో మెడెరా 2011 నుంచి 2012 వరకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. తాజా నియామకంపై ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ ‘ఐఎమ్ విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ ముగ్గురితో కూడిన తుదిజాబితా నుంచి జమీల్ను ఎంపిక చేసింది. అయితే ఆయన పదవీ కాలాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. జమీల్ మూడేళ్ల గడువును ఆశిస్తున్నారు. అయితే రెండేళ్లా లేదంటే మూడేళ్లా అనేది జట్టు ప్రదర్శన, ఆయన ఇచ్చే శిక్షణను బట్టి ఉంటుంది’ అని అన్నారు. భారత మాజీ ఫుట్బాలర్ అయిన జమీల్ శిక్షణలో 2017లో ఐజ్వాల్ ఫుట్బాల్ క్లబ్ ‘ఐ–లీగ్’ టైటిల్ను సాధించింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్సీ కోచ్గా ఉన్నారు. అయితే భారత కోచ్గా నియమితులైన జమీల్ పూర్తి స్థాయిలో టీమిండియా కోచ్గా పనిచేయాల్సి ఉంటుందని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు చౌబే స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఎల్ ఫ్రాంచైజీకి జమీల్ గుడ్బై చెప్పాల్సి ఉంది. గత కోచ్ మారŠె భారత జట్టు హెడ్ కోచ్గా ఉంటూనే, ఎఫ్సీ గోవా కోచ్గాను పనిచేశారు. స్పెయిన్కు చెందిన మనోలో గత నెల కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. టీమిండియా గత కొంతకాలంగా తక్కువ ర్యాంకు జట్లతోనూ ఓడిపోతుండటంతో ఇంకో ఏడాది పదవీకాలం మిగిలిండగానే కోచ్ తన పదవికి రాజీనామా చేశారు. -
కాళేశ్వరం నివేదికపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవినీతిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ సమర్పించిన నివేదికపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతిని కమిటీలో సభ్యులుగా నియమించింది. నివేదికను అధ్యయనం చేసి.. దాని సారాంశం (జిస్ట్) సిద్ధం చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నెల 4వ తేదీన ఈ నివేదికపై చర్చించడానికి సింగిల్ పాయింట్ ఎజెండాతో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఆ సమావేశంలో నివేదికపై విస్తృతంగా చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఎం చేతికి నివేదికజూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను శుక్రవారం సీల్డ్ కవర్లలో అందజేశారు. నివేదికను అందుకున్న వెంటనే దానిపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. 4న జరిగే మంత్రివర్గ సమావేశంలోపు నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ అందించనుంది. కేబినెట్లో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నివేదిక అందించే సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డితో సీఎం కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. ప్రణాళిక లోపమేనా?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయిన విషయం విదితమే. ఈ నిర్మాణ లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో విచారణ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బరాజ్లకు సంబంధించి ప్రణాళిక, నమూనాలు, నాణ్యత, నిర్వహణ ప్రధాన లోపాలు కాగా, స్థల ఎంపిక కూడా ఇందుకు కారణమన్న అభిప్రాయాన్ని కమిషన్ తన నివేదికలో వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. ఈ బరాజ్ల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సహా దాదాపు 150 మందిని విచారించిన తరువాత ఈ నివేదికను నివేదిక రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతకలు చోటు చేసుకున్నట్లు కమిషన్ నివేదికలో వెల్లడించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై కమిషన్ స్పష్టతనిచ్చిందని అంటున్నారు. -
గ్రాహం థోర్ప్కు నివాళిగా...
మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ స్మరణార్ధం ఇంగ్లండ్ ఆటగాళ్లు ‘ఎ డే ఫర్ థోర్పీ’ పేరుతో నివాళి అర్పించారు. ఆటగాడిగా ఉన్నప్పుడు తలకు హెడ్బ్యాండ్ ధరించి బ్యాటింగ్కు వచ్చే థోర్ప్ను గుర్తు చేసుకుంటూ...ఇంగ్లండ్ క్రికెటర్లు మ్యాచ్ రెండో రోజు అదే తరహా తెలుపు హెడ్బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. థోర్ప్ సొంత మైదానమైన ఓవల్ గ్రౌండ్లోనే టెస్టు జరుగుతున్న నేపథ్యంలో అతని భార్య, కూతురు ఆటకు ముందు గంట మోగించారు.మ్యాచ్ సందర్భంగా ప్రత్యేకంగా నిధుల సేకరణ కూడా జరిగింది. శుక్రవారం థోర్ప్ పుట్టిన రోజు కాగా...ఏడాది క్రితం 55 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6744 పరగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 82 వన్డేల్లో 37.18 సగటుతో 2380 పరుగులు సాధించాడు. -
సెమీస్లో తరుణ్
మకావ్: సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి... మకావ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్కు చేరాడు. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)పై ప్రిక్వార్టర్స్లో సంచలన విజయం సాధించిన తరుణ్... క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ 21–12, 13–21, 21–18తో ప్రపంచ 87వ ర్యాంకర్ హు జె (చైనా)పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్–300 టోర్నీల్లో తరుణ్ సెమీస్కు చేరడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు అత్యుత్తమంగా జర్మన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఆడాడు. 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ను సులువుగా గెలుచుకున్న 23 ఏళ్ల తరుణ్... రెండో గేమ్లో వెనుకబడ్డాడు. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్లు సాగగా... కీలక దశలో పాయింట్లు సాధించిన తరుణ్ ముందంజ వేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్ 21–14, 18–21, 21–14తో జియాన్ చెన్ జూ (చైనా)పై విజయం సాధించాడు. 63 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో లక్ష్యసేన్ ఆధిక్యం కనబర్చాడు. నేడు జరగనున్న సెమీఫైనల్స్లో ఐదో సీడ్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో లక్ష్యసేన్, జస్టిన్ హో (మలేసియా)తో తరుణ్ తలపడనున్నారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 14–21, 21–13, 20–22తో చూంగ్ హాన్ జియాన్–హైకల్ ముహమ్మద్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సర్కారు బడికి ‘రాం’ రాం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్ బాడీ) చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సర్కారు బడుల్లో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, డిజిటల్ పద్ధతిలో బోధన చేస్తున్నా కార్పొరేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2019–20 నుంచి 2021–22 వరకు సర్కారు బడుల్లో పెరిగిన ఎన్రోల్మెంట్.. ఆ తర్వాత 2022–23, 2023–24ల వరకు వచ్చే సరికి గణనీయంగా పడిపోయింది.2024–25లో కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక ఆశాజనకంగా లేదని యూనిఫైడ్ డిస్టిక్ట్ర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఇ) నివేదికలు చెబుతున్నాయి. 2019–20 నుంచి 2023–24ల వరకు ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో నమోదైన విద్యార్థుల గణాంకాలను రెండు రోజుల కిందట కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2021–22 సంవత్సరంలో నమోదైన విద్యార్థుల సంఖ్య.. 2023–24లోని సంఖ్యతో పోలిస్తే రెండు సంవత్సరాల్లో 1,57,50,281 మంది తగ్గారు.దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..ఏటేటా సర్కారు బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2019–20లో 13,09,31,634 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉంటే.. 2020–21 నాటికి ఆ సంఖ్య 13,49,04,560లకు చేరింది. మరుసటి సంవత్సరం 2021–22లో 14,32,40,480 లకు పెరగ్గా ఆ తర్వాత నుంచి ఎన్రోల్మెంట్ తగ్గింది. 2022–23లో 13,62,04,917లు కాగా, 2023–24 నాటికి 12,74,90,199లకు పడిపోయినట్లు రికార్డులు చెప్తున్నా యి. ఈ లెక్కన అత్యధికంగా రెండేళ్లలో బిహార్లో 45,22,871, ఉత్తరప్రదేశ్లో 31,88,070, రాజస్థాన్లో 15,30,705, మధ్యప్రదేశ్లో 7,57,974, తెలంగాణలో 5,23,986 మంది సర్కారు బడులకు దూరం అయ్యారు. ఒడిశా, లక్షదీప్లు మినహా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి పలు రాష్ట్రాల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గింది.ఉమ్మడి వరంగల్లో మూతబడులురాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేనట్లు అప్పట్లో అధికా రులు ప్రకటించడం గమనార్హం. కాగా ఉమ్మడి వరంగల్లోనూ 298 వరకు ప్రభుత్వ పాఠశాల లు మూత బడినట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కారు బడుల్లో సంఖ్య తగ్గడానికి గురుకు లాలు, మోడల్ స్కూళ్లు కారణమవగా.. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని వారు, గురుకులాల్లో సీట్లు దక్కని వారు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు బడుల్లో చేరుతున్నారని ఉపాధ్యా యులు చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో నాణ్యత తక్కువగా ఉంటుందని భావించి, ప్రైవే టు పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తు న్నారన్న ప్రచారం కూడా ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు ఉండటం వల్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్తున్నారు.మూతబడులను పునఃప్రారంభించాలి సర్కారు బడులకు పిల్లలు రావడం లేదని చాలాచోట్ల స్కూల్స్ మూసేస్తున్నారు. ఇదే కారణంతో నేను చదువుకున్న కుమ్మరికుంట తండా బడిని కూడా బంద్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పించి తిరిగి ప్రారంభించాలి. ఆ బడిని అన్ని వసతులతో మళ్లీ తెరిపిస్తే చాలామంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నాం. జిల్లా పాలనాధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలను పునఃప్రారంభించాలి. – బానోత్ శ్రీను, కుమ్మరి కుంట తండా, మహబూబాబాద్ జిల్లా -
ఈ నెలలో వర్షాలు సాధారణమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలలో తీవ్ర లోటువర్షపాతం నమోదు కాగా... జూలైలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వర్షపాతం గణాంకాలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర సగటు గణాంకాలు లోటు దిశగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, 94 శాతం నుంచి 106 శాతం మధ్యలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతేనే రైతాంగానికి లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ చెబుతుండగా.. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలు... రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి పూట తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం... రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా ద్వితీయార్ధం ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా... ప్రస్తుతం అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, రాత్రిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సూచించింది. నైరుతి సీజన్లో ఆగస్టు 1 వరకు 36.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 34.24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
బాబును దత్తత మాత్రమే ఇచ్చాను.. సరోగసీ అని చెప్పలేదు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): సృష్టి ఆస్పత్రి కేసు వ్యవహారంలో కీలకమైన ఏ1 ముద్దాయి డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. పిల్లలు లేరని తన దగ్గరకు వచి్చన మహిళకు తాను కేవలం బాబును దత్తత ఇప్పించానని పోలీసులకు ఇచి్చన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. అది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆమె నోరు విప్పకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు పోలీసులు విచారించేందుకు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ, ఏసీపీతో పాటు గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు వివిధ అంశాల గురించి ఆమెను గుచి్చగుచ్చి ప్రశ్నించినా ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తను ఎలాంటి తప్పూ చేయలేదని, తనకు బిడ్డ కావాలని, తన భర్త విదేశాల్లో ఉంటారని ఓ మహిళ తన దగ్గరకు రాగా దత్తత ఇప్పించానని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అంతకుమించి ఆమె నుంచి ఎటువంటి వివరాలూ పోలీసులు రాబట్టలేకపోయారు. ఆస్పత్రినుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించినా డాక్టర్ నమ్రత తనకు గుర్తు లేదని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా మాత్రమే జరగడంతో చాలా కేసులు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇంకా నాలుగు రోజులపాటు పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. పోలీసు కస్టడీకి మరో ఇద్దరు నిందితులు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. శుక్రవారం వైజాగ్కు చెందిన ఏ3–కల్పన, అమీర్పేట్కు చెందిన ఏ6 సంతోషిలను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శనివారం వారిని పోలీసులు విచారించనున్నారు. బాబును అసలైన తల్లిదండ్రుల నుంచి తీసుకుని వచ్చి రాజస్తాన్కు చెందిన దంపతులకు అందించడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. -
మళ్లీ సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్ 70 దేశాలపై పెంపు
మళ్లీ సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్ 70 దేశాలపై పెంపు -
లో కార్బ్.. హై ఫ్యాట్!
రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హై ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు. – సాక్షి, సాగుబడిపిండి పదార్థాలను ఎక్కువగా తింటే..మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.» ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది» గ్లైకోజెన్.. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.» గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం.» పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హై ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్). ఎల్సిహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. 10 కిలోల బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..» నికర పిండి పదార్థాలు – 20 గ్రా. (పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి)» మాంసకృత్తులు – 70 గ్రా.» ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు ఉండాలి.» ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి.» ప్రతి మనిషికి.. వారివారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.నేనూ వాడి.. లబ్ధి పొందానునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే ఆహారం వాడకం ప్రపం^è వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచింది. నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ నుంచి తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించారో చాలా వీడియోలు కూడా చేశాను. - డా. పి.వి. సత్యనారాయణ, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎస్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ -
ఇండియన్ ఎకానమీ ‘డెడ్ ఎకానమీ’నా?
‘ఇండియన్ ఎకానమీ... డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం, వెనువెంటనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను సమర్థించడం; శశిథరూర్, రాజీవ్ శుక్లా లాంటి కాంగ్రెస్ నేతలే రాహుల్ వ్యాఖ్యల్ని తప్పు పట్టడం... తాజా పరిణామాలు.నిజానికి ఏ ప్రభుత్వం పనితీరును అయినా అంచనా వేయడా నికి కీలక అంశం ద్రవ్యోల్బణం. అది ముఖ్యంగా... పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. యూపీఏ రెండో హయాంలో ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహానికి ఒక కారణం... దేశంలోని ద్రవ్యోల్బణం. ఇది అప్పట్లో గరిష్ఠంగా 12 శాతానికి చేరుకుంది. ఆ తరువాత ప్రతిపక్ష నేతలు... ఆర్థిక మాంద్యాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా మలచుకుని మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలని పదేపదే ప్రయత్నించారు. కానీ... వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది 2019 ఎన్నికల్లో గానీ, 2024 ఎన్నికల్లో గానీ ప్రముఖ ఎన్నికల నినాదంగా మారలేదు. ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించటానికి మన దేశంలో... 2012 వరకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)ని అనుసరించారు. ఆ తర్వాత నుంచి కంజ్యూ మర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ని అనుసరిస్తున్నారు. ఎన్డీయే హయాంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం నుండి 6 శాతానికి మధ్యలో ఉంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు ఇంకా తక్కువగా... 3.1 శాతమే ఉంది. కాబట్టి ఇది ఆల్ టైవ్ు రికార్డ్ అన్నమాట! మోదీకి ముందు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ పాలనా కాలంతో పోల్చినా కూడా ఇది ఎంతో మెరుగైన స్థితి. తక్కువ సమయంలో ద్రవ్యోల్బణం అంతగా నియంత్రణ అయిందంటే, దాని పైన ప్రభుత్వ ప్రభావం ఉందనే కదా! దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి.అంతకుముందు, భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువుల రవాణాలో... పర్మిట్లు, పన్నుల పరంగా ఆలస్యం చోటు చేసుకునేది. జీఎస్టీ రావడంతో పరిస్థితి మారిపోయింది. దీనివల్ల రవాణా వేగంగా జరిగి ఇంధన ఆదా పెరిగింది.క్రూడాయిల్ ధరలలో తగ్గుదల, డిజిటల్ సంస్కరణలు, పాల నలో అవినీతి తగ్గడం... ముఖ్యంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా చెయ్యడం కూడా ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్ప డ్డాయి. ప్రజలకి డబ్బులివ్వడం కంటే... వాళ్లకి పనికొచ్చే నాణ్యమైన ఇళ్ళను ‘పీఎమ్ ఆవాస్ యోజన’ ద్వారా ప్రభుత్వమే కట్టించి ఇవ్వడం, టాయిలెట్లు కట్టించి ఇవ్వడం లాంటి ప్రత్యక్ష ప్రయోజన కార్యక్రమాలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయ పడ్డాయి. కార్పొరేట్ పన్ను తగ్గింపులు, పీఎల్ఐలతో సహా అనేక పథకాలతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సఫలమైంది. ఇవన్నీ పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో వచ్చాయి. వాటి కారణంగానే ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో 4వ స్థానానికి మనం ఎగబాకాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత పరిస్థితులపై ఎవరైనా ఒక అంచనాకు రావాలి.– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి ‘ సామాజిక విశ్లేషకుడు -
ఫిరాయింపుల జాడ్యం ఆగేనా?!
