breaking news
-
జోరు చూపించిన సేవల రంగం
సేవల రంగం జూన్ నెలలో బలమైన పనితీరు చూపించింది. ఇందుకు నిదర్శనంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజెనెస్ యాక్టివిటీ ఇండెక్స్ పది నెలల గరిష్ట స్థాయిలో 60.4 పాయింట్లకు చేరింది. మే నెలలో ఇది 58.8 పాయింట్ల వద్ద ఉంది. స్థానిక మార్కెట్ నుంచే కాకుండా ఎగుమతి మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు దోహదం చేసింది. వ్యయాలు తగ్గడం మార్జిన్ల విస్తరణకు దోహదం చేసినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.2024 ఆగస్ట్ తర్వాత తొలిసారి కొత్త ఆర్డర్లు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. దేశీ మార్కెట్లో కార్యకలాపాలు పెరగడం, ఎగుమతులు వృద్ధి చెందడం మెరుగైన పనితీరుకు సాయపడ్డాయి. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం, యూఎస్ మా ర్కెట్ల నుంచి డిమాండ్ అధికమైందని భండారీ అంచనా వేశారు. వరుసగా 37వ నెలలోనూ జూన్లో ఉపాధి అవకాశాలు పెరిగినట్టు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో వృద్ధి పట్ల 18% సేవల రంగ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. 2022 తర్వాత చూస్తే ఇదే కనిష్ట స్థాయి.ఇదీ చదవండి: ‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’61పాయింట్లకు కాంపోజిట్ ఇండెక్స్తయారీ, సేవల రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ జూన్లో 61 పాయింట్లకు పెరిగింది. మే నెలలో ఇది 59.3గా ఉంది. 14 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. -
ప్రధాని మెచ్చిన రొట్టె!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కర్నాటకలోని కలబుర్గి రొట్టెల గురించి ప్రస్తావించడం ఒక విశేషం అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే కలబుర్గి రొట్టెల ఉత్పత్తి సహకార సంఘానికి 60కి పైగా అమెజాన్ ఆర్డర్లు రావడం మరో విశేషం. కలబుర్గి జిల్లాలోని వందలాది మహిళలకు ఈ సంఘం ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాల మహిళల నుంచి రొట్టెలను సేకరించి ఇ–కామర్స్ ఫ్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తుంటుంది.‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించడం వల్ల ఎంతోమంది పేద మహిళలకు మేలు జరుగుతోంది. ఒకప్పుడు మేమందరం ఇంటిపనులకే పరిమితమయ్యేవాళ్లం. రొట్టెల తయారీ ద్వారా వ్యాపారంలోకి అడుగుపెట్టాం’ అంటుంది కొట్నూరు గ్రామంలోని ‘నంది బసవేశ్వర రొట్టి కేంద్ర’కు చెందిన నింగమ్మ.‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధాని మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. దీని వల్ల మా రొట్టెలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది’ అంటుంది చిట్టాపూర్ గ్రామానికి చెందిన శరణమ్మ. ఆమె ‘మాతా మల్లమ్మ రోటీ కేంద్ర’ నిర్వాహకురాలు.(చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!) -
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్లోని అంబేడ్కర్ నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్ఫోన్కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్లో జూలై 20న పాకిస్తాన్తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్ -
వెస్టిండీస్ రెండో టెస్టు.. 286 పరుగులకు ఆసీస్ ఆలౌట్
సెయింట్ జార్జెస్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ విఫలమైంది. . ఓపెనర్లు సామ్ కొన్స్టాస్ (37 బంతుల్లో 25; 4 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (29 బంతుల్లో 16; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్టీవ్ స్మిత్ (3), కామెరూన్ గ్రీన్ (37 బంతుల్లో 26; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 29; 3 ఫోర్లు) పెవిలియన్కు వరుస కట్టారు. అయితే బ్యూ వెబ్స్టెర్(60), అలెక్స్ కారీ(63) మరోసారి హాఫ్ సెంచరీలతో ఆసీస్ను ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేయగల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు పడగొట్టగా... సీల్స్ రెండు, షామార్ జోసెఫ్, ఫిలిప్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వెలుతురు లేమి కారణంగా తొలి రోజు కేవలం 66.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించనుంది.బ్రాత్వైట్ 100వ టెస్టు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ ఈ మ్యాచ్ ద్వారా వంద టెస్టులు ఆడిన పదో కరీబియన్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ప్రభావంతో జాతీయ జట్టు కన్నా లీగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విండీస్ ప్లేయర్ల మధ్య బ్రాత్వైట్ ఈ ఘనత అందుకోవడం విశేషం.జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా చాలు అనే లక్ష్యంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న బ్రాత్వైట్... సుదీర్ఘ ఫార్మాట్పై మక్కువతో టి20ల జోలికి వెళ్లకుండా ఈ స్థాయికి చేరుకున్నాడు.చదవండి: #Shubman Gill: టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం -
బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే, బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, కీలక పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు నేషనల్ మీడియా(ఇండియా టుడే)లో కథనాలు వెలువడ్డాయి.బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. నిర్మల ముందంజ..అయితే, రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. వనతి శ్రీనివాసన్..తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ కూడా పరిశీలనలో ఉంది. ఆమె ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను ఆమె నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో వనతి మార్క్ కనిపించే అవకాశం ఉంది.పురందేశ్వరిరాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగారు.ఆర్ఎస్ఎస్ ఆమోదంమహిళా నాయకత్వం, ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సుమారు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయతి్నంచాయి.దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు. -
‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’
ఇంజినీరింగ్ కోణంలో భారత్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్గా ఉంటోందని ఏఎండీ జనరల్ మేనేజర్ (డేటా సెంటర్ జీపీయూ వ్యాపార విభాగం) ఆండ్రూ డీక్మాన్ తెలిపారు. టెల్కో దిగ్గజం రిలయన్స్ జియో తదితర సంస్థలు తమ డేటా సెంటర్లలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) ఉపయోగిస్తున్నట్లు వివరించారు. భారత్లో జియో తమకు ముఖ్యమైన భాగస్వామి అని కంపెనీ నిర్వహించిన అడ్వాన్సింగ్ ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.దేశీయంగా ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏఎండీ పోటీ సంస్థ ఎన్విడియాతో జియో జట్టు కట్టిన నేపథ్యంలో ఆండ్రూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఎండీకి భారత్లో 8,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏఐ చాలా పెద్ద మార్కెట్ అని, ఏ ఒక్క సంస్థకో ఇది పరిమితం కాదని ఆండ్రూ చెప్పారు. ఇదీ చదవండి: ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలుప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల ప్రభుత్వాలకు ఏఐపరంగా తోడ్పాటు అందించడంపై ఏఎండీ కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తమ చిప్లు తక్కువ ధరలో మరింత మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏఎండీ సీఈవో లీసా సూ చెప్పారు. -
'ఉప్పు కప్పురంబు' మూవీ రివ్యూ.. డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్
టైటిల్ : ఉప్పు కప్పురంబునటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరినిర్మాణ సంస్థ: అమెజాన్ ప్రైమ్నిర్మాత: రాధిక లావుకథ: వసంత్ మురళీకృష్ణ దర్శకత్వం: ఐవీ శశివిడుదల తేది: జులై 4, 2025స్ట్రీమింగ్: అమెజాన్జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). జులై 4న డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకులు ఐవీ శశి రూపొందించగా.. రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ కథని అందించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక గ్రామంలో శ్మశాన వాటిక కోసం ఏర్పడిన సంక్షోభాన్ని.. అక్కడి ప్రజలు ఏవిధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో ఈ సినిమా సిద్ధమైంది. 1990 నాటి బ్యాక్డ్రాస్ స్టోరీతో వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.కథేంటంటే..‘ఉప్పు కప్పురంబు’ సినిమాకు కథను పరిచయం చేస్తూ హీరో రానా వాయిస్ ఇచ్చారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ' చిట్టి జయపురం' అనే గ్రామానికి పెద్దగా (సుబ్బరాజు) శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే, ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేష్) గ్రామ పెద్దగా కొనసాగుతుంది. వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. అయితే, ఇక్కడ వారిద్దరు కూడా ఒకరిపైమరోకరు ఆధిపత్యం కోసం పోరాడుతూనే అపూర్వను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలా వారు రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక సమస్య వచ్చి పడుతుంది.గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఆ స్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న (సుహాస్) తెలుపుతాడు. అయితే, నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని చిన్న చెబుతాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా అపూర్వ ఎంపిక చేస్తుంది. అయితే, సడెన్గా జరిగిన ఒక ప్రమాదంలో అదేరోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతిపెట్టాక శ్మశానం హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. అయితే, ఆ శ్మాశనంలో ఇంకోకరికి చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడుతాడు. అలా అతను ఎందుకు చేశాడు..? గ్రామానికి తూర్పు దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు..? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులు ఏంటి..? ఫైనల్గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి..? అనేది తెలియాలంటే ఉప్పు కప్పురంబు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. 1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంతో దర్శకుడు ఐవీ శశి చక్కగా చూపారు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగునంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం ఇస్తుంది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకులు ఇలా సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. ఇంత చిన్న పాయింట్తో కూడా సినిమా తీయొచ్చా..? అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్కు కాస్త వినోదం జోడించి తెరపై చూపించడంలో దర్శకుడు ఐవీ శశి విజయం సాధించారు.ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలతో మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో అదరగొట్టింది. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్మురేపింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునేలోపు నలుగురు చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తాడు. కీర్తి సురేశ్ గ్రామ పెద్దగా నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి లాజికల్గా అనిపించవు. ఒక సీన్లో అమాయకంగా కనిపించిన కీర్తి.. మరో సీన్లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సీన్స్ కాస్త తికమకకు గురిచేస్తాయి. కొన్ని సీన్లు మరీ ఓవర్ రియాక్ట్ అయ్యేలా ఉంటాయి. కానీ, ఆమె నటన మాత్రం అదిరిపోతుంది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్గానే ఉంటుంది. ఎక్కడా కూడా తడబాటు లేకుండా సెట్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్యే జరుగుతుంది. కథలో అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తుంది. క్లైమాక్స్లో ఊరి సమస్యకు పరిష్కారం కనుగొన్న తీరు కాస్త ఎమోషనల్గా సీన్ రాసుకోవడం బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కీర్తి సురేశ్ నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెప్పిస్తుంది కూడా..ఎవరెలా చేశారంటే.. ఈ మూవీలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలం. అందుకు తగ్గట్లుగానే ఆమె నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా చాలా రొటీన్గానే ఉంటాయి. కానీ అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఎప్పిటికీ నిలిచిపోతుంది. ఇందులో అమాయకంగా, క్యూట్గా, అల్లరి పిల్లగా, బాధ్యతగల గ్రామ పెద్దగా ఇలా పలు షేడ్స్ ఆమె నటనలో కనిపిస్తాయి. ఒక మంచి పాత్రే కీర్తికి పడింది అని చెప్పవచ్చు.కాటి కాపరి పాత్రలో సుహాస్ మెప్పించాడు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు.'నిజం' సినిమాలో మహేశ్బాబుకు అమ్మగా నటించిన తాళ్లూరి రామేశ్వరికి ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పడింది. ఈ మూవీతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావచ్చని చెప్పొచ్చు. బాబు మోహన్, శత్రు తమ పాత్రల మేరకు మెప్పించారు. సంగీతం, సినిమాటోగ్రాఫర్ ఈ మూవీకి బలాన్ని చేకూర్చాయి. మూవీ నిర్మాణ విలువలు బడ్జెట్కు మించే ఉన్నాయని చెప్పవచ్చు. 'ఉప్పు కప్పురంబు' ఓటీటీలో ఎవరినీ నిరుత్సాహపరచని సినిమాగా తప్పకుండా మిగిలిపోతుంది. -
ఇంగ్లండ్తో మూడో టీ20.. తొలిసిరీస్ విజయంపై భారత్ కన్ను
ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత మహిళల జట్టు మొదట సన్నాహకంగా ఈసీబీ డెవలప్మెంట్ టీమ్తో రెండు మ్యాచ్లాడింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ హర్మన్ప్రీత్ బృందం ఓడింది. అయితే అసలైన సిరీస్ మొదలుకాగానే అమ్మాయిల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా ఓడిన జట్టే... ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్ల్ని గెలిచింది. ఇక ‘హ్యాట్రిక్’తో ఇంకో రెండు మ్యాచ్లుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ గడ్డపై అమ్మాయిలు సాధించే తొలి టి20 సిరీస్ కానుంది. మరోవైపు సొంతగడ్డపై వరుస పరాభవాల భారం ఒత్తిడి పెంచగా... తాజాగా అనుభవజ్ఞురాలైన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ గాయంతో కీలకమైన మూడో మ్యాచ్కు దూరమైంది. ఇది ఆతిథ్య జట్టుకు మరింత ప్రతికూలమవగా... సిరీస్ను గెలిచేందుకు భారత్కు అనుకూలతనీయనుంది. రెగ్యులర్ కెపె్టన్ గైర్హాజరీతో టామీ బ్యూమౌంట్ జట్టును నడిపించనుంది. బ్రంట్ స్థానంలో మైయా బౌచియెర్ను ఎంపిక చేశారు. జోరుమీదున్న భారత్ విజయాలిచ్చి ఉత్సాహం, బ్యాటర్ల ఫామ్తో భారత అమ్మాయిల జట్టు జోరుమీదుంది. తొలి మ్యాచ్లో స్మృతి మంధాన చెలరేగితే... గత మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్, అమన్జోత్ కౌర్ బ్యాటింగ్ బాధ్యతను పంచుకున్నారు. రిచా ఘోష్ కూడా మెరుపులు మెరిపించింది. వీరితో పాటు షఫాలీ వర్మ, దీప్తి శర్మలు కూడా ఫామ్లో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. బౌలింగ్లో తెలుగమ్మాయి శ్రీచరణి నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేస్తోంది.తొలి మ్యాచ్లో 4 వికెట్లు తీసిన ఆంధ్ర స్పిన్నర్, రెండో మ్యాచ్లో రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచింది. దీప్తి శర్మ, అమన్జోత్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి కూడా బౌలింగ్లో ఆకట్టుకుంటున్నారు. ఇన్ని సానుకూలాంశాల మధ్య మూడో విజయం సాధించడం హర్మన్ప్రీత్ బృందానికి ఏమంత కష్టం కానేకాదు. అన్నింటికి మించి ఆల్రౌండ్ సత్తాతో ఆతిథ్య జట్టును చిత్తు చేస్తున్న తీరు వచ్చే ఏడాది ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్కు ఎంతగానో దోహదం చేసే అవకాశాలున్నాయి. గెలిస్తేనే నిలిచేది! వరుస వైఫల్యాలకు తోడు రెగ్యులర్ కెపె్టన్ బ్రంట్ గాయంతో ఈ మ్యాచ్కు దూరమవడం ఇంగ్లండ్ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతోంది. పర్యాటక బ్యాటర్లేమో చెలరేగుతుంటే... సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. గెలిస్తేనే సిరీస్లో నిలిచే దశలో ఒత్తిడిని తట్టుకొని ఏ మేరకు నెట్టుకురాగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలి టి20లో ఆడిన బ్రంట్ అందుబాటులో లేదు. రెండు మ్యాచ్లో బ్యూమౌంట్ రాణించింది. వీరిద్దరు మినహా ఇంకెవరూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. మూడో మ్యాచ్లోనూ ప్రత్యర్థి బౌలర్లదే పైచేయి అయితే మాత్రం మాంచెస్టర్ (నాలుగో మ్యాచ్ వేదిక) వెళ్లకముందే ఇక్కడే సిరీస్ను కోల్పోవడం ఖాయం. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, అమన్జోత్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతి, స్నేహ్ రాణా, శ్రీచరణి.ఇంగ్లండ్: టామీ బ్యూమౌంట్ (కెప్టెన్), సోఫియా, డానీ వ్యాట్, మైయా బౌచియెర్, అమీ జోన్స్, అలైస్ క్యాప్సీ, అర్లాట్, సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్, లిన్సే స్మిత్. -
మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్ ఎప్పుడిస్తారు!
సి.బెళగల్: ‘యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్ రాలేదు. పింఛన్ ఎప్పుడిస్తారు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్లో టీడీపీ నాయకులు గురువారం తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.అదే విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా, ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలు
వచ్చే మూడేళ్ల పాటు వరుసగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మ్యాటర్ మోటర్ వర్క్స్ గ్రూప్ సీవోవో అరుణ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తమ ఎలక్ట్రిక్ గేర్డ్ బైక్ ‘ఏరా’ (ఏఈఆర్ఏ)ని ఢిల్లీ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 60 డీలర్షిప్లను ప్రారంభించనున్నామని, వీటిలో అత్యధిక భాగం దక్షిణాదిలోనే ఉంటాయని సింగ్ వివరించారు.ఇదీ చదవండి: ఐపీవోకు మీషో రెడీప్రస్తుతానికి తాము మోటర్సైకిల్స్పైనే దృష్టి పెడుతున్నాయని, ఎలక్ట్రిక్ స్కూటర్ల యోచన లేదని చెప్పారు. తమ తొలి మోడల్ ఏఈఆర్ఏని ఆరేళ్ల పాటు రూపొందించామని, గతేడాది అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభించామని వివరించారు. తొలి ఏడాదిలో 10,000తో మొదలుపెట్టి రెండో ఏడాది 50,000–60,000 వరకు వాహనాలను విక్రయించే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్లోని తమ ప్లాంటుకు ప్రతి నెలా 10,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉందని సింగ్ తెలిపారు. -
ఐపీవోకు మీషో రెడీ
ఫ్యాషన్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల ఈకామర్స్ కంపెనీ మీషో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సాఫ్ట్బ్యాంక్కు పెట్టుబడులున్న కంపెనీ గోప్యతా విధానంలో ముందస్తు ఫైలింగ్ను చేపట్టినట్లు తెలుస్తోంది. గత నెల 25న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఐపీవోకు ప్రాస్పెక్టస్ దాఖలుపై నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. లిస్టింగ్ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి.స్టాక్బ్రోకర్గా వన్ మొబిక్విక్సెబీ నుంచి గ్రీన్సిగ్నల్స్టాక్ బ్రోకర్, క్లియరింగ్ సభ్యులుగా వ్యవహరించేందుకు పూర్తి అనుబంధ సంస్థ మొబిక్విక్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ (ఎంఎస్బీపీఎల్)కు అనుమతి లభించినట్లు మాతృ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 జులై1న సెబీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలియజేసింది. వెరసి ఎంఎస్బీపీఎల్ దేశీ స్టాక్ బ్రోకర్గా కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, క్లియరింగ్, ఈక్విటీ లావాదేవీల సెటిల్మెంట్లు చేపట్టనున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదుతాజా లైసెన్స్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లో సంపద పంపిణీ(వెల్త్ డి్రస్టిబ్యూషన్) విభాగంలో సేవలు మరింత విస్తరించేందుకు వీలుంటుందని తెలియజేసింది. తద్వారా సమీకృత ఫిన్టెక్ సంస్థగా అవతరించనున్నట్లు పేర్కొంది. మొబిక్విక్ గ్రూప్ అనుబంధ సంస్థ జాక్ ఈపేమెంట్ సర్వీసెస్(జాక్పే).. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా సేవలందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. -
టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం
"ఈ సిరీస్లో నేను బెస్ట్ బ్యాటర్గా నిలుస్తా.. కెప్టెన్గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.ఎవరైతే అతడిని కెప్టెన్గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.జయహో నాయక..ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్కు సరిగ్గా సరిపోతుంది.తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్బాస్టన్లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటిలో సచిన్, కోహ్లి.. భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్బర్గ్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు. విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్బ్లాస్టర్ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్ఎఫ్( MRF) బ్యాట్తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.పట్టు బిగిస్తున్న భారత్..ఇక ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. -
‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#Thammudu Review : A Good emotional Ride with Solid Production values - 3/5 💥💥💥Mainly Youth Star ⭐️ @actor_nithiin has given one of the career best performance 🔥🔥🔥💥💥 with a good comeback film 🎥👍❤️🔥 #Nithiin Director #SriramVenu Handled the subject very well with… pic.twitter.com/Xy0CFOvlKH— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025 తమ్ముడు సినిమాలో విలువలతో పాటు మంచి ఎమోషన్ పండించే సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నితిన్ కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బీజీఎమ్ బాగుంది. క లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. Second half has excellent fight sequences…fans ki full meals aa fight sequences…Overall good movie. One time watch.Must in Theaters.#Thammudu @actor_nithiin https://t.co/ZHf0uZ0tr2— Mythoughts 🚩 (@MovieMyPassion) July 4, 2025 ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్లో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతాయి. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్లా ఫైట్ సీక్వెన్స్ తీర్చిదిద్దారు. ఓవరాల్గా తమ్ముడు గుడ్ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. కచ్చితంగా థియేటర్స్లో చూడాలి’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025బిలో యావరేజ్ సినిమా ఇది. రెండు ఫైట్ సీక్వెన్స్ మినహా సెకండాఫ్ అంతా బోరింగ్గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్ అయింది. వేణు శ్రీరామ్ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish! Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…— Venky Reviews (@venkyreviews) July 4, 2025 విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా.ఆ పాత్ర తాలుకు సంఘర్షణ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం బాగుంది. సెకండాఫ్లో ఒక సీన్ బాగుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదంటూ మరో నెటిజన్ 1.75 రేటింగ్ ఇచ్చాడు.#Thammudu is a super knit commercial movie.First half starts a bit slow and the director takes his own time to establish the plot. There’s no looking back from the pre-interval to the superb INTERVAL BANG 💥.Post interval scenes are the major highlights of the movie.3.5/5— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) July 4, 2025#thammudu First Half Review: Starts off with a familiar setup and unfolds at a slow pace, especially during the forest portions. The drama and stakes feel underwhelming so far. Hoping the second half picks up and delivers better.#ThammuduTrailer #nithin #DilRaju— Dingu420 (@dingu420) July 4, 2025 -
నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేలింది. వరంగలకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాల తీసుకున్నట్లు సమాచారం.ఈ స్కాంలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్గఢ్కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేసినట్లు తేలింది. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సీబిఐ గుర్తించింది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు రూ.60 లక్షలు ముట్టజెప్పినట్లు సీబీఐ గుర్తించింది. -
జపాన్లో వరుస భూకంపాలు.. తత్సుకీ మెగా సునామీ సంకేతమా?
టోక్యో: వరుస భూకంపాలు జపాన్లోని మారుమూల ద్వీపాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. ఏ క్షణం ఏం జరగుతుందోని ఆందోళనతో రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండటంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలను ఎదుర్కొంటుంది. కాగా, 12 టోకారా దీవులలో ఏడింటిలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవులలో కొన్నింటిలో ఆసుపత్రులు లేవు. ప్రిఫెక్చురల్ రాజధాని కగోషోమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం ఆరు గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్హౌస్లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ, ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు వస్తున్నాయి. 🌏 Current Earthquake Swarm ongoing south of Southern mainland #Japan near Tatsugō.Several M 4.5+ events - could portend a stronger #earthquake to come, and the region should be monitored closely 👀⚠️ This is one of the riskiest world areas in JULY 2025 because of this. pic.twitter.com/K0dmPQZMrP— Weather & Earth 25 (@Weather_Earth25) July 2, 2025ఇదిలా ఉండగా.. శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దీంతో, శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో ట్రండింగ్లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరమ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’ అంటూ వర్ణించారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్కు చెందిన మాంగా ఆర్టిస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. -
రెండు గంటల్లో.. ‘వెనకడుగు..’ మంత్రి, ఎంపీలకు చేదు అనుభవం
జరుగుమల్లి (సింగరాయకొండ): కూటమి ప్రభుత్వ హామీల అమలు, అవకతవకలపై అడుగడుగునా మహిళలు నిలదీయడంతో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు చేదు అనుభవం ఎదురైంది.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో గురువారం తొలిరోజు ప్రారంభమైన ‘తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా నాయకులు జరుగుమల్లి మండల కేంద్రానికి వచ్చారు.‘అయ్యా.. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాపకు మాత్రమే తల్లికి వందనం నగదు పడింది.. మిగతా వారికి పడలేదు’ అని మహిళ అడగ్గా, ‘మాకు గ్యాస్ డబ్బులు పడలేదు’ అంటూ మరికొందరు నిలదీశారు. ‘సార్.. నాకు ఇంటి స్థలం ఉంది.. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు కాలేదు’ అని మరో మహిళ ఆగ్రహం వ్యక్త చేసింది. -
జీవితంలో ఏం సాధించానో ఇప్పుడే తెలిసొచ్చింది: సమంత
నటి సమంత రూటే వేరు. తనకు నచ్చినట్లు ప్రవర్తించే నటీమణుల్లో ఈమె ముందుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ సోషల్మీడియాతో తన అభిమానులకు ఆమె టచ్లో ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని ఆమె పంచుకుంటారు. విడాకులు, మయోసైటిస్ ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి కూడా అందులో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా తాను ఎవరూ..? ఎంత పెద్ద సెలబ్రిటీ..? జీవితంలో ఏం సాధించానో తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.విడాకులు పొందిన సమంత ఆ తరువాత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై దాని నుంచి బయట పడటానికి పెద్ద పోరాటమే చేశారు. అలా చాలా కాలం నటనకు దూరం అయిన ఈమె మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అలా వెబ్ సిరీస్లో నటించిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తి శుభం అనే చిత్రాన్ని నిర్మించారు కూడా. ఇలా నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్గా ఉంటున్న సమంత తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో టీట్ చేశారు. అందులో తన చేతిలో ఎప్పుడూ సెల్ఫోన్ ఉంటుందన్నారు. దీంతో సడన్గా తనకొక ఆలోచన వచ్చిందనీ, దీంతో వెంటనే తన సెల్ఫోన్ను మూడు రోజుల పాటు స్విచ్చ్ ఆఫ్ చేసినట్లు చెప్పారు. ఆ మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదనీ, ఎవరినీ చూడలేదనీ, పుస్తకాలు చదవడం, రాయడం వంటివేవీ చేయలేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ పని చేయలేదన్నారు. అలా మూడు రోజులు మెదడుకు పూర్తిగా విశ్రాంతినిచ్చినట్లు చెప్పారు. ఆ అనుభవం చాలా కొత్తగా ఉందన్నారు. తన ఈగోలో చాలా భాగం తన సెల్ఫోన్తోనే అన్నది అప్పడు అర్థం అయ్యిందన్నారు. తాను ఎవరూ? ఎంత సెలబ్రిటీనీ? ఏం సాధించాను? అన్న విషయాలు తన సెల్ఫోన్నే చెబుతుందన్నారు. అది లేని రోజున తాను ఒక సాధారణ జీవినని అనే భావన కలిగిందన్నారు. పుట్టుకకు గిట్టుటకు మధ్య కాలంలో సెల్ఫోన్ మనకు ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన పెద్దలకు, ఆరోగ్యానికి సెల్ఫోన్ ఎంత ఆటంకంగా మారిందన్నది అవగతం చేసుకున్నానని నటి సమంత అన్నారు. ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ట్రంప్ భారీ విజయం.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సభ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల సాకారమైంది. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు గ్రీన్సిగ్నల్ లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో, ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్ విజయం సాధించారు.అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక, అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు. ✅ The House of Representatives just officially PASSED the One Big Beautiful Bill.The largest middle-class tax cut in American history — and so much more — is on its way to President Trump's desk.MAGA! pic.twitter.com/V3U8xhenrS— Rapid Response 47 (@RapidResponse47) July 3, 2025ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అమెరికా కాంగ్రెస్లో అధికారికంగా ఆమోదం పొందడంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పన్ను తగ్గింపులు, రక్షణ, సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు.The One Big Beautiful Bill:✅ Passed ✅ Signed ✅ Heading to President Trump’s desk to become lawMuch-needed and much-deserved relief for hardworking Americans is on the way! pic.twitter.com/zoh2dKlfO5— Speaker Mike Johnson (@SpeakerJohnson) July 3, 2025ట్రంప్ ఆనందం.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు. తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉంది. ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వైట్ హౌస్లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను, సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం. అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jul 03, 2025, 6:15 PM ET )The Republicans in the House of Representatives have just passed the “ONE BIG BEAUTIFUL BILL ACT.” Our Party is UNITED like never before and, our Country is “HOT.” We are going to have a… pic.twitter.com/qR2Dql3IYh— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) July 3, 2025బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు..2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.వలస నియంత్రణపై ఫోకస్...ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.ఆరోగ్య పథకంలో భారీ కోతలుతక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు. రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు. -
ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు.ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరో లారీ వరంగల్ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. -
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్ఫుల్ లుక్తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్సెల్స్తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్సెల్స్కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్డీఏ లేదా సీడీఎస్సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
కుంటు‘బడి’న చదువులు!