చట్టాలు కాగితాలకూ... ఆదర్శాలు ఉపన్యాసాలకూ పరిమితమవుతూ రాజ్యాంగ విలువలకు గ్రహణం పడుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ఒక విలువైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ను ఆదేశించింది. అదే సమయంలో అటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని తెలియజేసింది. పదో షెడ్యూల్ 6(1) పేరా చెప్తున్నదాని ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నట్టేనని, అందువల్ల రాజ్యాంగ అధికరణలు 226, 227 ప్రకారం హైకోర్టులూ, 136 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టూ స్పీకర్ చర్యల్ని సమీక్షించవచ్చని ధర్మాసనం చెప్పటం విశేషం. ఈ విషయంలో 122, 212 అధికరణల కింద స్పీకర్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండబోదని కూడా తేల్చింది. అసెంబ్లీలు మొదలుకొని పార్లమెంటు వరకూ ఫిరాయింపుల జాడ్యం ఇటీవలి కాలంలో బాగా ముదిరింది. కమ్యూనిస్టులు, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి ఒకటి రెండు పక్షాలూ తప్ప ఈ జాడ్యానికి దూరంగా ఉన్న పార్టీలు అతి స్వల్పం. స్వల్ప మెజారిటీతో గద్దెకెక్కినా, సంఖ్యాబలానికి అంతో ఇంతో తక్కువున్నా ఫిరాయింపుల్ని ప్రోత్సహించటం అలవాటైపోయింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకొచ్చింది. అయితే ఆచరణలో అది ప్రభావవంతంగా లేదని గ్రహించి 2003లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండగా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని పటిష్ఠపరిచారు. చిత్రమేమంటే దేశంలో మూడొంతుల ముప్పాతిక ఫిరాయింపులకు ఈ రెండు పార్టీలే కారణం. అందుకు మణిపుర్ మొదలుకొని కర్ణాటక, మహారాష్ట్రల వరకూ ఎన్నయినా ఉదాహరణలు చూపించొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కేసు తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యే లకు సంబంధించింది. ఆ ఫిరాయింపుల్ని సవాలు చేసిన బీఆర్ఎస్, అధికారంలో ఉండగా తానూ అదే పని చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు తనాన్ని ప్రోత్సహించటంలో ఆరితేరినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణలో తన పార్టీ తరఫున నెగ్గినవారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చా రని ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడిన బాబు... ఒకటి రెండు నెలలయ్యేసరికి ఏపీలో తానూ అదే పని నిస్సిగ్గుగా చేశారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈమధ్య వైఎస్సార్ కాంగ్రె స్కు చెందిన రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కొందరిని లోబర్చుకుని పార్టీకీ, చట్ట సభల సభ్యత్వానికీ రాజీనామా చేయించారు. విలువల గురించి అతిగా మాట్లాడే అలవాటున్న బీజేపీ ఇందుకు తోడ్పడటమేకాక... తానూ లాభపడింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చట్టసభలను కేవలం శాసనాలు చేసే వేదికలుగా మాత్రమే పరిగణించటం సరికాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు, వారి ఆకాంక్షలు ఆ చట్టసభల పనితీరులో ప్రతిఫలించాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. అధికారం వచ్చింది మొదలు ప్రతిపక్షాన్ని బలహీనపరచటం ఎలా, కక్ష తీర్చుకోవటం ఎలా అనే అంశాలే నిత్యకృత్యమైతే అందువల్ల అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ విషయంలో సభాధ్య క్షుల పాత్ర ఎంతో కీలకమైనది. వారు తటస్థంగా, సమర్థంగా వ్యవహరిస్తే చాలావరకూ ఈ జాడ్యం పోతుంది. చట్టసభల ఔన్నత్యం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో వారు పాలకపక్షాలకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో కొచ్చాయి గనుక ఇప్పుడేదీ రహస్యం కాదు. అధ్యక్ష స్థానంలో ఉన్నవారి వ్యవహార శైలి ఎలా ఉంటున్నదో అందరూ ఆ క్షణంలోనే పసిగడుతున్నారు. సభాధ్యక్షులు తలుచుకుంటే ఫిరాయింపుల సమస్య పరిష్కారం పెద్ద కష్టం కాదు. కానీ అది సజావుగా సాగటం లేదు. 2014లో తమ పార్టీ నుంచి ఫిరాయించినవారిపై అటు లోక్సభ లోనూ, ఇటు అసెంబ్లీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే రెండు చోట్లా స్పందన ఒకేలా ఉంది. ఆ చట్టసభల గడువు ముగిసే సమయానికి కూడా స్పీకర్లు నిర్ణయం ప్రకటించలేక పోయారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు కళ్లు మూసుకుని ఉండ గలవా? ఫిరాయింపుదార్లపై చర్య తీసుకునే విషయంలో స్పీకర్లకున్న నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సమీక్షిస్తే మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ ఆ చట్టంలోని లొసుగులతో అందరూ లాభపడుతున్నప్పుడు దీన్ని ఆశించటం అత్యాశేనేమో! -
కష్టం మీది... అధికారం మాది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడా నికి కమ్యూనిస్టు ఉద్యమాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 2004, 2023లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్టులు సహకారం అందించారని తెలిపారు. ఈ అధికారం ఇలాగే కొనసాగడానికి, మరోసారి తాము అధికారంలోకి రావడానికి కూడా కమ్యూనిస్టులు సహ కరించాలని కోరారు. కమ్యూనిస్టులు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడంకంటే, అధికారంలో ఉన్నోడిని దించేయటంలో ముందుంటారని చురకలంటించారు. భవిష్యత్లో కూడా కాంగ్రెస్– కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ‘కృషి మీది.. అధికారం మాది.. సహకారం కొన సాగాలి’అని కమ్యూనిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో పత్రికల పాత్ర, జర్నలిస్టులుగా కొందరు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల్లాగే జర్నలిస్టుల విశ్వసనీయత తగ్గుతోందిప్రస్తుతం సమాజంలో మీడియా సంస్థలు విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది. అక్షరాలు రానివారు కూడా జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారు. ఒకప్పుడు జర్నలిస్టు అంటే నిబద్ధత ఉండేది. ఇప్పుడు ఆవారాగాళ్లు, తిట్లు వచ్చేవాళ్లు జర్నలిస్టు అనే ముసుగు తొడుక్కొని వస్తున్నారు. ప్రెస్మీట్లలో మూడు గంటల ముందే వచ్చి ముందు కూర్చుంటారు. ఇంకా నమస్కారం పెట్టడం లేదేంటని గుడ్లురుమి చూస్తారు. అలాంటి వాళ్లను కిందకు దిగి కొట్టాలనిపిస్తుంది. జర్నలిజంలో ఇవాళ వింత పోకడలు వచ్చాయి. వాటికి రాజకీయ పార్టీలు తోడయ్యాయి. రాజకీయ నాయకుల తరహాలోనే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంది. నిజమైన జర్నలిస్టులను, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని వేరు చేయాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.కమ్యూనిస్టులు ఉప్పులాంటివారు‘కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు.. ఉప్పు లేని వంట రుచి ఉండదుం. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కని పించినప్పుడే ఆ సమస్యల పరిష్కారం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అబద్ధాల ప్రాతిపదికన జరిగే నిర్మాణం కూలిపోతుందని నమ్మే వ్యక్తిని నేను. నిజం చెప్పకపోయినా, అబద్ధం మాత్రం చెప్పను.కమ్యూనిస్టులను నమ్మించి మోసం చేశారు ఇప్పటి వరకు. నాకు కమ్యూనిస్టుల పట్ల అపార గౌరవం ఉంది. ఎంపీగా గెలిచినప్పుడు పార్టీ కార్యాలయాన్ని మల్లు స్వరాజ్యంను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రారంభించాను. ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణ పత్రికకు ఇతర ప్రధాన పత్రికలతో సమానంగా ప్రాధాన్యతనిస్తాం. నవ తెలంగాణలో ప్రజా సమస్యలపై వచ్చే వార్తల పరిష్కారానికి కృషి చేస్తాం’అని సీఎం తెలిపారు. కమ్యూనిస్టుల ఆశయాలను కాంగ్రెస్ సాకారం చేస్తోంది: మంత్రి పొంగులేటికమ్యూనిస్టులు పేదల పక్షాన నిలిచి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తుంటారని, నిత్యం పేదలకు అండగా ఉంటారని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలలో నిజాయితీని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించేందుకు పని చేస్తోందని తెలిపారు. తాము పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని చెప్పారు. గులాబీ రంగు వేసుకున్న కొన్ని పత్రికలు సీఎం రేవంత్రెడ్డితోపాటు అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై అసంబద్ధంగా వార్తలను ప్రచురించినా సానుకూల దృక్పథంతోనే ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. అమెరికాకు భయపడి ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడడానికి భయపడుతున్న మోదీని వెనుకేసు కొచ్చే స్థితిలో దేశంలోని మీడియా ఉందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్. ప్రియాంక, పార్టీ నేతలు బి.వి. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ మౌనం వల్లే లోకేశ్ బరితెగింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉందనే ధైర్యంతో బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బరితెగించి మాట్లాడుతు న్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. హరీశ్రావు శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందునే ఏపీ సీఎం చంద్రబాబు ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ ప్రకటనపై సీఎం రేవంత్, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే చర్చకు వెళ్లబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటిస్తే, సీఎం రేవంత్ మాత్రం భేటీకి హాజరై కమిటీ ఏర్పాటుకు అంగీకరించార ని మండిపడ్డారు.బనకచర్లపై చంద్రబాబు అనుస రిస్తున్న బుల్డోజ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ మౌనమే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనా లను పక్కన పెట్టి చంద్రబాబు, బీజేపీ మెప్పుకోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తు న్నారని ధ్వజమెత్తారు. అధికారం, మందబలాన్ని చూసుకుని బనకచర్లపై లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.నీళ్లు తీసుకుపోతే ఊరుకుంటామా?గోదావరిలో మిగులు జలాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనకచర్లపై ఏపీ పంపిన డీపీఆర్ను ఎందుకు వెనక్కి తిప్పి పంపాయని హరీశ్రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెప్తున్న నారా లోకేశ్.. ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తన తండ్రి చంద్ర బాబు కేంద్రానికి రాసిన 7 లేఖల గురించి తెలుసుకో వాలని హితవు పలికారు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడి గడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి తరలించుకు పోయే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. బనకచర్లను ఏపీ కట్టి తీరితే, తాము అడ్డుకుని తీరుతా మని స్పష్టంచేశారు. ‘గోదావరి నదిలో మా వాటాను అడిగితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నా మని లోకేశ్ అంటున్నారు. గతంలో బాబ్లీ, ఆల్మట్టిపై చంద్ర బాబు చేసిన పోరాటాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టేందుకేనా? సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులను కాపాడుతుంది. అనుమతు లు తెచ్చుకునే పద్ధ తి మీకు తెలిస్తే, ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. బనక చర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకు పోయే కుట్రను చంద్రబాబు బయట పెట్టారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం వెనుక ఈ కుట్ర దాగి ఉంది. లోక్సభలో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా బనకచర్లపై వాయిదా తీర్మాణం ఇచ్చి రాష్ట్ర హక్కు లను కాపాడటం లేదు’అని హరీశ్రావు మండిపడ్డారు. -
పట్టాలెక్కాల్సిన సంస్కరణలెన్నో!
ప్రభుత్వం గత పదేళ్ళుగా పెట్టుబడి వ్యయాన్ని రక్షణతోపాటు మరో రెండు రంగాలపై కేంద్రీకరించింది. ఆ రెండూ రోడ్లు, రైల్వేలు. తిరిగి రైల్వేలలో కూడా వేగంగా వెళ్ళే అధునాతన రైళ్ళను ప్రవేశ పెట్టడం, నూతన మార్గాలను జోడించడం, మెట్రో వ్యవస్థలను అభివృద్ధి చేయడంపైన చాలా వరకు దృష్టి పెట్టారు. రైల్వేలపై ప్రభుత్వ వ్యయం కొనసాగే అవకాశం ఉంది. రైళ్ళ విషయంలో ఆదర్శంగా తీసుకోదగిన ఇతర దేశాలలోని సేవలను మన దేశంలో కూడా అందించే విధంగా సంస్కరణలపై దృష్టి పెట్టడానికి ఇదే అనువైన సమయం. ముఖ్యంగా రెండు విభాగాలు ఈ సందర్భంగా మదిలో మెదు లుతాయి. రైల్వేల పనితీరుకు సంబంధించి నిర్దిష్ట కోణాలలో మొత్తంగా వ్యవస్థలను సంస్కరించవలసి ఉంది. ఇది మొదటగా చేయాల్సిన పని. దీనివల్ల ప్రయాణికులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలందుతాయి. భద్రతా పెరుగుతుంది. రెండు: రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ. ఫలితంగా, రైల్వేలకు కొంత రాబడి దక్కుతుంది. నూతన రాబడి మార్గాలను సృష్టించుకునేందుకు ఉన్న ఆస్తులను వినియోగించుకునే కేటగిరీలోకి ఇది వస్తుంది. తీసుకోవాల్సిన భద్రతా చర్యలుగత ఏడాది నుంచి చోటుచేసుకుంటున్న వివిధ సంఘటనల పాఠాలు భద్రతపైన కూడా దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాయి.అందుకే: 1. సబర్బన్ రైళ్ళ బోగీలకు ఆటోమేటిక్ తలుపులను అమర్చాలి. దీనివల్ల రైళ్ళలో వెళుతున్నప్పుడు ప్రయాణికులు గాయపడే అవకాశాలు తగ్గుతాయి. 2. సుదూరాలకు పయనించే రైళ్ళలో జనరల్ బోగీలు వాటి సామర్థ్యానికి మించి కిటకిటలాడుతూ ఉంటాయి. ఇది ప్రయాణికుల మధ్య సిగపట్లకు, కొండొకచో ప్రమాదాలకు కారణమవుతోంది. అన్ని టికెట్లనూ రిజర్వేషన్ల ప్రాతిపదికనే విక్రయించాలి. 3. పట్టాలు, సిగ్నలింగ్ వంటివాటిలో లోపాల వల్ల సంభవిస్తూ వచ్చిన ప్రమాదాలను నివారించేందుకు భద్రతా పరిక రాలను ప్రథమ శ్రేణికి చెందిన వాటినే వినియోగించాలి. 4. విసర్జించినవి సాఫీగా వెళ్ళిపోయేందుకు వీలుగా మరుగుదొడ్ల వ్యవస్థలను ఆధునీకరించేందుకు బోగీలను పూర్తిగా మార్చాలి లేదా తగిన మార్పులు చేపట్టాలి. 5. విమానాశ్రయాల మాదిరిగానే అన్ని రైల్వే స్టేషన్ల చుట్టూ పూర్తిగా కంచెను ఏర్పాటు చేయాలి. ప్రహరీని దాటి ప్రయాణికులు మాత్రమే లోపలికి ప్రవేశించే వీలుండాలి. 6. చివ రగా, ప్రభుత్వం మూలధన వ్యయంలో కొంత భాగాన్ని ప్లాట్ ఫారాల నిడివిని, ఎత్తును పెంచేందుకు వినియోగించాలి. దీంతో ప్రయాణికులు చాలా బోగీలున్న రైళ్ళను కూడా సురక్షితంగా ఎక్కగలుగుతారు, దిగగలుగుతారు. ఇవన్నీ ప్రాథమిక పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే సూచనలు. బడ్జెట్లో తగు కేటాయింపులతో సులభంగా ఈ సదుపాయాలు కల్పించుకోవచ్చు.చేయాల్సిన కొన్ని సంస్కరణలురైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ మరో పార్శ్వం. విమానాశ్రయాల విషయంలో అనుసరించిన పద్ధతినే వీటికీ వర్తింపజేయవచ్చు. సదు పాయాలు పెంచి యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు. చార్జీలు పెంచినా, అవి ప్రయాణికుల సంఖ్యపై అరుదుగానే ప్రభావం చూపడం మన దేశంలో గమనించవచ్చు. దేశంలోని చాలా ప్రాంతా లను రైల్వేలే అనుసంధానపరుస్తూండటం దానికి కారణం. 1. ప్రయాణికులకు మాత్రమే స్టేషన్ల లోపలికి ప్రవేశం ఉండాలి. టికెట్ కోడ్ చూపిస్తేనే తలుపులు తెరచుకునేటట్లు చేయవచ్చు. విజిటర్ల సంఖ్యను వీలైనంత పరిమితం చేయాలి. ప్రయాణికులలో అన్ని వయసులవారు ఉంటారు కాబట్టి, వారికి తోడుగా వచ్చేవారిని నివారించడం సాధ్యం కాకపోవచ్చు. ప్లాట్ ఫారమ్ టికెట్ ధరను పెంచితే, వీడ్కోలు పలకడానికి వచ్చేవారి సంఖ్య దానంతట అదే తగ్గుతుంది. 2. పోర్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. నిర్ణయించిన ధరలను పోర్టర్లకు తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రవేశపెడితే, ప్రయాణికులు వారి లగేజీని వారే తీసుకెళ్ళగలుగుతారు. 3. స్టేషన్ల వద్ద దోపిడీకి వీలు కల్పిస్తున్న మరో అంశం ట్యాక్సీలు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్తో ్రíపీ–పెయిడ్ సౌకర్యాన్ని అన్ని స్టేషన్ల వద్ద కల్పించాలి. ఫలితంగా, ఎంత వసూలు చేస్తున్నారో తక్షణం తెలిసిపోతుంది. 4. రుచికి, శుచికి పూచీవహించే విధంగా అల్పాహార శాలలను పునర్వ్యవస్థీకరించాలి. దుకాణాల సంఖ్య, ధరల విషయాన్ని స్టేషన్ డెవలపర్కు విడిచి పెట్టవచ్చు. ప్రయాణికులలో అత్యధిక సంఖ్యాకుల ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తినుబండారాల ధరలను తక్కువ స్థాయిలో నిర్ణయించడం సముచితంగా ఉంటుంది. కావాలంటే, ఉన్నత తరగ తుల బోగీల్లో ప్రయాణించేవారికి వేరే దుకాణాలు పెట్టవచ్చు.కనులకు ఇంపుగా, అనుభవానికి పసందుగా ఉండే ఈ ప్రధాన రూపాంతరీకరణకు డబ్బులు ఖర్చయ్యే మాట నిజమే. విమానయాన సంస్థల మాదిరిగానే యూజర్ చార్జీల ద్వారా ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే, ఈ ఏడాది దాదాపు 350 కోట్లమంది సుదూరాలకు వెళ్ళే రైళ్లలో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. వారిలో 300 కోట్ల మంది ద్వితీయ తరగతిలో, 50 కోట్ల మంది అప్పర్ క్లాస్లో ప్రయాణిస్తారని భావిద్దాం. హయ్యర్ క్లాసుల వారి నుంచి సగటున రూ. 200, సెకండ్ క్లాస్ వారి నుంచి రూ. 50 చొప్పున వసూలు చేసినా ఏడాదికి రూ. 25,000 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుంది. ఈ విషయంలో రకరకాల సమీకరణాలు రూపొందించు కోవచ్చు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామి మధ్య వాటిని పంచు కోవచ్చు. ఒకవేళ రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు వేలం వేస్తే వారే ఆ లెక్కలు చూసుకుంటారు. ఈ రెండు ఐడియాలను వచ్చే పదేళ్ళలో దేశవ్యాప్తంగా అమలుపరచే దిశగా కృషి చేయాలి. అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది.మదన్ సబ్నవీస్ వ్యాసకర్త ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’లో చీఫ్ ఎకనామిస్ట్, ‘కార్పొరేట్ క్విర్క్స్: ద డార్కర్ సైడ్ ఆఫ్ ద సన్’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
గత ప్రభుత్వ వైఫల్యంతోనే వైటీపీఎస్ పనుల్లో జాప్యం
మిర్యాలగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) యూనిట్–1లో విద్యుత్ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు లక్ష్మణ్కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. పవర్స్టేషన్లో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ఈ ఏడాది జనవరి 21 సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు. ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మిగతా మూడు యూనిట్లను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి 26 నుంచి పూర్తిగా జాతికి అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రెండేళ్లపాటు పర్యావరణ అనుమతులపై క్లియరెన్స్ తీసుకురాకపోవడంతోనే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకోని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై కేలెండర్ ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పారు. సంవత్సర కాలంలోనే రెండు యూనిట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ ఉత్పాదనతోపాటు వైటీపీఎస్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బందికి క్వార్టర్స్ నిర్మిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు. రహదారులు దెబ్బతినకుండా సీసీ రోడ్డు పనులు మొదలుపెట్టామన్నారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే..తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు కింద నష్టపోయిన కొందరు రైతులకు కూడా వైటీపీఎస్లో ఉద్యోగాలు, పరిహారం అందచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖరరెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిత్తల్, జెన్కో సీఎండీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతవారు వెయిటింగ్.. బయటివారికి పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో జూన్లో భారీ సంఖ్యలో జరిగిన మున్సిపల్ కమిషనర్ల బదిలీలు కొత్త సమస్యను తెరమీదకు తెచ్చాయి. సాధారణ బదిలీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ బదిలీలు, పదోన్నతుల ద్వారా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీల్లో మున్సిపల్ శాఖకు చెందిన కమిషనర్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ‘ఆన్ డ్యూటీ’పై వచ్చిన వారికి కూడా పోస్టింగులు దక్కాయి. మరోవైపు మున్సిపల్ శాఖకు చెందిన 32 మంది కమిషనర్లకు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా ‘వెయిటింగ్’జాబితాలో పెట్టారు. కొన్ని మున్సిపాలిటీల్లో మేనేజర్లుగా ఉన్న వారికే మున్సిపల్ కమిషనర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పదోన్నతులు, ఆన్డ్యూటీపై వచ్చిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత దక్కడంతో సొంత శాఖకు చెందిన కమిషనర్లు పోస్టింగు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వెయిటింగ్లో ఉన్న 32 మంది కమిషనర్లలో 25 మంది స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ వన్ కమిషనర్ హోదాలో ఉన్న వారే కావడం గమనార్హం. వీరిలో కొందరికి ‘100 రోజుల ప్రణాళిక’ఇన్చార్జీలుగా బాధ్యతలు అప్పగించినా నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమకు భవిష్యత్తులో పోస్టింగు వచ్చినా వెయిటింగ్ పీరియడ్కు సంబంధించిన వేతనాలు తిరిగి పొందడంలో ఆర్థిక శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెయిటింగ్ జాబితాలో ఉన్న ఇద్దరు స్పెషల్ గ్రేడ్ కమిషనర్లు పదవీ విరమణ గడువుకు చేరువలో ఉన్నారు. పోస్టింగ్ లేకుండా రిటైర్ అయితే తమకు దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకుండా పోతాయనే ఆందోళనలో వారు ఉన్నారు. బయటి నుంచి వచ్చినవారిదే హవారాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్ 1, 2, 3తో పాటు స్పెష ల్ గ్రేడ్, సెలక్షన్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు. వీరి లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ద్వారా నేరుగా ఎంపికైన వారితోపాటు కొందరు మేనేజర్ల స్థాయి నుంచి, మరికొందరు సెక్రటేరియట్ సర్వీసుల నుంచి పదోన్నతులపై కమిషనర్లుగా వచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖ లకు చెందిన వారు కూడా ‘ఆన్డ్యూటీ’పేరిట తమ పర పతి ఉపయోగించి మున్సిపల్ కమిషనర్లుగా పోస్టింగులు దక్కించుకున్నారు. అయితే, పదోన్నతులు, ఆన్ డ్యూటీలు ఇవ్వడంలో మున్సిపల్ కమిషనర్ల ఖాళీలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సొంత శాఖకు చెందిన వారిని వెయిటింగ్ జాబితాలో చేర్చి, బయటి నుంచి వచ్చినవారికి పోస్టింగులు ఇచ్చారు. పోస్టింగుల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఒత్తిళ్లతో పాటు ఇతర అంశాలు కూడా కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహాలో పోస్టింగులు పొందిన వారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు కీలక మున్సి పాలిటీల్లో తిష్ట వేశారనే విమర్శలు ఉన్నాయి. పదోన్నతులు, ఆన్డ్యూటీ ద్వారా కమిషనర్లుగా పోస్టింగులు పొందిన వారికి పురపాలన, పట్టణాభివృద్ధిపై అనుభవం లేకపోవడం కూడా క్షేత్ర స్థాయిలో పలు సమస్యలకు దారితీస్తోంది. గత నెలలో జరిగిన బదిలీల్లో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు వెయిటింగ్ జాబితాలో ఉన్న కమిషనర్లకు పోస్టింగులు ఇచ్చే ప్రతిపాదనలు ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. -
వాహన విక్రయాలు.. స్లోడౌన్
ముంబై: దేశీయంగా డిమాండ్ స్తబ్దత కొనసాగడంతో జూలైలోనూ వాహన విక్రయాలు నెమ్మదించాయి. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ విక్రయాలు స్వల్పంగా పెరగ్గా.., హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు తగ్గాయి. మహీంద్రాఅండ్మహీంద్రా, కియా ఇండియా విక్రయాల్లో రెండంకెలు, ఒక అంకె వృద్ధి నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూలైలో 1,37,776 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది జూలైలో అమ్ముడైన 1,37,463 వాహనాలతో పోలిస్తే స్వల్పంగా 0.22% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 9,960 నుంచి 6,822 యూనిట్లకు తగ్గాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 10% క్షీణించి 43,973 యూనిట్లకు వచ్చి చేరింది. ‘వాహన పరిశ్రమ గత కొన్ని నెలలుగా డిమాండ్ లేమి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పండుగ సీజన్పై ఆశావహంగా ఉన్నాం. పూర్తి స్థాయి సరఫరా, నూతన ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాం’ అని హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు మహీంద్రా యుటిలిటీ వాహన సేల్స్ 20% వృద్ధి తో 49,871 యూ నిట్లుగా నమోదైంది. -
ENG VS IND 5th Test: ఆటను శాసించిన బౌలర్లు
లండన్: అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసకందాయంగా జరుగుతోంది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్ ఇలా మొదలవగానే అలా 224 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు జోరుగా మొదలైన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ అంతే జోరుగా కుప్పకూలింది. 92 పరుగుల వరకు వికెట్ కోల్పోని ఆతిథ్య జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. కేవలం 23 పరుగుల ఆధిక్యమే లభించగా... అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) వెనుదిరగ్గా... యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 51 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ఆడి అజేయ అర్ధ శతకంతో నిలిచాడు. జైస్వాల్తో ఆకాశ్దీప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జైస్వాల్ ఇచ్చిన రెండు క్యాచ్లు ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేయడం కలిసొచ్చింది. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. 34 బంతుల్లోనే ముగిసె... రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ ఆలౌటైంది. 204/6 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మిగిలిన నాలుగు వికెట్లను తొలి అర గంటలోనే కోల్పోయింది. మూడో ఓవర్లోనే ఓవర్నైట్ స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ను (109 బంతుల్లో 57; 8 ఫోర్లు) టంగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 218 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. ఆ తర్వాత 6 పరుగుల వ్యవధిలోనే అట్కిన్సన్... వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 26; 3 ఫోర్లు), సిరాజ్ (0), ప్రసిధ్ కృష్ణ (0) వికెట్లను పడగొట్టాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 224 వద్ద ముగిసింది. రెండో రోజు భారత్ కేవలం 20 పరుగులే చేయగలిగింది. అట్కిన్సన్కు ఐదు వికెట్లు దక్కాయి. ఓపెనింగ్ జోరులో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా మొదలైంది. క్రాలీ, డకెట్ పేసర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సిరాజ్ మూడో ఓవర్లో క్రాలీ 2 ఫోర్లు కొడితే... ఆకాశ్దీప్ ఓవర్లో డకెట్ మూడు ఫోర్లు బాదాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఇలా ఎవరిని విడిచిపెట్టకుండా యథేచ్చగా ఆడేశారు. బౌండరీలు, సిక్స్లతో వన్డేను తలపించే ‘పవర్ ప్లే’లా సాగిన ఓపెనింగ్ జోరుతో ఇంగ్లండ్ 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. ఈ దూకుడుకు మరుసటి ఓవర్లో డకెట్ (38 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు)ను అవుట్ చేయడం ద్వారా ఆకాశ్దీప్ బ్రేకులేశాడు. 15వ ఓవర్లో ఇంగ్లండ్ వందకు చేరగా, క్రాలీ 42 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 109/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్కు వెళ్లారు. రెండో సెషన్లో బౌలర్ల హవా ఆ తర్వాత కూడా బజ్బాల్ ఆట ఆడిన క్రాలీని ప్రసి«ద్కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఇక్కడి నుంచి బౌలింగ్ ప్రతాపం మొదలైంది. సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్తో విలువైన వికెట్లను పడేశాడు. పోప్ (22; 4 ఫోర్లు), జో రూట్ (29; 6 ఫోర్లు), బెథెల్ (6)లను వరుస విరామాల్లో సిరాజ్ అవుట్ చేయడంతో 196 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 200 దాటాక స్మిత్ (8), ఓవర్టన్ (0)లను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. 215/7 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. టెయిలెండర్ల అండతో 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్రూక్ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఫీల్డింగ్లో భుజానికి గాయమైన వోక్స్ ఈ మ్యాచ్కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.జట్టునుంచి బుమ్రా విడుదలఐదో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ జట్టు నుంచి విడుదల చేసింది. దీని వల్ల అతను ఈ టెస్టు జరిగే సమయంలో టీమ్తో పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో ముందుగా అనుకున్నట్లుగానే 3 టెస్టులే ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో భారత్ ఆసియా కప్ టి20 టోర్నీ ఆడనుంది. బుమ్రా ఇందులో ఆడతాడా లేదా అనే విషయంపై సెలక్టర్లు తర్వాత నిర్ణయం తీసుకుంటారు.స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ రనౌట్ 21; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 57; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 26; ఆకాశ్దీప్ నాటౌట్ 0; సిరాజ్ (బి) అట్కిన్సన్ 0; ప్రసి«ద్కృష్ణ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 0; ఎక్స్ట్రాలు 38; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 224. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153, 7–218, 8–220, 9–224, 10–224. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 21.4–8–33–5, టంగ్ 16–4–57–3, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0. ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: క్రాలీ (సి) జడేజా (బి) ప్రసిధ్ 64, డకెట్ (సి) జురేల్ (బి) ఆకాశ్దీప్ 43; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 22; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 29; బ్రూక్ (బి) సిరాజ్ 53; బెథెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 6; స్మిత్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 8; ఓవర్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 0; అట్కిన్సన్ (సి) ఆకాశ్దీప్ (బి) ప్రసిధ్ 11; టంగ్ నాటౌట్ 0; వోక్స్ అబ్సెంట్ హర్ట్; ఎక్స్ట్రాలు 11; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–92, 2–129, 3–142, 4–175, 5–195, 6–215, 7–215, 8–235, 9–247. బౌలింగ్: సిరాజ్ 16.2–1–86–4, ఆకాశ్దీప్ 17–0–80–1, ప్రసి«ద్కృష్ణ 16–1–62–4, జడేజా 2–0–11–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 51; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్దీప్ బ్యాటింగ్ 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–46, 2–70. బౌలింగ్: అట్కిన్సన్ 6–2–26–1, టంగ్ 7–1–25–1, ఓవర్టన్ 5–1–22–0. -
అశోక్బాబుపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన వైయస్సార్సీపీ
తాడేపల్లి: వైయస్సార్సీపీ దళిత నేత వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం. రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్బాబును దారుణంగా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్బాబు, జూపూడి ప్రభాకర్రావు పేర్కొన్నారు. -
ENG VS IND 5th Test: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఓవల్ టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
జిమ్లో బిగ్బాస్ బ్యూటీ ఇనయా.. స్విమ్మింగ్ పూల్లో రకుల్ ప్రీత్ సింగ్ చిల్!
జిమ్లో చెమట్చోడుస్తున్న ఇనయా సుల్తానా..స్విమ్మింగ్ చేస్తూ చిల్ అవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్..పార్టీలో మెరిసిన విశ్వంభర్ బ్యూటీ మౌనీరాయ్..మహబలిపురంలో బిగ్బాస్ బ్యూటీ దివి..బీచ్లో డాగ్తో ఆడుకుంటోన్న బిగ్బాస్ అశ్విని శ్రీ.. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ENG VS IND 5th Test: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రూట్
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (29) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్లో స్వదేశంలో జరిగిన టెస్ట్ల్లో 7216 పరుగులు చేయగా.. తాజాగా ఇన్నింగ్స్తో రూట్ (7220) సచిన్ రికార్డును అధిగమించాడు.ఈ విభాగంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ (7578) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ సచిన్ను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు..7578 - రికీ పాంటింగ్ - ఆస్ట్రేలియా7220* - జో రూట్ - ఇంగ్లండ్*7216 - సచిన్ టెండూల్కర్ - ఇండియా7167 - మహేల జయవర్ధనే - శ్రీలంక7035 - జాక్వెస్ కల్లిస్ - దక్షిణాఫ్రికామ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది. -
‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు. ‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025 -
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్కే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
దేశీయ మార్కెట్లో 7 సీటర్ కార్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ విభాగంలో కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 15 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 ఉత్తమమైన వాహనాలను గురించి తెలుసుకుందాం..➢రెనాల్ట్ ట్రైబర్: రూ. 6.3 లక్షల నుంచి రూ. 9.17 లక్షలు➢మారుతి ఎర్టిగా: రూ. 9.12 లక్షల నుంచి రూ. 13.41 లక్షలు➢మహీంద్రా బొలెరో: రూ. 9.81 లక్షల నుంచి రూ. 10.93 లక్షలు➢మహీంద్రా బొలెరో నియో: రూ. 9.97 లక్షల నుంచి రూ. 12.18 లక్షలు➢టయోటా రూమియన్: రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు➢కియా కారెన్స్: ప్రారంభ ధర రూ. 11.41 లక్షలు➢కియా క్లావిస్: రూ. 11.50 లక్షల నుంచి రూ. 19.50 లక్షలు➢సిట్రోయెన్ ఎయిర్క్రాస్: రూ. 12.50 లక్షల నుంచి రూ. 14.60 లక్షలు➢మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ప్రారంభ ధర రూ. 13.77 లక్షలు➢మహీంద్రా స్కార్పియో ఎన్: ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు -
నిప్పులు చెరుగుతున్న భారత పేసర్లు.. ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడు
ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడుతొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది.ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో భారత పేసర్లు చెలరేగిపోతున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. సిరాజ్ (12-1-66-3), ప్రసిద్ద్ కృష్ణ (11.5-0-51-3), ఆకాశ్దీప్ (17-0-80-1) పోటీ పడి సత్తా చాటుతుండటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో పతనం అంచుల్లో ఉంది. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 215 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.టీ విరామానికి ముందు ఓవర్లో ప్రసిద్ద్ విజృంభించాడు. ఐదు బంతుల వ్యవధిలో జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్లను పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 9 పరుగులు వెనుకపడి ఉంది. హ్యారీ బ్రూక్ (33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
కెప్టెన్గా ఇషాన్ కిషన్.. జట్టులో వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్
త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు.ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని మొహమ్మద్ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. షమీ తన బెంగాల్ సహచరుడు ముకేశ్ కుమార్, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆకాశ్దీప్తో కలిసి పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు.జట్టులో అసోం సారధి, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఈ జట్టుకు సారధిగా ఎంపికైన ఇషాన్ ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడటంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఇషాన్ను సంప్రదించినప్పటికీ.. అతను కూడా గాయంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో పంత్కు ప్రత్యామ్నాయంగా ఎన్ జగదీశన్ను ఎంపిక చేశారు.దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్, మొహమ్మద్ షమీస్టాండ్బై ప్లేయర్లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్ -
జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్కాల్ సంభాషణ వైరల్
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు
టీమిండియాతో సిరీస్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. భారత జట్టుపై టెస్టుల్లో ఒకే దేశంలో 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా నిలిచాడు. సొంతగడ్డ ఇంగ్లండ్పై ఈ మైలురాయిని చేరుకుని ప్రపంచంలో ఇంత వరకు ఏ ప్లేయర్కూ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియాతో ఓవల్ వేదికగా ఐదో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్ఇందులో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండింట.. పర్యాటక భారత్ ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో సిరీస్ ఫలితం తేలాంటే ఆఖరిదైన ఐదో టెస్టు కీలకంగా మారింది.లండన్లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. కేవలం 37 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు పూర్తి చేసుకుంది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్లు జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) ధనాధన్ దంచికొట్టగా.. వన్డౌన్లో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ (22) మాత్రం నిరాశపరిచాడు. ఇక జో రూట్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. జేకబ్ బెతెల్ (6) కూడా సిరాజ్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఇదిలా ఉంటే.. జో రూట్కు ఇంగ్లండ్లో టీమిండియాపై ఇది 20వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలో ఓవల్ టెస్టు సందర్భంగా అతడు భారత జట్టుపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంతవరకు ఏ బ్యాటర్ కూడా టీమిండియాపై ఈ అరుదైన మైలురాయిని తాకలేదు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ జో రూట్.ఒక దేశంలో టీమిండియాపై అత్యధిక టెస్టు పరుగులు సాధించిన క్రికెటర్లు🏏జో రూట్- ఇంగ్లండ్లో- 2000* రన్స్🏏రిక్కీ పాంటింగ్- ఆస్ట్రేలియాలో- 1893 రన్స్🏏శివ్నరైన్ చందర్పాల్- వెస్టిండీస్లో- 1547 రన్స్🏏జహీర్ అబ్బాస్- పాకిస్తాన్లో- 1427 రన్స్🏏స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియాలో- 1396 రన్స్.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు -
ENG VS IND 5th Test: సిరాజ్ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో ఓలీ పోప్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ 41 టెస్ట్ మ్యాచ్ల్లో 117 వికెట్లు.. 44 వన్డేల్లో 71 వికెట్లు.. 16 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్లో సిరాజ్ ఓలీ పోప్ వికెట్ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీశాడు. జో రూట్, బేకబ్ బేతెల్లను పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఇప్పటివరకు 3 వికెట్లు తీశాడు. సిరాజ్ తీసిన 3 వికెట్లు ఎల్బీడబ్ల్యూలే కావడం విశేషం.సిరాజ్ చెలరేగడంతో టీమిండియా మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. సిరాజ్తో పాటు ఆకాశ్దీప్, ప్రసిద్ద్ కృష్ణ (తలో వికెట్) కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 195 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43), ఓలీ పోప్ (22), జో రూట్ (29), జేకబ్ బేతెల్ (6) ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (22), జేమీ స్మిత్ (5) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి ఎంపికైంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి హనుమాన్ రెండు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డ్ సాధించింది.ఆ తర్వాత వేణు యెల్దండి తెరకెక్కించిన రూరల్ ఎమోషనల్ చిత్రం బలగం ఉత్తమ సాహిత్యం విభాగంలో అవార్డ్ దక్కించుకుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలోని ఊరు పల్లెటూరు అనే పాటకు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది.సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రం బేబీకి రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్ప్లేతో దర్శకుడు సాయి రాజేశ్ను జాతీయ అవార్డు వరించింది. ఈ సినిమాలోని ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్కు ఉత్తమ సింగర్ అవార్డ్ దక్కింది. అలాగే సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపికైంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులుఉత్తమ తెలుగు చిత్రం- భగవంత్ కేసరి(అనిల్ రావిపూడి)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ- హనుమాన్ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్- హనుమాన్ఉత్తమ స్క్రీన్ప్లే- బేబీ(సాయి రాజేశ్)ఉత్తమ గాయకుడు- బేబీ (పీవీఎన్ఎస్ రోహిత్ )ఉత్తమ సాహిత్యం- కాసర్ల శ్యామ్ (బలగం)ఉత్తమ బాలనటి- సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు) -
హెబ్బా పటేల్ థాంక్యూ డియర్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.థాంక్యూ డియర్ కథేంటంటే..సత్య(ధనుష్ రఘుముద్రి) సినిమా డైరెక్టర్ కావాలని కష్టపడుతుంటాడు. జాను (రేఖా నిరోషా) హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. ఓ కారణంగా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియ(హెబ్బా పటేల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ హత్యలతో ఈ జంటకి ఉన్న సంబంధం ఏంటన్నదే? అసలు మిగతా కథ.ఎలా ఉందంటే..ప్రస్తుత సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు ఈ మూవీలో చూపించారు. అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని చూపించే ప్రయత్నమే థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కథనం ఆకట్టుకుంది. బీజీఎం ఫర్వాలేదనిపించినా పాటలు సినిమాకు ప్లస్గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్గా డైరెక్టర్ తాను అనుకున్న సందేశమిచ్చాడు.ఎవరెలా చేశారంటే..హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్.. ఎందుకంత సీరియస్?.. వీడియో
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root)కు కోపమొచ్చింది. టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు అంపైర్కు ఫిర్యాదు చేశాడు. భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు ఓవల్లో గురువారం మొదలైంది.టీమిండియా నామమాత్రపు స్కోరుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియాను మొదటి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగి గిల్ సేన నామమాత్రపు స్కోరుకు పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్ను ఆలౌట్ చేసిన తర్వాత.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.శుభారంభం అందించిన ఓపెనర్లుఓపెనర్లలో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ (57 బంతుల్లో 64)తో అదరగొట్టగా.. బెన్ డకెట్ (38 బంతుల్లో 43) కూడా రాణించాడు. బజ్బాల్ ఆటతో చెలరేగిన ఓపెనర్లలో డకెట్ను ఆకాశ్ దీప్ పెవిలియన్కు పంపగా.. క్రాలీని ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కెప్టెన్ ఓలీ పోప్ (22)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 142 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 22వ ఓవర్ను ప్రసిద్ కృష్ణ వేశాడు. అతడి బౌలింగ్లో క్రాలీ.. రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జో రూట్ అతడి స్థానంలో రాగా.. ప్రసిద్ అద్భుతమైన బౌలింగ్తో అతడిని తిప్పలు పెట్టాడు.ఆఖరి బంతికి ఫోర్ బాదిన రూట్ఆ ఓవర్లో తర్వాతి ఐదు బంతుల్లో (మూడోది నోబాల్) రూట్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. అయితే, ఆఖరి బాల్ను ప్రసిద్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా సంధించగా.. రూట్ దానిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ప్రసిద్ కృష్ణపై మండిపడ్డ రూట్ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ ఏదో అనగా.. రూట్ ఎన్నడూ లేని విధంగా సీరియస్ అయ్యాడు. ప్రసిద్తో వాగ్వాదం చేస్తూనే అంపైర్కు కూడా ఫిర్యాదు చేశాడు. అందుకు ప్రసిద్ కూడా గట్టిగానే బదులిచ్చినట్లు కనిపించింది. ఇంతలో అంపైర్ వచ్చి భారత పేసర్ను వివరణ అడిగినట్లు కనిపించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ప్రసిద్కు మద్దతుగా నిలబడి.. అంపైర్తో వాదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి రూట్ ఇలా మైదానంలో సీరియస్ అవ్వడం అరుదు.కానీ ఈసారి మాత్రం అతడు తీవ్రస్థాయిలో ప్రసిద్పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఆకాశ్ దీప్.. బెన్ డకెట్ సాగనంపే క్రమంలో భుజంపై చెయ్యి వేసి మరీ సెండాఫ్ ఇచ్చిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 33 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 33వ ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ బౌలింగ్లో రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బ్రూక్ 8 పరుగులతో ఉండగా.. జేకబ్ బెతెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. పక్కకు లాక్కెళ్లిన రాహుల్.. వీడియోVerbal spat between Prasidh krishna and joe root.#INDvsENGTest pic.twitter.com/6cbJCa7IVd— U' (@toxifyy18) August 1, 2025 -
పేరుకుపోతున్న ఘన, బయో, నిర్మాణ, ఈ–వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్తోపాటు ఘన, బయో, నిర్మాణ, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగవుతున్నాయి. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. మానవాళితోపాటు సకల జీవరాశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఏటేటా పరిశ్రమల నుంచి వ్యర్థాల విడుదల గణనీయంగా ఉందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, శుద్ధి చేయాల్సిన పీసీబీకి ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం గమనార్హం. 2014–15 సంవత్సరం నుంచి ప్రభుత్వం పీసీబీకి నిధులు, గ్రాంట్లను కేటాయించడం లేదు. కేవలం ఆపరేషన్, రెన్యూవల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి.పరిశ్రమల నుంచి కలుషిత జలాలు.. రాష్ట్రంలో పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్ కేటగిరీ అత్యంత హానికారక పరిశ్రమల కిందికి వస్తుంది. రాష్ట్రంలో 3,838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4,330 ఆరెంజ్, 1,332 గ్రీన్, 2,692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 2,193 పరిశ్రమలు రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయి. ఈ వ్యర్థాలు నీరు చెరువులు, కాలువలు, పంట పొలాలు, భూగర్భంలోకి ఇంకుతున్నాయి. 3,024 పరిశ్రమలు ఏటా 3.17 లక్షల టన్నుల ప్రమాదక వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో 94,131 టన్నులు పునర్వినియోగించదగిన వ్యర్థాలు కాగా.. 2,085 టన్నులు దహనం చేయగల వ్యర్థాలు, 1,10,930 టన్నులు కో–ప్రాసెసింగ్, 1,09,943 టన్నులు భూమిలో నింపే వ్యర్థాలు.ఘన వ్యర్థాలూ ఘనమే.. రోజుకు 11,522 టన్నుల ఘన వ్యర్థాలు (Solid Waste) విడుదలవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 7,206 టన్నులు కాగా.. 4,316 టన్నులు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి శుద్ధి చేయని బయో మెడికల్ వ్యర్థాలు విడుదల కావడం లేదు. ఇతర వ్యర్థాల మిశ్రమంతో బయో వేస్ట్ విడుదల అవుతున్నాయి. 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి రోజుకు 26,316 కిలోల బయో మెడికల్ వేస్ట్ విడుదల అవుతోంది. ఇందులో 17,184 కిలోలు దహించలేని బయో మెడికల్ వేస్ట్ కాగా.. 9,132 కిలోలు ఆటో క్లేవ్ వ్యర్థాలు.ఈ–వేస్ట్.. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యర్థాలు కూడా గణనీయంగా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 74,339 టన్నుల ఈ–వేస్ట్ విడుదలవుతోంది. 31 ఈ–వేస్ట్ (e- waste) కేంద్రాల్లో ఏటా 1,83,668 టన్నుల ఈ–వేస్ట్ శుద్ధి అవుతోంది. రాష్ట్రంలో రోజుకు 2,255 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,763 టన్నులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో 492 టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.చదవండి: డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు జీడిమెట్ల, ఫతుల్గూడ, శామీర్పేట, శంషాబాద్లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఏటా వీటి సామర్థ్యం 2 వేల టన్నులు. రాష్ట్రంలో 251 ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు నమోదయ్యాయి. వీటి నుంచి రోజుకు 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల అవుతుండగా.. 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతోంది. -
‘దేశం నుంచి పారిపోకుండా’.. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం (ఆగస్ట్1న) సర్క్యులర్ జారీ చేసింది.లుకౌట్ నోటీసులు కంటే ముందు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవులు సహా అన్ని ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లకు దీనిని పంపిస్తుంది. దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అలాంటి నోటీసులు జారీ చేయబడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఈడీ అధికారులు అప్రమత్తం చేస్తారు. రూ.3,000 కోట్ల రుణాలను 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. ఎస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది. -
జులైలో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎస్టీ (GST) వసూళ్లు జూలై 2025లో రూ. 1,95,735 కోట్లు. ఇది జూలై 2024తో (రూ.1,82,075 కోట్లు) పోలిస్తే 7.5% పెరుగుదలను సూచిస్తుంది. వరుసగా ఏడవ నెల రూ.1.8 లక్షల కోట్లకు పైన జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.ఏప్రిల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి, కానీ మే నెలలో రూ.2.01 లక్షల కోట్లకు తగ్గాయి. జూలైలో నికర దేశీయ ఆదాయం 0.2 శాతం తగ్గింది, నికర మొత్తం వసూళ్లు కేవలం 1.7 శాతం పెరిగి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ట్రంప్ భారతదేశంపై విధించిన అధిక సుంకాలు.. వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల కారణంగా వృద్ధి 0.3 శాతం పాయింట్ల తగ్గుదలను కలిగి ఉంటుందని ఆగస్టు 1న ఆర్థికవేత్తలు గుర్తించారు. భారతదేశానికి కేటాయించిన 25 శాతం సుంకాలు చాలా ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
చెలరేగిపోయిన మ్యాట్ హెన్రీ.. పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు పసికూన జింబాబ్వేపై తమ ప్రతాపాన్ని చూపించింది. బులవాయో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాట్ హెన్రీ (15.3-3-39-6), నాథన్ స్మిత్ (14-8-20-3) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) రాణించడంతో 307 పరుగులు చేసింది. బ్లెస్సింగ్ ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు.158 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఈ ఇన్నింగ్స్లో కూడా చేతులెత్తేసింది. మిచెల్ సాంట్నర్ (17.1-6-27-4), మ్యాట్ హెన్రీ (21-5-51-3), విలియమ్ ఓరూర్కీ (10-4-28-3) ధాటికి 165 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన సీన్ విలియమ్స్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం 8 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 2.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 7 నుంచి ప్రారంభం కానుంది. -
సమంత చేతికి స్పెషల్ రింగ్.. గుడ్ న్యూస్ చెప్పనుందా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఇద్దరు కలిసి డిన్నర్ తర్వాత ఓకే కారులో వెళ్లడంతో ఈ జంట డేటింగ్పై మరోసారి మొదలైంది. కొద్ది రోజుల క్రితమే లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రెస్టారెంట్లో చిల్ అవుతూ కనిపించింది. ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్ సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్ హాట్ టాపిక్గా మారింది. మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందా అనే చర్చ మొదలైంది. కాగా.. సమంత.. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో నటించారు. రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్- 2, సిటాడెల్: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఇండియన్ సూపర్ హీరోలకు సింగపూర్ అధ్యక్షుడు ఆహ్వానం
సింగపూర్: సూపర్ హీరోలు అంటే ఎవరు?.. ప్రత్యేక సూట్లు వేసుకుని అతీత శక్తులతో అద్భుతమైన పనులు చేసినంత మాత్రానా అయిపోతారా?.. అలాంటివేం లేకపోయినా ఆపదలో ఒక నిండు ప్రాణం కాపాడిన సరిపోతుందని నిరూపించారు ఇక్కడ కొందరు. సింగపూర్ గడ్డపై జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓ ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడుతుంది. వాస్తవానికి ఆ ప్రదేశం అండర్ గ్రౌండ్లో నీటి పైప్ లైన్ పగిలి ప్రమాదకరంగా మారింది. అందుకే ఓ కార్మికుడు వాహనాల రాకపోకల్ని పర్యవేక్షిస్తున్నాడు. అయినప్పటికీ ఓ కారు ప్రమాదానికి గురైంది. అదిగో అప్పుడే సింగపూర్లోని భారతీయ వలస కార్మికులు సూపర్ హీరోలుగా రంగలోకి దిగారు. నిమిషాల్లో ప్రమాదానికి గురైన కారును.. అందులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాల్ని కాపాడారు. ఆ దేశ అధ్యక్షుడితో శభాష్ అనిపించుకున్నారు. జూలై 26న సింగపూర్లోని తంజోంగ్ కాటాంగ్ రోడ్ వద్ద రోడ్డు వ్యవస్థల సమన్వయం కోసం 16 మీటర్ల లోతైన షాఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో.. ఒక కాంక్రీట్ భాగం కూలిపోయింది. ఫలితంగా వాటర్ పైప్లైన్ పగిలి 3 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు అందులో పడిపోయింది. అందులో ఉన్న మహిళ ప్రమాదంలో చిక్కుకుంది.ప్రమాదంతో అప్రమత్తమైన ఏడుగురు భారతీయ వలస కార్మికులు పిచ్చై ఉదయప్పన్ సుబ్బయ్య (సూపర్వైజర్),వెల్మురుగన్ ముత్తుస్వామి పూమాలై సరవణన్, గణేశన్ వీరసేకర్,బోస్ అజిత్కుమార్,నారాయణస్వామి మాయకృష్ణన్, సతపిల్లై రాజేంద్రన్లు నైలాన్ తాడు ఉపయోగించి మహిళను 3-5 నిమిషాల్లో సురక్షితంగా బయటకు లాగారు. అనంతరం,అచేతనంగా ఉన్న బాధితురాల్ని స్థానికంగా ఉన్న రాఫెల్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఏ మాత్రం సంకోచించకుండా మహిళ ప్రాణాల్ని కాపాడిన వలస కార్మికులకపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఈ సూపర్ హీరోలను ఆగస్టు 3న ఇస్తానా అధ్యక్షుడి భవనంలో భేటీ కానున్నారు. వారికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, మినిస్ట్రీ ఆఫ్ మాన్పవర్ ఏసీఐ అనే కాయిన్ను బహుకరించింది. ItsRainingRaincoats అనే చారిటీ ఎస్జీడీ 72,241 (సింగపూర్ డాలర్స్) (భారత కరెన్సీలోరూ.44 లక్షలకుపైగా) విరాళాలు సేకరించింది. వారి కుటుంబాలకు అందించనుంది. ఈ సంఘటన వలస కార్మికుల హక్కులపై చర్చకు దారితీసింది. వారు ఎదుర్కొంటున్న తక్కువ జీతాలు, అనారోగ్య నివాసాలు, పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ALERT: 🚨 Car falls directly into sinkhole while attempting to drive though construction area in Tanjong Katong, Singaporepic.twitter.com/JDM1pK6aWW— E X X ➠A L E R T S (@ExxAlerts) July 27, 2025 -
వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురు!