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని ఓ మోడల్ ప్రైమరీ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వం నలుగురు టీచర్లు, ఒక హెచ్ఎంను కేటాయించింది. ఇందులో ఇద్దరు టీచర్లను బదిలీపై ఇక్కడ నియమించగా, వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. అయితే రిలీవర్లు లేక వారు పాత స్కూల్లోనే కొనసాగుతున్నారు. ఈ మోడల్ ప్రైమరీ స్కూలులో ఐదుగురు టీచర్లు ఉన్నా, పనిచేస్తున్నది ముగ్గురే. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత రాష్ట్రంలో వేలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి: సర్కారు బడిలో చదువులు చతికిలపడ్డాయి. అస్తవ్యస్త బదిలీలతో బోధన కుంటుపడింది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూళ్లలో నియమించిన టీచర్లు కొత్త పోస్టులో బాధ్యతలు తీసుకున్నా, వారు పాత పాఠశాలల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా స్కూళ్లలో అధికారికంగా టీచర్లను నియమించినా, గతేడాది ఉన్న పరిస్థితే కొనసాగుతోంది. గత నెలలో పాఠశాల విద్యాశాఖలోని దాదాపు 67వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. వీరిలో 6వేల మందికి పీఎస్ హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు.అయితే, వీరు పదోన్నతులు తీసుకున్నా... పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక అవస్థలు మొదలయ్యాయి. దాదాపు 40శాతం మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్టు చేసి, తిరిగి పాత స్కూళ్లలోనే కొనసాగుతున్నారు. వచ్చే నెలలో విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు జరగనున్నాయి. కానీ, ఇక్కడ స్కూళ్లల్లో చదువు చెప్పేవారు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. డీఎస్సీ తర్వాతా కష్టమే? పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీల్లో 67వేల మంది టీచర్లకు స్థానచలనం కల్పించింది. వీరిలో ఎస్జీటీలు 31వేల మంది, స్కూల్ అసిస్టెంట్లు 28వేలు, ఎంపీఎస్ హెచ్ఎంలు 5,717, గ్రేడ్–2 హెచ్ఎంలు 1,500, భాషా పండితులు 1,199, పీఈటీలు 344 మంది ఉన్నారు. వీరిలో ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి పొందినవారు రిలీవర్లు లేక పాత పోస్టుల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేశాక పదోన్నతులు పొందినవారు రిలీవ్ అవుతారని విద్యాశాఖ ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం16,437 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించింది. ఖాళీలు అంతకు రెట్టింపు ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఖాళీలు 700 ఉండగా, నోటిఫైడ్ పోస్టులు 200 నుంచి 250 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నోటిఫైడ్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, మిగిలిన ఖాళీల పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొత్త టీచర్లను ఇప్పుడు బదిలీ అయినవారి స్థానాల్లో నియమిస్తారా? లేక పూర్తిగా ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమిస్తారా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొత్త టీచర్లతో ఖాళీలను భర్తీ చేస్తే, బదిలీ అయిన టీచర్లు పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. వచ్చేవారం డీఎస్సీ తుది ‘కీ’డీఎస్సీ–2025 పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. మొత్తం 66 పేపర్లలో సగానికి పైగా పేపర్లకు ప్రాథమిక కీ ప్రకటించగా, కొన్నింటికి సోమవారం నాటికి ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ ‘కీ’ని వచ్చే వారాంతానికి విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దానిపైనా అభ్యర్థులకు 10 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తీసుకుని ఈ నెల 25 నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఆగస్టులో అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
ఇంటర్ బోర్డ్ ఎత్తేద్దామా?
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను ఒకే గొడుగు కిందకు తేవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇంటర్ బోర్డ్ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను రాష్ట్రాల ముందు ఉంచింది. తాజాగా ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. జాతీయ విద్యా విధానం అమలే ఎజెండాగా జరిగిన ఈ సమావేశంలో ఇంటర్, టెన్త్ బోర్డుల విలీనపై చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల్లోని విద్యా విధానాలు, పరిస్థితులను కేంద్ర అధికారులు వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రతిపాదనకు సహకరించాలని కోరారు. ఈ చర్చల సారాంశాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సీఎం కార్యాలయానికి గురువారం తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రాల్లోనూ కేంద్ర విధానం..! కేంద్ర విద్యా సంస్థల్లో 12వ తరగతి వరకు బోర్డ్ ఒకటే ఉంటుంది. బోధనాంశాలు, నిర్వహణ, నిర్ణయాలు అన్నీ ఒకేరకంగా ఉంటాయి. రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. పాఠశాలల్లో పదో తరగతి వరకే బోధన ఉంటుంది. టెన్త్ ఉత్తీర్ణులు ఇంటర్ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంటర్ బోర్డ్ పరిధిలోకి విద్యార్థి వస్తాడు. కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థల మధ్య ఈ తేడా సరికాదన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉద్దేశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే బోర్డ్ పరిధిలోకి స్కూల్, ఇంటర్ విద్యను తేవాలని కేంద్రం సూచించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్స్ విధానం అనుసరిస్తున్న నేపథ్యంలో 12వ తరగతి వరకు ఈ విధంగానే ఉండాలనే ప్రతిపాదన చేస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం కూడా హెచ్ఎస్ఎల్సీ ఉండేది. 12వ తరగతి వరకు ఒకటే స్కూల్లో బోధన చేసేవారు. ఆ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లేవాళ్లు. డ్రాపౌట్స్ తగ్గించవచ్చా? ఒకే బోర్డ్ పరిధిలో 12వ తరగతి వరకు ఉండటం వల్ల విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించవచ్చని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల మందికిపైగా టెన్త్ పరీక్షలో అర్హత సాధిస్తున్నారు. ఇంటరీ్మడియట్ రెండు సంవత్సరాల తర్వాత ఉత్తీర్ణులయ్యేవారు 4 లక్షల లోపే ఉంటున్నారు. వీళ్లలో 3 లక్షల మంది ఉన్నత విద్యకు వెళ్తున్నారు. టెన్త్ నుంచి ఇంటర్కు వెళ్లే విద్యార్థులు మధ్యలోనే విద్య మానేస్తున్నారా? లేదా ఇంకేమైనా నేర్చుకుంటున్నారా? అనే సమగ్ర వివరాలు విద్యాశాఖ వద్ద లేవు. ఇటీవల సీఎం సమీక్షలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఒకే క్యాంపస్లో 12వ తరగతి వరకు విద్యార్థి కొనసాగితే మధ్యలో మానేసే అవకాశం ఉండదని కేంద్రం భావిస్తోంది. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోనే టెన్త్, ఇంటర్ బోర్డులు వేర్వేరుగా ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డ్ కాకుండా సెకండరీ గ్రేడ్ విద్యా విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల డ్రాపౌట్స్ తగ్గుతున్నాయని కేంద్ర విద్యా శాఖ రాష్ట్రాలకు తెలిపింది. నిర్ణయం చెబుతాం ఒకే బోర్డ్ ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. సమావేశంలో వాళ్లు చెప్పిన అంశాలన్నీ విన్నాం. సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి వివరిస్తాం. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. త్వరలో సమావేశ వివరాలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తాం. – డాక్టర్ నవీన్ నికోలస్, పాఠశాల విద్య డైరెక్టర్. -
మీకు భూములిస్తే మేం అడుక్కు తినాలి
తాడికొండ: ‘ఇంతకు ముందు భూములిచ్చిన రైతులకే న్యాయం జరగలేదు. వాళ్లకిచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడంలేదు. పన్నెండేళ్ల క్రితం భూములు ఇచ్చిన వాళ్లకే దిక్కులేనప్పుడు మాకెలా న్యాయం జరుగుతుంది? మా జోలికెలా వస్తారు’ అంటూ రాజధాని రెండో దశ భూ సమీకరణకు అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభలలో అన్నదాతలు విరుచుకుపడ్డారు. మీకు భూములిస్తే మేం అడుక్కు తినాల్సిందేనని అన్నారు. మీరిచ్చే రూ. 30 వేల కౌలు దేనికి సరిపోతుందని నిలదీశారు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం తినాలని ప్రశ్నించారు.ఉచిత విద్య, వైద్యం అంటున్నారని, రైతుల పొట్టకొట్టి పెట్టిన విద్యా సంస్థల్లో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఎల్కేజీకి రూ.30 వేలు ఫీజులు చెల్లించాలని, ఇక విట్, ఎస్ఆర్ఎం వంటి యూనివర్శిటీల్లో ఏడాదికి రూ.7 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారని చెప్పారు. భూములిచ్చిన మాకు ఏం న్యాయం చేసినట్టు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాడికొండ మండలం పాములపాడు, బేజాత్పురం , రావెల గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎదుటే భూములివ్వబోమని తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో పరిమితికి మించి భూములు తీసుకుంటే మా పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. బేజాత్పురంలో రైతులపై టీడీపీ నేతల దుర్మార్గంబేజాత్పురం గ్రామ సభలో భూములివ్వబోమని మెజార్టీ రైతులు తేల్చిచెప్పారు. ఆ రైతులతో టీడీపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. అయినా భూములను ఇచ్చేది లేదని రైతులు కుండ బద్దలు కొట్టారు. రావెల గ్రామంలో పూలింగ్కు భూములు ఇవ్వబోమంటూ రైతులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. 12 ఏళ్ల క్రితం ఇచ్చిన వారికే దిక్కు లేదని, మిమ్మల్ని నమ్మి భూములిస్తే అడుక్కు తినాల్సి వస్తుందని అన్నారు. 2016లో రుణ మాఫీ చేస్తానని ఇచ్చిన బాండ్ చూపించి, ఇది అమలు చేయలేదు, మళ్ళీ ఎలా నమ్మాలని ఓ రైతు గట్టిగా నిలదీశారు.ముందుగా చేసిన సంతకాలతో టీడీపీ నేతల అంగీకార పత్రాలుగ్రామ సభల్లో టీడీపీ నాయకులు ఒకే తరహా అంగీకారపత్రాలు ఇచ్చారు. ఒకే నమూనా పత్రం ప్రింట్ చేయించి, కేవలం గ్రామం పేరు మాత్రమే మార్చి, ముందుగానే కొందరితో సంతకాలు చేయించారు. వాటినే ఎమ్మెల్యే చేతికిచ్చి అంగీకారం అంటూ చదివి వినిపిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం భూమి సరిపోయింది.. మళ్లీ ఎందుకు?ప్రభుత్వం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రకారం తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల రైతులకు ఉన్న భూమి 45 వేల ఎకరాలు సరిపోయింది కదా ఇప్పుడు అదనంగా భూములు ఎందుకు సమీకరిస్తున్నారని ఓ రైతు గట్టిగా ప్రశ్నించారు. దీనికి అధికారులు, ఎమ్మెల్యే సమాధానం దాటవేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్డీవో శ్రీనివాసరావు బదులిస్తూ.. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వచ్చేమో అని అనడంతో భూ సమీకరణపై రైతుల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ గ్రామ సభల్లో సర్పంచ్ రావెల శైలజ, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ మెహర్ కుమార్, ఎంపీడీవో కె సమతావాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
హలో మేడం.. ఈ ఫైలింగ్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో విద్యార్థులు తికమక పడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో సవాలక్ష సందేహాలొస్తున్నాయి. దీంతో ఎప్సెట్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఇంజనీరింగ్తోపాటు పాలిసెట్, ఇతర సాంకేతిక కోర్సుల కోసం సాంకేతిక విద్యామండలి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఈ–మెయిల్స్ కూడా స్వీకరిస్తున్నారు. మరోవైపు క్యాంపు కార్యాలయంలో అనుమానాలు నివృత్తి చేసే ఏర్పాట్లూ చేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ విరామం లేకుండా ఫోన్కాల్స్ వస్తున్నాయి. రోజుకు కనీసం ఆరువందలకు తగ్గకుండా ఫోన్ కాల్స్, వందల కొద్దీ ఈ–మెయిల్స్ అందుతున్నాయి. క్యాంపు కార్యాలయానికీ రోజుకు వంద మంది వరకూ వస్తున్నారు. వీరందరికీ సమా ధానం చెప్పేందుకు ప్రత్యేక సిబ్బందిని నియ మించారు. ఫోన్కాల్స్, మెసేజ్, మెయి ల్స్కు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశాలపై వారికి ముందే శిక్షణ ఇచ్చారు. ఎన్నో అనుమానాలుటోల్ ఫ్రీ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని క్యాంప్ కార్యాలయ అధికారులు తెలిపారు. షెడ్యూల్ విడులైన తర్వాత స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్కు సంబంధించిన విధివిధానాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది అప్లికేషన్లు నింపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఏదైనా డేటా తప్పుగా ఇస్తే సరిచేస్తారా అని ముందే ప్రశ్నిస్తున్నారు. కుల ధ్రువీకరణ, ఆదాయ పత్రాలను ఎలా పొందాలని, ఎప్పుడు తీసుకున్నవి చెల్లుతాయని అడుగుతున్నారు. ప్రతీ దశలోనూ స్లాట్ బుక్ చేసుకోవాలా అనే ప్రశ్నలు వేస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎక్కడకు వెళ్లాలి? ఏఏ సరి్టఫికెట్లు తీసుకెళ్లాలని కొంతమంది అడుగుతున్నారు. స్లాట్ బుకింగ్, ఆప్షన్ల సమయంలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఆప్షన్లు మొదలు కాకున్నా, ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని? ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది స్లాట్ బుకింగ్ కోసం ఏ గేట్ వే ద్వారా డబ్బులు చెల్లించాలని, మరికొంతమంది గేట్ వే ద్వారా చెల్లిస్తుంటే ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ క్యాంపు కార్యాలయం సిబ్బంది ఓపికగా సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచీ ఫోన్లు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి నాన్–లోకల్ తీసివేయడంతో తాము ఏ కేటగిరీ కింద సీటు పొందొచ్చని ప్రశ్నిస్తున్నారు. కాల్ సెంటర్కు మంచి స్పందన వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. కౌన్సెలింగ్కు వెళ్లే విద్యార్థి ప్రతీ సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నారు. ఇది మంచి స్పందనే. సాంకేతిక విద్య వెబ్లోకి వెళ్తే ఎప్సెట్ కౌన్సెలింగ్ వివరాలు తెలుస్తాయి. అంతేకాదు, గత ఏడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వచ్చాయనేది అందుబాటులో ఉంచాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ టోల్ ప్రీ నంబరులో సిబ్బంది అందుబాటులో ఉంటారు. 7660009768– 79 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. – శ్రీనివాస్, ఎప్సెట్ క్యాంప్ ఆఫీసర్ ప్రతీ సందేహానికి సమాధానం విద్యార్థులు ఫోన్లో కౌన్సెలింగ్కు సంబంధించిన అనేక సందేహాలు అడుగుతున్నారు. మేం ఇచ్చే సమాధానాల తర్వాత సంతృప్తి చెందుతున్నారు. కొన్నిసార్లు స్లాట్ బుకింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిని నివృత్తి చేస్తున్నాం. తిరిగి లాగిన్ అయ్యేలా చేస్తున్నాం. – శ్యామల, టోల్ ఫ్రీ నంబర్ సిబ్బంది మెయిల్స్ అన్నీ పరిశీలిస్తాం రోజూ వందల్లో మెయిల్స్ వస్తున్నాయి. విద్యార్థులు అడిగే ప్రశ్నల్లో కొన్నింటికీ ఎప్సెట్ వెబ్సైట్లో సమాచారం ఉంటుంది. ఆ లింక్ను వారికి పంపుతున్నాం. సాంకేతిక సమస్యలు ఉంటే ఆయా విభాగాలకు పంపి, తక్షణమే పరిష్కరించేలా చేస్తున్నాం. – నవ్య, ఈ–మెయిల్స్ పరిశీలించే ఉద్యోగి -
బాధ్యత పట్టని ఏపీ ప్రభుత్వం!
శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం పాలకడియం గ్రామానికి చెందిన వెంకటేశ్ సిగాచీ పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్. మూడురోజుల కిందట జరిగిన పేలుడు ఘటనలో అతడు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రోజులు గడుస్తున్నా తన కొడుకు మృతదేహాన్ని అప్పగించని పరిస్థితి. దీంతో మృతుని తండ్రి చిన్నారావు ఆవేదనకు అంతులేదు. హెల్ప్డెస్క్ వద్ద, మార్చురీ వద్ద తమ బిడ్డ మృతదేహం కోసం పడరాని కష్టాలు పడుతున్నాడు.సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ దుర్ఘటనలో మరణించిన, క్షతగాత్రులైన బిహార్, ఒడిశా కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల బృందాలను పంపింది. కానీ ∙ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తరహా చొరవ చూపడం లేదు. ఈ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు దగ్గరుండి తమ రాష్ట్రాల బాధిత కుటుంబాలకు సహాయమందిస్తుంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క అధికారి కూడా అటువైపు తొంగిచూడలేదు. దీనిపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుల తరబడి నిరీక్షణఏపీకి చెందిన మృతుల్లో విజయనగరం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు చెందిన వారున్నారు. అయితే గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాల అప్పగింత ప్రహసనంగా మారింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాలు ఇంకా అందక ఆయా కుటుంబాలు పాశమైలారం పారిశ్రామిక వాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వారిని కోల్పోయిన దుఖం కంటే.. కడసారి చూపు కోసం వారు పడుతున్న బాధ వర్ణణాతీతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబాలు కన్నీరు ఇంకిన కళ్లతో వేచి చూస్తున్నాయి. బిహార్, ఒడిశా రాష్ట్రాల మాదిరిగా తమకు సహాయం అందించేందుకు తమ అధికారులెవరూ రాలేదని వాపోతున్నాయి. -
ప్రపంచ దేశాలతోనే పోటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మాకు దేశంలోని ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు. అమెరికా, సింగపూర్, కొరియా, యూకే వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతోనే మాకు పోటీ ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని ఏ ఒక్క నగరం కూడా మన హైదరాబాద్తో పోటీ పడలేదు..’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని పారిశ్రామిక జనరల్ పార్క్లో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మలబార్ బంగారు, వజ్రాభరణా ల తయారీ సంస్థను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ‘తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారికి, వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది. గత 20 ఏళ్లలో పాలకులు మారారే కానీ.. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆయా ప్రభుత్వాల విధానాలు మాత్రం మారలేదు. మేం పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులను కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించొచ్చు. కొనుగోళ్లలో తెలుగు మహిళల ముందంజ బంగారు, వజ్రాభరణాల కొనుగోలు విషయంలో ఇతర రాష్ట్రాల మహిళలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల మహిళలే ముందుంటారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మహిళలు ఉంటారు. బంగారు ఆభరణాల తయారీకి మహేశ్వరం అనువైన ప్రదేశం. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద యూనిట్ను ఏర్పాటు చేయడం అబినందనీయం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహేశ్వరం, ముచ్చర్ల, బేగరి కంచె కేంద్రంగా 30 వేల ఎకరాల్లో భారత ఫ్యూచర్ సిటీని తీర్చి దిద్దబోతున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాదు వారికి లభాలు చేకూరేలా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని సీఎం హామీ ఇచ్చారు. తయారీ రంగానికీ హబ్గా మార్చేందుకు కృషి: శ్రీధర్బాబు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా రంగాల మాదిరే తయారీ రంగానికీ తెలంగాణను హబ్గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తయారీ రంగం గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 2022–23లో రూ.1.34 లక్షల కోట్లు ఉండగా, 2023–24లో 9 శాతం వృద్ధితో రూ.1.46 లక్షల కోట్టకు చేరిందని తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీలో తయారీ రంగం వాటా 19.5 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో ఇది 17.7 శాతమే ఉందని చెప్పారు. తెలంగాణ తయారీ రంగ ఎగుమతులు రూ.1.2 లక్షల కోట్ల మార్కు దాటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్బాస్టన్లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్హామ్: ఇంగ్లండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్కు సుందర్తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్కు 4.6 రన్రేట్తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్లెగ్లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
ఇది చాలా దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్రెడ్డికి సహేతుక కారణాలు చెప్పకుండానే రిమాండ్ విధించడం, పీటీ వారెంట్లు జారీ చేస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘ఏం చేస్తాం.. మేజిస్ట్రేట్ల తీరు అలాగే ఉంది. ఇది చాలా దురదృష్టకరం (సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్)’ అని హైకోర్టు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. పలు అభ్యర్థనలతో కాకాణి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు పిటిషన్లు దాఖలు చేసిన కాకాణి అక్రమ మైనింగ్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసులో తన బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు పీటీ వారెంట్ జారీ చేస్తూ నెల్లూరు కోర్టు గత నెల 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి మరో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేశారంటూ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు తనకు పీటీ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గోవర్ధన్రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లున్నా కూడా 41ఏ వర్తిందన్నారు ఈ సందర్భంగా కాకాణి తరఫున సీనియర్ న్యాయవాది ఒ.మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకాణిపై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడేవేన్నారు. అయినా కూడా మేజిస్ట్రేట్ సెక్షన్ 41ఏ వర్తించదన్నారని తెలిపారు. అంతేకాక సహేతుక కారణాలు తెలియచేయకుండానే పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. మేజిస్ట్రేట్ల తీరుపై వ్యాఖ్యానించారు. అంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ కేసులో కాకాణిని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరపనుందని తెలిపారు. అందువల్ల కాకాణి దాఖలు చేసిన అప్పీల్పై విచారణను వాయిదా వేయాలని పలుమార్లు అభ్యరి్థంచారు. దీంతో కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
మళ్లీ ‘సెర్చ్’..!
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల (వీసీ) ఎంపిక పెద్ద ప్రహసనంగా సాగుతోంది. పూర్తిస్థాయి ఉప కులపతులను నియమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాదికి పైగా వీసీల పేర్లు వెతుకులాటలోనే గడిపేసింది. సెర్చ్ కమిటీలు కూలంకషంగా విశ్లేషించి వర్సిటీల వారీగా ఇచ్చిన జాబితాలను తమకు నచ్చకుంటే బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా సెర్చ్ కమిటీలను నియమిస్తూ మరింత సాగదీతకు దిగుతోంది. – సాక్షి, అమరావతిరాజకీయాలకు అతీతంగా ఉంచాల్సిన వర్సిటీలపై కూటమి సర్కారు కన్నేసింది. గత ప్రభుత్వ హయాంలోని వీసీల మెడపై కత్తిపెట్టినట్టు బెదిరించి బలవంతపు రాజీనామాలు తీసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ వర్సిటీ వీసీలందరూ మూకుమ్మడిగా వైదొలగడం చర్చనీయాంశమైంది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వీసీల ఊసే ఎత్తకుండా ఇన్చార్జిల పాలనకు వదిలేసింది. చివరికి ఫిబ్రవరిలో 9 వర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ఎంపికైన హైదరాబాద్ వర్సిటీ (సెంట్రల్ వర్సిటీ) ప్రొఫెసర్ పి.ప్రకాశ్బాబు మరో సెంట్రల్ వర్సిటీలో అవకాశం రావడంతో వెళ్లిపోయారు.ఇంకా సెర్చ్ కమిటీ ఎందుకు?కూటమి ప్రభుత్వం వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీ నివేదికకు విలువ లేకుండా చేస్తోంది. ఆచార్య నాగార్జున, శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, జేఎన్టీయూ గురజాడ వర్సిటీలకు గతంలో సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లలోని వ్యక్తులు వీసీలుగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం, మిగిలినవారి పేర్లు ప్రభుత్వానికి నచ్చకపోవడంతో పక్కనపెట్టింది. వాస్తవానికి వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీ, యూజీసీ నుంచి వ్యక్తులు నామినీలుగా ఉంటారు. అలాంటి కమిటీ వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిభావంతులకే పెద్దపీట వేస్తుంది. కానీ, కూటమి ప్రభుత్వం తమ అనుయాయులకే వీసీల పదవులు కట్టబెట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన పేర్లు నచ్చనప్పుడు ప్రభుత్వమే తనకు నచ్చిన పేర్లు ఇచ్చి జాబితాలో రాయించుకోవచ్చు కదా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.కొత్తగా 4 వర్సిటీలకు సెర్చ్ కమిటీలుఆచార్య నాగార్జున, ద్రవిడియన్, జేఎన్టీయూ గురజాడ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు కొత్తగా సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 17 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించగా కొన్నింటి సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యంగా జరిగాయి. ద్రవిడియన్ వర్సిటీ వీసీ ఎంపికలో యూజీసీ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎకే సారిన్ను సెర్చ్ కమిటీలో నియమించారు. ఆయనపై తాము చెప్పిన పేర్లనే ప్రతిపాదించాలని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటినుంచి మళ్లీ సమావేశం జరగలేదు. ఈ క్రమంలో ఆయన పేరును తొలగించి మద్రాస్ వర్సిటీ మాజీ వీసీ ఎస్.గౌరిని తీసుకొచి్చంది.శ్రీకృష్ణదేవరాయలో యూజీసీ నామినీగా ఉన్న ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సరితకుమార్దాస్ స్థానంలో లక్నో వర్సిటీ ప్రొఫెసర్ అలోక్ కుమార్రాయ్, జేఎన్టీయూ గురజాడ వర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఐఐటీ జోధ్పూర్ డైరెక్టర్ అవినాశ్కుమార్ అగర్వాల్ బదులు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ చైర్మన్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్ధిని, ఆచార్య నాగార్జున వర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీగా జమ్మూ సెంట్రల్ వర్సిటీ వీసీ సంజీవ్ జైన్ స్థానంలో తమిళనాడులోని డీమ్డ్ వర్సిటీ వీసీ ఎన్.పంచనాథంను నియమిస్తూ కొత్తగా సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఉర్దూ, ఆంధ్రకేసరి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్సిటీలకు వీసీల పేర్లను సెర్చ్ కమిటీలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. వీటిని కూడా ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు శ్రీవెంకటేశ్వర వర్సిటీకి సైతం త్వరలో కొత్త సెర్చ్ కమిటీని వేయనున్నారు. యోగి వేమన వర్సిటీ వీసీ పోస్టుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించగా సెర్చ్ కమిటీని వేయాల్సి ఉంది. -
హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రముఖ న్యాయవాది గేదెల తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం ఈ మేరకు తీర్మానించింది. తుహిన్ కుమార్ పేరుకు కేంద్రం ఆమోదం తెలిపాక అది ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత తుహిన్ కుమార్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులతో కలుపుకుని మొత్తం 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తుహిన్ నియామకంతో ఆ సంఖ్య 29కి చేరుకుంటుంది. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. తుహిన్ నియామకం పూర్తయితే 8 ఖాళీలు ఉంటాయి. త్వరలో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు కొలీజియం సిఫారసుకు ఆమోదముద్ర వేసింది. తుహిన్ నేపథ్యం ఇది.. తుహిన్ కుమార్.. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్ కుమార్ పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్మీడియెట్, విశాఖపట్నం ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
ఎలక్ట్రానిక్ కంపెనీల హవా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది. వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది. భారీ అంచనాలు దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.కీలక రంగాల దన్ను అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్నిస్తోంది. దిగ్గజాల దూకుడు దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కూటమి పాలనపై జనసేన నేత తిరుగుబాటు
తిరువూరు: కూటమి ధర్మాన్ని విస్మరించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ కన్వినర్ మనుబోలు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తనను నిత్యం బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏమి చేసినా భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని, కూటమి గెలుపు కోసం కృషిచేసిన వారిని అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.తనపై భౌతికదాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు సొంత అజెండా రూపొందించుకోవడాన్ని ఖండించారు.నియోజకవర్గానికి మంజూరైన సీసీ రోడ్లలో కూటమి భాగస్వామ్య పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ నాయకులే కాంట్రాక్టు పనులు చేసుకుంటే పొత్తు ధర్మం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.చెరువుల్లో మట్టిని టీడీపీ నాయకులే పోటీపడి అమ్ముకోవడం, రేషన్ మాఫియా వద్ద నెలవారీ మామూళ్ళు వసూలు, జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్ళ పర్వం, విద్యుత్ సబ్స్టేషన్లలో కాంట్రాక్టు కార్మికుల నియామకానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం, తిరువూరులో గతంలో అక్రమ కట్టడంగా గుర్తించినది ఇప్పుడు సక్రమంగా ఎలా మారిందనే విషయాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మనుబోలు చెప్పారు. ఏ కొండూరు మండలం గోపాలపురంలో మట్టి అక్రమ క్వారీ నిర్వహణపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఓకే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3 శాతం పెరిగాయి. 19,048 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే భిన్నమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గినట్టు నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) లీజింగ్ మార్కెట్ మాత్రం బలమైన పనితీరు చూపించింది. → దేశవ్యాప్తంగా టాప్ 8 నగరాల్లో 2025 జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 1,70,201 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 2 శాతం తక్కువ. → ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 2 శాతం నుంచి 14 శాతం మధ్య పెరిగాయి. → ఇళ్ల అమ్మకాల్లో 49 శాతం రూ.కోటి అంతకుమించి ధరల శ్రేణిలోనే ఉన్నాయి. మిగిలిన 51 శాతం ఇళ్ల ధరలు రూ.కోటిలోపు ఉన్నాయి. → ముంబై నగరంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి మార్పు లేకుండా 47,035 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్ నగరంలో అమ్మకాలు కూడా పెద్ద మార్పు లేకుండా 9,370 యూనిట్లుగా ఉన్నాయి. → చెన్నై నగరంలో క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగి 26,795 యూనిట్లుగా నమోదయ్యాయి. → బెంగళూరులో అమ్మకాలు 3 శాతం తగ్గి 26,599 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 8 శాతం తగ్గి 26,795 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో ఒక శాతం తగ్గాయి. 24,329 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కోల్కతాలో అమ్మకాలు 11 శాతం తగ్గి 8,090 యూనిట్లకు పరిమితమయ్యాయి.జోరుమీదున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 41 శాతం పెరిగి 48.9 మిలియన్ (489 లక్షలు) చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద లీజింగ్ 80–90 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని నైట్ఫ్రాంక్ అంచనా. → చెన్నైలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 68 శాతం వృద్దితో 5.1 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → ముంబైలో మాత్రం క్రితం ఏడాది మొదటి ఆరు నెలల కాలం గణాంకాలతో పోల్చి చూస్తే 5 శాతం క్షీణించి 5.5 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపై 18.2 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో బలమైన వృద్ధి నమోదైంది. 27 శాతానికి పైగా పెరిగి 7.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో లీజింగ్ 17% వృద్ధితో 5.1 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. → కోల్కతాలో ఏకంగా 60 శాతం పెరిగి 1.1 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → అహ్మదాబాద్లో 51 శాతం తగ్గిపోయి 0.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
‘వరదే’ కృష్ణరూపిణీ..