నాగ్పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
ENG VS IND 5th Test: రికార్డు తిరగరాసిన టీమిండియా
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా ఓ రికార్డును తిరగరాసింది. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగుల విభాగంలో భారత్ తమ పూర్వపు రికార్డును బద్దలు కొట్టింది. 1978-79 వెస్టిండీస్ సిరీస్లో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడి 3270 పరుగులు చేసింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్కు ముందు ఓ సిరీస్లో భారత జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే.ప్రస్తుత సిరీస్తో టీమిండియా తమ పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఇంగ్లండ్ సిరీస్లో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పాత రికార్డును చెరిపేసింది. తొలి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ స్కోర్తో ఈ సిరీస్లో భారత్ పరుగుల సంఖ్య 3393 పరుగులకు చేరింది.ఈ సిరీస్ మొత్తంలో భారత్ చేసిన ఈ పరుగులు 1995 నుంచి ఓ సిరీస్లో ఓ జట్టుచే చేయబడిన అత్యధిక పరుగులు కూడా కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. 204/6 స్కోర్ వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్ను టంగ్ బోల్తా కొట్టించాడు.ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43) ఔట్ కాగా.. ఓలీ పోప్ (18), జో రూట్ (4) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్
కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి.. -
రజినీకాంత్ కూలీ అప్డేట్.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.తాజాగా కూలీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రజినీకాంత్ పోస్టర్ను షేర్ చేస్తూ సెన్సార్ తమకు ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K— Sun Pictures (@sunpictures) August 1, 2025 -
ఆకాశ్ దీప్ ఆన్ ఫైర్.. పక్కకు లాక్కెళ్లిన కేఎల్ రాహుల్.. వీడియో
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ (Ben Duckett) బజ్బాల్ ఆటతో భారత బౌలర్లకు స్వాగతం పలికారు. టీ20 ఫార్మాట్ తరహాలో ర్యాంప్, స్కూప్ షాట్లతో చెలరేగిపోయారు. వీరిద్దరి జోరును నిలువరించేందుకు టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.ఈ క్రమంలో డకెట్ అత్యుత్సాహం ప్రదర్శించగా.. ఆకాశ్ దీప్ (Akash Deep) అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో బౌలింగ్కు దిగిన ఆకాశ్ దీప్.. ఐదో బంతిని ఫుల్ డెలివరీగా సంధించాడు. అయితే, బంతిని అంచనా వేయడంలో పొరపడ్డ డకెట్.. రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) చేతుల్లో పడింది. దీంతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో డకెట్.. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై వెనుదిరగాల్సి వచ్చింది.డకెట్ భుజంపై చెయ్యి వేసిన ఆకాశ్ దీప్.. ఇక డకెట్ అవుట్ కాగానే.. ‘సాధించాను’ అన్నట్లుగా ఆకాశ్ దీప్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం క్రీజును వీడుతున్న డకెట్ భుజంపై చెయ్యి వేసి.. అతడితో ఏదో అన్నాడు. పక్కకు లాక్కెళ్లిన రాహుల్ఇందుకు సదరు బ్యాటర్ కూడా సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. ఇంతలో కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్ను అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు ఓవల్ మైదానంలో మొదలైంది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 224 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ధనాధన్అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టాననికి 109 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్కు వెళ్లేప్పటికి ఓపెనర్ జాక్ క్రాలీ 52, వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఓలీ పోప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలీతో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డకెట్.. 38 బంతుల్లో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు.ఇక ఐదు టెస్టుల సిరీస్లో లీడ్స్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఎడ్జ్బాస్టన్లో భారత్ గెలిచింది. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించగా.. మాంచెస్టర్ టెస్టు డ్రా అయింది. ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి. లేదంటే.. ఇంగ్లండ్కు సిరీస్ సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్AKASHDEEP REACTION AFTER GETTING BEN DUCKETT. 🤣#akashdeep #benduckett #INDvsENG pic.twitter.com/mZQ8SRNc91— Ritika Singh (@Ritikasinggh) August 1, 2025 -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
National Film Awards: హనుమాన్కు జాతీయ అవార్డు.. ఉత్తమ చిత్రంగా..!
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (71st National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం వరించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. సుకుమార్ కూతురికి పురస్కారంమిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. గాంధీ తాత చెట్టు చిత్రానికిగానూ సుకుమార్ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ విభాగంలో సామ్ బహదూర్ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి ఈ విజేతలను ఎంపిక చేసింది.71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితా..(ఫీచర్ ఫిలిం కేటగిరిలో..)ఉత్తమ సహాయ నటుడువిజయరాఘవన్ - పోక్కాలమ్ మలయాళ చిత్రంముధుపెట్టయి సోము భాస్కర్ - పార్కింగ్ తమిళ చిత్రంఉత్తమ సహాయ నటిఊర్వశి - ఉళ్లోళుక్కు మలయాళ చిత్రంజంకీ బోడివాల - వశ్ గుజరాతీ చిత్రంబెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్సుకృతి వేణి బండ్రెడ్డి - గాంధీ తాత చెట్టుకబీర్ ఖాండరి - జిప్సీ మరాఠి మూవీత్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ - నాల్ 2 మరాఠీ మూవీఉత్తమ దర్శకుడుసుదీప్తో సేన్ -ద కేరళ స్టోరీఉత్తమ డెబ్యూ దర్శకుడుఆశిశ్ బెండె- ఆత్మపాంప్లెట్బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్పీవీఎన్ ఎస్ రోహిత్ - (ప్రేమిస్తున్నా.. బేబీ మూవీ)బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్శిల్పరావు (చెలియా.. జవాన్ మూవీ)బెస్ట్ సినిమాటోగ్రఫీప్రసంతను మొహపాత్ర - ద కేరళ స్టోరీబెస్ట్ లిరిక్స్ఊరు, పల్లెటూరు సాంగ్.. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ (బలగం)బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)నందు, పృథ్వి (హనుమాన్)బెస్ట్ స్క్రీన్ప్లేఉత్తమ స్క్రీన్ప్లే రచయితసాయిరాజేశ్ నీలం (బేబీ)రాంకుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్)డైలాగ్ రచయితదీపక్ కింగక్రాని (సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై)ఉత్తమ చిల్డ్రన్స్ ఫిలిం: నాల్ 2 (మరాఠి మూవీ)బెస్ట్ కొరియోగ్రఫీ: దిండోరా బాజ్ రె పాట.. కొరియోగ్రాఫర్: వైభవి మర్చంట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్ (సాంగ్స్) - (వాతి), హర్షవర్ధన్ రామేశ్వర్ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)- (యానిమల్)బెస్ట్ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్)బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సచిన్ లోవలేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: మోహన్దాస్ (2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో)బెస్ట్ ఎడిటింగ్: మిధున్ మురళి (పొక్కలాం- మలయాళ చిత్రం)బెస్ట్ సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరణ్- హరిహరణ్ మురళీధరన్ (యానిమల్)బెస్ట్ పాపులర్ ఫిలిం (హోల్సమ్ ఎంటర్టైన్మెంట్) - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానిఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్ఉత్తమ పంజాబీ చిత్రం - గొడ్డే గొడ్డే చాఉత్తమ మరాఠి చిత్రం - శ్యాంచీ ఆయ్ఉత్తమ మలయాళ చిత్రం - ఉల్లొళుఉత్తమ కన్నడ చిత్రం - కందిలుఉత్తమ హిందీ చిత్రం: కాథల్ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్ఉత్తమ ఒడియా చిత్రం- పుష్కరఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్ఉత్తమ అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982స్పెషల్ మెన్షన్యానిమల్ (రీరికార్డింగ్ మిక్సర్) - ఎమ్ఆర్ రాజకృష్ణన్నాన్ ఫీచర్ ఫిలిం విజేతల జాబితాబెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ) బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)బెస్ట్ స్క్రిప్ట్: సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) - కథారచయిత- చిదానంద నాయక్బెస్ట్ వాయిస్ ఓవర్: ద సేక్రడ్ జాక్: ఎక్స్ప్లోరింగ్ ద ట్రీ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్) - (వాయిస్ ఓవర్: హరికృష్ణన్ ఎస్)బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిలిం -హిందీ)బెస్ట్ ఎడిటింగ్: నీలాద్రి రాయ్ (మూవింగ్ ఫోకస్)బెస్ట్ సౌండ్ డిజైన్: శుభరుణ్ సేన్గుప్తా (దుండగిరి కె పూల్)బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ చిత్రం) - శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్బెస్ట్ ఫిలిం క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామీస్)బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)ఉత్తమ షార్ట్ ఫిలిం: గిద్ ద స్కావెంజర్బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం (సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్): ద సైలెంట్ ఎపిడమిక్ (హిందీ)బెస్ట్ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యుమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిలిం: టైమ్లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్ రికన్స్ట్రక్షన్ ఫిలిం: మా బో, మా గాన్ (ఒడియా చిత్రం), లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ద ఈస్టర్న్ హారిజన్ (ఇంగ్లీష్ చిత్రం)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శిల్పిక బోర్డొలాయ్ (మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ- మిజోరాం చిత్రం)స్పెషల్ మెన్షన్1. నేకల్: క్రోనికల్ ఆఫ్ ద పాడీ మ్యాన్ (మలయాళం)2. ద సీ అండ్ సెవన్ విలేజెస్ (ఒడియా)చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
అన్నదాతలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి,విజయవాడ: అన్నదాతలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. అన్నదాత సుఖీభవం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రేపు(శనివారం, ఆగస్టు 2) పథకం అమలులో భాగంగా రూ.40 వేలకు గాను రూ.5 వేలు మాత్రమే ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో గత ఏడాది ఖరీఫ్, రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టింది. రూ.7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కోత విధించింది.వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చగా.. చంద్రబాబు మాత్రం 46.85 లక్షలకు లబ్ధిదారులను తగ్గించేశారు. గత ఏడాది పూర్తిగా రూ.20 వేలు ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కేవలం 5 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు సిద్ధమైంది. రూ. 20 వేలు ప్రతీ రైతు కుటుంబానికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో రూ.20 వేలు ఇస్తామని మెలికపెట్టారు. ఇలా గత ఏడాది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10,800 కోట్లు ఎగ్గొట్టింది. ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేయనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. పేరు మార్చి అన్నదాత సుఖీభవ అంటూ 14 నెలలుగా పథకాన్ని అమలు చేయకుండా రైతుల పొట్టకొడుతూ వచ్చారు. ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కావడంతో ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల మాత్రమే రైతుల ఖాతాలో జమ చేయనుండడంతో కూటమి ప్రభుత్వంపై రైతన్నలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్లు బెక్ డకెట్ (Ben Duckett), జాక్ క్రాలీ సరికొత్త చరిత్ర లిఖించారు. భారత జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీగా రికార్డులకెక్కారు. అదే విధంగా.. టీమిండియాపై టెస్టుల్లో అత్యధికసార్లు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఓవల్ మైదానంలో గురువారం ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ కీలక మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. 224 పరుగులకు ఆలౌట్ అయింది.224 పరుగులకు టీమిండియా ఆలౌట్వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38), ఐదో స్థానంలో ఆడిన కరుణ్ నాయర్ (57) తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ఐదు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్కు ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ శుభారంభం అందించారు. డకెట్ 29, క్రాలీ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. టీమిండియాపై 936 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆండ్రూ స్ట్రాస్- అలిస్టర్ కుక్ జోడీని వీరు అధిగమించారు.కుక్- స్ట్రాస్లను అధిగమించి..కాగా డకెట్- క్రాలీ జోడీ టీమిండియాపై ఇప్పటికి ఓవరాల్గా 936 పరుగులు పూర్తి చేసుకోగా.. కుక్- స్ట్రాస్ కలిసి 20 ఇన్నింగ్స్లో 932 పరుగులు సాధించారు. అదే విధంగా.. అత్యధికంగా ఎనిమిదిసార్లు డకెట్- క్రాలీ 50 ప్లస్ పార్ట్నర్షిప్స్ నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. డకెట్ అర్ధ శతకానికి చేరువైన వేళ టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ అద్బుత డెలివరీతో అతడిని పెవిలియన్కు పంపాడు. 38 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేసిన డకెట్.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. భోజన విరామ సమయానికి 16 ఓవర్ల ఆట ముగిసేసరికి క్రాలీ అర్ధ శతకం (52) పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ 12 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 109/1 (16). కాగా డకెట్-క్రాలీ కలిసి తొలి వికెట్కు 92 పరుగులు జోడించారు.చదవండి: కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్ -
‘ మేం నిరూపిస్తే.. మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’
విశాఖ: తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంత రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ‘జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారు. జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా?, జగన్ కాలు గోటికి అనితా సరిపోదు. సంస్కారహీనురాలు, మానసిక రోగి అనిత. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3 వేల మంది పోలీసులను పెట్టారు. రోడ్లు మీద గుంతలు తవ్వి, ఇనుప కంచెలు పెట్టారు. అయినా జనాలను రాకుండా అడ్డుకోలేక పోయారు.అనితా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అనితా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అసమర్థ హోమ్ మంత్రి అనిత అని పవన్ కళ్యాణ్ చెప్పారు’ అని వరుదు కళ్యాణి కౌంటరిచ్చారు. -
గర్భంతో ఉండగా అలా ఎలా చేశావ్?: లావణ్య త్రిపాఠి సోదరి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతోంది. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్డే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కి కాస్త గ్యాప్ తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఓకే చెప్పిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. గతేడాది డిసెంబర్లో లావణ్య ఈ సినిమాలో భాగమైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. మే నెలలో చిత్రీకరణ వేగవంతం చేశారు. మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా కానిచ్చేశారు. గర్వంగా ఉందిమొత్తానికీ సినిమాను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల క్రితమే సతీలీలావతి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా వరకు సినిమా షూటింగ్లో పాల్గొందట లావణ్య. ఈ విషయాన్ని లావణ్య అక్క శివాని త్రిపాఠి వెల్లడించింది. సతీలీలావతి టీజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లావణ్య, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ ట్రిమిస్టర్ (ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు) మొత్తం పని చేస్తూనే ఉన్నావు, అలా ఎలా చేయగలిగావు? ప్రతిసారిలాగే ఈసారి కూడా టాలెంట్తో చంపేశావు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు లావణ్య థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.ప్రేమ పెళ్లివరుణ్ తేజ్, లావణ్య 'మిస్టర్' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వివాహం జరగ్గా, హైదరాబాద్ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో.. లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లు చేసింది. చదవండి: ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే? -
సరికొత్త బీఎస్ఏ బైకులు ఇవే - వివరాలు
బ్రిటిష్ బ్రాండ్ 'బీఎస్ఏ మోటార్సైకిల్స్' తన సరికొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650, బీఎస్ఏ బాంటమ్ 350 లను ఆవిష్కరించింది. 1861 నాటి వారసత్వం కనిపించేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది.బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650కొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 క్లాసిక్ 652సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ద్వారా 45 పీఎస్ పవర్, 55 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 41mm టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్తో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇందులో ఉన్నాయి.థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ యెల్లో అనే మూడు రంగులలో లభించే ఈ బైక్.. డ్యూయల్ ఛానల్ ABSతో బ్రెంబో బ్రేక్లు, గ్రిప్పీ పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్టీఆర్ టైర్లు, వైర్ స్పోక్ అల్లాయ్ రిమ్ వంటివి పొందుతుంది. 12 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 218 కేజీలు.బీఎస్ఏ బాంటమ్ 350బీఎస్ఏ బాంటమ్ 350 నిజమైన క్లాసిక్కు నిదర్శనం.ఇది 334 సీసీ లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్ కలిగి 6-స్పీడ్ గేర్బాక్స్తో 7750 rpm వద్ద 29PS పవర్ 6000rpm వద్ద 29.62Nm టార్క్ అందిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.రౌండ్ హెడ్లైట్, టియర్డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వంపుతిరిగిన రియర్ ఫెండర్ కలిగిన ఈ బైక్ అవలోన్ గ్రే, ఆక్స్ఫర్డ్ బ్లూ, ఫైర్క్రాకర్ రెడ్, బారెల్ బ్లాక్, విక్టర్ యెల్లో వంటి రంగులలో లభిస్తుంది. -
‘జగన్ని ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.సింగపూర్కు వెళ్లి ఏమి సాధించారు?ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఏం చేసినా జగన్ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు. -
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్నెస్ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె. ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్నెస్ పట్ల ఫోకస్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం. ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..హర్యానాలో సోనిపట్లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్గా మారింది. చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది. అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!) -
సుద్దమొద్దు టీచర్ అవసరమా?
మీ పిల్లల మార్కుల సంగతి సరే.. కానీ, వాళ్లు ఎలా చదువుతున్నారో ఎప్పుడైనా గమనిస్తున్నారా?. పోనీ వాళ్ల టీచర్లు ఏం చదువు చెబుతున్నారో ఆరా తీస్తున్నారా?. లేదా?? అయితే ఇకనైనా ఆ పని చేయండి. దాని కంటే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. Chattisgarh Govt School teacher can't even spell ELEVEN.BJP and Congress have ensured that the Indian masses remain illiterate so that they can manipulate them on trivial issues. pic.twitter.com/KepJHgukOr— Dr Ranjan (@DocRGM) July 30, 2025పై వీడియోలో ఉంది ఓ గవర్నమెంట్ టీచర్. బోధించేది ప్రైమరీ స్కూల్లో ఆంగ్లం సబ్జెక్ట్. ఆయనకు జీతం రూ.70 వేలపైనే. కానీ, Eleven, Nineteen స్పెల్లింగులు రాయలేక ఇబ్బంది పడ్డారు. Elevenను Aivene అని, Nineteenను Ninithin అని తప్పు తప్పుగా రాశారు. పైగా ఈ ఘటన సరిగ్గా విద్యాశాఖ అధికారి ఇన్స్పెక్షన్కు వచ్చిన టైంలో జరిగింది. ఆ తప్పులతోనే ఆయన వాళ్లకు అలాగే పాఠాలు బోధించారు. అంతేకాదు మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ల పేర్లు కూడా ఆ టీచర్ చెప్పలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.ఇక్కడ ఆ టీచర్ను అవమానించడం ఉద్దేశం కాదు. కానీ, గ్రామీణ విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలు సారిస్తున్న దృష్టి ఏపాటిదో అనేది ఈ ఘటన బయటపెట్టింది. ఛత్తీస్గఢ్ బాల్రాంపూర్ జిల్లా ఘోడాసోట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వీడియో వైరల్ కావడంతో ఛత్తీస్గఢ్ విద్యా శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించింది.మరోవైపు.. ఉపాధ్యాయుల ఎంపిక, శిక్షణ, మానిటరింగ్ పద్ధతులపై సోషల్ మీడియాలో ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వేలకు వేలు జీతం పొందుతున్న ఉపాధ్యాయులు కూడా ప్రాథమిక ఇంగ్లీష్ స్పెల్లింగ్లు తెలియకపోవడం విడ్డూరమనే కామెంట్లు కనిపిస్తున్నాయి. గుడ్డిగా పోస్టింగ్లు ఇవ్వకుండా రాటుదేలిన ఉపాధ్యాయులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు కొందరు. మరికొందరేమో.. ఆ టీచర్ను రీ-ట్రైనింగ్కు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ మధ్యే అకడమిక్ ఈయర్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా గుణవత్తా అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ కింద టీచర్లు లేని స్కూల్స్ ఇక మీదట ఉండకూడదని, ప్రతీ బడిలో కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలని, తమ పిల్లలకు సరిగా పాఠాలు బోధించని టీచర్లను తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితులు రావాలని.. ముఖమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఓ ప్రకటన చేశారు. ఈ తరుణంలో ఈ టీచర్ వీడియో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశమైంది. -
ఇంటికొచ్చి వంట చేస్తాడు.. రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు
ఈరోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కన్నా చిరు వృత్తులు చేసేవారే అధికంగా సంపాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ముంబైకి చెందిన ఆయుషి దోషి అనే న్యాయవాది సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఆదాయ అసమానతలు , నైపుణ్యం కలిగిన కార్మికుల నిర్వచనం గురించి విస్తృతమైన చర్చకు దారితీసింది.స్థానికంగా 'మహారాజ్' అని పిలిచే ఆమె ఇంట్లో పనిచేసే వంటమనిషి కార్పొరేట్ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్కో ఇంట్లో ఆయన కేవలం 30 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాడు. ఇందుకు ఒక్కో ఇంటికి రూ.18,000 సంపాదిస్తున్నారు. ఆయన ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని 10-12 ఇళ్లలో పనిచేస్తున్నాడు. అంటే అతని నెలవారీ సంపాదన రూ .1.8 లక్షల నుంచి రూ.2.16 లక్షల మధ్య ఉంటుంది. ఇది చాలా మంది వైట్-కాలర్ నిపుణుల జీతాల కంటే ఎక్కువ.విజయానికి ఒక రెసిపీ! దోషి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో వంటమనిషి సమర్థవంతమైన పని నమూనాను హైలైట్ చేశారు. ‘ఒక్కో ఇంటికి రూ.18,000 తీసుకుంటాడు. రోజూ 10-12 ఫ్లాట్లలో పనిచేస్తాడు. ఒక్కో ఇంటికీ 30 నిమిషాలే కేటాయిస్తాడు. భోజనం, టీలు ఉచితం. సమయానికి పేమెంట్’ అంటూ ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు.అయితే అందరు వంటవాళ్లూ ఇలాగే సంపాదిస్తున్నారని కాదు.. అద్భుతమైన నైపుణ్యం, దశాబ్దానికి పైగా నిర్మించుకున్న పేరు ఆయనకు ఎక్కువ సంపాదనను తెచ్చిపెడుతోంది. మరోవైపు చాలా మంది వంటవాళ్ల సంపాదన రూ.10,000 నుంచి రూ.12,000 మించడం లేదని, వేగం, పరిశుభ్రత, స్థిరత్వానికి పేరుగాంచిన వారు గణనీయంగా ఎక్కువ సంపాదించవచ్చని దోషి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. -
BCCI: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అప్డేటెడ్ జట్టు ఇదే
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఐదో టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్తో ఓవల్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బీసీసీఐ ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది.ఇక జట్టును వీడిన బుమ్రాకు సెప్టెంబరులో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup) వరకు సుదీర్ఘ కాలం విశ్రాంతి లభించనుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతోంది.ఓవల్ టెస్టులో గెలిస్తేనే సమంఈ క్రమంలో ఇంగ్లండ్ గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది. అయితే, పనిభారం తగ్గించే క్రమంలో ప్రధాన పేసర్ బుమ్రాను ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని మేనేజ్మెంట్ ముందుగానే ప్రకటించింది.అందుకు తగ్గట్లుగానే లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్లో విశ్రాంతి తీసుకున్నాడు. లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చి.. వెంటనే మాంచెస్టర్ టెస్టు కూడా ఆడాడు. అయితే, కీలకమైన ఐదో టెస్టులో ఆడతాడని భావించినా.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా యాజమాన్యం అతడికి రెస్ట్ ఇచ్చింది. తాజాగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. కాగా ఇంగ్లండ్తో ఆడిన మూడు టెస్టుల్లో ఈ రైటార్మ్ పేసర్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. 14 వికెట్లు కూల్చాడు.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్)శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఆసియా కప్ నాటికి తిరిగి వస్తాడా?ఆసియాకప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నట్లు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 14న గ్రూప్ దశ మ్యాచ్, 21న ‘సూపర్ ఫోర్’ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్లు జరగనుండగా... దుబాయ్, అబుదాబిలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. యూఏఈ, ఒమాన్, పాకిస్తాన్తో కలిసి భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనున్నాయి.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కేవలం తటస్థ వేదికల్లోనే తలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మ్యాచ్లను యూఏఈలో నిర్వహించనున్నారు. ప్రసారదారులతో ఏసీసీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ నుంచి పోటీపడనున్నాయి. దీంతో గ్రూప్ స్థాయిలో, ‘సూపర్ ఫోర్’ దశతో పాటు ఫైనల్లో ఇరు జట్లు పోటీపడే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఆసియాకప్ను అదే ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మెగా టోర్నీ నాటికి బుమ్రా తిరిగి వస్తాడో లేదో చూడాలి. చదవండి: ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా -
ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్ను టంగ్ బోల్తా కొట్టించాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
స్వతంత్ర్య అభ్యర్ధి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు!
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర్య అభ్యర్థి పట్ల టీడీపీ నేతలు రౌడీయిజం సృష్టించారు. శ్రీదేవి అనే స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా, ఆమెను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె నామినేషన్ వేయకుండా చేసేందుకు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోయారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఆమెను టీడీపీ నాయకుడు ఆనంద్రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి , ఇలా రౌడీయిజం చేసి కాదు. నామినేషన్ పత్రాలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, 5వేల నగదు ఎత్తుకు వెళ్లారు. ఎస్.ఐ దగ్గర ఉన్నా, మాపై దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు’ అని ఆమె విమర్శించారు. -
ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే?
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha Movie). జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిజానికి ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. కానీ మౌత్ టాక్ బాగుండటంతో ఏరోజుకారోజు వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలుచోట్ల థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే నరసింహ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు హోంబలే ఫిలింస్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.నరసింహస్వామి కథపురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద- నరసింహస్వామి కథే మహావతార్: నరసింహ. ఈ యానిమేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించాడు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.విష్ణు దశావతరాలుహోంబలే ఫిలింస్.. క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్లో సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ యూనివర్స్లో వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. రాబోయే సినిమాలు..ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో నరసింహ (ఆల్రెడీ రిలీజైంది), 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలను విడుదల చేస్తామని హోంబలే గతంలో వెల్లడించింది. 53 CRORES India GBOC and counting… 💥The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc— Hombale Films (@hombalefilms) August 1, 2025చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
బంపరాఫర్.. ఒక్క రూపాయి రీఛార్జ్తో అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అంటూ ట్వీట్ చేసింది.భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.Azadi ka plan at just Rs. 1/- & get true digital freedom with BSNL.With 30 days of unlimited calls, 2GB data/day, 100 SMS/day, and a free SIM. Applicable for new users only.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/L9KoJNVaXG— BSNL India (@BSNLCorporate) July 31, 2025 -
భారత్కు రానున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ.. ధోని, రోహిత్, కోహ్లితో క్రికెట్ మ్యాచ్
భారత ఫుట్బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో (13-15) కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.మెస్సీకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్లో (విజ్క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్లో పర్యటించాడు. నాడు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. -
కుళ్లిన చికెన్, గడ్డ కట్టిన చేపలు, మాగిపోయిన పీతలు!!
కుళ్లిన చికెన్, గట్టిన చేపలు, మాగిపోయిన పీతలు, ముద్దగా మారిన రొయ్యలు, 15 రోజులకు పైగా నిల్వ ఉంచిన మసాలా ముద్దలు.. చదువుతుంటే ఎలా ఉంది?. కానీ, ఈ వీటితో తయారు చేసిన వంటకాలనే విశాఖపట్నంలోని ప్రముఖ రెస్టారెంట్లలో వడ్డిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. విశాఖలో ఇవాళ ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. ఈ క్రమంలో.. క్వాలిటీలేని ఫుడ్ను విక్రయిస్తున్న వాళ్లపై అధికారుల సీరియస్ అయినట్లు సమాచారం.జగదాంబ జంక్షన్ లోని ఆల్ఫా హోటల్ లో తనిఖీలు చేస్తున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, సిబ్బంది సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘ఇవాళ 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నాం. ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్ని గుర్తించాం. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఇక్కడి ఫుడ్ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తాం. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయి. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటాం. పాయిజన్ ఫుడ్తో ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడేవాళ్లను క్షమించేది లేదు’’ అని హెచ్చరించారాయన. -
ఇటీవలే రెండో బిడ్డకు జననం.. ఆస్పత్రిలో చేరిన దృశ్యం నటి..!
బాలీవుడ్ నటి ఇషితా దత్తా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.ఈ ఏడాదిలో రెండో బిడ్డకు స్వాగతం పలికింది ముద్దుగుమ్మ. ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇషితా జూన్లో రెండో బిడ్డను తన జీవితంలో ఆహ్వానం పలికింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అయితే తాజాగా ఇషాతా దత్తా ఆస్పత్రిలో చేరింది. తన రెండు నెలల కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని ఇషితా తెలిపింది. ఇది నిజంగా కఠినమైన నెల... నేను నా నవజాత శిశువుతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో... ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అంటూ వివరించింది. మీలో చాలా మంది అనుకుంటున్నట్లు నా బరువు తగ్గడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని తెలిపింది.కాగా.. ఇషిత దత్తా -వత్సల్ సేత్ 2017లో వివాహం చేసుకున్నారు. రిష్టన్ కా సౌదాగర్ - బాజిగర్ అనే టీవీ సీరియల్ సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 19, 2023న, వారిద్దరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. ఇషిత దత్తా చివరిసారిగా 2022లో విడుదలైన దృశ్యం- 2లో కనిపించింది.ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. -
కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) సీజన్లో పాల్గొనే వెస్ట్జోన్ (West Zone) జట్టు ఖరారైంది. టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఈ దేశవాళీ టోర్నీలో వెస్ట్జోన్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతడి సారథ్యంలోని ఈ టీమ్లో టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా భాగం కానున్నారు.దూబే, రహానే, పుజారాలకు మొండిచేయివీరితో పాటు దేశీ స్టార్లు తుషార్ దేశ్పాండే, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్ కూడా వెస్ట్జోన్కు ఆడనున్నారు. మరోవైపు.. శివం దూబే అందుబాటులో ఉన్నా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. అదే విధంగా.. టీమిండియా వెటరన్ బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలకు కూడా దులిప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు.రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో శార్దూల్ ఠాకూర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ఈ ఆల్రౌండర్ లోయర్ ఆర్డర్లో భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియాలో శార్దూల్ సభ్యుడిగా ఉన్నాడు.ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో శార్దూల్ పెద్దగా రాణించడం లేదు. మరోవైపు.. వెస్ట్జోన్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వస్తాడనుకుంటే.. ఆసియా టీ20 కప్-2025తో అతడు బిజీ కానున్న నేపథ్యంలో పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ జోన్ కెప్టెన్గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. కాగా ఆగష్టు 28- సెప్టెంబరు 15 వరకు దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు.దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.సౌత్ జోన్ జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్దులిప్ ట్రోఫీ-2025 షెడ్యూల్👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.చదవండి: IND vs ENG: నా కుమారుడు చేసిన తప్పేంటి?: సెలక్టర్లపై క్రికెటర్ తండ్రి ఫైర్ -
Stock market: భారీ నష్టాలు.. నెత్తురు కక్కిన ఫార్మా షేర్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 585.67 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 81,317.51 -80,495.57 శ్రేణిలో ట్రేడ్ అయింది.ఇక 24,784.15 -24,535.05 రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 203 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,565.35 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ 4.43 నుంచి 2.41 శాతం మధ్య నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.33 శాతం, 1.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లో టాప్లో ఉండి 3.33 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వరుసగా 5.17 శాతం, 4.89 శాతం నష్టపోయాయి. అస్థిరత సూచీ, ఇండియా (విఐఎక్స్) 3.74 శాతం పెరిగి 11.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
15 వేల జీతంతో 30 కోట్ల ఆస్తులు?.. అవినీతికి అడ్రస్ చెప్పిన గుమస్తా!
బెంగళూరు: ఆయనో గుమస్తా(క్లర్క్). ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను నిర్వహించడం, డాక్యుమెంట్లను తయారు చేయడం, డేటా ఎంట్రీ, కార్యాలయ పరిపాలనకు సహాయం చేయడమే పని.నెలకు జీతం అక్షరాల రూ.15,000. ప్రభుత్వ ఉద్యోగి. అనుభవం ఉంది కాబట్టి ఆస్తులు మహా అయితే ఎంతుండొచ్చు. ఓ సొంతిల్లు. ఓ పదిపదిహేను లక్షల డబ్బు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్లర్క్ ఆస్తులు రూ.30కోట్లు,బంగారం,పదుల సంఖ్యలో భవానాలు,ఎకరాలకొద్దీ పొలాలు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? బెంగళూరులో శుక్రవారం లోకాయిక్తా అధికారులు ప్రభుత్వ కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్) కార్యాలయంలో మాజీ క్లర్క్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని కొప్పల్ పట్టణంలో ప్రభుత్వ ఆఫీస్లో కలకప్ప నిడగుండి క్లర్క్గా విధులు నిర్వహించేవారు జీతం రూ.15000. కానీ లోకాయిక్తా అధికారులు జరిపిన దాడుల్లో భయటపడ్డ కలకప్ప నిండగుండి ఆస్తుల్ని చూసి కంగుతిన్నారు.కలకప్ప నిండగుండితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద 24 ఇళ్లు,నాలుగు ఫ్లాట్లు, 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,నాలుగు వాహనాలు 350 గ్రాముల బంగారం,1.5కేజీ వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.నిడగుండి, మాజీ కేఆర్ఐడీఎల్ ఇంజనీర్, జెడ్ఎం చిన్చోల్కర్, పూర్తి కాని 96 అసంపూర్ణ ప్రాజెక్టులకు నకిలీ పత్రాలను సృష్టించి రూ. 72 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లోకాయుక్తా అధికారులు మాజీ గుమస్తా నిడగుండి నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక సంక్షోభం గురించి, బంగారం & వెండి కొనుగోలు గురించి, బిట్కాయిన్లో పెట్టుబడుల గురించి పలుమార్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ముఖ్యమైన ప్రశ్న అంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.మనం నియంత్రించే రెండు అత్యంత విలువైన ఆస్తులు.. మన సమయం, డబ్బు. వేలాది మంది ప్రజలు సమయాన్ని, డబ్బును తమ బాడీ, మైండ్, స్పిరిట్ కోసం కేటాయిస్తున్నారు. ఇది గొప్ప విషయమే. అయితే 'మీరు మీ సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?' అని తన ఎక్స్ వేదికగా ప్రశ్నింస్తూ.. జాగ్రత్తగా ఉండు అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.At at Ken McElroy’s LIMITLESS Event in Dallas. Thousands of people..great speakers. Priceless. I have leaned a lot….not all of it pleasant. Two most valuable assets we control….our time and our money.Grateful that thousands of people give both their time and their…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 1, 2025 -
పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!