సాక్షి, నరసరావుపేట/శ్రీశైలం ప్రాజెక్టు: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ఫలితంగా నదీమతల్లి రాష్ట్రంలోని జలాశయాల వైపు పరుగులు తీస్తోంది. వరద నీటితో ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ డ్యాంలు దాదాపుగా నిండాయి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు క్రస్ట్గేట్లను తెరవడంతో రాష్ట్రంలోని శ్రీశైలానికి వరదనీరు వస్తోంది. గతేడాది తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పాడవడం, డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నిలపరాదన్న నిర్ణయంతో శ్రీశైలానికి వేగంగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం ఉదయం 8 గంటలకు 875.6 అడుగులుగా నమోదైంది.డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.89 టీఎంసీలు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం ఉదయం 68,169 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రారంభించాయి. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ వైపు 63,150 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 12.649 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.357 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. సాగర్లో 147.82 టీఎంసీలకు చేరిక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. గురువారం ఉదయం 8 గంటలకు సాగర్లో నీటి మట్టం 519.2 అడుగులు వద్ద నమోదైంది. 147.82 టీఎంసీలు నిల్వ ఉంది. ఎగువన శ్రీశైలం నుంచి 50,771 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండటానికి మరో 164.23 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నారు. ఇప్పటికే క్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ పూర్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈనెల చివరివారంలోగా ఆయకట్టుకు నీరు వదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాం 20 గేట్ల ఎత్తివేత సాక్షి,బళ్లారి/హొళగుంద: తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గురువారం మధ్యాహ్నం 33 క్రస్ట్గేట్లలో 20 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి దాదాపు 59 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. డ్యాం క్రస్ట్గేట్లు బలహీనంగా ఉండటంతో గరిష్ట నీటి నిల్వను 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించి, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు. డ్యాం చరిత్రలో జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇన్ఫ్లో 28,932 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 62,766 క్యూసెక్యులుగా నమోదైంది. 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న టీబీ డ్యాంలో ప్రస్తుతం 1625.46 అడుగులతో 78.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఈ సారి దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద ఖరీఫ్కు మాత్రమే సాగు నీరివ్వనున్నారు. కాలువకు 10న నీటిని విడుదల చేసి నవంబర్ 30న నిలిపి వేయనున్నారు. అయితే కర్ణాటక రైతు సంçఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. -
జనాలు నలిగిపోతాన్రు!
జగనైతే ఎవరికీ ఏలోటూ లేకుండా అందరికీ అన్నీ ఏసేటోడు! బడ్డీ కొట్టు పెట్టుకున్నోళ్లకి డబ్బులిచ్చోడు.. ఒక్కడికీ లేదని పించలేదు. సంవత్సరానికి మాకు అన్ని పథకాలూ కలిపి డెబ్బై వేలదాకా వొచ్చేది. చంద్రబాబు వొచ్చాక ఇప్పుడేటీ రాలేదు. జనాలు నలిగిపోతాన్రు. చెప్పుకోకూడదు కానీ టీ సుక్కకి కూడా డబ్బులాడతం లేదు! – మంగలి సత్యం, నాయీ బ్రాహ్మణుడు, తామరాపల్లి, విజయనగరం జిల్లా ‘ఏటి సేసినారు..? రైతు భరోసా పెంచి ఇత్తామన్నారు.. అది అసలే నేదు..! చదువుకున్న కుర్రోళ్లకి డబ్బులేసేటోళ్లు..! వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలన్నీ ఒచ్చియి.. అవి ఇప్పుడున్నాయేటి..? ఏయీ నేవు...! గుండికాయల మీద సెయ్యేసి తెలుసుకుంటే.. ఈడు సేసిందేముంది..? ఆడు సేసిందేముంది..? అని తెలుసుకుంతారు! ఒక తల్లికి పిల్లనేదు.. పిల్లకి తల్లీనేదు! ఎవరి చేతిలోనూ డబ్బుల్లేక నకనకనాడిపోతున్రు...! ఇప్పుడే పనీనేదు.. పేదాసాదా అంతా ఉసూరుమని ఏడుత్తాండ్రు! రెండొందలు మూడొందలు వొచ్చీ కరెంటు బిల్లు ఇప్పుడు డబలైపోనాది. కొట్టుమీద కిరాణా సామాన్లు పెరిగాయి.. నూని డబ్బా పెరిగింది.. ఇప్పుడింక బాగైనా బరాయించాల..! చెడ్డయినా బరాయించాల..! మళ్లీ మన టైమొచ్చీదాకా..! మరింకేటి సేత్తాం..!. – జట్టి మంగ, కండేపల్లి, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లానేను పక్కా టీడీపీ అయినా జగన్ పథకాలు టంచనుగా అందాయి ‘కరోనా టైమ్లో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు. అయ్యన్నపాలెంలో ఒక కుటుంబానికి ఏటా రూ.లక్ష దాకా వచ్చేది. అప్పుడు జనాలకు సొమ్మాడటంతో కొత్త బట్టలని, ఇంట్లో ఏదైనా సామాన్లని కొనుక్కునేవారు. ఇప్పుడు వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. నేను పక్కా టీడీపీ. అయినా జగన్ పథకాలు మాకు టంచనుగా అందాయి..’ – సోమేశ్వరరావు, టైలర్ షాపు, అయ్యన్నపాలెం, నర్సీపట్నంశివరామకృష్ణ మిర్తిపాటి – ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏడాది పాలన గుండె చప్పుడు ఇది! నిజాలను భరించగలిగే శక్తి ఉంటే పేదల ఆక్రందన అర్థం అవుతుంది! గ్రామాల్లో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏరికోరి కష్టాల పాలయ్యామనే ఆక్రోశం ఎవరిని కదిలించినా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలిపివేయడం.. సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో పేదలు నలిగిపోతున్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. గిట్టుబాటు ధరలు లభించక అల్లాడుతున్నారు. పిల్లల చదువులు మళ్లీ గుదిబండలా మారుతున్నాయి. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న మహిళలు విసిగిపోతున్నారు. ఏడాది క్రితం దాకా కళకళలాడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో కకావికలమవుతోంది. ఏడాదికే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో!ఏం ప్రభుత్వమండీ ఇది! వాహనమిత్ర పథకం అందకపోవడంతో గ్రామాల్లో ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. రోజుకు ఐదారొందలు వస్తే పోలీసులు రూ.మూడు నాలుగొందలు కట్టాలని కేసు రాసేస్తున్నారని ఇక తాము ఎలా బతుకుతామంటూ విజయనగరం జిల్లా తామరాపల్లి జంక్షన్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 8 వారాల నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి బతుకుతున్నామని విజయనగరం జిల్లా పెద్ద బోరబండ గ్రామానికి చెంది ఉపాధి హామీ కార్మి కులు చెబుతున్నారు. ఆఖరికి మూగజీవాల గోడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘గొర్రెలకు కూడా మందులిచ్చేటోడు జగన్! ఇప్పుడేవీ లేవు. మట్టి పనుల డబ్బులు 4 నెలలుగా పడలేదు.రైతు భరోసా ఆగిపోయింది. ఎవరికీ ఏవీ లేక జనాలు మండిపోతున్నారు’ అని పురోహితినివలసకు చెందిన నీలబోణి లచ్చుము వాపోయాడు. ‘జగన్ ఉంటే ఏ పార్టీ అయినా కూడా అనుకున్న టైమ్కి అందరికీ అన్ని పథకాలూ వచ్చేవి. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి. చంద్రబాబు హామీలు అమలు కావడం లేదు. పథకాలూ రాక, జనాల చేతిలో డబ్బులాడక మా వ్యాపారం సాగడం లేదు’ అని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో రోడ్డు పక్కన బెల్లం, కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్న మాధవి నిర్వేదంగా చెప్పింది! ‘ఏం ప్రభుత్వమండీ ఇది! మాకు ఇంతకుముందు అన్ని పథకాలు వచ్చియి. మా మనవరాలికి అమ్మ ఒడి, మాయావిడికి రూ.18,500 వచ్చియి. ఇప్పుదేదీ లేదు’ అంటూ కోటవురట్లలో చిన్న కిళ్లీ బడ్డీ నడుపుకుంటున్న దాకారపు రవణ దిగాలుగా నిట్టూర్చాడు.అభివృద్ధి.. అప్పుల్లోనే!! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, నాడు–నేడుతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడంతో నిత్యం అభివృద్ధి పనులు జరిగేవి. జగనన్న కాలనీలలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతో గ్రామాలలో ఉపాధి లభించేది. కోవిడ్లోనూ ఈ పనులు నిరాటంకంగా సాగడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసింది.నవరత్నాల సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి మరీ అమలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనేందుకు నిదర్శనం. ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ ‘జగనున్నప్పుడు రైతు భరోసా ఏసీవోడు! చంద్రబాబు వచ్చిన కాడ నుంచి ఏవీ రావడం లేదు. ఏదో సొంత పొలం వదిలేయలేక తిండి గింజలు పండిస్తున్నాం. అదీనేకపోతే కూడు కోసుపోయి ఉండటమే! చోడవరం పందార ఫ్యాక్టరీకి చెరుకు తోలి ఐదు నెలలైంది ఇప్పటికొచ్చి రూపాయివ్వలేదు. మరి ఏటి తింటారు? మా ఆయన ఉపాధి హామీ మట్టి పనికెళ్లి రెండు నెలలైంది. ఒక్క రూపాయి పడలేదు. మార్చి నుంచి చేసినోళ్లకే లేదు. ఇంక మాకేం పడతాయి? చంద్రబాబుది అంతా మోసమే! ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ అంటూ అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన అచ్చయ్య గోడు వెళ్లబోసుకుంది. 70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు, మామిడి పళ్లు, కొబ్బరిబొండాలు అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది! ఈ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..! ‘పండిన పంటకు గిట్టుబాటు లేదు. ఒక రైతు భరోసా లేదు. క్రితం ఏడాది నువ్వులు క్వింటా రూ.12 వేలు ఉంది. ఇప్పుడు రూ.8 వేలే. కష్టం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఏ పథకాలూ లేవు. జగనున్నప్పుడు అమ్మ ఒడి అనో, 45 ఏళ్లు దాటిన ఆడోళ్లకి రూ.18,500 అనో ఏదో డబ్బులు పడేయి. ఇప్పుడు ఏవీ రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..!’ విజయనగరం జిల్లా తెర్లాంలో నువ్వులు నూరి్పడి చేస్తున్న రైతు దంపతులు శ్రీరాములు, లక్ష్మి ఆవేదన ఇదీ!! -
19న అఖిలపక్ష సమావేశం: రిజిజు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండు రోజులు ముందుగా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజులపాటు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో వెల్లడించారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 13, 14వ తేదీల్లో సమావేశాలు ఉండవని చెప్పారు. పార్లమెంటు సమావేశాలను ఆగస్ట్ 12వ తేదీతోనే ముగించాలని ముందుగా నిర్ణయించారు. అయితే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన వాటిని అమలు చేయడానికే సమావేశాల వ్యవధిని మరో తొమ్మిది రోజులు పొడిగించినట్లు సమాచారం. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సంక్షేమానికి సంబంధించిన బిల్లులతో సహా పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: శు.నవమి సా.4.24 వరకు, తదుపరి దశమి; నక్షత్రం: చిత్త సా.5.30 వరకు, తదుపరి స్వాతి; వర్జ్యం: రా.11.43 నుండి 1.29 వరకు; దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు; అమృత ఘడియలు: ఉ.10.29 నుండి 12.15 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు; యమగండం ప.3.00 నుండి 4.30 వరకు; సూర్యోదయం: 5.33; సూర్యాస్తమయం: 6.35. మేషం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.వృషభం.. కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.మిథునం.... బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కర్కాటకం.... పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.సింహం.... ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..కన్య... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.తుల... వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం.వృశ్చికం.... వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.ధనుస్సు.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మకరం.... పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.కుంభం... ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.మీనం... చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. -
అట్టుడుకుతున్న యూరప్
బెర్లిన్: యూరప్ దేశాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు స్పెయిన్లో నలుగురు, ఇటలీ, ఫ్రాన్స్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్లోని బెజ్నౌ అణు రియాక్టర్ను మూసివేశారు. మరో అణు రియాక్టర్లో విద్యుదుత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్లోని కాటలోనియా ప్రాంతంలో కార్చిచ్చుతో ఇద్దరు చనిపోయారు. ఎండల వేడిమికి తాళలేక 300 మంది ఆస్పత్రి పాలయ్యారని ఫ్రాన్స్ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో, జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు. బ్రాండెన్బర్గ్, సాగ్జనీల్లో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చును ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాలైన పారిస్లోని ఈఫిల్ టవర్తోపాటు బ్రస్సెల్స్లోని అటోమియంను మూసివేశారు. -
గురుకులాల్లో నిలిచిన టెండర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లాలో గురుకుల విద్యాలయాలకు సరుకులు సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో దిగజారుడు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో 11 జ్యోతిరావు పూలే గురుకులాలు, రెండు ఏపీ రెసిడెన్షియల్ , 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఆహారాన్ని అందించేందుకు గాను కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్ వంటి సరుకులను సరఫరా చేసేందుకు గత నెలలో టెండర్లు పిలిచారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 40 మంది టెండర్లు దాఖలు చేశారు.కానీ ఆ టెండర్ల వ్యవహారంలో అధికార కూటమి నేత జోక్యం టెండర్ ప్రక్రియకు గ్రహణం పట్టినట్లయింది.ఇంతకీ ఏం జరిగిందంటేజూన్ 28న జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో తొలుత శ్రీకాకుళం డివిజన్లో ఐదు గురుకులాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుండగా డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ రంగంలోకి దిగారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన గురుకులాల టెండర్లు డీసీఎంఎస్కే కావాలని, తాను డీసీఎంఎస్ అధ్యక్షునిగా ఉన్నందున ఇంకెవరికి ఇవ్వరాదని అధికారులకు తేల్చిచెప్పారు. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి టెండర్ నిలిపి వేయించినట్లు తెలుస్తోంది.కొటేషన్లోనూ ఎక్కువే..వాస్తవానికి ప్రైవేటు టెండరుదారులు ఓ సరుకుకు రూ.330 కోట్ చేయగా, అదే సరుకుకు డీసీఎంఎస్ ద్వారా రూ.805 కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ కోట్ చేసిన వారికి టెండరు ఖరారు చేయకూడదు. ఆ లెక్కన డీసీఎంఎస్ అనర్హత సాధించినట్లే. అయితే ఓవైపు నిబంధనలు, మరోవైపు మంత్రి స్థాయి నుంచి ఒత్తిళ్లు వెరసి ఏం చేయాలో తోచక అధికారులు టెండర్ను వాయిదా వేశారు. దీంతో తక్కువ ధరకు కోట్ చేసిన టెండరుదారులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నం
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహరపేట అరుంధతీయ కాలనీకి చెందిన ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన మొండెం ఉదయ్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్రహరపేటకు చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయ్ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు చేరుకునేసరికి ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు విషపు అన్నమా! ఉప్మాలో జెర్రి... భోజనంలో బొద్దింక
నాడు జగన్ పాలనలో బడి పిల్లలకు ‘గోరు ముద్ద’లతో పౌష్టికాహారం అందించారు. నేడు కూటమి పాలనలో ‘పురుగుల’ అన్నం పెడుతున్నారు. ఒకటో తారీకున పాయకారావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల వసతి గృహంలో బొద్దింక భోజనాన్ని సాక్షాత్తు హోం మంత్రి అనితే రుచి చూశారు. మూడో తేదీన ఇలాంటిదే మరో సంఘటన. తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులకు పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. 64 మంది తినగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో తీసుకొస్తానంటున్న విప్లవాత్మక మార్పులు ఇవేనా? అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న భోజన వసతి ఏమేర ఉందో తేటతెల్లమవుతోంది. అసలేం జరిగిందంటే... తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం ఉదయం ప్రార్థన జరుగుతుండగా ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారికి సపర్యలు చేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం తిన్న ఉప్మాలో జెర్రి వచ్చిందని విద్యార్థినులు వైద్యులకు తెలియజేశారు.విద్యార్థుల కథనం మేరకు.. తెలుగుగంగ కాలనీలోని బీసీ కళాశాల వసతి గృహంలో 84 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం ఉదయం 64 మంది విద్యార్థులకు ఉప్మాను అల్పాహారంగా అందించారు. యోష్ణ అనే విద్యార్థిని తనకు పెట్టిన ఉప్మాలో జెర్రి వచ్చిందని తోటి విద్యార్థులకు చూపించింది. దాంతో విద్యార్థులు ఎవరు ఉప్మా తినకుండా అక్కడ పడేసి కళాశాలకు బయలు దేరి వెళ్లిపోయారు.అయితే ప్రార్థన సమయంలో ఎం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యోష్ణ కళ్లు తిరిగి కిందపడిపోయింది. కడుపు నొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునికుమారి, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అధ్యాపకులకు చెప్పారు. అధ్యాపకులు వెంటనే వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. -
కాంట్రాక్టులన్నీ స్వీప్!
ఈ ఫొటోలో ఉన్న స్వీపింగ్ యంత్రాలు నెల్లూరు మున్సిపాలిటీలోనివి. గతంలో టీడీపీ పాలనలో సరఫరా చేసిన ఏడేళ్లకే ఈ వాహనాలు మూలకు చేరాయి. వాస్తవానికి.. వాహనాల కాలపరిమితి రవాణాశాఖ లెక్క ప్రకారం 15 ఏళ్లు. అయితే, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ వాహనాలు మూణ్ణాలకే మూలకు చేరాయి.ఏపీ27టీజెడ్ 2131 రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన ఈ స్వీపింగ్ యంత్రాన్ని నెల్లూరు మున్సిపాలిటీకి 2017లో సరఫరా చేశారు. అయితే, ఇది కాస్తా 2018లో మరమ్మతులకు గురికావడంతో అప్పటి నుంచి ఈ స్వీపింగ్ యంత్రం శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ గోడౌన్లోనే మూలుగుతోంది. దీనిపై నెల్లూరు మున్సిపల్ అధికారులు అడిగేందుకూ సాహసించడంలేదు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంఇప్పుడీ స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు (ఓ అండ్ ఎం) పేరుతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. మంత్రి పేరుతో అన్ని మున్సిపాలిటీల్లోని అధికారులు, టీడీపీ కూటమి నేతలను ఈ సంస్థ ప్రతినిధులు కలుస్తూ తమకే కాంట్రాక్టు వచ్చేలా నిబంధనలు రూపొందించుకుంటున్నారనే విమర్శలున్నాయి. వాస్తవానికి.. సదరు సంస్థ సరఫరా చేసిన 125 వాహనాల్లో ఇప్పటికీ 61 వాహనాలు మున్సిపాలిటీల పేరిట ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు.అయినప్పటికీ సదరు సంస్థ యంత్రాల కొనుగోలు సమయంలో టెండరు దాఖలు చేసినప్పుడు ఉంచిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కూడా చెల్లించేందుకు ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. మరోవైపు.. సదరు సంస్థ సరిగ్గా వాహనాలను నిర్వహించడంలేదని.. వాటికి మరమ్మతులు చేయడంలేదని పేర్కొంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంస్థను 2023లో టెర్మినేట్ చేసింది. సాధారణంగా టర్మినెట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకూడదు. కానీ, గుంటూరులో శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ర్పైజెస్ దాఖలు చేసిన సింగిల్ టెండర్కే పనులు అప్పగించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఓ మంత్రి పేరుతో ఓ అండ్ ఎం కాంట్రాక్టులను ఊడ్చేసేందుకు రంగం సిద్ధమైంది.రిజిస్ట్రేషన్ చేయకుండానే..వాస్తవానికి.. రూ.41 కోట్లు వెచ్చించి 125 స్వీపింగు వాహనాలను శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 2017లో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు ఆ సంస్థ సరఫరా చేసింది. అయితే, ఇందులో 62 వాహనాలకు ఇప్పటివరకు ఆయా మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినప్పటికీ ఆ సంస్థకు అప్పట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బిల్లులు చెల్లించింది. అయితే, ఈ వాహనాలను ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకొస్తే.. చేయిస్తానని సదరు సంస్థ ఇప్పుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.ఇందుకు కూడా సంసిద్ధత తెలిపి.. ఆ భారాన్ని మున్సిపాలిటీలపై వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, మొత్తం 125 వాహనాల్లో సగానికి పైగా వాహనాలకు ఇంజన్లు లేవు. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖాధికారులు అంగీకరించే అవకాశంలేదని మున్సిపల్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇక నెల్లూరు మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.8 కోట్లతో టీపీఎస్ సంస్థ ద్వారా ఐదు కొత్త స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు.వీటికి రానున్న ఐదేళ్ల పాటు రాజరాజేశ్వరి సంస్థకు ఓ అండ్ ఎం బాధ్యతలను సింగిల్ టెండర్లో అప్పగించడం గమనార్హం. ఇదే తరహాలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు తదితర మున్సిపాలిటీల్లో కూడా కొత్త స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు పనులను మళ్లీ ఈ సంస్థకే అప్పగించేందుకు అధికారులను మంత్రి పేరుతో ఒత్తిళ్లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకదాని పరికరాలు మరో దానికి..ఇక సాధారణంగా ఏదైనా వాహనంలో ఒక పరికరం పాడైతే మరో పరికరాన్ని అమర్చి బాగుచేయాల్సి ఉంటుంది. కానీ, ఒక వాహనానికి చెందిన పరికరాన్ని మరోదానికి అమర్చడం పరిపాటిగా మారింది. ఇలా మొత్తం వాహనాలను డొల్లకింద మార్చేశారు. ఫలితంగా.. అనేక వాహనాల్లో ఏకంగా ఇంజిన్లు, బ్లోయర్లు, రేడియేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలు మాయమై మూలకు చేరాయి.తిరుపతి, నెల్లూరు, గుంటూరులో మాత్రం ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో మరమ్మతులు చేయించి తిప్పుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి రానున్న ఐదేళ్లపాటు కూడా ఇదే సంస్థకు ఓ అండ్ ఎం అప్పగించేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇప్పటికే గుంటూరు మున్సిపాలిటీలో సింగిల్ టెండర్ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్కు అప్పగించగా.. తిరుపతి, విశాఖ, కర్నూలు, నెల్లూరులోనూ ఇదే తరహా మంత్రాంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది. -
పులివెందుల పోలీసులకు చుక్కెదురు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరాలివీ..అప్పట్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ కమిషనర్తోపాటు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. వీరు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించారు. దీన్ని సాకుగా చూపి హోంమంత్రి ద్వారా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఆదేశాలతో ఓ టీడీపీ నాయకుడితో వారిపై ఫిర్యాదు చేయించారు. దీంతో.. టీడీపీ నేతపై దాడిచేసినట్లు వైఎస్సార్సీపీ వారిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారు.పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్సార్సీపీ నాయకులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్కు తెలిపారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ఆదేశించగా.. వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులతోపాటు టీడీపీ నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి దెబ్బలులేనట్లుగా రిపోర్టులు ఇప్పించారు. దీనిపై నిందితులు మళ్లీ హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని, నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.పులివెందుల పోలీసుల ఓవరాక్షన్..ఇక ఈ మెడికల్ టెస్టుల్లో తమకు వ్యతిరేకంగా నివేదిక వస్తుందనే అనుమానంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, అర్బన్ సీఐ చాంద్ బాషా, రూరల్ సీఐ వెంకటరమణ కర్నూలులో మకాంవేసి అధికార పార్టీ నేతల ద్వారా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాక.. కర్నూలు డీఎస్పీ కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రిపోర్టులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా.. కర్నూలు సూపరింటెండెంట్తో పాటు వీరంతా కలిసి ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ వీడియోలో మీడియా కంటపడకుండా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తన ముఖం చాటేయడం కనిపించింది. వీటి ఆధారంగా పిటిషనర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక.. తమకు తగిలిన గాయాలను ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయాలున్నట్లు తేలిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో.. హైకోర్టు ఈ వారంలోగా వారికి తిరుపతి స్విమ్స్ కేంద్రంగా మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్ బాషాను ఈనెల 1న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం ఆయనకు అందజేశారు. -
జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎదుట ధర్నా చేస్తున్న వారిపై మరోసారి పోలీసులను ఉసిగొల్పింది. దీంతో యువ వైద్యులను పోలీసులు కాళ్లతో తొక్కేసి.. జట్టు పట్టుకొని ఈడ్చేశారు. నేరతుల కంటే దారుణంగా.. వారిని బలవంతంగా ట్రక్కుల్లోకి ఎత్తిపడేశారు. వారికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాల నాయకులను సైతం అరెస్ట్ చేసి రాత్రి వరకు నిర్భందించారు. మూకుమ్మడిగా మీద పడి లాక్కెళ్లారు.. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వందలాది మంది యువ వైద్యులు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రులను సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో నాలుగు రోజులుగా విజయవాడలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఉన్న హెల్త్ యూనివర్సిటీ ఎదుట నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారికి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్కుమార్, కార్యదర్శి ఐ.రాజేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి తదితరులు మద్దతు తెలిపారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డి.శ్రీహరిరావు కారును అడ్డుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంతలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకాష్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు హెల్త్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. మూకుమ్మడిగా వైద్య విద్యార్థులపై పడి.. వారిని ఈడ్చేశారు. మహిళా వైద్యులని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లి ట్రక్కుల్లో పడేశారు.దీంతో పలువురు గాయపడ్డారు. అనంతరం వారిని ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్కు తరలించారు. పోలీస్ లు తమ పట్ల కర్కశంగా వ్యవహరించారని యువ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేయలేకపోతే.. చంపేయండి అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. యువ వైద్యుల జీవితాలతో సర్కార్ చెలగాటం.. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ యువ వైద్యులను పరామర్శించారు. వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. యువ వైద్యుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్
న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలర్ల గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందంటూ చురకలంటించారు. సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ నమోదైన కేసులో ప్రధాన నిందితులైన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా విషయంలో సీబీఐ సిట్ నమోదు చేసిన కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్లు నాలుగున్నర నెలలకు పైగా జైల్లో ఉన్నారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే దర్యాప్తు మొత్తం పూర్తయిందని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించారని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారని, అడిగిన డాక్యుమెంట్లన్నీ కూడా అందచేశారని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్లు సాక్షులను బెదిరించారన్న సీబీఐ ఆరోపణలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం నిందారోపణలే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.నా ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అవకాశం..ఈ తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమాల ట్రోలర్ల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింగయ్య మృతి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేసేందుకు కూటమి మద్దతు ట్రోలర్లకు అవకాశంగా మారింది. -
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
పైరసీ.. సినిమా చూపిస్తోంది!
⇒ సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు గత ఏడాది రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మరి దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతేంటి? పైరసీ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. బీమా సంస్థలు మాత్రం.. నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టమంటూ బీమా కవరేజ్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.⇒ పుష్ప–2, కల్కి 2898 ఏడీ, గేమ్ ఛేంజర్, తండేల్, సింగిల్.. మొన్నటికి మొన్న కన్నప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీకి గురైన సినిమాల జాబితా పెద్దదే. ఈ ఏడాది మార్చిలో విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం లీక్ కావడంతో నిర్మాత రూ.91 కోట్ల నష్టాన్ని చవిచూశారన్న వార్తలు గుప్పుమన్నాయి. చిత్ర పరిశ్రమను పైరసీ భయం వెంటాడుతోంది. ప్రధానంగా పెద్ద బడ్జెట్ చిత్రాల విషయంలో నిర్మాతలు ఆందోళనగా ఉన్నారు. పైరసీ సంబంధ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. అయితే కవరేజ్ విషయంలో బీమా సంస్థలు వెనుకాడుతున్నాయని సినీ పరిశ్రమ చెబుతోంది.⇒ వ్యవస్థాగత మార్పులతో..: బీమా కవరేజ్పై ఆధారపడటం కంటే వ్యవస్థాగత మార్పుల ద్వారా పైరసీని ఎదుర్కోవాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. పైరసీ కవర్తో నష్టాలను తిరిగి పొందే బదులు కఠిన చట్టాలను తీసుకురావడం ద్వారా పైరసీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నది వారి ఆలోచన. మరికొందరు మాత్రం పైరసీ కవర్తో నష్టం కొంతైనా పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు.⇒ నిధుల సవాళ్లు ఉన్న సమయంలో పైరసీ కవర్ కోసం అదనపు ఖర్చు అనేది నిర్మాతలకు భారమయ్యే వ్యవహారమే. సినీ రంగానికి ‘పరిశ్రమ’ హోదా ఇవ్వడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిత్ర నిర్మాతలు పైరసీ ముప్పును పరిష్కరించడానికి ప్రత్యేక బీమా ఉత్పత్తుల కంటే ప్రధానంగా యాంటీ–పైరసీ అమలుపై ఆధారపడుతున్నారు. అంటే కాపీరైట్ కలిగిన కంటెంట్ను అనధికారికంగా వినియోగం, పంపిణీని అడ్డుకోవడానికి వ్యూహాలు, చర్యలను అమలు చేస్తున్నారు.⇒ రెండు ప్రధాన బీమాలు..: మన చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా రెండు బీమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చిత్ర నిర్మాణం కోసం కాగా, మరొకటి పంపిణీ కోసం. నిర్మాణంలో ఆలస్యం; తారాగణం, సిబ్బంది అనారోగ్యం; పరికరాల నష్టం, ప్రొఫెషనల్ సేవల్లో లోపాలు తప్పులు లేదా నిర్లక్ష్యం కారణంగా క్లయింట్కు కలిగే ఆర్థిక నష్టాలకు ‘చలనచిత్ర నిర్మాణ బీమా’ కవరేజీని అందిస్తోంది. ఫిల్మ్ ప్రింట్లు, డిజిటల్ మాస్టర్స్ నష్టం, థియేటర్లలో విడుదల జాప్యం, వ్యాపార అంతరాయాలు, విడుదలకు ముందు లేదా డిజిటల్ విడుదల ప్రారంభ దశలలో లీక్ లేదా పైరసీ నుండి ఉత్పన్నమయ్యే నష్టాల నుండి ‘చలనచిత్ర పంపిణీ బీమా’ రక్షిస్తుంది.పైరేటెడ్ మూలాల నుండి..అధిక బడ్జెట్తో నిర్మాణాలు చేపట్టే స్టూడియోలు పైరసీ కవర్ కోసం బీమా సంస్థలను సంప్రదిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే కంటెంట్ లీక్ అవుతోందనే భయం నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో పెరుగుతోందని బీమా కంపెనీ ‘అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్’ చెబుతోంది. ‘మీడియా పార్ట్నర్స్ ఆసియా’ ఇటీవలి నివేదిక ప్రకారం.. పైరసీ అదుపు చేయకపోతే భారత్లో డిజిటల్ వీడియో పరిశ్రమకు ఆదాయ నష్టాలు ప్రస్తుత రూ.10,260 కోట్ల నుంచి 2029 నాటికి రెండింతలై రూ.20,520 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి తర్వాత సబ్స్క్రిప్షన్ ఆదాయంలో 150 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. దేశంలోని 51 శాతం మీడియా వినియోగదారులు పైరేటెడ్ మూలాల నుండి కంటెంట్ను వినియోగిస్తున్నారని ‘ఈవై–ఐఏఎంఏఐ’ రిపోర్ట్ వెల్లడించింది. బీమా కంపెనీలతో చర్చలు..ఈ నష్టం ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా డిజిటల్ వీడియో పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. ఉద్యోగ నష్టాలకు దారితీస్తోంది. ‘ఆదాయాలపై పైరసీ ప్రభావం చూపుతూనే ఉంది. సినిమా పంపిణీకి బీమాను ఎంచుకునేటప్పుడు.. పైరసీ నష్టాలు, నిరోధక చర్యలకు కూడా కవరేజ్ ఉండాలి’ అని నిర్మాతలు అంటున్నారు. సినిమా పైరసీ నుంచి రక్షణ పొందడానికి నిర్మాతలు, బీమా కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పైరసీకి కవరేజ్ అత్యవసరం అన్న డిమాండ్ పెరుగుతోంది. బీమా సంస్థలు మాత్రం పైరసీ నష్టాలకు బీమా కవరేజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టం అనేది వాటి వాదన. -
రోప్ పార్టీకి దిక్కులేదు.. జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నారంట!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఆయన పర్యటనల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చునన్నారు. ఓ వ్యక్తి భద్రత విషయంలో రోప్ పార్టీది కీలకపాత్ర అని ఆయన వివరించారు. భారీ సంఖ్యలో వచ్చే జనాలను రోప్ పార్టీ నియంత్రిస్తుందని, తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. జగన్కు అన్నిరకాల భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రోప్ పార్టీని ఎందుకు ఏర్పాటుచేయడం లేదో చెప్పడం లేదన్నారు.రోప్ పార్టీ విషయంలో ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందో అర్థంకావడంలేదన్నారు. అది లేకుంటే జగన్ భద్రతకు ముప్పు ఉన్నట్లేనని శ్రీరామ్ స్పష్టంచేశారు. జగన్ పర్యటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమన్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటునకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్రజాప్యం చేశారన్నారు. అడుగు కూడా వేయలేని ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చారని, ఈ ప్రాంతంలో చెట్లు, పొదలు తొలగించడానికే మూడ్రోజులు పడుతుందని శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో జగన్ తన నెల్లూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని తెలిపారు. జగన్కు రోప్ పార్టీతో సహా అన్నీ రకాలుగా భద్రత కల్పించే విషయాన్ని కేవలం నెల్లూరు పర్యటనకు మాత్రమే కాకుండా, ఆయన చేసే ప్రతీ పర్యటనకు సైతం వర్తింపజేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. జగన్కు సేఫ్ ట్రావెల్, సేఫ్ ల్యాండింగ్, సేఫ్ మూవ్మెంట్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే జగన్ భద్రత కోసం ప్రభుత్వ నిర్లక్ష్యంపై రెండు పిటిషన్లు దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, జగన్ పర్యటన వాయిదా నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ నిరర్థకమైందన్నారు. జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామన్నారు. జడ్ ప్లస్ వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పిటిషనర్లు అనుబంధ పిటిషన్ వేశారని, దీనికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆ రోజుకి కౌంటర్ దాఖలు చేయాలని, ఆ రోజునే వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ను పరిష్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెల్లూరు పర్యటనకు వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతనేని చంద్రశేఖర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిఖ్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.రాయచోటి పోలీసు పరేడ్ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్ సిద్దిఖ్ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయి.⇒ మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యకు పాల్పడిన రోజే.. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 1999లో కొచ్చి–కుర్లా ఎక్స్ప్రెస్లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.⇒ 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు రాయచోటి నుంచే కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహమాడి చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. భారీ కుట్రను భగ్నం చేశాయి.అల్ ఉమ్మా సంస్థతో అనుబంధంఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయి.రాయచోటి నుంచే పలు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపారు? సహాయ సహకారాలు అందించినవారెవరు? ప్రతి విషయం క్షుణ్ణంగా విచారిస్తున్నాం. పేలుడు సామగ్రి ఎలా వచ్చింది? బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. స్థానికంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. అబూబకర్, మహమ్మద్ అలీలను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసుపై నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి.సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు..ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులు లభించాయి. వీటితో కర్ణాటకలోని మల్లేశ్వరం లాంటి 30 బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం.పోలీసులను అడ్డుకున్న నిందితుల భార్యలు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్లు మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. మహిళలు ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. కోర్టు రిమాండ్ విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించాం.⇒ ఉగ్రవాదుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నాలుగు సూట్కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. భయం.. భయం..రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఇవిగో సాక్ష్యాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్ బూత్లలో చోటుచేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్సభ పక్షనేత పి.మిథున్రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్రెడ్డి, చంద్రశేఖర్తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈవీఎం, వీవీ ప్యాట్లను పోల్చి చూడాలి2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98 శాతం చార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్లను కంపారిజన్ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.రాయచోటి ఓ ఉదాహరణ..2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎక్కువ శాతం పోలింగ్ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్కుమార్కు అందించాం. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ హిందూపురం ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు..ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహాలను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్–157, 28లలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్ తరహాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్కుమార్ అంగీకరించారు.బ్యాలెట్తోనే ఎన్నికలు జరపాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశాం. అమెరికా, జర్మనీ, యూరప్ దేశాల్లో సైతం బ్యాలెట్తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్ బూత్లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువారం వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది. -
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం వారి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్తోపాటు జస్టిస్ అభిషేక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలతలను తెలంగాణకు బదిలీ చేస్తూ గత నెల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుజోయ్పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. కొత్తగా ఎంపికైన వారు నలుగురు, బదిలీపై ఇక్కడికి వచ్చేవారు నలుగురు, ఇక్కడి నుంచి వెళ్లే వారు ఒకరు.. వీరందరి సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే న్యాయమూర్తుల సంఖ్య 33 (సీజేతో కలిపి)కు పెరగనుంది. ఇంకా 9 ఖాళీలుంటాయి. చాలాకాలం తర్వాత న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా పదోన్నతులు క ల్పించడంపట్ల అడ్వొకేట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జడ్జీల నేపథ్యాలు ఇవి.. ⇒ సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జనగాంలో జన్మించారు. తండ్రి జగన్మోహన్రావు. 1998 మార్చి 26న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటి సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసుల్లో వాదనలు వినిపించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సెల్గా 2022లో నియమితులయ్యారు. ప్రస్తుతం అవే విధులు నిర్వహిస్తున్నారు. ⇒ వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఎ.అనంతసేన్రెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ కేసుల్లో సమర్థులు. ఇప్పటివరకు 1,000 పిటిషన్లకుపైగా దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సెల్గా విధులు నిర్వహిస్తున్నారు. ⇒ గౌస్ మీరా మొహినుద్దీన్ 1969 జూలై 15న జన్మించారు. ఆయన హైదరాబాద్ బాలానగర్కు చెందిన వారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్ఎంటీ మేనేజర్గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్కు స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు. ⇒ గాడి ప్రవీణ్కుమార్ 1971 ఆగస్టు 28న జన్మించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్. తండ్రి జగన్మోహన్రావు. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ.. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్ఎం చదివారు. 1998 నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్, ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగ, సర్విస్ మ్యాటర్స్, లేబర్ లా, క్రిమినల్ లా.. పలు విభాగాల్లో నిష్ణాతులు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. -
బలమైన భారత్తో స్థిరమైన ప్రపంచం
ఆక్రా: భారతదేశం బలంగా ఉంటే ప్రపంచం మరింత స్థిరంగా, సౌభాగ్యవంతంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ పాలనా విధానంలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. దక్షిణార్ధ గోళ దేశాల (గ్లోబల్ సౌత్) గొంతుకకు బలం, విలువ ఇవ్వకపోతే ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన భారత ప్రజాస్వామ్యం ఒక ఆశారేఖగా వెలిగిపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండియా సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి ప్రపంచ ప్రగతికి ఉ్రత్పేరకంగా మారిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచానికి ఒక బలమైన మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. భారత్ మరింత బలోపేతమైతే ప్రపంచ స్థిరత్వానికి, సౌభాగ్యానికి తిరుగు ఉండదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నినాదాలకు మించిన కార్యాచరణ ‘‘అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. స్థిరమైన పాలన, రాజకీయ వ్యవస్థ అనే పునాదిపై ఇండియా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యం. గ్లోబల్ సౌత్లో మా వాటా 16 శాతంగా ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మా దేశంలోనే ఉంది. ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్గా మారింది. పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ప్రపంచానికి కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటివి సమస్యగా మారాయి. గత శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు వీటిని పరిష్కరించలేకపోతున్నాయి. అందుకే గ్లోబల్ గవర్నెన్స్లో విశ్వసనీయమైన, ప్రభావంతమైన సంస్కరణలు కచి్చతంగా రావాలి. ప్రపంచం బాగు కోసం గ్లోబల్ సౌత్కు మరింత బలం చేకూరాలి. నినాదాలకు మించిన కార్యాచరణ కావాలి. జీ20 కూటమికి మేము సారథ్యం వహించినప్పుడు ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే విజన్తో పనిచేశాం. మా హయాంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యదేశంగా మారింది. ఆఫ్రికా అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకొనేందుకు ఇండియా కట్టుబడి ఉంది. ఆఫ్రికా ప్రజల అభ్యున్నతి కోసం ఆఫ్రికా అభివృద్ధి ఎజెండా–2063కు మద్దతిస్తున్నాం. ఆఫ్రికా లక్ష్యాలు మాకు ప్రాధాన్యతలు. కలిసి పనిచేస్తూ సమానంగా ఎదగాలన్నదే మా విధానం. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యం కొనసాగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తాం. ఆఫ్రికాలో కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు, స్థానిక ప్రజల సాధికారతే మా ధ్యేయం. స్ఫూర్తిదాయకమైన చరిత్ర కలిగిన ఘనాలో పర్యటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్. మాకు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు.. మా ప్రాథమిక విలువల్లో అదొక అంతర్భాగం. ఇండియాలో ప్రజాస్వామ్యానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. నిజమైన ప్రజాస్వామ్యం చర్చ, సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అది ప్రజలను ఐక్యం చేస్తుంది. గౌరవం, మానవ హక్కులకు అండగా నిలుస్తుంది. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా పారదర్శక, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఆత్మలాంటివి. ఇండియాలో ఎన్నికల సంఘం పనితీరును దగ్గరగా గమనించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో ఘనా–ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ సొసైటీని స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. ఇండియాలో 2,500 రాజకీయ పారీ్టలున్నాయని మోదీ చెప్పగా ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. భారత్–ఘనా మధ్య ‘సమగ్ర భాగస్వామ్యం’ భారత్–ఘనా దేశాలు తమ పరస్పర సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. ఘనా అభివృద్ధి ప్రయాణానికి భారత్ తోడుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన గురువారం ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్–ఘనా మధ్య పరస్పర వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం మోదీ బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. తొలుత ఘనా అధ్యక్షుడితో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. గురువారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సంస్కృతి, సంప్రదాయ వైద్యంతోపాటు వేర్వేరు రంగాల్లో సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా దేశ నిర్మాణంలో అండగా నిలుస్తోందని మోదీ ఉద్ఘాటించారు.మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామా ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రశంసనీయమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించడంతోపాటు ప్రపంచ స్థాయి నేతగా ప్రభావం చూపుతున్నందుకు గాను మోదీని ఘనా ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది ఎంతో గర్వకారణమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఘనా జాతీయ గౌరవ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.ముగిసిన ఘనా పర్యటనభారత ప్రధానమంత్రి ఘనాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పయనమయ్యారు. శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. -
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎలాంటి నిర్ణయమైనా సమష్టిగా చర్చించిన తర్వాతే తీసుకుంటామని, దాన్నిఅమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు చెప్పారు. సొంతంగా, స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ‘పార్టీ ఎజెండా ముఖ్యం.. 2028లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై గురువారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అప్పుల గురించి రేవంత్కు అప్పుడు తెలియదా? ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నర కాలంలోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ అప్పుల గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ అప్పుల సంగతి ఆయనకు తెలియదా? కనీస అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అమలు చేయాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి చెబుతారా? రైతు రుణమాఫీ ఇంకా పూర్తికాలేదు. రైతుబంధు అందడం లేదు. మహాలక్ష్మీ, గృహలక్ష్మి అంటూ ఎన్నో హామీలు ఇచ్చి... ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ప్రజాస్వామ్య తెలంగాణ మాటలకే పరిమితమైంది. భైంసాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు. గోరక్షకులను అరెస్టులు చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. పదేళ్ల పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ను ప్రజలు వద్దనుకున్నారు. అందుకే కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ విధానాలనే అమలు చేస్తోంది. అందుకే కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటికీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితికి తగినట్లు బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారంలోకి వచ్చేలా కష్టపడతాం. ఒక్క ఎమ్మెల్యేతో మొదలుపెట్టి.. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో బలమైన పార్టీగా ఎదిగింది. గతంలో కేవలం మూడు, నాలుగు శాతం ఓట్లున్న ఈ పార్టీ..గత పార్లమెంటు ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో సగం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా ఏర్పడింది. గెలుపు గుర్రాలకే ‘స్థానిక’టిక్కెట్లు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జీహెచ్ఎంసీలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ఉన్న వ్యతిరేకత మాకు కలిసివస్తుంది. త్వరలో వర్క్షాప్ నిర్వహిస్తాం. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తాం. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లను చేర్చుకుంటాం. కొత్త నీరు వస్తేనే కదా ప్రవాహం పెరిగేది. టాలెంట్కు తగిన పదవులు కూడా ఇస్తాం. పాత, కొత్త నాయకులనే తేడా అస్సలు లేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటా.. రాష్ట్ర అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి పర్యటనలకే తొలి ప్రాధాన్యత. పార్టీ పరంగా మాకు 38 జిల్లాలున్నాయి. కార్యాలయానికే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. సమస్యలపై ఉద్యమాలు చేపడతా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ నినాదం ఉత్తమాటే. బీసీ బిల్లు ఇక్కడ రూపొందించి అక్కడ అమలు చేయడమనేది తెలివి తక్కువ చర్య. బిల్లు ఆమోదిస్తే గెజిట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బిల్లు తయారు చేసి కేంద్రాన్ని అమలు చేయమన్నది. మా ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ నెల 5 లేదా 10వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తా. -
అంతరిక్షంలో అతిథి
భూమి దిశగా గ్రహశకలాలు దూసుకొస్తూ అతిథుల్లా పలకరిస్తుంటాయి. అయితే ప్రచండ వేగంతో రావడంతో భూవాతావరణంలోకి రాగానే మండిపోయి మసైపోతాయి. కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే తోకతో మెరుపువేగంతో దూసుకొచ్చే తోకచుక్క ఇందుకు మినహాయింపు. ఆకాశంలో కనిపించినంతసేపు కనువిందు చేయడం దీని ప్రత్యేకత. అలాంటి తోక చుక్క ఒకటి మన సౌరమండలంలోకి అతిథిగా వచ్చిందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. దీనికి 3ఐ/అట్లాస్ అని నామకరణం చేశారు. చరిత్రలో ఇప్పటిదాకా సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన మూడో కొత్త తోకచుక్క ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని రియో హర్టాడో నగరంలో ఏర్పాటుచేసిన ఆస్ట్రరాయిడ్ టెరిస్ట్రియల్ –ఇంపాక్ట్ లాస్ అరైవల్ సిస్టమ్(అట్లాస్) సర్వే టెలిస్కోప్, అమెరికా శాన్డీగో కౌంటీలోని పాలమార్ అబ్జర్వేటరీ జ్వికీ టెలిస్కోప్లు ఈ తోకచుక్క రాకను జూలై ఒకటో తేదీన కనిపెట్టాయి. ధనస్సు రాశిగా పిలవబడే నక్షత్ర కూటమి వైపు నుంచి ఈ తోకచుక్క మన సౌరకుటుంబం దిశగా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.భూమికెలాంటి ప్రమాదం లేదన్న సైంటిస్టులుప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంతదూరం నుంచి వెళ్తుండటంతో దీని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనకారులు తేల్చిచెప్పారు. ఈ తోకచుక్క తన మార్గంలో పయనిస్తూనే సూర్యుని సమీపంగా వెళ్లనుంది. ప్రస్తుతం ఇది సూర్యునికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఆదిత్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. కేవలం 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అది తన పథంలో దూసుకుపోనుంది. అంటే అంగారక గ్రహం కంటే కూడా ఇది సూర్యుని సమీపానికి వెళ్లనుంది. సెప్టెంబర్ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు ఈ తోకచుక్కను టెలిస్కోప్ సాయంతో చూడొచ్చు. తర్వాత అది సూర్యుని ఆవలిదిశ వైపుగా వెళ్లడంతో భూమి మీద నుంచి తోకచుక్క సరిగా కనిపించకపోవచ్చు. మళ్లీ డిసెంబర్ తర్వాత కనువిందు చేయనుంది. గతంలో 2017లో ఒక తోకచుక్క, 2019లో మరో తోకచుక్క ఇలా మన సౌరకుటుంబంలోకి అలా అతిథులుగా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 1ఐ/ఓమువామూ, 2ఐ/బొరిసోవ్ తోకచుక్కల తరహాలోనే ఇది కూడా తోకచుక్కలకు సంబంధించిన మరింత వాస్తవిక సమాచారాన్ని అందించి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త తోకచుక్క కావడంతో దీని తోక పొడవు, వెడల్పుల వివరాలు ఇంకా తెలియలేదు. కొత్త తోకచుక్కను సీ/2025 ఎన్1 అనే పేరుతోనూ పిలుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్ కృష్ణా హోటల్కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్రెడ్డి, ప్రేంసాగర్ రావు, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్ నుంచి రేవంత్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హోటల్కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్ విప్ ఆఫర్ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హోటల్ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
పైరసీ నియంత్రణకి కఠిన చర్యలు: ‘దిల్’ రాజు
‘‘చిత్ర పరిశ్రమకి వీడియో పైరసీ అన్నది చాలా నష్టం కలిగిస్తోంది. ఈ పైరసీ నియంత్రణకి కఠిన చర్యలు చేపడుతున్నాం... ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పలు కీలక సమావేశాలు నిర్వహించాం. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్లకు ఆన్లైన్ అనుమతులపైనా చర్చించనున్నాం. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరం కలిసి సినీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీ సమస్యలను ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం’’ అని ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంక హామీ ఇచ్చారు. -
సార్ చెప్పేదంతా జ్యోతిష్యమే కదా!
సార్ చెప్పేదంతా జ్యోతిష్యమే కదా! -
ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించిన యూపీ కోర్టు
మౌ: ఉత్తరప్రదేశ్లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్ సింగ్పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ విద్యుత్ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది. ఈ సమయంలో సుధాకర్ సింగ్ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్ కోర్టు సింగ్కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. -
సైకో కిల్లర్గా చేయాలని ఉంది: వర్ష బొల్లమ్మ
‘‘హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశాను. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చినా చేస్తాను. స్క్రీన్పై వర్ష బాగా నటిం చిందనే పేరు తెచ్చుకుంటే చాలు. ఉదాహరణకు నిత్యా మీనన్గారికి మంచి పెర్ఫార్మర్గా పేరుంది. ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ‘తమ్ముడు’ కథ విన్నప్పుడు, ఈ సినిమాలో నేను చేసిన చిత్ర క్యారెక్టర్ కొత్తగా అనిపించింది.సవాల్గా తీసుకుని, ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. నితిన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, బాల నటి శ్రీరామ్ దిత్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా ‘తమ్ముడు’. కానీ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ జైకి ఓ డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటుంది చిత్ర పాత్ర.ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలనుకునే మనస్తత్వం చిత్రది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక ఓ సైకో కిల్లర్ రోల్ చేయాలన్నది నా ఆకాంక్ష. ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్, మరో వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి’’ అని అన్నారు. -
అమెరికా–పాక్ రక్షణ బంధం బలోపేతం!
వాషింగ్టన్: అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్ సిందూర్లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్(పీఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎస్ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది. తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్–16 బ్లాక్ ఫైటర్జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్–టు–ఎయిర్ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది. -
పొగాకు రైతుల వెతలు తీరాలి!
పొగాకు కంపెనీలు బర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా రైతుల ఆశలపై నీళ్లుజల్లాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంపెనీల చేత పొగాకు కొనుగోలు చేయించటంలో విఫలమైంది. అత్యంత శక్తిమంతమైన ఐటీసీ, బ్రిటిష్ అమెరికన్, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఫిలిప్ మోరిస్ తదితర పొగాకు కంపెనీలు ఏపీ ప్రభుత్వ మాటను వినలేదు. తమకు అనుకూలమైన ధరకు, కొంత మేరకే పొగాకును కొనుగోలు చేస్తామని భీష్మించుకు కూర్చున్నాయి. గత సంవత్సరం బర్లీ పొగాకును క్వింటాల్కు రూ. 15,000 కు కొన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ ఖర్చులు, కౌలు, కూలీ రేట్లు పెరిగాయి. కనీసం గత సంవత్సరం కొన్న ధరకైనా కొనమని స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి లాం ఫారమ్ మీటింగులో అడిగినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం మరొక మెట్టు దిగి రెండు, మూడు వలుపుల హైగ్రేడ్ క్వింటాల్ పొగాకు ధర రూ. 12 వేలు, మొదటి వలుపు లోగ్రేడ్ పొగాకు ధర 6 వేలుగా (ధరలను తగ్గించి) ప్రకటించింది. అయినా కంపెనీలు తమ పట్టు వదల లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పొగాకు కంపెనీలతో మాట్లాడినా ప్రయోజనం లేదు. పొగాకును కొనుగోలు చేయమని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు కలెక్టర్ కార్యాలయాల వద్ద; పర్చూరు, పంగులూరు, చిలకలూరిపేట, యడ్లపాడు, కారంచేడు, యద్దనపూడి, పెదనందిపాడు మరికొన్ని తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. చిలకలూరిపేట, పర్చూరు, పంగులూరు, ఇంకొల్లు, ఒంగోలులో రైతు సదస్సులు జరిపి పొగాకును కొనిపించమని ప్రభుత్వాన్ని కోరారు. చిలకలూరిపేటలో ఐటీసీ కంపెనీ ముందు మే నెల 27, 28 తేదీల్లో నిరసన దీక్ష చేశారు. గుంటూరులో జీపీఐ కంపెనీ ఎదుట జూన్ 5న తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించామని ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు దిగటం రైతుల ఆందోళనకు లభించిన విజయం. రైతు ఉద్యమిస్తేనే వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని మరోసారి నిరూపితమయ్యింది. అయితే ప్రభుత్వం తన మాట మీద నిలబడి చివరి ఆకు కొనుగోలు చేసేంతవరకూ రైతులు అప్రమత్తంగా ఉండాలి. మొదట 350 కోట్ల రూపాయలను నల్ల బర్లీ పొగాకు కొనుగోలుకు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 300 కోట్లన్నారు. చివరకు 270 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పొగాకు కొనుగోలు చాలా నెమ్మదిగా సాగుతోంది. రైతుల వద్ద పొగాకు చాలావుంది. ఆలస్యం అయ్యే కొద్దీ రైతులకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి. అప్పులు, వడ్డీలే కాకుండా పొగాకు చెడిపోతుంది. బరువు తగ్గుతుంది. ఈ విధంగా కొనుగోలు జరిగితే... రైతుల దగ్గర ఉన్న మొత్తం పొగాకును కొనడానికి ఇంకా రెండు మూడు నెలలు పడుతుంది. ఎక్కువ మంది రైతులు పొగాకు బేళ్ళను కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకోవటానికి మార్క్ఫెడ్ అనుమతించటం లేదు. ముందుగానే వాట్సాప్ మెసేజ్ ద్వారా రైతుకు తెలియజేసి కొద్ది మందినే పిలుస్తున్నారు. బయ్యర్ కొద్ది సమయంలోనే 300 బేళ్ళు కొనగలుగుతున్నాడు. స్పీడ్గా కొనగలిగిన శక్తి కలిగిన సిబ్బంది ఉన్నా అతి నెమ్మదిగా ప్రభుత్వం కొంటోంది. పొగాకులో తేమ ఉందని కొనడానికి తిరస్కరిస్తున్నారు. తేమ పరిమితులను సవరించాలి. కొనుగోలు కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. పెదనందిపాడు, ఇంకొల్లు లాంటి చోట్ల కొనుగోలు కేంద్రాలను పెట్టాలి. జిల్లా సరిహద్దులు అడ్డంకిగా ఉండరాదు. దగ్గరగా ఉన్న గ్రామాల రైతులను గుంటూరు పొమ్మనకుండా కంప్యూటర్ సహాయంతో వివరాలను సేకరించి దగ్గరలో అమ్ముకునే అవకాశం ఇవ్వాలి. గోడౌన్లు అందుబాటులో లేకపోతే కొనుగోలు పాయింట్ పెట్టి పొగాకు కొనాలి. కొన్న పొగాకును దగ్గర ఉన్న గోదాములకు తరలించాలి. పొగాకును కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు వెంటనే రావటం లేదు. ఆలస్యం లేకుండా రైతులకు డబ్బులు వచ్చేలా చూడాలి. పొగాకు కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తగ్గిపోయింది. దీంతో నాణ్యమైన పొగాకును తక్కువ ధరకు తీరికగా కొనుక్కుంటున్నారు.మరోవైపు రైతుల ఆందోళన రోజురోజుకూ ఉద్ధృతమౌతున్నది. స్థానిక శాసనసభ్యులు, మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. మూడుసార్లు వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు రైతులతో సమావేశమయ్యారు. అయినా కంపెనీలు వాటి పంథా మార్చుకోలేదు. దేశాధిపతులనే మార్చగలిగిన చరిత్ర ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క అనిపించినట్లు లేదు. అటువంటి అభిప్రాయం రాకుండా ప్రభుత్వం చూడాలి. పొగాకు కొనమని కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. మల్టీ నేషనల్ కంపెనీల పవర్కు ప్రభుత్వం తలొగ్గరాదు.డా‘‘ కొల్లా రాజమోహనరావు వ్యాసకర్త నల్లమడ రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్గామ్ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది. -
కొనసాగుతున్న జడ్జీల ఎంపిక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జీ పోస్ట్లను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తన ఎంపిక విధానాన్ని మరింతగా కఠినతరం చేసింది. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి రెండు రోజుల్లో 54 మంది అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమగ్ర వివరాలను కొలీజియం పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన కోలీజియం జూలై 1, 2 తేదీల్లో అభ్యర్థులతో విస్తృతంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొదటి రోజున 20 మందితో, రెండో రోజున 34 మందితో సమావేశమైంది. అభ్యర్థుల పనితీరు, బయోడేటా, అనుభవం వంటి అంశాలపై అరగంటపాటు ప్రశ్నలు సంధిస్తూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటివరకు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టులు, అలాగే సంబంధిత హైకోర్టులకు చెందిన సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయాలపైనే ఆధారపడుతూ నియామకాలు జరిగేవి. కొలీజియం ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో సిఫారసుల ఆమోదంలో ఆలస్యాలు రావడం వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. కొంతమంది అభ్యర్థులు వీలైనంతకాలం ఎదురు చూడలేక తమ అభ్యర్థిత్వం వెనక్కి తీసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన అప్రకటిత నగదు కేసు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు వంటి పరిణామాల నేపథ్యంలో కొలీజియం ఈసారి తన పరిశీలనను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, జిల్లా న్యాయవ్యవస్థ నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఒక రోజు, బార్ అభ్యర్థుల కోసం మరొక రోజు కేటాయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 371 ఖాళీలుండగా ఇందులో తెలంగాణ హైకోర్టులో 16, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
‘అణు వివక్ష’ అంతమయ్యేనా?