అధికారులు తమ కింద పనిచేసే ఉద్యోగులను మాములుగా సతాయించారు. ఉద్యోగ ధర్మానికి సంబంధించిన పనులు తప్పించి..ఇబ్బందిపెట్టేలా అర్థం పర్థం లేని పనులు అప్పగించి బాధపెడుతుంటారు. పై అధికారి అనో లేక ఉద్యోగపోతుందనే భయంతోనో నోరు మెదపకుండా తలాడిస్తూ చేస్తుంటారు పాపం. కింది స్థాయి సిబ్బంది కూడా మనలాంటి సాటి మనుషులే కదా అని కూడా భావించరు కొందరు అధికారులు. అలాంటి వింత ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. నెటిజన్లు సైతం ఇంకా ఇలానా అంటూ మండిపడుతున్నారు. ఆగ్రాలో జూలై 30న సాయంత్రం హోంగార్డులు రోజులానే విధుల్లోకి రాగా..పోలీస్ లైన్ కాంపౌండ్లో పార్క్ చేసిన కార్లపై నిఘా ఉంచాలేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా పై అధికారి విచిత్రమైన డ్యూటీని అప్పగించడంతో కంగుతిన్నారు వారంతా. తమ డ్యూటీ ఆ రోజు ఒక పిల్లికి కాపల కాయడం. అది ఓ ట్రాఫిక్ ఎస్పీకి చెందిన పిల్లి. ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకోమని వాళ్లను ఆదేశించారు.ఏ జంతువు దానిపై దాడి చేయకుండా చూడటమే కాకుండా దానికి రాత్రిపూట పాలు, రొట్టే వంటివి ఇవ్వాల్సిందిగా చెప్పారట. ఒకవేళ ఆ పిల్లికి హాని కలిగేలా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారట ఆ అధికారి. దీంతో నిర్ఘాంతపోయారు హోంగార్డులు. ఈ విషయాన్ని ఒక హోంగార్డు తన డ్యూటీ ముగిసిన తదనంతరం సోష్లో మీడియాలో తన గోడును వెల్లబోసుకున్నారు. పైగా ఆ పోస్ట్కి ఈ రోజు మా డ్యూటీ పిల్లికి కాపల. దానికేదైనా జరిగితే మాపై కఠిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని క్యాప్షన్ని కూడా జోడించి మరి తన బాధను వెల్లడించాడు ఆ హోంగార్డు. ఈ విషయం క్షణాల్లో వైరల్ అవ్వడంతో.స్వాతంత్ర భారతవనిలో ఇంకా ఇలాంటివి ఉన్నాయా అంటూ మానవ హక్కుల కార్యకర్లు ఒక్కసారిగా మడిపడ్డారు. అటు నెటిజన్లు కూడా పోలీసుల విధుల గురించి సైటర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నెట్టింట ఈ విషయం తారస్థాయిలో ఆగ్రహోజ్వాలాలు రెకెత్తించగా..వెంటనే మరోపోస్ట్లో అతి వీధిపిల్లి అని ఎవ్వరిది కాదని అధికారిక పోస్ట్లో వివరణ ఇవ్వడం గమనార్హం. (చదవండి: బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్కి షాకవ్వాల్సిందే..! వీడియో వైరల్) -
భారత్తో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వోక్స్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా బలమైన గాయమని తేలింది.దీంతో అతను ఐదో టెస్ట్ నుంచి అర్దంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్లో వోక్స్ లేని లోటు ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినైట్లంది.ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడిన వోక్స్ 181 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా తరుపుముక్క అయిన కేఎల్ రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ తలో 2 వికెట్లు తీయగా.. వోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గిల్ రనౌటయ్యాడు. -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్
బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్ బిగ్బాస్ షోతో పాపులర్ అయింది. ఉయ్యాలా జంపాలా సీరియల్తో నటనవైపు అడుగులు వేసిన సిరి.. సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్లో నటించి ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా, పులి మేక వంటి వెబ్ సిరీస్లతో ఫుల్ పాపులర్ అయింది. తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చీరలో అందంగా సిరిఆ మధ్య వచ్చిన షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రంలోనూ చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా ఈ బిగ్బాస్ బ్యూటీ ప్రియుడు, నటుడు శ్రీహాన్తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీహాన్ పంచెకట్టులో ఉండగా సిరి చీరలో అందంగా ముస్తాబైంది. ఇది చూసిన కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. అందుకే పెళ్లి ఆలస్యం?కాగా సిరి, శ్రీహాన్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సిరి-శ్రీహాన్ పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పట్టించుకోనట్లే ఉంటున్నారు. దానికింకా టైముంది అన్నట్లుగానే ఓ ఎక్స్ప్రెషన్ పడేస్తున్నారు. అయితే ఓ సందర్భంలో సిరి మాట్లాడుతూ.. చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) చదవండి: వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి -
ప్రైవేటీకరణ బాటలోనే విశాఖ స్టీల్ ప్లాంట్
ఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తాము వెనక్కి తగ్గే యోచనలో లేమనే విషయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 100 శాతం పెట్టబడుల ఉపసంహరణ ఉంటుందన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్న సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పటివరకూ 1017 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఆర్ఐఎన్ఎల్కు రూ. 11,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకూ రూ. 984 కోట్లను విడుదల చేశాం’ అని మంత్రి తెలిపారు. -
రేవంత్రెడ్డి ఫొటోను తెగవాడేస్తున్న ఉద్యోగులు
సాక్షి, జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యాప్ తీసుకొస్తే.. ఆ యాప్ను ఎడాపెడా తమకు ఇష్టానుసారం వాడేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో బయటపడ్డ వ్యవహారం ఉన్నతాధికారుల్నే అవాక్కై నోట మాట రాకుండా చేసింది. జగిత్యాలలో ఓ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్న వైనం వెలుగు చూసింది. పంచాయితీ కార్యదర్శుల కోసం ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుంచే అటెండెన్స్ నమోదుకు అవకాశం కల్పించింది. అయితే అందులో కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో ఓ పంచాయితీ కార్యదర్శి మాత్రం నిత్యం విధులకు రాకుండా ఆ యాప్లో సీఎం ఫొటోను అప్లోడ్ చేశాడు. అది చూసి అధికారుల నోట మాట రాలేదు. ఈ సార్లాగే.. మరికొందరు చేసినట్లు గుర్తించారు. అంతేకాదు మరికొందరు విధులను ఎగ్గొట్టి ఇతరుల సాయంతో అటెండెన్స్ను నమోదు చేసుకుంటున్నట్లు తేలింది. చివరికి.. ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్న తీరుపైనా విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: హైకోర్టులో సీఎం రేవంత్కు ఊరట -
సీఈవో రాజీనామా.. కుప్పకూలిన షేర్లు
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో 17 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో రూ.819.25 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గిరిష్ కౌస్గీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఈ పతనం చోటుచేసుకుంది. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశ, స్థిరత్వంపై పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగించింది.నాయకత్వ శూన్యం2022 అక్టోబర్లో నాలుగేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన గిరీష్ కౌస్గీ 2025 అక్టోబర్ 28న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ తన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయడం వల్ల వారసత్వ ప్రణాళిక, నాయకత్వ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.అయితే కంపెనీ మాత్రం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార దృష్టి, వృద్ధి మార్గం యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇస్తోంది. కొత్త సీఈవో కోసం బోర్డు అనుభవజ్ఞుడైన వ్యక్తిని అన్వేషించడం ప్రారంభించింది.గత పనితీరు అమోఘంకౌస్గీ నాయకత్వంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 200 శాతం వృద్ధి చెందింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లలో అమ్మకాలు 50-రోజుల సగటు కంటే 1,176 శాతం అధికంగా నమోదయ్యాయి. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకాలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి.బలమైన క్యూ1 ఫలితాలుపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జూలై 21న బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం రూ.2,082 కోట్లుగా నివేదించింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.1,980 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.760 కోట్లు.ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ, సీఈవో రాజీనామా, టెక్నికల్ బ్రేక్డౌన్ కారణంగా తాత్కాలిక అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేచి చూడాలనే దృక్పథాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సీఈవో ఎవరు అవుతారు, మార్కెట్ భావన ఎలా మారుతుంది అన్నది స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు. -
‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆధార్, యూపీఐ ఆవిష్కరణల్లో కీలకపాత్ర పోషించిన నందన్ నీలేకని భారత్లో కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉండబోతుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ భారతదేశ జాబ్ మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. అందుకు బదులుగా భారీగా సంపదను, అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సాంకేతిక నిపుణులు ఏఐలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంతోపాటు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఈ ధోరణి ఇప్పటికే ప్రపంచ సాంకేతిక పర్యావరణ వ్యవస్థల్లో కనిపిస్తుంది. కానీ భారతదేశం అందుకు భిన్నమైన దృక్పథాన్ని నిర్మించాలి. ప్రపంచ శక్తులతో మనం పోరాడలేం. కానీ మన ప్రభావిత ప్రాంతంలో కోట్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు చేయాలి. ఉద్యోగం పోతుందని భయపడే బదులు నైపుణ్యాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలి’ అని నీలేకని అన్నారు. -
కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పా.. ప్రియాంక చోప్రా
‘రామ్-లీలా’ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రామ్ చాహే లీలా’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్లిప్ని షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది.‘ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సంజయ్ లీలా నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయగలనా’ అనుకున్నాను. కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పాను. సెట్లో దర్శకుడు నాకు బాగా ధైర్యం చెప్పాడు. పాటలోని ప్రతి పదానికి అర్థం వివరిస్తూ..హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకూ సలహాలిచ్చారు. కొరియోగ్రాఫర్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. లంచ్ బ్రేక్ టైంలో కూడా డ్యాన్స్ మూమెంట్స్ గురించి వివరించేవాడు. కష్టంగా ఒకే చెప్పినా..నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’ అని ప్రియాంక ఇన్స్టాలో రాసుకొచ్చింది.రామ్-లీలా సినిమా విషయానికొస్తే.. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రణ్వీర్-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వం వహించాడు. గ్యాంగ్స్టర్ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల చుట్టు తిరిగే కథ ఇది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!
ఇండియన్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'హోండా మోటార్సైకిల్' కంపెనీ కొత్త 'షైన్ 100 డీఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ.74,989 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.హోండా షైన్ 100 డీఎక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా స్టైలిష్గా ఉంటుంది. ఇందులో కొత్త గ్రాఫిక్స్, క్రోమ్ యాక్సెంట్స్ వంటి వాటితో పాటు ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. స్టీల్ ఛాసిస్పై నిర్మితమైన ఈ బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ఫైవ్ టైప్స్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ల పొందుతుంది. ఇది రెండు చివర్లలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ట్యూబ్లెస్ టైర్లతో వస్తుంది.పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే కొత్త హోండా షైన్ 100 డీఎక్స్ 98.98 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7500 rpm వద్ద 7.28 Bhp పవర్, 5000 rpm వద్ద 8.04 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఫోర్ స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. -
Sheep Scam: గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం.200లకుపైగా బ్యాంక్ పాస్బుక్లు సీజ్ చేశాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్ఫోన్లు, 20 సిమ్కార్డులు సీజ్ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని తెలిపింది. -
బిక్కముఖం వేశాడు.. జైసూ ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడు: అశ్విన్
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జైస్వాల్ టెక్నిక్ సరిగ్గా లేదంటూ విమర్శించాడు. అతడు ఎప్పటికీ సాయి సుదర్శన్ కాలేడని.. అట్కిన్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో జైసూ పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు.బిక్కముఖం వేశాడుఈ మేరకు.. ‘‘జైస్వాల్ ఎన్నటికీ సాయి సుదర్శన్ కాలేడు. అయినా వీళ్లిద్దరిని పోల్చడం సరికాదనుకోండి. కానీ ఇంగ్లండ్తో తొలి టెస్టులో జైస్వాల్ అవుటైన తీరును చూస్తే.. అతడికి ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియక బిక్కముఖం వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇలాంటి పిచ్పై ఎలా ఆడాలన్న గేమ్ ప్లాన్ అతడి వద్ద లేనట్లే అనిపించింది. నీ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు లేకపోతే ఇలాగే అవుట్ అయిపోతావు. బంతిని అతడు సరిగ్గా అంచనా వేయలేదు. డిఫెండ్ చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇప్పటికైనా జైస్వాల్ తన టెక్నిక్ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.కాగా ఈ మ్యాచ్లో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 108 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. చెన్నైకి చెందిన సాయి కూడా యశస్వి జైస్వాల్ మాదిరే లెఫ్టాండ్ బ్యాటర్ అన్న విషయం తెలిసిందే.తొలి రోజు ఇంగ్లండ్దే పైచేయిఇదిలా ఉంటే.. ఓవల్ వేదికగా గురువారం ఇంగ్లండ్తో మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 64 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించాడు.అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (21) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. గత మ్యాచ్లో అజేయ శతకంతో మెరిసిన రవీంద్ర జడేజా (9) ఈసారి విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (19) తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరుణ్ నాయర్ 52, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన ఈ సిరీస్ను కనీసం సమం చేయగలుగుతుంది. ఇక ఈ సిరీస్లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 101, 4, 87, 28, 13, 0, 58, 0, 2.చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్ట్యాగ్లతో కంటెంట్కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్కి షాకవ్వాల్సిందే..!
చిన్నారులు కూడా చిరుప్రాయంలోనే చిచ్చిర పిడుగుల్లా తమ ప్రతిభను చాటుకుని శెభాష్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో చూశాం. కానీ ఇలా అగ్గితో అవలీలగా ఆడుకునే చిన్నారిని చూసుండరు. ఏ మాత్రం బెరుకులేకుండా చేస్తున్న ఆ ఫైర్ విన్యాసం కళ్లు ఆర్పడమే మర్చిపోయేంతలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ డేరింగ్కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.తమిళనాడుకు చెందిన ఆరవ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు.. నిప్పుతో ఆడే ఒక రకమైన యుద్ధకళతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆరవ్ రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ కూడా. ఆ బాలుడు తమిళనాడుకి చెందిన పురాతన ఆయుధ ఆధారిత యుద్ధ కళ అయిన 'సిలంబం'ని అలవోకగా చేసి అలరించాడు. ఇది ఇరువైపులో అగ్నితో జ్వలిస్తున్న కర్రతో ఒక విధమైన విన్యాసంలా ప్రదర్శిస్తారు. ఎంతో శిక్షణ ఉంటేనే గానీ ఇంతలా డేర్గా చేయడం కష్టం. చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాచీన యుద్ధ కళ ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. కానీ ఈ బుడతడు ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఆ కళకే వన్నెతెచ్చేలా అత్యంత అద్భుతంగా ప్రదర్శించాడు. దీన్నిచూసిన నెటిజన్లు సిలంబం కళకే గర్వ కారణం అంటూ ప్రశంసించారు. ఆ వీడియోలో ఆరవ్ ప్రదర్శన సమయంలో కాలిపోతున్నట్లుగా కనిపించినా.. ఎక్కడ ఆగకుండా చేస్తున్న తీరు చూపరులను కట్టిపడేస్తుంది. చిన్న వయసులోనే ఇంత డేరింగా అని ఆశ్చర్యంకలుతుంది. ఇక ఆ వీడియోలో కూడా ఎవరూ దీన్ని ట్రై చేయొద్దు. తాము నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఇచ్చాం అంటూ ఒక హచ్చరిక సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. కనుమరుగవుతున్న మన ప్రాచీన కళలు ఈ విధంగానైనా ప్రస్తుత జనరేషన్ తెలుకునే అవకావశం దొరికింది అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Aarav AJ (@aarav_aj_official) (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(35)కు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.హాసన్లోని గన్నికాడ ఫామ్హౌజ్లో 2021 COVID లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అదే సమయంలో..ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ ఆరోపణలను ప్రజ్వల్ పేరెంట్స్ ఖండించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇదీ చదవండి: ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్ను ఎయిర్పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.#BreakingA Special court in Bengaluru has convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna, in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District. #PrajwalRevanna #Rape pic.twitter.com/fnzxJUp2Sc— Live Law (@LiveLawIndia) August 1, 2025ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ?ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: ప్రజ్వల్కు చీర చిక్కుఅశ్లీల వీడియోల కలకలంపని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్లోని ఫామ్హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు -
కేఏ పాల్ పిటిషన్.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ‘సుప్రీం’ నోటీసులు
ఢిల్లీ: బెట్టింగ్ యాప్లను నిషేధించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది. అయితే, గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా?. వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేఏ పాల్ కోరారు. బెట్టింగ్ యాప్లు కారణంగా కోట్లాదిమంది యువకులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి కేఏ పాల్ తీసుకువచ్చారు. -
వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి
శాంతి కృష్ణ (Shanthi Krishna).. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మలయాళంలోనే కాదు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. తెలుగులో ప్రియురాలు అనే ఏకైక చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే ఇప్పటికీ తనకు హీరోయిన్గానే నటించాలనుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి కృష్ణ మాట్లాడుతూ.. మోహన్లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు నన్ను హీరోయిన్గా పరిగణించరు. హీరోయిన్గా చేస్తా...ఫహద్ ఫాజిల్, నివిన్ పౌలీ వంటి హీరోలకు తల్లిగా నటించాక నన్నెందుకు కథానాయికగా తీసుకోవాలనుకుంటారు? కానీ, ఇప్పటికిప్పుడు నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా.. మలయాళ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తారు. ఇప్పటికీ వారి మనసుల్లో నాకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చింది. శాంతి కృష్ణకు ఇప్పుడు 60 ఏళ్లు. కొన్నాళ్లపాటు బెంగళూరులో ఉన్న ఆమె ప్రస్తుతం కొచ్చిలో సెటిలైంది. ఇప్పుడు హ్యాపీగా ఉందిదీని గురించి నటి మాట్లాడుతూ.. నేను మళ్లీ కేరళకుట్టిగా మారిపోయాను. కొచ్చిలో ఇల్లు తీసుకున్నాను. దీనికి శ్రీకృష్ణం అనే పేరు పెట్టాను. శ్రీ కృష్ణుని ఆలయం పక్కనే మా ఇల్లు ఉండటంతో అదే పేరు నా నివాసానికి పెట్టుకున్నాను. పిల్లల చదువుల కోసం చాలా ఏళ్లు బెంగళూరులో ఉన్నాను. చివరకు నా మనసుకెంతో దగ్గరైన ప్రదేశంలోనే ఇల్లు తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాను. ఇక్కడికి షిఫ్ట్ అవమని నా స్నేహితులు పదేపదే చెప్పారు. మొత్తానికి ఇక్కడికి వచ్చేశాక మనసుకెంతో తృప్తిగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్ -
చింతమనేని వర్గం హల్చల్.. అబ్బయ్య చౌదరి హెచ్చరిక
సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
రక్షాబంధన్కు ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొత్త రేట్లుఢిల్లీ: రూ.1,631.50కోల్కతా: రూ.1734.50ముంబై: రూ.1582.50చెన్నై: రూ.1789హైదరాబాద్: రూ.1,886.50డొమెస్టిక్ సిలిండర్ ధరలుడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది. -
జట్టులో లేని ప్లేయర్కు ఛాన్సులు.. నా కుమారుడు చేసిన తప్పేంటి?