భారత అణు కేంద్రాలు ఏపాటి సురక్షితమైనవి? చెర్నోబిల్ అణు కేంద్ర ప్రమాదం (1986) తర్వాత భారత్ అణుశక్తి సంస్థ అధిపతికి ఈ ప్రశ్న ఎదురైంది. ‘‘మన అణు కేంద్రాలు ఎంత సురక్షితమైనవంటే వాటిని ఒక క్షిపణి తాకినా, విమానం వాటిపై కూలినా అవి చెక్కుచెదరవు’’ అని ఆయన జవాబిచ్చారు. అణు విద్యుత్ కేంద్రాన్ని లేదా తత్సంబంధిత సదుపాయాలను నెలకొల్పేటప్పుడు యుద్ధంతో సహా ఎటువంటి విపత్తు సంభవించినా తట్టుకుని నిలబడేటట్లు అణు ఇంజనీర్లు ప్లాన్ చేస్తారు. ఏ అణు సదుపాయాన్ని ఏర్పాటు చేసేటప్పుడైనా దాని భద్రతకు ప్రధానంగా పూచీ వహేంచే అంశం ఏదైనా ఉందీ అంటే అది దానిని ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆ భౌగోళిక ప్రాంతమే. భౌగోళిక సుస్థిరతతోపాటు జనావాసాలకు దూరంగా ఉండటం ముఖ్యం. సాధారణంగా అటువంటి సదుపాయాలు వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా అంతర్జాతీయ సరిహద్దులకు దూరంగా ఉంటాయి. అణుదాడులు బాధ్యతారాహిత్యంఇరాన్లోని ఫర్దో, నతాంజ్, ఇస్ఫహాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫర్దో యురేనియం శుద్ధి సదుపాయాన్ని ఇరాన్ కేంద్ర ప్రాంతంలో పర్వతాల లోపల లోతున నిర్మించారు. యరేనియం శుద్ధి కేంద్రాలు, ఇంధన కడ్డీల తయారీ యూనిట్లు, విద్యుదుత్పాదన కేంద్రాలు, వ్యర్థాలను భద్రపరచే ప్రదేశాలు వంటి అణు సదుపాయాల భద్రత... అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ ఆందోళనకర అంశంగానే ఉంటూ వస్తోంది. యాదృచ్ఛికంగానైనా లేదా ఉద్దేశపూర్వకంగానైనా ఎలాంటి ప్రమాదం సంభవించినా అది అణు ధార్మికత విడుదలకు కారణమై అటు మానవాళికి, ఇటు పర్యావరణానికి హానికరంగా పరిణమించవచ్చు. ఇటీవలి ఘర్షణలో ఆ మూడు చోట్ల వైమానిక దాడుల్లో అణు రియాక్టర్లను లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు. ఫలితంగా, వాటి చుట్టూ ఉన్న ఇతర సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంలో ఈమధ్య ఉక్రెయిన్లోని జపొరియిష వంటి అణు సదుపాయాలు దాడులకు లోనుకావచ్చని వాటి భద్రతపై ఆందోళన నెలకొంది. అలాగే, ఉత్తర కొరియా కూడా అణు బూచికి చిరునామాగా మారింది. పైగా, అది అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం లేదు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇలాంటి విషయాల్లో ప్రపంచ పెద్దమనిషిగా వ్యవహరించవలసి ఉంది. అణు విచ్ఛిత్తి పదార్థాల రవాణాతోపాటు, అణు ధార్మికతకు దారితీయగల ప్రమాదాలపై అది ఒక కన్ను వేసి ఉంచుతుంది (తాజాగా ఐఏఈఏకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ నిర్ణయించింది). ఒక రియాక్టర్ పై దాడి జరిగి, అది ధ్వంసమైతే దాని నుంచి విడుదలయ్యే అణు ధార్మికత సుదూర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనల్లో అదే జరిగింది. రెండు దేశాల మధ్య ఘర్షణలు సాగుతున్నప్పుడు ఏ పక్షమైనా సరే రెండవ పక్షానికి చెందిన అణు రియాక్టర్పై దాడికి దిగినా, ధ్వంసం చేసినా అది సదరు దేశం పక్షాన పూర్తి బాధ్యతారాహిత్యం అవుతుంది. అసమానతే అంతస్సూత్రమా?రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో సైన్స్లో ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది. ఐఏఈఏ 1957లో ఏర్పడడానికి ప్రేరణ ఇచ్చిన అంశాల్లో అది కూడా ఒకటి. ప్రభుత్వాలనన్నింటినీ ఒకచోట చేర్చడం, టెక్నాలజీ అంశాలపై వాటికి దారి చూపడం, అణు శక్తి శాంతియుత ప్రయోజనాలపై సమాచారాన్ని క్రోఢీకరించడం అనే భావనతో అది ఏర్పడింది. ఐఏఈఏ ఏర్పాటుకు దారితీసిన చర్చల్లో భారత్ కూడా పాల్గొంది. అందులో భారత్ వ్యవస్థాపక సభ్యురాలు. కొన్ని దశాబ్దాలుగా, ఆ సంస్థ గవర్నర్ల బోర్డులో సభ్యురాలిగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తోంది. అణు శక్తిని ద్వంద్వ ఉపయోగ టెక్నాలజీగా వినియోగిస్తున్నారు. దాంతో, ఆ కార్యకలాపాలు గోప్యంగా సాగుతూ, సమాచార వినిమయం క్లిష్టంగా మారింది. అణు పదార్థాలను సురక్షితంగా వ్యవహరించేటట్లు చూడటంతోపాటు, అణ్వాయుధాల తయారీకి వాటిని బదలాయించకుండా నివారించడం కూడా ఐఏఈఏ ప్రధాన కర్తవ్యం. కానీ, ఆది నుంచి కూడా ఈ నిఘా సంస్థ విధి నిర్వహణలో ఒక రకమైన అసమానత అంతర్లీనంగా ఉంటూ వస్తోంది. ఐఏఈఏ వైజ్ఞా్ఞనిక సలహా మండలికి మన హోమి జహంగీర్ భాభా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ మండలి, 1960లలో ప్రతిపాదించిన సురక్షితా ప్రమాణాల స్వరూప స్వభావాలపై కఠిన వైఖరిని అవలంబించింది. ఎటువంటి తనిఖీలకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పిన కొన్ని దేశాలకు ఒక తరహా నిబంధనలు, ఐరోపా దేశాలకు మరో రకమైన నిబంధనలు విధించడాన్ని ప్రశ్నించింది. మిగిలిన దేశాలను మాత్రం కఠినమైన నిరోధాలు, తనిఖీలకు లోనుచేశారు. అణు శక్తి రంగంలో ఐరోపా దేశాలు ఎంతో ప్రగతిని సాధించినందువల్ల వాటి భద్రతను అవి చూసుకోగలవనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. అయితే, ఈ వ్యవస్థతో ఏకీభవించనివారు దిగ్భంధనాలను ఎదుర్కోవలసి వస్తోంది. అణు విస్ఫోటనాలను సైనికేతర ప్రయోజనాలకు వినియోగించినా వివాదం నెలకొంటోంది. భారీ స్థాయి ఇంజినీరింగ్, గనుల తవ్వకం, ఇతర తవ్వకాలు లేదా భూగర్భ జలాశయాలను నిర్మించడం వంటివి ఆ కోవలోకి వస్తాయి. ప్రాజెక్ట్ రూలిసన్ వంటి శాంతియుత విస్ఫోటనాలను అమెరికా నిర్వహించినప్పుడు, వాటిని వైజ్ఞానిక విజయాలుగా జేజేలు కొట్టారు. మన దేశం 1974లో శాంతియుత విస్ఫోటనాన్ని నిర్వహించినపుడు మనపై ఆంక్షలు విధించారు. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించగల సామర్థ్యాన్ని సంతరించుకోగల స్థితిలో ఉందనే అభిప్రాయమే ఇరాన్ అణు సదుపాయాలపై ఇటీవల అమెరికా దాడులకు కారణం. అందరికీ ఒకే న్యాయంఅణు శక్తి దాని తొలినాటి శాస్త్రీయ సహకార పరిధిని ఏనాడో అతిక్రమించింది. భారీ పారిశ్రామిక కార్యకలాపాలతో అది ఇపుడు ముడిపడి ఉంది. అణు కార్యకలాపాలు అపారమైన ఆర్థిక పెట్టుబడులు, భౌగోళిక రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగినవిగా రూపాంతరం చెందాయి. భారత్తో సహా, అనేక దేశాలలో అణు శక్తి రంగంలోకి ప్రైవేటు సంస్థలు అడుగిడబోతున్నాయనే మాటలు వినవస్తున్నాయి. ప్రైవేటు అణు విద్యుదుత్పాదన కేంద్రాలు ఐఏఈఏ పర్యవేక్షణలోకి పరోక్షంగా వస్తాయి. అవి దానికి విధేయత చూపేటట్లు చూడవలసిన బాధ్యత ఆ యా ప్రభుత్వాల పైనే ఉంటుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద తనకు లభించిన సంప్రదాయ సిద్ధమైన నిఘా పాత్రతోపాటు, అలాంటి సవాళ్లకు కూడా ఐఏఈఏ తనను తాను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. దేశాలు అణు పదార్థాలను ఆయుధాల తయారీకి తరలించకుండా చూడటం ఆ ఒప్పందం ప్రకారం ఐఏఈఏకి అప్పగించిన ప్రాథమిక కర్తవ్యం. అంతర్జాతీయ సుస్థిరతకు, న్యూక్లియర్ టెర్రరిజం బెడదను తగ్గించడానికి పరిస్థితులను సరిచూసే, తనిఖీ వ్యవస్థ కీలకం. కానీ, దాని పనితీరు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడంలో ఐఏఈఏ పాత్రను చాలా దేశాలు బలపరుస్తున్నాయి. కానీ, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, అణు సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికీ సమాన సౌలభ్యం ఉండాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బిహార్లో ఒంటరి పోరు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం విపక్ష ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చే కీలక ప్రకటన చేశారు. వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలకు ఉద్దేశించింది మాత్రమేనని పేర్కొన్నారు. ‘ఆప్ బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు మాత్ర మే. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు లేదు. పొత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ గుజరాత్లోని విశావదర్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసింది. కాంగ్రెస్ కేవలం ఆప్ను ఓడించేందుకు పోటీ చేసింది. ఆప్ను ఓడించేందుకు, ఓట్లను తగ్గించేందుకు కాంగ్రెస్ను బీజేపీ పంపింది’అని అహ్మదాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బిహార్లో ఆప్ తన ఎన్నికల అరంగేట్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టిందన్నారు. తమ నిర్ణయం ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను సవాల్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా అభివరి్ణంచారు. అదే సమయంలో గుజరాత్లో ఆప్ రాజకీయ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. అయినప్పటికీ బీజేపీ పదేపదే గెలుస్తోంది. దీనికి కారణం అక్కడ బలమైన ప్రత్యామ్నా యం లేకపోవడమే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ జేబులో ఉంది. ఒకవిధంగా బీజేపీని గెలిపించే కాంట్రాక్ట్ను కాంగ్రెస్ తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్ను నమ్మరు. కాంగ్రెస్కు ఓటేస్తే గెలవరని, గెలిచినా బీజేపీలోకి వెళ్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఆప్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గుజరాత్ను మొదటి 30 ఏళ్లు కాంగ్రెస్, తర్వాత 30 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇప్పుడు ఆప్కు అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు దెబ్బేఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్ సైతం ఈ ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశముంది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బిహార్లో ప్రజల వద్దకు వెళ్తామని, పట్టణ పేదలు, గ్రామీణుల ప్రజలను చేరుకునేలా తమ వ్యూహం ఉంటుందని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ఆప్ నిజంగా అదే వ్యూహంతో ముందుకెళితే ఇండియా కూటమి ఓట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఇండియా కూటమి 9 స్థానాలను గెలుచుకుంది. ఆప్ పోటీలో నిలిస్తే కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్ల వాటాను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇది పరోక్షంగా ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చనుంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 52 శాతం, ఇండియా కూటమి 42 శాతం ఓట్లను సాధించాయి. ఇప్పుడు ఆప్ పోటీలో ఉంటే ఇండియా కూటమికు నష్టం జరిగే అవకాశం ఉంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతాయ పార్టీల ఆధిపత్యం ఉండే బిహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్ నిర్ణయం ఇండియా కూటమికి నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు సైతం లెక్కలు వేస్తున్నారు. ఆప్ కనీసంగా 5–10శాతం ఓట్లు సాధించినా, అది ఎన్డీఏకే కలిసొస్తుందని అంటున్నారు. ఈ ఓట్ల శాతం రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా తనను ప్రకటించుకునేందుకు ఆప్కు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్దీప్, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్లో ఉన్నారు. -
కాంతా లగా ఫేమ్ ఆకస్మిక మరణం.. ఆమెను తలచుకుని భర్త ఎమోషనల్!
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.పరాగ్ తన పోస్ట్లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. View this post on Instagram A post shared by Parag Tyagi (@paragtyagi) -
‘దెబ్బలతో నడవలేని స్థితిలో మహిళా విద్యార్ధినులు ఉన్నారు’
విజయవాడ: పర్మినెంట్ రిజస్ట్రేషన్ల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు. అయితే గాయాల పాలైన వైద్య విద్యార్థులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను కలవడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. అతికష్టం మీద ఇద్దరు విద్యార్థులతో మాత్రమే మాట్లాడేందుకు దేవినేని అవినాష్కు అనుమతి ఇచ్చారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘ ఈ ప్రభుత్వ వైఖరితో 1500 మంది విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేయడం దుర్మార్గం. పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణం. మహిళా విద్యార్థులని చూడకుండా పోలీసులు లాగి పడేశారు. దెబ్బలతో నడవలేని స్థితిలో మహిళా విద్యార్థినులు ఉన్నారు. వైద్య విద్యార్థుల మీద కూడా చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే విదేశీ వైద్య విద్యార్ధులు చేసిన పాపం. విదేశీ వైద్య విద్యార్ధులకు అండగా ఉంటాం. వారి డిమాండ్లు నెరవేరే వరకూ పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వైద్య విద్యార్థులపై మరోసారి పోలీసు జులుం.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. -
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
కుమారుడితో హీరోయిన్ అమలాపాల్ పోజులు..కలర్ఫుల్ శారీలో అనసూయ అదిరిపోయే లుక్స్..మొబైల్తో బిజీ బిజీగా సురేఖవాణి కూతురు సుప్రీత..బ్లాక్ బ్యూటీలా బిగ్బాస్ ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు. -
లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
వ్యక్తిగత, గృహ, వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని ఫ్లోటింగ్-రేట్ రుణాలకు వర్తించే ప్రీ-పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది. గృహ రుణాలు, వ్యాపార అవసరాల కోసం తీసుకున్నవి, వ్యక్తులు, ఎంఎస్ఈలు పొందిన రుణాలన్నింటికీ ఆర్బీఐ కొత్త నిబంధన వర్తిస్తుంది. 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు, అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది.ఈ మేరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు (కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, అఖిల భారత ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఏదైనా ఫ్లోటింగ్ రేటు టర్మ్-లోన్పై జప్తు ఛార్జీలు / ప్రీ-పేమెంట్ పెనాల్టీలను విధించడానికి వీల్లేదని ఆర్బీఐ సర్క్యులర్ తెలిపింది. ఎంఎస్ఈలకు సులభమైన, సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది.ఎంఎస్ఈలకు మంజూరు చేసిన రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల విధింపునకు సంబంధించి నియంత్రిత సంస్థల (ఆర్ఈ) మధ్య భిన్నమైన పద్ధతులను ఆర్బీఐ పర్యవేక్షక సమీక్షల్లో గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు, వివాదాలు కూడా వెల్లువెత్తాయి. ముసాయిదా సర్క్యులర్పై వచ్చిన స్పందన, ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పుడు ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. -
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’
ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో హడలిపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ సలహాదారు రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో భారత్ ఏమైనా అణు యుద్ధాన్ని ఆరంభించిందా అనే ఆలోచనలో పడ్డామన్నారు. రావల్పిడింలోని తమ ప్రధాన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్బేస్పై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిన క్రమంలో కాసేపు తాము అలా చూస్తూ ఉండిపోయామన్నారు. ప్రధానంగా 30 నుంచి 45 సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తమ సైన్యంలో ఏర్పడిందన్నారు. తొలుత అణు యుద్ధంగా భావించామని, తర్వాత తేరుకుని మిసైల్తో దాడి చేశారనే విషయాన్ని గ్రహించామన్నారు.‘ భారత్ న్యూక్లియర్ వార్హెడ్ను భారత్ ఉపయోగించకపోవడంతో వారు మంచి చేశారని నేను చెప్పడం లేదు. మా దేశ ప్రజలు మాత్రం దీనిపై కచ్చితంగా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారు. అది అణు యుద్ధమేనని మా ప్రజలు అనుకుని ఉంటారు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ న్యూక్లియర్ వార్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేది’ అని రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు.పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఆ బ్రహ్మోస్ క్షిపణి మెరుపుదాడిలో పాకిస్తాన్లో పలు ప్రాంతాలు అతలాకులమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్బేస్ పరిధిలోని పాకిస్తాన్ శాటిలైట్ వ్యవస్థ నాశనమైంది. పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్బేస్ ప్రాంతంలో భారత్ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సైతం నూర్ ఖాన్ ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసి పాక్ను కోలునీయకుండా చేసింది. -
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ గురువారం హైదారబాద్లోని యశోదా ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ యశోదా ఆస్పత్రి వైద్యులతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. -
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులు సాధించాడు.కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలుఈ మ్యాచ్లో 269 పరుగులు చేసి ఔటైన గిల్.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో గిల్ కోహ్లి ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా అవతరించాడు. గిల్ కెప్టెన్గా తన మూడో ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత కెప్టెన్లు..గిల్-269కోహ్లి-254 నాటౌట్ (2019)కోహ్లి-243 (2017)కోహ్లి-235 (2016)ధోని-224 (2013)టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లు..వీరేందర్ సెహ్వాగ్ - 319వీరేందర్ సెహ్వాగ్ - 309కరుణ్ నాయర్ - 303*వీరేందర్ సెహ్వాగ్ - 293వీవీఎస్ లక్ష్మణ్ - 281రాహుల్ ద్రవిడ్ - 270శుభ్మన్ గిల్ - 269ఇంగ్లండ్లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్బాస్టన్, 2003269 - శుభ్మన్ గిల్ (IND), ఎడ్జ్బాస్టన్, 2025259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004269 - శుభ్మన్ గిల్ vs ENG, ఎడ్జ్బాస్టన్, 2025254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006గిల్ సాధించిన మరిన్ని రికార్డులు..ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్..ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్.. ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. గిల్ ఔటయ్యాక భారత్ అదే స్కోర్ వద్ద ఆకాశ్దీప్ (6) వికెట్ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 583/9గా ఉంది. సిరాజ్ (7), ప్రసిద్ద్ కృష్ణ (2) క్రీజ్లో ఉన్నారు.యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్ (42), గిల్ (269), ఆకాశ్దీప్ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, టంగ్, బషీర్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించింది.అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది. -
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
హెచ్ఎంఏ అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది. -
‘మరాఠిని అవమానిస్తే ఉపేక్షించం’
ముంబై: ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాషకు సంబంధించి రగడ మొదలైంది. ఇప్పటికే త్రి భాషా పాలసీ తీర్మానాన్ని రద్దు చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు మరాఠి భాషను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపుతున్నాయి. . ఓ షాపు కీపర్ మరాఠి భాష మాట్లాడలేదనే కారణంతో అతనిపై ఓ వర్గం దాడికి దిగడంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఎవరూ కూడా ఈ తరహా దాడులు చేసి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూనే మరాఠీ భాషను మహారాష్ట్రలో ఉండేవారు ఎవరైనా అవమానిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎమ్మెన్నెస్కు చెందిన కార్యకర్తలు పలువురి కలిసి ఓ స్టీట్ షాపు కీపర్పై దాడి చేశారు. సదరు షాప్ కీపర్ మరాఠీ మాట్లాడనందుకు, ఆ భాషా మాట్లాడటం ఏమైనా తప్పనిసరి చేశారా? అని ప్రశ్నించినందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఆదిత్యా ఠాక్రే మాట్లాడారు. ఎవరైన మరాఠీ భాషను అవమానిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఎవరూ భౌతిక దాడులకు దిగవద్దని, మరాఠీ భాషన అవమానించే వారికి చట్టపరంగా బుద్ధి చెబుదామన్నారు.ఇప్పుడు దీనిపై అధికార బీజేపీకి ప్రతిసక్ష పార్టీలకు మహారాష్ట్రలో తీవ్ర రగడ జరుగుతోంది. మరాఠీ భాష మాట్లాడడం అనేది తప్పనిసరిక, కానీ ఇలా భాష మాట్లాడలేదని దాడులకు దిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని మహారాష్ట్ర మంత్రి,, శివసేన నాయకుడు యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. #WATCH | Mumbai | On a viral video of a shop owner in Thane assaulted for purportedly refusing to speak in Marathi, Maharashtra Minister Yogesh Kadam says, "In Maharashtra, you have to speak Marathi. If you don't know Marathi, your attitude shouldn't be that you won't speak… pic.twitter.com/kSXV1JekAn— ANI (@ANI) July 3, 2025 -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
ప్రజాగ్రహం దెబ్బకు తలొగ్గిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి,ఢిల్లీ: ప్రజాగ్రహంతో ఢిల్లీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) వెహికల్ పాలసీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పాత వాహనాలపై నిషేధంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు నష్టపోకుండా.. ప్రయోజనం చేకూరేలా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.వాహనం వయస్సు ఆధారంగా కాకుండా వాతావరణం కాలుష్యం చేసే వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. వాహనాల కాలుష్యం విషయంలో యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఢిల్లీతో పాటు ఇతర ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.క్వాలిటీ ఎయిర్ మేనేజ్మెంట్ నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు పాలసీ అమలును నిలిపి వేయనుంది. ఇది వాహన యజమానులకు తాత్కాలిక ఊరట కలిగించినా, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. Delhi Environment Minister Manjinder Singh Sirsa writes to the Commission for Air Quality Management to place on hold the enforcement of Direction No. 89, which mandates the denial of fuel to End-of-Life (EOL) vehicles in Delhi"We urge the Commission to put the implementation… pic.twitter.com/mgg1Ymdaes— ANI (@ANI) July 3, 2025 -
పీఎస్లే కేంద్రంగా పంచాయితీలు
‘పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదం.. ఇదంటే పోలీసులకు వీనుల విందు, బహు పసందు కూడా. క్రిమినల్ కేసులో ఏముంటుంది... పరిశోధన, తిరగడం, చాకిరీ... అదే సివిల్ కేసుల్లో అయితే... డబ్బే డబ్బు. నగరంతో పాటు చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు పెరిగిపోయాయి. ఇలాంటి వివాదాలన్నీ చివరకు పోలీసుల వద్దకే చేరుతున్నాయి. దీంతో కొందరు పోలీసులు తమ సివిల్ సెటిల్మెంట్లకు పోలీసుస్టేషన్లనే అడ్డాలుగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో న్యాయస్థానాలు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఆ విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ... ఇప్పుడు అనేక పోలీసుస్టేషన్లలో భూ వివాదాలను పరిష్కరించడం మామూలు విషయంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సివిల్ వివాదాలు లేకపోతే స్టేషన్తో పాటు అధికారుల ఖర్చులు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. తమ జేబులు నింపేవి కూడా అవే కావడంతో కింది స్థాయి పోలీసులు వాటి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే బయటపడితే ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో సాధ్యమైనంత వరకు కేసు రిజిస్టర్ చేయకుండానే వ్యవహారం చక్కబెడుతుంటారు. అప్పటికీ సెటిల్ కాకపోతే తాము ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఇరు వైపుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఆ తర్వాత కథ నడిపిస్తున్నారు. కేసు నమోదయితేనే సివిల్ కేసుల్లో తలదూర్చుతున్నారని తెలుస్తోంది. అసలు కేసే నమోదు చేయకపోతే? పోలీసులకు ఇబ్బందే ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కేసు నమోదు తప్పనిసరిగా మారుతుంది. అలాంటప్పుడు తమకు అనుకూలమైన లాయర్ల వద్దకు క్లైంట్స్ను పంపే పోలీసులు కోర్టు రిఫర్డ్ ద్వారా రమ్మని చెప్పి కేసులు నమోదు చేస్తుంటారు. వాటి విభజన చాలా కష్టం... ‘ఇచ్చట సివిల్ కేసులు నమోదు చేసుకోం... వివాదాలు పరిష్కరింపబడవు’ దాదాపు ప్రతి పోలీసుస్టేషన్లోనూ ఈ బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. అయితే సివిల్ కేసులు నమోదు చేసుకోవడం మానేసిన ఖాకీలు... వచ్చిన కేసునల్లా సెటిల్మెంట్ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. దీనికి కారణం భూ వివాదాల్లో సివిల్, క్రిమినల్ విభజించడం చాలా కష్టం. ఈ రెండింటి మధ్యా ఓ చిన్న గీత మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే... అది సివిల్ వివాదం అవుతుంది. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులకు, దాడులకు దిగితే అది క్రిమినల్ కేసుగా మారుతుంది. అంటే.. పోలీసుల చేతికి వచ్చినట్లే. ఈ పరిణామాల నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన చర్యలు లేకుండా పోలీసులను, సివిల్ కేసులను వేరు చేయడం సాధ్యంకాదని వినిపిస్తోంది. అవన్నీ అటకెక్కిపోయాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.చదవండి: అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా.. అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు (ఎస్ఓపీ) రూపమిచ్చి వెబ్సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
ENG VS IND 2nd Test: భారీ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్ తర్వాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్కు టెస్ట్ల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మైలురాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా..ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్గా.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఇప్పటికే భారీ స్కోర్ చేసేసింది. డబుల్ సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్దీప్ (0) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామం సమయానికి భారత్ స్కోర్ 565/7గా ఉంది.310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. లంచ్ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్, వాషింగ్టన్ సుందర్తో (42) కలిసి ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్ తలో వికెట్ పడగొట్టారు. -
‘కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. వారితో సంబంధం లేదు’
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నిఅంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి అన్నారు. తమకు హరీష్ రావు, కేటీఆర్లతో సంబంధం లేదని, వారు తమ లెక్కల్లోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘ హరీష్రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలి. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం. కేసీఆర్తోనే లెక్క.. హరీష్రావు ఎవరో నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్రావు, కేటీఆర్లు,. కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్కు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు, కేటీఆర్లు కీలకం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని మణిహారంగా ఉన్న జలమండలి ఇక మహా జలమండలిగా మారనుంది. తాగునీటి, సీవరేజీ నెట్వర్క్ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాలకు నెట్వర్క్ ఉండగా, వెలుపల కూడా విస్తరించే చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో నాలుగు దిక్కులా విస్తరిస్తున్న నగర భవిష్యత్తు, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టి పెట్టుకొని సీవరేజీ, వాటర్ ప్రాజెక్టు సమగ్ర నివేదిక రూపకల్పనకు ఆదేశించారు. 2050 చదరపు కిలోమీటర్లు జలమండలి నెట్వర్క్ 1,450 చదరపు కిలోమీటర్ల వరకు ఉండగా.. 2,050 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కోర్ సిటీలో 169.3 చ. కి.మీటర్లు, చుట్టుపక్కల 518.9 చ.కి.మీటర్లు, ఓఆర్ఆర్ పరిధిలో 762 చ.కి.మీటర్లు విస్తరించి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో 600 చ.కి.మీటర్ల నెట్వర్క్ కోసం కసరత్తు చేస్తోంది. మహా విస్తరణ మాస్టర్ ప్లాన్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. వాటర్, సీవరేజ్ పైప్లైన్లతోపాటు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టి శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం కోసం కూడా దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయాలని యోచిస్తోంది.జలమండలి పరిధిలోకి... శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్దఅంబర్పేట, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలు ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్నాయి. దీంతో వాటిని కూడా జలమండలి (Jalamandali) పరిధిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.చదవండి: అక్కడ అలా.. ఇక్కడ ఇలా..! ఓఆర్ఆర్ పరిధిలో.. ఇప్పటికే ఓటర్ రింగ్రోడ్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల తాగునీటి సరఫరా కోసం ఓఆర్ఆర్ తాగునీటి ప్రాజెక్టు–1, 2 దశలను పూర్తి చేసి సేవలందిస్తోంది. ఓఆర్ఆర్–1 కింద జీహెచ్ఎంసీ పరిధి అవతల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 190 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు సుమారు రూ.124 కోట్ల అంచనా వ్యయంతో 70 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల 164 రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు దాదాపు రూ.527 కోట్ల వ్యయంతో 1,601 కిలో మీటర్ల మేర పైపులైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టు–2 కింద సుమారు 189 కోట్ల అంచనా వ్యయంతో 140 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన 71 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం, సుమారు రూ.778 కోట్ల అంచనా వ్యయంతో 2,758 కిలోమీటర్ల మేర కొత్త పైపులైను నెట్వర్క్ పూర్తి చేసి సేవలు అందిస్తోంది. -
IND vs ENG: గంభీర్ ఏం చేస్తున్నాడు?.. కుమార్ సంగక్కర ఫైర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన శుబ్మన్ గిల్కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్మన్ గిల్.. లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
సిగాచి పరిశ్రమలో నిపుణుల కమిటీ..