టీమిండియా అరంగేట్రం కోసం మూడేళ్లుగా ఎదురుచూన్నాడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran). దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బెంగాల్ బ్యాటర్కు 2022లోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా నాటి కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయపడటంతో.. అభిమన్యుతో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.మరోసారి పాత కథే పునరావృతంఅయితే, ఆ సిరీస్లో అభిమన్యుకు ఆడే అవకాశం రాలేదు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాకు కూడా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఎంపికయ్యాడు. అప్పుడూ తుదిజట్టులో నో ఛాన్స్. ఇక తాజాగా ఇంగ్లండ్తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ ఆడే జట్టులోనూ స్థానం సంపాదించాడు.కానీ.. మరోసారి పాత కథే పునరావృతం అయింది. అభిమన్యు ఈశ్వరన్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పునరాగమనం చేసిన కరుణ్ నాయర్కు మాత్రం మేనేజ్మెంట్ వరుస అవకాశాలు ఇచ్చింది. ఇంగ్లండ్తో తొలి మూడు టెస్టుల్లో విఫలమైనా.. ఐదో టెస్టులో అతడికి మరోసారి ఆడే ఛాన్స్ ఇచ్చింది.జట్టులో లేని ప్లేయర్కు ఛాన్సులుఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అభిమన్యు టెస్టు అరంగేట్రం కోసం నేను రోజులు కాదు.. సంవత్సరాలు లెక్కబెడుతున్నాను. ఇప్పటికి మూడేళ్ల కాలం గడిచింది.ఓ బ్యాటర్గా పరుగులు చేయడం మాత్రమే కదా కావాల్సింది. ఆ పని అభిమన్యు చేస్తూనే ఉన్నాడు. నిజానికి అభిమన్యు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జట్టుకు ఎంపికైనపుడు కరుణ్ నాయర్ అసలు జట్టులోనే లేడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టులకు ఎంపికా?కానీ ఐపీఎల్లో కాస్త మెరుగ్గా ఆడితే టెస్టు టీమ్లోకి తీసుకుంటారు. అసలు సంప్రదాయ క్రికెట్ జట్టుకు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్లేయర్లను ఎంపిక చేయడం ఏమిటి? రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ప్రదర్శన మాత్రమే టెస్టు సెలక్షన్కు ప్రామాణికం కదా!ఏడాది కాలంలో నా కుమారుడు 864 పరుగులు సాధించాడు. అయినా తనకు ఆడే అవకాశం రావడం లేదు. నా కుమారుడు డిప్రెషన్లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది’’ అంటూ రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలక్టర్ల తీరు సరికాదంటూ మండిపడ్డారు.నిజానికి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్న నాటి నుంచి నేటి వరకు ఏకంగా 15 మంది క్రికెటర్లు అరంగేట్రం చేయడం గమనార్హం. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఇప్పటికి 103 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 27 శతకాలు, 31 అర్ధ శతకాల సాయంతో 7841 పరుగులు సాధించాడు.చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
టెస్టు క్రికెట్లోకి తిరిగిరానున్న శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడేందుకు తను సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు శ్రేయస్ అయ్యర్ తెలియజేసినట్లు సమాచారం.ఈ దేశవాళీ రెడ్బాల్ క్రికెట్ టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అయ్యర్ వెస్ట్జోన్ తరపున ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు టీమిండియా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబేలు కూడా దులీప్ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. వెస్ట్జోన్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న సెమీస్లో క్వార్టర్ ఫైనల్ విజేతతో వెస్ట్జోన్ తలపడనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. వైట్బాల్ క్రికెట్లో తనను తను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్ ఇంకా టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. భారత తరపున ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన అయ్యర్.. 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు.అయితే డిమాస్టిక్ క్రికెట్లో మాత్రం అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో కూడా ఈ ముంబైకర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్తో టెస్టులకు ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అతడికి ప్రస్తుతం జట్టులోఅయ్యర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నప్పటికి.. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ ఇచ్చేందుకు అవకాశం లేదని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే ఇంకా మెరుగ్గా రాణించి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా అయ్యర్ ముందుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్ భారత తరపున చివరగా గతేడాది ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్ -
లోకేష్.. అది మీ నాన్నను అడిగి తెలుసుకోండి
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్రావు హెచ్చరికలు జారీ చేశారు. -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, షెడ్యూల్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్దీప్ ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీ ఆఖరు. నామినేషన్ పరిశీలన 22వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది.భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించబడే ఒక ప్రత్యేక ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ తరఫున లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.పరోక్ష ఓటింగ్ (Indirect Election).. ఏక బదిలీ ఓటు పద్ధతి.. ఓటర్లు ఎన్నికలో నిల్చున్న అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో (1, 2, 3...) గుర్తిస్తారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుందిఅర్హతలుభారతీయ పౌరుడై ఉండాలికనీసం 35 సంవత్సరాల వయస్సురాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలిలాభదాయక పదవిలో ఉండకూడదురిటర్నింగ్ అధికారిగా.. లోక్సభ లేదంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారునామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు — మొత్తం ప్రక్రియను 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్ 66 స్పష్టం చేస్తోంది. -
కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. కింగ్డమ్.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.హిట్టు కొట్టినంఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ను రౌడీ హీరో షేర్ చేస్తూ మనం (హిట్) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..! ఇకపోతే కింగ్డమ్ వీకెండ్లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైగర్ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.ఆ సినిమాలతోనే పోటీఅయితే ఈ చిత్రానికి.. మహావతార్ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్ ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి! కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, వెంకటేశ్, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. BOOM 💥🔥Manam Kottinam 🤗❤️ https://t.co/FOqpt7dxjK— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2025చదవండి: రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్ -
'మదరాసి' ఫస్ట్ సాంగ్.. అనిరుధ్ మ్యాజిక్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'మదరాసి'(Madharaasi ). ఇందులో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్లో విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా ఉన్న ఈ సాంగ్ను సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఆలపించారు. అయితే తెలుగు వర్షన్ను ధనుంజయ్ సీపాన ఆలపించారు. -
‘లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ’
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు. -
బరువు తగ్గాలంటే.. టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్
బరువు తగ్గించుకునే క్రమంలో చప్పచప్పగా తింటూ విసిగిపోయారా? వెయిట్ లాస్జర్నీకి భంగం కలగకుండా ఉండేలా, బోరింగ్ స్నాక్స్ కాకుండా హెల్దీగా, సంతృప్తి కరంగా ఉండేలా కొన్ని రకాల ఆహారాలను తయారు చేసుకోవచ్చు. ఇవాల్టీ టిప్ ఆఫ్ది డేలో భాగంగా రుచితోపాటు, సంతృప్తిగా, బరువుతగ్గడంలోనూ కూడా సాయపడే వంటకాల గురించి తెలుసుకుందాం.చనా లేదా చిక్పీస్, లేదా కాబూలీ శనగలు ఎలా పిలిచినా ఇవి పోషకాల గని. వీటినే తెల్ల శనగలు అని కూడా అంటారు. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, ఎన్నో విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బోర్ కొట్టకుండా, వెరైటీగా, రుచికరంగా ప్రోటీన్-ప్యాక్డ్గా స్నాక్స్, కూర ,సలాడ్ ఇలా ఎన్నో.. సులభంగా తయారు చేసుకోవచ్చు .కాబూలీ శనగలకూర (Kabuli Chana Curry)కావలసినవి: బాగా నానబెట్టి ఉడించిన కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, ఉప్పు.ఒక ప్యాన్లో నూనెగానీ నెయ్యిగానీ వేసి వేడెక్కిన తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ,పచ్చిమిర్చి, టొమాటోవేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా వేయించుకోవాలి. వేగాక ఉడికించి పెట్ఘుకున్నశనగలు వేసి ఉడికించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బాగా దగ్గరికి వచ్చిన తరువాత టేస్ట్ చూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన కర్రీ రెడీ.. అన్నంలోగానీ, చపాతీలు, రోటీలోకి గానీ భలే టేస్ట్గా ఉంటుంది.Kabuli Chana Pulao కాబూలీ శనగలతో పులావ్ కావలసినవి: కాబూలి శనగలు, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, గరం మసాల దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పులావ్ఆకులు), ఉప్పు.తయారీ: ఒకప్యాన్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మసాలాలు వేసి వేయించుకోవాలి. తరువాతతరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత నీళ్లు, బియ్యం, శనగలు వేసి సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర, పుదీనాతో గార్నీష్ చేసుకుంటే పులావ్ రెడీ. ఇలా ఉత్తినే తీనేయవచ్చు. లేదా పుదీనా, అల్లం చట్నీతో తినవచ్చు.సలాడ్కావలసినవి: కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, కీరా నిమ్మరసం, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు.తయారీ: రాత్రంతా నానబెట్టిన ఉడికించిన శనగలు, సన్నగా తరిగిన ముక్కలు, నిమ్మరసం, చాట్ మసాలా, ఆలివ్ ఆయిల్( ఆప్షనల్) వేసి బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు.చనా మసాలాకావాల్సినవి : ఉడికించి పెట్టుకున్నశనగలు కాశ్మీరీ ఎండుమిర్చి, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మసాలాలు (దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు , బిర్యానీ ఆకులు, ధనియాలు, జీలకర్ర , సోంపు)ఒక పాన్లో కొద్దిగా నెయ్యివేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేస్ట్, మసాలాలు బాగా వేయించాలి. పాన్ అడుగున అంటు కోకుండా తిప్పుతూ బాగా వేయించాలి. ఆ తరువాత తరిగి ఉంచుకున్న టమాటాలు ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి, ఉడికాక శనగలు వేసి ఉప్పు, నూనెపైకి వచ్చేదాకా బాగా ఉడికించాలి. రుచి చూసుకొని తినేముందు నిమ్మరసం కలిపి, పైన కొత్తిమీర చల్లుకున్న ఘుమఘుమలాడే చనా మసాలా రెడీ..కాబూలీ శనగల స్నాక్స్రాత్రంతా నానబెట్టి ఉడికించిన కాబూలి శనగలు. నూనె, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి. శనగలను నూనెలో బాగా వేయించి, మసాలాలు కూడా యాడ్ చేసి మరికొద్దిసేపు వేగించి ఆరగించడమే.ఇవి కాకుండా ఉడికించిన శనగలను మెత్తగా చేసి, మసాలాలు జోడించి కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. శెనగ పిండితో కలిపి బజ్జీలు చేసుకోవచ్చు.శనగలతో లాభాలురోగనిరోధక శక్తికి కూడా శనగలు చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి9, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలుంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇదొక యాంటి ఆక్సిడెంట్ కూడా. గ్లూటెన్ రహితం కాబట్టి షుగర్, అదుపులో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బెల్లీ ఫ్యాట్ను కరిగిస్తుంది. చర్మ సంరక్షణకు కూడా మంచిదేనోట్: శనగలు ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అతిగా తినడం మంచిది కాదు కొంతమందికి గ్యాస్ సమస్యలు రావచ్చు. ఏవైనా సందేహాలు, సలహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.) -
సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్హౌజ్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్లో నేను వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. -
నేనో సిట్టింగ్ ఎంపీని.. జడ్జి ఎదుట మిథున్రెడ్డి రిక్వెస్ట్
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.ఇదిలా ఉంటే.. మిథున్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. -
ఓటమితో వీడ్కోలు.. టెన్నిస్ స్టార్ కన్నీటి పర్యంతం
మాంట్రియల్: కెనడాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ జెనీ బుచార్డ్ ఆటకు వీడ్కోలు పలికింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. నేషనల్ బ్యాంక్ ఓపెన్లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బుచార్డ్ 2–6, 6–3, 4–6తో 17వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో పోరాడి గెలిచిన బుచార్డ్... రెండో రౌండ్లో అదే ఆటతీరు కనబర్చలేకపోయింది. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో... తొలి సెట్లో ఓడిన బుచార్డ్... ఆ తర్వాత పుంజుకుంది. రెండో సెట్ గెలిచి... మూడో సెట్లోనూ చక్కటి పోరాటం కనబర్చినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన బెన్చిచ్ విజయం సాధించింది. ప్రత్యేక అనుబంధం‘మాంట్రియల్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఎదో ఒక రోజు ఇదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకాలని బలంగా అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇదో భావోద్వేగ సందర్భం. కెరీర్లో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా’ అని బుచార్డ్ పేర్కొంది. 2014లో కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో బుచార్డ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరింది. ఆ ఏడాదే కెరీర్లో ఏకైక డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆమె.... ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో సెమీఫైనల్కు చేరింది. 2014లో వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన బుచార్డ్... తిరిగి పుంజుకోలేకపోయింది. కన్నీటి పర్యంతం‘ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఇక్కడి వరకు వచ్చా. టెన్నిస్ ధ్యాసలో పడి చదువుకు దూరమయ్యా. ఇష్టాలను వదులుకొని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇక ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. టెన్నిస్ నాకు తిరిగిచి్చన దాంతో సంతృప్తిగా ఉన్నా. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్లు వీక్షించేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగు పెట్టాలని కలలు కనేదాన్ని. అది నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నా’ అని మ్యాచ్ అనంతరం బుచార్డ్ కన్నీటి పర్యంతమైంది. -
న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.‘‘నేను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు. -
180 KM.. ఐదు ఆస్పత్రులు.. ఆర్మీ అధికారి కొడుకు ప్రాణం తీసిన నిర్లక్ష్యం!
డెహ్రాడూన్: ఐదు ఆసుపత్రుల్లో వైద్యులు నిర్లక్ష్యంగా కారణంగా 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు జిల్లాల్లోని ఐదు ఆస్పత్రులకు చిన్నారిని చికిత్స కోసం తిప్పినప్పటికీ తన బిడ్డను దక్కించుకోలేకపోయాయని తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. దేశం కోసం తాను సరిహద్దుల్లో కాపలాగా ఉన్నందుకు తన బిడ్డను కోల్పోయినట్టు చిన్నారి తండ్రి, ఆర్మీ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి దర్యాప్తునకు ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆర్మీ అధికారి దినేష్ చంద్ర జోషి, శ్రీ జోషి దంపతుల కుమారుడు శివాంష్ జోషి(14 నెలలు). దినేష్ చంద్ర జోషి భారత సరిహద్దుల్లో జమ్ముకశ్మీర్లో విధుల్లో ఉన్నారు. శ్రీ జోషి, శివాంష్ జోషి తమ స్వగ్రామంలో(ఉత్తరాఖండ్) ఉంటున్నారు. అయితే, జూలై 10న శివాంష్ జోషికి వాంతులు కావడంతో తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో చిన్నారి డీహైడ్రేషన్కు గురయ్యాడు. చిన్నారిని తీసుకుని తల్లి స్థానికంగా చమోలిలోని గ్వాల్డామ్లోని ప్రజారోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడ సరైన సిబ్బంది లేకపోవడంతో.. బాగేశ్వర్లోని బైజ్నాథ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రిఫర్ చేశారు. చిన్నారిని తీసుకుని 22 కి.మీ దూరంలో తల్లి అక్కడికి చేరుకుంది. అయితే, పీహెచ్సీలో పిల్లల వైద్యుడు లేకపోవడం, చికిత్స చేయడానికి సౌకర్యాలు లేవని సిబ్బంది తెలిపారు. వెంటనే స్థానికంగా ఉన్న సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి కొంత చికిత్స అందించారు. కానీ, వైద్యం సరిపోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో, అక్కడి వైద్యులు.. మరో 20 కి.మీ దూరంలో ఉన్న బాగేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.బిడ్డను తీసుకున్న హుటాహుటిన తల్లి.. జిల్లా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుంది. అక్కడున్న వైద్యులు, నర్సులు.. చిన్నారికి సరైన వైద్యం అందించలేదు. చిన్నారిని పరిశీలించకుండానే.. అల్మోరాకు రిఫర్ చేశారు. ఈ క్రమంలో అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించగా.. రాత్రి 7 గంటలకు అంబులెన్స్కు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో చిన్నారి తల్లి జిల్లా మేజిస్ట్రేట్కు ఫోన్ చేసి సహాయం కోరిన తర్వాత రెండున్నర గంటలు ఆలస్యంగా వాహనం వచ్చింది. తీరా అక్కడికి వెళ్లాక బిడ్డ మెదడులో రక్త ప్రవాహ అవరోధంతో బాధపడుతున్నాడని పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ లేకపోవడంతో వైద్యుడు ఉన్నత కేంద్రానికి వెళ్లాలని సూచించాడు. చివరికి రాత్రి 9:30 గంటలకు నాలుగో ఆసుపత్రి అయిన అల్మోరా మెడికల్ కాలేజీకి తరలించారు.ఇక, చిన్నారికి చికిత్స అందించారు కానీ మళ్లీ నైనిటాల్లోని హల్ద్వానీలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. జూలై 12న హల్ద్వానీలో వైద్యులు బిడ్డను వెంటిలేటర్పై ఉంచారు. అయితే నాలుగు రోజుల తర్వాత జూలై 16న బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. ఈ ఘటన ముఖ్యమంత్రి వరకు చేరడంతో సీఎం పుష్కర్సింగ్ ధామి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి స్పందిస్తూ.. అంతా అయిపోయింది. ఒక నిస్సహాయ సైనికుడి తండ్రి సరిహద్దు నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ అంబులెన్స్ సమయానికి రాలేదు. అతనితో సరిగ్గా మాట్లాడలేదు. ఉత్తరాఖండ్లోని ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఉంటాడు. అసెంబ్లీలో కొండప్రాంత ప్రజలను అవమానించే మంత్రి ఉన్న ఈ ప్రభుత్వంలో సైనికుల కుటుంబాలకు వారు ఆదుకుంటారు అని ఆశించడం పూర్తిగా వ్యర్థం అని ఆవేదన వ్యక్తం చేశారు.ही हो गई। एक मजबूर फौजी पिता सरहद से फोन करता रहा, लेकिन एम्बुलेंस समय पर नहीं आई, और उससे ढंग से बात तक नहीं की गई। उत्तराखंड के हर घर में सैनिक है, जिस सरकार का मंत्री सदन में पहाड़ियों को गाली देता हो, वो सरकार इन सैनिकों के परिवार का ध्यान रखेगी, ऐसी उम्मीद करना भी बेकार है। pic.twitter.com/RGZHJ8Ve3n— Himalayan Hindu (@himalayanhindu) July 30, 2025చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లోని సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే నా బిడ్డ చనిపోయాడు. తనను తాను జాతీయవాదిగా చెప్పుకునే అవినీతి ప్రభుత్వం ఒక సైనికుడి కొడుకును కాపాడలేకపోయింది! అంటూ మండిపడ్డారు.उत्तराखंड की लचर स्वास्थ्य सेवाओं ने सरहद पर तैनात चमोली के दिनेश चंद्र जोशी के एक साल के बेटे शुभांशु की जान ले ली। फौजी के बेटे को नहीं बचा पाई खुद को राष्ट्रवादी कहने वाली भ्रष्ट सरकार! ग्वालदम, बैजनाथ, बागेश्वर, अल्मोड़ा, और हल्द्वानी के अस्पतालों में भागते-भागते बच्चे की मौत pic.twitter.com/Ut7zPTg4AS— Himalayan Hindu (@himalayanhindu) July 30, 2025 -
అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు. -
అయూబ్ ఆల్రౌండ్ షో.. విండీస్ను చిత్తు చేసిన పాక్
వెస్టిండీస్ పర్యటనను పాకిస్తాన్ ఘనంగా ఆరంభించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన తొలి టీ20లో 14 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హసన్ నవాజ్(24), ఫఖార్ జమాన్(28) రాణించారు. విండీస్ బౌలర్లలో షెమార్ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, షెఫర్డ్, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు.టాపర్డర్ ఫెయిల్..అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్కు ఓపెనర్లు జాన్సెన్ చార్లెస్(35), జ్యువెల్ ఆండ్రూ(35) 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే విండీస్ ఒకే ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్.. ఆండ్రూ, చార్లెస్, మోటీలను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ షాయ్ హోప్(2), రూథర్ ఫర్డ్(11), ఛేజ్(5), షెఫర్డ్(5) వరుస క్రమంలో ఔటయ్యారు. ఆఖరిలో హోల్డర్(30), షమీర్ జోషఫ్(21) మెరుపులు మెరిపించినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లక్ష్య చేధనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగల్గింది.పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు, అయూబ్ రెండు, ముఖియమ్ ఓ వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 2న ఫ్లోరిడా వేదికగా జరగనుంది.చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్ -
రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్ బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్కు తగిన స్మార్ట్ఫోన్లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.శాంసంగ్ ఎం06 5జీ🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్ఫోన్లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.ఇన్ఫినిక్స్ హాట్ 60🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్ను పెంచుకోవచ్చు.🔹హాట్ 60 5జీ ప్లస్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.లావా స్టార్మ్ ప్లే🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. -
రేయ్.. ఎవరురా మీరంతా?
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న నగరం.. బెంగళూరు(కర్ణాటక). వర్షాలు.. వరదలు, ట్రాఫిక్ రద్దీ, లైంగిక వేధింపులు, భాష ప్రతిపాదికన దాడుల ఘటనలు ఏవో ఒకటి నగరాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో.. మరో తరహా ఘటనలు ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారి తీస్తున్నాయ్.. నోయెల్ రాబిన్సన్, యూనెస్ జారో.. ఈ ఇద్దరూ ఆషామాషీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్లకి. అయితే తాజాగా ఈ ఇద్దరికీ బెంగళూరులోనే చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు ఘటనలో వీళ్లిద్దరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చింది.జర్మన్ టిక్టాకర్ నోయెల్ రాబిన్సన్.. గుబురు జుట్టేసుకుని జనం మధ్య డ్యాన్సులు వేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్కతా సహా పలు నగరాల్లో ఇప్పటికే వీడియోలతో భారతీయులకూ దగ్గరయ్యాడు. అయితే.. బెంగళూరు వీధుల్లో సంప్రదాయ పంచెకట్టులో డాన్స్ చేస్తూ వీడియో చేయబోయాడు. దీంతో జనం భారీగా గుమిగూడారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ పేరుతో అతన్ని స్టేషన్కు లాక్కెళ్లారు. ఆ సమయంలో అతనితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. తీరా పీఎస్కు తీసుకెళ్లాక ఓ పావు గంట తర్వాత అతని నుంచి వివరణ తీసుకుని.. జరిమానా విధించి వదిలేశారు. దీనిని అంతే తేలికగా తీసుకున్న నోయెల్.. దానిని ఓ ఫన్నీ వీడియోగా ప్రమోట్ చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Noel Robinson (@noel)మరో ఘటనలో.. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ యూనస్ జారో నగరంలోని చర్చి స్ట్రీట్ వద్దకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే అతని రాకతో అక్కడ జనం గుమిగూడారు. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని పీఎస్కు తరలించి.. ఫైన్ విధించి పంపించారు. ఆ సమయంలోనూ అతను వాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ మరో ఫొటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Younes Zarou (@youneszarou)ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటిష్ మ్యూజీషియన్ ఇద్ షరీన్ రోడ్డు మీద ప్రదర్శన ఇస్తుండగా.. కుబ్బన్ పోలీసులు అంతరాయం కలిగించి అక్కడి నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అటు ఫ్యాన్స్తో పాటు అతిథి దేవోభవకు బెంగళూరు పోలీసులు తూట్లు పొడిచారంటూ ఇటు నెటిజన్లు నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు.International artist @edsheeran was stopped playing in #Bangalore at church street. Even though, he had the permission. Literally! The cops pulled the plug. Damn sad! #Karnataka pic.twitter.com/C0F9tdm26g— Imran Khan (@KeypadGuerilla) February 9, 2025 అయితే.. పోలీసులు మాత్రం తమ అనుమతులు లేకుండా రోడ్లపై అలాంటి షోలను అనుమతించమని.. జనం గుమిగూడి జరగరానిది ఏదైనా జరిగితే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ - 2025 తెర మీదకు తెచ్చింది. ఈ రకమైన ఈవెంట్లు గనుక అనుమతులు లేకుండా నిర్వహిస్తే.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా విధించాలని ఈ చట్టం తేబోతోంది. -
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్తో అలరించనున్నారు. బెంగాల్ ఫుడ్కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు. ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. రాష్ట్రంలోని సన్రైజ్ కంపెనీల(ఎమర్జింగ్ పరిశ్రమలు)కు ఇచ్చిన కార్మిక చట్టాన్ని పరిశీలిస్తామని తెలిపారు.‘టీసీఎస్ నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు ప్రభావితం అవుతారు. అకస్మాత్తుగా 12,000 మంది తొలగింపు అంటే చాలా ప్రమాదం. ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అంతకుమించి స్పష్టమైన కారణం కూడా తెలుసుకుంటాను. కార్మిక చట్టాన్ని పరిశీలిస్తాం. సన్ రైజ్ కంపెనీలకు నిత్యం చాలా వెసులుబాట్లు ఇస్తూనే ఉంటాం’ అని మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు.ప్రభుత్వ జోక్యం కోరిన ఎన్ఐటీఈఎస్లేఆఫ్స్కు సంబంధించి వివరణ కోరుతూ టీసీఎస్కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కోరింది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్యను 5,000 పెంచింది.ఇదీ చదవండి: క్యాప్ జెమినీలో భారీ నియామకాలుసన్రైజ్ పరిశ్రమలునూతన ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్రైజ్ పరిశ్రమలకు(అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీలు) కార్మిక చట్టం మినహాయింపులు ఇస్తోంది. ఇందులో సౌకర్యవంతమైన నియామకాలు, తొలగింపు నిబంధనలున్నాయి. స్టార్టప్లు, టెక్ ఆధారిత సంస్థలకు ఈ చట్టం ద్వారా మద్దతు లభిస్తుంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్ టెక్, స్పేస్ టెక్, ఏరోస్పేస్ వంటి విభాగాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. -
నెల్లూరులో హైటెన్షన్.. ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై దాడికి యత్నం
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణలు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతల ప్రెస్మీట్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్ కార్యాలయంపైకి మహిళలను పంపించారు. పోలీసులు రావడంతో ప్రశాంతిరెడ్డి అనుచరులు పారిపోయారు.కూటమిలో కలవరం నిన్న(గురువారం) వైఎస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది.జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్పోస్ట్లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు. -
ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్లో ఐటీ సెంటర్ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు. -
నీ స్నేహం..ఓ సంబరం..
కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపురేఖలు వేరట.. ఊపిరొకటే చాలట.. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.. కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా.. నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి.. స్నేహమంటే రూపులేని ఊహ కాదని.. లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.. అని సిరివెన్నెల రచించిన పాట అందరికీ సుపరిచితమే.. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచి్చందంటే!.. అదే ‘ఫ్రెండ్షిప్ డే’.. ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం బహుమతులు ఇచి్చపుచ్చుకోవడం లేదా ఇన్స్టాలో కథలు చెప్పడం మాత్రమే కాదు. నిజానికి, ఈ వేడుక రేపటి జ్ఞాపకాలుగా మారే అనుభవాలకు వేదిక. ట్రెడిషన్, ట్రెండ్ను మిళితం చేసే హ్యాపెనింగ్ సిటీ అయిన మన భాగ్య నగరంలో ఆ జ్ఞాపకాల సృష్టికి అనువైన ప్రదేశాలెన్నో.. అలాంటి కొన్ని ప్రదేశాలు, ఈవెంట్ల వివరాలు, అనువైన ప్రదేశాలను కోరుకునే ఫ్రెండ్షిప్ కోసం.. ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా ఆగస్టు నెల్లో తొలి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోనున్నారు స్నేహితులు. ఇందుకు నగరంలో పలు వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇది స్నేహితులతో రోజూ మాదిరి సరదాగా కాకుండా మరింత ప్రత్యేకంగా గడపడానికి సరైన సందర్భం.. అందుకు అనువైన ప్రదేశాలెన్నో నగరంలో వేదిక కానున్నాయి. ఫ్రెండ్స్.. జంతు ప్రేమికులైతే బంజారాహిల్స్లోని పెట్ కేఫ్ లాంటివి సరైన ఎంపిక. ఇక్కడ పిల్లులను కౌగిలించుకోవచ్చు, అందమైన శునకాలను పలకరించవచ్చు. ఇది స్నేహితుల రోజువారీ ఒత్తిడిని తగ్గించడానికి అనువైన ప్రదేశం. నగరంలో మొట్టమొదటి ఆర్ట్ థెరపీ స్పాట్ జూబ్లీహిల్స్లోని లైజుర్–ఆర్ట్ కేఫ్, లైజుర్ పెయింటింగ్, టఫ్టింగ్, కుండలు, టీ–షర్ట్ పెయింటింగ్, కొవ్వొత్తుల తయారీ లాంటివెన్నో అందిస్తుంది. కళాభిమానులైన స్నేహితులు ఆర్ట్ జామింగ్ లేదా సృజనాత్మక సెషన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బ్రష్స్ట్రోక్స్ లేదా టఫ్టింగ్ సెషన్ మధ్య కాఫీని ఆస్వాదించవచ్చు. జూబ్లీహిల్స్లోని బోర్డ్ కేఫ్లో స్క్రాబుల్ వంటి క్లాసిక్ల నుంచి తంబోలా వంటి పార్టీ గేమ్ల వరకూ 700 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. ఆటలకు కొత్తవారైతే హోస్ట్ల ద్వారా సహాయం అందుకోవచ్చు. ఇక్కడ గంటల తరబడి నవ్వుతూ, స్నేహితులతో సరదా పోటీలతో గడపవచ్చు. జూబ్లీహిల్స్లోని బేస్ కాఫీ, పికిల్ బాల్ కేఫ్.. నగరంలో కొత్త జీవనశైలిలో ఒకటైన పికిల్ బాల్ కాఫీలని విలీనం చేస్తుంది. స్నేహితులు బాల్ గేమ్స్ ఆడవచ్చు, ఆ తరువాత కోల్డ్ బ్రూలు స్నాక్స్తో రీఛార్జ్ కావచ్చు. ప్రకృతిని, ప్రశాంతతను ఇష్టపడే ఫ్రెండ్స్ ప్రప్రథమ గార్డెన్ థీమ్డ్ అర్బన్ నెమో కేఫ్ని ఎంచుకోవచ్చు. ఇది పచ్చని మొక్కలతో రిలాక్స్డ్ ఓపెన్–ఎయిర్ సీటింగ్ బొటానికల్ డెకార్ను అందిస్తుంది. ఈ కేఫ్ ఫ్రెండ్షిప్ డే కార్యకలాపాలను ప్రత్యేకంగా నిర్వహించనప్పటికీ.. పచ్చదనంతో పాటు అల్లుకున్న ప్రశాంతత నిశ్శబ్దంగా ఫ్రెండ్షిప్ డేని ఆస్వాదించడానికి సరిపోతుంది. సృజనాత్మక కో–వర్కింగ్, వర్క్షాప్లు లేదా ఈవెంట్లతో కూడిన హైబ్రిడ్ స్పేస్ మిక్సింగ్ కేఫ్ ఛార్జీ. ఇక్కడ ఓపెన్ మైక్ నైట్స్, ఇండీ బ్రాండ్ పాప్–అప్లు, రైటింగ్ సర్కిల్స్, ఆర్ట్ వర్క్షాప్లు లేదా స్టాండ్–అప్ కామెడీని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు.. కోకాపేట్లోని ది రాబిట్ లాంజ్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా డీజే కిమ్, డీజే సినాయ్లు సందడి చేయనున్నారు. లిక్విడ్ డ్రమ్స్, సాక్సాఫోన్, దర్బూకా.. వంటి వెరైటీ సంగీత పరికరాలు ఆకట్టుకోనున్నాయి. నగర శివార్లలో ఉన్న ఎమ్యూజ్మెంట్ పార్క్స్లో ఫ్రెండ్షిప్ డే వినోదభరితంగా జరగనుంది. శని, ఆదివారాలు రెండు రోజులపాటు వేడుకలు ప్లాన్ చేశారు. వేవ్ పూల్ డీజే సెట్లు, ఫోమ్ పారీ్టలు, ఇంటరాక్టివ్ గేమ్లు సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకూ కొనసాగే నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని థర్డ్ వేవ్ కాఫీలో ‘సొంత ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ తయారు చేసుకోండి’ పేరిట శనివారం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హిప్–హాప్ పార్టీ విత్ జినీ లైవ్ ప్రోగ్రామ్ను సోమాజిగూడలోని ఆక్వా ది పార్క్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. దీని కోసం మిజోరాంకు చెందిన ఆరి్టస్ట్ నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. (చదవండి: సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!) -
ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్ సెట్ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్కు తీసుకురావలనే ప్లాన్లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. -
చంద్రబాబూ.. మీ భుజాలు మీరే చరచుకుంటే ఎట్లా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్లో చేసిన ప్రసంగాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవేనా? నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి నారాయణ తదితరులు ఆరు రోజుల సింగపూర్ పర్యటన పెట్టుకోవడమే ఆశ్చర్యం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం వరకూ ఓకే కానీ.. ఆ సింగపూరే సర్వస్వం అన్నట్లు మాట్లాడటం వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని, దాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమనడం మరీ అతిగా అనిపించింది. సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారట. తాను జైలులో ఉన్నప్పుడు డెబ్బై, ఎనభై, తొంభై దేశాలలో తెలుగు వారు తమ పనులు మానుకుని నిరసనలు తెలిపారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన ఏ కేసులో అరెస్టు అయింది మాత్రం వివరించలేదు. సింగపూర్ అత్యంత నీతివంతమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆ దేశ మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన ఈశ్వరన్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లిన విషయాన్ని విస్మరిస్తే సరిపోతుందా!.సింగపూర్ అవినీతి బాగా తక్కువ ఉన్న దేశం కావచ్చు. కానీ, ఇతర దేశాల అవినీతి డబ్బుకు కేంద్రం అన్న పేరు కూడా ఉంది. సింగపూర్ కంపెనీలు అమరావతికి ఎంతవరకు వస్తాయో డౌటే అంటూనే.. సంప్రదింపులతో పాత ఒప్పందాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని చంద్రబాబు ఈ టూర్కు ముందు చెప్పారు. అంటే మళ్లీ సింగపూర్ కంపెనీలకు 1700 ఎకరాలు కట్టబెట్టి, ఆ భూమి అభివృద్ది కోసం ప్రభుత్వమే రూ.5500 కోట్లు వెచ్చించి, ఆ ప్లాట్ల అమ్మకానికి వారికి అప్పగిస్తారా? తద్వారా వచ్చే ఆదాయంలో 58 శాతం వారికే ఇస్తారా?. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం సింగపూర్ కంపెనీలతో పనేముంది?. ఏపీకి సంబంధించిన పలు సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి కదా!. ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు దేశీ సంస్థలకే ఇచ్చారు కదా!. అందులో తెలుగువారి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. వారు చేయలేని పని ఏదో సింగపూర్ కంపెనీలు చేస్తాయన్నట్లు చంద్రబాబు వంటి సీనియర్ నేత మాట్లాడడమే ఏపీకి పరువు తక్కువ. ఆ దేశ మంత్రితో చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. అమరావతి కోసం కన్సార్షియం ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు కూడా. సాంకేతిక సాయం అందిస్తామని మాట వరసకు అన్నట్లు అనిపిస్తుంది. సింగపూర్ అయినా, మరో దేశం అయినా ఇక్కడ జరిగే నిర్మాణాలలో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటే గౌరవం కాని, మనం వెళ్లి పిలిస్తే లోకువ అవడం లేదా!. దీనిని పక్కనబెడితే సింగపూర్ వెళ్లి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటి?. అది ఏపీ బ్రాండ్ను దెబ్బ తీయడం కాదా!. నిజానికి ఏపీలో ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర పరువును దెబ్బతీశాయి. ప్రతి నిత్యం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ టూర్కు వెళ్లినా ఆంక్షలు పెట్టడం, రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా!. ఈ తరహా నియంతృత్వం ఏపీకి పేరు తెస్తుందా?. అపకీర్తి తెస్తుందా?. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న దందాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న స్కాంలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న తీరు.. ఇవి కదా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేది?. వాటిపై వివరణ ఇవ్వకుండా, జగన్పై ఆరోపణలు చేస్తే ఏమి లాభం?.జగన్ టైమ్లో విధ్వంసం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు కదా!. ఈ 14 నెలల కాలంలో అది ఏంటో ఎన్నడైనా చెప్పారా?. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఆధారాలు చూపారా?. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి రావడం అప్రతిష్ట కాదా!. అప్పులు పుట్టడం లేదంటూనే సుమారు రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్ది. ఆ విషయం సింగపూర్ లేదా ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారికి తెలియదన్న నమ్మకంతో మాట్లాడుతున్నారా?. జగన్ తీసుకు వచ్చిన ఓడరేవులు, వైద్య కళాశాలలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా తదితర సంస్థల భవనాల నిర్మాణం వంటివి ఏపీకి ఉపయోగమా? కాదా?. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓడరేవులు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?. ఏపీకి వచ్చిన వైద్య కళాశాలల సీట్లను కూటమి ప్రభుత్వం ఎందుకు వదలుకుంది?.జగన్ టైమ్లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నోరు వెళ్లబెట్టడం, లేదా అన్నీ చేసేశాం కదా అని దబాయించడం ఏపీకి వన్నె తెచ్చిందా?. ప్రతి ప్రభుత్వం కొన్ని విధానాలు నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం ముందుకు వెళుతుంది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు తన మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఇన్ని హామీలను ఇలా అమలు చేసి ప్రజల ముందు గర్వంగా నిలబడ్డామని చెప్పుకునే పరిస్థితి ఉందా?. అసలు పెన్షన్ రూ.1000 పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన వాగ్ధానాలన్నిటిని ఏడాది ఎగవేసిన విషయం వాస్తవం కాదా?. అది చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చిందా? తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వారిపైనే నిందారోపణలు చేయడం ఎంతవరకు పద్దతి అన్నది ఆలోచించుకోవాలి.సింగపూర్ అయినా మరోచోటికి వెళ్లినా, ఏపీకి ఉన్న సానుకూల అంశాలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా లభించే సహకారం మొదలైన అంశాలు తక్కువ మాట్లాడి, ఎక్కువ భాగం జగన్ దూషణకు కేటాయిస్తే ఎల్లో మీడియాలో బ్యానర్లుగా పనికి రావచ్చేమో కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఉపయోగపడవు. సింగపూర్లో తెలుగు వారు తన వల్లే ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం, అంతకన్నా మించి ఆయన తనయుడు లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే అది చంద్రబాబు ఘనతేనని పొగుడుకోవడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడు కోవడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టవచ్చేమో కానీ, ఆ తర్వాత ఇలా వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారేంటి అన్న ఆలోచన వచ్చి అవహేళనకు గురవుతారని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇలాంటివి అనుభవమైనా ఈ ధోరణి మారడం లేదు. తల్లికి వందనం స్కీంను లోకేశ్ కనిపెట్టారని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. దానికి కారణం జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్కు ఇది కాపీ కావడమే.ఇటీవల ఆయా మీటింగ్లో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు, లోకేశ్లు ప్రకటించగా ఎలా నవ్వులపాలైంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చెబుతున్నాయి. కర్ణాటక మంత్రి బోసు రాజు ఒక ట్వీట్ చేస్తూ ఇప్పటికే కర్ణాటకలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైందని, ఏపీలో తలపెట్టిన దానికన్నా మూడు రెట్లు శక్తిమంతమైందని, ప్రచారం చేసుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ వల్ల చంద్రబాబుకు అపఖ్యాతి వచ్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అబద్దమైనా, నిజమైనా తన గొప్ప తానే ఒకటికి వందసార్లు చెప్పుకుంటే జనం నమ్ముతారన్నది బాబు నమ్మిక. దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలలో "పవర్ కపుల్ పేరొందిన ఈ జంట ఒక్కసారిగా విడిపోయి అందరికి షాకిచ్చారు. సరిగ్గా ఇదంతా చాహల్ భారత జట్టుకు దూరమైన సమయంలోనే జరిగింది.దీంతో చాహల్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోవడంపై చాహల్ తాజాగా స్పందించాడు. విడాకులు తర్వాత వచ్చిన తప్పుడు ఆరోపణలు తనను ఎంతోగానే బాధించాయని చహల్ భావోద్వేగానికి లోనయ్యాడు.ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.."విడాకుల సమయంలో నాపై ఎన్నో నిరాధరమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను మానసికంగా కుంగిపోయాను. ఇక ఈ జీవితం చాలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. గంటలు తరబడి ఏడ్చేవాడిని. దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయాను. నాకు ఇష్టమైన క్రికెట్పై ఏకాగ్రత పెట్టలేకపోయాను. నా స్నేహితుడితో ఆత్మహత్య ఆలోచనలను పంచుకునేవాడిని. చాలా భయపడ్డాను. అందుకే కొద్ది రోజులు క్రికెట్కు దూరంగా ఉన్నాను.నేను ఎప్పుడూ మోసం చేయలేదు.."ధనశ్రీతో విడాకులు తీసున్నాక చాలామంది మోసగాడిగా అభివర్ణించారు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తి తనకు దొరకడు. సోదరీమణులు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వారితో కలిసి పెరిగాను. కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. నా పేరును ఇతరులతో లింక్ చేసి చాలా కథనాలు రాశారు. కేవలం వ్యూస్ కోసం అలా చేశారు" అని రాజ్ షమానీ పాడ్కాస్ట్లో జరిగిన ఇంటర్య్వూలో చాహల్ పేర్కొన్నాడు. కాగా చాహల్-ధనశ్రీ వర్మలు 22 డిసెంబర్ 2020న ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఇద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరికి ముంబైలోని బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్ ప్రస్తుతం ఆర్జే మహ్వాష్తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.చదవండి: #Karun Nair: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్నైట్లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్ అవసరం.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది. ఎయిర్ పోర్టు, మాల్స్లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్బో హార్ట్ ఇన్స్స్టిట్యూట్ -
సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి ఊరట లభించింది. ఆయనపై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. నాంపల్లి స్పెషల్ కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వాఖ్యలను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ క్వాష్ పిటిషన్ అనుమతిచ్చిన హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.కాగా, సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డికి ఊరట లభించింన సంగతి తెలిసిందే.. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం(గత నెల జులై 28) డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు -
సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!
మెటాలిక్ కలర్, మిర్రర్ వర్క్ డ్రెస్లో నటి ఖుషీ కపూర్ హ్యూందయ్ ఇండియన్ కొచర్ వీక్లో మెరిసిపోయారు. డిజైనర్ రిమ్జిమ్ దాదు చేసిన ఈ మోడర్న్ డిజైన్స్కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్గ్రీన్గా నిలిచే కలర్స్కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ను ఆమె తన డిజైన్స్కి జత చేశారు.ఖుషీ కపూర్ ధరించిన కస్టమ్ టెక్ట్స్టైల్ బ్రాకెట్–స్టైల్ బ్లౌజ్, హై–వెయిస్టెడ్ లెహంగా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలలో హైలైట్గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్ను రూపొందించారు. మెటాలిక్ కలర్లోనే స్కర్ట్ అంతా మిర్రర్ వర్క్ చేశారు. బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ను ఆమె తన డిజైన్స్కి జత చేశారు. ఇతర మోడల్స్ ధరించిన డ్రెస్సులను డిజైనర్ దాదు తన బ్రాండ్ సిగ్నేచర్ మెటల్ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్ ఫారమ్స్, స్కల్ప్చర్ డ్రేప్లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్లో పైస్లీ మోటిఫ్లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
క్యాప్ జెమినీలో భారీ నియామకాలు
ఐటీ నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్లో ఈ ఏడాది 40,000-45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ తెలిపారు.భారత్లో 1.75 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ దేశీయ కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. కంపెనీ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు ఆదా, మరిన్ని అవకాశాలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ధోరణి భారత్లో మరింత వ్యాపారాన్ని అందిస్తుంది. సంస్థకు 50కి పైగా కళాశాలలు, క్యాంపస్లతో ఒప్పందాలు ఉన్నాయని, ప్రస్తుత సీజన్కు సంబంధించి నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త నియామకాలు అభ్యర్థుల కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఈడీ సమన్లుడబ్ల్యుఎన్ఎస్తో విలీనంఇటీవల డబ్ల్యూఎన్ఎస్ కొనుగోలు క్యాప్జెమినీకి వ్యూహాత్మకంగా నిలుస్తుందని యార్డీ చెప్పారు. సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ డబ్ల్యూఎన్ఎస్ను నెలకొల్పింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్జెమిని సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఈ రెండు కంపెనీలూ భారత్లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. -
భగవంతుడి సృష్టి
ఈ విశ్వంలో భూమి ఉంది, కాబట్టి మనం ఇక్కడ పుట్టాం. భూమి ఉండటానికి మానవులు ఏమైనా చేశారా? లేదు, ఏదో ఒక శక్తి భూమిని సృష్టించింది. మనం పుట్టిన తర్వాత జీవించటానికి ప్రాణవాయువు అవసరం. ఆ ప్రాణవాయువు ఏర్పడటానికి మానవులేమైనా చేశారా? లేదే! ఏదో ఒక శక్తి దాన్ని పుష్కలంగా లభింపచేసింది. ఈ భూమిపైన ఎప్పుడూ గాఢాంధ కారం ఉండి ఉంటే జీవించటం సాధ్యమా? వెలుతురు ఉండాలి. ఆ వెలుతురు ఉండాలంటే సూర్యుడుండాలి. ఆ సూర్యుడు అక్కడ ఉండటానికి మనుషులు ఏం చేశారు? ఏదో ఒక శక్తి ఆ సూర్యుణ్ణి సృష్టించింది. మనం జీవించటానికి నీరు అత్యంత ముఖ్యం. మరి నీటిని మనుషులెవరైనా చేశారా? ఏదో ఒక శక్తి సముద్రాలను ఏర్పరచి వాటిని నీటితో నిల్వచేసి నిరంతరం మనకు అందుబాటులోనికి తెచ్చి పెడుతున్నది. ఆహారం తీసుకొంటేనే మనం జీవించగలం. మరి ఆ ఆహారాన్ని మనుషులెవరైనా ఏ లోకం నుంచైనా భూమిపైకి తెచ్చిపెట్టి మనకు సరఫరా చేస్తున్నారా?మనం వివేకాన్ని వినియోగించి యోచిస్తే ఇదంతా స్వచ్ఛమైన సత్యమని తెలుస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే గ్రంథం మానవ సమాజానికి శ్రేయస్సును కలిగించేదవుతుంది. ‘అన్నాద్భవన్తి భూతాని, పర్జన్యాదన్న సంభవః.’ అంటే ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, ఆ మేఘము యజ్ఞం వలన కలుగు చున్నది. అంత ముఖ్యమైన యజ్ఞాన్ని జరిపే బాధ్యత అల్పజ్ఞులైన మానవులపై ఉంచక ఆ దైవం ముఖ్యమైన కార్యాలన్నీ తానే జరిపించినట్లే ఆ యజ్ఞాన్ని కూడా ఆయనే జరివిస్తున్నాడని భగవద్గీత చెబుతోంది. ‘తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామి చ’ అంటాడు భగవానుడు. ‘నేను (సూర్య కిరణములను) తపింప చేయుచున్నాను, వర్షమును కురుపించుచున్నాను, వర్షమును నిలుపుదల చేయుచున్నాను. (గీతామకరందము–శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి). మనిషి జీవించ టానికి అవసరమైన భూమి, గాలి, ఎండ, నీరు, ఆహారం అన్నీ ఆ కరుణా మయుడే సమకూర్చాడు. వాటిని కలుషితం చేయకుంటే ఆయురారోగ్యాలు కల్గుతాయి.– రాచమడుగు శ్రీనివాసులు