సంగారెడ్డి: ఇటీవల పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 40 మంది వరకూ మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయింది దీనిపై నిపుణుల కమిటీ బృందం ఈ రోజు(గురువారం, జూలై 3వ తేదీ) సిగాచి పరిశ్రమలో ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మూడున్నర గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసింది. పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్ పని చేసిందా?, చేయలేదా అనే దానిపై నిపుణుల కమిటీ ప్రధానంగా పరిశీఇంచింది. దీంతో పాటు అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతి ఏంటి?, తయారు చేస్తున్నదేంటి అన్న కోణంలో సైతం విచారణ చేపట్టింది నిపుణుల కమిటీ బృందం. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికి ఎన్నిసార్లు మిషనరీ మార్చారో నిపుణులు కమిటీ తలుసుకుంది. చివరిగా పరిశ్రమలో సెఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు..? అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ నిపుణుల కమిటీ విచారణ చేస్తుంది. -
యశోదా ఆసుపత్రికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమాజీగూడ యశోదా ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు. మూడు రోజుల పాటు నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు.సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్.. ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో నందినగర్ నివాసంలో కేసీఆర్కు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు యశోదా ఆస్పత్రికి వెళ్లారు కేసీఆర్. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్కు మెడికల్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. -
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్మన్ గిల్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
వైద్య విద్యార్థులపై మరోసారి పోలీసు జులుం.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మెడికల్ విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు.. మెడికల్ విద్యార్థులను దారుణంగా కొట్టిన పోలీసులు.. ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండి అంటూ మహిళా విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.విదేశీ వైద్య విద్యార్థులను ఏఆర్ గ్రౌండ్స్కి పోలీసులు తరలించారు. గాయాలపాలైన విద్యార్ధులకు వైద్య సదుపాయం కూడా అందించలేదు. విద్యార్థులను కలిసేందుకు ఏఆర్ గ్రౌండ్స్కు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ రాగా.. విద్యార్థులను కలవడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఏఆర్ గ్రౌండ్స్లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేసేశారు.విదేశీ వైద్య విద్యార్థులను పరామర్శించేందుకు ఏఆర్ గ్రౌండ్స్కి వచ్చిన సీపీఎం నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులపై సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించలేకపోతున్నారని.. అందుకే ఏటా వందల మంది విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన చేస్తున్నా హెల్త్ మినిస్టర్ కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సాక్షిగా విద్యార్థులపై దాడి జరగడం హేయమైన చర్య, దేశమంతా ఒక రూలు.. ఏపీలో మరొక రూలా? ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అంటూ బాబురావు ప్రశ్నించారు. -
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్కు అమెరికా ఎంత సపోర్ట్గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్తో జరిగిన యుద్ధంలో కూడా పాక్కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. -
ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ.. ఆ నాలుగు పాత్రలపైనే ఆసక్తి!
మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో చిత్రం అలరించేందుకు సిద్ధమైంది. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ జూలై 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని నలుగురి పాత్రలపై ఓ లుక్కేద్దాం. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ కనిపించనున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్కు నాయకుడిగా ఉంటారు. రీడ్ రిచర్డ్స్ తన శరీర ఆకృతి మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సూ స్టార్మ్ (ఇన్విజిబుల్ ఉమెన్)గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. ఆమె క్షిపణుల నుంచి వచ్చే ఇంటర్ డైమెన్షనల్ శక్తి దాడులను నిరోధించేంత శక్తివంతమైన పాత్ర పోషించింది. జానీ స్టార్మ్ (హ్యూమన్ టార్చ్) గా జోసెఫ్ క్విన్ నటించారు. బెన్ గ్రిమ్ (ది థింగ్) పాత్రలో ఎబోన్ మోస్-బచ్రాచ్ కనిపిస్తారు.కాగా.. ఈ చిత్రానికి మాట్ షాక్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. -
లిస్టింగ్ సూపర్హిట్.. ఇన్వెస్టర్లకు వరుస లాభాలు
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగులు సూపర్హిట్టయ్యాయి. మార్కెట్ అనిశ్చితుల్లోనూ అదిరిపోయే అరంగేట్రం చేసి ఇన్వెస్టర్లకు తొలిరోజే లాభాలు పంచాయి. హెచ్డీబీ ఫైనాన్స్ షేరు ఇష్యూ ధర(రూ.740)తో పోలిస్తే బీఎస్ఈలో 13% ప్రీమియంతో రూ.835 వద్ద లిస్టయ్యింది.ఇంట్రాడేలో 15% ఎగసి రూ.850 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14% లాభంతో రూ.841 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.69,758 కోట్లుగా నమోదైంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రెండో రోజూ గురువారం లాభాలను కొనసాగించింది. రూ.890 వరకూ పెరిగి రూ.865 వద్ద ముగిసింది.సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగూ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.82)తో పోలిస్తే బీఎస్ఈలో 34% ప్రీమియంతో రూ.110 వద్ద లిస్టయ్యిది. ట్రేడింగ్లో 35% పెరిగి రూ.111 వద్ద గరిష్టాన్ని తాకింది. గరిష్టాల వద్ద స్వల్ప లాభాలు చోటు చేసుకున్నప్పటికీ.., చివరికి 19% లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,875 కోట్లుగా నమోదైంది. -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్పూల్ ఫుట్బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్బాలర్కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్తో వైరల్గా మారింది.లివర్పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్పూల్ ఎఫ్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
భారతదేశంలో అత్యంత చౌకగా లభించే తృణధాన్యం.దీన్నే ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.ఈ చిరు ధాన్యాలలో కాల్షియం, ఇనుము , విటమిన్లు బి1 నుండి బి3 లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రాగా మాల్ట్ లేదా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం.మొలకలతో పిండి రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను నానబెట్టి, మెత్తని బట్టలో కట్టిపెట్టి, మొలకెత్తించి, నీడలో ఎండబెట్టి, పిండిగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్ మరింత పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కాబట్టి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా దీన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.రాగి మాల్ట్ తయారీస్టవ్ మీద పాన్ లేదా కుండలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ లోపు ఒక కప్పు నీళ్లలో రాగుల పిండి జారుగా కలుపుకోవాలి.నీళ్లు మరుగుతున్నపుడు కలిపిన రాగిపిండిని పోసి, ముద్దలు లేకుండా తరచుగా కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం కాస్త చిక్కగా గరిటె జారుగా అయ్యేలా చూసుకోవాలి.ఇందులో మజ్జిగ, ఉప్పు కలుపుకొంటే కమ్మటి రాగి జావ రెడీ.ఇందులో ఇష్టమున్న వారు బెల్లం, నెయ్యికలుపుకొని తాగవచ్చు. అలాగే ఉడికించే నీళ్లలో కొంచెం పాలనుకూడా కలుపుకోవచ్చు.ఇంకా బాదం పౌడర్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా సన్నగా తరిగిన ముక్కలతో గార్నిష్తో చేస్తే పిల్లలకు చాలామంచిది. రాగుల జావ, ఆరోగ్య ప్రయోజనాలురాగి జావలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీకి శక్తినిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రాగి జావలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, సాయ పడుతుంది.మధుమేహాన్ని నియంత్రిస్తుంది: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.రాగి జావలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది.రాగి జావలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.రాగి జావలో ఉండే పోషకాలు జుట్టు రాలడం నివారించడంలో సహాయపడతాయి.రాగి జావలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.రాగి జావను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. లేదా, భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు. -
ఓటీటీలో పోటాపోటీగా సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'ది హంట్' వెబ్ సిరీస్ జులై 4న ఓటీటీలో విడుదల కానుంది. 'సోనీలివ్' (SonyLiv) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమిత్ సియాల్తో పాటు సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. అయితే, ఈ హత్యకు వారి ఉద్దేశ్యం ఏంటి..? హత్య, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే కోణాల్లో ఈ మూవీ ఉండనుంది.హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh)- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్' (Thug life) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జులై 3 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం,హిందీ మలయాళం, కన్నడలో ఉంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన ఈ చిత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది.నటి, దర్శకురాలు రేవతి తెరకెక్కించిన ‘గుడ్వైఫ్’ (Good Wife) వెబ్సిరీస్ జులై 4న విడుదల కానుంది. ఇందులో ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించారు. ఆమెకు భర్తగా సంపత్ రాజ్ నటించారు. 'జియో హాట్స్టార్' (Jio Hotstar) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సిరీస్ 'ది గుడ్వైఫ్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను ఇండియాలో తెరకెక్కించారు. -
‘సోలో బాయ్’ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాడు : సెవెన్ హిల్స్ సతీష్
సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను బతకాలనుకునే ఆలోచన గల వ్యక్తి చుట్టు తిరిగే కథే ఇది. ప్రతి ఒక్కరిలోను సోలో బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాం. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.→ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.→ గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.→ నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.→ ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను. అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాం→ నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది. -
ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. గిల్తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జడేజా సెంచరీ మిస్ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్ విరామం సమయానికి గిల్ 168, వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్తో గిల్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు. -
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తేసిన మరో బ్యాంక్..
అన్ని సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల మరింత మందికి బ్యాంకింగ్ సేవలు చౌకగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.మరోవైపు ఇండియన్ బ్యాంక్ ఏడాది కాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు (0.05శాతం) తగ్గించి 9 శాతానికి సవరించినట్టు ప్రకటించింది. 3వ తేదీ నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లకు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ బెంచ్మార్క్గా ఉంటుంది.పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించకపోతే విధించే జరిమానా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా ఇదివేరకే ప్రకటించింది. అంతకు ముందు కెనరా బ్యాంక్ కూడా అన్ని పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించనందుకు విధించే పెనాల్టీ ఛార్జీలను తొలగించింది. ఎంఏబీ అనేది ఒక నిర్దిష్ట కాలంలో (సాధారణంగా నెల) మీ పొదుపు ఖాతాలో నిర్వహించాల్సిన సగటు మొత్తం. -
‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’
విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు‘శవరాజకీయాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుది. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్ జగన్ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్పై తప్పుడు ప్రచారం చేశారు. తండ్రీ కొడులు ఇద్దరూ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది. -
Finger Millet: పోషకాల రాగి
ప్రధాన ఆహార పంటల్లో రాగి పంట ఒకటి. చిరుధాన్యం పంటగా రాగి పండిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవిలో కూడా రాగి సాగు అధికంగా చేస్తారు. రాగిలో క్యాల్షియం అధికంగా ఉండడం, కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండడం, పీచుపదార్థం కావడం, వరి, గోధుమల కంటే పోషకాల శాతం ఎక్కువ ఉన్న మంచి పౌష్టికాహారం కావడంతో ఇటీవల కాలంలో రాగి వినియోగం పెరిగింది. దీంతో రాగి సాగు విస్తీర్ణం ప్రస్తుతం పెరిగింది. ప్రభుత్వాలు కూడా రాగి పంటకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు పొందుతున్నారు. బంగారుపాళెం: నియోజకవర్గంలో రైతులు చిరుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాగి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నీటి తడులకు అవకాశం ఉన్న రైతులు రాగి పంటతో పాటు వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాగులకు మంచి గిరాకీ ఉంది. గతంలో గ్రామాల్లో రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అరికె పంటలు సాగు చేసేవారు. క్రమంగా ఆయా పంటల సాగు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో రాగి, కొర్ర పంట సాగు చేస్తున్నారు. గ్రామాల్లో మధ్యాహ్న రాగి సంగటి వాడుతున్నారు. హోటళ్లలో కూడా రాగిసంగటి అందుబాటులో ఉంటోంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రాగి సంగటి తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో రాగి «ధాన్యానికి డిమాండ్ పెరిగింది. వరి కోసిన తరువాత రాగిపంట సాగు చేస్తున్నారు. రాగులు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. దీంతో రాగి పంట సాగుతో మంచి లాభాలు రాబడుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు.. రాగి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల్లో మేలైన రకం మారుతిరకం. ఈ రకం పంట 85 రోజుల నుంచి 90 రోజుల్లో దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. అన్ని ప్రాంతాల్లో సాగు చేసేందుకు వీలుగా ఉంటుంది. మిగతా రకాలైన వేగావతి, సువర్ణముఖి, వకుళ, భారతి, హిమ, శ్రీచైతన్య రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి. బంగారుపాళెంలో సాగు చేసిన రాగి పంట విత్తనశుద్ధి ఇలా.. రాగి పంట సాగు చేసే సమయంలో విత్తనశుద్ధి అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం అనే మందు కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా ఉంటాయి. నారు నాటే పద్ధతిలో అయితే ఒక ఎకరానికి నారు కావాలంటే 2 కేజీల విత్తనాన్ని 5 సెంట్ల భూమిలో నారుమడిలో పోయాలి. 21 రోజుల తరువాత నారు నాటాలి. పొలం దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వాడాలి. ఖరీఫ్లో వర్షాధారంగా పండించే రాగి పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వేయాలి. అగ్గి తెగుళ్ల నివారణకు ట్రై సైక్లోజెల్ 6 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ను లీటరు నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. కాండం తొలిచే పురుగు నివారణకు కొరాజిన్ 3 మిల్లీలీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈవిధంగా పంట సస్యరక్షణ చేస్తే పంట అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. రాగితో ఆరోగ్యం.. రాగి ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగులతో చేసే సంగటి, రాగి జావ, రొట్టె తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు 100 గ్రాములు తీసుకుంటే, అందులో 344 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీలు, 3,6 గ్రాముల పీచు పదార్థాలు, 7.3 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే పూర్వం ఎక్కువగా రాగులతో చేసిన పదార్థాలే తినేవారు. రాగి జావ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగులు వాడకంతో బరువు తగ్గుతారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా విజయ్భాస్కర్రెడ్డి
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకాశం జిల్లాకు చెందిన చిట్యాల విజయ భాస్కర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీతం విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడల్ సాధించిన విజయ భాస్కర్ రెడ్డి బెంగళూరులో 2010వ సంవత్సరంలో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం స్థాపించారు. ఈ ఫోరం ఆధ్వర్యంలో బెంగళూరు, పూణే నగరాల్లో ఐటి ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పలు సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించారు.ప్రతిష్టాత్మక పులివెందుల, కడప ఉపఎన్నికల్లో ఫోరం టీం సభ్యులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ పెట్టక ముందు వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుంచి తాను తన ఉద్యోగ, వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ తాను ఎంతగానో ఆదర్శంగా తీసుకుని ప్రేరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్తో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన సేవలను అందిస్తూ వస్తున్నారు.అలానే ఇటీవల తన తాత పేరు మీద ఒక ట్రస్ట్ నెలకొల్పి పలువురు బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. తన మండల పరిధిలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో తాను ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు గాను ఇటీవల ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా సిఎస్ఆర్ అవార్డు అందుకున్నారు. చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషి, వృత్తిపరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి చెందిన కీలకమైన రాష్ట్ర ఐటి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా చిట్యాల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంతగానో అభిమానించే పార్టీ అధినాయకులు జగన్ అన్న నాయకత్వంలో కీలకంగా పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను రాష్ట్ర విభాగ అధ్యక్షులు, అన్ని స్థాయిలలోని కమిటీ సభ్యులతో కలిసి సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబయి, పూణే లాంటి వివిధ నగరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐటి, ఇతర నిపుణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యున్నతికి తన వంతుగా శక్తి వంచనలేకుండా అంకిత భావంతో కృషి చేస్తానని తెలియజేశారు. వైఎస్సార్ స్ఫూర్తిని, ఆశయాలను అనుసరిస్తూ ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. -
'కుబేర' నుంచి తొలగించిన వీడియో సాంగ్ వచ్చేసింది
ధనుష్, నాగార్జున కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.. ఇందులో రష్మిక మందన్న కీలకపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి 'పీ పీ డుమ్ డుమ్' అంటూ సాగే వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. ఇందులో రష్మిక వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. అయితే, ఈ పాట సినిమాలో లేదు. రన్టైమ్ ఎక్కువగా ఉండటంతో దీనిని తొలగించారు. ఓటీటీ విడుదల సమయంలో మళ్లీ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సాంగ్ మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం. మంగ్లీ సోదరి ఇంద్రావతి ఈ పాటను ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. -
చరిత్ర తిరగరాసిన శుబ్మన్ గిల్.. అత్యధిక స్కోరుతో..
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్బాస్టన్లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.భారత రెండో కెప్టెన్గా..ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.మూడో సారథిగా..అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ సిరీస్తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యంఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది. 107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్ -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్క్లబ్లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025 -
రోప్పార్టీలపై ఎందుకీ దాగుడు మూతలు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది...మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు. పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది. -
ఊహలకందని విధ్వంసం.. 78 బంతుల్లో 28 సిక్సర్ల సాయంతో 263 పరుగులు
అమెరికాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్లో ఊహలకందని విధ్వంసం జరిగింది. ఎడిసన్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించే ఓ ఆటగాడు 78 బంతుల్లో 17 ఫోర్లు, 28 సిక్సర్ల సాయంతో 337.18 స్ట్రయిక్రేట్తో 263 పరుగులు (నాటౌట్) చేశాడు. క్రికెట్ చరిత్రలో బహుశా ఇంతటి విధ్వంసం ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్కు అధికారిక గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఇంతటి విధ్వంసానికి కారకుడు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by Loudoun Cubs Cricket Academy (@loudouncubs)వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట అమెరికాలో క్రికెట్ లీగ్ ఆఫ్ న్యూజెర్సీ (CLNJ) అనే క్రికెట్ టోర్నీ (40 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఇందులో భాగంగా ఎడిసన్ క్రికెట్ క్లబ్, ఈసీసీ షార్క్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రౌనక్ శర్మ (ఎడిసన్ క్రికెట్ క్లబ్) అనే ఆటగాడు సిక్సర్ల సునామీ సృష్టించి 78 బంతుల్లో అజేయమైన 263 పరుగులు చేశాడు. ఇందులో రౌనక్ తన తొలి సెంచరీని కేవలం 27 బంతుల్లోనే చేయడం మరో విశేషం.Raunaq Sharma lit up club cricket with a jaw-dropping 263 off just 78 balls against ECC Sharks!🔥💯His knock, in a 40-over clash, stands as one of the most explosive and highest-scoring innings in limited-overs cricket history. (official or unofficial) pic.twitter.com/3MuBcCQ2QW— CricTracker (@Cricketracker) July 3, 2025ఇదే టోర్నీలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లోనూ రౌనక్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. NJ Lions CCతో జరిగిన మ్యాచ్లో 81 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 209.88 స్ట్రయిక్రేట్తో 170 పరుగులు చేశాడు.దీనికి ముందు జరిగిన మరో టోర్నీలో (WMCB T20 League Elite Division) కూడా రౌనక్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓ మ్యాచ్లో 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన రౌనక్.. 220.65 స్ట్రయిక్రేట్తో 50.75 సగటున 406 పరుగులు చేశాడు. 33 ఏళ్ల రౌనక్ శర్మ భారత్లోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఆయన.. క్రికెట్ అవకాశాల కోసం యూఎస్ఏకు వలస వెళ్లాడు. ప్రస్తుతం రౌనక్ హ్యూస్టన్ స్టార్స్ అనే అమెరికన్ జట్టుకు ఆడుతున్నాడు. రౌనక్కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు చిన్నతనంలో కలిసి ఆడారట. -
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
ట్రోలింగ్స్.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ నెయ్యి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు క్రితం సింగయ్య కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్ను అనుమతించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్’’ అంటూ న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారుఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్కు బాగా పనికొస్తాయంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ పిటిషన్లను వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలా చూసుకోవాలన్నారు. -
క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్లో క్యాషియర్గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు. -
అనుమానాస్పద స్థితిలో నటి మృతి.. అతిగా డ్రగ్స్ తీసుకుందా?
ప్రముఖ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కైలీ పేజీ(28) అనుమానాస్పదంగా మృతి చెందారు. జూన్ 25న ఆమె లాస్ ఏంజిల్స్లోని తన నివాసంలో మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవలడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ సంబంధిత వస్తువులు ఆమె ఇంటిలో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆమె గదిలో ఇతరులు సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్ల చనిపోయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.కైలీ పేజీ అసలు పేరు కైలీ పైలెంట్. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి దాదాపు 200పైగా సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ "హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్న్డ్ ఆన్"లో కూడా కనిపించారు, ఇందులో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలోని తన అనుభవాలు, అక్కడ ఎదురయ్యే సవాళ్ల, సమస్యలను గురించి ఓపెన్గా మాట్లాడింది. కైలీ మరణ వార్త తెలియగానే ఆమె స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. -
హ్యాట్సాప్ బామ్మ.. ఆ వయసులో ఎంతటి స్థైర్యం..!
మన పర్యావరణం కోసం ఓ విదేశీయురాలు ఎంతలా తపిస్తుందో తెలిస్తే విస్తుపోతారు. మన దేశంలో కూడా ఎందరో పర్యావరణ ప్రేమికులు, సామాజకి వేత్తలు అందుకోసం కృషి చేస్తున్నారు. వారంత తమ గడ్డపై నడుంబిడిస్తే..ఆ విదేశీయురాలు మన దేశంలోని ఒక సరస్సు కోసం ఐదేళ్లుగా కష్టబడుతోంది. ఆ సరస్సు అందాలను బావితరాలకు తెలిసేలా చేయాలని తన సేవను కొనసాగిస్తుంది. ఎవరామె అంటే..68 ఏళ్ల ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్మాన్ అనే డచ్ మహిళ కశ్మీర్ పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటిరిగా కృషి చేస్తోంది. ప్రకృతిపై ఉన్న ప్రేమే ఆ బామ్మను శ్రీనగర్లోని దాల్ సరస్సు అందాలను కాపాడేందు పురిగొల్పింది. అంతేగాదు రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆ సేవకే అంకితం చేశారు. నిజానికి ఆమె కశ్మీర్తో అనుబంధం ఎల ఏర్పడిందంటే..సుమారు 25 ఏళ్ల క్రితం తొలిసారిగా కాశ్మీర్ లోయను సందర్శించినప్పుడు ప్రారంభమైందట. దాని చుట్టు ఉన్న ప్రకృతి రమణీయతకు ఆకర్షితురాలైంది. అది ఎంతలా అంటే ఆ కాశ్మీర్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నంతగా ప్రేమను పెంచుకుంది. అలా ఇక్కడే ఉండి ఈ ఐకానిక్ సరస్సు వైభవాన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అంతేగాదు ఆమె ఆ సరస్సు నుంచి బాటిళ్లను, చెత్తను తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా.ఆ వీడియోలో ఎల్లిస్ మన స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉండేలా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చింది. ఆ వీడియోని చూసిని నెటిజన్లు ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ.. నిజంగా ఆ బామ్మ చాల గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ సైక్లిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు శ్రీనగర్ వీధుల గుండా వెళ్తూ..పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తోందామె. స్థానికులు, పర్యావరణ వేత్తులు ఆ బామ్మ సేవనిరతికి మంత్ర ముగ్దులవుతున్నారు. ఎంత ధైర్యవంతమైన మహిళ, ఈ వయసులో ఆమె అభిరుచి, లక్ష్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమె మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. Kudos to Dutch national Ellis Hubertina Spaanderman for her selfless efforts in cleaning Srinagar's Dal Lake for past 5 years. This dedication serves as an inspiration to preserve Kashmir's natural beauty. Let's join hands to keep our paradise clean & pristine. @ddprsrinagar pic.twitter.com/YINLbm3X1z— Kashmir Rights Forum🍁 (@kashmir_right) June 29, 2025 (చదవండి: Zohran Mamdani: 'చేత్తో తినడ'మే ఆరోగ్యానికి మంచిది..! పరిశోధనలు సైతం..) -
F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. -
ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, భారత్ రెండో టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై విమర్శలు వస్తున్నాయి.మూడు మార్పులుబర్మింగ్హామ్లో బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూలను జట్టు నుంచి తప్పించింది.వీరి స్థానాల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్కు కాస్త ఎక్కువగానే సహకరిస్తుందనే విశ్లేషణల నడుమ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను టీమిండియా పక్కనపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.విమర్శల వర్షంఅంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేసేందుకు ఆల్రౌండర్లు నితీశ్, వాషీలను తీసుకున్నామని.. ఆఖర్లో కుల్దీప్ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ టీమిండియా నాయకత్వ బృందంపై విమర్శలు గుప్పించారు.ఎనిమిది రోజుల విరామం తర్వాత కూడా బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబడితే.. కుల్దీప్ను ఎలా పక్కనపెడతారంటూ గావస్కర్, గంగూలీ ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్లో తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదంటూ విమర్శించారు.ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్అయితే, బుధవారం నాటి తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క మాటతో ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆట పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లేదు.. తుదిజట్టు ఎంపికలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’’ అంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగానే మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్గా, కెప్టెన్గా అతడు అద్బుతం. జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేము అనుకున్న పని పూర్తి చేస్తాం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (2) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకం(87) సాధించాడు. ఇక కరుణ్ నాయర్ (31) మరోసారి నిరాశపరచగా.. రిషభ్ పంత్ 25 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గిల్ శతక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా అతడికి అండగా నిలిచాడు. బుధవారం ఆట పూర్తయ్యేసరికి గిల్ 114, జడ్డూ 41 పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడిపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సానుకూలంగా ప్రారంభమై స్వల్ప లాభాలతో ట్రేడయిన భారత బెంచ్మార్క్ సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో స్థిరపడ్డాయి.ఇంట్రాడేలో 83,850 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 170.22 పాయింట్లు (0.2 శాతం) క్షీణించి 83,239.7 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 48.1 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 25,405.3 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సానుకూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.89 శాతం క్షీణించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, బ్యాంక్, ఫియాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మా, హెల్త్కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.48 శాతం క్షీణించి 12.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
Doddi Komaraiah తెలంగాణ వేగు చుక్క
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘటన దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) తెలంగాణ వేగు చుక్క మరణం. కొమురయ్య కడవెండి గ్రామ యువకుడు. నిజాం రాజ్యంలో ప్రముఖుడైన విస్నూర్ దేశ్ముఖ్ రాపాక రామ చంద్రారెడ్డి కింద ఉన్న 60 గ్రామాలలో కడవెండి ఒకటి. ఇక్కడే దేశ్ముఖ్ తల్లి జానమ్మ నివసిస్తూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది. ఆంధ్ర మహాసభ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్ అకృత్యాలనూ, పెత్తందారీ సంస్కృతినీ విమర్శించడం, ధిక్కరించడం మొదలు పెట్టింది. దున్నేవానికే భూమి, అక్రమ పన్నుల రద్దు వంటి కమ్యూనిస్ట్ నినాదాలతో ప్రేరేపితమయ్యింది. వెట్టి చాకిరీ, రకరకాల పన్నులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ వంటి వాటికి వ్యతిరేకంగా గ్రామం సంఘటితమవుతూ ఉంది. ఈ క్రమంలో కడవెండి గ్రామానికి 1946 జూలై 4న నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు వచ్చారు. తమ దగ్గర తినడానికే ధాన్యం లేదనీ, లెవీ ధాన్యం ఎక్కడి నుంచి తేవాలనీ ప్రశ్నించారు గ్రామస్థులు. లెవీ వసూలుకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా రెతులు, కూలీలు ఆ రోజు ఒక ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో దొడ్డి కొమురయ్య– మల్లయ్య సోదరులు కూడా పాల్గొన్నారు. వారు ముందువరుసలో ఉండి నినాదాలు చేస్తూ ముందుకు కదులుతుండగా మిస్కిన్ అలీ నేతృత్వంలో దొర గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. తూటాలు తగలడంతో కొమురయ్య మృతిచెందాడు. అనేకమందికి గాయాలయ్యాయి. కొమురయ్య అంత్యక్రియలకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. అతడి మరణంతో కమ్యూనిస్టులు తామూ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో సాధారణ రైతాంగ పోరాటం మహత్తర సాయుధ పోరాటంగా మారింది. ఉద్యమం తాకిడికి భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములను పేద రైతులు, కూలీలకు పంచారు నాటి ఉద్యమ నాయకులు. – అస్నాల శ్రీనివాస్ ‘ దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ (జులై 4 దొడ్డి కొమురయ్య వర్ధంతి) -
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు. జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు. అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య -
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ సెంచరీతో (114), రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 87, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు.రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో రోజు గిల్ మరో 36 పరుగులు చేస్తే, ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్పై 150 పరుగులు మార్కును తాకిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. 2018లో విరాట్ 149 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు ఎడ్జ్బాస్టన్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. విరాట్ రికార్డును ఛేదించే క్రమంలో గిల్ సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్లను అధిగమించే అవకాశం ఉంది. ఎడ్జ్బాస్టన్లో సచిన్ 122, పంత్ 146 పరుగులు చేశారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. -
రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ -
హైదరాబాద్లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్కుమార్.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్లోని పలు థియేటర్స్లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.సినిమా థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ ఛేంజర్, సినిమాల ఫైల్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్ను సీజ్ చేశారు. -
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది. -
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లైన్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు. ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోందిఆ విజ్ఞానంతోనే.. ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలసచదవండి: బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు -
పెళ్లైన పదిరోజులకే ఫుట్బాల్ స్టార్ దుర్మరణం
లివర్పూల్ ఫుట్బాలర్, పోర్చుగీస్కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్లోని జమోరా ప్రావిన్స్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్ ఫుట్బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కీలక విజయాల్లో పాత్రపోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్, వోల్వర్హాంప్టన్ వాండరర్స్ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్పూల్తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. జర్గన్ క్లాప్ నాయకత్వంలో ఎఫ్ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్పూల్ అటాకింగ్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్లో లివర్పూల్ ప్రీమియర్ లీగ్ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.రొనాల్డో సంతాపంజోటా మృతిపై పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు. -
జానీ మాస్టర్ ఎఫెక్ట్.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన కొంతకాలం జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్లు తమ సినిమా కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించారు. దీంతో ఈ దంపతులపై కోలీవుడ్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు బాలీవుడ్ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించింది.నయనతార, విఘ్నేష్ శివన్లు నిర్మిస్తున్న కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కోసం కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను కూడా జానీ షేర్ చేశాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత నయనతార దంపతులను కోలీవుడ్ మీడియా తప్పుబడుతుంది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన బాలికపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరియోగ్రాఫర్గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పనిపించలేదా..? కోలీవుడ్లో మీకు ఎవరూ కొరియోగ్రాఫర్ దొరకలేదా..? అంటూ విమర్శించారు.నేరస్థులకే ఛాన్సులు: చిన్మయికోలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్, విఘ్నేష్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'జానీ, ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చాడు. మనం 'ప్రతిభావంతులైన' నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాము. వారినే అధికార స్థానాల్లో ఉంచుతాము. మహిళలను ఎక్కువగా వేధించేది నేరస్థులే అని గుర్తుపెట్టుకోవాలి. 'నాకు ఏమీ జరగకుండా చూడండి' మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి స్వీట్' అంటూ ఆమె తెలిపారు.చిన్మయి చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ జంట నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు వారు "లైంగిక వేటగాడిని వేదికగా చేసుకున్నారని" ఆరోపించారు. నయన్ తనను తాను స్వయంకృషి కలిగిన మహిళగా చెప్పుకుంది. మహిళా నటుల కష్టాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. వేదికలపై తారలు మాట్లాడాలని కోరింది. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, పోక్సో కింద నిందితుడైన వ్యక్తికి తన భర్త మద్దతు ఇవ్వడం ఆమెకు బాగానే ఉంది అంటూ కొందరు విమర్శించారు. ఏదేమైన నయనతార దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల కోలీవుడ్ నుంచి తీవ్రంగా వ్యతిరేఖత వస్తుంది.Jani is out on conditional bail involving a minor’s sexual assault.We as a people seem to love ‘talented’ offenders and will keep promoting them and keeping them in positions of power which the offenders use to harangue the women more - “See nothing will happen to me.” It is… pic.twitter.com/irXOqZp824— Chinmayi Sripaada (@Chinmayi) July 2, 2025Nayan called herself a self-made woman who knows the struggles of female actors, urged stars to speak out, and thanked those who supported her. Yet she's fine with her husband backing a man accused under POCSO. Why the double standards? #Jani #VigneshShivan pic.twitter.com/Bz1sXpumvq— Films Spicy (@Films_Spicy) July 2, 2025don't know when wikki is gonna understand he's not a single person anymore.Whatever he does/speaks directly attached to #Nayanthara.She is a self made woman who stood up for herself and women in cinema in the past.A happy post with a pedophile dance master is seriously a big mess pic.twitter.com/SaG9sT2kQD— common_man (@IronladyNa5366) July 2, 2025It's not news that Vignesh Shivan and Nayan support predators. Why are y'all surprised? pic.twitter.com/f9u97SB2Ko— ஜமுனா (@velu_jamunah) July 2, 2025 -
వధువు సోదరి, వరుడు సోదరుడు ‘చమ్మక్ చల్లో..’ వైరల్ వీడియో
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్లోని సూపర్సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు. View this post on Instagram A post shared by WeddingDreamCo | Wedding Content Creator Chennai (@weddingdreamco) ఈ వీడియోను @weddingdreamco ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్తో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి. -
'చేత్తో తినడం' ఇది ఎప్పటి అలవాటంటే..!
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్లు, స్పూన్లు,చాకులతోనే తినేవారా అంటే..చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్ఫుల్గా తినేందుకు చిహ్నం.అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్లు, ఫోర్క్లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం. చాప్స్టిక్స్ సంగతేంటి?చైనా, జపాన్లోని ప్రజలు చాప్స్టిక్లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్లు, చాక్లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్లో చాప్స్టిక్తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది. వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్గా తినాంటే ఆ చాప్స్టిక్లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.చేత్తో తినడం మంచిదేనా.. చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు. అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!) -
మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ క్యాంప్నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది. -
ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ స్పందన
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబయ్యింది. మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్ఖాంగ్లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. తాజాగా.. దలైలామా వారసత్వం ఎంపికపై చర్చ నడుస్తుండడంతో ఆయన స్పందించారు. న్యూఢిల్లీ: తన వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. టిబెట్ను గుప్పిట పెట్టుకోవడానికి తమ అదుపులో ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దలైలామాదే అంతిమ నిర్ణయమని కిరణ్ రిజిజు అన్నారు. ‘‘15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’’ అని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కొత్త దలైలామాను తామే ఎన్నుకుంటామంటూ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఎంపిక 600 సంవత్సరాలుగా బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతోందని, తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియను చేపడుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని, బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. అయితే చైనా 14వ దలైలామా ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిబెట్ చైనాకి చెందిన భూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని ఆమె గుర్తు చేశారు.దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్పై అమెరికా ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్లో ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. 14వ దలైలామా ఎంపిక తర్వాత.. టిబెటన్ సంప్రదాయంలో.. ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. జూలై 6, 1935న టిబెట్ క్వింఘై ప్రావిన్స్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన టెన్జిన్ గ్యాట్సోను.. రెండేళ్ల వయసులో 14వ దలైలామా గుర్తించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్ను ఆక్రమించుకున్నాయి. 1959లో టిబెట్ ధైవభూమి లాసాలో తిరుగుబాటు విఫలం తర్వాత వెయ్యి మందికిపైగా బౌద్ధ సన్యాసులతో దలైలామా భారత్కు శరణార్ధిగా వచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. -
ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత్ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.తప్పని ఓటమిలీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్, బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో గిల్ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లను ఎడ్జ్బాస్టన్ టెస్టుకు తీసుకుంది.ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం మేనేజ్మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘కుల్దీప్ యాదవ్ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్బాస్టన్ లాంటి పిచ్పై బంతి కాస్త టర్న్ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.గిల్పై గావస్కర్ ఆగ్రహం!అంతేకాదు.. బ్యాటింగ్లో డెప్త్ కోసం ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నామన్న కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థనను కూడా గావస్కర్ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్ విఫలమవుతుంటే.. వాషింగ్టన్ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్ గిల్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఇంగ్లండ్తో బుధవారం మొదలైన ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), కెప్టెన్ శుబ్మన్ గిల్ (114 నాటౌట్)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్) రాణించాడు.ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర.. 51 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లండ్ టూర్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను యశస్వి ఉతికారేశాడు.తన మెరుపు బ్యాటింగ్తో భారత్కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.51 ఏళ్ల రికార్డు బద్దలుఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్గా జైశ్వాల్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది. సుదీర్ నాయక్ 1974లో ఇదే మైదానంలో 77 పరుగులు చేశారు.ఇప్పుడు తాజా మ్యాచ్తో నాయక్ పేరిట ఉన్న 51 ఏళ్ల రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. జైశ్వాల్, సుదీర్ తర్వాతి స్ధానాల్లో సునీల్ గవాస్కర్ (68), చేతేశ్వర్ పుజారా (66), చేతన్ చౌహాన్ (56) వంటి భారత ఓపెనర్లు ఉన్నారు.సునీల్ గవాస్కర్ రికార్డుపై కన్ను..భారత టెస్టు జట్టులో యశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో రాణిస్తూ వస్తున్నాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్ల్లోనే యశస్వి.. ఐదు సెంచరీలు, పన్నెండు అర్ధ సెంచరీలతో సహా 1,990 పరుగులు చేశాడు.ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్లో అతడు 10 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో అత్యంతవేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు.చదవండి: SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు -
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యేశపోగు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్సార్ సీపీ తరుపున ఎన్నికయ్యారు. తరువాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి జనసేనలో చేరారు. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఈ సందర్భంగా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విలువ ఇప్పుడు పేద ప్రజలకు తెలుస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి మారుపేరన్నారు. రానున్న కాలంలో పార్టీనుండి వెళ్లిన అందరూ తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, వత్సవాయి ఎంపీపీ కొలుసు రమాదేవి పాల్గొన్నారు. -
భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్ఫాస్ట్లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ
అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు
29 పరుగుల వద్ద తొలి వికెట్... సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రెండో వికెట్.. మరో రెండు పరుగులు జతచేసి రెండు వికెట్లు (102/4).. ఆ తర్వాత వైడ్ రూపంలో ఒక పరుగు అంటే అప్పటికి స్కోరు 103/4.. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కూడా డౌన్.. ఒక్క పరుగు జతచేర్చిన వెంటనే ఆరో వికెట్ కూడా పడింది (104/6)..మళ్లీ ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో బ్యాటర్లు.. అదే స్కోరు వద్ద ఏడో వికెట్ కూడా డౌన్.. వైడ్ రూపంలో మరో పరుగు రాగానే ఎనిమిదో వికెట్ కూడా పడిపోయింది.. అప్పటికి స్కోరు 105/8.. మరో పందొమ్మిది పరుగులు రాగానే తొమ్మిదో వికెట్ కూడా పడింది.. 167 పరుగులకు ఆలౌట్..ఐదు పరుగులు, ఏడు వికెట్లుశ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానం ఇది.. 100-1తో పటిష్టంగా కనిపించిన బంగ్లా.. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మరో ఏడు వికెట్లు కోల్పోయింది. తమ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసి ఏడు వికెట్ల నష్టాన్ని చవిచూసింది. లంక బౌలర్ల ధాటికి తాళలేక 167 పరుగులకే కుప్పకూలి.. 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ మేరకు బంగ్లాదేశ్కు చుక్కలు చూపించిన శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్ చరిత్రలో.. అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టు మీద ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక నిలిచింది. లంక ఇలా ప్రత్యర్థిని కుదేలు చేయడం ఇది మూడోసారి.2008లో జింబాబ్వే మీద మూడు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన లంక.. 2024లో అఫ్గనిస్తాన్ మీద. ఏడు పరుగుల వ్యవధిలో ఈ ఘనత సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ మీద ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఫీట్ నమోదు చేసింది.వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన జట్లు🏏శ్రీలంక- 2008లో హరారే వేదికగా- జింబాబ్వేను 124-3 నుంచి 127-10కి పడగొట్టింది.🏏శ్రీలంక- 2025లో కొలంబో వేదికగా- బంగ్లాదేశ్ను 100-1 నుంచి 105-8కు పడగొట్టింది.🏏వెస్టిండీస్- 1986లో షార్జా వేదికగా- శ్రీలంకను 45-2 నుంచి 51-9కు పడగొట్టింది.🏏శ్రీలంక- 2024లో పల్లెకెలె వేదికగా- అఫ్గనిస్తాన్ను 146-3 నుంచి 153-10కు పడగొట్టింది.🏏నేపాల్- 2020లో కీర్తిపూర్ వేదికగా- యూఎస్ఏను 27-2 నుంచి 35-9కి పడగొట్టింది.🏏భారత్- 2014లో మిర్పూర్ వేదికగా- బంగ్లాదేశ్ను 50-3 నుంచి 58-10కు పడగొట్టింది.వన్డేల్లోనూ శుభారంభంసొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు... వన్డేల్లోనూ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత అసలంక (123 బంతుల్లో 106; 6 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.టెస్టు సిరీస్లో దంచికొట్టిన పాథుమ్ నిసాంక (0), నిశాన్ మధుషనక (6), కమిందు మెండిస్ (0) ఈసారి విఫలమయ్యారు. జనిత్ లియాంగె (29), మిలాన్ రత్ననాయకె (22), వనిందు హసరంగ (22) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తన్జీద్ హసన్ (61 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో పోరాడగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్ల ధాటికి కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (0), పర్వేజ్ (13), నజు్మల్ షంటో (23), తౌహిద్ హృదయ్ (1) పెవిలియన్కు వరుస కట్టారు. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. సంక్లిప్త స్కోర్లు🏏శ్రీలంక- 244 (49.2)🏏బంగ్లాదేశ్- 167 (35.5).చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగాBangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025 -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
డాలస్లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో "అడాప్ట్-ఎ-విలేజ్" ఘన విజయం
డాల్లస్, టెక్సాస్ - జూన్ 28 టెక్సాస్లోని ఇర్వింగ్లోని జాక్ సింగ్లీ ఆడిటోరియం లో శంకర నేత్రాలయ USA మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవకు మద్దతుగా మ్యూజిక్ & డ్యాన్స్ ఫర్ విజన్ అనే దాతృత్వ వేడుకను ఘనంగా నిర్వహించారు. 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో సమాజం, కళ ,సేవా శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, "కరుణ సమాజాన్ని కలిసినప్పుడు మనం ఏమి సాధించగలమో ఈ కార్యక్రమం నిదర్శనం" అని పాలకమండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి అన్నారు. "MESU చొరవ కేవలం మొబైల్ సర్జరీ గురించి కాదు - ఇది ఆశను సమీకరించడం గురించి" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి వ్యాఖ్యానించారు.ఒక చిరస్మరణీయ సాయంత్రానికి హృదయపూర్వక ప్రారంభంప్రతిభావంతులైన గాయకులు,వాయిద్యకారులు ప్రదర్శించిన భక్తి మరియు శాస్త్రీయ కూర్పుల శ్రేణి ప్రేక్షకులను కదిలించాయి. - జానకి శంకర్, సంతోష్ ఖమ్మంకర్, ప్రభాకర్ కోట, భారతి అంగలకుదిటి , కామేశ్వరి చరణ్ తమగానంతో ఆకట్టుకున్నారు. రవి తుపురాని సజావుగా సమన్వయం చేసిన వారి కళాత్మకత ప్రశంసలను పొందింది. నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్, కూచిపూడి కళాక్షేత్రం, అభినయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, తత్యా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాట్యోం డ్యాన్స్ అకాడమీ, తాండవం స్కూల్ ఆఫ్ కూచిపూడి, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య ప్రదర్శనలతో సహా డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని డాన్స్ అకాడమీలు - సంప్రదాయం, కథనాల్లో పాతుకుపోయిన నేపథ్య ఘట్టాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథి, మెగా దాతకు సత్కారంశంకర నేత్రాలయ USA ముఖ్య అతిథి మరియు సలహాదారుల బోర్డు సభ్యురాలు ప్రసాద రెడ్డి కాటంరెడ్డి , కరుణామయ దాత శ్రీమతి శోభా రెడ్డి కాటంరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాటంరెడ్డి కొత్త మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) స్థాపనకు 5 లక్షల డాలర్ల విలువైన స్మారక విరాళాన్ని అందించారు.ఈ అసాధారణ దాతృత్వ చర్య పేద గ్రామీణ సమాజాలలో వేలాది మందికి దృష్టిని రక్షించే శస్త్రచికిత్సలను తీసుకువస్తుంది. దృష్టి సంరక్షణ కోసం వారి అచంచల నిబద్ధతను గుర్తించి, ఈ జంటను హృదయపూర్వకంగా సత్కరించారు. నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంలో తమ ముఖ్య అతిథిగా , నిజమైన భాగస్వామిగా కలిగి ఉండటం చాలా గౌరవంగా ఉందని అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి కొనియాడారు.ఛాంపియన్స్ ఆఫ్ విజన్: మా అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లకు గౌరవంఅలాగే ముగ్గురు విశిష్ట సమాజ నాయకులు AVN రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ గౌరవ అతిథులుగా చాలా కాలంగా భారతీయ-అమెరికన్ సమాజంలో సాంస్కృతిక పరిరక్షణకు మార్గదర్శకులుగా ఉన్నారు. 35 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు మరియు అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల అచంచల మద్దతు ద్వారా 4లక్షల డాలర్లకుపైగా నిధులను సేకరించింది. ఆనంద్ దాసరి, ఉన్నత సలహాదారు, బెనిఫాక్టర్ స్పాన్సర్లు ప్రకాష్ బేడపూడి, మూర్తి రేకపల్లి, శ్రీని వీరవల్లి, కిషోర్ కంచర్ల, అరవింద్ కృష్ణస్వామి, మరియు MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, తిరుమల్ రెడ్డి కుంభం, బుచ్చిరెడ్డి గోలి, సునీత & డాక్టర్ రాజు కోసూరి, శ్రీకాంత్ బీరం, శ్రీని SV, ఆండీ ఆశావ, సతీష్ కుమార్ సేగు, డాక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్ రావు, డాక్టర్ రూపేష్ కాంతాల, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అర్జున్ మాదాడి (స్వర్గీయ భాను మాదాడి జ్ఞాపకార్థం), ప్రవీణ్ బిల్లా, శివ అన్నపురెడ్డి, డాక్టర్ పవన్ పామదుర్తి, డాక్టర్ శ్రీనాధ రెడ్డి వట్టం, రమన్ రెడ్డి క్రిస్టపాటి లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అసాధారణ దాతృత్వం దాదాపు 6,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలుగా మారుతుంది - ప్రతి ఒక్కటి దృష్టి లోపంతో బాధపడుతున్న పేద వ్యక్తులకు జీవితాన్ని మార్చే బహుమతి. "ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ మొత్తం సమాజానికి ఆశాకిరణంగా మారారు. మీ నిబద్ధత ఆర్థిక సహాయం కంటే చాలా ఎక్కువ - ఇది వేలాది మందికి దృష్టి, గౌరవం మరియు అవకాశాన్ని పునరుద్ధరించే శక్తివంతమైన చర్య అంటూ శంకర నేత్రాలయ USA తరపున డాక్టర్ రెడ్డి ఊరిమిండి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నృత్య గురువులు, గాయకులు,కళా ప్రదర్శకులను సత్కరించారు. శంకర నేత్రాలయ USA కోశాధికారి మూర్తి రేకపల్లి, కార్యదర్శి వంశీ ఏరువారం, పాలక మండలి సభ్యులు మెహర్ చంద్ లంక, నారాయణరెడ్డి ఇందుర్తి, ఆది మొర్రెడ్డి, చంద్ర మౌళి సరస్వతి, మహిళా కమిటీ చైర్పర్సన్ రేఖ రెడ్డి, కమిటీ సభ్యులు మోహన నారాయణ్ లను పాలక మండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి, డాక్టర్ ప్రవీణ వజ్జ, డల్లాస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ చినసత్యం వీర్నపు, కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమం విజయవంతంకావడంలో కీలక పాత్ర పోషించారు. 35 మంది అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లతో పాటు, అనేక మంది వ్యక్తిగత దాతలను కూడా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా పరిమళ మార్పాక వ్యవహరించారు.మరిన్ని వివరాలకు లేదా విరాళం ఇవ్వడానికి, దయచేసి www.sankaranethralayusa.org ని సందర్శించండి లేదా (855) 463-8472 కు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి. -
చినబాబు దర్శనానికి రూ.40 లక్షలు..!
సాక్షి, అమరావతి: ముడుపులు ముట్టచెబితేనే ముఖ్యనేత, ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్లు తెలిసింది. మంత్రిగా ఉన్న చినబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లోమీడియా మాజీ ప్రతినిధి, మంత్రి చుట్టూ తిరిగే పీఏను సంప్రదించగా. వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షలు తీసుకుని అపాయిట్మెంట్ ఇప్పించారని సమాచారం.ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకుని అక్కడే పీఏలతో గొడ వకు దిగారని తెలిసింది. విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పీఏకు కబురుపెట్టారని, ఈలోపే విషయం మంత్రికి చేరడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పీఏనే పిలుస్తారా? తమాషాగా ఉందా? అంటూ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అక్రమ వసూ ళ్లకు చినబాబే అనుమతిచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఆయనకూ వాటాలు న్నాయని ప్రచారం. ముఖ్య నేతను కలవాలన్నా.. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది. -
'రామాయణ' సినిమా నుంచి ఫస్ట్ వీడియో విడుదల
'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్బీర్కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఏఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్-2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది. -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి పాము.. ఉలిక్కిపడిన ఆటగాళ్లు! వీడియో
కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రత్యక్షమైంది. బిగ్ స్క్రీన్లో పామ్ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.ఆటగాళ్లు సైతం కాస్త గందరగోళానికి గురయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సందర్భంగా పాములు పట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(106) సెంచరీతో మెరిశాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయసంగా గెలిపించేలా కన్పించిన బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్Bangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025 -
రామ్దేవ్ పతంజలికి డాబర్ దెబ్బ
బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. డాబర్ చ్యవన్ప్రాష్(Chyawanprash)ను లక్ష్యంగా చేసుకుని పతంజలి ప్రసారం చేస్తున్న సెటైరిక్ యాడ్ను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం గురువారం ఆదేశించింది. న్యూఢిల్లీ: చ్యవన్ప్రాష్ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్ కంపెనీ పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. తమ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్) చ్యవన్ప్రాష్లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్ తన పిటిషన్లో ప్రస్తావించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జడ్జి మినీ పుష్కర్ణా యాడ్ నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జులై 14వ తేదీన జరగనుంది. చ్యవన్ప్రాష్ (Chyawanprash) అనేది ఆయుర్వేద లేహ్యం. ఇది శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాడే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమం. ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు చ్యవన్ ఋషి అనే మహర్షి ఈ లేహ్యాన్ని తయారు చేసినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. -
యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
బతికి వస్తేనే మాకు బతుకు
అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిలి్చన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి: కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్క్కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.క్యాంపులో బిక్కుమంటూ..బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేవుడా కనికరించు దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న. – కశ్మీరా కుమారీ, బీహర్ నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది. – సనాపతి, బీహర్ కళ్ల ముందే కకావికలం సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. –యశ్వంత్, విజయవాడ -
‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్ను బహుళ కంపెనీలలో మూన్లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు. -
సౌతాఫ్రికా ఆటగాడి సునామీ ఇన్నింగ్స్.. కేవలం 9 బంతుల్లోనే! వీడియో
మేజర్ లీగ్ క్రికెట్-2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ విజయభేరి మ్రోగించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్ చేసింది.సూపర్ కింగ్స్ ఓపెనర్లు స్టోయినిష్(2), డార్లీ మిచెల్(6 రిటైర్డ్ హార్ట్) నిరాశపరిచినప్పటికి.. శుభమ్ రంజనే( 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39 నాటౌట్), డోనోవన్ ఫెరీరా(9 బంతుల్లో 5 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.సౌతాఫ్రికాకు చెందిన ఫెరీరా.. ఆఖరి ఓవర్ వేసిన మిచెల్ ఓవెన్ బౌలింగ్లో నాలుగు సిక్సర్లు, రెండు డబుల్స్ సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వాషింగ్టన్ బౌలర్లలో నేట్రావల్కర్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిదిగిన వాషింగ్టన్ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18) టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్ రెండు, అకిల్ హోసేన్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. కాగా టెక్సాస్, వాషింగ్టన్ రెండు జట్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకున్నాయి.DONOVAN FERREIRA - THE SUPERSTAR OF TEXAS SUPER KINGS.!!!- 6, 6, 6, 2, 2, 6 vs Mitchell Owen in the final over to finish 37* (9) .!!!pic.twitter.com/hbmUUZAWwC— MANU. (@IMManu_18) July 3, 2025 -
‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి. -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
తప్పుడు కేసులు పెట్టినోళ్లు శిక్ష అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసు నిందితులను మూడో రోజు సిట్ తమ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడ్ని తొలుత జీజీహెచ్కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జైలు నుంచి తరలించే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు. ఆ సమయంలో మీడియా కాస్త దూరంలో ఉండగా.. చెవిరెడ్డిని మాట్లాడనీయకుండా పోలీసులు దురుసుగా నెడుతూ వాహనంలోకి తరలించారు. ఇదీ చదవండి: వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది! -
ఈసీతో వైఎస్సార్సీపీ నేతల భేటీ.. చివరి గంటలో పోలింగ్ శాతంపై చర్చ..
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైఎస్సార్సీపీని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. అనంతరం, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పాం. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయి. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఆరు తర్వాత జరిగిన పోలింగ్లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దీనిపై ఎంక్వైరీ చేయాలి.విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరాము. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు. అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరాము. దానికి ఈసీ ఒప్పుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్లో అసెంబ్లీ, పార్లమెంట్కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలి’ అని చెప్పుకొచ్చారు. -
ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా.. చావ మంటారా!
జగదేవ్పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ పేద కుటుంబం పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. ఈ ఘటన మండలంలోని చాట్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. బుధవారం గ్రామ కార్యదర్శి సాయిబాబాతోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసేందుకు వెళ్లారు. గ్రామానికి చెందిన స్వప్న రమేష్ దంపతులు తమది పేద కుటుంబమని, అన్ని అర్హతలు ఉన్నా.. మొదటి విడతలో ఇల్లు రాలేదని తెలిపారు. తమ పేరు ఎందుకు రాయలేదని అక్కడికి వచ్చిన అధికారులు, కమిటీ సభ్యులను నిలదీశారు. ఇల్లు మంజూరు చేయకుంటే ఇక్కడే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో దంపతులిద్దరూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దంపతులను సముదాయించారు. అనంతరం ఎంపీడీఓ రాంరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. -
సినిమానే వదిలేస్తా కానీ..తెరపై ఆ పని చేయలేను : రష్మిక
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు కుర్రకారుకు తారక మంత్రంగా మారింది. కన్నడంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ భామ ఇప్పుడు జాతీయ స్థాయి క్రష్ హీరోయిన్గా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పయనాన్ని మొదలెట్టినా, ఈమెను క్రేజీ హీరోయిన్ను చేసింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ ఛలో చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఇటీవల విడుదలయిన కుబేర వరకూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. అదే విధంగా తమిళంలోనూ సుల్తాన్, వారిసు చిత్రాల్లో మెరిశారు. ఇకపోతే గుడ్బై అంటూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అక్కడ తొలి చిత్రం యావరేజ్ అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన యానిమల్ చిత్రం సూపర్హిట్ అయ్యింది. రణ్బీర్ కపూర్కు జంటగా నటించిన యానిమల్ చిత్రం గత 2023 డిశంబర్ నెలలో తెరపైకి వచ్చి రక రకాల విమర్శనలను ఎదుర్కొంది.ముఖ్యంగా నటుడు రణ్బీర్ కపూర్ పాత్రపై మాత్రం ఘోరంగా విమర్శలు ట్రోల్ అయ్యాయి. ఆయన ఎక్కువగా సిగరెట్స్ కాల్చే సన్నివేశాలపై తీవ్ర విమర్శలు దొర్లాయి. అయితే వసూళ్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టుకుంది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో స్పందించిన నటి రష్మిక మందన్నా తాను ఆ చిత్రాన్ని చిత్రంగానే చూశానన్నారు. చిత్రంలో హీరో సిగరెట్టు తాగితే అది ఇతరులను సిగరెట్లు తాగే విధంగా ప్రేరేపిస్తున్నాయి అని అంటున్నారని, సమాజంలో ప్రజలు సిగరెట్స్ తాగడం అనేది సర్వ సాధారణం అని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం సినిమాల్లో కూడా సిగరెట్స్ తాగే విధంగా నటించనని చెప్పారు. ఒకవేళ అలాంటి పాత్రలు వస్తే.. సినిమానే వదిలేస్తానని అన్నారు. ఇకపోతే చిత్రాన్ని చిత్రంగానే చూడమని, ఇతరులను చిత్రం చూడమని ఎవరినీ చిత్రం చూడమని వత్తిడి చేయడం లేదని అన్నారు. ఇక్కొక్కరికి ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుందని దాన్ని యానిమల్ చిత్రంలో దర్శకుడు చూపించారు అంతే అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. అయితే చిత్రం విడుదలై ఏడాదిన్నర పైగా అయినా యానిమల్ చిత్రం విమర్శల నుంచి తప్పించుకోలేకపోతోంది. -
ఆ టీచర్ కోసం యావత్తు గ్రామమే కన్నీళ్లు పెట్టుకుంది!
గురువు అన్న పదమే ఎంతో గౌవరనీయమైనది. ఇక ఆ స్థానాన్ని అలకంరించి.. ఎందరో విద్యార్థులను మేధావులగా తీర్చిదిద్దే వాళ్ల సేవ అజరామరం. అలాంటి వ్యక్తులు బదిలీ నిమిత్తం లేదా వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా వెళ్లిపోతున్నారంటే ఏదో కోల్పుతున్నంత బాధ కలగడం సహజం. అలా విద్యార్థుల ప్రేమను పొందిన ఉపాధ్యాయులెందరో ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా బదిలిపై వెళ్తుతన్న ఓ మహిళా టీచర్కి విద్యార్థుల తోపాటు యావత్తు గ్రామం కన్నీటి వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే..బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక చిన్న గ్రామంలోని ఆదర్శ విద్యాలయంలో రేఖ అనే టీచర్ 22 ఏళ్లుగా టీచర్ పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులను మంచి విద్యను బోధించడమే గాక ఆ గ్రామంలోని గ్రామస్తులుకు విద్య ప్రాముఖ్యత అవగాహన కల్పించేవారామె. గత 22 ఏళ్లుగా ఆ గ్రామంలో తన బోధన సేవతో గ్రామస్తులు, విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు బదిలిపై స్కూల్ని వీడక తప్పని పరిస్థితి. అయితే ఆమె లాస్ట్ వర్కింగ్ డే రోజున విద్యార్థుల తోపాటు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు కూడా వచ్చి కన్నటి సంద్రంతో భారంగా వీడ్కోలు పలికారు. అంతేగాదు ఆ రోజు ఫంగ్షన్ ఏర్పాటు చేసి..గ్రామస్తులంతా ఆమె సేవలను కొనియాడుతూ సన్మానించడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురించి షేర్ చేసుకున్నారు. ఇక వీడ్కోలు సమయానికి అంత ఆమె చుట్టుచేరి ఐ మిస్ యూ రేఖ మేడమ అంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. మొత్తం గామ్రమే ఆమె వెళ్లిపోతుంటే కన్నీటి సంద్రంలో మునిగిపోయి నిట్టూర్చింది. ఆ ఘటన మొత్తం కంటెంట్ క్రియేటర్ రీకార్డ్ చేసి పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా అవసరం లేదు మన సేవాతత్పరత మనల్ని అందరికి చేరవయ్యేలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుపెడుతుందంటూ సదరు టీచర్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఎట్టకేలకు విడుదల
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో జులై 24న విడుదల కానుంది. -
అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు. -
కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. #WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp— ANI (@ANI) July 2, 2025కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు -
భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
రవిచంద్రన్ ఆశ్విన్ విధ్వంసం.. బెంబేలెత్తిన బౌలర్లు
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2025లో దిండిగల్ డ్రాగన్స్ జట్టు క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. బుధవారం ఎన్పీఆర్ కాలేజీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్లో ట్రిచీ గ్రాండ్ చోళస్పై 6 వికెట్ల తేడాతో దిండిగల్ ఘన విజయం సాధించింది. దీంతో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో చెపాక్ సూపర్ గిల్లీస్తో దిండిగల్ డ్రాగన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.కాగా ఎలిమేనటర్లో టీమిండియా స్పిన్ లెజెండ్, దిండిగల్ కెప్టెన్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించిన ఆశ్విన్.. ఆ తర్వాత బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను ఆశూ ఉతికారేశాడు.కేవలం 48 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆశ్విన్తో పాటు బాబా ఇంద్రజిత్(27) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ట్రిచీ బౌలర్లలో ఈశ్వరన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శర్వన్ కుమార్, డేవిడ్సన్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ట్రిచీ బ్యాటర్లలో జాఫర్ జమాల్(33), వసీం అహ్మద్(36) రాణించారు. డ్రాగన్స్ బౌలర్లలో ఆశ్విన్తో పాటు జి పెరియస్వామి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖం పట్టినట్లేపట్టి మళ్లీ పెరుగుతోంది. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’ (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా రికార్డు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్ -
జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..!
వర్షాలు ముసురుకుంటున్న సమయంలో కుక్కలకు ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కలతో పాటు మనుషులకూ ఈ వ్యాధి వ్యాప్తిచెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వివిధ జాతుల కుక్కలను, ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పెట్స్ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మూగజీవాలకు కొంత సమయం కేటాయిస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కొంత సమయం వాటితో ఆడుకోవడం అలవాటుగా మారుతోంది. ఈ సమయంలో ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకితే పెట్స్తో సహా మనుషులకూ ముప్పు పొంచి ఉంది. వీధి కుక్కలతో జర జాగ్రత్త.. వీధి కుక్కలు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన, సంచరించే ప్రాంతానికి సరిహద్దులు (టెరిటరీ) నిర్ణయించుకుంటాయి. వాటి పరిధిలోకి వేరే కుక్కలను రానీయవు. ఇవి వాటి పరిధి దాటి వెళితే ఆందోళనకు గురవుతాయి. దీంతో కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయంతో దాడి చేయడానికి ప్రయతి్నస్తాయి. అటువంటి వాటని ఐ కాంటాక్ట్ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం) చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలు సహజంగానే కుక్కలు కనిపించినపుడు వాటి తోక, చెవులు పట్టుకుని లాగుతుంటారు. ఒక రకమైన ఇరిటేషన్లో ఉన్న కుక్కలను ఇలా చేస్తే అవి వెంటనే కరిచే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ వీధుల్లో వాటిని పట్టుకుని చికిత్సలు చేస్తున్నారు. అనంతరం ఎక్కడ నుంచి తెచ్చినవి అక్కడ విడిచిపెట్టకుండా ఏదో ఒక చోటు వదిలేస్తున్నారు. ఇది కూడా కుక్క కాట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మెదడును ప్రభావితం చేస్తుంది.. పెట్స్కు ర్యాబిస్ సోకినప్పుడు వైరస్ అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందనేది దానికి తెలియకుండానే నియంత్రణ కోల్పోతుంది. కోపం, దూకుడుగా, పచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంది. మనుషులకు వచ్చినట్లే కుక్కలకు సైతం విషజ్వరాలు వస్తాయి. లక్షణాలు గుర్తించినపుడు వైద్యులను సంప్రదించడం మేలు. రేబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకు ముందుగానే జాగ్రత్త పడాలి. సొంగ కార్చే సమయంలో దాన్ని మనం చేతితో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. కుక్క పిల్లలు ఆరు వారాల నుంచి 8 వారాల వయసులో పారో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రివెంటివ్ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. – డా.డీ.అశోక్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్.ఈ సీజన్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్ వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటో పెంచుకునే పెట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎర్రబడటం, జ్వరం రావడం, గొంతు కండరాలు బిగుసుకుపోయి నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, నాలుగైదు రోజుల పాటు సొంగ కార్చడం, నురగలు కక్కడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ర్యాబిస్ వైరస్కు సంబంధించిన లక్షణాలుగా పరిగణించాలి. ప్రాథమికంగా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించినట్లైతే పెట్స్ను రక్షించుకోవచ్చు.నివారణ చర్యలు.. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. తద్వారా ర్యాబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చు..దీంతో పాటు పెంపుడు జంతువులను నియంత్రణలో ఉంచాలి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇళ్లలో పెంచుకునే వాటికి టీకాలు వేయించాలి. ఏదైనా జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులు లేదా బయటి జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా.. అవి కాటు వేసినా.. గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ర్యాబిస్ సోకిన జంతువు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుని సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలి. ర్యాబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు, లేదా తరచూ జంతువులతో నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉన్న వ్యక్తులు ముందస్తుగా ర్యాబిస్ టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో గబ్బిలాల నివాసం లేకుండా చూసుకోవాలి. ర్యాబిస్ సోకిన తర్వాత, లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స తీసుకోవడం చాలా కష్టం.. కాబట్టి నివారణా చర్యలు పాటించడం ఉత్తమం.. ఆరోగ్యకరం. (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్
ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman gill) అద్బుతమైన సెంచరీ సాధించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శుబ్మన్ గిల్.. బాధ్యయుత ఇన్నింగ్స్తో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన గిల్.. మొదటి 100 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కున్నాక తనదైన శైలిలో గిల్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో శుబ్మన్ 199 బంతుల్లో తన ఏడవ టెస్ట్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో కూడా గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో గిల్పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆటను చూసి దక్షిణాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ గర్వపడతుంటాడని యువరాజ్ కొనియాడాడు. కాగా గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఇంగ్లండ్లో తన తొలి టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు గిల్ డబుల్ సెంచరీలు సాధించికపోయినప్పటికి.. వరుసగా రెండు సెంచరీలు మాత్రం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే గిల్ను స్మిత్తో యువీ పోల్చాడు."జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది నేను ఉన్నా అంటూ ముందుకు వస్తారు. ఆ కోవకు చెందినవాడే శుబ్మన్ గిల్. టెస్టు కెప్టెన్గా వరుసగా సెంచరీలు చేసిన అతికొద్ది మందిలో ఒకడిగా గిల్ నిలిచాడు. ఎంతో ప్రశాంతత, ధైర్యవంతంగా బ్యాటింగ్ చేయడం, జట్టును విజయవంతంగా నడిపించాలనే తపన గిల్లో కన్పించాయి.అతడిని చూసి గ్రేమ్ స్మిత్ కచ్చితంగా గర్వపడుతుంటాడు అని ఎక్స్లో యువీ రాసుకొచ్చాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్తో కలసి జిమ్కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్, సప్లిమెంట్స్లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్బీట్, బీపీలను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్కు వెళ్లకూడదుజిమ్ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్మిల్ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా?
కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’ (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా వెలసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లలమర్రి.ముక్కంటికి మూడు ఆలయాలు..పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గుర యినా, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ. 1208లో ఎరుకేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవాన్ని చాటిచెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు. దీని ముఖమండప స్తంభాలు నల్లరాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లలమర్రిలో రెండు శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు నామేశ్వరాలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. కొన్నిచోట్ల స్తంభాలపై సూక్ష్మాతిసూక్ష్మంగా అందమైన నగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనం లాæకరిగి΄ోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, సముద్ర మథనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకేమండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. చెన్నకేశ్వర... బ్రహ్మదేవాలయాలు... పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణం లో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉన్నారు. క్రీ.శ.1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో΄ాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయం ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతీమాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.ఎలా చేరుకోవాలంటే?ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. ధరిత్రిపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండటం విశేషం. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంస వాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ. -
వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య(26) సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం నలుగురితో కలిసి యర్రయ్య సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టడం కోసం తాడును చేతికి కట్టుకుని గేలంతో చేపలను కొట్టాడు. ఈ క్రమంలో ఈ గేలానికి సుమారు 100 కేజీల బరువు ఉండే పెద్ద చేప చిక్కుకుంది. అయితే ఆ చేప బలంగా సముద్రంలోకి లాక్కుపోవడంతో యర్రయ్య గల్లంతైనట్టు తోటి మత్స్యకారులు తెలిపారు. తీరానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వేట సాగించామన్నారు. అధికారులు స్పందించి గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలించాలని మత్స్యకార నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
మోసం చేస్తే మోసమే!
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ , ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు.‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..? రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు.’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.., ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను.’ అన్నారు ప్రశాంతంగా..‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..?’ అంటూ ఆశగా చూశాడా వ్యక్తి.. ‘‘కాని ఎలా సాధ్యం? ఆవ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు నిరాశతో.. ‘‘అలా అనకు.. నిరాశ తిరస్కారం ( కుఫ్ర్ )తో సమానం.. దైవచిత్తమైతే నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ’నిజమే.. ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడం లేదు.’’నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్ . నీ పైకం ఇప్పించే పూచీనాది.’ అన్నారు బహెలూల్ ధీమాగా..’సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ’రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు.’ అన్నారు బహెలూల్ . సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, కాస్త ఈ సంచి మీదగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఇందులో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉందని చెప్పారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోస΄ోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతనితో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ కూడా తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తనదారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పి చూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమెన జీవనం ప్రారంభించాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్∙ -
ఉమెన్ 'ఇన్నోవేటర్స్'..! ఆవిష్కర్తల కోసం..
పరిశ్రమలు, పారిశ్రామిక రంగంలో మహిళకు వ్యవస్థాపకులుగా, ఆవిష్కర్తలుగా సాధికారత కల్పిస్తూ వారందరినీ అనుసంధానం చేసే వినూత్న వేదికగా డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ (డీఇడబ్ల్యూఐ) ప్రారంభమైంది. అంకుర సంస్థల ఔత్సాహిక మహిళల సమిష్టి ఉన్నతికి సహకారం, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా నగరంలో డీఇడబ్ల్యూఐ ఆవిష్కృతమైంది. నగరంలోని హైటెక్స్ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ డాక్టర్ నీలిమా వేములతో పాటు చైర్పర్సన్ డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల, వైస్ చైర్పర్సన్ – సహ వ్యవస్థాపకురాలు సత్యవతి ప్రసన్న మడిపడిగే, సహ వ్యవస్థాపకురాలు – బ్రాండ్ కస్టోడియన్ పల్లవి నాగళ్లతో పాటు ముఖ్య సలహాదారు రాజు మడిపడిగే డీఇడబ్ల్యూఐను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మహిళా దార్శనికులు, స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహిళా ఆవిష్కర్తలను ఒక చోటికి చేర్చారు. మహిళా శక్తికి లాంచ్ప్యాడ్.. ఈ సందర్భంగా డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ వ్యవస్థాపకురాలు డా.నీలిమా వేముల మాట్లాడుతూ.. డీఇడబ్ల్యూఐ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇదొక ఒక ఉద్యమం. ప్రధానంగా ఇండస్ట్రీ, ఇన్నోవేషన్లో బాధ్యతను కోరుకునే, ఒకరికొకరు ప్రోత్సాహం అందించుకునే ఔత్సాహిక మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు మహిళా శక్తిని, విజయాన్ని పునర్ నిర్వచించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను అనుసంధానం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. డీఇడబ్ల్యూఐ అనేది మహిళల వ్యవస్థాపకతను పెంపొందించేందుకు కమ్యూనిటీ సహకారంతో పాటు మూలధనంపై దృష్టి సారించి, ఆశావహులైన–స్థిరపడిన మహిళా వ్యవస్థాపకులకు ఒక లాంచ్ప్యాడ్గా సేవలందించనుందని, ఇలాంటి వారి అభివృద్ధికి అవకాశాలు కల్పించే సమాంతర వ్యవస్థగా రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మహిళా నేతృత్వంలోని వెంచర్లను స్కేలింగ్ చేయాలనే సంస్థ లక్ష్యానికి భవిష్యత్తు పెట్టుబడిదారులు, నిధుల సేకరణదారులుగా విశిష్ట జ్యువెలరీ డైరెక్టర్ సింధుజా పలబట్ల, సురక్ష ఫార్మా డైరెక్టర్ పద్మజా మానేపల్లిని డీఇడబ్ల్యూఐ కుబేరులుగా ఎంపిక చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అలేఖ్య పుంజాల, ప్రముఖ ఫిట్నెస్ నిపుణురాలు దినాజ్ వెర్వత్వాలా, సినీ నటుడు అలీ జీవిత భాగస్వామి జుబేదా అలీ, వైద్య నిపుణురాలు, మహిళా ఆరోగ్య న్యాయవాది డాక్టర్ సునీత రెడ్డి (వైఎస్), వకుళ సిల్స్ వ్యవస్థాపకురాలు మాధురి దువ్వాడ, టీజీ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
అమర్నాథ్ యాత్ర షురూ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహలోని మంచు స్ఫటిక శివలింగ దర్శనానికి వేళయ్యింది. అత్యంత కఠినమైన, అననుకూల వాతావరణం మధ్య మొత్తం 38 రోజులపాటు సాగే అమర్నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. ఉదయం 3,880 మీటర్ల ఎత్తులోని అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీకి తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు. వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తుల్లో మొదటి యాత్రికుల బృందం పహల్గాం, బాల్టాల్ బేస్ క్యాంప్ల నుంచి ‘హర్ హర్ మహాదేవ్’, ‘బమ్ బమ్ భోలే’ నినాదాలతో గుహ దిశగా ప్రయాణం ప్రారంభించారు. బుధవారం జమ్మూలోని భగవతీ నగర్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపడంతో 168 వాహనాల్లో 5,892 మందితో కూడిన యాత్రికుల తొలి బృందం పయనమైంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. ఇప్పటికే 3.5 లక్షలకుపైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జమ్మూలోని సరస్వతీ ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభ వంటి కేంద్రాల్లో రోజూ సుమారు 2,000 మంది రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు. 2011లో అత్యధికంగా 6.34 లక్షల మంది భక్తులు అమర్నాథుని దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు యాత్రకు 3.5 లక్షల మంది ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t— crpf_fan (@CrprepostFan) July 2, 2025ఘనమైన భద్రతా ఏర్పాట్లు1990 నుంచి 2017 వరకు అమర్నాథ్ యాత్ర మార్గంలో 36 వరకు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 53 మంది యాత్రికులు మరణించగా, మరో 167 మంది గాయపడ్డారు. 2000లో అమర్నాథ్ యాత్రపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఏడాది యాత్రను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాయి. ప్రధానమైన పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో కాంక్రీటు బంకర్లు, చెక్పోస్టులు, డ్రోన్ల ద్వారా నిత్యం నిఘా కొనసాగిస్తున్నారు. యాత్రికుల వాహనాలు పాస్ల ద్వారా మాత్రమే అనుమతులు పొందుతున్నాయి. పలు అంశల భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రతి దశలో మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.రెండు రూట్ల ద్వారా యాత్రపహల్గాం రూట్: 48 కిలోమీటర్ల దూరం, సుమారు 5 రోజులు పడుతుంది. పహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వాడి వరకు యాత్ర తేలిక. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పిస్సూ టాప్, ఆపై మరో 9 కిలోమీటర్లు నడవాలి. సాయంత్రానికి శేషనాగ చేరుకుంటారు. రెండో రోజు అక్కడ్నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణి చేరుకుంటారు. ఆపైన చివరిగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ గుహకు పయనమవుతారు. బాల్టాల్ మార్గం: యాత్ర సమయం తక్కువగా ఉన్న వారు ఈ మార్గంలో వెళ్లవచ్చు. సుమారు 16 కిలోమీటర్ల దూరముండే ఈ మార్గంలో సుమారు 2 రోజుల్లో పవిత్ర గుహకు చేరుకునే వీలుంది. అయితే ఇది కాస్త కఠినమైన పర్వతమయం, మలుపులతో కూడిన మార్గం. వృద్ధులకు అనువైంది కాదు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం -
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
Toli Ekadashi 2025: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని, తొలి ఏకాదశి అనీ పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు... అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి. చదవండి: హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం? సీతమ్మ సత్కారం -
పదేపదే చెవుల్లో మ్యూజిక్ వినిపించడం మానసిక సమస్య..?
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!– గురునాథం, కరీంనగర్ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
Hanuman హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం?
తమిళనాడు రాష్ట్రం, కరూర్కి చెందిన ఒక బ్యాంకు ఉద్యోగి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం కారులో తిరుమల బయలుదేరాడు.ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేసరికి కొంచెం సేద తీర్చుకోవాలనుకున్నాడు. ఓ ఆంజనేయస్వామి గుడి వద్ద కారు ఆపాడు.ఆ పక్కనే ఓ భార్యాభర్తల జంట కొబ్బరికాయల కొట్టు పెట్టుకుని ఉన్నారు. భార్య అంగడిలో కూర్చుని ఉంది. భర్త అంగడి ముందర ఉన్న పూల మొక్కలకు నీళ్ళుపోస్తూ ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్ళాడు బ్యాంకు ఉద్యోగి. ఇక్కడ స్వామికి తమల΄ాకులతో పూజ చేస్తారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును’’ అని బదులిచ్చాడు వ్యాపారి.‘‘నేనెప్పుడూ చూడలేదు. దీని విశేషం ఏమిటి?’’ అని ఆసక్తిగా అడిగాడు బ్యాంకు ఉద్యోగి. ‘‘నేను పెద్దగా చదువుకున్న వాణ్ని కాదు. పెద్దలెవరైనా రామాయణం, మహా భారతం లాంటివి చెబుతూ ఉంటే కనీసం వినను కూడా వినలేదు. అయితే మా ఊరిలో ఈ ఆకు పూజ గురించి చెప్పుకునే కథ గురించి మాత్రం మీకు చెప్పగలను’’ అన్నాడు.‘‘నువ్వు విన్నదే చెప్పు. నాకెందుకో కుతూహలంగా ఉంది’’ అన్నాడు బ్యాంకు ఉద్యోగి.భక్తి భావంతో ఆ వ్యా΄ారి తను వేసుకున్న చెప్పులు తీసివేశాడు. తలకి చుట్టిన తువ్వాలును తీసి భుజాన వేసుకున్నాడు. చక్కగా నిలబడి ఆంజనేయ స్వామిని మనసులోనే ప్రార్థించి ఇలా చెప్పసాగాడు.‘‘అది లంకానగరంలో అశోక వనం. ఎక్కడ చూసినా కురూపులైన రాక్షస స్త్రీలు. వారి మధ్యలో సీతమ్మ.ఆమె ముఖం కళ తప్పి ఉంది. పది తలల రాక్షసుడు పెట్టే బాధలు సహించలేకపోతోంది. సరిగ్గా ఆ సమయంలో పిల్ల గాలి వీచింది. చెట్టు మీది పక్షుల రెక్కలు రెపరెపలాడాయి. ‘ఏమిటా’ అని సీతమ్మ చుట్టూ కలయచూసింది. ఎదురుగా ఒక కాంతి పుంజం. కళ్ళు వెడల్పు చేసి చూస్తే ఎదురుగా వినయ విధేయతలతో చేతులు జోడించిన ఆకారం. అది మానవాకారం కాదు, వానరాకారం. సీతమ్మ జడుసుకుంది. ‘ఇది రావణ మాయ ఏమో...’ అని అనుమానపడింది.అయితే ఆ వానరాకారం గౌరవంగా ‘అమ్మా’ అని సంబోధిస్తే ఉలిక్కిపడింది. ‘‘అనుమానం వలదు, నేను రామదూతను’’ అని హనుమంతుడు వినమ్రంగా విషయమంతా వివరించాడు. అంతా ఆసక్తిగా విన్నది సీతమ్మ. హనుమంతుడు చెప్పటం ఆ΄ాక సుగుణాభిరాముని క్షేమ సమాచారాలు అడిగింది. వాలి సుగ్రీవుల గురించి వాకబు చేసింది. శ్రీ రాముడు కపిసైన్యంతో రానున్నాడనే చల్లని కబురు తెలుసుకుని ఆనందపడింది. శ్రీరాముల వారు ఆనవాలుగా పంపిన ఉంగరం చూసి పరవశించిపోయింది.ఆ సంతోషంలో హనుమంతుడిని గౌరవించాలని అనుకుంది సీతమ్మ. చుట్టూ చూసింది. పూల చెట్లు ఏవీ కనిపించలేదు. కనీసం తులసీ బృందావనమైనా అక్కడ లేదు. పరిసరాలను మరింత సూక్ష్మంగా చూసింది. కంచెను అల్లుకుని ఉన్న తమలపాకు తీగలను చూసింది. వాటిని చిన్నగా గిల్లి దండగా మార్చింది. చిరునవ్వుల మోముతో హనుమ మెడలో వేసింది. ఈ హఠాత్పరిణామానికి హనుమ ఆశ్చర్యచకితుడయ్యాడు. హనుమ కంట ఆనందాశ్రువులు. ‘‘అంజన తనయా.. లోకంలో ఎవరు ఏ శుభ వార్త అందించినా బహుమతులివ్వడం మా ఆనవాయితీ. నువ్వు శ్రీ రాములవారి ఉంగరాన్ని నాకు చేరవేశావు. శ్రీరాముడు వస్తున్నాడన్న మంచి విషయం తెలియ జేశావు. ఈ దేశం కాని దేశంలో నీకు ఈ తమల పాకుల దండ తప్ప మరేమీ ఇవ్వలేను’’ అని చెప్పింది.ఊహించని సత్కారానికి హనుమంతుని ఒళ్లంతా పులకరించింది. ‘‘లోకమాత అయిన నీవు నా మెడలో తమలపాకుల మాల వేశావు, నా జన్మ చరితార్థమయ్యింది తల్లీ’’ అని రెండు చేతులూ జోడించి తల వంచాడు. ఇదే రానురాను ఆకు పూజకు నాంది పలికిందని ఇక్కడ చెప్పుకుంటారు. శివునికి బిల్వపత్రం, విష్ణువుకు తులసి లాగా హనుమంతునికి తమలపాకు ప్రియ మయిందని భావిస్తారు. హనుమంతునికి ఆకుపూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చని ఇక్కడి వారి నమ్మకం’’ అని వివరించాడు. అప్పటికే ఆ బ్యాంకు ఉద్యోగి తమలపాకుల మాల, ఇతర పూజా సామగ్రి కొనుక్కుని గుడిలోకి వడివడిగా వెళ్తూ ఉన్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను ‘ఫ్రాడ్’ అకౌంట్గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్ 23వ తేదీతో ఎస్బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆర్కామ్ తెలిపింది. దీని ప్రకారం ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.ఆర్కామ్కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్కామ్ ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాలని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది. ‘ఫ్రాడ్’గా మారిస్తే..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్ డైరెక్టర్, ఇతరత్రా హోల్టైమ్ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఆర్కామ్ స్పందన ఇదే..ఎస్బీఐ నిర్ణయంపై ఆర్కామ్ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్కామ్ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్కామ్లోని ఇతర నాన్–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసును విత్డ్రా చేసుకున్న ఎస్బీఐ, అంబానీ కూడా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు. -
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? ) -
సీఎం కరకట్ట నివాసం వద్ద యోగాసనాలతో నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే.. సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బుధవారం నార్తాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 269 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన తుపాన్ ఇన్నింగ్స్లో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన రికార్డులు ఇవే..👉అండర్-19 వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై 236.84 స్ట్రైక్రేట్తో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 31 బంతుల్లో 277.41 స్ట్రైక్రేట్తో 86 పరుగులు చేసిన వైభవ్.. రైనా ఆల్టైమ్ రికార్డు రికార్డు బ్రేక్ను చేశాడు.👉అండర్ 19 వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. వైభశ్ సూర్యవంశీ కంటే ముందు రిషభ్ పంత్.. అండర్ 19 వన్డేల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.👉అండర్-19 యూత్ వన్డేలో భారత తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మన్దీప్ సింగ్(8 సిక్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో 9 సిక్సర్లు బాది మన్దీప్ రికార్డును వైభవ్ అధగమించాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
విజయవంతంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘సాహిత్యంలో హాస్యం’ కార్యక్రమం
డాలస్, టెక్సస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం (5 సంవత్సరాలకు పైగా) నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన 81వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం-అలనాటి విశిష్ట రచయితల హాస్యరచనా వైభవం” (గురజాడ, భానుమతి, మొక్కపాటి, ముళ్ళపూడి, చిలకమర్తి, భమిడిపాటి, శ్రీరమణ) ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపించింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ - మనకున్న తెలుగు సాహితీవేత్తలలో కొంతమంది విశిష్టరచయితలు సృష్టించిన హాస్య సాహిత్యవైభవాన్ని ఈ రోజు ఈ వేదికమీద చర్చించుకోవడం ముదావహం అంటూ శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ”హాస్యంకోసం హాస్యరచనలు చేసినవారు కొందరైతే, ఆనాటి వాస్తవ సాంఘిక, సామాజిక సమస్యల ఇతివృత్తంగా కొంతమంది చేసిన రచనలు సహజంగా హాస్యాన్ని సృష్టించాయి. రచనలతో హాస్యం పండించడం, పాఠకుల్ని మెప్పించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి దాన్ని అలవోకగా సాధించిన రచయితలలో కొంతమందిని ఎంపికచేసుకుని వారి రచనావైభవాన్ని మననం చేసుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా సబబుగా ఉంది అన్నారు.” విశిష్ట అతిథులుగాపాల్గొన్న - ఆచార్య డా. చుండూరి మృణాళిని, ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, వక్త à గురజాడ అప్పారావు (రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) గురించి; పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి భానుమతీ రామకృష్ణ (రచయిత్రి, నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు) గురించి; డా. కొచ్చెర్లకోట జగదీశ్, ప్రముఖ రచయిత à మొక్కపాటి నరసింహశాస్త్రి (ప్రముఖ హాస్యరచయిత) గురించి; యర్రంశెట్టి శాయి, ప్రసిధ్ధ తెలుగు కథా, నవలా రచయిత à ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సినీ కథా రచయిత, హాస్య కథా, నవలా రచయిత) గురించి; కూచి, ప్రముఖ చిత్రకారుడు, హాస్య రచయిత à చిలకమర్తి లక్ష్మీనరసింహం (సుప్రసిద్ధ కవి, రచయిత, నాటకకర్త, సంఘసంస్కర్త) గురించి; డా. చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు à భమిడిపాటి కామేశ్వరరావు (హాస్యబ్రహ్మ, ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త) గురించి; ఫణి డొక్కా, ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీ రమణ (ప్రముఖ వ్యంగ్య వ్యాస, కథా, నవలారచయిత)లు సృష్టించిన అసంఖ్యాక రచనలోని విశేషాలను, పాత్రల స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ఆద్యంతం నవ్వులు పూయించారు.హాస్యప్రధానంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్టఅతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.ఈ పూర్తి కార్యక్రమాన్ని క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/x9kzttV6B_w -
ఇండోనేసియాలో పడవ మునక
బాలి: ఇండోనేసియాలోని బాలిలో పడవ మునిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. కనీసం 29 మంది గల్లంతయ్యారు. 31 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. కేఎంపీ తును ప్రతమ జయ అనే పడవ బుధవారం సాయంత్రం తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బాలిలోని గిలిమనుక్కు బయలుదేరిన అరగంటకే అలల తాకిడికి గురైంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 22 వాహనాలు, ట్రక్కులు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు 31 మందిని కాపాడారు. వీరిలో సుమారు 20 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. టగ్ బోట్లు, నౌకలతో సహా తొమ్మిది బోట్లతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అలలు రెండు మీటర్ల ఎత్తులో ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. పూర్తిగా మునిగిపోయిన పడవలో చిక్కుకుని ఎవరూ ఉండే అవకాశాల్లేవని చెప్పారు. కాగా, అధికారులు చెబుతున్న దానికంటే పడవలో ఎక్కుమంది ప్రయాణికులు ఉండే అవకాశాలున్నాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు అంటున్నారు. ఇలా ఉండగా, ఇండోనేసియాలోని దీవుల మధ్య రోజూ ప్రయాణించే లక్షలాది మందికి పడవలే ఆధారం. అయితే, కాలం చెల్లిన ఓడలు, తగినంత భద్రతా తనిఖీలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బాలి సమీపంలో ఒక పర్యాటక పడవ బోల్తా పడటంతో ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ మరణించింది. 2018లో టోబా సరస్సులో పడవ మునిగిన ఘటనలో 150 మందికి పైగా జల సమాధి అయ్యారు. ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం