breaking news
-
గ్రామీణ ‘మహిళా చిత్రం’
డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎమ్జెఎఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్సు ఒక భాగం. మొదట అన్హాద్ ఫిల్మ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయ్యింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.బాల్య వివాహాల సంకెళ్లలో చిక్కుకుని, కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకొని, మహిళా కార్మికుల దయనీయ జీవితాలు, గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు, చాలావరకు విజయం సాధించారు కూడా. వీరు తమ ఆలోచనలను సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి, సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధించిన ఈ మహిళలు ట్రైనర్లుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో అత్యంత సామాన్యంగా ఉండే రెండంతస్తుల భవనం అది. అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేలుకొంటుంది. అన్ని వయసుల మహిళలు అక్కడ కనిపిస్తారు. వారంతా బాల్యవివాహాల సంకెళ్ల బందీలే. నేడు ఆ మహిళలు బాలికలకు సాధికారత కల్పించడానికి మహిళా జన అధికార్ సమితి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా కెమెరాలు తీసుకొని షూటింగ్లకు వెళుతున్నారు. మరికొందరు తమ సినిమాలను ఎడిట్ చేయడానికి కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఉంటున్నారు. అంతా కలిసి, వారు నూతన భవిష్యత్తుకు ఒక్కొక్క ఫ్రేమ్ని స్క్రిప్ట్ చేస్తున్నారు. డిజిటల్ అక్షరాస్యతమహిళా జన అధికార్ సమితి ఆఫీసులో 30 మందికి పైగా మహిళలు చిత్ర నిర్మాణం, ఎడిటింగ్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో కెమెరా పట్టుకొని ప్రపంచంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తులు వీరే. పాతికేళ్ల క్రితం భూమి హక్కుల కోసం, కులవివక్ష, బాల్య వివాహాలు, పరువు హత్యలకు వ్యతిరేకంగా ΄ోరాడిన మహిళల నేతృత్వంలోని అట్టడుగు వర్గాల నుంచి ఈ మహిళా జన అధికార్ సమితి పుట్టుకు వచ్చింది. నేడు అక్కడి మూడు జిల్లాలలో ఈ సమితి తన ఉనికిని కొనసాగిస్తోంది. డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వ కార్యక్రమాలు, లింగ సమానత్వం, గృహ హింసపై దృష్టి సారించింది. మహిళల ఆందోళనలను వ్యక్తపరచడానికి, వారి జీవితాలలో, సమాజాలలో సానుకూల మార్పును తీసుకు రావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.గ్రామీణ మహిళ చేతిలో కంప్యూటర్ స్క్రీన్...మహిళా జన అధికార్ సమితి ఆఫీసులోకి వెళ్లి చూస్తే – ఎడిట్ రూమ్లో 19 ఏళ్ల మంజు రావత్ దీక్షగా తన డెస్క్టాప్పైన సినిమాను ఎడిట్ చేస్తూ కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఈ ఎన్జీవోలో చేరినప్పుడు ఆమె ఏకైక లక్ష్యం డిజిటల్ అక్షరాస్యత పొందడం. అయితే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ, కెమెరా వర్క్తో సహా మహిళలకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ఆమెలో ఆసక్తిని కలిగించింది. ‘కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి మొదట మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు, అందరూ నన్ను చూసి నవ్వారు. నా కుటుంబంతో పాటు ఇరుగు పొరుగువాళ్లు ‘ఆమె ఎలా తిరుగుతుందో చూడండి’ అనేవారు. కానీ, వారి మాటలను పట్టించుకోలేదు’ అని చెబుతుంది. నాలుగేళ్ల వయసులోనే 20 ఏళ్ల వాడితో ముడిపెట్టిన ఛాందస కుటుంబం నుండి వచ్చిన రావత్ ఇప్పుడు తనలాంటి మహిళల సమస్యలపైన దృష్టి సారిస్తూ షార్ట్ ఫిలింలు తీసింది. రావత్ చెల్లెలు సంజు వయసు 19 ఏళ్లు. ఆమె, అజేసర్ గ్రామంలోని దినసరి కార్మికుల జీవితాలను చిత్రీకరించింది. సవాళ్లను ఎదిరిస్తూ..24 ఏళ్ల భగవతీ దేవికి 15 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఆమె తన గ్రామం భవానీ నుండి అజ్మీర్కు ప్రతిరోజూ 30 కి.మీ దూరం ప్రయాణించే భగవతీ దేవి ముసుగు ధరించే ఆచారం పైన, తగిన ధ్రువపత్రాలు లేక΄ోవడం వల్ల సంక్షేమ పథకాల నుండి మినహాయించిన సంచార జాతి ఘుమంతు తెగపై సినిమాలు నిర్మించింది.ఈ కోర్సు నేర్చుకుంటున్న మహిళలందరూ ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీశారు. వీరంతా పురుషుల నుంచి, కుటుంబాల నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నవారే. ఈ యేడాది మొదట్లో 23 ఏళ్ల సంత్రా చౌరాసియా, భగవతీ దేవి, మరో ఇద్దరు కిషన్ గఢ్లో ఒక పెళ్లిని చిత్రీకరించారు. ఇది వారి మొదటి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్. వీరు తీసిన సినిమాలను చూసిన స్థానిక మహిళలు సంతోషిస్తుండగా పురుషులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటిగా నడుస్తాం. ఏ అమ్మాయి అయినా మా డిజిటల్ క్లాసులకు రాలేక΄ోతే మేమే వారి ఇంటికి వెళ్లి వెంటబెట్టుకు వస్తాం. కుటుంబ ఒత్తిడి కారణంగా ఎవరూ ఈ డిజిటల్ చదువు మానేయకుండా చూసుకోవాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అని 22 ఏళ్ల మేరీ చెబుతోంది. ‘‘గతంలో మా కాలనీలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంటినుండి బయటకు వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. ఇప్పుడు చాలామంది మహిళలు నాతో చేరారు. ఇది మా సమష్టి విజయం’ అని 21 ఏళ్ల ట్రైనర్ సమీరా బాను గర్వంగా చెబుతుంది. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపైన సినిమాలు తీస్తూ, వాటిని గ్రామంలో ప్రదర్శిస్తూ అవగాహన తీసుకువస్తున్నారు. మహిళాభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో తమ సినిమాల ద్వారా చూపుతున్నారు. -
కచ్చితంగా యుద్ధం చేసి కోలుకోని దెబ్బతీస్తాం!
కచ్చితంగా యుద్ధం చేసి కోలుకోని దెబ్బతీస్తాం! -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.తదియ రా.2.53 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: భరణి రా.12.36 వరకు, తదుపరి కృత్తిక,వర్జ్యం: ప.11.11 నుండి 12.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.10 నుండి 9.57 వరకు, తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు,అమృత ఘడియలు: రా.8.05 నుండి 9.36 వరకు, అట్ల తదియ.సూర్యోదయం : 5.55సూర్యాస్తమయం : 5.41రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.వృషభం.... బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.మిథునం.... ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.కర్కాటకం..... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.సింహం..... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.కన్య..... అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యం. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.తుల........పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.వృశ్చికం..... వ్యవహారాలలో విజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.ధనుస్సు.... ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మకరం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.కుంభం... మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.మీనం.... సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. -
మల్లమ్మ మాట.. పల్లె పదాల మూట
తెలంగాణలో గంగవ్వ ఎలాగో కర్నాటకలో మల్లమ్మ అలాగ. కన్నడ భాషలోని పల్లె పలుకుబడిలో వర్తమాన విషయాలపై మల్లమ్మ చేసే వ్యంగ్య వ్యాఖ్యానానికి చాలామంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆమె ‘మల్లమ్మ టాక్స్’ యూట్యూబ్ చానల్కు 50 వేల మంది సబ్స్క్రయిబర్స్. అందుకే ఆమెకు కన్నడ బిగ్బాస్లో పిలుపు వచ్చింది. మారుమూల పల్లెల్లో ఉన్నామని చిన్నబుచ్చుకోక గంగవ్వలా, మల్లమ్మలా ఎవరైనా వెలగొచ్చు.కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తోన్న ‘కన్నడ బిగ్బాస్ 12’వ సీజన్ప్రారంభమైంది. అన్ని బిగ్బాస్ షోలకు ఉన్నట్టే అక్కడా దానికి ఒక క్రేజ్ ఉంది. ప్రతిసారీ హౌస్లోకి వచ్చేవారు ఎవరా అనే కుతూహలం ఉంటుంది. ఈసారి హౌస్లోని అభ్యర్థుల్లో పాపులర్ వ్యక్తులు చాలా మందే ఉన్నారు. అయితే వారందరిని మించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమే మల్లమ్మ అలియాస్ ‘మటిన మల్లి’ (మాటల రాణి– ఆమెను అభిమానంగా పిలుచుకునే పేరు). బిగ్బాస్లో అందరికంటే ఎక్కువ వయసు మల్లమ్మదే. 70 ఏళ్లు. మల్లమ్మ సరళమైన జీవనశైలి, హాస్యం, గ్రామీణ జీవితంపై ఆమె చేసే కంటెంట్ సోషల్ మీడియాలో ఆమెను వైరల్గా మార్చాయి. ఇక్కడ బిగ్బాస్లో ఎలాగైతే తెలంగాణ గంగవ్వకు చోటు లభించిందో ఆమెకు అలా అక్కడ చోటు లభించింది. బిగ్బాస్లో పాల్గొన్న గంగవ్వ ఆ షో పుణ్యమా అని సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగింది. మరి మల్లమ్మకు ఏం ప్రయోజనం కలుగుతుందో చూడాలి.కథలు చెప్పే మల్లమ్మఉత్తర కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సురపుర గ్రామానికి చెందిన మల్లమ్మ మంచి మాటకారి. సోషల్మీడియా కంటెంట్ క్రియేటర్. ఆమె వీడియోలకు లక్షల్లో వీక్షకులున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రయాణం విచిత్రంగా మొదలైంది. ఆమె గతంలో బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైన్ కంపెనీలో పని చేసింది. ఆమె మంచి టైలర్. ఆ సమయంలో స్టోర్ యజమానులను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేసింది. అవి పాపులర్ కావడంతో ఇతర అంశాలపైనా దృష్టి సారించి, మరిన్ని వీడియోలు చేసింది.పల్లెటూరి పనులు, వంటలు, షాపుల్లో పల్లెజనం బేరసారాలు చేసే తీరు, జాతరలు ఇవన్నీ యథాతథంగా ఎలా ఉంటాయో ఆమె చూపడం వల్ల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్కు 1.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మల్లమ్మ అప్పుడప్పుడూ సరదా కథల్ని కూడా తన వీడియోల్లో పంచుకుంటోంది. ఇంత పాపులారిటీ ఉండటం వల్ల సహజంగానే బిగ్బాస్ షోకు ఆహ్వానం అందింది. హోస్ట్ సుదీప్తో ఆమె మాట్లాడుతూ బిగ్బాస్ హౌస్ నియమాల గురించి తనకేమీ తెలియదని అన్నారు. ‘మల్లమ్మ ఎప్పుడూ తనంతట తానుగా జీవితాన్ని గడిపే వ్యక్తి’ అని సుదీప్ అన్నారు. మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.ప్రశంసలతోపాటు వివాదాలుమల్లమ్మ చేసిన వీడియోలకు అనేక ప్రశంసలు వచ్చాయి. ఒక్క వీడియో మాత్రం తీవ్రమైన విమర్శలు మూటగట్టుకుంది. ఒక తెలుగు సినిమాలోని పాట గురించి ఆమె మాట్లాడిన మాటలతో అనేకమంది తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తన అకౌంట్ను మూసివేయాలని అనుకున్నట్లు ప్రకటించింది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆమె అభిమానులు ఆమెను ఒప్పించారు. అలా ఆమె వీడియోల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. విక్కీ కౌశల్ ‘తౌబా తౌబా’ డ్యాన్స్, ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్ స్టైల్, ఉత్తర భారతదేశ వంటలు, వైరల్ రీల్స్.. ఇలా అన్నింటి గురించి ఆమె వీడియోలు చేసింది. అయితే ప్రస్తుతం కన్నడ బిగ్బాస్ షో తాత్కాలిక కష్టాల్లో పడింది. పర్యావరణ అనుమతులు లేవని ΄ోలీసులు బిగ్బాస్ హౌస్ను మంగళవారం సాయంత్రం సీజ్ చేసి కంటెస్టెంట్లను ఒక రిసార్ట్కు తరలించారు. బిగ్బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చే మురుగు నీరు, వ్యర్థ పదార్థాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని నిర్వాహకుల మీద అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో సంతోషంగా హౌస్లో అడుగు పెట్టిన మల్లమ్మ ప్రస్తుతం రిసార్ట్కు చేరింది. అయితే సమస్య అతి త్వరలో సద్దుమణిగి షో కొనసాగుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు. -
తాలిబన్లతో సఖ్యత!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరన్న నానుడి దౌత్యానికి కూడా వర్తిస్తుంది. పైకి ఏం చెబుతున్నా, ఇతరేతర ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించటమనే ప్రక్రియ దౌత్యంలో నిరంతరం కొనసాగుతుంటుంది. పర్యవసానంగా ఒక్కోసారి అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. తాలిబన్ల ఆధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ గురువారం అయిదు రోజుల భారత సందర్శనకు రావటం అటువంటిదే. ఇది దక్షిణ, మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామం. ప్రపంచ దేశాల్లో రష్యా మినహా మరే దేశమూ ఇంతవరకూ అఫ్గాన్ ప్రభుత్వాన్ని లాంఛనంగా గుర్తించలేదు. మన దేశం తొలిసారి ఆ దిశగా అడుగులేస్తున్నది. అమీర్ ఖాన్ రానున్న సందర్భంగా తాలిబన్ను ప్రాంతీయ బృందంలోని భాగస్వామిగా గుర్తించటానికి భారత్ సిద్ధపడింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించటం ఇక లాంఛన ప్రాయం. భద్రతా మండలి ఉగ్రవాదులుగా గుర్తించి ఆంక్షలు విధించిన వారిలో అమీర్ ఖాన్ ఒకరు. దానికింద ఆయన తారసపడితే అరెస్టు చేయాల్సి ఉంటుంది. భారత్ చొరవతో ఈ విషయంలో తాత్కాలికంగా మినహాయింపు లభించింది.తొలిసారి 1996లో అఫ్గాన్ తాలిబన్ల వశమైనప్పుడు మనకు ఎన్ని విధాల సమస్య లొచ్చాయో ఎవరూ మరిచిపోరు. సోవియెట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధి కారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అనేకమంది మిలిటెంట్లను కశ్మీర్కు తరలించారు. పర్యవసానంగా అక్కడ నెత్తురుటేర్లు పారాయి. కేంద్రంలో వాజ్పేయి నాయ కత్వాన తొలి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 1999లో ఉగ్రవాదులు ఖాట్మండు నుంచి న్యూఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేసి అఫ్గాన్లోని కాందహార్కు తరలించారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఈ చర్య వెనక నేరుగా తాలిబన్లు లేక పోయినా ఉగ్రవాదులు సురక్షితంగా వెళ్లటానికి సహకరించారు. తాలిబన్లతో చర్చలు గానీ, గుర్తింపుగానీ ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇంటా, బయటా వారు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించేది.ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో అఫ్గాన్ను దురాక్రమించాక ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో తాలిబన్ల పునరాగమనంతో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయేవరకూ మన దేశం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 25,000 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్నీ, సల్మా ఆనకట్టనూ, ఒక జాతీయ రహదారినీ నిర్మించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లో పాలుపంచుకుంది. ఇవన్నీ తాలిబన్లలో సద్భావన కలిగించటంతో పాటు పాకిస్తాన్తో వచ్చిన విభేదాలు కూడా వారిని భారత్వైపు మొగ్గేలా చేశాయి. పాక్– అఫ్గాన్ దీర్ఘకాల సంబంధాలూ, ఉజ్బెకిస్తాన్ ద్వారా సన్నిహితం కావటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలూ, చైనా వరస మంతనాలూ మన దేశంలో కూడా పునరాలోచన కలిగించాయి. మనం ముందడుగు వేయనట్టయితే ఏదోనాటికి తాలిబన్–పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడి, చైనా పలుకుబడి పెరిగి అది మన భద్రతకు ముప్పు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా కీలకమైన అఫ్గాన్లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఇది కూడా మన భద్రతను ప్రశ్నార్థకం చేసే పరిణామం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోబట్టే తాలిబన్లతో సత్సంబంధాలకు మన దేశం సిద్ధపడింది. ఏ దేశానికైనా స్వీయ ప్రయోజనాలు, భద్రత అత్యంత కీలకం. ఆ తర్వాతే మిగిలిన వన్నీ. గత నాలుగేళ్లుగా మన దేశం వేలాది టన్నుల గోధుమలు, వందల టన్నుల మందులు, వ్యాక్సిన్లు, భారీ మొత్తంలో పురుగుమందులు, అత్యవసర సరుకులు పంపింది. ఇటీవల భూకంపం వచ్చినప్పుడు టెంట్లు, మందులు, దుప్పట్లు, జనరేటర్లు అందించింది. కాబూల్లో పూర్తిస్థాయి దౌత్య కార్యాలయం కాకపోయినా సాంకేతిక కార్యాలయాన్ని తెరిచింది. తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవటానికి అనుమతినిచ్చింది. ఈ అనుకూల వాతావరణంలో అఫ్గాన్తో సత్సంబంధాలకు ప్రయత్నించటం అనేక విధాల శుభ పరిణామం. -
ప్రజాభీష్టాన్ని పట్టించుకోవాలి!
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్లో తిరిగి వీధులకెక్కారు. లద్దాఖ్ ఎందుకు కీలకం?లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.నిరసనలకు కారణాలులద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు. ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్చుక్కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర హోదా వచ్చేనా?జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్కు (1995లో), కార్గిల్కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది. 2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది. దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!అజయ్ కె. మెహ్రావ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లోవిజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
ఢిల్లీ: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యమైన నగర ప్రాంత నియోజకవర్గాలలో ఒకటి. నవీన్ వైపే సీఎం రేవంత్రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను కాంగ్రెస్ గెలుచుకుంది. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ మాత్రం నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. -
World Cup 2025: పాక్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్ఫీల్డ్ (10).. వన్డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్డౌన్లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెను అవుట్ చేసింది.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్లో నష్రా తొమ్మిదో వికెట్గా.. సదర్లాండ్ బౌలింగ్లో షమీమ్ పదో వికెట్గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
‘ఇంటర్నేషనల్’ తెలివి తేటలు.. ఏఐ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలు..!
రాయ్పూర్: మనోడు చదివేది చత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్ డెవలప్చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్ గురయ్యాడు. బిలాస్పూర్కు చెందిన థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్ చిత్రాలను సృష్టించాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్ 6వ తేదీ ఆ ఇన్స్టిట్యూట్లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు సిద్ధమైన ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆశిష్ రాజ్పుత్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
EPFO: ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా కొత్త సంవత్సరం నుంచే!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ సేవలను ఈపీఎఫ్ఓ 2026 జనవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీబీటీ, అక్టోబర్ రెండవ వారంలో జరగబోయే బోర్డు సమావేశంలో ఏటీఎం ఉపసంహరణలను ఆమోదించే అవకాశం ఉంది.ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. పీఎఫ్ సొమ్ము ఉపసంహరించుకోవడానికి వారు ఆన్ లైన్ క్లెయిమ్ ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ డబ్బు కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఉద్యోగులు నేరుగా ఏటీఎంకు వెళ్లి పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏటీఎం లాంటి లావాదేవీలను అనుమతించడానికి సిద్ధంగా ఉందని సీబీటీ సభ్యుడిని ఉటంకిస్తూ మనీకంట్రోల్ వార్తా సంస్థ పేర్కొంది. ఏటీఎం ఉపసంహరణకు పరిమితి ఉంటుందని, అయితే దీనిపై ఇంకా చర్చ జరుగుతోందని ఆయన చెప్పనట్లుగా పేర్కొంది.ఈపీఎఫ్ఓ ఏటీఎం సదుపాయాన్ని ప్రారంభించడంపై బ్యాంకులతో పాటు ఆర్బీఐతో చర్చించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు ప్రత్యేక కార్డును జారీ చేసే అవకాశం ఉందని, ఏటీఎంల నుండి తమ నిధులలో కొంత భాగాన్ని ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద 7.8 కోట్ల మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి ఈపీఎఫ్వో దగ్గర రూ .28 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ చేశారు. దాదాపు పదేళ్ల క్రితం 2014లో ఈపీఎఫ్ఓలో సభ్యులు 3.3 కోట్ల మంది ఉండగా వారి డిపాజిట్ల మొత్తం రూ.7.4 లక్షల కోట్లుగా ఉండేది. -
సూపర్ హిట్ కాంబో.. ఆ డైరెక్టర్తో మరోసారి నిహారిక!
గతేడాది చిన్న చిత్రంగా వచ్చిన సూపర్ హిట్గా నిలిచిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్గా రూ.24.5 కోట్లు వసూళ్లు రాబట్టింది.మరోసారి రిపీట్.. అయితే మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ యదు వంశీ మరోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెలతో కలిసి మరో సినిమాను రూపొందించటానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక కమిటీ కుర్రోళ్లు సినిమా అవార్డుల రేసులో సత్తా చాటింది. సైమా 2025లోబెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సందీప్ సరోజ్కి సైమా అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా అవార్డును సొంతం చేసుకున్నారు.ప్రొడక్షన్ నెం.2..పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఫాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. -
డెయిరీ ఫామ్లో ‘అలియా భట్’ను కలుసుకున్న ప్రియాంక
తిరువంబడి: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒక ఆసక్తికర ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కేరళలోని తిరువంబడిలో గల ఒక డెయిరీ ఫామ్కు వెళ్లినప్పటి సందర్భాన్ని ఆమె షేర్ చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్లో ఆమె.. తాను డెయిరీ ఫామ్లో ‘అలియా భట్’ను కలుసుకున్నానని తెలిపారు. అయితే ఇక్కడ ఆలియా భట్ అంటే బాలీవుడ్ స్టార్ కాదు.. అదే పేరు కలిగిన అందమైన ఆవు. Met a group of dairy farmers at a dairy farm run by the loveliest family (and even encountered a cow named Alia Bhatt!!, due apologies to Ms.Bhatt @aliaa08, but she was really a cutie pie!).Unfortunately dairy farmers are struggling with multiple difficulties and many are… pic.twitter.com/p36oeAZTbF— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 7, 2025‘డెయిరీ ఫామ్లో పాడి రైతుల బృందాన్ని కలుసుకున్నాను. అక్కడే అలియా భట్ అనే ఆవును కూడా కలుసుకున్నాను. అయితే అలియా భట్కు క్షమాపణలు’ అని ప్రియాంక ఆ పోస్టులో రాశారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రియాంకా గాంధీ దృష్టి సారించారు. పెరుగుతున్న పశువైద్య ఖర్చులు, తగినంత బీమా కవరేజ్ లేకపోవడం, నాణ్యమైన పశువుల దాణా అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని ఆమె పేర్కొన్నారు. -
సర్వస్వం నువ్వే.. నా జీవితంలో ఆదర్శం నువ్వే.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025 -
రేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన రుణ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్) తో ముడిపడి ఉన్న రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించింది. ఈ తగ్గింపుతో వివిధ రుణ కాలపరిమితులలో చాలా మంది కస్టమర్లకు ఈఎంఐలను తగ్గిస్తుందని భావిస్తున్నారు.ఎంపిక చేసిన కాలపరిమితులపై బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. సవరణ తరువాత, రుణ వ్యవధిని బట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసిఎల్ఆర్ ఇప్పుడు 8.40 శాతం నుండి 8.65 శాతం వరకు ఉంటుంది. గతంలో ఈ రేట్లు 8.55 శాతం నుంచి 8.75 శాతం వరకు ఉండేవి.తగ్గింపు ఇలా..ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గుముఖం పట్టగా, నెల రోజుల వ్యవధి రేటు 8.40 శాతానికి పడిపోయింది. మూడు నెలల రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.45 శాతానికి తగ్గించారు. ఆరు నెలలు, ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్లు ఇప్పుడు 8.55 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాలానికి రెండేళ్ల రేటు 8.60 శాతం, మూడేళ్ల రేటు 8.65 శాతంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసిఎల్ఆర్ అనేది రుణం కోసం బ్యాంకు వసూలు చేయగల కనీస వడ్డీ రేటు. ఇది చాలా గృహ, వ్యక్తిగత, వ్యాపార రుణాలకు ఆధారంగా పనిచేస్తుంది. 2016 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఎంసిఎల్ఆర్ రుణగ్రహీతలకు బ్యాంకు నిధుల వ్యయం కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని నిర్ధారిస్తుంది.ఈఎంఐలు తగ్గే అవకాశంఈ సవరణ తరువాత ఎంసిఎల్ఆర్తో అనుసంధానించిన గృహ, వ్యక్తిగత రుణగ్రహీతలు వారి ఈఎంఐలలో (EMI) తగ్గింపును చూసే అవకాశం ఉంది. రెపో రేటుతో ముడిపడి ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గృహ రుణ రేట్లు ప్రస్తుతం రుణగ్రహీత ప్రొఫైల్, రుణ రకాన్ని బట్టి 7.90 శాతం నుండి 13.20 శాతం వరకు ఉన్నాయి. -
వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ జగన్ రేపు (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా - తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. -
Bihar Elections: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ?
పట్నా: బీహార్లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
‘42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం’
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొన్నం ప్రబాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పై ప్రభుత్వం తరపున మా వాదనలు బలంగా వినిపించాం. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నాం. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృశ్య రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలి. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానం పై జరిగింది. కోర్టులో అఫిడవిట్లు ఉండవు ఇంప్లీడ్ కావాలని కోరాం..ఎంపైరికల్ డేటా కు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. రాజకీయాలు పక్కన పెట్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి’అని పొన్నం కోరారు. ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు: ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం -
మహ్మద్ షమీ కీలక నిర్ణయం
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.చాంపియన్ జట్టులోకోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో షమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచ్లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.రెండేళ్ల నుంచీ నిరాశే పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.షమీ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి అప్డేట్ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్ కోచ్ టెలిగ్రాఫ్తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్ మ్యాచ్ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్ మ్యాచ్లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.అయితే, ఐపీఎల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్.. కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్కు ఎండ్ కార్డ్? -
కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్గా భారీ బడ్జెట్తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025 -
‘వైఎస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుంది’
విశాఖ. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన రేపు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) యథావిధిగా కొనసాగుతుందని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గాన మెడికల్ కాలేజ్కి వెళ్తారని తెలిపారు. స్టీల్ప్లాంట్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు రూట్ మార్చారన్నారు. ‘ వైఎస్ జగన్ తన తిరుగు ప్రయాణంలో కేజీహెచ్కు వెళ్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శిస్తారు. 70 మంది వివిధ హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు మరణించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది.జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా భయపెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కట్టే ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారు.అరిచేతను అడ్డంపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. ఆంక్షలుతో వైఎస్ జగన్ను ఆపలేరు. మనుషులు ఉండే హాస్పటల్లో నిర్మించలేని చంద్రబాబు పశువులకు హాస్టల్స్ పెడతారట’ అని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘జగన్ పర్యటనపై పోలీసులు హైడ్రామా నడిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవడానికి వీల్లేదు అంటూ రూటు మార్చారు. మాకు ప్రజా సమస్యల ముఖ్యం. పోలీసుల రూట్ మార్చిన వైఎస్ జగన్ నర్సీపట్నం వెళుతున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ పర్యటనకు లేనిపోని ఆంక్షలు పెట్టారు. 10 కార్లు మాత్రమే కాన్వాయ్ లో ఉండాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, రాచరిక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. జగన్ పర్యటనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, చిరు వ్యాపారుల సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వుమెన్ వన్డే క్రికెట్లో తొమ్మిదో వికెట్కు వందకు పైగా స్కోరు జతచేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఇంత వరకు ఏ మహిళా జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens World Cup 2025)లో భాగంగా పాకిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ఆసీస్ జట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంక వేదికగా తమ మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆసీస్ (Aus W vs Pak W)తో తాజా మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది.టాపార్డర్ కుదేలైనా..అయితే, పాక్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్ఫీల్డ్ (10) నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. వన్డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ 5 పరుగులకే నిష్క్రమించింది.మిగిలిన వాళ్లలో కిమ్ గార్త్ (11) తప్ప అంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ, పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్ సంచలన ఇన్నింగ్స్తో మెరిశారు. మూనీ సెంచరీ (114 బంతుల్లో 109)తో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్గా నిలిచింది.మూనీ- అలనా కలిసి తొమ్మిదో వికెట్కు 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా..ఇక 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. మూనీ- అలనా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు స్కోరు చేయగలిగింది. కాగా మహిళల వన్డే చరిత్రలో ఏడు ఎక్కువ వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జట్టుగానూ ఆసీస్ నిలిచింది. ఏడో వికెట్ పడిన తర్వాత ఆసీస్ 145 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డూ ఆసీస్ పేరు మీదేఐసీసీ పురుషుల వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ఆసీస్ 91 పరుగులకే ఏడు వికెట్ల నష్టపోయిన వేళ.. గ్లెన్ మాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్ కలిసి అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్కు ఏకంగా 202 పరుగులు జోడించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆసీస్ను నిలిపారు.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
గట్టు వామన్ రావు దంపతుల కేసులో సీబీఐ దూకుడు
సాక్షి,హైదరాబాద్: అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు జంట హత్యల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ వామన్ రావు అనుచరులు బొల్లంపల్లి సంతోష్, ఇనుముల సతీష్ను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వామన్ రావుతో సాన్నిహిత్యం, ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో పలు రకాల అంశాలపై ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రెండో ఫ్లోర్లో విచారణ చేపట్టిన అధికారులు.. విచారణ కోసం ముందస్తు నోటీసులు అందించారు. గత 20 రోజుల నుంచి కొనసాగుతున్న సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇక తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 130మందిని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్రావు 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు అదే ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది.చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామన్రావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును విచారిస్తున్నారు. -
నేను జోహో ఈ-మెయిల్కు స్విచ్ అయ్యా: అమిత్ షా
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా కోసం పదే పదే పిలుపునిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ-మెయిల్ అడ్రస్ మారింది. ఇక నుంచి అమిత్ షా ఈ-మెయిల్ ఐడి ‘జోహో మెయిల్’. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్’ ఖాతాలో స్సష్టం చేశారు. తాను జోహో మెయిల్కు స్విచ్ అయినట్లు విషయాన్నిఅమిత్ షా పేర్కొన్నారు. ఇక నుంచి తన మెయిల్ ఐడీ amitshah.bjp @ http://zohomail.in అని ఆయన తెలిపారు.Hello everyone,I have switched to Zoho Mail. Kindly note the change in my email address.My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.Thank you for your kind attention to this matter.— Amit Shah (@AmitShah) October 8, 2025 Zoho Mail అనేది జోహో కార్సోరేషన్ అందించే ఒక ప్రొఫెషనల్ ఇమెయిల్ సేవ. ఇది వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది, ముఖ్యంగా అధిక భద్రత, ప్రైవసీ, మరియు వినియోగదారులకు అనుకూలమైన ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది. జోహో కార్సోరేషన్ అనేది భారతదేశానికి చెందిన కంపెనీ, ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది. -
అయ్యే.. ఇన్ని కేసులు మూసేశారా?
కేసు.. నో క్లూస్.. అందుకే క్లోజ్.. ఇదీ చాలా కేసుల పరిస్థితి. నేరం జరిగిందనే విషయం బాధితులతోపాటు పోలీసులకూ స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిందితులను పట్టుకోవడానికి, వారిపై న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి పక్కా ఆధారాలు మాత్రం లభించలేదు. ఈ కారణంగా కేసును మూసివేసినట్లు పోలీసుల ద్వారా బాధితుడికి సమాచారం వెళ్తుంది. అప్పుడు బాధితుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించడం... సరిగ్గా ఇలాంటి ఫీలింగ్నే 2023లో నగరానికి చెందిన 34.98 శాతం మంది బాధితులు అనుభవించారు. - సాక్షి, సిటీబ్యూరోనేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2023కు సంబంధించిన ‘క్రైమ్ ఇన్ ఇండియా’గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’అంటూ కేసును మూసేస్తున్నట్లు పేర్కొంటారు. ఆర్థిక నేరాల్లోనే అత్యధికం... హైదరాబాద్ నగర పోలీసు (Hyderabad Police) విభాగం 2023లో దర్యాప్తు చేసిన కేసుల్లో కొన్ని పాత కేసులూ ఉంటాయి. సరాసరిన చూస్తే 2023లో ఐపీసీ, లోకల్ యాక్ట్స్, ఐటీ చట్టాల కింద మొత్తం 30,604 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,706 కేసుల్ని పైన చెప్పిన ‘నో క్లూ’కారణాలతో మూతపడ్డాయి. ఇలా మూతపడిన కేసుల్లో అత్యధికం ఐపీసీ చట్టాల కింద నమోదైన నేరాలకు సంబంధించినవే ఉన్నాయి. కేసులు ఇలా మూతపడటంలో బాధితుల పాత్ర సైతం ఉంటోందని పోలీసులు చెప్తున్నారు. బాధితులుగా మారిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి కేసు నమోదు చేయిస్తుంటారని, ఆ తర్వాత కొన్నాళ్ళకు నిందితులు రాజీకి వస్తే అంగీకరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తు, విచారణ వంటివి జాప్యాలుగా భావిస్తున్న బాధితులు తక్షణం నష్టం పూడుతోందనే ఉద్దేశంలో ఇలా చేస్తుంటారని వివరిస్తున్నారు. ఫలితంగా దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులకు పూర్తిస్థాయిలో అందించరు. దీంతో ఈ తరహా కేసుల్ని ‘ట్రూ బట్ ఇన్సఫీషియంట్ ఎవిడెన్స్’ తదితర కారణాల కింద మూసేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. సాక్ష్యాధారాలు ఉండాల్సిందే... ఏదైనా నేరానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసి, నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రాథమిక ఆధారాలు ఉంటే సరిపోతుంది. అయితే దర్యాప్తు పూర్తియిన తర్వాత పోలీసులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు కేసు విచారణను న్యాయస్థానం చేపడుతుంది. దీనికి పక్కా సాక్ష్యాధారాలు ఉండాల్సిందే. అలా లేని పక్షంలో కోర్టు నుంచి పోలీసులకు అక్షింతలు తప్పవు. అవకతవకలకు, వేధింపులకు ఆస్కారం లేకుండా, బెదిరింపులు, ప్రలోభాలకు తావు లేకుండా ఉండటంతోపాటు నిరపరాధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి కేసులోనూ సరైన సాక్ష్యాధారాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. పక్కా ఆధారాలు లేనప్పుడు పోలీసులు న్యాయనిపుణుల సలహా మేరకు ‘ట్రూ బట్ ఇన్సఫీషియంట్ ఎవిడెన్స్’లేదా ‘అన్ ట్రేస్డ్’లేదా ‘నో క్లూ’కారణంగా కేసుల్ని మూసేస్తుంటారు. మరికొన్ని కారణాలతోనూ... దర్యాప్తు చేస్తున్న కేసుల్ని మరికొన్ని కారణాలతోనూ పోలీసులు మూసేస్తున్నట్లు ఎన్సీఆర్బీ (NCRB) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది నగర పోలీసు విభాగానికి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులుగా తేలుతున్నాయి. వ్యక్తిగత, ఆర్థిక కారణాలు, ఈర్షా్యద్వేషాలు, అహం కారణంగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అకారణంగా ఆరోపణలు చేస్తూ పోలీసుల వద్దకు తీసుకువస్తున్నారని స్పష్టమవుతోంది. దర్యాప్తులో అవి తప్పుడు ఫిర్యాదులని తేలడంతో ‘పాల్స్’ అనే కారణంగా కేసులు మూతపడుతున్నాయి. ‘ఆ తరహా నేరం కాని’కేసులూ మూతపడుతున్నాయి. కేసు నమోదు సందర్భంలో ఆ నేరం ఫలానా తరహాకు చెందినది భావిస్తున్నారు. చివరకు దర్యాప్తు పూర్తయ్యే సరికి దాని స్వరూప స్వభావాలు మారిపోవడంతోపాటు బాధితుల నుంచి సహకారం లేకపోవడంతో కేసు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నగదు లావాదేవీలతో ఇబ్బంది... ఏటా నమోదవుతున్న ఆర్థిక నేరాల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి అనేకం ఉంటున్నాయి. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ రూ.లక్షలు, రూ.కోట్లలో ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. పెట్టుబడులు, చిట్టీలు, భాగస్వామ్యం కోసం వెచ్చింపు, రుణాలు ఇప్పిస్తానంటూ కమీషన్లు... ఇలా అనేక చోట్ల నగదు లావాదేవీలే నడుస్తున్నాయి. చదవండి: నీ చొక్కా చాలా బాగుంది.. నాకు ఇవ్వన్నా..ఆద్యంతం ఇవన్నీ సజావుగా జరిగిపోతే అవి రికార్డుల్లోకి ఎక్కవు. ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు బాధితులుగా మారిన వాళ్లు పోలీసుల వద్దకు వస్తున్నారు. ఆన్లైన్ లేదా చెక్కుల రూపంలో జరిగిన వాటికి పక్కా ఆధారాలు ఉంటాయి. నగదు రూపంలో చేసిన లావాదేవీలను నిరూపించడం చాలా అరుదు. ఈ కారణంగానూ కొన్ని కేసులు ‘ట్రూ బట్...’ అంటూ మూసేయాల్సి వస్తోందని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం అరుదు.. ఠాణాల్లో నమోదైన కేసులు ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్’కింద మూతపడటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ అంశంలో పోలీసుల నిర్లక్ష్యం అనేది అత్యంత అరుదు. బాధితులు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేయడం ఓ ప్రధాన కారణం. దీనికితోడు అనుమానితులు, నిందితులపై వివరాలు చెప్పకపోవడం, సరైన ఆధారాలు అందించకపోవడంతో కేసులు మూతపడుతున్నాయి. సైబర్ నేరాల విషయంలో కేటుగాళ్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వనరుల లేమి కారణంగా ఆధారాలు లభించట్లేదు. – నగర పోలీసు ఉన్నతాధికారి -
‘డ్యూడ్’ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది: హీరో ప్రదీప్ రంగనాథన్
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డ్యూడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రిలేటబుల్ క్యారెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. డైరెక్టర్ ఈ కథ చెప్తున్నప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ కన్వెన్షన్ చాలా నచ్చింది. తిరుపతి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను. తిరుపతిలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది.సినిమా మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. దయచేసి పైరసీని ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను’ అన్నారు. -
బంగారం చెలగాటం.. డాలర్కు సంకటం!
ఈ భూమిపై బంగారాన్ని అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయనే రాబర్ట్ కియోసాకి. ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత అయిన ఆయన ఎప్పుడూ బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు పెడుతుంటారు. తనను అనుసరించేవాళ్లనూ పెట్టమని ప్రోత్సహిస్తుంటారు.బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూ రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో 10 గ్రాములకు రూ .1,22,780 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్కు 4,000 డాలర్లను అధిగమించింది. దీంతో ఎప్పటిలాగే రాబర్ట్ కియోసాకి వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేశారు. విలువైన లోహాలుక, డిజిటల్ ఆస్తులపై తన బుల్లిష్ వైఖరిని పునరుద్ఘాటించారు."యూఎస్ డాలర్ అంతం?"నా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం స్టాక్కు విలువ ఇంకా పెరుగుతోంది.యూఎస్ డాలర్ను నమ్ముకున్నోళ్లంతా నష్టబాధితులు.విజేతగా ఉండండి.జాగ్రత్త" అంటూ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.బంగారం, వెండి, బిన్ కాయిన్ల విలువలు పెరిగిపోతున్న తరుణంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సాంప్రదాయ పొదుపులపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు అంటూ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!END of US Dollar? Adding to my gold, silver, Bitcoin, and Ethereum stack.Savers of US dollars are losers. Be a winner. Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 8, 2025 -
‘నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలి’
సాక్షి,అమరావతి: టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. ఈ నకిలీ మద్యం దందాపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.2024 ఎన్నికల మందు తంబెళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె,ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మద్యం దందాపై ఎంపీ మిథున్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేతలే నకిలీ మద్యం కేసులో దొరికారు. రాష్ట్రంలో డంపులు డంపులుగా నకిలీ మద్యం సీజ్ అవుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని అనేక చోట్ల తయారు చేస్తున్నారు.. నా నియోజకవర్గ పరిధి లో ఉన్న తంబాళపల్లిలో చిన్న పరిశ్రమనే స్టార్ట్ చేశారు. తంబళ్ళపల్లెలో టీడీపీ తరుపున పోటీ చేసిన వ్యక్తే పట్టుబడ్డాడు. జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి టీడీపీ మనిషి. ఇంత నిస్సిగ్గుగా మీ నాయకులే పట్టుబడితే.. మా మీద ఆరోపణలు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. వాళ్ళు మా కోవర్టులు అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ముగ్గురు, నలుగురు ఇప్పుడు కేబినెట్లో ఉన్నారు. కెబినెట్ మంత్రులు కూడా మా కోవర్టులే అవుతారా? దీనిపై నిజనిజాలు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర అధికారులతో విచారణ చేస్తే దర్యాప్తు తప్పుదోవ పడుతుంది. అందుకే సీబీఐతోనే నకిలీ లిక్కర్పై విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
సీనియర్ల వేధింపుల వల్లే.. ఆత్మహత్య: ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ నోట్
గుర్గావ్: సీనియర్ అధికారుల వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న హర్యానాకు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్లో బహిర్గతమైంది. ఈ మేరకు పూరన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాశారు. నిన్న(మంగళవారం, అక్టోబర్ 7) పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడగా, తాజాగా సదరు అధికారి రాసిన సుదీర్ఘ సూసైడ్ నోట్ బయటకొచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.పూరన్ కుమార్ సన్నిహితుడైన సుశీల్ కుమార్ అనే వ్యక్తి సదరు ఆఫీసర్ పేరు మీద లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదురై రోహతక్ పోలీసులు.. సోమవారం నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలువురు పైస్థాయి అధికారులు మానసిక వేధింపుల కారణంగానే పూరన్ కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. పూరన్ కుమార్ సకుమార్ సహాయకుడు డ తన పేరు మీద రూ. 2.5 లక్షలు లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రోహ్తక్ పోలీసులు సోమవారం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు.అయితే ఈ క్రమంలోనే సుశీల్ను అరెస్ట్ చేయగా, పూరన్ కుమార్ పేరు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆపీసర్ పూరన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఇది సీనియర్ అధికారుల తనను వేధింపులకు గురి చేయడంలో భాగంగానే జరిగిందని, తన ప్రొఫెషనల్ కెరీర్ను నాశనం చేయడానికి ఇలా చేశారని సూసైడ్ నోట్ రాసిన పూరన్ కుమార్ ఆపై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు పేర్లు రాసి పెట్టాడు పూరన్ కుమార్.కాగా, హర్యానా కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్కు పయనమయ్యారు. ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఇది ఉగ్రవాదుల పనేనా? -
20 నెలల తర్వాత మళ్లీ.. వెంకీమామ మూవీపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇటీవలే ప్రకటించారు. అనిల్ రావిపూడితో కలిసి బ్లాక్బస్టర్ విక్టరీ కొట్టిన వెంకటేశ్ నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీని కుటుంబ కథాచిత్రంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో 77వ చిత్రంగా నిలవనుంది. వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. వీరిద్దరి కలిసి మరోసారి మ్యాజిక్ను సృష్టించడానికి సెట్స్పైకి వెళ్లనున్నారని రాసుకొచ్చారు. వెంకీతో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P— Naga Vamsi (@vamsi84) October 8, 2025 -
ఇన్స్టాగ్రామ్లో ‘మ్యాప్’ ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు నుంచి భారత మార్కెట్లో “మ్యాప్” ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కేఫేలు, టూరిస్టు ప్రదేశాలు, షాపింగ్ సెంటర్లు, ఈవెంట్లు మొదలైనవాటిని ప్రత్యక్షంగా మ్యాప్లో వీక్షించవచ్చు.ఈ ఫీచర్తో స్థానిక వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్లు తమ పోస్టులు లేదా స్టోరీల్లో లొకేషన్ ట్యాగ్ చేస్తే — ఆ కంటెంట్ ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ వ్యూలో కూడా ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న ఇతర యూజర్లు ఆ ప్రదేశాన్ని సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి.ఈ ఫీచర్లో యూజర్లు లొకేషన్ ట్యాగ్లను పూర్తి నియంత్రణలో ఉంచవచ్చు. లొకేషన్ను పబ్లిక్గా, ఫ్రెండ్స్కి మాత్రమే లేదా ప్రైవేట్గా ఉంచే ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్ల లోపు వయసున్న యూజర్ల ఖాతాల్లో లొకేషన్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది.భారతీయ యూజర్లలో లొకేషన్ ఆధారిత కంటెంట్ వినియోగం వేగంగా పెరుగుతోందని, అందుకే ఈ ఫీచర్ను ప్రత్యేకంగా ప్రారంభించినట్లు ఇన్స్టా వర్గాలు చెబుతున్నాయి. -
పాక్ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్ బ్యాటర్
పాకిస్తాన్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బౌలర్ల విజృంభణకెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగింది.పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్రౌండర్ అలనా కింగ్తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్తో మెరిసింది. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్లో సదాఫ్ షమాస్కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లుమరో ఎండ్లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్పై బ్యాట్తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025 -
Kashmir: ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఉగ్రవాదులు అపహరించారా?
కోకెర్నాగ్: దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కోకెర్నాగ్-గాడోల్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది అదృశ్యమయ్యారని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. పారా కమాండోస్ యూనిట్కు చెందిన ఈ సైనికులు సోమవారం (అక్టోబర్ 6) ఉగ్రవాదులను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ బృందంలో సభ్యులని తెలిపారు.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి నిఘా సమాచారం అందిన దరిమిలా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది తమ యూనిట్తో సంబంధాలు కోల్పోయారని, అప్పటి నుండి వారి జాడ కనిపించడం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో అదృశ్యమైన సైనికులను వెదికేందుకు సైన్యంతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.దోడా- కిష్త్వార్ జిల్లాల సరిహద్దుల్లోనిపిర్ పంజాల్ పర్వత శ్రేణి వెంబడి ఉన్న ప్రాంతంలో ఈ ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. ఈ ప్రాంతం దట్టమైన అడవితో కూడి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కురుస్తున్న మంచు, భారీ వర్షాలు సెర్చ్ అపరేషన్కు సవాలుగా మారాయి. తప్పిపోయిన సిబ్బందిని ఉగ్రవాదులు అపహరించారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. -
SSMB29: మహేశ్-ప్రియాంకతో ఫోక్ సాంగ్.. టైటిల్ ఇదే!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో ఓ సినిమా(SSMB 29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిమాదిరే టైటిల్ని గోప్యంగా ఉంచాడు. అంతేకాదు సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలోని వచ్చింది. అదే వారణాసి. గతంలో పలు పేర్లు అనుకున్నా.. చివరకు రాజమౌళి ఈ పేరుకే మొగ్గు చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.డివోషనల్ టచ్..ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి..మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే.. ఇదొక జంగిల్ అడ్వెంచరస్ మూవీ అని ప్రచారం జరిగింది. లీకైన షూటింగ్ క్లింప్స్ కూడా అలానే అనిపించాయి. అయితే జక్కన్న మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషినల్ టచ్ ఇచ్చాడట. ఆగస్ట్లో రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే కూడా ఇది నిజమనే తెలుస్తుంది. అందులో మహేశ్ మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ ఉంది. అది చూస్తే.. ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ‘వారణాసి’ టైటిల్ కూడా ఆ పుకారుకి మరింత బలం చేకూర్చింది.నవంబర్లో క్లారిటీ!రాజమౌళి చిత్రాల టైటిల్స్ యూనిక్గా ఉంటాయి. కథకు తగ్గట్లుగా టైటిల్స్ పెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మహేశ్ సినిమాకు వారణాసి అని పెట్టినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది. కానీ జక్కన్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా? అక్కడ వేరే టైటిల్తో రిలీజ్ చేస్తాడా? అసలు వారణాసి టైటిల్ ఫైనల్ అయిందా లేదా అనేది తెలియాలంటే.. నవంబర్ వరకు ఆగాల్సిందే. (చదవండి: ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను..రూమర్స్పై స్పందించిన రష్మిక)నవంబర్ 16న సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. అందులోనే మేజర్ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఫోక్ సాంగ్?ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణీ ఓ జానపద బాణీని రాజమౌళికి ఇచ్చాడట. అది ఆయనకు బాగా నచ్చిందట. ట్రయల్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్-ప్రియాంక చోప్రాల మధ్య ఆ సాంగ్ ఉంటుందట. ఆ ఫోక్ సాంగ్కి వీరిద్దరు వేసే ఊరమాస్ స్టెప్పులు అదిరిపోతాయట. మొత్తానికి ‘నాటు నాటు’ ని మించేలా ఆ పాటను తీర్చి దిద్దాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. -
‘అమెరికా’ ఒత్తిళ్లకు తలొగ్గామని మీరే అన్నారు కదా? ప్రధాని మోదీ ధ్వజం
నవీ ముంబై: 2008 ముంబైలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని విరమించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్పై యుద్ధాన్ని విరమించుకున్నది మీరు కాదా? అంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి బుదవారం(అక్టోబర్ 8) హాజరైన ప్రధాని మోదీ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన తేకుండానే కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. ‘ 2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు భీకర దాడికి దిగితే కాంగ్రెస్ ఏం చేసింది?. వారి బలహీనతను నిరూపించుకుంది. టెర్రరిజం ముందు మోకరిల్లింది’ ఇదే విషయాన్ని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే చెప్పారు’ అంటూ విమర్శలు గుప్పించారు, ‘26/11 అనేది దేశంపై జరిగిన అత్యంత జుగుప్సాకరమైన ఉగ్రదాడి. ఈ దాడి ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని చెప్పారు. మన దేశానికి మరొక దేశం యుద్ధం వద్దని హితబోధ చేయడంతో పాక్తో యుద్ధానికి బలగాల్ని పంపలేదంట. ఇది కదా వేరే దేశ ఒత్తిడికి లొంగడమంటే?’ అని మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో చిదంబరం మాట్లాడుతూ.. 2008లో అంతటి ఉగ్రదాడి జరిగిన దానికి కారణమైన పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు వద్దనుకున్నారో చెప్పారు. తాను హోంమంత్రిగా ఉన్న ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కారణంగానే దేశంలో అంతటి విధ్వంసాన్ని ఉగ్రవాదులు సృష్టించినా పాక్పై యుద్ధాన్ని వద్దనుకున్నామన్నారు ఓ కాంగ్రెస్ నేత. ఇది ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలను సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ ఎండగడుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించదనేది చిదంబరం వ్యాఖ్యలతో నిరూపితమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. మూడు నెలల క్రితం చిదంబరం వ్యాఖ్యలను లేవనెత్తుతూ కాంగ్రెస్ వైఖరిపై ధ్వజమెత్తారు. ఇదీ చదవండి:నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే.. -
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు... వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్మన్ గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్ను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్కోచ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్లకు ఆసీస్ జట్ల ప్రకటన -
కాంతార రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)కాంతార రికార్డ్ బ్రేక్.. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్వుడ్లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. -
తెలంగాణ టి-ఫైబర్కు జాతీయ గుర్తింపు..
తెలంగాణ టి-ఫైబర్కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్ డిజిటల్ ఇన్క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది. -
Delhi: నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె, ఎర్ర కారం.. అరిస్తే ఇంకా పోస్తానంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్గీర్లో ఉంటున్న దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్(28) కాలిన గాయాలతో సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే.. మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె తలుపులు తెరిచింది. దినేష్ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
ట్రైబల్ వర్సిటీ లోగోలో ప్రధాన ఆకర్షణలు ఇవే..
తెలంగాణలో సమ్మక్క– సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ లోగోను విడుదల చేశారు. ఇందులో పలు విశేషాలు ఉన్నాయి.లోగోలో ప్రధాన ఆకర్షణలు.. ⇒ సమ్మక్క–సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్య సమ్మక్క–సారలక్క గద్దెలు ⇒ సమ్మక్క దేవత కుంకుమకు చిహ్నంగా మధ్యలో ఎర్రటి సూర్యుడు ⇒ ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఆసీనులైన ఇద్దరు వన దేవతలు ⇒ గిరిజన ఆహార్యం, సౌందర్యానికి సూచికగా నెమలి ఈకలు ⇒ సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపనసాక్షి, న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ సమ్మక్క– సారలమ్మ యూనివర్సిటీని సందర్శిస్తానని, కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి సమక్క– సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో.. సమ్మక్క– సారలమ్మ కేంద్ర విశ్వ విద్యాలయాన్ని సాధించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.చదవండి: చొక్కా విప్పి.. చితిపై కప్పి -
మోదీ లాంటి నాయకుడుండటం మన భాగ్యం : తెగ పొగిడేసిన ఆకాశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ విప్లవాన్ని నడిపించే నాయకుడిని కలిగి ఉండటం భారతదేశ అదృష్టమంటూ కొనియాడారు.బుధవారం న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2025)కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ, భారతి గ్రూప్ సునీల్ భారతి మిట్టల్ ఇతర కార్పొరేట్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆకాష్ అంబానీ పీఎం మోదీ నాయకత్వాన్ని, దార్శనికతను ప్రశంసించారు, మోదీ లాంటి నాయకుడిని కలిగి ఉండటం ఇండియా అదృష్టమన్నారు, మోదీ విజన్ గత పాతికేళ్లుగా దేశ సాంకేతిక , ఆర్థిక ప్రయాణాన్ని నిర్దేశించిందనీ, భారతదేశ డిజిటల్ విప్లవంలో ఆయన పాత్ర కీలకమైనదని అభివర్ణించారు.#WATCH | Delhi: On PM Modi's 25 years of serving as head of a government, Chairman of Reliance Jio Infocomm Limited, Akash Ambani says, "It has been an absolutely revolutionary mode for India and we are lucky to have a leader like him." pic.twitter.com/R8i5gdwddx— ANI (@ANI) October 8, 2025అలాగే స్టార్టప్లు, విద్యావేత్తలు మరియు పరిశ్రమ నాయకుల సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా మారే దిశగా దేశం పురోగతిని ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అంబానీ అన్నారు. చిప్ తయారీ నుండి ఫ్రాడ్ మేనేజ్ మెంట్ సిస్టం, తదుపరి తరం వైర్లెస్ కనెక్టివిటీ వరకు, తాము పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించామని పేర్కొన్నారు. ఇది భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థకుగర్వకారణమైన క్షణం, దేశం ప్రపంచ డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉండ బోతోందన్నారు.ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుసెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ SP కొచ్చర్ మాట్లాడుతూ, ఐఎంసీ భారతదేశం అధునాతన కనెక్టివిటీ, డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త దశ అన్నారు. దేశీయ సాంకేతిక పురోగతి సమర్థుల చేతుల్లో ఉందనీ మెరుగైన కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ,భద్రత, ఆవిష్కరణ, సహకారంపై నిరంతర దృష్టి కారణంగా దేశం చాలా వేగంగా గ్లోబల్ డిజిటల్-ఫస్ట్ ఎకానమీగా అవతరించనుందన్నారు.చదవండి: నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే -
రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందా? కాదా? అన్న ఉత్కంఠతకు తెరపడింది. గురువారం (అక్టోబర్9) రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రేపు ఉదయం 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి తొలివిడుత నామినేషన్లుఅక్టోబర్ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు అక్టోబర్ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్ -
అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్మన్ గిల్కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా తప్పించి.. శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్ఇక రోహిత్పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్రౌండర్దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్కప్లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్ కింగ్ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
Pakistan: టీటీపీ ఉగ్రవాదులతో ఘర్షణ.. 11 మంది సైనికులు మృతి
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన నిఘా ఆధారిత ఆపరేషన్లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7-8 మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఇంకావున్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొంది. నిషేధిత టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లోని భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్ఎస్ఎస్) తాజా గణాంకాల ప్రకారం 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక ఘటనల్లో 221కు పైగా జనం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్తో పోరస్ సరిహద్దులను పంచుకునే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాయి. -
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
‘నీ చొక్కా చాలా బాగుంది.. నాకు ఇవ్వన్నా..’
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేత, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ సోమవారం గుండెపోటుతో మృతి చెందగా మంగళవారం అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు హాజరైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy).. తాను ధరించిన చొక్కాను రామకృష్ణ చితిపై ఉంచారు.రామకృష్ణ బతికున్నప్పుడు.. తాను ధరించిన చొక్కాను చూసి ‘అన్నా.. నీ చొక్కా చాలా బాగుంది. నాకు ఇవ్వన్నా..’అని అంటుండేవాడని, తాను తప్పకుండా ఇస్తా.. అని చెప్పి.. ఇవ్వడం మరచిపోయేవాడినని ఎమ్మెల్యే కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం తన చొక్కాను తీసి చితిపై ఉంచి.. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.చదవండి: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధంనల్లగొండ పట్టణంలో దారుణంనల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదివే ఓ విద్యార్థినిపై ప్రేమ పేరుతో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డిగూడెం గ్రామానికి (Annareddygudem Village) చెందిన బాలిక(17) నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే మండలం గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణతో ఆ విద్యార్థినికి ఆరు నెలలుగా పరిచయం ఉంది.'మంగళవారం ఉదయం కళాశాలకు బయల్దేరిన ఆ విద్యార్థినికి.. ప్రేమ పేరుతో కృష్ణ మాయమాటలు చెప్పి నల్లగొండలోని తన స్నేహితుడి రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం అతనే పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కృష్ణకు అతడి స్నేహితుడు సహకరించాడని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై అత్యాచారం, హత్య కేసులతోపాటు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. -
వెయ్యి కొత్త ఉద్యోగాలు.. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రకటన
గ్లోబల్ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ నగారో వచ్చే 12–18 నెలల్లో 1,000 మంది పైగా నిపుణులను నియమించుకునే యోచనలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె సహా కీలక హబ్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కంపెనీకి ప్రస్తుతం భారత్లో 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు నగారో సీఈవో మానస్ హుమాన్ వివరించారు.స్టార్టప్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ పెరగడంతో మార్కెట్లో నిపుణుల కొరత నెలకొందని, అయితే అంతర్జాతీయ అనిశ్చితులపై ఆందోళన వల్ల ఉద్యోగాలు మారే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు మానస్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య, టారిఫ్లపరమైన అనిశ్చితులు ప్రభావం చూపుతున్నాయని వివరించారు. -
ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారని కాకాణి పూజిత దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్లో నిల్చొవాలి.. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుందంటూ మండిపడ్డారు.కర్నూలు: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే కల్తీ లిక్కర్ను అరికట్టాలని.. బెల్టు షాపులు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.అనంతపురం: కల్తీ మద్యంపై మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి. పేదల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. -
'హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!
కసరత్తులు, వర్కౌట్లు చేస్తేనే స్ట్రాంగ్గా ఉంటారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే..ఎలాంటి వర్కౌట్లు, శిక్షణ ట్రైనింగ్ లేకుండా ఈ మహిళ అవలీలగా బరువులు ఎత్తి ఔరా అనిపించుకుంది. అంతేగాదు..ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలు చేసే విదేశీ మహిళ సైతం అంతలా ఆ బరువులను ఎత్తలేకపోయింది. అంతేగాదు ఆమెను చూసి పోటీ అనే పదానికి తావివ్వని శక్తిమంతులు ఈ మహిళలు అని కితాబిచ్చేసింది. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె ఉత్తరాఖండ్లోని చమోలీ అనే స్థానిక పహాడి(పర్వత) మహిళ. హిమాలయాల్లో నివశిసించే ఈ మహిళల శక్తి సామర్థ్యాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. ఆ వీడియోకి గెమ్మకోల్లెల అనే విదేశీ మహిళ 'నువ్వు బలవంతుడివని విశ్వసిస్తావు..అది తప్పని నిరూపించేంత వరకు' అనే క్యాష్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఆ విదేశీ మహిళ గెమ్మ ఉత్తరాఖండ్లోని చమోలిలో నది సమీపంలోని ఒక చిన్నగ్రామంలోని ఇద్దరు మహళలు తమ గెదెల కోసం గడ్డికోస్తున్నట్లుగా కనిపించారు. వాళ్లలో ఒక మహిళ సదరు విదేశీ మహిళను చూడటమే గాదు, ఓ సవాలు కూడా విసిరారు. కొంటెగా నవ్వుతూ ఈ గడ్డిమోపు ఎత్తగలవా అని సవాలు విసిరింది స్థానిక హిమాలయన్ ఆంటి. అక్కడంతా ముద్దుగా ఆ మహిళలను అలా పిలుచుకుంటుంటారు. అయితే ట్రెక్కింగ్కి వెళ్లే అనుభవం ఉన్న విదేశీ మహాళ గెమ్మకి అదేమంతా పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు..సుమారు 20 నుంచి 25 కిలోలు దాక బరువులు మోసే అలవాటు ఉంది ఆమెకు. దాంతో అదేమంతా పని అన్నట్లుగా సై అంది విదేశీ మహిళ. ఆ తర్వాత మొదలయ్యాయి..ఆమె కష్టాలు, పాట్లు చూస్తే నవ్వు ఆగదు. కొంచెం కూడా గడ్డిమోపుని ఎత్తలేక నానా అవస్థలు పడింది. కానీ ఈ పర్వతాల్లో నివశించే హిమాలయన్ మహిళ మాత్రం చాలా అలవోకగా ఆ భారీ గడ్డిమోపుని సులభంగా ఎత్తేయడమే కాదు ట్రక్కు వద్దకు నేరుగా తీసుకెళ్లింది కూడా. ఆమె శక్తి సామర్థ్యాలకు ఫిదా అవ్వతూ ఆ మహిళ ఎంతలా అప్రయత్నంగా ఆ గడ్డిమోపుని ఎత్తేసిందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.అస్సలు పోటీ అనేదే ఆమెకు లేదు అంటూ గడ్లల జల్లు కురిపించింది సదరు విదేశీ మహిళ. అయితే నెటిజన్లు..హిమాలయల ఇళ్లకు వెన్నముక ఈ స్త్రీలు. సగటు పర్వతపు మహిళ దినచర్య ఇదేనని అభినందన జల్లు కురిపిస్తున్నారు. పైగా ఆమె చాలా క్యాజువల్గా పహాడి కండరాలను వంచు తోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Gemma Colell (@indra.creativa) View this post on Instagram A post shared by Gemma Colell (@indra.creativa) (చదవండి: Success Story: ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..) -
నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ నూతన ఎయిర్పోర్టును పరిశీలించారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) కింద ఈ భారీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ విమానాశ్రయం ఈ ఏడాది డిసెంబర్లో దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎంఐఏ) మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ఇదే. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)కు అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. సీఎస్ఎంఐఏలో ఏర్పడే రద్దీని తగ్గిస్తుంది.ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల్లో ముంబైకి ప్రత్యేక స్థానం దక్కింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ విమానయాన సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఏడాదికి తొమ్మిది కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాల ప్రారంభ దశలో ఏడాదికి రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించనుంది.నవీ ముంబైలోని కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతపు సామర్థ్య పరిమితులను అధిగమిస్తుందని, కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ)పేర్కొంది. కాగా విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) గత సెప్టెంబర్ 30న విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ను మంజూరు చేసింది. టెర్మినల్లో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 ప్రయాణీకుల బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి.ఈ విమానాశ్రయ కార్యకలాపాలు సాంకేతికంగా అధునాతనంగా ఉంటాయి. 5జీ నెట్వర్క్లు, పర్యవేక్షణ కోసం అధునాతన సెన్సార్లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్లు, మెరుగైన సౌలభ్యం కోసం డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్లెస్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్గో సౌకర్యం పూర్తి ఆటోమేషన్తో పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్మెంట్ ట్రాకింగ్, డిజిటల్ లావాదేవీలు, మందులు , పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక నియంత్రిత విభాగాలు అందుబాటులో ఉంటాయి. -
ICC: దుమ్మురేపిన సిరాజ్.. కెరీర్ బెస్ట్!.. దిగజారిన జైసూ ర్యాంకు
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) టెస్టు ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్ కనబరుస్తున్న ఈ హైదరాబాదీ బౌలర్లో కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ క్రమంలో మూడు స్థానాలు ఎగబాకి పన్నెండో ర్యాంకుకు చేరుకున్నాడు.అగ్రస్థానం బుమ్రాదేఅంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్ ((ICC) Latest Test Rankings)ను బుధవారం ప్రకటించింది. బౌలర్ల విభాగంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కగిసో రబడ, మ్యాట్ హెన్రీ, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ టాప్-5లో కొనసాగుతున్నారు.సిరాజ్ కెరీర్లో అత్యుత్తమంగా ఆ తర్వాతి స్థానాల్లో నొమన్ అలీ, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మార్కో యాన్సెన్, మిచెల్ స్టార్క్, గస్ అట్కిన్సన్ కొనసాగుతుండగా.. జేడన్ సీల్స్, ప్రభాత్ జయసూర్య, షమాన్ జోసెఫ్లను వెనక్కి నెట్టి సిరాజ్ పన్నెండో స్థానానికి దూసుకువచ్చాడు. కెరీర్లో అత్యుత్తమంగా 718 రేటింగ్ పాయింట్లు సాధించాడు.ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీసిన సిరాజ్.. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో తొలి టెస్టులోనూ ఫామ్ కొనసాగించాడు. అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఏడు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలోనే కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు.రూట్.. రైట్ రైట్మరోవైపు.. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ టాప్ ర్యాంకులో కొనసాగుతుండగా.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి టాప్-5లో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఐదో స్థానంలోకి రాగా.. శ్రీలంక స్టార్ కమిందు మెండిస్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.దిగజారిన జైసూ ర్యాంకుఇక జైస్వాల్ ఐదో ర్యాంకు నుంచి ఏడుకు పడిపోయాడు. అయితే, టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్ మాత్రం తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గాయం కారణంగా రిషభ్ ఇంగ్లండ్తో ఐదో టెస్టు, విండీస్తో తొలి టెస్టుకు దూరమైనా తన ర్యాంకును నిలబెట్టుకోగా.. వెస్టిండీస్తో మొదటి టెస్టులో విఫలమైన జైసూ (36) ఈ మేరకు చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.టాప్లోనే జడ్డూఅదే విధంగా.. టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు స్థానాలు ఎగబాకి పదకొండో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా విండీస్ తొలి టెస్టులో అజేయ శతకం (104) బాదిన జడ్డూ.. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన -
‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి,విశాఖ: విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్లో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. అంనతరం,ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు స్క్రినింగ్ టెస్టులు చేయించారనేది అబద్ధం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో శాటినేషన్ లోపమే కారణం.ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించడం లేదు. అసలు ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో చెప్పాలి. ఇవాళ మరో ఆరుగురు విద్యార్థులు కేజీహెచ్ వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు’అని ’ధ్వజమెత్తారు. -
‘గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?’
కేజీహెచ్(విశాఖ): పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టింకోరా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు. ఇందులో ఇద్దురు విద్యార్థినులు చనిపోయినా చంద్రబాబు గానీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 8వ తేదీ) విద్యార్థులను పరామర్శించడానికి విశాఖ కేజీహెచ్కు వెళ్లిన సీదిరి అప్పలరాజు.. మీడియాతో మాట్లాడారు. ‘ గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?,గిరిజన విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా?, పవన్కు జలుబు చేస్తే సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. గిరిజన విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే. గతంలె నాడు-నేడు ద్వారా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం’ అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. ప్రాథమిక చికిత్స కోసం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 15 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి నుంచి రికవరీ అయిన కొంతమందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలో మంచి నీటి వసతులు, మరుగుదొడ్లు, మరియు పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
హోస్ట్ ముందు కాలి మీద కాలేసుకుని కూర్చోవడమేంటి?.. పుష్ప సినిమా చూడలేదా అన్న హరీశ్!
తెలుగు బిగ్బాస్ సీజన్ నాలుగో వారం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిముఖం పట్టారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో కామనర్ హౌస్లో అడుగుపెట్టింది. అయితే హౌస్లో ఫుల్ అగ్రెసివ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్ హరీశ్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్-5 కంటెస్టెంట్స్లో ఒకరిగా ఉంటారనుకున్నా మాస్క్ మ్యాన్ను ఆడియన్స్ బయటకు పంపించేశారు.ఈ సందర్భంగా బిగ్బాస్ నుంచి బయటకొచ్చిన మాస్క్ మ్యాన్ హరీశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాస్క్ మ్యాన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. హోస్ట్ నాగార్జున ముందు కాలిమీద కాలు వేసుకుని ఎందుకు కూర్చున్నారు? సెలబ్రిటీలే మామూలుగా కూర్చుంటే.. కామనర్ అయిన మీరెందుకు అలా కూర్చోవాల్సి వచ్చిందని హరీశ్ను ప్రశ్నించారు.దీనికి బిగ్బాస్ కంటెస్టెంట్ హరీశ్ సమాధానం ఇచ్చారు. పుష్ప సినిమా డైలాగ్ను గుర్తు చేశారు. ఇది నా కాలే.. ఇది నా కాలే.. అంటూ అల్లు అర్జున్ చేసిన సీన్ ఎగ్జాంపుల్గా చూపించారు. కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అగౌరవించడం అనే విషయం నాకు ఇప్పటికీ తెలియదన్నారు. అలా చేయడం తప్పేమీ కాదు.. మన కాలు అవతలి వాళ్ల మీద వేస్తే తప్పు అని వివరించారు. అవతలి వ్యక్తిని గౌరవించడం అనేది మన మాటల్లో కనపడుతుంది.. అంతే కానీ మన కంఫర్ట్ జోన్లో కూర్చుంటే డిస్ రెస్పెక్ట్ చేయడం కాదన్నారు. నాగార్జున అంటే నాకు చాలా గౌరవముందని మాస్క్ మ్యాన్ హరీశ్ వెల్లడించారు. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అస్థిర సెషన్ తరువాత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు ప్రారంభ లాభాలు కరెక్షన్కు గురై నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,773.66 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 25,046.15 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.73 శాతం, 0.52 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో, నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియాల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1 శాతం వరకు పడిపోయాయి.సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 21 షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా టాప్ లూజర్స్ గా నిలిచాయి. టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. -
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
Coldrif syrup: ఆ విషయంపై క్లారిటీ ఇవ్వండి: డబ్ల్యూహెచ్వో
మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా..? అంటూ భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టత కోరింది. భారత అధికారుల నుంచి వివరణ అనంతరం ఆ దగ్గు మందుపై అలర్ట్ జారీ చేసే అవసరముందా? అనే దానిపై పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తాజాగా, మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దీంతో, దగ్గు సిరప్ సంబంధిత మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తమియా బ్లాక్లోని భరియాధానా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ధని దెహారియా, జున్నార్దియోకు చెందిన రెండేళ్ల జయుషా యదువంశీ సోమ, మంగళవారాల్లో చనిపోయినట్లు అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ చెప్పారు. దగ్గు మందు తాగిన తర్వాత వీరిద్దరూ కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకే చెందిన మరో ఆరుగురు చిన్నారులు నాగ్పూర్లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ను నిషేధించాయి. తమిళనాడు ల్యాబ్ నివేదికల ప్రకారం ‘కోల్డ్రిఫ్’లో 48.6 శాతం డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. -
ఉద్యోగం వదిలేశా..‘అరి’ కోసం హిమాలయాలకు వెళ్లా : డైరెక్టర్ జయశంకర్
‘నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ‘అరి’ చిత్రాన్ని రూపొందించాను’ అన్నారు దర్శకుడు జయ శంకర్. ‘పేపర్ బాయ్’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘అరి’. . వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను.→ ‘అరి’ లాంటి మూవీని స్టార్స్ కూడా చేయొచ్చు. అయితే పాత్రల కంటే వారి స్టార్ డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని పాత్రలకు సరిపోయేలా సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష ..ఇలాంటి వారిని తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.→ నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు.→ మా ‘అరి’ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.→ అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ‘అరి’ సినిమాను రూపొందించాను. ఈ కారణం వల్లే చిత్రీకరణ ఆలస్యమైంది. వీలైనంత సింపుల్ గా ఈ సబ్జెక్ట్ ను తెరకెక్కించాం. సెన్సార్ వాళ్లు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచింగ్ గా మూవీ రూపొందించారని ప్రశంసించారు. మా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.→ వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. పురణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం.→ ఈ మూవీ యూత్ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. ఈ మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా.→ మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.→ త్వరలోనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం. -
TCS: వాళ్లందరికీ కనీసం ఆర్నెళ్ల జీతం..
దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) ఇటీవల భారీ లేఆఫ్ ప్రణాళికను (TCS Layoff)ప్రకటించింది. సుమారు 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులతో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వివిధ స్థాయిల సెవెరెన్స్ ప్యాకేజీని అమలు చేస్తోంది. ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీలో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో కలకలం రేపింది.సంస్థలో ఎవరి నైపుణ్యాలైతే పనికిరావో లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందడానికి అవకాశం లేదో అలాంటి వారిని టీసీఎస్ తొలగిస్తోంది. వీరందరికీ మూడు నెలల నోటీసు వ్యవధి చెల్లింపుతో పాటు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇది సంస్థలో వారి సర్వీస్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే అందరికీ కనీసం ఆరు నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.ప్రభావిత ఉద్యోగులు మరో ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయపడటానికి, టీసీఎస్ మూడు నెలల వరకు అవుట్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ఫీజులను అందిస్తోంది. అదే జూనియర్ అసోసియేట్లకు అయితే ఇంకొన్ని నెలలు ఈ సహాయాన్ని అందించనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇక అలాగే ఉద్యోగులకు అందించే మానసిక ఆరోగ్య సాయం టీసీఎస్ కేర్స్ను కూడా కొన్నాళ్ల పాటు వారికి కొనసాగించనుంది.బెంచ్లో ఉన్నవారికి మూణ్నెళ్ల జీతమే..బెంచ్లో ఉండి లేదా ఎనిమిది నెలలకు పైగా వర్క్ కేటాయించని ఉద్యోగులు తొలగింపునకు గురైతే వారు ప్రామాణిక మూడు నెలల నోటీసు వ్యవధి వేతనాన్ని మాత్రమే పొందుతారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి, పదవీ విరమణ ప్రయోజనాలు, బీమాకు పూర్తి ప్రాప్యతతో ముందస్తు రిటైర్మెంట్ ఎంపికను టీసీఎస్ అందించింది. అలాంటి వారు మిగిలిఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందుకుంటారు.ఇదీ చదవండి: దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్! -
Bihar Election: బెదిరింపులకు దిగిన మాజీ సీఎం.. 15 సీట్ల కోసం మంకుపట్టు
పట్నా: బీహార్ ఎన్నికలకు ముందుగానే ఎన్డీఏలో అసంతృప్తి మొదలయ్యింది. మిత్రపక్షం హిందూస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) నేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తమ పార్టీకి కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే, అసలు ఎన్నికల్లో పోటీ చేయబోమని బెదిరింపులకు దిగారు. అయితే తాము ఎన్డీఏ శిబిరంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ అంశంలో జోక్యం చేసుకుని మాంఝీని, శాంతింపజేసే ప్రయత్నం చేశారని సమాచారం.‘ప్రాధాన్యత కలిగిన పార్టీగా గుర్తింపు పొందేందుకు మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు అవసరం. ప్రతిపాదిత సంఖ్యలో సీట్లు మాకు లభించకపోతే, మేము ఎన్నికల్లో పోటీ చేయబోము. అయితే మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాం. కానీ ఎన్నికల్లో పోటీకి దిగం. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను’ అని జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు.ఇంకా తేలని సీట్ల భాగస్వామ్య సూత్రంనవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు ఇంకా తమ సీట్ల భాగస్వామ్య సూత్రాన్ని ప్రకటించలేదు. అయితే మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం జేడీయూ, బీజేపీలు దాదాపు 100 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్కు చెందిన ఎల్జేపీ(రామ్ విలాస్) 24, మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి ఆరు సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. కాగా ఈ తరహా సీట్ల కేటాయింపుపై మాంఝీతో పాటు, చిరాగ్ పాశ్వాన్ కూడా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వారిద్దరూ కనీసం 40 సీట్ల కోసం ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే..దేశంలోని అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలుఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్లలో 100 శాతం వెబ్కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.ప్రతి రెండు గంటలకు కౌంటింగ్ అప్డేట్పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్ను అప్డేట్ చేస్తారు. -
ద్రవిడ్ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం: రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వల్లే తమకు వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత వన్డే జట్టు కెప్టెన్గా ఉద్వాసనకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు.ముంబైలో జరిగిన CEAT క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సం కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఏడాది సారథిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకుగానూ ప్రత్యేక పురస్కారం అందుకున్నాడు.ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదుఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టంటే నాకెంతో ఇష్టం. వారితో కలిసి ఆడటం, వారితో కలిసి ప్రయాణించడం గొప్ప విషయం. ఇదేదో ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు. చాలా ఏళ్లుగా శ్రమిస్తున్న మాకు దక్కిన ప్రతిఫలం.చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి.. ట్రోఫీని చేజార్చుకున్నాం. అయితే, ఈసారి మాత్రం తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం. ఒకరో.. ఇద్దరో ఆటగాళ్ల వల్ల ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు గొప్పగా రాణిస్తేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టగలం.నాకు, రాహుల్ భాయ్కు..చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుపులో భాగమైన ఆటగాళ్లంతా.. టైటిల్కు అర్హులు. మేమంతా ఎన్నో ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నాం. కేవలం ఆట మీదే దృష్టి పెట్టాము. జట్టు నుంచి నాకు, రాహుల్ భాయ్కు అందిన సహకారం గొప్పది.టీ20 ప్రపంచకప్-2024లో మేము సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. వాటినే చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ కొనసాగించాము. అయితే, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మాత్రం ఓడిపోయాము. ఆ తర్వాత మాలో పట్టుదల మరింత పెరిగింది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.గంభీర్కు రోహిత్ కౌంటర్కాగా ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ కెప్టెన్సీలో 2024లో పొట్టి ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయగా.. గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ మార్గదర్శనం చేసినా.. దాని వెనుక ద్రవిడ్ ఏళ్ల శ్రమ ఉందని రోహిత్ పరోక్షంగా చెప్పడం గమనార్హం.ఇక వన్డే కెప్టెన్గా కొనసాగాలనుకున్న రోహిత్ శర్మను తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథి చేయడం వెనుక గంభీర్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో రోహిత్ ఇలా తాను రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని చెప్పడం గమనార్హం. పరోక్షంగా గంభీర్కు హిట్మ్యాన్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన రోహిత్.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ ఇప్పటికే టీమిండియా టెస్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు నాయకుడిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
'సలార్'లో సీన్కి ముందు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని
ప్రభాస్ 'సలార్' సినిమా.. థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో రాధారమ అనే పాత్రలో అదరగొట్టిన శ్రియారెడ్డి.. ఈ ఒక్క చిత్రంతో చాలా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'ఓజీ'లోనూ ఈమెకు అద్భుతమైన రోల్ పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియారెడ్డి.. 'సలార్'లో ఎందరో మగాళ్లు ఉన్నప్పటికీ తాను హైలైట్ కావడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'సలార్ గురించి గుర్తుచేసుకుంటే.. నా ప్రతి సీన్కి ముందు దాదాపు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని. కాస్ట్యూమ్ వేసుకున్నా, కారవ్యాన్లో ఉన్నా ఇది తప్పనిసరి. నా వరకు అయితే బస్కీలు తీయడం అనేది చాలా సులభమైన వర్కౌట్. షూటింగ్ జరుగుతున్న టైంలోనూ దీని గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ముందే చెప్పాను. దీంతో నా సీన్ తీయడానికి ఇంకాసేపు ఉందనగా చెప్పేవారు. నేను పుష్ అప్స్ వర్కౌట్ పూర్తి చేసుకుని వెళ్లేదాన్ని. దీంతో అందరి మధ్య నేను శక్తిమంతురాలిలా కనిపించేదాన్ని. ఖాన్సార్లోని మగాళ్ల కంటే నాకు నేనే అజేయంగా అనిపించేదాన్ని' అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన)ఈమె చెప్పిన కామెంట్స్ చూస్తుంటే నిజమేననిపిస్తుంది. ఎందుకంటే 'సలార్'లో ప్రభాస్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇలా దాదాపు అందరూ మేల్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్లతో సరిసమానంగా శ్రియారెడ్డి ఎలివేట్ అయిందంటే.. పుష్ అప్స్ వర్కౌట్ చేయడం ఈమెకు చాలా సహాయపడినట్లు కనిపిస్తుంది.శ్రియారెడ్డి వ్యక్తిగత విషయానికొస్తే.. విశాల్ 'పొగరు' మూవీలో విలన్గా నటించి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. హీరో విశాల్ అన్న విక్రమ్ని పెళ్లి చేసుకుంది. తర్వాత చాన్నాళ్ల పాటు నటనకు దూరమైపోయింది. రీసెంట్ టైంలో సలార్, ఓజీ సినిమాలతో మళ్లీ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. గతంలోనే ఈమె తెలుగు చిత్రాల్లో నటించింది. 2003లో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది గానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రియాకు అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు తెలుగు చిత్రాలతోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
Nobel Prize: రసాయన శాస్త్రంలో ముగ్గురికి పురస్కారం
రసాయనశాస్త్రంలో ప్రముఖ శాస్త్రవేత్తలు సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘిలు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2025 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన సుసుము కిటగావా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికాలోని బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒమర్ ఎం. యాఘిలు సంయుక్తంగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్(ఎంఓఎఫ్) సృష్టించడంలో చేసిన కృషికి నోబెల్కు ఎంపికయ్యారు.రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ముగ్గురిని "లోహ-సేంద్రీయ చట్రాల((మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్) అభివృద్ధి" కోసం సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి లోహ అయాన్లను సేంద్రీయ అణువులతో అనుసంధానించడం ద్వారా తయారైన స్ఫటికాకార పదార్థాలు. ఇవి అధిక పోరస్ నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ నానోస్కోపిక్ చట్రాలు వాయువులు, అణువులను బంధించగలవు. నిల్వ చేయగలవు. మార్చగలవు. ఇవి ప్రపంచ స్థిరత్వ సవాళ్లను ఎదుర్కోవడంలో అపారమైన సామర్థ్యాన్ని అందిస్తాయి.ఎంఓఎఫ్లు కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లేదా నీటి ఆవిరి వంటి వాయువులను వాటి చిన్న కుహరాల ద్వారా లోపలికి, బయటకు ప్రవహించేలా చేస్తాయి. ఈ ప్రత్యేక లక్షణం గ్రీన్హౌస్ వాయువులను సంగ్రహించడం, నీటిని శుద్ధి చేయడం, హైడ్రోజన్ ఇంధనాన్ని నిల్వ చేయడం వరకు అద్భుతమైన విధులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ పదార్థాలను ప్రయోజన-నిర్మిత గదులతో కూడిన పరమాణు నిర్మాణం’గా అభివర్ణిస్తారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2025 #NobelPrize in Chemistry to Susumu Kitagawa, Richard Robson and Omar M. Yaghi “for the development of metal–organic frameworks.” pic.twitter.com/IRrV57ObD6— The Nobel Prize (@NobelPrize) October 8, 2025MOFs అంటే ఏమిటి?Metal–Organic Frameworks అనేవి లోహ అయాన్లు, ఆర్గానిక్ లింకర్లు కలిపి ఏర్పడే అణు నిర్మాణాలు. ఇవి పొడవైన గుహలు కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలో నీటి ఆవిరి నుండి నీరు సేకరించడం, కార్బన్ డయాక్సైడ్ శోషణ, హైడ్రోజన్ నిల్వ, విషపూరిత వాయువుల నిర్వహణ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి.సామాజిక ప్రభావంఈ నిర్మాణాలు పర్యావరణ పరిరక్షణ, శుద్ధ నీటి సేకరణ, ఫలాల పరిపక్వత నియంత్రణ, ఔషధాల సరఫరా వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీశాయి. MOFs ద్వారా PFAS వంటి హానికర రసాయనాలను నీటిలో నుండి వేరు చేయడం సాధ్యమైంది. -
'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్బాస్ సంజనా గల్రానీ ఆవేదన!
ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ సీజన్-9 నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో ఏకంగా బిగ్బాస్ తెలుగు సీజన్-9కి తొలి కెప్టెన్గా నిలిచింది. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా రాణిస్తోంది. ఈ సందర్భంగా సంజనా గల్రానీకి సంబంధించిన ఓ వీడియోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తన జర్నీతో పాటు డ్రగ్స్ కేసు గురించి కూడా సంజనా మాట్లాడింది. తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఎమోషనలైంది.ఈ వీడియోలో సంజనా మాట్లాడుతూ.. 'హాయ్ నా పేరు అర్చన.. నేను మీ బుజ్జిగాడు సంజనా అంటూ పరిచయం చేసుకుంది. ఏడో తరగతిలోనే ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరి జగన్నాధ్ నాకు బుజ్జిగాడులో అవకాశం ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నా. ఒకరోజు సడన్గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? ఆ రోజు డిసైడ్ అయిపోయా. ఆ రోజు గురించి తలుచుకుంటేనే చాలా బాధేస్తోంది. ఒక్కొక్కరు వారికి నచ్చినట్లు రాసుకున్నారుని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ క్లీన్ చీట్ ఎవరికీ కనిపించలేదు. చూసేవారికి బిగ్బాస్ కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కావొచ్చు. కానీ నా లైఫ్లో ఈ బిగ్బాస్ షో నాకు పెద్ద ఛాన్స్. మీ మనసుల్లో నాకు గురించి ఎంత తప్పుగా అనుకున్నారో.. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. ఈ షో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. కానీ మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్బాస్కు వచ్చాను" అంటూ ఫుల్ ఎమోషనలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. 1989లో అక్టోబర్ 10న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. టాలీవుడ్ చిత్రపరిశ్రమతోనే తొలి ఛాన్స్ అందుకున్నారు. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో ఒరు కధల్ సేవిర్లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.కాగా.. శాండిల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజనా గల్రానీ పేరు తైరపైకి వచ్చింది. విచారణకు పిలిచిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆమెను జైల్లోనే ఉంచారు.Cleared the blame, now she’s in the game, #SanjanaGalrani is here to claim the fame ❤️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/ZjX4leeZAN— Starmaa (@StarMaa) October 7, 2025 -
పోలీసు కావాలనుకున్నాడు, భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.రాజ్వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్పై విహార యాత్రకు వెళ్లిన రాజ్వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్వీర్ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది. (జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్)రాజ్వీర్ జవాండా భార్య హెచ్చరికరాజ్వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్వీర్ పట్టించు కోలేదని రాజ్వీర్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు -
ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..
అత్యంత ప్రతిష్టాత్మకమైన కఠినమైన ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్. అలాంటి సివిల్స్ ఎగ్జామ్స్లో సత్తా చాటి ఐఏఎస్ కావాలనేది ఎందరో యువత కల. అందరు ఒక్కోలా తపించి కలను సాకారం చేసుకుంటుంటారు. కానీ ఈమె అత్యంత విభిన్న పద్ధతిలో తన డ్రీమ్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సాధించాలనుకునేవాడికి సవాలక్ష మార్గాలు తన కళ్లమందు ఉంటాయనేందుకు ఉదాహరణగా నిలిచింది.ఆ అమ్మాయే అంకిత కాంతి(Ankita Kanti,). ఉత్తరాఖండ్(Uttarakhand)లోని చమోలి జిల్లాలోని చిర్ఖున్ అనే చిన్న గ్రామానికి చెందిన అంకిత కాంతి కుటుంబం మధ్యతరగతి నేపథ్యానికి చెందిన అతి సామాన్య కుటుంబం. ఆమె తండ్రి దేవేశ్వర్ కాంతి బ్యాంకులకు నగదు తీసుకెళ్లే పనిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఉషా కాంతి గృహిణి. బాల్యం నుంచి అంకిత కాంతి చదువులో మంచి ప్రతిభను చాటుకుంది. ఆమె తుంటోవాలాలోని డూన్ మోడరన్ స్కూల్, కర్బరిలోని సంజయ్ పబ్లిక్ స్కూల్లలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. పదోతరగతి పరీక్షలో 92.40% మార్కులు సాధించింది. తర్వాత 2018లో 12వ తరగతి పరీక్షలలో 96.4% మార్కులు సాధించి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికే నాల్గవ టాపర్గా నిలిచింది. ఇక డీబీఎస్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, ఎంఎస్సీ పూర్తి చేసింది. అయితే అప్పటి నుంచే ఆమె యూపీఎస్సీ సివిల్స్(UPSC Civil Services Examination (CSE))కి సన్నద్ధమైంది. కానీ సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థుల్లా కాకుండా..స్వీయంగా సన్నద్ధమైంది. అయితే ఆమె హిందీ మాధ్యమంలో ఈ సివిల్స్ 2024 ఎగ్జామ్ని రాసి ఆల్ ఇండియా ర్యాంకు 137 సాధించి, ఐఏఎస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకుందామె. దీంతో అంకిత తొలిసారగా హిందీ మాధ్యమంలో పరీక్ష రాసి.. టాపర్గా నిలిచిన అమ్మాయిగా వార్తల్లో నిలిచింది. ఆమె చెల్లెలు కూడా బ్యాంకు ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం ఆమె కూడా తన అక్క అంకిత అడుగుజాడల్లో వెళ్తోంది. అంజలి కూడా ప్రస్తుతం యూపీఎస్సీకి ప్రిపేరవ్వుతోంది. ఎక్కడ నియమించారంటే..ప్రస్తుతం ఆమె ట్రైనింగ్లో ఉంది. అధికారికంగా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదామెకు.(చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!) -
జాబ్లో చేరిన 4 నెలల్లోనే రూ.1లక్ష వేతనం పెంపు
వేతనాల పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేవలం నాలుగు నెలల్లోనే భారీ వేతన పెంపును అందుకున్నాడు. కంపెనీలో చేరినప్పుడు తన సీటీసీ(CTC)లో 100% పెరిగిన కొద్ది నెలలకే మరోసారి వేతన పెంపు అందుకున్నాడు. ఈమేరకు రెడ్డిట్లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్గా మారింది.పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను ప్రముఖ కంపెనీలో ఇటీవలే చేరాను. నాకు 7.2 ఏళ్ల పని అనుభవం ఉంది. అంతకుముందు పని చేసిన కంపెనీతో పోలిస్తే కొత్త సంస్థ 100 శాతం సీటీసీను పెంచింది. నేను ఇంటర్వ్యూలో అడిగిన దానికంటే ఎక్కువగానే వేతనం ఇచ్చారు. దాంతో నాకు ఏటా రూ.31 లక్షలు ఆఫర్ చేశారు. కొత్త సంస్థలో చేరి నాలుగు నెలలైంది. ఇటీవల అప్రైజల్స్ వచ్చాయి. అందులో ఆశ్చర్యంగా నాకు మరో లక్ష పెంచారు. దాంతో నా వార్షిక వేతనం రూ.32 లక్షలైంది’ అని రాసుకొచ్చారు.ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది అసాధారణమైనది కాదు. మంచి స్టార్టప్ కంపెనీలు నైపుణ్యాలున్న వారి కోసం ఇలా చేస్తాయి’ అని ఒకరు తెలిపారు. మరోవ్యక్తి స్పందిస్తూ..‘కేవలం 5 నెలల్లోనే నేను 16% పెంపు పొందాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏంటి?.. మంచు విష్ణు ఆగ్రహం
సాక్షి,తిరుపతి: మోహన్బాబు వర్సిటీపై వస్తున్న వార్తలను హీరో, మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం (అక్టోబర్8న) ఓ నోట్ను విడుదల చేశారు.అందులో.. యూనిర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉండగా.. వాటిని ధిక్కరించి ఉన్నత విద్యామండలి పోర్టల్లో పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి సిఫార్సులు సరికాదు. మా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు సోషల్ దుష్ప్రచారం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. -
నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..
తన మాజీ భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ను ఉద్దేశించి టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన పేరు వాడుకోనిదే ఒకరికి పూట గడవదని అనిపిస్తే.. వారు అలా చేయడాన్ని తాను తప్పుపట్టనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ప్రేమ పాఠాలు..అసలు విషయం ఏమిటంటే.. యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకునే క్రమంలో చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వీరిద్దరు 2020లో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఎక్కడైనా జంటగా వెళ్తూ అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. 2025లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు.ఈ సందర్భంగా తాము 2022 నుంచే విడిగా ఉంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడం గమనార్హం. అయితే, విడాకుల తర్వాత పరస్పర ఆరోపణలతో ఇద్దరూ రచ్చకెక్కారు. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ముందే.. బాలీవుడ్ నటి, ఆర్జే మహ్వశ్తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.అతడే వదిలిపెట్టాడుఅంతేకాదు.. ధనశ్రీ రూ. 4 కోట్ల భరణం తీసుకున్న నేపథ్యంలో.. ‘‘ఎవరి తిండి వారే సంపాదించుకోవాలి’’ అనే కోట్ ఉన్న షర్ట్ వేసుకుని కోర్టుకు వచ్చాడు చహల్. ఈ పరిణామాల నేపథ్యంలో ధనశ్రీ స్పందిస్తూ.. తాను విడాకులు తీసుకోవాలని అనుకోలేదని.. అతడే తనను వదిలిపెట్టాడంటూ చహల్పై ఆరోపణలు చేసింది. ఏదేమైనా చహల్ సంతోషంగా ఉంటే చాలని పేర్కొంది.పెళ్లైన రెండు నెలల్లోనేతాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీ.. తోటి కంటెస్టెంట్తో మాట్లాడుతూ.. పెళ్లైన రెండు నెలల్లోనే చహల్ తనను మోసం చేశాడని.. అయినా తాను సర్దుకుపోయినట్లు తెలిపింది. ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా.. చహల్ తాజాగా హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ధనశ్రీ వ్యాఖ్యలను ఖండించాడు.‘‘ఒకవేళ ఏదైనా బంధంలో ఓ వ్యక్తి రెండు నెలల్లోనే మోసగాడని తెలిస్తే.. అయినా అతడితో కలిసి ఎవరైనా జీవిస్తారా?.. నా దృష్టిలో ఇది ముగిసిన అధ్యాయం. అయిందేదో అయిపోయింది. నేను జీవితంలో ముందుకు సాగుతున్నాను.నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..కానీ కొందరు అదే పట్టుకుని వేలాడుతున్నారు. అయినా, మేమే నాలుగున్నరేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్నాము. కలిసి కాపురం చేశాం. ఒకవేళ నేను నిజంగా మోసగాడినే అయితే.. ఆ వ్యక్తి అంతకాలం నాతో ఎలా కలిసి ఉంటారు?.. నా పేరు చెప్పుకోనిదే ఒకరికి పూట గడవదు అంటే అలాగే చేసుకోనివ్వండి.వారి మాటలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ విషయంపై నేను స్పందించడం ఇదే ఆఖరిసారి. ముగిసిన అధ్యాయం గురించి మరోసారి మాట్లాడను. నేను ఒక క్రీడాకారుడిని. మోసగాడిని కాదు’’ అని చహల్.. ధనశ్రీకి ఘాటు కౌంటర్ ఇచ్చాడు.టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ చివరగా.. 2023లో టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్లో 174 మ్యాచ్లలో కలిపి 221 వికెట్లు తీసిన చహల్... అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.చదవండి: తిట్టకు అమ్మా!.. ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్చేస్తే.. -
జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్
ప్రఖ్యాత అసోం గాయకుడు జుబీన్ గార్గ్ అకాలమరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత స్కూబా డైవింగ్ ప్రమదంలో చనిపోయాడని భావించిన ఈ కేసులో ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. విషప్రయోగం కారణంగా చనిపోయాడని మరోవార్త వెలుగులోకి వచ్చింది. దీంతో జుబీన్గార్గ్కు సంబంధించిన వారిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జుబీన్ మరణానికి ఆయన సమీప బంధువు, పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన మరో నలుగురు ఇప్పటికేఈ పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెలలో సింగపూర్లో జుబీన్మరణానికి సంబంధించి జుబీన్ గార్గ్ బంధువు , అస్సాం పోలీసు DSP సందీపన్ గార్గ్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇది ఐదో అరెస్టు.VIDEO | Guwahati: Zubeen Garg's cousin and Assam Police DSP Sandipan Garg arrested in connection with singer's death.#ZubeenGarg #AssamNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/BdAfazODSz— Press Trust of India (@PTI_News) October 8, 2025గత నెలలో సింగపూర్లో గాయకుడి మరణంపై పట్టుబడిన పోలీసు అధికారిని గత కొన్ని రోజులుగా అనేకసార్లు విచారించారు. ఈ సంఘటనలో డిప్యూటీ ఎస్పీ, సందీపన్ గార్గ్ అతనితో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సందీపన్ రిమాండ్ కోరుతామని మరొక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి ,అమృత్ ప్రభా మహంతాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడ వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)'వార్ 2' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి(అక్టోబరు 09) నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారంనుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025 -
ముషీర్ ఖాన్తో గొడవ తర్వాత గర్ల్ ఫ్రెండ్తో చిల్ అయిన పృథ్వీ షా
వివాదాలు, క్రమశిక్షణ లేమి కారణంగా బ్రహాండమైన కెరీర్ను నాశనం చేసుకున్న మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. నిన్న (అక్టోబర్ 7) ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ (181) చేసిన అనంతరం షా తన మాజీ సహచరుడు ముషీర్ ఖాన్తో (Musheer Khan) గొడవ పడ్డాడు.వాస్తవానికి ముషీర్ ఖానే మొదట షాను గెలికాడు. షాను ఔట్ చేసిన ఆనందంలో ముషీర్ వ్యంగ్యంగా థ్యాంక్యూ అని అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన షా.. ఒక్కసారిగా ముషీర్పైకి దూసుకొచ్చి, కాలర్ పట్టుకొని బ్యాట్ ఎత్తాడు. అంపైర్లు, సహచరులు వారించడంతో షా తగ్గి పెవిలియన్ వైపు వెళ్లబోయాడు.పోయే క్రమంలో మరో ముంబై ఆటగాడు షమ్స్ ములానీ కూడా షాను ఏదో అన్నాడు. దీనికి కూడా షా ఘాటుగానే స్పందించాడు. ఈ గొడవల కారణంగా షా చేసిన సూపర్ సెంచరీ మరుగున పడింది. మిస్ బిహేవియర్ కారణంగా అందరూ షానే తప్పుబడుతున్నారు. ఈ వివాదాల కారణంగానే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇంకా దేశవాలీ క్రికెట్లోనే మిగిలిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇంత వివాదం జరిగిన తర్వాత షా తన సోషల్మీడియా పోస్ట్ కారణంగా మరోసారి వార్తల్లోకెక్కడం విశేషం. మ్యాచ్ ముగిసిన అనంతరం షా తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్తో (Akriti Agarwal) కలిసి రిలాక్స్ అవుతున్న ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు.గత కొంతకాలంగా షా-అకృతి మధ్య ప్రేయాణం నడుస్తుందన్న టాక్ నడుస్తుంది. వీరిద్దరూ ఇటీవల గణేశ్ చతుర్థి వేడుకల్లో కలిసి కనిపించారు. షా కొంతకాలం క్రితం మోడల్ నిధి తపాడియాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకృతితో డేటింగ్లో ఉన్నట్లు సోషల్మీడియా టాక్.ఎవరీ అకృతి..?అకృతి అగర్వాల్ ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముంబైలోని నిర్మలా కాలేజీ నుంచి BMS పూర్తి చేసిన అకృతి.. కోవిడ్ సమయంలో డాన్స్, లైఫ్స్టైల్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.షా సెకెండ్ ఇన్నింగ్స్18 ఏళ్ల వయసులో వెస్టిండీస్పై టెస్ట్ సెంచరీతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న షా.. ఆతర్వాత ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి, వివాదాల కారణంగా కెరీర్ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.ఇటీవలే క్రికెటర్గా జన్మనిచ్చిన ముంబై టీమ్ కూడా షాను వదిలేసింది. దీంతో అతను మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ జట్టు తరఫున కూడా వరుస సెంచరీలతో అదరగొడుతున్న షా.. టీమిండియాలో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. షా తన ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ను పక్కన పెడితే క్రికెటర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. షా కంటే జూనియర్ అయిన శుభ్మన్ గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ అయిపోయాడు. కానీ, షా మాత్రం టీమిండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు. చదవండి: సంచలన వార్త.. దేశం కోసం భారీ డీల్ను వదులుకున్న కమిన్స్, హెడ్..? -
తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దగ్గు మందులపై నిషేధం విధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్ కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.కాగా, రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. -
వయసు తక్కువే కానీ.. సంపదలో రారాజులు
భారతదేశ స్టార్టప్, వ్యాపార రంగంలో యువతరం శక్తి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. హురున్ రిచ్ లిస్ట్ 2025 విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్లో అత్యంత ధనిక యువ వ్యాపారవేత్తలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు. సాంకేతికత, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ, నిర్మాణ రంగాలు.. వంటి వాటిలో తమదైన ముద్ర వేస్తున్నారు.అతి పిన్న వయస్కుడిగా కైవల్య వోహ్రా రికార్డుకైవల్య వోహ్రా కేవలం 22 ఏళ్ల వయస్సులోనే రూ.4,480 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న తన ‘జెప్టో’ స్టార్టప్ నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడంలో నగర జీవన విధానాన్ని మార్చేసింది. జెప్టో సహ-వ్యవస్థాపకుల్లో మరొకరు ఆదిత్ పలిచా (23). రూ.5,380 కోట్ల సంపదతో ముందుకు సాగుతున్నారు.రితేష్ అగర్వాల్ (31): ప్రిజం (OYO) వ్యవస్థాపకుడు. రూ.14,400 కోట్ల నికర విలువతో గ్లోబల్ ఆతిథ్య రంగంలో తనదైన ముద్ర వేశారు. భారతీయ స్టార్టప్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన దార్శనికత ముఖ్యమైనది.అరవింద్ శ్రీనివాస్ (31): శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పెర్ప్లెక్సిటీ ద్వారా రూ.21,190 కోట్లు సేకరించి గ్లోబల్ టెక్ మార్కెట్లో భారతదేశ ప్రతిభను తెలియజేశారు.త్రిష్నీత్ అరోరా (30): చండీగఢ్కు చెందిన ఈయన తన సైబర్ సెక్యూరిటీ సంస్థ టాక్ సెక్యూరిటీ ద్వారా రూ.1,820 కోట్ల సంపదను ఆర్జించారు.శాశ్వత్ నక్రానీ (27): ఫిన్టెక్ ప్లాట్ఫామ్ భారత్పే సహ వ్యవస్థాపకుడిగా రూ.1,340 కోట్ల నికర విలువతో చిన్న వ్యాపారాల చెల్లింపులను డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్నారు.రోహన్ గుప్తా & ఫ్యామిలీ (26): ఎస్జీ ఫిన్సర్వ్ ద్వారా రూ.1,140 కోట్ల సంపదతో డిజిటల్ ఫైనాన్షియల్ సేవలను ఆధునీకరిస్తున్నారు.హార్దిక్ కొఠియా అండ్ ఫ్యామిలీ (31): సూరత్ కేంద్రంగా ఉన్న రేజోన్ సోలార్ ద్వారా రూ.3,970 కోట్ల సంపదతో పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించి పర్యావరణ అనుకూల ఆవిష్కరణ లాభదాయకతను నిరూపించారు.హర్షారెడ్డి పొంగులేటి (31): హైదరాబాద్కు చెందిన ఈయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా రూ.1,300 కోట్ల నికర విలువతో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశ వృద్ధికి దోహదపడుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
నెల్లూరు డబుల్ మర్డర్.. గంజా బ్యాచ్ పనే!
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ వద్ద వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసు.. గంజాయి బ్యాచ్ పనేనని నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులిద్దరూ గంజాయ్ బ్యాచ్గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
రాహుల్.. నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని వారినే మోసం చేశారు: కవిత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం.. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు వాళ్లు తగిన బుద్ధి చెబుతారని కామెంట్స్ చేశారు.గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. గన్ పార్క్ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ.. బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు.రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. గ్రూప్-1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాము. తెలంగాణలో ఉన్న మేధావులు మౌనం వీడాలి. గ్రూప్-1 పరీక్షపై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్ను కలుస్తాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు నమ్మి తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడుతారు.త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి మళ్లీ గ్రూప్-1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
దేశంలో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లు ప్రారంభం
భారతదేశంలో కస్టమర్ సపోర్ట్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడానికి షావోమి ప్రధాన నగరాల్లో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇది భారత మార్కెట్ పట్ల కంపెనీ దీర్ఘకాలిక నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పింది. కంపెనీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, జైపూర్, ముంబై, పుణె, అహ్మదాబాద్ల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్లో కేంద్రాలు ప్రాథమికంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 100 ప్రీమియం సర్వీస్ సెంటర్లకు విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. ఈ సందర్భంగా షావోమి ఇండియా సీఈవో సుధీన్ మాథుర్ మాట్లాడుతూ..‘కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం కంటే మమ్మల్ని విశ్వసించే వ్యక్తులతో శాశ్వత సంబంధాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించాని నిర్ణయించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు..
నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ‘ఉన్నతి ఫౌండేషన్’ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. కెప్టెన్ సుబ్బారావు ఉదార మద్దతుతో ప్రారంభమైన ఈ కేంద్రం, కీలకమైన ఉపాధి నైపుణ్యాలను , ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువతకు వీలు కల్పిస్తోంది.2024లో కాకినాడలో తన శిక్షణా కార్యక్రమాలను ఉన్నతి ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో సహాయసహకారాలు అందించింది. అంతేకాకుండా, ఈ సంస్థ కళాశాలల్లో UNXT శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కాకినాడలో దాదాపు 1,700 మంది విద్యార్థులకు చేరువవుతోంది. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ వృత్తి శిక్షణా కేంద్రం, UNXT మోడల్తో కలిసి.. ప్రతి ఏడాది కాకినాడలో 2 వేల మందికి పైగా యువతకు నైపుణ్యం, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఈ ఉన్నతి సంస్థ అందించనుంది . వృత్తి శిక్షణ కేంద్రంలో, శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి 35వ రోజు శిక్షణ నాటికి ఉద్యోగం లభిస్తుందనే భరోసా అందిస్తోంది. ఇది దీర్ఘకాలిక, స్థిరమైన కెరీర్లకు పునాది వేస్తుంది.“ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా, కాకినాడలో వీలైనంత ఎక్కువ మంది యువతను ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో ఉదార మద్దతు ఇచ్చినందుకు కెప్టెన్ సుబ్బారావు ప్రభలకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆయన నమ్మకం నిజంగా ప్రశంసనీయం, ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గౌరవంగా ఉన్నతి భావిస్తోంది ” అని ఉన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ స్వామి అన్నారు.ఈ కార్యక్రమంపై తన ఆలోచనలను కెప్టెన్ ప్రభల వెల్లడిస్తూ , “ఆంధ్రప్రదేశ్కు అపారమైన సామర్థ్యం ఉంది, కానీ అర్థవంతమైన ఉపాధిని పొందడానికి విద్య ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఉన్నతికి మద్దతు ఇచ్చి, తమ స్వంత కాళ్ళపై నిలబడేలా చేయడమే గాక, గౌరవప్రదంగా బతికేలా చేసేందుకు తమవంతు సహాయసహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలామంది బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా(BFSI)లో బిజినెస్ అసోసియేట్ వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలు పొందారు. మరికొందరు బీపీవో, టెలికాలింగ్ కార్యకలాపాల్లో చేరారు. అలాగే ప్రభుత్వ కళాశాలలలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి ఉన్నతి ఫౌండేషన్ పనిచేస్తుంది. ఒక్క కాకినాడలోనే, 5 నుంచి 6 కళాశాలలతో ఉన్నతి భాగస్వామ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 29 వేలు కంటే ఎక్కువ మంది యువత దీని నుంచి పలు రకాల ప్రయోజనాలు పొందారు.(చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!) -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
బీహార్ ఎలక్షన్స్: ‘భారతంలో దృతరాష్ట్రుడిలా..’
విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్ రాజకీయం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్ సిన్హా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. బీహార్లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్ సిన్హా అన్నారు. ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు! -
సోషల్ వార్.. పొలిటికల్ పోరు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి.ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెస్ర్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనా్రస్తాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి.ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పారీ్టకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిరి్వరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పారీ్టలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. -
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!
అమెరికా హెచ్1బీ వీసాపై పెంచిన ఫీజులు, ‘యూఎస్ ఫస్ట్’ వైఖరితో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు అమెరికా వెళ్లాలని భావిస్తున్న ఇతర దేశాల్లోని వారు ఆలోచనలో పడ్డారు. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నియామకాలను ముమ్మరం చేస్తున్నాయి.నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు..కెనడాఅత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం కెనడా తన టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (TFWP) ద్వారా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (Global Talent Stream - GTS) విధానంలో నిపుణులను వేగంగా రిక్రూట్ చేసుకుంటోంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ (Express Entry), గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS), ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ (PNP) వంటి విధానాలు అనుసరిస్తోంది. ముఖ్యంగా IT/టెక్నాలజీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, నెట్వర్క్ టెక్నీషియన్లు), ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్), ఆరోగ్యం (నర్సులు, డాక్టర్లు), నిర్మాణం (Construction) వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.కెనడా GTS ద్వారా అర్హతగల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వర్క్ పర్మిట్ దరఖాస్తులను కేవలం రెండు వారాల్లో ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రక్రియ.జర్మనీయూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ తన కార్మిక లోటును పూడ్చుకోవడానికి చురుగ్గా వలసదారులను ఆకర్షిస్తోంది. అందుకోసం ఈయూ బ్లూ కార్డ్ (EU Blue Card), ఎంప్లాయ్మెంట్ వీసా, జాబ్ సీకర్ వీసా, ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) పాలసీలను అనుసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్), IT (సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు), ఆరోగ్యం (డాక్టర్లు, నర్సింగ్), ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాషా నైపుణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఆస్ట్రేలియా (Australia)ఆస్ట్రేలియా పాయింట్స్-ఆధారిత (Points-based) వ్యవస్థను ఉపయోగిస్తుంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాల జాబితాను క్రమం తప్పకుండా ప్రకటిస్తుంది. హెల్త్కేర్ (నర్సింగ్, ఇతర వైద్య నిపుణులు), IT, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం(Construction Management)లో అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కనీస వేతనంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తారు.యూకే (United Kingdom)యూకే కూడా పాయింట్స్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మారింది. నైపుణ్యం కలిగిన కార్మికులకు (Skilled Workers), ఆరోగ్య కార్యకర్తలకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది. IT, హెల్త్కేర్ (నర్సులు, వైద్య నిపుణులు), విద్యలో అవకాశాలున్నాయి.స్వీడన్ (Sweden)స్వీడన్ అధిక నాణ్యత గల జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక భద్రత, వర్క్-లైఫ్ సమతుల్యత (Work-Life Balance)కు ప్రసిద్ధి చెందింది. టెక్నాలజీ, హెల్త్కేర్, ఇంజినీరింగ్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్క్ పర్మిట్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.నెదర్లాండ్స్ (Netherlands)నెదర్లాండ్స్ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. హై-టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ (HSM) వీసా, ఈయూ బ్లూ కార్డ్ పాలసీలు పాటిస్తుంది. IT, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ (Logistics) వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.సింగపూర్, యూఏఈఆసియాలో ఈ దేశాలు ఉన్నత స్థాయి జీతాలు, తక్కువ పన్నులు, శక్తివంతమైన వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నాయి. సింగపూర్లో ఫైనాన్స్, ఫిన్టెక్ (FinTech), ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువులున్నాయి. ఇక్కడ జారీ చేసే ఉద్యోగ పాస్లు (Employment Passes) అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. యూఏఈ (దుబాయ్, అబుదాబి)లో నిర్మాణ నిర్వహణ, పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఐటీ, ఎనర్జీ వంటి విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ అందించే గోల్డెన్ వీసాల (Golden Visas) ద్వారా దీర్ఘకాల నివాస అవకాశాలను పొందవచ్చు.ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర -
దేశం కోసం భారీ డీల్ను వదులుకున్న కమిన్స్, హెడ్..?
క్రికెట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో సంచలన టాపిక్గా మారింది. ఇద్దరు స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు దేశం కోసం భారీ డీల్ను కాదనుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాస్తవాలు ఎంత వరకో తెలీదు కానీ, సదరు ఆటగాళ్లను మాత్రం వారి స్వదేశ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. మా ఆటగాళ్లకు దేశం కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదంటూ డబ్బా కొట్టుకుంటుంది. ఇది కదా నిజమైన దేశభక్తి అంటే అంటూ గొప్పలకు పోతుంది.ఆస్ట్రేలియాకు చెందిన ద ఏజ్ (The Age) అనే వార్తా సంస్థ కధనం ప్రకారం.. వారి దేశ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (Pat Cummins), ట్రవిస్ హెడ్కు (Travis Head) ఓ ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏడాదికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 58.2 కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. షరతేమిటంటే.. వారిద్దరు ఆస్ట్రేలియా తరఫున ఆడటం మానేసి, ఆ ఫ్రాంచైజీకి చెందిన గ్లోబల్ టీ20 లీగ్ల్లో మాత్రమే ఆడాలి. ఈ ఆఫర్ను కమిన్స్, హెడ్ ఇద్దరూ తిరస్కరించారు. దేశం కంటే తమకు డబ్బు ముఖ్యం కాదని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆసీస్ మీడియా గత కొన్ని రోజులుగా హైలైట్ చేస్తుంది. సోషల్మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. వాస్తవాస్తవాలు తెలియని క్రికెట్ అభిమానులు దేశం పట్ల కమిన్స్, హెడ్కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దేశం తరఫున ఆడితే ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లకు మించి రావు. అలాంటిది కమిన్స్, హెడ్ ఇంత భారీ ఆఫర్ను ఎలా కాదనుకున్నారని కొందరనుకుంటున్నారు.ఇతర దేశాల ఆటగాళ్లు ఇలా లేరు..!కమిన్స్, హెడ్ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం భారత్ మినహా ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెటర్లంతా లీగ్ క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్ల కెరీర్లను పూర్తి వదులుకొని లీగ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవలే వెస్టిండీస్కు చెందిన నికోలస్ పూరన్, దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ తమ అంతర్జాతీయ కెరీర్లు అర్దంతరంగా వదిలేసి లీగ్ల పంచన చేరారు. వీరే కాక చాలా మంది స్టార్ క్రికెటర్లు లీగ్ల్లో లభించే అధిక డబ్బు కోసం దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని వద్దనుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. ఫ్రాంచైజీలు అధిక డబ్బును ఆశగా చూపిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నాయి.తిరిగి కమిన్స్, హెడ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వీరు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందంలో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 2025 సీజన్ వేలానికి ముందు కమిన్స్ను రూ. 18 కోట్లకు, హెడ్ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. కెప్టెన్గా, ఆటగాడిగా కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు సీజన్లో చెలరేగిపోయిన హెడ్ గత సీజన్లో తస్సుమన్నాడు.చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన -
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!
దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశలోని సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్ని భోపాల్కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.An MP IAS officer Sanskriti Jain, Collector Seoni,was given a unique farewell by her staff. Unheard of before.Many officers hv been popular during their postings owing to people-oriented works & honesty, yet this was something new.Let more officers be like her.@IASassociation pic.twitter.com/wsebdt9ELw— Abhilash Khandekar (@Abhikhandekar1) October 5, 2025 (చదవండి: డిజిటల్ డిటాక్స్లో ఉండగా ..వరించిన నోబెల్ బహుమతి! ట్విస్ట్ ఏంటంటే..) -
క్షీరసాగర మథనం-గరళ ఆవిర్భావం
దుర్వాసుని శాపం వల్ల అసురులకు తన త్రిలోకాధిపత్యాన్నీ, సకల సంపదలనూ కోల్పోయాడు ఇంద్రుడు. అసురుల చేతిలో ఎన్నో బాధలు అనుభవించి ఇతర దేవతలతో కలిసి చివరకు బ్రహ్మను ఆశ్రయించాడు. బ్రహ్మ వారిని విష్ణువు దగ్గరకు నడిపించాడు. ఆయన సాగరమథనం చేసి అందులోంచి పుట్టే అమృతాన్ని దేవతలు మాత్రమే సేవించేట్లుగా చేయడం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అన్నాడు. సత్వరం అసురులను మంచి మాటలతో ఒప్పించి అందరూ కలిసి మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకిని ఆ కవ్వమునకు తాడుగాను అమర్చి సాగర మథన కార్యక్రమానికి పూనుకొమ్మని చెప్పాడు. అలా మొదలైన ‘క్షీరసాగర మథనం’ (Ksheera Sagara Madhanam)అనే బృహత్కార్యంలో శ్రీమహావిష్ణువు కమఠ (తాబేలు) రూపం దాల్చి, మందర పర్వతం సాగరంలో మునగకుండా అడ్డుతగిలే ఆధారమై అమరాడు. చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుఅసురులు వాసుకికి తలవైపున ఉండి లాగడం వలన వాసుకి నోటి నుండి వెలువడిన విషపు వేడిజ్వాలలు తగిలి నానాటికి కమిలిపోయి, అలిసిపోయి బలహీనులై మిగలసాగారు. దేవతలు తోకవైపు ఉండి లాగి బలవంతులుగానే మిగిలారు. అలా సాగిన సాగర మథనంలో వరుసగా సురభి, వారుణి, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము, పూర్ణచంద్ర మండలము, అప్సరలు, ధన్వంతరి ఉద్భవించారు. ఆ తరువాత క్షీరసాగరం నుండి అమృతం జనించక ముందు, హాలాహలం ప్రత్యక్షమవడం జరిగిందని కలిదిండి భావనారాయణ రచించిన ‘శ్రీవిష్ణుపురాణం’ చెబు తోంది. కం. అక్కజముగ దేవాసురు / లుక్కున, వడి, బట్టితిగుచు నుద్ధతులకడున్ / త్రొక్కుడువడి, వాసుకి, వడి / గ్రక్కిన గరళంబు భోగిగణములు గొనియెన్. దేవతలు అసురులు ఎంతో శ్రమపడి చెరొకవైపు పట్టి అవిరామంగా లాగడం వలన త్రొక్కుడుపడిన వాసుకి అలసిపోయి భళ్ళుమని ఒక్కసారిగా గరళాన్ని కక్కాడు. ఆ గరళాన్ని సర్ప సమూహాలు ఆరగించాయి – అని పై పద్యం భావం. అలా క్షీరసాగర మథనం సందర్భంగా పుట్టిన హాలాహలాన్ని నాగులు గ్రహించారని శ్రీవిష్ణుపురాణం కథనం చేసింది. – భట్టు వెంకటరావు -
బిగ్బాస్ హౌస్కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు
తెలుగు, తమిళం, హిందీలో ప్రస్తుతం బిగ్బాస్ షో ప్రసారమవుతోంది. కన్నడ సీజన్ మాత్రం మొదలైన పదిరోజులకే క్లోజ్ అయిపోయింది. ఏకంగా ప్రభుత్వ అధికారులు వచ్చి హౌస్కి మంగళవారం తాళం వేశారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి విషయం?కన్నడ హీరో సుదీప్.. కన్నడ బిగ్బాస్ 12వ సీజన్కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో షో మొదలైంది. బెంగళూరుకి దక్షిణాన ఉన్న జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్లో హౌస్ సెట్ వేశారు. అయితే హౌస్ నుంచి వచ్చే వ్యర్థాలని బయటకు వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే పర్యావరణ నియంత్రణ మండలి.. షో నిర్వహకులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే బిగ్బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్)ఇక మంగళవారం.. ప్రాంతీయ తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు.. బిగ్బాస్ హౌస్ దగ్గరకు వెళ్లారు. తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. గంటలో అందరూ హౌస్ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయినా సరే లోపలి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో అధికారులు.. హౌస్కి తాళం వేశారు. ఇక చేసేదేం లేక రాత్రి 8 గంటల తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిర్వహకులు.. ఓ థియేటర్కి తరలించారు.అయితే షో మొదలు కాకముందే పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ నిర్వహకులకు అవేం పట్టినట్లు లేవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే షో ప్రారంభించారు. ఇప్పుడు మొదలైన 10 రోజుల్లో క్లోజ్ అయిపోయింది. మరి ఈ సీజన్ మళ్లీ మొదలవుతుందా లేదంటే ఇక్కడితే ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, రెండుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని అందుకే ఇలా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 9: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)VIDEO | Bengaluru: The Bengaluru South district authorities on Tuesday sealed the studio premises hosting the Kannada reality show 'Bigg Boss' in Bidadi following the Karnataka State Pollution Control Board (KSPCB) order. The board had cited serious violations of environmental… pic.twitter.com/E1Ejv8kVo7— Press Trust of India (@PTI_News) October 8, 2025 -
కన్నడలో బ్యాన్.. స్పందించిన రష్మిక!
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అఅయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. థామా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు. -
విశ్రాంత పాత్రికేయులకేదీ భరోసా?
సంక్షేమంలో ఛాంపియన్లుగా పేరుపొందిన తెలుగు రాష్ట్రాలు పాత్రికేయుల సంక్షేమాన్ని మాత్రం పక్కన పెడుతున్నట్లున్నది! 1,000 నుంచి 2,500 రూపా యల పీఎఫ్ పెన్షన్ మాత్రమే అందుకొంటూ విశ్రాంత జీవితాన్ని నానాపాట్లూ పడుతూ గడుపుతున్న 60 ఏళ్లు పైబడిన విశ్రాంత పాత్రికేయులను పట్టించు కోవడం లేదని... కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.మన తెలుగు రాష్ట్రాల్లో గౌరవప్రదమైన జీతభత్యాలు ఇస్తూ, పీఎఫ్ చందాలు కడుతూ పాత్రికేయులకు అండగా, ఆలంబనగా నిలుస్తున్న సంస్థలు పరి మితమే. ఉద్యోగ భద్రత, నెలవారీగా వేతనం వస్తుందన్న గ్యారెంటీ లేకుండా జీవితాన్ని గడిపే పాత్రికేయులే ఇప్పడు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారు రిటైరైన తర్వాత కూడా కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం సమాజంలోని అన్ని వర్గాల కోసం పాటుపడిన పాత్రికేయులు రిటైరయ్యాక ఎవరూ పట్టించుకోని దైన్యస్థితిలో బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అక్ష రాన్నే నమ్ముకుని ఉన్న వేలాదిమంది పాత్రికే యుల పరిస్థితి అసంఘటిత కార్మికుల కంటే తీసికట్టుగా తయారైంది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?నిజానికి, తెలుగు రాష్ట్రాలు తప్ప దేశంలో మరో 19 రాష్ట్రాలు విశ్రాంత పాత్రికేయులకై పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా నెలకు రూ. 20 వేల చొప్పున పెన్షన్ను 60 ఏళ్ళు పైబడిన పాత్రికేయులకు అందజేస్తోంది. అసోం నెలకు రూ. 5 వేలు, ఛత్తీస్గఢ్ 10 వేలు, గోవా 10 వేలు, హరియాణా 10 వేలు, మన పొరుగునే ఉన్న కర్ణాటక 10 వేలు, కేరళ 11 వేలు చెల్లిస్తున్నాయి. పంజాబ్లో 12 వేలు, రాజస్థాన్లో 15 వేలు, తమిళనాడులో 12 వేలు, త్రిపురలో 10 వేల చొప్పున విశ్రాంత జీవితం గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్గా అందచేస్తున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుతెలుగు రాష్ట్ర్రాలు వందల కోట్ల నిధులతో లక్షలమందికి సామాజిక పెన్షన్లు అందచేస్తున్నాయి. అయితే అరకొర ఆదాయంతో రిటైర్మెంట్ జీవి తాన్ని గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్ వసతి కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పాత్రికేయులకు పెన్షన్ ఇస్తామంటూ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఆ వాగ్దానాన్ని గుర్తుచేశారు విశ్రాంత పాత్రికేయులు. త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలనూ కలిసి వినతిపత్రం సమర్పించ నున్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం కావాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం తీర్మానం చేసింది. అక్షరాన్ని నమ్ముకొని, సమాజానికి మార్గదర్శనం చేసిన వయోధికులకు పాలకులు అండనివ్వాలి. – చొప్పరపు కృష్ణారావుపాత్రికేయుడు 84668 64969 -
స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్
రీసెంట్గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. -
వింటేజ్ ను రవితేజను గుర్తుచేస్తున్న 'హుడియో హుడియో'
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు.'హుడియో హుడియో' అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు. సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ తన మనోహరమైన స్వరంతో భీమ్స్తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్(Pakistan) రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్(Asim Khwaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్India vs Pakistan) మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.పాక్ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా పాకిస్తాన్కు చెందిన సమా టీవీలో మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. కానీ, రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించడం లేదు. మళ్లీ భారత్తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం విషయానికి పాకిస్తాన్ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తాం. భారత్ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చూపిస్తుంది. ఔరంగజేబు పాలనలో మాత్రమే ఐక్యంగా ఉంది. ముందు నుంచి పాకిస్తాన్ వేరుగానే సృష్టించబడింది. స్వదేశంలో మేము వాదించుకుంటాం.. పోటీ పడతాం. కానీ, భారత్తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అంటూ బీరాలు పలికారు. దీంతో, వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ ప్లాన్ ఏంటి? అని సోషల్ మీడియాతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Pakistan Defence Minister Khwaja Asif speaks of the possibility of another Indo-Pak war-“History shows that India was never truly united, except briefly under Aurangzeb. Pakistan was created in the name of Allah. At home, we argue and compete, but in a fight with India we come… pic.twitter.com/bTrDxqhQel— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 8, 2025ఇక, అంతకుముందు కూడా భారత్పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని కామెంట్స్ చేశారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ 0–6 స్కోర్తో ఓడిపోయిందని అన్నారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi)హెచ్చరించిన తర్వాత ఖవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు. -
అయోధ్య రామ్ లీలా... రికార్డుల హేల
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీరాముని నగరమైన యోధ్య మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. దసరా నవరాత్రలు నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య వేదికగా నిర్వహించిన రామ్లీలా (Ayodhya Ramlila ) ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రామ్లీలాగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిజిటల్ విప్లవ యుగంలో, ఈ కార్యక్రమం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం...3–డీ సాంకేతికత ఆధునిక వేదిక అలంకరణ ఈ «ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఎక్కువ సంఖ్యలో రామ భక్తులను చేరుకోవడానికి రామ్లీలా ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ప్రసారం, ఆరాధన, టాటా ప్లే, షెమరూ మీ, Vఐ యాప్, ఎయిర్టెల్, షెమరూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల వ్యాప్తంగా జరిగింది. అకేలే షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్లో ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. వేదికపైనే కాకుండా తెరపై కూడా, ఈ కార్యక్రమం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సంవత్సరం, రామ్లీలాను 50 కి పైగా దేశాలలో ఆన్లైన్లో ప్రసారం చేశారు మొత్తం 62 కోట్లకు పైగా రామభక్తులు వీక్షించారు.ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వీక్షకులు....అయోధ్యలోని రాంలీల ప్రతి సంవత్సరం డిజిటల్ వీక్షకుల పరంగా రికార్డులను సృష్టించడం గమనించదగ్గ విషయం. గూగుల్ డేటా ప్రకారం, 2020లో 16 కోట్ల మంది వీక్షకులు, 2021లో 20 కోట్ల మంది వీక్షకులు, 2022లో 25 కోట్ల మంది వీక్షకులు, 2023లో 40 కోట్ల మంది వీక్షకులు, 2024లో 41 కోట్ల మంది వీక్షకులు మరియు 2025లో 62 కోట్ల మంది వీక్షకులు దీనిని వీక్షించారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. గత 2020లో రామ్లీలాను అప్పటి పర్యాటక సాంçస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేశారు.దేశ దేశాలలో శ్రీరామ నామస్మరణ...రామ్లీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి కేంద్రంగా మార్చారు. రామ్నగరి అయోధ్యలో ప్రదర్శించిన ఈ రామ్లీలా మొత్తం ప్రపంచపు రామ్లీలాగా మారింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కోట్లాది మంది రామభక్తులు దీనిని వీక్షించారు.(Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు)అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని నిరూపించేలా యోగి సర్కార్ సహకారం డిజిటల్ టెక్నాలజీ సంగమం రామ్లీలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి భారతీయ ఆధ్యాత్మిక వైభవం అంతర్జాతీయ విశేషంగా మారింది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?సినీ సందడి...శ్రీరాముని నగరమైన అయోధ్యలో జరిగిన గ్రాండ్ రామ్లీలా ఈ సంవత్సరం సినీ తారల సందడితో మరింత ప్రత్యేకంగా మారింది. మన దేశపు ప్రముఖ నటులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు. ఢిల్లీ, ముంబై నుంచి 250 మందికి పైగా సినీ కళాకారులు ఈ రామ్లీలాకు హాజరై పలు రకాల ప్రదర్శనలు సమర్పించారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తల్లి సీతమ్మ పాత్రను పోషించి ప్రదర్శించింది. విందు దారా సింగ్ తన శక్తివంతమైన నటనతో హనుమంతుని పాత్రకు ప్రాణం పోశారు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందిన షాబాజ్ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ప్రముఖ నటుడు అనిల్ ధావన్ విభీషణుడి పాత్రను పోషించారు. హాస్యనటుడు సునీల్ పాల్ నారదమునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనితో పాటు, మనోజ్ తివారీ, రవి కిషన్, రాకేష్ బేడి, రజా మురాద్, అష్రాని, అవతార్ గిల్, రీతు శివపురి, షీబా మరియు అరుణ్ బక్షి కూడా తమ తమ పాత్రలతో రామ్లీలాకు అభినయ వైభవాన్ని జోడించారు.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కేంద్రంగా మారిన రాంలీలా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మిస్ యూనివర్స్ 2024చ 2025ల రాక కూడా ఈ ఈవెంట్ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించింది. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance) ఓ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ -
వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన
ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ సింహాలు (India U19 Team) గర్జించాయి. వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్ల్లో ఆతిథ్య జట్టును (Australia U19 Team) క్లీన్ స్వీప్ చేశాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన యువ భారత్.. వన్డే సిరీస్ను 3-0తో, టెస్ట్ సిరీస్ను 2-0తో ఊడ్చేసింది.మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 8) ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కుర్ర జట్టు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ సైతం తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైనా.. 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది.అనంతరం భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఆసీస్ను 116 పరుగులకే (రెండో ఇన్నింగ్స్లో) కుప్పకూల్చారు. తద్వారా భారత్ ముందు నామమాత్రపు 81 పరుగుల లక్ష్యం ఉండింది.స్వల్ప ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడింది. 13 పరుగుల వద్దే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (13) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బంతికే స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డకౌటయ్యాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా భారత ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే 52 పరుగుల వద్ద విహాన్ (21) కూడా ఔటయ్యాడు. ఈసారి వేదాంత్ (33 నాటౌట్) మరో ఛాన్స్ తీసుకోకుండా రాహుల్ కుమార్ (13 నాటౌట్) సహకారంతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన వైభవ్ఈ మ్యాచ్లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయిన ఈ కుర్ర డైనమైట్.. రెండో ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.చెలరేగిన బౌలర్లుఈ మ్యాచ్లో భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్ల్లో చెలరేగిపోయారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆసీస్ బ్యాటర్లు కొద్ది సేపు కూడా క్రీజ్లో నిలబడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్ల్లో ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (66, 38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో హెనిల్ పటేల్ 6, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్ తలో 4, నమన్ పుష్పక్ 3, దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీశారు. చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ కూలి నలుగురి మృతి
సక్తి: ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి నలుగురు కూలీలు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. దబ్రా ప్రాంతం పరిధిలోని ఉచ్చపిండా గ్రామంలో ఆర్కేఎం పవన్జెన్ ప్లాంట్లో ఈ ఘటన జరిగిది.10 మంది కార్మికులు తమ షిఫ్ట్ ముగించుకుని లిఫ్ట్లో దిగుతున్న సమయంలో లిప్ట్ అకస్మాత్తుగా కింద పడిపోయిందని ఎస్పీ అంకితా శర్మ వెల్లడించారు. గాయపడినవారిని రాయ్గఢ్లోని జిందాల్ ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారని తెలిపారు. ఆరుగురికి వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు. -
ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..
ఉద్యోగులకు కోటీశ్వరులు కావాలనే ఆశ ఉంటుంది. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలామంది తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. జీతం తక్కువగా ఉన్నా సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తే ప్రైవేట్ ఉద్యోగులు కూడా దీర్ఘకాలంలో కోటీశ్వరులు (Crorepati) కావడం సాధ్యమే.బడ్జెటింగ్, పొదుపునెలవారీ ఖర్చులను లెక్కించి, బడ్జెట్ వేసుకోవడం తప్పనిసరి. వచ్చిన జీతంలో కనీసం 20% నుంచి 30% వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అధిక వడ్డీ ఉండే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు అప్పులను వీలైనంత త్వరగా చెల్లించాలి. ఎందుకంటే అధిక వడ్డీ మీ సంపాదనలో చాలా భాగాన్ని తగ్గిస్తుంది.పెట్టుబడి ఎంపికలుకోటీశ్వరులు కావాలంటే కేవలం పొదుపు చేస్తే సరిపోదు. ఆ పొదుపును పెంచే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ క్రమంలో రిస్క్ (Risk), రాబడి(Returns)ని దృష్టిలో ఉంచుకోవాలి. దీర్ఘకాలంలో అత్యధిక రాబడి ఇచ్చే అవకాశం ఉన్న పెట్టుబడి మార్గాల్లో స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్లు కీలకంగా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు SIP ఒక ఉత్తమమైన మార్గం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మంచి పనితీరు కనబరుస్తున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.ఉదాహరణ: మీరు నెలకు రూ.10,000 చొప్పున 25 సంవత్సరాలు SIP చేస్తే సగటున 12% రాబడితో దాదాపు రూ.1.89 కోట్లు సంపాదించవచ్చు. చిన్న మొత్తంలో క్రమంగా పెట్టుబడి పెట్టి పెద్ద సంపదను సృష్టించడానికి ఇది సహాయపడుతుంది.నేరుగా స్టాక్స్లో పెట్టుబడి: మీకు మార్కెట్ గురించి లోతైన అవగాహన ఉంటే మంచి ప్రాథమిక అంశాలున్న (fundamentally strong) పెద్ద కంపెనీల బ్లూ-చిప్ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో నష్టభయం ఉంటుందని గమనించాలి.గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు (Gold Investments)ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. మొత్తం పెట్టుబడిలో కొంత భాగాన్ని (సుమారు 5% - 10%) బంగారంలో పెట్టవచ్చు. నేరుగా బంగారం కొనుగోలు చేయడం కంటే గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ముఖ్యమైన పెట్టుబడి సూత్రాలు‘వడ్డీపై వడ్డీ’ అనే సూత్రాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడానికి వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించాలి. మీరు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగిస్తే మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది.పెట్టుబడి మొత్తాన్ని ఒకే ఆస్తిలో కాకుండా స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వేర్వేరు మార్గాల్లో విభజించాలి. ఒక రంగంలో నష్టం వచ్చినా మరొక రంగం ఆ నష్టాన్ని భర్తీ చేయగలుగుతుంది.మీరు ఎంచుకున్న SIP లేదా ఇతర పెట్టుబడిని నిరంతరాయంగా కొనసాగించాలి. మార్కెట్ తగ్గినా లేదా పెరిగినా నెలవారీ పెట్టుబడిని ఆపకూడదు.ఏటా జీతం పెరిగినప్పుడల్లా మీ పెట్టుబడి మొత్తాన్ని కూడా కొంత పెంచాలి. ఇది మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి సహాయపడుతుంది.కోటీశ్వరులు అవ్వడం ఒక రాత్రిలో జరిగేది కాదు. ఇది సమయం, క్రమశిక్షణ, సరైన పెట్టుబడి నిర్ణయాల కలయిక. మీ ప్రస్తుత జీతం ఎంత ఉన్నా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికను అనుసరిస్తే మీరు తప్పకుండా ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోగలరు.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
నోబెల్ వరించిన విషయం తెలియకుండానే..
కొన్ని సమయాల్లో ఊహకందని విధంగా అంతర్జాతీయ స్థాయి రేంజ్లో బహుమతి వరించినా..అది ఆ వ్యక్తికి తెలియకపోతే.. ఔను..! ఆ వ్యక్తి తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే..అదృష్టం వచ్చి ఒళ్లో వాలినా..తెలుసుకోలేకపోవడం అంటే..అంతకుమించిన దురదృష్టం మరొకటి ఉండదేమో కదూ. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ శాస్త్రవేత్త. చివరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. పైగా తనకు ఈ బహుమతి వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ శాస్త్రవేత్తే అమెరికాకు చెందని ఇమ్యునాలజిస్ట్ ఫ్రెడ్ రామ్స్డెల్. అతను డిజిటల్ డిటాక్స్ కోసం తన భార్యతో కలిసి అడవిలో సేద తీరుతున్నాడు. అలా అక్కడి పరిసరాలతో మమేకమవుతుండగా భార్య ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసింది. అది చూసి రామ్స్డెల్ అడివిలో ఉండే ఎలుగుబంటులను చూసి భయపడింది కాబోలు అనుకున్నాడు. తర్వాత ఆమె అసలు విషయం చెప్పడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అస్సలు ఇది ఊహించలేదంటూ రామ్స్డెల్ సంబరపడ్డట్లు నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్లమాన్ పేర్కొన్నారు. అమెరికాలోని మోంటాన పర్వత శ్రేణుల్లో ఎంజాయ్ చేస్తున్నా ఆ జంట ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్కు చేరుకుని నేరుగా న్యూయార్క్ టైమ్స్తో కాసేపు ముచ్చటించారు. తాను కచ్చితంగా నోబెల్ బహుమతి గెలుచుకుంటానని అస్సలు అనుకోలేదని, అస్సలు తాను పరిశోధన చేసిన విషయాన్నే మర్చిపోయానంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు రామ్స్డెల్. ఇక రామ్స్ డెల్కి రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై చేసిన ఆవిష్కరణలకు గానూ ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని రామ్స్డెల్ సీటెల్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన మేరీ బ్రంకో, జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన షిమోన్ సకాగుచిలతో పంచుకున్నారు. అంటే ఈముగ్గురికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ 11కోట్లు పైనే) నగదు లభిస్తుంది. కాగా రామ్స్డెల్ రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించే టీ కణాలకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతిని పొందారు. ఇక్కడ టీ కణాలు అనేవి ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు. ఇది శరీరంపై దాడి చేసే సూక్ష్మ జీవులను గుర్తించడానికి, లేదా కేన్సర్ కణాలను చంపడానికి సహాయపడతాయట. వాటిని తరుచుగా సెక్యూరిటీ గార్డ్లుగా వ్యవహరిస్తారు పరిశోధకులు. ఇక నోబెల్ కమిటీ సెక్రటరీ పెర్లమాన్ మిగతా ఇద్దరు పరిశోధకులు టచ్లో ఉన్నారని, కానీ ఈ 65 ఏళ్ల రామ్స్డెల్ని సంప్రదించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆయన తన ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో ఉంచడంతో సంప్రదించడం కష్టమైందని, అందువల్ల ఆయన భార్యకు సమాచారం అందించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇలా నోబెల్బహుమతి గెలుచుకున్న విజేతలను సంప్రదించడంలో ప్రతిసారి తమకు చాలా నిరాశ ఎదురవ్వుతోందని కమిటీ వాపోయింది. గతంలో సంగీతకారుడు బాబ్ డిలన్ విషయంలో రోజుల తరబడి సమయం పట్టిందని, మరొకరు ఈ బహుతిని గెలుచుకున్న రోజుల వ్యవధిలో మరణించారని నోబెల్ కమిటీ వెల్లడించింది.డిజిటల్ డిటాక్స్ అంటే..డిజిటల్ పరికరాల (స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివి) అన్నింటికి ఉద్దేశపూర్వకంగా విరామం ఇచ్చి..తోటి వ్యక్తులతో, పరిసరాలతో కనెక్ట్ అవ్వడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇది ఒత్తిడిని, నిద్ర సమస్యలను దూరం చేయడమే గాక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. (చదవండి: సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..) -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి
బిగ్బాస్ షోలో ప్రస్తుతం ఐదోవారం నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. మరోవైపు డేంజర్ జోన్ వల్ల రీతూ చావు తెలివితేటలు చూపించింది. దీంతో బిగ్బాస్ కోపం వచ్చింది. రీతూ చేసిన పనివల్ల మిగతా వాళ్లందరూ బలి అయిపోయారు. ఇంతకీ హౌస్లో 30వ రోజు ఏమేం జరిగింది? ఈసారి నామినేషన్లలో ఉన్నది ఎవరు?మంగళవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్ట్ ఎంట్రీల గురించి చెప్పిన బిగ్బాస్.. కెప్టెన్ రాము, ఇమ్మాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా డేంజర్లో ఉన్నారు. అయితే ఈ వారం డేంజర్లో ఉన్నవాళ్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్లో ఉన్నవాళ్లని కుదిపేస్తుంది. అదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్లు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్ని ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెప్పాడు. అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.ఇకనుంచి హౌసులో ఓనర్స్, టెనెంట్స్ ఉండరని చెప్పిన బిగ్బాస్.. ఇప్పటినుంచి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మంచి ప్రదర్శన చేసి ఎవరైతే పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్లు సేవ్ అవుతారు. అయితే ఈ పోటీల కోసం జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో పవన్-రీతూ, సంజన-ఫ్లోరా, భరణి-దివ్య, శ్రీజ-సుమన్, కల్యాణ్-తనూజ జట్టుకట్టారు. తొలుత 'పట్టువదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇసుకని తీసుకొచ్చి నచ్చని జట్టు పట్టుకున్న ఓ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇసుక నిండితే బాక్స్ కిందకు తగులుతుంది. అలా తగలకుండా ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్లు గెలిచినట్లు అని బిగ్బాస్ చెప్పాడు. ఈ గేమ్లో పవన్-రీతూ విజయం సాధించారు.అయితే ఇసుక టాస్క్లో భరణికి జంటగా ఉన్న దివ్య.. ఇసుకని తీసుకొచ్చి తనూజ టీమ్ బకెట్లో వేసింది. గేమ్ అయిపోయిన తర్వాత తనూజ హర్ట్ అయిపోయింది. దీంతో భరణి వచ్చి ఆమెని సముదాయించేందుకు తెగ ప్రయత్నించాడు. కానీ వినలేదు. దీంతో ఆమె చెబుతున్నంతసేపు భరణి సైలెంట్గానే ఉండిపోయాడు. రెండో పోటీగా బెలూన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలోని ఓ కంటెస్టెంట్ ఓ బాక్స్లో సూదులతో ఉన్న మాస్క్ పెట్టుకుని తల పెట్టాల్స ఉంటుంది. మరో కంటెస్టెంట్ బెలూన్ని లోపల వేయాలి. బాక్స్ లోపల ఉన్న సభ్యులు ఆ బెలూన్స్ తమ మాస్క్కి ఉన్న నీడిల్స్కి తగిలి పగలకుండా ఉండేలా పైకి ఊదుతూ గాల్లో ఉంచాలి అదే సమయంలో ఆ బెలూన్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెప్పాడు.అయితే ఈ పోటీలో రీతూ చావు తెలివితేటలు చూపించింది. పవన్ వెనక బెలూన్ ఉంచేసింది. ఈమెని శ్రీజ, తనూజ టీమ్స్ కూడా అదే ఫాలో అయిపోయారు. దీంతో బిగ్బాస్కి కోపం వచ్చింది. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య తేడా బిగ్బాస్కి చాలా బాగా తెలుసు. మీరు చదివిన స్కూల్కి చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేను. కానీ అత్యంత పేలవమైన ఆట ఇది. ఆట స్ఫూర్తికే విరుద్ధం అని ఏకిపారేశాడు. ఈ క్రమంలో ఈ గేమ్లో ఆడిన సంజన-ఫ్లోరాకి తప్పితే మిగిలిన వాళ్లందరూ ఉన్న పాయింట్లలో సగం కట్ చేసి పడేశాడు. దీంతో గేమ్ ఆడినా సరే పాయింట్ల్ రాలేదే అని సంజన ఏడ్చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్, దివ్య, రీతూ డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. -
జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా ఖాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కవలకూడదు అని రూట్ మార్చారు.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్నాథ్ కోరారు.‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు...నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
ముగిసిన వివాదం.. అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో (Telangana Politics) ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తాం, కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి లక్ష్మణ్ కుమార్కు క్షమాపణ చెప్పారు. లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను.. మంత్రి అడ్లూరి, పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’ అని తెలిపారు. సమస్య ముగిసింది: అడ్లూరిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు. టీపీసీసీ కీలక వ్యాఖ్యలు.. అనంతరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎస్సెన్స్లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెండో ఇన్నింగ్స్లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్లోనూ చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (8-3-23-3), నమన్ పుష్పక్ (7-1-19-3), ఉధవ్ మోహన్ (8-4-17-2), దీపేశ్ దేవేంద్రన్ (6-2-15-1), ఖిలన్ పటేల్ (11.1-2-36-1) ధాటికి ఆసీస్ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.ఆసీస్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన అలెక్స్ లీ యంగ్ టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్ (19), జేడన్ డ్రేపర్ (15), అలెక్స్ టర్నర్ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్ డకౌట్లు కాగా.. కెప్టెన్ విల్ మలాజ్చుక్, యశ్ దేశ్ముఖ్ తలో 5, ఛార్లెస్ లచ్మండ్ 9, విల్ బైరోమ్ 8 పరుగులు చేశారు.అంతకుముందు ఆసీస్ బౌలర్లు భారత్ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్ చేశారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..? -
చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!
చీరమీను..అరుదైన ఒక రకం చిట్టిచేప. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని యానం ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన, అత్యంత విలువైన చేప. ఈ చిన్న చేప చక్కని రుచి, పోషకాలతో కూడినది. సీజన్లో దొరుకుతుంది. ప్రత్యేక వేట పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. చీరమీను స్థానికులకు మాత్రమే కాక, సీ ఫుడ్ ప్రియులకు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.స్థానిక పేర్లు: చీరమీను, సీరమీను. శాస్త్రీయ నామం: auridatumbil, Sauridatumbil, Sauridagracilis, Sauridatumbil ambo scamis. Synodontidae. దీన్ని కొందరు Awaousfluviatilisఅని కూడా సూచిస్తారు. చీరతో పట్టే చేపచీరమీను ప్రధానంగా గోదావరి నది – సముద్రం కలిసే బురద నీటిలో దొరుకుతుంది. ఈ ్ర΄ాంతంలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఈ చేపలు గుడ్లు పెడతాయి. వర్షాకాలం సీజన్లో తూర్పు గాలులు వీస్తే, ఈ చేపలు నది ఒడ్డుకు చేరతాయి. వాటి రాకను పక్షులు గమనించి వాటిని తినడానికి నీటిపై ఎగురుతాయి. పక్షుల హడావుడి చూసి మత్స్యకారులు ‘చీరమీను వస్తోంది’ అని గుర్తిస్తారు. చీరమీను వేట ఒక సాంప్రదాయ ప్రక్రియ. మత్స్యకారులు చీరలకు ఒకవైపున షీట్లు కుట్టి వాటిని నీటిలో అమరిస్తారు. చేపలు వాటిలో చిక్కుకుంటాయి. చిన్న వలలు ఉపయోగించకుండా ఈ చేపలను చీరలతోనే సురక్షితంగా పట్టుకుంటారు. చీరలను ఉపయోగించి పడవలో వెళ్లి పట్టుకుంటారు కాబట్టి ‘చీరమీను’ అని పేరుపెట్టారు. ఈ చేప 1.7 సెంటీమీటర్లు వరకు పెరుగుతుంది. చీరమీను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లభిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీపాళి, నాగుల చవితి వంటి పండుగల సమయానికి చీరమీను మార్కెట్లలో అత్యధిక డిమాండ్లో ఉంటుంది. ఈ సీజన్లోనే స్థానికులు, ఆహార ప్రేమికులు దీన్ని ఆస్వాదిస్తారు. మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, నియాసిన్, సెలీనియం, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు చీరమీను చేపల్లో పుష్కలంగా ఉంటాయి.ఇదీ చదవండి: కిలో రూ. 1,500!చీరమీను అరుదుగా దొరుకుతుంది. వేట శ్రమతో కూడినది. కాబట్టి, మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. దీన్ని గ్లాసు, తవ్వ, సేరు, కుంచం, బిందె, బకెట్లలో కొలిచి విక్రయిస్తారు. ఒక గ్లాసు చీరమీను చేపల ధర సుమారు రూ. 50–100. ఒక కుండి లేదా పెద్ద పాత్ర చేపల ధర రూ.10,000 వరకు ఉంది. కిలో ధర: రూ.500 – 1,500 (డిమాండ్ను బట్టి) పలుకుతుంది. ఇందువల్ల ఇది ఒక విలాసవంతమైన వంటకంగా మారింది. చీరమీను మాత్రమే కాక, దీని పిల్లలు కూడా ఫ్రాన్స్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతాయి. ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?మసాలా దట్టించి వండిన చీరమీను చక్కటి రుచి ఉంటుంది. కొంతమంది చీరమీను మినప్పిండి, చింత చిగురు, మామిడి కాయ, గోంగూర వంటి ఇతర పదార్థాలతో కలిపి వంటలు తయారు చేస్తారు. స్థానికులు పండుగల సమయంలో బంధు మిత్రులకు దీన్ని బహుమతిగా ఇచ్చి ఆనందిస్తారు. గోదావరి మడ అడవుల ప్రాంతంలో అధికంగా వేటాడటం, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చీరమీను మనుగడ ప్రమాదంలో పడింది. కాలుష్య నియంత్రణ, మత్స్యసంఘాల అవగాహన ద్వారా సురక్షిత వేట పద్ధతులను పాటిస్తే చేపల జాతిని పరిరక్షించుకోవచ్చు. తద్వారా జీవవైవిధ్యాన్ని, గోదావరి ప్రాంతపు సాంస్కృతిక, ఆర్థిక వారసత్వాన్ని నిలుపు కోవచ్చు. భవిష్యత్ తరాలకు దీన్ని రుచి చూపవచ్చు. చీరమీను కేవలం ఒక చేప మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయం, జీవనోపాధి, వంటకాల సంపద పర్యావరణ సూచికగా ప్రసిద్ధి చెందింది. ప్రతి వర్షాకాలం సీజన్లో గోదావరి ప్రాంతానికి వచ్చే పర్యాటకులు దీని రుచిని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. -పొన్నపల్లి రామమోహన్ రావు (9885144557), డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్ (రిటైర్డ్), కాకినాడ -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15వరకు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ:తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాడివేడిగా కొనసాగాయి తెలంగాణ ప్రభుత్వం తరుఫును అభిషేక్ సింఘ్వి వాదనలురిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందిఇప్పటి వరకూ రిజర్వేషన్ బిల్లును ఎవరూ ఛాలెంజ్ చేయలేదురిజర్వేషన్లు 50శాతం మించకూడదని కచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదుకచ్చితమైన ప్రాదమిక,సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండొచ్చురిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదనుకుంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్ధం లేదు’ అంటూ వాదనతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం సింఘ్వి వాదానాల అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షంబీసీ రిజ్వర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్విహించారు?ట్రిపుల్ టెస్టు విధానాన్ని అనుసరించారా?ప్రజల అభ్యంతరాలను తీసుకున్నారు?గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉందికమిషన్ రిపోర్టు పబ్లిష్ చేశారా? షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని ఏజిని ప్రశ్నించిన హైకోర్టుఅందుకు ఇంకా వాదనలు ఉన్నాయి.. విచారణ రేపటికి వాయిదా వేయాలన్న ఏజీ ఇంక వాదనలు అవసరం లేదు.. విచారణ ముగిస్తున్నాం’అంటూ వ్యాఖ్యానించిన హైకోర్టుహైకోర్టు ప్రశ్నలు:అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పాస్ ఎప్పుడైంది?.ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా?.బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?.గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా?. రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?.పిటిషనర్ తరఫున వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ...నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ తెలిపారు. 42 శాతం బిల్లు పాస్ అయింది కానీ.. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని పిటిషనర్ తరఫు లాయర్లు చెప్పారు. ట్రిపుల్ టెస్టు పాస్ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు అని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యింది కానీ, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంపిరికల్ డేటా కూడా సరిగా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలు విడదలయ్యాయి. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచవచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.అంతకుముందు.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు తెలిపారు. అలాగే, రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ నెలకొంది. -
తొలి కార్పొరేట్ లైబ్రరీ..15 వేలకు పైగా పుస్తకాలు..
పఠనాసక్తి ఉన్న వారి కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంటాయని తెలుసు. అలాంటి వారికి సిటీలో గ్రంథాలయాలు ఎక్కడా అని భూతద్ధం పెట్టి వెతకాల్సిన పనిలేదు. వాటిని వేళ్లమీదే లెక్కబెట్టొచ్చు. వాస్తవానికి నగరంలో గ్రంథాలయాలు అరకొరా ఉన్నా.. ఆ లైబ్రరీలో ఉండే వసతులు నామమాత్రమే అని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ కంపెనీ అత్యాధునిక లైబ్రరీని నగరవాసుల కోసం అందుబాటులోకి తెచ్చిది. ఏమాత్రం లాభాపేక్ష, వ్యాపార కోణం లేకుండా పూర్తి అధునాతన వసతులతో సిటీలో ఓ లైబ్రరీ.. మంగళవారం ప్రారంభమైంది. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోని టాప్ 10లో ఒకటిగానే కాకుండా 7వ స్థానంలో నిలిచిన సంస్థ కోఫోర్జ్. ఈ కార్పొరేట్ సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ లైబ్రరీని నగరంలోని కొత్తగూడ జంక్షన్లో ప్రణవ్ బిజినెస్ పార్క్, 8వ ఫ్లోర్లో ఏర్పాటు చేసింది. గత సంవత్సరం ఫిబ్రవరి 2024లో నోయిడాలో మొదటి కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ తర్వాత రెండోది గురుగ్రామ్లో ప్రారంభించామని, ఇవి వేలాది సందర్శకుల రాకపోకలతో సందడిగా మారాయని, ఈ నేపథ్యంలో నగరంలో 3వ అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. విశాలమైన..విశేషాల్లో మిన్న.. ఈ లైబ్రరీ పఠనాభిలాషులు ఎవరైనా సరే రావచ్చు. లోనికి ప్రవేశించిన తర్వాత ఒకసారి డిజిటల్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఆ తర్వాత కేవలం సైన్ ఇన్ అయ్యి ఎన్ని సార్లయినా రాకపోకలు సాగించవచ్చు. దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 15,000 కంటే ఎక్కువ పుస్తకాలను అందించనున్న ఈ కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ వారాంతాలు, సెలవులలో సహా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శకులను స్వాగతిస్తుంది. ఏకకాలంలో 160 మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విభిన్న రకాల సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. లైబ్రరీ ఆధ్యంతం ఆహ్లాదకరమైన ఇంటీరియర్తో రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నో చాటింగ్, వర్కింగ్.. ఓన్లీ రీడింగ్.. ఒక అధునాతన కేఫ్కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ.. ఈ లైబ్రరీలో కాలక్షేపానికి చాటింగ్స్, ల్యాప్ టాప్పై ఆఫీస్ వర్క్స్ వంటివి అనుమతించరు. కేవలం పఠనాభిలాషుల కోసం మాత్రమే ఏర్పాటైన ఈ లైబ్రరీలో బుక్ రీడింగ్ సెషన్స్, బుక్ లాంచ్ సహా ఏ రకమైన గేదరింగ్స్కు అవకాశం లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పుస్తకాలను చదువుకోవడం మాత్రమే ప్రధానం అయినప్పటికీ.. అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లాలంటే రిఫండబుల్ డిపాజిట్ కట్టి తీసుకెళ్లవచ్చు. కిడ్స్ స్పెషల్ జోన్.. ఈ లైబ్రరీలోనే ఒక కార్నర్లో కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు.. అందులో చిన్నారులకు ఉపయుక్తమైన పుస్తకాలు ఉంచారు. అదే విధంగా ఫిక్షన్, నాన్–ఫిక్షన్, పిల్లల సాహిత్యం నుంచి స్వచ్ఛంద సేవ, వ్యాపారం, ఆధ్యాతి్మకత, కళ, కృత్రిమ మేధస్సు, సాంకేతికత, ఫొటోగ్రఫీ, కవిత్వం.. సహా అన్ని విభాగాల్లో ప్రసిద్ధ పుస్తకాల సేకరణ ఉంది. ఈ సేకరణలో పెంగి్వన్, హార్పర్కాలిన్స్, అమర్ చిత్ర కథ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రెస్ సాహిత్య అకాడమీ వంటి 350కి పైగా ప్రముఖ ప్రచురణకర్తలకు చెందిన 13,000 పైబడిన రచనలు చోటు చేసుకోనున్నాయిు. లైబ్రరీ కేటలాగింగ్ నిర్వహణ పూర్తిగా డిజిటలైజ్ చేశారు. (చదవండి: క్యాషియర్ టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) -
హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక దానిలో ఉన్న మూవీస్.. మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ డబ్బింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఓ జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)2023లో తమిళంలో 'డాడా' టైటిల్తో ఓ సినిమా రిలీజైంది. హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్లో 'పాపా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చింది. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'పాపా' విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) క్లాస్మేట్స్. వీళ్ల మధ్య మొదలైన స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే మణి వల్ల సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి- సింధు ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్) -
క్యాషియర్ టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
సినిమాలో ప్రొడక్షన్ విభాగంలో క్యాషియర్గా మొదలైన ప్రస్థానం.. చివరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకుంది.. హ్యాపీడేస్ సినిమాతో మొదలై.. క్రమంగా శేఖర్ కమ్ములతో ప్రయాణం సాగించారు. అలా ఆవకాయ బిర్యానీ సినిమాకు పనిచేశారు. ఈ క్రమంలో తన హార్డ్ వర్క్ నచ్చి శేఖర్ కమ్ముల మెచ్చుకున్నారు. తర్వాత లీడర్ సినిమాకు టీంలో చేరమని కబురు పంపారు. ఇదే ఆయన జీవితంలో కీలక మైలు రాయని, తెరవెనుక తాను పడిన కష్టమే తనను అనేక మెట్లు ఎక్కించిందని చెబుతున్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇర్ల నాగేశ్వర్రావు. పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా మాచవరంలోనే. పిడుగురాళ్లలో ఇంటరీ్మడియట్, నర్సరావుపేటలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఓ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్ చేరారు. దగ్గుబాటి రానా నటించిన లీడర్ సినిమాకు శేఖర్ కమ్ముల టీంలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. అలా క్లాప్ కొట్టడం, తర్వాత ఆర్టిస్టులను కో–ఆర్డినేషన్ చేయడం. అగ్ర నటులు గొల్లపూడి మారుతి రావు, నటి సుహాసిని, నటుడు హర్షవర్ధన్, హీరోయిన్ ప్రియా, కోట శ్రీనివాసరావు వంటి వారికి దగ్గరయ్యారు. వివిధ విభాగాల్లో.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం లొకేషన్స్ కోసం క్రమంగా ఫిదా సినిమాకు ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. తర్వాత లవ్ స్టోరీ సినిమాకూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఈ క్రమంలో పని నచ్చడంతో శేఖర్ కమ్ముల అమిగోస్ ప్రొడక్షన్స్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు. కుబేర విజయంలోనూ లొకేషన్స్ పరంగా కీలకపాత్ర పోషించారు. ‘నేను జీవితంలో మంచి చెడు పంచుకునే మొదటి వ్యక్తి శేఖర్ గారు. ఆయనతో నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా’ అని చెబుతున్నారు నాగేశ్వర్రావు. ప్రస్తుతం అమిగోస్ ప్రొడక్షన్ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!) -
విన్నింగ్ కెప్టెన్ న్యూ కెప్టెన్
విమానంలో క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ కనిపించడం విశేషం కాకనొవచ్చు. అయితే ఈసారి మాత్రం విశేషంగా మారింది. ఇండిగో ఆహ్వానం మేరకు విమానంలోకి అడుగుపెట్టిన కపిల్దేవ్ కొత్తగా కెప్టెన్గా ప్రమోట్ అయిన ప్రియాంక యూనిఫామ్కు చారలపట్టి పిన్ చేశారు. ఈ ఫోటోని విమానయాన సంస్థ ఇండిగో ‘ఎక్స్’లో తన అఫీషియల్ ఎకౌంట్లో షేర్ చేసింది. ‘ఇది చిరస్మరణీయంగా గుర్తుండి పోయే సందర్భం. కెప్టెన్ కావడం అనేది చిన్న విషయమేమీ కాదు. ప్రియాంకకు తన విజయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునే మధుర జ్ఞాపకం’ ... ఇలాంటి కామెంట్లు ఇండిగో పోస్ట్లో కనిపిస్తాయి.‘చూడముచ్చటైన దృశ్యం. గోవా టు దిల్లీ ఫ్లైట్లో ఈ అపురూప దృశ్యాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది’ అని రాశారు అదే ఫ్టైట్లో ప్రయాణించిన ఒక యూజర్. ‘ఫ్రమ్ ఏ విన్నింగ్ కెప్టెన్ టు ఏ న్యూ కెప్టెన్’ అన్నారు ఒకరు. ‘కెప్టెన్ ప్రియాంక నేపథ్యం ఏమిటి? ఆ స్థాయికి రావడానికి పడిన కష్టాల గురించి రాసి ఉంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండేది’ అని రాశారు ఒక యూజర్. Becoming a Captain is no small feat and having Mr. Kapil Dev pin her stripes made Captain Priyanka’s achievement a moment she’ll always treasure. There’s indeed no better way to say Hello, Captain! #goIndiGo@therealkapildev pic.twitter.com/09tgA7cowR— IndiGo (@IndiGo6E) October 4, 2025(చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,179కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు పుంజుకొని 82,209 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్పిట్లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్పిట్లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్లోనే నరకం -
నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!
కొన్ని నెలల క్రితం వరకు నేను ఆన్లైన్లో గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు వెచ్చించి ఆడేవాడిని. అలా కొంత డబ్బులు పోగొట్టుకున్నాను మరికొంత సంపాదించాను. నాలుగు నెలల క్రితం సైబర్ కంప్లైంట్ కారణంగా నా బ్యాంక్ ఖాతా సీజ్ చేసినట్లు బ్యాంకు వారు తెలిపారు. అంతకు మించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. నా జీతం అదే ఖాతాలో డిపాజిట్ అవుతుంది. నేను పనిచేస్తున్న కంపెనీకి ఈ విషయం చెప్పి ఎకౌంటు మార్చమని అడుగుదామనుకుంటే... ఆ కేసు విషయం అందరికీ తెలిసి, నా ఉద్యోగం పోతుందనే భయంతో చెప్పలేకపోతున్నాను. నెల జీతం వస్తోంది కానీ విత్ డ్రా చేయలేని పరిస్థితి. బ్యాంకు వారిని సంప్రదించినప్పటికీ పరిష్కారం దిశగా సమాధానం ఇవ్వడం లేదు. నా ఉద్యోగానికి ఎటువంటి ముప్పు రాకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పగలరు.– కృష్ణ చైతన్య, హైదరాబాద్ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ చట్టం, 2025 ఇటీవలే అమలులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటిని రెగ్యులేట్ చేయడం, వ్యసనాలకు దారి తీయకుండా చేయటం, ఆన్లైన్ ఫైనాన్షియల్ మోసాలను అరికట్టటం, కుటుంబాలను– యువతను కూడా ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంచటం, దేశ ఖజానాకు భంగం కలిగించకుండా ఉండడం వంటివి ఈ చట్టం ముఖ్య ఉద్దేశాలు. ఈ చట్టం అమలులోకి రాకముందు చాలా ఉదంతాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో చాలా యాప్స్ ద్వారా ఆన్లైన్ మోసాలు జరిగాయి అని వేల సంఖ్యలో కంప్లైంట్లు ఇచ్చారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో వేల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు సీజ్ కూడా అయ్యాయి. బహుశా మీరు వాడిన బెట్టింగ్/గేమింగ్ యాప్ ఏదో ఒక నేరంలో ఉండి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో బ్యాంకు వారు కూడా ముందస్తు చర్యగా ఎకౌంటును సీజ్ చేయవచ్చు. అయితే అందుకు గల కారణాలను సదరు ఖాతాదారులకు ఇవ్వడం బ్యాంకు వారి బాధ్యత. ఇక దీని మూలంగా మీ ఉద్యోగానికి ఏదో జరిగిపోతుంది అనే కంగారు ప్రస్తుతానికి అవసరం లేదు. బ్యాంకు వారికి మీ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి గల కారణాలు అలాగే ఏదైనా పోలీసు వారు కానీ, మరి ఎవరైనా అధికారులుగానీ ఇచ్చిన ఆర్డర్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియజేయాలి అంటూ లిఖితపూర్వకంగా ఒక వినతిపత్రం ఇచ్చి అక్నాలెడ్జెమెంట్ తీసుకోండి. కుదరని పక్షంలో రిజిస్టర్డ్ ΄ోస్టు ద్వారా మీ దరఖాస్తును/వినతి పత్రాన్ని పంపవచ్చు. ఏదైనా పోలీసు కేసు వలన మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిందని తెలిస్తే, సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టు లో సి.ఆర్.పి.సి సెక్షన్ 457 ప్రకారం ఒక దరఖాస్తు చేసుకొని ఎకౌంటును డీ ఫ్రీజ్ చేయించుకోవచ్చు. లేకపోతే నేరుగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి కూడా మీ అకౌంటును డీ ఫ్రీజ్ చేయమని కోరవచ్చు. అలాంటి కంప్లైంట్ ఏమీ లేకుండా ఒకవేళ బ్యాంకు వారు ఫ్రీజ్ చేసినట్టు అయితే అది కేవలం కొంతకాలానికి మాత్రమే చెల్లుతుంది. నేరంలో భాగంగా ఉన్న సొమ్మును అలాగే ఎకౌంట్లో ఉంచి మిగతా అకౌంట్ లావాదేవీలను డీ ఫ్రీజ్ చేయాలి అని కోర్టు ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇకపోతే ఏదైనా ఎఫ్.ఐ.ఆర్.లో మీరు నిందారోపితుడు అయి ఉంటే తప్ప మీ ఉద్యోగానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఎందుకంటే మీరు నేరుగా ఎటువంటి నేరం చేయలేదు కాబట్టి. గేమ్స్ ఆడిన వారిపై ప్రస్తుతానికి శిక్షలు లేవు కనుక మీరు ఈ విషయాన్ని మీ కంపెనీ వారికి చెప్పినా ఏమీ కాదు. అయితే అలా చెప్పే ముందు సైబర్ కంప్లైంట్లో మీరు నిందారోపితుడుగా (అక్యూజ్డ్ గా) ఉన్నారేమో చూసుకోండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: Success Story: ఇంటి పనులకే పరిమితమైన స్థాయి నుంచి డీఎస్పీ రేంజ్కి..!) -
కరూర్ విషాద ఘటన.. విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..?
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26కు (Ashes Series) ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. కమిన్స్ జులైలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వెన్ను సంబంధిత గాయానికి గురయ్యాడు. ఈ గాయమే అతన్ని యాషెస్ సిరీస్కు దూరం చేసేలా కనిపిస్తుంది.సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. కమిన్స్ ఇటీవల గాయానికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. దీంతో నవంబర్ 21న పెర్త్లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ సమయానికి కమిన్స్ అందుబాటులో ఉండలేడు. పరిస్థితి చూస్తుంటే కమిన్స్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా ఉన్నాడన్నది సదరు నివేదిక సారాంశం.వాస్తవానికి కమిన్స్ ఈ సిరీస్ కోసమే గతకొంతకాలంగా క్రికెట్ మొత్తానికే దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆసీస్ ఆడిన ఏ ఫార్మాట్లోనూ అతను ఆడలేదు. త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.యాషెస్ సమయానికి పూర్తిగా ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో కమిన్స్ ఈ మధ్యలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తీరా చూస్తే అతని గాయం పూర్తిగా మానలేదని తెలుస్తుంది.ఒకవేళ కమిన్స్ యాషెస్కు పూర్తిగా దూరమైతే ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకుంది. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకు ప్రకటించారు. నవంబర్ 21-25 వరకు పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 4న రెండో టెస్ట్ (బ్రిస్బేన్), డిసెంబర్ 17న మూడో టెస్ట్ (అడిలైడ్), డిసెంబర్ 26న నాలుగో టెస్ట్ (మెల్బోర్న్), వచ్చే ఏడాది జనవరి 4న ఐదో టెస్ట్ (సిడ్నీ) మొదలవుతాయి.చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
అంబుడ్స్మన్ స్కీమ్ విస్తరణ
రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరిధిలోకి రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు చేరనున్నాయి. ఇందుకు 2021 ఏకీకృత అంబుడ్స్మన్ పథకం(ఐవోఎస్)లోకి వీటిని చేరుస్తూ ఆర్బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నవంబర్ 1నుంచి రూ.50 కోట్ల డిపాజిట్ పరిమాణంగల అన్ని వాణిజ్య బ్యాంకులతోపాటు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులు, నాన్షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులకు ఏకీకృత అంబుడ్స్మన్ స్కీమ్ వర్తించనుంది.కనీసం రూ. 100 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అన్ని నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లనూ పథకం కవర్ చేయనుంది. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఈ పథకం నుంచి మినహాయింపునివ్వగా.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను చేర్చింది. ఈ ఆర్బీఐ ఐవోఎస్ను 2021 నవంబర్లో ప్రవేశపెట్టింది. అంబుడ్స్మన్ అనేది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర నియంత్రిత సంస్థల వినియోగదారుల కోసం కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. క్రెడిట్ రిస్క్లో సవరణబ్యాంకుల క్రెడిట్ రిస్క్ నిబంధనలను సవరించేందుకు ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించింది. సంభవించిన నష్టాల ఆధారంగా ప్రొవిజనింగ్ చేపట్టేందుకు ప్రస్తుతం బ్యాంకులను ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. వీటిస్థానే అంచనా రుణ నష్టాల ఆధారిత ప్రొవిజనింగ్కు వీలు కల్పించే విధంగా ఆర్బీఐ నిబంధనల సవరణకు ప్రతిపాదించింది. తద్వారా క్రెడిట్ రిస్క్ నిర్వహణా విధానాలను మరింత పటిష్టం చేయనుంది. అంతేకాకుండా వివిధ ఫైనాన్షియల్ సంస్థలను పోల్చి చూడటంలో మరిన్ని అవకాశాలకు తెరతీయనుంది. 2025 ఆర్బీఐ మార్గదర్శకాలు పేరుతో అంతర్జాతీయంగా అనుమతించిన నిబంధనలు, అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తాజా ముసాయిదాను రూపొందించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, దేశవ్యాప్త ఫైనాన్షియల్ సంస్థలు– అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ అండ్ ఇన్కమ్ రికగ్నిషన్ పేరుతో ముసాయిదాను విడుదల చేసింది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
'డ్రాగన్' తెచ్చిన లక్.. కాయదు లోహర్కి మరో ఛాన్స్!
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ 'అల్లూరి' అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన 'డ్రాగన్'.. ఈమె కెరీర్ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది 'మదగజరాజా' వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్గా కాయదు లోహర్ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. నేను ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి) -
కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
‘ఒరిగిందేం లేదు..’ ట్రంప్ టారిఫ్లకు గీతా గోపినాథ్ నెగెటివ్ మార్క్
ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్.. ట్రంప్ సుంకాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాటి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారామె. పైగా ఈ 6 నెలల కాలంలో టారిఫ్లు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని తేల్చేశారామె(Gita Gopinath On Trump Tariffs).ప్రపంచంలోనే అత్యధికంగా.. భారత్, బ్రెజిల్పై 50 శాతం సుంకాలను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే.. బ్రాండెడ్ ఔషధాలపైనా 100 శాతం టారిఫ్లు విధించారు. వీటితో పాటు చాలా రంగాలపై సుంకాలు విధించారు.. ఇంకా విధించుకుంటూ పోతున్నారు. అయితే.. లిబరేషన్ డే పేరిట ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టి(Liberation Day Tariffs) ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంలో హార్వార్డ్ యూనివర్సిటీ ఎకనామిక్ ఫ్రొపెసర్ గీతా గోపినాథ్ స్పందించారు. ట్రంప్ సుంకాలను నెగటివ్ స్కోర్కార్డ్గా అభివర్ణిస్తూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం కాకుండా నష్టం కలిగించాయని అన్నారామె. ఈ టారిఫ్లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినప్పటికీ.. ‘పన్నుల్లా’ వాటి భారం అమెరికా కంపెనీలు, వినియోగదారులపై పడిందని ఆమె అన్నారు. టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణాన్ని స్వల్పంగా పెరిగినప్పటికీ.. గృహోపకరణ వస్తువులు, ఫర్నిచర్, కాఫీ వంటి వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైందని.. ఇది మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం చూపినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి.. తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందలేదు. అలాగే, వాణిజ్య లోటు తగ్గిన సంకేతాలు కూడా లేవు. టారిఫ్లతో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు అని ఆమె తేల్చేశారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం, విదేశీ పోటీని తట్టుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడమే లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకోవడం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వలేదని IMF మాజీ అధికారి అభిప్రాయపడటం గమనార్హం.It is 6 months since "Liberation day" tariffs. What have US tariffs accomplished?1. Raise revenue for government? Yes. Quite substantially. Borne almost entirely by US firms and passed on some to US consumers. So it has worked like a tax on US firms/consumers. 2. Raise… pic.twitter.com/KZG3UgKB3S— Gita Gopinath (@GitaGopinath) October 6, 2025 గీతా గోపినాథ్(53) భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణురాలు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో IMF చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులై, 2022లో ఆ సంస్థకు తొలి డిప్యూటీ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. 2025లో IMF పదవిని వీడి.. హార్వర్డ్లో తిరిగి ప్రొఫెసర్గా చేరారు.ఇదీ చదవండి: క్వాంటమ్ మెకానిక్స్కు ఎట్టకేలకు గుర్తింపు -
వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదు
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో బండమైసమ్మ కమ్యూనిటీ హాల్ లో కిరాణా షాప్ ఓనర్లకు "వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019", "ఆహార భద్రత చట్టం 2006", "తూనికలు కొలతల చట్టం 2011", ప్రకారం కొనుగోలు విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులను, షాపు నిర్వాహకులు వాటిని ఉల్లంఘిస్తే విధించే శిక్షలు మరియు జరిమానాలు గురించి కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ బస్తీలలో, కాలనీలలోనీ కిరాణా షాప్ యజమానులకు ప్రభుత్వ అధికారులు ఏరియా ఫుడ్ సేఫ్టీ అధికారి GHMC నుంచి సాహితీ గారు, తూనికలు కొలతల శాఖ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, FSSAI నుంచి డిప్యూటీ ఫుడ్ కంట్రోలర Rtd T.విజయ్ కుమార్ గార్ల సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.చిన్న పిల్లలు తినే తిను పదార్థాలు నుంచి వంట సరుకుల వరకు నాసిరకం ఉత్పత్తి మరియు వాటి అమ్మకాలు ఎక్కువైనందున కిరాణా షాప్ యజమానులకు షాప్ లో అమ్ముతున్నటువంటి సరుకుల అమ్మకాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతలు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు గారు మాట్లాడుతూ చుట్టుపక్కల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు వినియోగదారుల ఆరోగ్యం కోసం ఆలోచించాలని కోరారు.పిల్లలు క్రమం తప్పకుండా నాసిరకం లేదా తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకుంటే, తగినంత పోషకాహారం లేకపోవడం మరియు హానికరమైన పదార్థాల కారణంగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఆది వారి శారీరక మరియు మానసిక అభివృద్ధి పై ప్రభావం చూపుతూ తక్షణ సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధులు గా మారతాయి అని తెలిపారు, గత నెల నుంచి మేము నిర్వహించిన సర్వేలో నాసిరకం అమ్మకాలు ప్రతి షాప్ లో జరుగుతున్నాయని తేలింది, ముఖ్యంగా యజమానులకు అవగాహన లేకపోవడం కారణంగా భావించి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం ఏ షాప్ లో అయినా సరే ఫుడ్ సేఫ్టీ (FSSAI) లైసెన్స్ లేని తిను పదార్థాలు, వంట సర్కులు, లేబుల్(Declaration) లేని ప్యాక్ చేసిన తిను పదార్థాలు, వంట సర్కులు, తయారీదారుని పూర్తి వివరాలు లేని తిను పదార్థాలు, వంట సర్కులు అమ్మడం కనిపిస్తే సంస్థ తరపున మేమే కంప్లైంట్ చేసి శిక్ష పడేలా చేస్తామని అనరు, అలాగే వయింగ్ మిషన్లో హెచ్చుతగ్గులు ఉండడం కొన్న వస్తువులకు వినియోగదారుడు బిల్లు అడిగితే ఇవ్వకపోవడం లాంటివి చేయదని కోరారు, ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యుడు ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ యుద్దీన్ నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సంస్థ సబ్యులు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భారత్తో భాగస్వామ్యంపై ఖతార్ కంపెనీల్లో ఆసక్తి
భారత కంపెనీలతో భాగస్వామ్యానికి ఖతార్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, ఇతర దేశాల్లో ప్రాజెక్టులను భారత కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్క రోజు పర్యటన కోసం వ్యాపార ప్రతినిధి బృందంతో మంత్రి గోయల్ ఖతార్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.ఖతార్కు చెందిన ఆల్ బలఘ్ ఎల్అండ్టీ భాగస్వామిగా ఉందన్న ఉదాహరణను ప్రస్తావించారు. ఈ ఇరు సంస్థలు కలసి ఖతార్లో ప్రాజెక్టులను పూర్తి చేశాయని, ఇతర దేశాల్లోనూ సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఖతార్ ప్రభుత్వం మూడో పక్ష దేశాల్లో ప్రాజెక్టులపై దృష్టి పెట్టిందని, ఇదే విషయాన్ని తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఖతారీ డెవలప్మెంట్బ్యాంక్ నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కనుక భారత కంపెనీలు ఈ అవశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖతార్తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25లో 14.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.అమెరికాతో ఒప్పందంపై చర్చలుప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికా–భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నవంబర్ చివరికి చర్చలు ముగించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని అవకాశాలున్నట్టు చెప్పారు. తదుపరి విడత చర్చలు భౌతికంగా జరిగేందుకు ఉన్న అవకాశాలను తోసిపుచ్చలేదు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ షట్డౌన్ (మూసివేత)ను ఎదుర్కొంటున్నందున, తదుపరి దశ చర్చలు ఎలా, ఎక్కడ నిర్వహించేదీ చూడాల్సి ఉందన్నారు. నిధుల మంజూరునకు కాంగ్రెస్ ఆమోదం పొందలేకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ
హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గానే రష్మికతో నిశ్చితార్థం చేసుకున్నాడని టాక్. ఇది నిజమే అయినప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే విజయ్.. తల్లి, తమ్ముడు ఆనంద్తో కలిసి పుట్టపర్తి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఒకటి రెండు ఫొటోలతో ఈ విషయం కూడా బయటపడింది. అయితే ఇప్పుడు ఆ ట్రిప్ వీడియోని స్వయంగా విజయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.పుట్టపర్తి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ.. తను మొదట చేరిన '1ఏ' క్లాస్ రూమ్.. వేదాలు, మంత్రాలు, భజనలు నేర్చుకున్న మందిరం.. గతంలో తనలా ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు... నా రూమ్ బీ-13 మధ్యలో కప్ బోర్డ్ నాదే.. మమ్మల్ని సక్రమమైన దారిలో నడిపించిన సార్స్.. అంటూ 20 ఏళ్ల తన జ్ఞాపకాల్ని వీడియో రూపంలో పొందుపరిచి ఇన్ స్టాలో వీడియోగా పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి)విజయ్ దేవరకొండ ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సడన్గా పుట్టపర్తి దర్శనం చేసుకోవాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు అయితే లేదు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాడంటే కచ్చితంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సాయిబాబా ఆశీర్వదాలు తీసుకోవడానికేనని రౌడీ హీరో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అయితే పుట్టపర్తి దర్శనానంతరం.. విజయ్ ప్రయాణిస్తున్న కారు ఓ చోట ప్రమాదానికి గురైంది. అయితే ఈ యాక్సిడెంట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: 80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం
27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక నిన్న (అక్టోబర్ 7) ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు ఈ వేడుకలో పురస్కారాలు లభించాయి. ఈ వేడుకలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత రోహిత్కు ఇది మొదటి పబ్లిక్ అప్పియరెన్స్.ROHIT SHARMA - THE LEADER 🐐 Ro received the Special award from CEAT for winning the Champions Trophy. pic.twitter.com/ad5GbSdAZG— Johns. (@CricCrazyJohns) October 7, 2025ఈ వేడుకలో రోహిత్కు ఓ ప్రత్యేక అవార్డు లభించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించినందుకుగానూ అతన్ని ఈ అవార్డు వరించింది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ ఇది. 2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. రోహిత్కు ఈ అవార్డును భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అందజేశారు.ఈసారి CCR అవార్డులను మెజార్టీ శాతం భారత క్రికెటర్లే గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మను కాదని సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.ఇటీవలికాలంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్కు (Shreyas Iyer) ఓ ప్రత్యేక అవార్డు ఇచ్చారు. CEAT JioStar అవార్డుతో అతన్ని సత్కరించారు.మహిళల విభాగంలోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. స్మృతి మంధన, దీప్తి శర్మ బెస్ట్ బ్యాటర్, బౌలర్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే, వారు ఈ అవార్డులను అందుకునేందుకు రాలేకపోయారు. ప్రస్తుతం వారు వన్డే వరల్డ్కప్లో బిజీగా ఉన్నారు.విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జో రూట్కు అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కేన్ విలియమ్సన్కు వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. హ్యారీ బ్రూక్కు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఇటీవల సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్టిన టెంబా బవుమాకు బెస్ట్ కెప్టెన్ అవార్డు లభించింది. బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.విజేతల పూర్తి జాబితా:ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి గుర్తుగా ప్రత్యేక అవార్డు- రోహిత్ శర్మలైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- బ్రియాన్ లారా అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- జో రూట్ T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- సంజు శాంసన్T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్- వరుణ్ చక్రవర్తిCEAT JioStar అవార్డు- శ్రేయస్ అయ్యర్ODI బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- కేన్ విలియమ్సన్ODI బౌలర్ ఆఫ్ ది ఇయర్- మ్యాట్ హెన్రీCEAT లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- B.S.చంద్రశేఖర్మహిళల బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- స్మృతి మంధనమహిళల బౌలర్ ఆఫ్ ది ఇయర్- దీప్తి శర్మఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- అంగ్రిష్ రఘువంశీఉదాత్త నాయకత్వ అవార్డు- టెంబా బవుమాటెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్- ప్రభాత్ జయసూర్యటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హ్యారీ బ్రూక్డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హర్ష్ దూబేచదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్ -
బజాజ్ అలయెంజ్ పేరు మార్పు
డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ తాజాగా బీమా రంగ భాగస్వామ్య సంస్థలను రీబ్రాండింగ్ చేసింది. దీంతో ఇకపై బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్.. బజాజ్ జనరల్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్గా సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది మొదట్లో రెండు సంస్థలలోనూ భాగస్వామ్య కంపెనీ అలయెంజ్ ఎస్ఈకి గల 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బజాజ్ గ్రూప్ ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకుంది.ఈ ఒప్పందాన్ని అమలు చేయడంతో వీటిలో బజాజ్ గ్రూప్ వాటా ప్రస్తుతం 74 శాతం నుంచి 100 శాతానికి చేరనుంది. ఎస్పీఏకు అన్ని రకాల అనుమతులు లభించడంతో రెండు సంస్థలూ బజాజ్ గ్రూప్నకు పూర్తి అనుబంధ సంస్థలుగా అవతరించనున్నాయి. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బజాజ్ గ్రూప్ తొలుత వీటిలో కనీసం 6.1 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేయవలసి ఉంటుంది. దీంతో అలయెంజ్ ప్రమోటర్ గుర్తింపును కోల్పోవడం ద్వారా ఇన్వెస్టర్గా మారనుంది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
ఆవిష్కరణలను అణగదొక్కేలా నిబంధనలు ఉండకూడదు..
నిబంధనలు, నియంత్రణలనేవి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప అణగదొక్కేలా ఉండకూడదని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వాటిని అణగదొక్కే పరిస్థితి ఉంటే ఇంకో దగ్గరెక్కడో ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణలనేవి సంస్థ ప్రాతిపదికగా కాకుండా కార్యకలాపాల ప్రాతిపదికన ఉండాలని సుబ్రహ్మణ్యం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.‘ఒకవేళ నేను బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, నన్ను బ్యాంకరుగా పరిగణించి, దానికి తగ్గ నిబంధనలు వర్తింపచేయాలి. అదే ఏదైనా ఫండ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, బ్యాంకరుగా కాకుండా ఫండ్ డిస్ట్రిబ్యూటరు నిబంధనలను వర్తింపచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా విధానంపై ఆర్థిక శాఖ, నియంత్రణ సంస్థలు లోతుగా చర్చిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, జీఎస్టీ 2.0 తర్వాత, దీపావళికన్నా ముందే మరో విడత సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సారథ్యంలోని కమిటీ ఇప్పటికే వీటికి సంబంధించిన నివేదికల తొలి సెట్ను సమర్పించినట్లు పేర్కొన్నారు. పొరుగుదేశాలతో పటిష్ట సంబంధాలు ఉండాలి..చైనాతో పాటు ఇతర పొరుగు దేశాలతో భారత్కి పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఉండాలని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మొత్తం యూరోపియన్ యూనియన్ వాణిజ్యంలో 50 శాతం భాగం.. అంతర్గతంగా ఆయా దేశాల మధ్యే జరుగుతుందని ఆయన చెప్పారు. భారత్ విషయానికొస్తే బంగ్లాదేశ్ 6వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగాను, టాప్ 10లో నేపాల్ ఉండేదని తెలిపారు. చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేస్తారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, భారత్కి ఆ దేశం కీలక సరఫరాదారని సుబ్రహ్మణ్యం చెప్పారు. 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని విస్మరించజాలమని పేర్కొన్నారు. అలాంటి దేశానికి మరింతగా విక్రయించలేకపోతే అర్థరహితమైన విషయం అవుతుందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
నేడే నవీ ముంబై విమానాశ్రయం ప్రారంభం
దాదాపు రూ.19,650 కోట్లతో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం) ప్రారంభించనున్నారు. ముంబైకి కనెక్టివిటీని పెంచేందుకు, ప్రస్తుత విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని గ్లోబల్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఐఏటీఏ తెలిపింది. దీనితో భారత ఎకానమీకి కూడా గణనీయంగా లబ్ధి చేకూరుతుందని వివరించింది.భారత ఏవియేషన్ ప్రస్తానంలో నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఐఏటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ (ఏషియా–పసిఫిక్) షెల్డన్ హీ తెలిపారు. తొలి దశలో ఏటా 2 కోట్ల మంది ప్యాసింజర్ల హ్యాండ్లింగ్ సామర్థ్యంతో, ఎయిర్పోర్టులో ఒక టర్మినల్, ఒక రన్వే ఉంటాయి. దేశీయంగా మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాక్సీతో కనెక్ట్ అయిన విమానాశ్రయం ఇదే అవుతుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
కేంద్రం చెంతకు పంచాయితీ!
బోర్డు నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలతో టాటా ట్రస్ట్స్లో అంతర్గతంగా ఆధిపత్య పోరు నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డేరియస్ ఖంబట్టా కూడా ఉన్నారు.ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్నకు చాలా ప్రాధాన్యమున్న నేపథ్యంలో దాని పూర్తి నియంత్రణను ఏ ఒక్కరి చేతికో ఇవ్వడం శ్రేయస్కరమేనా కాదా అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలుగా మారిందని వివరించాయి. టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు టాటా సన్స్పైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి.రెండు వర్గాలుగా ట్రస్టీలు..156 ఏళ్ల దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ గొడుగు కింద 30 లిస్టెడ్ కంపెనీలతో పాటు 400 కంపెనీలు ఉన్నాయి. దీనిపై గణనీయంగా ప్రభావం చూపే.. టాటా ట్రస్ట్స్కి టాటా సన్స్లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్ బోర్డులో నియామకాలు, గవర్నెన్స్ అంశాల మీద వివాదం నెలకొంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టరుగా మాజీ డిఫెన్స్ కార్యదర్శి విజయ్ సింగ్ పునర్నియామకం కోసం సెప్టెంబర్ 11న జరిగిన ఆరుగురు ట్రస్టీల సమావేశంలో దీనికి బీజం పడింది. విజయ్ పేరును ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ ప్రతిపాదించగా, నలుగురు ట్రస్టీలు (మెహ్లి మిస్త్రీ, ప్రమిత్ ఝవేరీ, జహంగీర్ హెచ్సీ జహంగీర్, డేరియస్ ఖంబట్టా) వ్యతిరేకించారు. తదుపరి మెహ్లీ మిస్త్రీని నామినేట్ చేయాలంటూ ఆయన తరఫున ఉన్న నలుగురు ట్రస్టీలు ప్రతిపాదించగా, టాటా గ్రూప్ విలువలను ప్రస్తావిస్తూ దాన్ని నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ వ్యతిరేకించారు. దీనితో విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలికీలకమైన నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారంటూ మెహ్లీ మిస్త్రీ భావిస్తుండగా, ఆయన సారథ్యంలోని ట్రస్టీలంతా కలిసి.. ట్రస్ట్స్లో నోయెల్ టాటా ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గ్రూప్లో కొందరు భావిస్తున్నారు. టాటా సన్స్లో 18.37 శాతం వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి మెహ్లీ మిస్త్రీకి బంధుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం పోరు నడుమ ట్రస్టీలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు మరోసారి సమావేశం కానుండగా, అజెండా వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై టాటా ట్రస్ట్ టాటా సన్స్, వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్లో అత్యున్నత స్థాయిలో కొన్నాళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పటి గౌరవ చైర్మన్ రతన్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి చివరికి మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. ప్రస్తుతం రతన్ టాటా, మిస్త్రీ.. ఇద్దరూ మరణించారు. -
రాయదుర్గం ‘రియల్’ సంచలనం.. సొంతింటి కల దూరమేనా?
సాక్షి, సిటీబ్యూరో: ఎకరం రూ.177 కోట్లు.. దుర్గం చెరువు పక్కనే ఉన్న కొండపై ఉన్న భూమి ధర ఇదీ. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేటలోని నియోపొలిస్ వేలంలో ఎకరా రూ.100.75 కోట్లు పలికిన ధరే అందర్నీ షాక్కు గురి చేయగా.. సోమవారం టీజీఐసీసీ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టించింది. పశ్చిమ హైదరాబాద్లోని బహుళ అంతస్తుల భవనాలే కాదు.. అక్కడి భూముల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని రియల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో భూమి బంగారం కంటే ఖరీదైపోయింది. కొండలే కోట్లకు కోట్లు ధర పలుకుతున్నాయి. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ (టీజీఐఐసీ) నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబరు 83/1 ప్లాట్ నంబరు–19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు–15ఏ/2లో 7.67 ఎకరాలు మొత్తం 18.67 ఎకరాలను వేలం వేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.3,135 కోట్ల ఆదాయం సమకూరింది. స్థానిక బిల్డర్లతో పాటు జాతీయ నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ధర రికార్డు స్థాయిని దాటేలా చేశారు. ఈ పరిణామాలు మార్కెట్లో సంచలనంగా మారాయి. హైదరాబాద్ మార్కెట్కు ఇంకా భవిష్యత్తు ఉందని, డిమాండ్ తగ్గలేదని మార్కెట్ పడిపోలేదు అనడానికి ఈ వేలమే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సొంతింటి కల దూరమేనా..? భూముల వేలంలో వేలంవెర్రిగా ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల ప్రభావం చుట్టుపక్కల భూములు, అపార్ట్మెంట్లపై ఉంటుంది. దీంతో హైదరాబాద్కు ఉన్న అఫర్డబులిటీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్ అనగానే సరసమైన ఇళ్లకు కేంద్రమని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా చెబు తూ వస్తున్నాయి. వేలంలో రికార్డ్ ధరలు పలుకుతుండటంతో భూముల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతంలోని అపార్ట్మెంట్ల ధరలు పెరగక తప్పని పరిస్థితి. సామాన్యుడికి ఇంటి కల దూరమవుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎకరం భూమి రూ.177 కోట్లు పలకడంతో సంపన్నులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకింత ధర? రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. ఐటీ కారిడార్లో ఉండటంతో గృహ నిర్మాణం, కార్యాలయాలకు అనువుగా ఉంది. భవనం ఎత్తుపై ఆంక్షలు లేకుండా అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు అవకాశం ఉండటంతో బిల్డర్లు ధరకు వెనకాడలేదు. వీటి దృష్ట్యా వేలంలో కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. 470 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలున్నాయి.బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్రోడ్డు, మెట్రో, విమానాశ్రయాలతో నగరం నలువైపులా సులువైన కనెక్టివిటీ ఉంది. రాయదుర్గం మెట్రో స్టేషన్కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్/విప్రో జంక్షన్కు, హెచ్ఐసీసీ/హైటెక్స్కు 15 నిమిషాలు, ఎయిర్పోర్ట్కు 40 నిమిషాలు ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. -
Bihar Election: ఎన్డీయేకు కొత్త తలనొప్పి?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి(Bihar Assembly Election 2025). అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే ఓ అవగాహన కుదిరింది. చెరో 100–102 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే.. 243 స్థానాల్లో 204–205 సీట్లలో ఈ రెండు పార్టీలే పోటీ చేయనుండగా.. మిగతా సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి(NDA Bihar Seat Sharing). బిహార్ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఇంఛార్జి వినోద్ తావ్డేలు బుధవారం లోక్జనశక్తి పార్టీ(LJP రామ్ విలాస్) నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్(chirag paswan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు.. లోక్జనశక్తి పార్టీ(LJP)కి 25 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే.. చిరాగ్ ఆ ఆఫర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్జేపీకి 40 స్థానాలు డిమాండ్ చేస్తూ.. ఆయన అంతకు మించి ఒక్క సీటు తగ్గినా ఊరుకునేది లేదని చెప్పినట్లు సమాచారం. తాము కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆయన ఎన్డీయే పెద్దలకు అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. 2024 లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన విజయంతో.. తన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందనే భావనలో చిరాగ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పైగా బీహార్లో గౌరవప్రదమైన సీట్లు.. కేంద్ర కేబినెట్ పదవికి మించినవని భావిస్తున్నారు. ఈ తరుణంలో.. ఎన్డీఏలో ప్రాధాన్యం లేని తరుణంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీతో పొత్తు కోసం చిరాగ్ ప్రయత్నిస్తున్నారన్న కథనాలు.. బీహార్లో రాజకీయ కలకలం సృష్టించాయి. అయితే.. చిరాగ్ పార్టీకి చెందిన ఎంపీ శాంభవి చౌద్రి మాత్రం పరోక్షంగా ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎన్డీయే కూటమి తిరిగి బీహార్లో అధికారంలో చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో బ్లాక్మెయిల్ ద్వారా సీట్లు సాధించుకోవాలని చిరాగ్ చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే.. చిరాగ్ నేతృత్వంలోని LJP (RV)కి బీహార్లో దళిత ఓటు బ్యాంక్ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు 2020 ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన చిరాగ్ ఎల్జేపీ.. జేడీయూకి నష్టం కలిగించింది. అంటే.. చిరాగ్ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఎన్డీయేపై ప్రభావం చూపెడుతుందన్నమాట. దీంతో బీజేపీ ఈ విషయాన్నింటిని పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయనతో చర్చలు జరుపుతోంది. మిగతా పార్టీలోని జితన్ రామ్ మాంజీ హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు 7, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)కి 6 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయితే ఆ రెండు పార్టీలు కూడా డబుల్ డిజిట్ సీట్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై మరో మూడు, నాలుగు రోజుల పాటు వరుసగా చర్చలు కొనసాగనున్నాయి. మిత్రపక్షాలకు సీట్లు తగ్గితే రాజ్యసభ, శాసనమండలి సీట్ల ఆఫర్లతో వాటిని భర్తీ చేయవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నా.. అందుకు వాటిని ఒప్పించడం బీజేపీపై కత్తి మీద సాములాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇదీ చదవండి: ప్చ్.. నితీశ్కు మెట్రో కలిసొచ్చేనా? -
హైవేపై ట్రక్కులు ఢీ.. సిలిండర్లు పేలుళ్ల ధాటికి మంటలు..
జైపూర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో హైవేపై భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జైపూర్-అజ్మేర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఎల్పీజీ సిలిండర్లను తీసుకువెళ్తున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. కారణంగా సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు ఎగిసిపడుతుండంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.Huge Fire on Jaipur-Ajmer Highway! 🚨Gas tanker overturns near Sawarada Puliya, Dudu, causing a massive blaze. 😱 Praying for safety & recovery. 🙏 Stay safe, everyone! 💪 #JaipurAjmerHighway #Emergency🔥 RT to spread the word! 🔔 pic.twitter.com/y9cnSEqvjG— Pramod Kumar Saxena (@PramodKuma79446) October 7, 2025మరోవైపు.. ఈ ప్రమాద ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వాను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెండు ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. VIDEO | A truck carrying LPG cylinders caught fire following a collision with a tanker on the Jaipur-Ajmer highway on Tuesday night. Deputy CM Premchand Bairwa (@DrPremBairwa) said, "A truck hit a stationary vehicle. The situation is under control now. One casualty has been… pic.twitter.com/nHzKbyK7OM— Press Trust of India (@PTI_News) October 8, 2025 Big Breaking 🚨🚨 on the Jaipur-Ajmer highway a massive fire broke out near the Sawarda culvert in the Mauzamabad area, after a vehicle allegedly hit a truck loaded with gas cylinders.Watch video 📷 pic.twitter.com/7P35AI3B2j— Globally Pop (@GloballyPop) October 7, 2025 -
ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్
అంతర్జాతీయ క్రికెట్కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది.ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ బ్యాటింగ్ యువ కెరటం లూసీ లైల్స్తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్గా కనిపించారు. లూసీతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బ్రూక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్ 18 నుంచి ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తుంది.అబ్రార్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్ స్పిన్నర్ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వీ సహా పలువురు పాక్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్-2025లో నఖ్వీకి, పాక్ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్ రిసెప్షన్కు ప్రాధాన్యత సంతరించుకుంది.తాజాగా ముగిసిన ఆసియా కప్లో భారత్ పాక్ను ఫైనల్ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా పాక్పై ఘన విజయం సాధించింది. చదవండి: స్వల్ప స్కోర్కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..! -
నల్లగొండ: హాలియా ఎస్బీఐలో అగ్నిప్రమాదం.. ఆన్లో ఉన్న కంప్యూటర్ వల్లే!
సాక్షి, నల్లగొండ: హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది(Haliya SBI Fire Accident). అయితే స్థానికంగా ఒకరు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం కూడా తప్పింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు.హాలియా ఎస్బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్మెంట్ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి బూడిద అయ్యాయి. ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్(Computer Short Circuit) జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి. అంతకంతకు పెరిగి బ్యాంకును దగ్ధం చేశాయి’’ అని అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రేషన్ కార్డులు.. అందరికీ కాదు! -
నకిలీ మద్యం కేసు: నాగరాజు అరెస్ట్.. సీఐ హిమబిందుపై వేటు
ములకలచెరువు/మదనపల్లె/గన్నవరం/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన వారి సంఖ్య 14 మంది. తొలిరోజు 10 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురిలో కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, విదేశాల్లో ఉన్న జనార్దనరావు అరెస్ట్ కావాల్సి ఉంది. ఇదే కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఆ ఏడుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. కాగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన కల్తీ మద్యం తయారీ కేసులో మద్యం నింపేందుకు ఖాళీ బాటిళ్లను సరఫరా చేసిన సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్కు చెందిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మద్యం నింపేందుకు వినియోగించిన 90 ఎంఎల్ (క్వార్టర్) ఖాళీ బాటిళ్లను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్లోని శ్రీనివాస పెట్ బాటిల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మంగళవారం ఆ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు కంపెనీ నిర్వాహకుడైన గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులకు 17 వరకు రిమాండ్ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసిన ముగ్గురికి కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాధల్ దాస్, ప్రతాప్దాస్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం 6వ ఎంఎం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా, ముగ్గురికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.అధికార పార్టీ నేతల్ని వదిలేసి.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు మదనపల్లె: అధికార పార్టీ పెద్దల అండదండలతో సాగిన నకిలీ మద్యం దందాలో అసలైన సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి ఎక్సైజ్ అధికారిపై వేటు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ దందా నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ హిమబిందును విజయవాడ కమిషనరేట్కు బదిలీ చేశారు. ఇప్పుడు వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఎక్కడో అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తుంటేనే దాడులు చేసే ఎక్సైజ్ అధికారులకు ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గురించి తెలియక పోవడం విడ్డూరం అని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అందరిపై అన్ని విధాలా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం, బెల్డ్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు.. ఇలా ఇన్ని జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలుపుతోంది. -
తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్ మీడియాలో(Social Media Reels) హల్చల్ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్లో చెప్పుకొచ్చారు.చూశారా తమ్ముళ్లు మన మంచి ప్రభుత్వంలో తిరుమలలో కూడ రీల్స్ చేసుకునే సదుపాయం కల్పించాం pic.twitter.com/ZHj0oJyGq8— Ꮩᴀʀsʜᴀ Ꭱᴇᴅᴅʏ 🐬 (@YSvarshareddy) October 6, 2025గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో సోషల్ మీడియా రీల్స్ చేయించడం పై శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/8bUxzZ8W62— TOVINO𓃵 (@Vamos_Rafa23) October 7, 2025 -
‘ఏదో సరదాగా అన్నంత మాత్రాన..’: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు. ‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే! -
స్వల్ప స్కోర్కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (India U19 vs Australia U19) తొలిసారి బ్యాటింగ్లో తడబడింది. మెక్కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వరుసగా 26, 25, 22, 20 పరుగులు స్కోర్ చేశారు. ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్వల్ప స్కోర్కే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించడం విశేషం.ఆసీస్కు సంతోషం ఎంతో సేపు మిగల్చలేదుదీనికి తోడు స్వల్ప లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత పేసర్ హెనిల్ పటేల్ రెండో ఓవర్లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. హెనిల్ రెండో ఓవర్లో వరుసగా తొలి, రెండో బంతులకు సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్లను పెవిలియన్కు పంపాడు. ఆసీస్ అప్పటికి ఖాతా కూడా తెరవలేదు. 2 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 0/2గా ఉంది.అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్లోనూ చెలరేగడంతో ఆసీస్ 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
బాబోయే ఇదేం ట్రాఫిక్!
బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం సహజమే. కానీ, జాతీయ రహదారిల్లో.. అదీ నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?(Massive Traffic Jam). ఇదేదో సమ్మెలో భాగం జరిగిందనుకుంటే మీరు పొరపడినట్లే!!. బీహార్లోని ఔరంగాబాద్-రోహ్తాస్ మధ్య ఢిల్లీ-కోల్కతా జాతీయ రహదారిపై(Delhi Kolkata Highway) గత నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. వందలాది వాహనాలు బంపర్-టు-బంపర్గా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం గత శుక్రవారం రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు. భారీ వర్షాల కారణంగా.. జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లు నీటితో మునిగిపోయాయి. అధికార యంత్రాగం సమన్వయం లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI), రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అక్కడ ఆగిపోయిన డ్రైవర్లు చెబుతున్నారు. ‘‘30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగాం. టోల్, రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాం కదా. అయినా ఎవరూ సహాయం చేయరా?’’అని ప్రవీణ్ సింగ్ అనే ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో డ్రైవర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “రెండు రోజులుగా ట్రాఫిక్లోనే ఉన్నాం. ఆకలితో, దాహంతో బాధపడుతున్నాం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికే గంటల సమయం పడుతోంది” వాపోయాడు.ఇదిలా ఉంటే.. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకెళ్తున్న డ్రైవర్లు అవి పాడైపోతాయని చెబుతున్నారు. ఇంకోవైపు.. అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఈ ట్రాఫిక్తో ప్రభావితం అయ్యాయి. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మ ఈ ట్రాఫిక్ సమస్యపై స్పందించేందుకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా?(World Worst Traffic Jam Incident).. అధికారిక గణాంకాలేవీ లేకపోయినా.. 2010లో చైనా దేశంలోని బీజింగ్-టిబెట్ ఎక్స్ప్రెస్వే (National Highway 110) పై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా గుర్తించబడింది. మంగోలియా ప్రాంతం నుండి బీజింగ్కు బొగ్గు తీసుకెళ్తున్న వేలాది ట్రక్కులు రహదారిపై నిలిచిపోవడంతో.. బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 26 వరకు 12 రోజుల పాటు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి.. ప్రజలు అవస్థలు పడ్డారు.ఇదీ చదవండి: సౌర తుపానుతో మనిషికి ముప్పేనా? -
నా భార్య నాగిని!
సీతాపూర్ (యూపీ): అక్టోబర్ 4వ తేదీ.. అది జిల్లా కలెక్టర్ కార్యాలయం. ‘ప్రజా సమస్యల పరిష్కార దినం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభి షేక్ ఆనంద్ కక్షిదారుల నుంచి వినతు లు స్వీకరిస్తున్నారు. అప్పుడే ఓ తమా షా జరిగింది.. మహమూదాబాద్ తహ సీల్లోని లోధాసా గ్రామానికి చెందిన మీరాజ్ కూడా కలెక్టర్ను కలిశాడు. ఆ యన చెప్పింది విన్న కలెక్టర్ తేరుకోవ డానికి చాలా సమయం పట్టింది.‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్.. స్. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్... స్... అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్ బావురు మన్నాడు.పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు.అతను చెప్పింది విన్న కలెక్టర్ మొదట అవాక్కయినా.. తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు. -
బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బలంగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. పదు నెక్కిన తీర్మానాలు రచించాలి. ఇదేదో ఒక్కరిద్దరి కోసం కాదు. యావత్తు తెలంగాణ బీసీల భవిష్యత్ అని గుర్తించా లి. ప్రతి ఒక్కరు యుద్ధవీరులు కావాలి. ఇప్పటి వరకు ఇతరుల కోసం పోరాటాలు చేశాం. ఇప్పుడు మన కోసం పోరాటాలు చేయక తప్పదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరు కదలివస్తేనే మన హక్కులను సాధించుకుంటాం. భూకంపం సృష్టిస్తేనే.. ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇవ్వా ల్సిన బీజేపీ ఇవ్వడం లేదు.పోరాడాల్సిన కాంగ్రెస్ పోరాటం చేయడం లేదు. నిరసనలు చేస్తామన్న బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. కేవలం బీసీల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలు చేస్తున్నాయి. అన్నీ ఉన్న మనం మన రిజర్వేషన్లు ఎందుకు సాధించుకోలేకపోతున్నాం. ఇదే చిట్ట చివరి అవకాశం. ఒక తెలంగాణ కోసం పోరాటం చేస్తేనే ఇన్ని వచ్చాయి. రిజర్వేషన్లు అమలైతే దానికి రెట్టింపు ఫలితాలు పొందుతాం అని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కోరింది. మంగళవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లు– న్యాయ వివాదాలు పరిష్కారం’పై బీసీ సంఘాల సమాలోచన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, జాతీయ ఓబీసీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వ రయ్యగౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ డా.విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్తోపాటు అనేక బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నిరాహారదీక్ష చేయడానిౖనా సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పరంగా మద్దతు ఇస్తామని చెప్పారు. ⇒ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు పోరాటం చేయాలన్నారు. యుద్ధం ఆపేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి బీసీ జాతిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. క్రెడిట్ అంతా మాకే రావాలని రెండు బిల్లులు చేసి పంపిన కాంగ్రెస్.. దాని అమలు కోసం చిత్తశుద్ధి ఏది అని ప్రశ్నించారు. హైకోర్టు జడ్జిమెంట్ రాక ముందే ప్లాన్ఆప్ యాక్షన్ చేసుకోవాలని హితవు పలికారు. ⇒ చిరంజీవులు మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్న బీఆర్ఎస్ ఏమీ చేయడం లేదని, బీసీల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఒక్కరిద్దరు మాత్రమే రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్టుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలన్నారు. ⇒ విశారదన్ మాట్లాడుతూ రేవంత్ తన గెలుపు కోసం 420 హామీలు ఇచ్చారని, అందులో బీసీ రిజర్వేషన్లు అనే ఒక ఆయుధంతో బీసీలను ఆటాడిస్తున్నారన్నారు. తనకు ఇష్టం వచ్చినట్టు ఆ ఆయుధాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మీదే ఉందని, అవి అమలు కాకపోతే వారిద్దరని సంఘ బహిష్కరణ చేయాలన్నారు. -
కాకి లెక్కలతోనే క్రాప్ బుకింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రతి సీజన్లో అనుసరించే క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) విధానం లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జియో ట్యాగింగ్ ద్వారా పంటలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించినప్పటికీ..ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. క్రాప్ బుకింగ్తో పాటు వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెక్టార్ల వారీగా నియమించిన వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఇచ్చే నివేదికల పైనే ప్రభుత్వం ఆధారపడుతోంది.రైతు పంటలు వేసినప్పుడే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తే, కచ్చితమైన సాగు విస్తీర్ణం, సాగైన పంటల వివరాలు తెలుస్తాయి. తదనుగుణంగా ఎరువుల పంపిణీ, మద్దతు ధరకు కొనుగోళ్లు, అందుకయ్యే నిధులు సమకూర్చుకోవడం వంటి ప్రక్రియ సజావుగా జరిగే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అంతా కాకి లెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలుకొని పంటల సేకరణ వరకు అంతా లోపభూయిష్టంగానే సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ సీజన్లో 60శాతం మించని క్రాప్ బుకింగ్రాష్ట్రంలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ గత నెల 30వ తారీఖుతో పూర్తయింది. ఆనాటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఇవి కాకుండా ఎర్ర మిర్చి, పసుపు 1.34 లక్షల ఎకరాల్లో సాగయినట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా పంటల నమోదు మాత్రం సెప్టెంబర్ 30 నాటికి 70 లక్షల ఎకరాల (53 శాతం) మేరకే పూర్తయింది. సెప్టెంబర్ 30 నుంచి ఈనెల 7 వరకు వారం రోజుల్లో మరో ఏడు శాతం క్రాప్ బుకింగ్ అయిందనుకున్నా, 60 శాతం మించలేదు. ఒకవైపు వరి కోతలు ప్రారంభం కాగా, మరోవైపు పత్తి ఏరడం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు వరి క్రాప్ బుకింగ్ 53 శాతం, పత్తి పంట నమోదు 57 శాతం మాత్రమే పూర్తయింది.చేతులు దులుపుకొంటున్నారా?ఒక గ్రామంలో ఒక ఖరీఫ్ సీజన్లో సాగైన పంటల విస్తీ ర్ణం ఆధారంగా మరుసటి సంవత్సరం పంట నమోదును కొంత అటు ఇటుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యవసాయ శాఖలోనే ఉన్నా యి. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా కొరత అత్యంత తీవ్ర రూపం దాల్చడానికి సరైన క్రాప్ బుకింగ్ డేటా లేకపోవడమే కారణమ నే అభి ప్రాయం వ్యక్తమైంది. రైతులు పంటలు సాగు చేసి నప్పుడే ఆయా పంటలను కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే, ఏ గ్రామానికి ఏ పంటలకు ఎంత యూరియా, ఇతర ఎరువులు అవ సరమవుతాయనే అంచనాలకు అవకాశం ఉంటుంది. కానీ అది జర గడం లేదు. అలాగే వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.పత్తి, జొన్నలు విక్రయించే సమయాల్లో వేసే లెక్కలకు పొంతన ఉండడం లేదు. పంటల నమోదు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో ఉంటే ఈ పరిణామాలు ఉత్పన్నం కావని వ్యవసాయ, మార్కెటింగ్అధికారులు చెపుతున్నారు. వ్యవ సా య విస్తరణాధికారులకు జిల్లా, మండల స్థాయిలో చేయాల్సిన వ్యవసాయ పనులు అప్పగించడం వల్ల పంట నమోదు కాకుండా ఇతర పనులపైనే ఎక్కు వ సమయం గడిపే పరిస్థితి ఉందంటున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అదే సీజన్లో నమోదు చేసిన పంటలకు కొంత ఎక్కువ, తక్కు వగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నెల 9న తాను సందర్శిస్తానని.. అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో మొదలయ్యే రచ్చబండ కార్యక్రమం నవంబరు 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించే కోటి సంతకాల పత్రాలను నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తామన్నారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. సేకరించిన కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేస్తామన్నారు.మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం విక్రయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆదేశించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలంటే..? మనం మన హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పేదలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తెచ్చాం. దీనిపై అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా.అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి? ఎందుకంటే.. ప్రభుత్వాలు అవి చేయకపోతే ప్రైవేటు ఎక్స్ప్లాయిటేషన్ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీతో ఏ పేదవాడికీ వైద్యం అందని దుస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యాజమాన్యానికి ఫీజులు కట్టలేక పేదలు తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు ఆపరేటర్ల దెబ్బకు ఎవరూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే గవర్నమెంట్ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం స్కూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నిర్వహించాలి. లేదంటే ప్రైవేటు దోపిడీకి అడ్డూ అదుపూ ఉండదు. జిల్లా మొత్తానికి హబ్గా.. మన హయాంలో ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పటల్ను తెచ్చే ప్రయత్నం చేశాం. ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ఒక మెడికల్ కాలేజీ రాకతో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రైవేటు దోపిడీ ఆగిపోతుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ స్టూడెంట్లు, నర్సింగ్ స్టూడెంట్లు టీచింగ్ హాస్పటల్లో పని చేస్తారు. రకరకాల విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా జిల్లా మొత్తానికి టీచింగ్ హాస్పటల్ ఒక హబ్గా పని చేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే ప్రివెంటివ్ కేర్ మన పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. మెడికల్ సీట్లు పెరిగేవి.. నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు 2,360 మాత్రమే. మనం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చేవి. మొత్తంగా 4,900 మందికిపైగా డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చేవారు. అంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. అది కూడా మెడికల్ సీట్లలో 50 శాతం కోటా ఉచితం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50 శాతం సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుకే విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉచిత వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఏడు కాలేజీలు పూర్తి చేశాం.. మన హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశాం. వాటితోపాటు పాడేరు మెడికల్ కాలేజీని కూడా కలిపితే 800 ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ఇలా ఐదు మెడికల్ కాలేజీలు మనం అధికారంలో ఉండగానే 2023–24లోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు.. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించేందుకు చంద్రబాబు రాకముందే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే.. మాకొద్దంటూ చంద్రబాబు అడ్డుకుని ఎన్ఎంసీకి లేఖ రాయించారు. 9 నుంచి కార్యాచరణకూటమి సర్కారు ప్రజా కంటక పాలనను నిలదీస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 9న నేను స్వయంగా సందర్శిస్తా. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదించి కోటి సంతకాల పత్రాలు అందజేస్తాం. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా? మనం దాదాపు రూ.3 వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేశాం. ఇక మిగిలింది రూ.5 వేల కోట్లు. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఖర్చు పెట్టలేరా? వాటిని పూర్తి చేయడానికి మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకువచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫాస్ట్రక్చర్ అనే పథకంలో మెడికల్ కాలేజీలను కూడా పెట్టించాం. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇస్తారు. నేను చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా? సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వలేరా? అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇప్పుడున్న 50 వేల ఎకరాలు సరిపోవు. ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడుగుతున్నారు. మొదట 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కావాల్సింది రూ.లక్ష కోట్లు. కానీ ఇంతకు ముందు ఆయన ఖర్చు చేసింది చూస్తే రూ.4500 కోట్లు. అది అలా ఉండగానే మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు.అంటే అక్కడ మరో రూ.లక్ష కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యారు. అంటే మొత్తం రూ.రెండు లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాంటిది రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కొత్త మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. అవి చిరస్థాయిగా నిలి్చపోయే విలువైన సంపద. ప్రైవేటు వారు పేదలను దోచుకోకుండా శ్రీరామరక్ష లాంటిది. అలాంటి వాటికి ఐదేళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఆశ్చర్యంగా ఉంది. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తాం. అదే సమయంలో ఆ గ్రామంలో పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలి. మెడికల్ కాలేజీలకు సంబంధించి క్యూఆర్ కోడ్తో ముద్రించిన పాంప్లెట్లు, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన లెటర్ కాపీలను గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందచేయాలి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 పంచాయతీలు ఉంటాయనుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం 500 మందితో సంతకాలు సేకరిస్తాం.ఆ బాధ్యతను కొత్తగా నియమించే గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు అప్పగిస్తాం. ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి నియోజకవర్గం ఇన్చార్జీ రోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణను పర్యవేక్షించి అక్కడే మీడియాతో మాట్లాడతారు. అక్టోబర్ 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి డిమాండ్ పత్రాన్ని అందచేస్తాం. అప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో నేను స్వయంగా ర్యాలీలో పాల్గొంటా.నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడ తరలిస్తారు. తదుపరి గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం. కోటి సంతకాల పత్రాలూ ఆయనకు అందజేస్తాం. -
పత్తి.. ఎంతైనా కొంటాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పత్తి రైతులు ఎంత పండిస్తే అంత పత్తిని కొనుగోలు చేస్తామని.. పత్తి చివరి కిలో వరకూ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని పత్తి రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బాధ్యతల నుంచి పారిపోతోందని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరుల బృందం రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను వివరించేందుకు గిరిరాజ్ సింగ్తో సమావేశమైంది. అనంతరం గిరిరాజ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణలో 20 లక్షల మంది పత్తి రైతులు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తుండగా వారి నుంచి సీసీఐ 80 శాతం పత్తిని కొనుగోలు చేస్తోంది. గతంలో ఎంత సేకరించామో అంతకు మించి సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా అలా చేయట్లేదు. ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకొని పత్తిని ఆరబెట్టి ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పంపాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రంపై మాత్రం నిందలు వేస్తోంది. ఇది సరికాదు’అని పేర్కొన్నారు. రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంట విక్రయించొద్దు: కిషన్రెడ్డి పత్తి రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంటను విక్రయించొద్దని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. తేమ శాతం ఎక్కువుందన్న పేరుతో ప్రైవేటు వ్యక్తులు ధర తగ్గించి కోనుగోలు చేయడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్తో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పత్తి కొనుగోళ్లలో ఏటా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా వాటిని పరిష్కరించేందుకే కేంద్ర మంత్రితో సమావేశమయ్యాం. సీసీఐ చైర్మన్తోనూ పలు విషయాలు చర్చించాం. పత్తిలో 12 శాతం తేమ ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను సీసీఐ కొనుగోలు చేస్తోంది. పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని గిరిరాజ్ సింగ్ను కోరాం. హై డెన్సిటీ కాటన్ ప్లాంటేషన్ ద్వారా రైతుల ఆదాయం మూడింతలు అవుతోంది. తెలంగాణలో ఎందుకు ఆ విత్తనాలను వినియోగించట్లేదని గిరిరాజ్సింగ్ అడిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 122 సెంటర్లలోని రైతు కమిటీల ప్రతినిధులు, అధికారులకు సమస్యలను చెబితే వారు వెంటనే పరిష్కరిస్తారు. తేమ శాతాన్ని కచి్చతత్వంతో కొలిచే ఆధునిక మెషీన్లను అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు. -
దేశంలో తొలి డ్యూయల్ చాంబర్ పేస్మేకర్ ఇంప్లాంట్
న్యూఢిల్లీ: గుండె పనితీరును క్రమబద్ధం చేసేందుకు అమర్చే పేస్మేకర్ సర్జరీల్లో ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ సరికొత్త చరిత్ర లిఖించింది. దేశంలో తొలిసారి ఓ రోగికి ‘డ్యూయల్ చాంబర్ పేస్మేకర్’(డీసీఎల్పీ)ను విజయవంతంగా అమర్చినట్లు మంగళవారం ప్రకటించింది. సాధారణ పేస్మేకర్లు అమర్చేందుకు రోగికి ఛాతీ భాగంలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. పైగా దానికి వైర్లతో బయటి యంత్రానికి అనుసంధానం చేసి గుండె స్పందనలను క్రమబద్ధం చేయాల్సి ఉంటుంది. డ్యూయల్ చాంబర్ లీడ్లెస్ పేస్మేకర్లతో ఆ అవసరం ఉండదు.ఇవి చిన్న క్యాప్సూల్ మాదిరిగా ఉంటాయి. వాటిని గుండె పై కర్ణికలో ఒకటి, కింది దమనికలో ఒకదానిని అమరుస్తారు. ఇందుకోసం పొట్టలోకి కృత్రిమంగా ఆహారాన్ని పంపే ఓ గొట్టంలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల శస్త్రచికిత్సతో పని ఉండదు. ఈ క్యాప్సూల్స్కు వైర్లు ఉండవు. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి ఈ పరికరాలు రెండు వాటంతట అవే సమాచార మారి్పడి చేసుకుంటాయి. గుండె సాధారణంకంటే వేగంగా కొట్టుకోవటం ప్రారంభించగానే ఇవి పనిచేయటం మొదలుపెట్టి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే గుండె వేగం సాధారణంకంటే తగ్గితే వెంటనే కృత్రిమంగా వేగాన్ని పెంచుతాయి. 83 ఏళ్ల వ్యక్తికి...మ్యాక్స్ హాస్పిటల్లో 83 ఏళ్ల ఓ రోగికి వీటిని అమర్చారు. ఆస్పత్రి కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ బల్బీర్సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ అరుదైన చికిత్స నిర్వహించింది. ఆ రోగికి గుండెలో కర్ణిక, దమనికల మధ్య సమన్వయం లోపించటంతో గుండె వేగం సాధారణంకంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు కారణాల రీత్యా సాధారణ పేస్మేకర్ చికిత్స సరికాదని గుర్తించి డ్యూయల్ చాంబర్ పేస్మేకర్ అమర్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించాయి. -
ఏ 'మాత్ర'o తగ్గలేదు!
జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో దాదాపు 1,500 మెడికల్ స్టోర్లు, 200పైగా హోల్ సేల్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలని చాలామంది మెడిసిన్ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. బేరాల్లేవ్! చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించరే మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాత మందులంటూ బూచీ జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తగ్గింపు ధరలు అమలు కావాలి ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి. – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు -
నేడు ఢిల్లీకి యూకే ప్రధాని స్టార్మర్
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మొదటిసారిగా బుధవారం భారత్ పర్యటనకు రానున్నారు. మంగళవారం రాత్రి ఆయన తన ప్రతినిధి బృందంతో కలిసి హీత్రూ ఎయిర్పోర్టులో విమానమెక్కారు. ప్రధాని మోదీ ఆహ్వనం మేరకు భారత్ వస్తున్న స్టార్మర్ రెండు రోజులపాటు పర్యటిస్తారు. భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది.ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఇద్దరు నేతలు కీలక ప్రసంగాలు చేయనున్నారు. రెండు దేశాల మధ్య జూలైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది.దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. -
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు
8 ఏప్రిల్ 2025న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. 18 జూన్ 2025న పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోయిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థంపర్థం లేని నిబంధనలను పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు. ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్యలోనుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. 31 జూలై 2025న అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగివచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటనను విఫలం చేయాలని శాయశక్తులా యత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. ఈ ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు 66వేల మంది వస్తారని, వారిని నిలువరించలేమని పోలీసులే పేర్కొనడం, జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కారు కుట్రలో వారు పావులుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తోంది. వైఎస్ జగన్ వెళ్లిన ఎక్కడికి వెళ్లినా జనాదరణ వెల్లువెత్తుతుండడంతో సర్కారులో వణుకుపుడుతోంది. ప్రజావ్యతిరేకత పెరిగిపోవడంతో జంకుతోంది. ఫలితంగా ఎలాగైనా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని ఆంక్షలు విధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఏకంగా 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణమవుతున్న మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గాన వెళితే భద్రత కల్పించలేమంటూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ అప్పటికప్పుడు ప్రకటించడం గమనార్హం. 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో అవసరమైన పోలీసు బలగాలను ఇప్పటికిప్పుడు కేటాయించలేమంటూ సెలవివ్వడం చర్చనీయాంశమైంది. విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటూ సాకుగా చూపడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పర్యటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు స్వయంగా పోలీసులే... 65 వేల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని, అంత మందికి అక్కడి ప్రాంతం సరిపోదంటూ మాజీ మంత్రి అమర్నాథ్కు పంపిన సమాధానంలో పేర్కొనడం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా అంగీకరించినట్టు స్పష్టమవుతోంది. సవాల్ విసిరి.... చల్లారిపోయి....! వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు 50 సీట్లు కేటాయించారు. మరో ఐదు కళాశాలలను అంతకుముందే ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. ఇప్పటికే 60 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో ప్రైవేటు పరంచేసేందుకు సర్కారు కుట్రపన్నింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కాలేజీకి అనుమతులు లేవంటూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొత్తరాగం అందుకున్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీఓ ఉందా? దమ్ముంటే రమ్మనండి.. ఎవరినైనా రమ్మను అంటూ బీరాలు పోయారు. అర్థంపర్థం లేని సవాల్ విసిరారు. అయితే, స్పీకర్ మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న రానున్నారు. ఇప్పటివరకు దమ్ముంటే రమ్మనండి అంటూ సవాళ్లు విసిరిన కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ వస్తుంటే నిజాలన్నీ బయటకు వస్తాయని వణికిపోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.హెలికాప్టర్పై అయితే అనుమతిస్తారట..! వాస్తవానికి వివిధ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యత్నించిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు కల్పించడం పోలీసులకు పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనను పేర్కొంటూ హెలికాప్టర్ ల్యాండింగ్కు పలు సందర్భాల్లో అనుమతి నిరాకరించిన పోలీసులు... ఇప్పుడు అందుకు విరుద్ధంగా హెలికాప్టర్లో వస్తే అనుమతిస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం గమనార్హం. అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా.. అందుకు అంగీకరిస్తామని చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా జగన్ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ పల్లవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతివిశాఖ సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పర్యటన ఇలా సాగాలి » విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.» అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి. » ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు. » ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు. » మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు. » ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉంటుంది. -
సొంత పౌరులనే చంపుతున్న పాక్
యునైటెడ్ నేషన్స్: పాకిస్తాన్ సొంత పౌరులపైనే బాంబులు వేసి చంపుతోందని, ఆ దేశంలో మారణహోమాలు, మహిళలపై సామూహిక లైంగికదాడులు నిత్యకృత్యమని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం ‘మహిళలు, శాంతి, భద్రత’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ఈ చర్చలో పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంతో ఆయన దాయాది దేశానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ నుంచి కశ్మీరీ మహిళలను తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు.‘సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్న ఒక దేశం, ఒక క్రమపద్ధతిలో మారణహోమానికి పాల్పడుతూ, లక్షలమంది మహిళలపై లైంగికదాడులు చేయించిన దేశం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. దురదృష్టవశాత్తూ ఏటా పాకిస్తాన్ దుష్ట చర్యలకు మేం బాధితులం అవుతున్నాం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో.. అయినా ప్రపంచం పాకిస్తాన్ దృష్టకోణం నుంచే చూస్తోంది’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971 మార్చి 25న తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతో పాకిస్తాన్ మారణహోమానికి పాల్పడిందని, 4 లక్షల మంది మహిళలపై పాక్ సైన్యం అత్యాచారాలకు పాల్పడిందని గుర్తుచేశారు.మహిళల భద్రత విషయంలో భారత్ను ఎవరూ వేలెత్తి చూపలేరని స్పష్టంచేశారు. మహిళల భద్రత, శాంతి సాధన విషయంలో ప్రపంచంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమతి శాంతి పరిరక్షణ మిషన్లలో భారత్ తరఫున పాల్గొన్న మహిళా అధికారులనే ఈ అంశంలో తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. 1960వ దశకంతో కల్లోల కాంగోలో ఐరాస పీస్ కీపింగ్ మిషన్లో భారత్ మహిళా మెడికల్ అధికారుల దళాన్ని పంపిందని గుర్తుచేశారు. -
ప్రభుత్వ తీరుపై గురువుల ‘ధర్నా’గ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గళమెత్తింది. ఇకపై బోధనేతర కార్యక్రమాలు నిర్వహించబోమని, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సమాఖ్య నాయకులు ప్రకటించారు. తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిరసనగా మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడలో ‘పోరుబాట’ పేరుతో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులతో ధర్నా చౌక్ నిండిపోయింది. హామీలు అమలు చేయకుంటే సత్తా చూపిస్తాంమహాధర్నాను ఉద్దేశించి ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయి ఉపాధ్యాయులు పనిచేయలేని విధంగా మారిందన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. గత నెలలో జిల్లాల్లో నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఇకనైనా పట్టించుకోకపోతే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.28 వేలకు పైగా చెల్లించాలని.. వీటిని ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో–57 అమలు చేసి 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. 1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారి బదిలీలు అసమంజసమని, న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని దుయ్యబట్టారు. ఈ తరహా బదిలీలను వెంటనే రద్దు చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత ప్రభుత్వం గ్రామీణ పేద బాలికల ఉన్నత విద్య కోసం ప్రారంభించిన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఫ్యాప్టో ఇచ్చిన నోటీసులోని 20 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఉపాధ్యాయ నాయకులు హెచ్చరించారు. పోరుబాట ధర్నాలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏపీ సీపీఎస్సీఏ బాధ్యులు సీఎం దాస్, సతీష్, బాజీ పఠాన్ తదితరులు మద్దతు ప్రకటించారు. పాఠాలు చెప్పనీయడం లేదు గత ప్రభుత్వం గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు హైసూ్కల్ ప్లస్లను ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నించింది. దీనిపై పెద్దఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గి, ఆ స్కూళ్లల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను సర్ప్లస్ పేరిట బదిలీ చేసింది. ఈ విధానం పేద బాలికలు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కాలరాయడమే అవుతుంది. బడుల్లో ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలతో పాఠాలు చెప్పనివ్వడం లేదు. ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. యాప్ల భారం తగ్గించి బోధనేతర విధులకు విముక్తి కల్పించాలి. ఇకపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు మాత్రమే యాప్లలో నమోదు చేస్తాం. మిగిలినవి బహిష్కరిస్తాం. – సాయి శ్రీనివాస్ (ఎస్టీయూ), ఫ్యాప్టో చైర్మన్ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది ఎన్నికల ముందు చంద్రబాబు డైరెక్ట్ పీఆర్సీ ఇస్తామన్నారు. 16 నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. కనీసం ఒక్కసారి కూడా ఉపాధ్యాయులతో చర్చించలేదు. మైకుల ముందు, శాసనసభలో ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రిగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉంటాయనుకున్నాం. కానీ.. పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. బడుల్లో ఉపాధ్యాయులు ఎవరూ పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. ఏడాదిన్నర అవుతున్నా విద్యారంగ సమస్యలపై మంత్రి స్పందించలేదంటే ప్రభుత్వ విద్య అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. – పి.అశోక్ కుమార్రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్గిన్నిస్ రికార్డుల కోసమే తపన కూటమి నాయకులు ఎన్నికల ముందు యాప్లు రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మరిన్ని యాప్లతో వేధిస్తున్నారు. గిన్నిస్ రికార్డుల పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకుంటోంది. యాప్ల ద్వారా పిల్లలకు అక్షరాలొస్తాయా. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం, ఈలోగా మా డిమాండ్లపై స్పందించాలి. ప్రభుత్వం దిగిరావాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, యూటీఎఫ్ఉపాధ్యాయులు దొంగలా?ఉపాధ్యాయులు దొంగలా? మేం దొంగలమైతే పదో తరగతిలో ఎందుకు అంత స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ చిలక పలుకులు ఉపాధ్యాయుల వద్ద ఇక సాగవు. కూటమి ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ బడులను దిగజారుస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుంటే ఉపాధ్యాయులు పెద్ద ఉద్యమబాట పడతార – ఎన్.వెంకటేశ్వర్లు, డెప్యూటీ సెక్రటరీ జనరల్, ఫ్యాప్టో విద్యాశాఖవిద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోసం ప్రయత్నిస్తే ఆయన సమయం కేటాయించటం లేదు. విద్యారంగం చాలా విస్తృతమైన విషయమని గుర్తించటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 మాసాలైంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. విద్యారంగాన్ని నాశనం చేయటానికి ప్రపంచ బ్యాంక్ సూచించిన సాల్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దానిని వెంటనే రద్దు చేయాలి. 12 పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలి. ఎన్నికల్లో పదేపదే ప్రకటించిన తెలుగు మీడియంను ప్రవేశ పెట్టాలి.– కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ -
విద్యుత్ ఉద్యోగుల మెడపై కత్తి
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా వారి మెడపై కత్తులు వేలాడదీస్తోంది కూటమి ప్రభుత్వం. తమ డిమాండ్ల సాధన కోసం గత నెల నుంచి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తోంది. విద్యుత్ ఉద్యోగులను చర్చలకు పిలుస్తూనే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా ఉద్యోగులకు సెలవులను రద్దుచేసింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారంతా తక్షణమే విధుల్లో చేరాలని హుకుం జారీచేసింది. అత్యవసరమైతే.. ఉన్నతాధికారుల అనుమతిపత్రం తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.బెదిరిస్తే నిరవధిక సమ్మె.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వాల్సిన నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్మెన్లుగా గుర్తించాలని, పింఛన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొంతకాలం కిందట ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పలు దఫాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఈ నెల 15 వరకు గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని నోటీసు ఇచ్చింది. దీంతో బుధవారం (నేడు) విజయవాడలోని విద్యుత్ భవన్లో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అంతకుముందే ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపట్టింది. జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగులంతా సెలవులను రద్దుచేసుకుని విధులకు హాజరుకావాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఆదేశాలు జారీచేశారు. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా హెడ్క్వార్టర్ దాటి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో పనిచేసే శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందేనని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నమూనా హాజరుపట్టీలో వారి హాజరు నమోదుచేసి రోజూ సీఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. దీనిపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తమను బెదిరించి ఆందోళనలను విరమింపజేయాలని ప్రయత్నిస్తే వెంటనే నిరవధిక సమ్మెలోకి వెళతామని జేఏసీ హెచ్చరించింది. -
హిమాచల్లో ఘోర ప్రమాదం
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది మరణించారు. బిలాస్పూర్ జిల్లా ఝన్దత్త నియోజకవర్గంలోని భలుఘాట్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుపై సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపెద్ద కొండరాళ్లు, బురద మట్టి కింద బస్సు మొత్తం కూరుకుపోయి నుజ్జయ్యింది. మరోతన్–కలౌల్ మధ్య తిరిగే ఈ బస్సులో ప్రమాదం సమయంలో 30–35 మంది ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు ప్రయాణికులను కాపాడినట్టు బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్కుమార్ తెలిపారు. శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీసినట్టు ఝన్దత్త ఎమ్మెల్యే జేఆర్ కత్వాల్ చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయచర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రి సమయం కావటంతో సెల్ఫోన్లు, టార్చిలైట్ల వెలుగులో సహాయక చర్యలు చేపట్టారు. ఒక జేసీబీతో శిథిలాలను తొలగిస్తుండగా, సహాయక సిబ్బంది మరోవైపు పారలతో మట్టిని తవ్వి బస్సులోనివారి కోసం వెదుకుతున్న వీడియోలు మీడియాలో ప్రసారమయ్యాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు బిలాస్పూర్ ప్రమాదంపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుక్కు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్స్లో తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సకల వనరులు ఉపయోగించి సహాయక చర్యలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రయాణికుల మరణంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పన ఆర్థికసాయం ప్రకటించారు. సుఖ్విందర్ సింగ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
అంబరాన్నంటిన సిరిమాను సంబరం
జై పైడిమాంబ... జై జై పైడిమాంబ... అంటూ లక్షలాది భక్తజనం జయజయధ్వానాల నడుమ సిరులతల్లి... విజయనగర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 4.24 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు. అనంతరం మూడుసార్లు అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు సాగిన ఉత్సవం సాయంత్రం 5.47 గంటలకు ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కోట బురుజుపై నుంచి, విజయనగరం అర్బన్ బ్యాంక్ భవనం ఉన్న ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వేదిక నుంచి రాష్ట్ర శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ వీక్షించారు. అయితే, ఏర్పాట్లలో డొల్లతనం కారణంగా ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై కూర్చున్న బొత్స సత్యనారాయణతోపాటు ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఒక ఎస్ఐ, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. – సాక్షిప్రతినిధి, విజయనగరం -
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకుగాను జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టీనిస్, మైఖేల్ హెచ్ డెవొరెట్లకు ఉమ్మడిగా ఈ బహుమతిని అందజేయనున్నట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. వీరిలో క్లార్క్(83)బర్కిలీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో, మార్టినిస్ శాంటా బార్బరాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో, డెవొరెట్ యేల్ యూనివర్సిటీతోపాటు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలోనూ పరిశోధనలను నిర్వహించారు. వీరి పరిశోధన ఏమిటి? ‘మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ‘ అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్లో చూపించగలిగారు. విద్యుత్ సర్క్యూట్లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టీన్లు అమెరికాకు చెందిన వారు కాగా, హెచ్ డెవొరెట్ ఫ్రాన్స్ దేశస్థుడు. క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత.. గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతికశాస్త్రంతో వివరించవచ్చు. ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎల్రక్టాన్లతో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్లు అటువంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయిల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్ను ఉపయోగిస్తూంటారు కదా.. అలాగే శక్తి కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుందన్నమాట. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్ అంటారు. అయితే, అణుస్థాయిలో ఇలా ఉండదు.శక్తి అనేది మెట్లు ఎక్కినట్లు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్ను కూడా అరచేతిలో పట్టేంత, పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు. క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలు ఏర్పడింది. గూగూల్, ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్ కండక్టింగ్ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగానే తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారమవుతాయి. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అ్రల్టాసౌండ్ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే అవకాశ మేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియలాజికల్ సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్ టెలిస్కోపులు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్లలో క్వాంటమ్ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి మస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపేందుకు అవసరమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చు. -
నేడు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన భీమవరం చేరుకుంటారు, అక్కడినుంచి పెదఅవిురం చేరుకుని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించే సిరిమానోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారి్థస్తున్నానని ‘ఎక్స్’లో మంగళవారం పోస్ట్ చేశారు.ఆదర్శనీయుడు వాల్మీకి మాజీ సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి,అమరావతి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో మరో దోపిడీకి ముఖ్యనేత స్కెచ్ వేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్)తోపాటు ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ), ఎస్పీవీ సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులకు పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతుల్లో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ, ప్రభుత్వం, ఎస్పీవీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి. భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని పనులు రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయిస్తారు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి కాంట్రాక్టర్కు హక్కులు కల్పిస్తారు. ఆ ప్రాజెక్టుల ద్వారా పన్నులు, యూజర్ చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్) వంటి అంశాలను సీఆర్డీఏ ఖరారు చేస్తుంది. అప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నష్టం వస్తే వయబులిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. వీటిని పరిశీలిస్తే.. ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి భారీ ఎత్తున భూములు కేటాయించి.. వాటిని తనఖా పెట్టి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులతో వాటిని చేపట్టి ‘నీకింత... నాకింత’ అంటూ దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం రాజధానిలో మలి విడత భూసమీకరణకు సిద్ధమైందన్నది స్పష్టమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటి వాటి కోసం భూములు అవసరమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పదేపదే చెబుతుండటం విదితమే.రాజధాని భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ సర్కార్ ఉత్తర్వులుసాక్షి, అమరావతి: రాజధానిలో భూసమీకరణ పథకం(ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 343.36 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లో చట్టపరమైన లోపాలు ఉండటంతో దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు(53,749.49) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 37,941.58 ఎకరాలు రైతులది. భూసమీకరణ పథకం కింద 34,396.87 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 3,544.71 ఎకరాలను సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పూర్తి వివరాలను తమకు అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఎస్ఐఆర్ తర్వాత సెప్టెంబర్ 30న ప్రచురించిన తుది ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించిన వారి వివరాలు ఇవ్వాలని కోరింది.ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విచారణకు హాజరయ్యారు. తొలగించిన పేర్లలో చాలావరకు కొత్తగా ఓటు నమోదుచేసుకున్నవారేనని తెలిపారు. వారిలో ఎవరి నుంచీ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయినప్పటికీ తొలగించినవారి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎలక్టోరల్ ముసాయిదాతోపాటు తుదిజాబితాను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గందరగోళాన్ని తొలగించేందుకే.. తమ ఆదేశాలు ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎన్నికల జాబితాపై గందరగోళాన్ని తొలగించేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ‘ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజలకు మరింత సమాచారం అందుబాటులో ఉండేందుకు మీరు (ఈసీ) మా నిర్ణయంతో ఏకీభవించాలి. మీరు ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల పేర్లు తొలగించారు. చనిపోయినవారు, రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించటం సబబే. కానీ, మీరు ఓటరు జాబితా నుంచి ఒక పేరును తొలగించాలంటే కచి్చతంగా రూల్ 21ను పాటించాలి. ప్రజలకు కూడా ఒక విన్నపం. ఎవరి పేర్లయితే ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందో.. వారు తమ వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో అందజేయండి’అని సూచించారు. -
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్పై పామూరుకు చెందిన పవన్ మెన్స్వేర్ లేబుల్ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు ష్యూరిటీ పోయింది.. మోసం గ్యారెంటీగా మారింది
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు, కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలు, ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు?ఈ రోజు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేస్తోందని ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తే.. అసలు పాలన మీద ధ్యాస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు? ఈ రోజు ఎంత ఆదాయం వచ్చింది? రేపటికి ఇంకా ఎంత పెంచుకోవాలి? సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి? అన్న వాటిపైనే వారికి ధ్యాస. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అరాచకమే. రాష్ట్ర ఆదాయాలు తగ్గుతున్నాయి. అది పక్కదారి పట్టి.. చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏది చూసినా దోపిడీయే. ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడం లేదు. మట్టి, క్వార్ట్జ్, సిలికా, లేటరైట్.. ఏదైనా అంతే. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. తమకు సంబంధించిన వారికి పావలా, అర్ధ రూపాయి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు. మన హయాంలో.. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి.. మరో 30 ఏళ్లు ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్ని రూ.2.49 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నానా యాగీ చేసిన వారు ఈరోజు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్లు ఏ స్థాయికి దిగజారారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాలుగా మారిన హామీలు..మరోవైపు చూస్తే చంద్రబాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారెంటీ అయ్యింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల పేరుతో ఎన్నికలకు ముందు ఈనాడులో ఆయనిచ్చిన యాడ్స్ ఇప్పటికే చాలాసార్లు చూపించా. మొన్న అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించి అన్నీ చేసేశామని చెబుతూ ఇచ్చిన యాడ్స్ కూడా చూపించా. ఆ హామీలు ఎలా మోసాలుగా మారిపోయాయో వివరించా. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. విజయోత్సవ సభ అడ్వర్టైజ్మెంట్లో నిరుద్యోగ భృతి హామీ తీసేశారు. ఎన్నికలకు ముందు కనిపించిన 50 ఏళ్లకే పింఛన్ – ఏడాదికి రూ.48 వేలు హామీ ప్రకటన విజయోత్సవ సభకు వచ్చేసరికి మాయమైంది. ఆ పార్ట్ అంతా కటింగే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పోయి.. బాబు ష్యూరిటీ అనేది మోసం గ్యారెంటీగా మిగిలిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. పేదింటి చదువులపై కుట్రలురాష్ట్రంలో విద్యారంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూస్తుంటే బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ అనే వ్యక్తి ఇంకో ఐదేళ్లు పరిపాలన చేసుంటే.. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు, ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు మన హయాంలో చదివిన వారు ఇంగ్లిష్ మీడియం, ఐబీ సర్టిఫికెట్తో పాసయ్యేవారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు అటెండ్ అవుతూ పదో తరగతి పూర్తయ్యే నాటికి వెస్ట్రన్ యాక్సెంట్ (అమెరికన్ యాక్సెంట్)తో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడేవాడని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక ఎనిమిదో తరగతి పిల్లాడు మనమిచ్చే ట్యాబ్లతో ఐబీ చదువులు, టోఫెల్లో ఉత్తీర్ణత సాధించేవాడు. ట్యాబ్లతో ఇంటర్నెట్తో అనుసంధానమై సాఫ్ట్వేర్పై అవగాహన వచ్చేది. మనం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇవన్నీ కలిసి ఆ పిల్లాడు ఏ స్టేజ్కి వచ్చే వాడంటే.. ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా నిలిచేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ను రాష్ట్రంలో ప్రతి పేద, మధ్యతరగతి పిల్లలకు మనం అందుబాటులోకి తెచ్చాం. చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి ఎండీ మనవళ్లు ఈ ఐబీ చదువులు చదివారు. వాళ్లలో ఎవరూ తెలుగు మీడియం చదవడం లేదు. మన దగ్గరకి వచ్చేసరికి వీళ్లంతా కుట్ర పన్ని పేదవాడి మీద, మిడిల్ క్లాస్ వారి మీద రాక్షసుల మాదిరిగా యుద్ధం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో ఐబీ నుంచి సీబీఎస్ఈ వరకు పేద పిల్లల ప్రయాణాన్ని అడ్డుకున్నారు. టోఫెల్ క్లాసులు పూర్తిగా రద్దయి పోయిన పరిస్థితి. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వకపోగా ఆ పేరెత్తే ధైర్యం కూడా వీరికి లేదు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు ఊసే లేదు. దారుణంగా గవర్నమెంట్ స్కూళ్లు.. 5 లక్షల మంది విద్యార్థుల తగ్గుదలప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చివరకు నిర్వహణ కూడా చేయలేని అధ్వాన్న స్థితిలోకి విద్యా వ్యవస్థను నెట్టేశారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామెర్లు సోకాయి. 30 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నెలరోజుల క్రితం జాండిస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. మన మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వెళితే గానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. రోజుకొక మెనూతో గొప్పగా అందించిన గోరుముద్ద కనుమరుగైంది. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఏకంగా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్స్ కోసం వచ్చిన పరిస్థితులు చూశాం. అదే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అమ్మ ఒడి పేరుతో మనం తీసుకొచ్చిన పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశారు. రూ.15 వేలు కాస్తా రూ.13 వేలు చేశారు. అది కూడా ఇవ్వకుండా కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు.. ఆగుతున్న పిల్లల చదువులు..ఫీజురీయింబర్స్మెంట్కు సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇవ్వలేకపోయాం. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పుడు 2025 సెప్టెంబర్ నాటికి 7 త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు రూ.4,500 కోట్లకుగానూ ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. మిగతాదంతా గాలికొదిలేశారు. వసతి దీవెన కింద మన హయాంలో ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లు ఇవ్వాల్సినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లలు చదువులు మానుకుంటున్న దుస్థితి. వ్యవసాయం.. నిస్సహాయ పరిస్థితుల్లోపంటల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. రైతులకి మనమిచ్చిన ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. మన హయాంలో సీఎం–యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ధరలను పర్యవేక్షించాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా వెంటనే ఆర్బీకేలో అలెర్ట్ వచ్చేది. ఇప్పుడు అన్నీ పోయాయి. రైతు భరోసాగా మనం పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చి రైతుకు అండగా నిలిస్తే కళ్లబొల్లి మాటలతో భ్రమలు కల్పించారు. పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అన్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కాకుండా తామే సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపితే ఒక్కో రైతుకు రూ.40 వేలకుగాను విదిల్చింది కేవలం రూ.5 వేలు. ఇవాళ ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు దగ్గర్నుంచి మొదలుపెడితే మిర్చి, పొగాకు, అరటి, మామిడి, టమాటా, సజ్జలు, పెసలు, మినుములు, చీని, ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులే. ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సింది పోయి ప్రైవేటుకి ఎక్కువగా కేటాయించి దళారీలతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏ రోజైనా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కడం చూశామా?ప్రజారోగ్యం నేడు గాలికి..వైద్య రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన హయాంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేవారు. 105 రకాల మందులు అందుబాటులో ఉండేవి. అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్ చేసేవారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు సేవలందించేవారు. అన్ని ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అమలు చేసి నియామకాలు చేపట్టాం. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే.. మన హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. 1,000 ప్రొసీజర్లను 3,300 వరకు తీసుకెళ్లాం. ఆరోగ్య ఆసరా తెచ్చి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తెరమరుగైపోయాయి. ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. ఈ 16 నెలలకు గాను రూ.4,800 కోట్లు అవసరం. కానీ ఈ పెద్ద మనిషి రూ.1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.3,800 కోట్లు పెండింగ్ పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేశాయి. 108, 104 సర్వీసుల నిర్వహణ స్కాములమయం. కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని, టీడీపీ ఆఫీస్ బేరర్గా ఉన్నవారికి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించారు. ఇక అది కుయ్.. కుయ్ అని ఏమంటుంది? బుయ్.. బుయ్ అంటుంది.ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నాడు మనం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చి ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉద్యోగులకు మనం తోడుగా ఉన్నామన్న భరోసాను కల్పించడంతో పాటు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలి. -
ప్రజల జీవితాల్లో మార్పే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా 24 సంవత్సరాలు పూర్తిచేసుకొని మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 12 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో ఓటమి ఎరుగని ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘నా తోటి భారతీయులు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. ప్రభుత్వాధినేతగా నేను 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు స్థిర చిత్తంతో గట్టి ప్రయత్నం చేశాను. ఈ గొప్ప దేశ ప్రగతికి నా వంతు కృషి చేశాను’అని పేర్కొన్నారు.నిరాశ నుంచి గొప్ప స్థాయికి పయనం తాను 2014లో దేశ ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశంలో అవినీతి, ప్రజల్లో నిరాశ, నిస్పృహ నెలకొని ఉన్నాయని.. తన 11 ఏళ్ల పదవీ కాలంలో దేశం ఆ పరిస్థితి నుంచి బయటపడి.. ఎంతో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ‘2014 సార్వత్రిక ఎన్నికల కోసం 2013లో నన్ను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొనే నాటికి యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుటిలతత్వం, విధాన వైఫల్యాలకు పర్యాయపదంగా ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంబంధాలు కలిగి ఉంది. కానీ, విజు్ఞలైన భారతీయులు మా కూటమికి, మా పారీ్టకి ఎన్నికల్లో అద్భుత మెజారిటీ ఇచ్చారు.గత 11 ఏళ్లలో మనమంతా కలిసి ఎంతో మార్పు తీసుకొచ్చాం. ముఖ్యంగా మన మహిళా శక్తి, యువశక్తి, అన్నదాతలు ఎంతో స్వయంసమృద్ధి సాధించారు. 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ అద్భుత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది’అని ప్రధాని పేర్కొన్నారు.సవాళ్లే నన్ను బలంగా మార్చాయి ప్రభుత్వాధినేతగా మొదట్లో తాను ఎదుర్కొన్న సవాళ్లే తనను శక్తిమంతంగా మార్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదట అధికారం చేపట్టేనాటికి భారీ భూకంపం, తీవ్రమైన తుఫాన్, వరుస కరువులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. బలమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేసేందుకు, గుజరాత్ను పునరి్నరి్మంచేందుకు ఆ సవాళ్లు నన్ను శక్తిమంతుడిని చేశాయి. నాడు గుజరాత్ను ఇక బాగు చేయలేం అన్నారు. కానీ, అందరం కలిసికట్టుగా కష్టపడి సుపరిపాలనకు గుజరాత్ను పవర్హౌస్గా మార్చాం’అని చెప్పారు.తన తల్లి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసే సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పారు. నీ పని ఏమిటో నాకు సరిగా తెలియదు కానీ.. రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఒకటి.. నువ్వు ఎప్పుడూ పేదల బాగు కోసమే పనిచేయాలి. రెండు.. లంచం తీసుకోవద్దు అని చెప్పారు. నేను కూడా ప్రజలకు అదే చెప్తాను. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. -
కెనరా హెచ్ఎస్బీసీ @ రూ. 100–106
న్యూఢిల్లీ: బీమా రంగ కంపెనీ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 100–106 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 2,516 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 9న షేర్లను ఆఫర్ చేయనుంది. లిస్టింగ్లో కంపెనీ విలువ రూ. 10,000 కోట్లుగా నమోదయ్యే వీలుంది.ఈ భాగస్వామ్య సంస్థలో పీఎస్యూ కెనరా బ్యాంక్కు 51%, హెచ్ఎస్బీసీ గ్రూప్ కంపెనీ హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ (ఏషియా పసిఫిక్) హోల్డింగ్స్కు 26% చొప్పున వాటా ఉంది. ఐపీవోలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు(14.5 శాతం వాటా), హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ 47.5 లక్షల షేర్లు(0.5 శాతం వాటా)తోపాటు.. ఇన్వెస్టర్ సంస్థ పంజాబ్ నేషనల్బ్యాంక్ (పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు(10 శాతం వాటా) విక్రయించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 140 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ బాటలో ఈ నెల 9న కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఐపీవో సైతం ప్రారంభం కానుంది. ఇది 13న ముగియనుంది. -
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
32 అడుగుల ఎత్తు.. 45 కి.మీ. నిడివి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే మార్గంలో సుమారు 32 అడుగుల ఎత్తు, 45 కి.మీ. నిడివితో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దాదాపు ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించగా అందులో వన్యప్రాణులు సంచరించే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి మిగతా భాగాన్ని దానికి అప్రోచ్ రోడ్డుగా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 7,690 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా అందులో సగం వ్యయం భరిస్తామని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సవరించిన అంచనాలను తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ. 8 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అందులో రూ. 4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. విస్తరణ జరగక పెరిగిన ట్రాఫిక్.. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రోడ్డును గతంలో మన్ననూరు వరకు విస్తరించగా అక్కడి నుంచి దట్టమైన అడవి ఉండటం.. అదే మార్గంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం కూడా ఉండటంతో రోడ్డు విస్తరణకు కేంద్రం అనుమతించలేదు. దీంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సాధారణ రోడ్డే కొనసాగుతోంది. దీనికితోడు వన్యప్రాణుల కదలికల దృష్ట్యా నిత్యం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల ఉదయం వేళల్లో ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీంతో రోడ్డు విస్తరణ తప్పనిసరైంది. అయితే భూఉపరితలంలో విస్తరణ సాధ్యం కానందున వన్యప్రాణులకు అంతరాయం కలగని రీతిలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన ఏడాదిన్నర క్రితం తెరపైకి వ చ్చింది. కానీ దాని బదులు కేబుల్ కార్ నిర్మిస్తే రూ. 2,270 కోట్లు ఖర్చవుతుందన్న ఉద్దేశంతో ఆ మేరకు ప్రతిపాదన సమర్పించా లని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. అలాగే సొరంగ మార్గం ప్రతిపాదన కూడా తెరపైకి వ చ్చింది. ఎట్టకేలకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇ చ్చింది. కారిడార్కు ఇరువైపులా ఇనుపకంచెలు, నాయిస్ బ్యారియర్లు.. వన్యప్రాణులకు ఆటంకం కలగని విధంగా ఎలివేటెడ్ కారిడార్ను చేస్తున్నారు. వాహనాల చప్పుడు ఎక్కువ వినిపించకుండా ఉండేందుకు, జంతువులు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు 32 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించనున్నారు. వాహనాలు కింద పడకుండా.. వాహనదారులు కింద ఉండే అటవీ ప్రాంతంలోకి చెత్త విసరకుండా రోడ్డుకు ఇరువైపులా ఎత్తయిన ఇనుప కంచెలు ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో వాహనాల శబ్దంతో జంతువులు ఇబ్బంది పడకుండా రోడ్డుకు ఇరువైపులా నాయిస్ బ్యారియర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్టెక్ దన్ను.. ఫిన్టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్టెక్లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్గ్లాసెస్తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
ఏఐతో..గుత్తాధిపత్యం
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ) సాంకేతికత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోంది. అదేసమయంలో పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) హెచ్చరించింది. ఏఐ, దాని ప్రభావంపై మార్కెట్ అధ్యయనం నిర్వహించిన సీసీఐ, గత నెలలో ఇందుకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఏఐ మార్కెట్లో కొన్ని బడా టెక్నాలజీ సంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో గుత్తాధిపత్యానికి దారితీసి, ఆరోగ్యకరమైన పోటీని దెబ్బ తీస్తుందని ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్గారిథమ్ల ద్వారా రహస్య కుమ్మక్కు, ధరల వివక్ష, స్టార్టప్లకు అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ 2020లో 93.24 బిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 186.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఏఐ మార్కెట్ పరిమాణం 2020లో 3.20 బిలియన్ డాలర్లుండగా 2024 నాటికి 6.05 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2031 నాటికి ఇది 31.94 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలు ఏఐ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.బడా కంపెనీలదే పెత్తనం సీసీఐ నివేదిక ప్రకారం, ఏఐ పర్యావరణ వ్యవస్థను (ఏఐ ఎకో సిస్టం) కొన్ని పొరలుగా (ఏఐ స్టాక్) విభజించారు. ఇందులో డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (క్లౌడ్ కంప్యూటింగ్, చిప్స్), డెవలప్మెంట్ (అల్గారిథమ్స్, ఫౌండేషన్ మోడల్స్) వంటి కీలకమైన ప్రాథమిక (అప్స్ట్రీమ్) పొరలు ఉన్నాయి. ఈ కీలకమైన రంగాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఎన్విడియా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలదే పూర్తి ఆధిపత్యం. మనదేశంలోని దాదాపు 67% స్టార్టప్లు కేవలం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసే (డౌన్స్ట్రీమ్) స్థాయిలోనే పనిచేస్తున్నాయి. ఇవి తమ కార్యకలాపాల కోసం పూర్తిగా ఈ బడా సంస్థల క్లౌడ్ సేవలు, టెక్నాలజీలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది మార్కెట్లో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మార్కెట్ను శాసించే అల్గారిథమ్స్ ఏఐ రాకతో మార్కెట్లో పోటీతత్వం స్వరూపమే మారిపోతోంది. ముఖ్యంగా, ధరలను నిర్ణయించే అల్గారిథమ్ల వాడకం పెరగడం పెను సవాలుగా మారింది. సీసీఐ నివేదిక ప్రకారం, అల్గారిథమ్ల ద్వారా కంపెనీలు రహస్యంగా కుమ్మక్కయ్యే (అల్గారిథమ్ కొల్యూషన్) ప్రమాదం పొంచి ఉంది. మనుషుల ప్రమేయం లేకుండానే, అల్గారిథమ్లు ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటూ ధరలను కృత్రిమంగా పెంచే అవకాశం ఉంది. ఈ నివేదిక కోసం సర్వే చేసిన స్టార్టప్లలో 37% మంది అల్గారిథమిక్ కుమ్మక్కుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ‘టాప్కిన్స్’కేసు, యూకేలో ‘ట్రాడ్/జీబీ ఐ’కేసు వంటివి ఇందుకు నిదర్శనాలని నివేదిక ఉదహరించింది. అంతేకాకుండా, వినియోగదారుడి కొనుగోలు శక్తి, ప్రవర్తనను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో ధరను చూపే ‘ధరల వివక్ష’కూడా పెరిగిపోతోందని, దీనిపై 32% స్టార్టప్లు ఆందోళన చెందాయని సర్వేలో తేలింది.ప్రవేశానికి అడ్డంకులు.. స్టార్టప్లకు సవాళ్లుఏఐ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే స్టార్టప్లకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని సీసీఐ అధ్యయనంలో వెల్లడైంది. స్టార్టప్లు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకుల్లో 68% మంది డేటా లభ్యత అతిపెద్ద అడ్డంకిగా పేర్కొన్నారు. అత్యుత్తమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి భారీ మొత్తంలో నాణ్యమైన డేటా అవసరం, కానీ అది బడా సంస్థల వద్దే పోగుపడి ఉంది. 61% మంది క్లౌడ్ సేవలు అత్యంత ఖరీదైనవిగా మారాయని తెలపడం ఇందుకు ఉదాహరణ. 61% మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకడం కష్టంగా ఉందని చెప్పారు. 66% మంది నిపుణులు సులభంగా అందుబాటులో లేరని అభిప్రాయపడ్డారు. 59% మంది కంప్యూటింగ్ సౌకర్యాల ఖర్చు అడ్డంకిగా భావించారు. 56% మంది స్టార్టప్లు నిధులు సమీకరించడం పెద్ద సవాలుగా ఉందని తెలిపారు. సర్వే ప్రకారం, 83% స్టార్టప్లు సొంత నిధులతోనే నడుస్తున్నాయి. తదుపరి దశ నిధులు పొందడం చాలా కష్టంగా ఉందని 50% మంది పేర్కొన్నారు. ఈ అడ్డంకుల వల్ల ఆవిష్కరణలు తగ్గి, మార్కెట్లో పోటీతత్వం నీరుగారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొని, ఏఐ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు సీసీఐ తన నివేదికలో పలు కీలక సూచనలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది. అందులోని అంశాలివీ... స్వీయ–తనిఖీ : ఏఐ వ్యవస్థలను వినియోగించే సంస్థలు, తమ అల్గారిథమ్లు పోటీ చట్టాలకు విరుద్ధంగా పనిచేయకుండా చూసేందుకు స్వీయ–తనిఖీ విధానాన్ని పాటించాలి. ఇందుకు ఒక మార్గదర్శక పత్రాన్ని సీసీఐ జతచేసింది. పారదర్శకత: ఏఐ ఆధారిత నిర్ణయాల విషయంలో కంపెనీలు పారదర్శకతను పాటించాలి. ఏఐని ఏ ఉద్దేశంతోవాడుతున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. అవగాహన కార్యక్రమాలు: ఏఐ, పోటీ చట్టాలపై వాటాదారులందరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, వర్క్షాపులు నిర్వహిస్తుంది. అడ్డంకుల తొలగింపు: స్టార్టప్లకు అవసరమైన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం: ఏఐకి సంబంధించిన అంశాలు బహుళ నియంత్రణ సంస్థల పరిధిలోకి వస్తున్నందున, వాటి మధ్య సమన్వయం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీసీఐ భావిస్తోంది. అంతర్జాతీయ సహకారం: ప్రపంచవ్యాప్తంగా ఉన్నకాంపిటీషన్ ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ద్వారాఅంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మొత్తమ్మీద ఏఐ సాంకేతికతను ప్రోత్సహిస్తూనే, మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణులను అరికట్టి, చిన్న సంస్థలు, స్టార్టప్లు కూడా రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించేలా పటిష్టమైన నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరముందని సీసీఐ స్పష్టం చేసింది. -
నాలుగో రోజూ లాభాలే
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.అయితే ద్వితీయార్ధంలో ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో టెలికం 2.13%, రియల్టీ 1.09%, ఇంధన 0.50%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.28%, ఫైనాన్సియల్ సర్విసెస్ 0.24%, ఐటీ 0.23 శాతం లాభపడ్డాయి. ⇒ లాజిస్టిక్స్ సర్విసు ప్రొవైడర్ గ్లోటిస్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.129)తో పోలిస్తే బీఎస్ఈలో 32% డిస్కౌంటుతో రూ.88 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 37% క్షీణించి రూ.81 కనిష్టాన్ని తాకింది. చివరికి 35% పతనంతో రూ.84 వద్ద నిలిచింది.⇒ ఇష్యూ ధర (రూ.191) వద్దే ఫ్లాటుగా లిస్టయిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ షేరూ మెప్పించలేకపోయింది. ఇంట్రాడేలో 5% పతనమై రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 4.5% నష్టంతో రూ.182 వద్ద స్థిరపడింది. -
బూత్ల వారీగా ప్రచార బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బుధవారం హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బూత్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ప్రతికూలంగా స్పందిస్తే ఇతర ప్రాంత నేతలకు కూడా జూబ్లీహిల్స్లో పార్టీ తరపున బాధ్యతలు అప్పగించే అవకాశముంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చిన రీతిలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇతర జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ప్రచార పర్వంలో మోహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.నేడు మరోమారు భేటీజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు బుధవారం బీఆర్ఎస్ కీలక నేతలు మరోమారు భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితోపాటు ఒకరిద్దరు కీలక నేతలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందున ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, హాల్ మీటింగ్స్ ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్పై చర్చిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశముంది.ఆర్టీసీ ప్రైవేటీకరణకు యత్నంఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ టికెట్ ఇస్తూ భర్త నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అలాగే పిల్లల బస్పాస్ల రేట్లు పెంచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చార్జీల పెంపు ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటోందని విమర్శించారు. చార్జీల పెంపుతో ఒక్కో కుటుంబంపై 20 శాతం మేర అదనపు భారం పడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తోందన్నారు. హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కనందునే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు చార్జీలు పెంచిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చార్జీల పెంపునకు కాంగ్రెస్ పార్టీ ప్రతిఫలాన్ని అనుభవిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
బంగారం @ 4,000
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది. ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నట్టు చెప్పారు. దేశీయంగా రూ.1.24 లక్షలు ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది. -
సౌర తుపానుతో..మన ఆరోగ్యానికీ ముప్పే!
‘శక్తిమంతమైన సౌర తుపాను భూమిని తాకింది.. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల శాటి లైట్లు, పవర్గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభా వితం అయ్యే అవకాశం ఉంది’ ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఔను, నిజమే. సూర్యుడి నుంచి ఉత్పన్న మయ్యే సౌర తుపాన్లు అంత ప్రభావవంతమైనవే, ప్రమాదకరమైనవే. అది ఆయా వ్యవస్థలనేకాదు.. మానవుల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. సౌర తుపాన్ల వంటి వాటివల్ల ప్రభావితమయ్యే భూ అయస్కాంత క్షేత్రం.. మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతోందట.బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎన్పీఈ), యూనివ ర్సిటీ ఆఫ్ సావో పాలో సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వ హించాయి. గుండెపోటు సమస్య ఉన్న 1,340 మంది.. ఇందులో 871 మంది పురుషులు, 469 మంది స్త్రీల ఆసుపత్రి వివరాలను పరిశీలించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రతను... సాధారణం, ఒక మోస్తరు, తీవ్రస్థాయి అనే 3 రకాలుగా విభజించారు. పేషంట్లను కూడా వయసుల వారీగా.. 30 అంతకంటే తక్కువ వయసున్నవారు, 31–60 ఏళ్లవారు, 60 ఏళ్లకు పైబడినవారు.. ఇలా మూడు వర్గాలుగా విభజించారు. మూడు రెట్లు ఎక్కువ.. సౌర తుపాను వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పులు గుండెపోటును ప్రభావితం చేశాయని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా సౌర తుపాను సమయంలో గుండెపోటు అవకాశాలు మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రత ‘సాధారణం’తో పోలిస్తే ‘తీవ్రస్థాయి’లో ఉన్నప్పుడు గుండెపోట్లు మూడు రెట్లు ఎక్కువగా వచ్చాయట. రక్తపోటు పెరుగుతోంది..: పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5 లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డులను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. జీఎంఏలో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా బీపీలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయట. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌర తుపాను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఊపిరితిత్తులు.. నాడీ వ్యవస్థ..: 2022లో సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన మరో అధ్యయనంలో.. సౌర తుపాన్ల వల్ల భూ అయస్కాంత ఆవరణలో వచ్చే మార్పులు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తాయని తేలింది. ఆ సమయంలో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే ఆ సమయంలో నాడీ వ్యవస్థ పనితీరు కూడా ప్రభావితమైందట.సూర్య – ఏఐ..: సౌర తుపాన్లను, వాటి తీవ్రతను అంచనా వేయ డానికి అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా, ఐబీఎమ్ కంపెనీ సహకారంతో సూర్య అనే ఏఐ వ్యవస్థను రూపొందించింది. శాటిలైట్లు, పవర్గ్రిడ్లు, కమ్యూ నికేషన్ వ్యవస్థలకు ప్రమాదకరమైన సౌర తుపాన్లు వచ్చినప్పుడు ఇది అప్రమత్తం చేస్తుంది.5 లక్షల మందిపై..సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే వేడి గాలులు భూ అయస్కాంత ఆవరణాన్ని ప్రభావితం చేసి.. మన రక్తపోటు పెంచుతాయని చైనాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. సౌరతుపాన్ల వల్ల భూ అయాస్కాంతావరణంలో (జీఎంఏ) సంభవించే మార్పులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయనే దానిపై అధ్యయనం సాగింది. –సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఏడాదిలో మేడిగడ్డ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ను ఏడాదిలోగా పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్ల రూపకల్పనతోపాటు ఇతర సాంకేతిక అంశాల్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు సహకారం అందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించామన్నారు. ఐఐటీ లేదా ఇతర ప్రతిష్టాత్మక సంస్థను కన్సల్టెంట్గా నియమించి.. డిజైన్ల రూపకల్పన, బరాజ్లకు జియోఫిజికల్, జియోటెక్నికల్ వంటి పరీక్షలతో పాటు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తామని చెప్పారు. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ 7వ నంబర్ బ్లాక్కు మరమ్మతులు నిర్వహించాలా? దానిని పూర్తిగా తొలగించి కొత్త బ్లాక్ను పునర్నిర్మించాలా? అనే అంశంపై సైతం కన్సల్టెన్సీ సహకారం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖపై మంగళవారం ఉత్తమ్ సచివాలయంలో సమీక్షించారు. 6 నెలల్లో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ పూర్తి ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఆధారంగా జస్టిస్ బ్రిజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్వహిస్తున్న విచారణ మరో ఆరు నెలల్లో పూర్తికావొచ్చని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ వాదనలు పూర్తయిన తర్వాత రిజాయిండర్ వాదనలు వినిపించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహితకు రెండు అలైన్మెంట్లు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి తీరుతామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కి.మీ.ల గ్రావిటీ ద్వారా మైలారానికి నీటిని తీసుకొచి్చ, అక్కడి నుంచి 14 కి.మీ.ల సొరంగ మార్గం ద్వారా సుందిళ్ల బరాజ్కు నీటిని తరలించాలనే ఓ ప్రతిపాదన ఉందని చెప్పారు. మైలారం వద్ద పంప్హౌస్ నిర్మించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్లోకి నీటిని ఎత్తిపోయాలనే మరో ప్రతిపాదనను సైతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ రెండు అలైన్మెంట్లలో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసి ఈ నెల 22లోగా సిఫారసు చేయాలని నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్ నేతృత్వంలోని కమిటీని ఆదేశించారు. త్వరలో ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. వర్షాలు ముగిసిన వెంటనే పనులు ప్రారంభించాలని, ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తామన్నారు. సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలోని స్థితిగతులను తెలుసుకోవడానికి నిర్వహించనున్న హెలికాప్టర్ ఆధారిత సర్వేకు త్వరలో పౌర విమానయాన శాఖ డీజీ (డీజీసీఏ) నుంచి అనుమతులు వస్తాయన్నారు. సమ్మక్కపై సీడబ్ల్యూసీ అనుమానాలను నివృత్తి చేయాలి సమ్మక్క–సారక్క ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అనుమానాలను సత్వరంగా నివృత్తి చేసి ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను పొందా లని అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకే జీ–6 అంచనాల పెంపుతోపాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతించామని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకుగాను తక్షణమే భూసేకరణకు రూ.33 కోట్లు విడుదల చేయాలన్నారు. సమీక్షలో శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్, ఈ ఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
డాల్ఫిన్ పేరెంటింగ్..పిల్లల పెంపకంలో'కింగ్'!
తమ పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు...తమ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ ఇంకొందరు..ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతారని కోప్పడటానికే భయపడిపోయే తల్లిదండ్రులు ఇంకొందరు.తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకునేవారు.. పిల్లల విషయాల్లో అతిగా జోక్యం చేసుకునేవాళ్లు..పిల్లలు చదువులో రాణించాలని వారిపై తమ ఇష్టాయిష్టాలు రుద్దేవారు..ఇలా రకరకాల పేరెంట్స్. ఎవరు చేసేది వారికి కరెక్టుగానే అనిపిస్తుంది. మరి, వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్? ఏది బెస్ట్ పేరెంటింగ్?ఈ రోజుల్లో పేరెంటింగ్.. అత్యంత కష్టమైన పని. కృత్రిమ మేధనైనా సృష్టించవచ్చు, నియంత్రించవచ్చుగానీ పిల్లల పెంపకం మాత్రం సులభంగా చేయలేం.– ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెబుతున్న మాటలివి. నిజమే. ఒకప్పటిలా ఇప్పటి రోజులు లేవు. ఇన్ని ప్రభావాలూ లేవు.తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా ఒకప్పటిలా లేదు. రకరకాల తల్లిదండ్రులు మనకు సమాజంలో కనిపిస్తున్నారు. మూడు ప్రధానమైన పేరెంటింగ్ విధానాల్లో ‘డాల్ఫిన్ పేరెంటింగ్’ మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.హెలికాప్టర్ పేరెంటింగ్..: చెప్పాలంటే బొమ్మరిల్లులోని ప్రకాష్ రాజ్ లాంటి తండ్రి లేదా తల్లి. తమ పిల్లలు కాలు కింద పెట్టకుండా.. ఎండ కన్నెరుగకుండా.. వారికి ఏమాత్రం కష్టం కలగకుండా చూసుకునేవారు. వారి గురించి అతిగా ఆలోచిస్తూ.. నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ.. వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునేవాళ్లు. ఈ విషయాన్ని తమ బంధుమిత్రులకు గొప్పగా చెప్పుకోడానికి కూడా ఇష్టపడతారు. పిల్లలపై ప్రభావం..: ఇలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు స్వతంత్రంగా ఆలోచించలేరు, నిర్ణయాలు తీసుకోలేరు, సమస్యలను పరిష్కరించలేరు, భావోద్వేగాల నియంత్రణ ఉండదు. ఇది పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వదు. ఇలాంటి తల్లిదండ్రులంటే పిల్లలకు భయం ఉండదు కానీ.. వారిని తప్పించుకు తిరగాలన్న మనస్తత్వం ఉంటుంది. టైగర్ పేరెంటింగ్వీళ్లు చండశాసనులు. చాలా స్ట్రిక్టుగా ఉంటారు. తమ పిల్లలు చదువులోనూ, సంగీతం వంటి ఇతర అంశాల్లోనూ కచ్చితంగా రాణించాలని, పేరు ప్రతిష్ఠలు (తమకూ వస్తాయన్న స్వార్థం కూడా అంతర్లీనంగా ఉంటుంది) సంపాదించాలని వారిపై ఒత్తిడి తెస్తుంటారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, లక్ష్యాల పేరిట పిల్లలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పిల్లలను ఆధిపత్య ధోరణితో పెంచుతారు. వారిలో తమ పట్ల భయం ఉందన్న విషయాన్ని తమ చుట్టుపక్కల వారికి తెలియాలని అనుకుంటారు. పిల్లలపై ప్రభావంఇలాంటి పేరెంట్స్ అంటే పిల్లలు భయపడతారు.. వీలైనంతవరకు తప్పించుకు తిరగాలని చూస్తారు. పిల్లలపై నిత్యం ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ విఫలమవుతామోనన్న భయం వెంటాడుతుంటుంది. తమ తల్లిదండ్రులు ఉన్నంత వరకు క్రమశిక్షణతో ఉన్నట్టు కనపడే ఈ పిల్లలు.. వాళ్లు లేరని లేదా తమ గమనించడం లేదని తెలిస్తే మాత్రం కట్టుబాట్లన్నీ పక్కనపెట్టేస్తారు. డాల్ఫిన్ పేరెంటింగ్వీళ్లు పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. పిల్లలతో మరీ కఠినంగానూ ఉండరు, అలాగని పూర్తిగా వదిలేయరు. అన్ని విషయాల్లోనూ సమతూకం పాటిస్తారు. అతిగా షరతులు పెట్టరు. అలాగని క్రమశిక్షణకూ విలువిస్తారు. పిల్లలను స్వతంత్రంగా ఆలోచించనిస్తారు. వారికి మరీ కష్టంగా ఉన్నప్పుడు లేదా ఇక వారికి సాధ్యం కాదు అనుకున్నప్పుడు చేయూతనిస్తారు. వారితో ఆత్మవిశ్వాసం నింపుతారు. దీన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా మాటల్లో చెప్పాలంటే.. కొన్ని విషయాల్లో స్పష్టమైన నిబంధనలు పెడతారు. ఉదాహరణకు.. రాత్రిపూట పడుకునేముందు ఫోన్లు ఉండకూడదు. ఒక వయసు వచ్చే వరకూ సోషల్ మీడియాను ఎంకరేజ్ చేయరు. ప్రతిరోజూ స్క్రీన్ టైమ్ విషయంలో కచ్చితంగా ఉంటారు. అయితే ఈ విషయాలను ఆధిపత్య ధోరణితో కాకుండా.. వారికి అర్థమయ్యేలా చెప్తారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన కెనడాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ షిమి కాంగ్ దీనిపై ‘ద డాల్ఫిన్ పేరెంట్ ః ఎ గైడ్ టు రెయిజింగ్ హెల్తీ, హ్యాపీ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ కిడ్స్’ పుస్తకం కూడా రచించారు.పిల్లలపై ప్రభావంపిల్లలకు తమ హద్దులేంటో తెలుస్తాయి. అందువల్ల అలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉన్నా దాన్ని శిక్షలా కాకుండా.. తమ మంచి కోసమే అని అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటారు. వాళ్లంటే భయపడకుండా.. వారితో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటారు. -
సెకండ్ లైఫ్
అందరూ పనిచేసి రిటైర్ అయ్యే వయసులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు ఆరు పదుల వయసు దాటిన ఈ మహిళలు. ఇటీవల జరిగినపారిస్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది 60 ఏళ్ల జర్మన్ మోడల్ గినా. భారతదేశంలో రాజస్థాన్ వాసి 60 ఏళ్ల ముక్తాసింగ్(Mukta Singh) మోడలింగ్ను కెరియర్గా ఎంచుకొని, అందానికి కొత్త నిర్వచనం చూపుతోంది. అరవై ఏళ్ల వయసులో వీరి ఆరోగ్యకరమైన జీవనశైలి 20 ఏళ్ల యువతులకు కూడా స్ఫూర్తిని కలిగిస్తోంది.మలివయసును అందంగా తీర్చిదిద్దుకోవడానికి గినా, ముక్తా లనే ఉదాహరణగా తీసుకోవచ్చు.గినా డ్రెవాలోవ్సీ్క జర్మన్ మోడల్. కంటెంట్ క్రియేటర్. 60 ఏళ్ల వయసులో అందం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని కొత్తగా మలుచుకుంది. ఇటీవలపారిస్ ఫ్యాషన్ వీక్లో ఐకానిక్ లె డే ఫైల్ షో సందర్భంగా రన్ వే పై నడిచింది గినా. ఆమె ప్రదర్శన ఫ్యాషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రతిచోటా మహిళలు తమ బలాన్ని, సామర్థ్యాన్ని ఎంతలా నమ్ముకోవచ్చో లోకానికి చూపింది.బోల్డ్ విజన్..: గినా డ్రెవాలోవ్స్కీకంటెంట్ క్రియేటర్, ఫ్యాషన్ ప్రపంచంలోకి 58 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది గినా. ఐదు పదులు దాటిన మహిళలకు సాధికారత కల్పించడం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, స్వీయప్రేమను ప్రోత్సహించడమే లక్ష్యంగా కంటెంట్ను సృష్టించడం ప్రారంభించింది. 30 ఏళ్లపాటు ఫ్యాషన్ పరిశ్రమలోని దిగ్గజాలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెది. కమ్యూనికేషన్, మార్కెటింగ్లో రాణించింది. డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి తన ఉత్సాహకరమైన జీవనానికి ఊపిరిపోసింది.గినా సోషల్ మీడియా ద్వారా తన ప్రయాణాన్ని పంచుకుంటూ ‘58 ఏళ్ల వయసులో నేను సున్నా నుండి నా జీవితాన్ని ప్రారంభించాను. నచ్చిన పని, దూర దృష్టి, నా బలం, నమ్మకం, ఫీల్గుడ్ పవర్ను నా చుట్టూ ఉన్నవారిలో నింపడానికి ఇదో మార్గంగా ఎంచుకున్నాను. 60 ఏళ్ల వయసులోపారిస్లో రన్వేపై నడవడం సాధారణమైనది కాదు. అది నా వయసున్న ఎంతోమందికి సందేశం. వయసు మన ఆలోచనలను పరిమితం చేయదు’ అని తెలియజేసింది. ఆమె చేసిన ఈ పని చాలామందిని ఆకట్టుకుంది. వృద్ధాప్య జీవనాన్ని అందంగా మలుచుకోవాలనేవారికి గినా రోల్మోడల్గా నిలిచింది. వృద్ధాప్యంలోనూ ఆమె చర్మం, శరీరాకృతి, వెలుతురు నింపుకున్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. గినా కథ కేవలం ఫ్యాషన్ విజయం మాత్రమే కాదు. ఆమె పట్టుదల, శక్తి, జీవనశైలి, సానుకూల మనస్తత్వానికి నిదర్శనం. మహిళలు అనుకుంటే తమ జీవనాన్ని ఎలా మార్చుకోగలరో, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలరో, అద్భుత విజయాలను ఎలా సొంతం చేసుకోగలరో ఉదాహరణగా చూపిస్తుంది. కలలను కొనసాగించే విషయంలో వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని మరోమారు నిరూపించింది.స్టైలిష్ అమ్మమ్మ: ముక్తాసింగ్తెల్లని జుట్టుతో మోడలింగ్ను కెరీర్గా తీసుకుని విజయవంతంగా రాణిస్తోంది 62 ఏళ్ల ముక్తాసింగ్. తల్లి, అమ్మమ్మ నుండి ప్రేరణ పొందాను అని చెప్పే ముక్తా సింగ్ రాజస్థాన్ వాసి. తన సెకండ్ జర్నీ గురించి సోషల్ మీడియా ద్వారా వీక్షకులకు తరచూ చెబుతూనే ఉంటుంది. ఆత్మగౌరవాన్ని అందాన్ని పునర్ నిర్వచించడంలోని ప్రాముఖ్యతను వివరిస్తుంది. వయసు కారణంగా గుర్తింపును పరిమితం చేయలేమని చెబుతుంది. ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?50 ఏళ్ల వయసులో మోడల్ కావాలని నిర్ణయించుకొని, అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ముక్తాసింగ్ చాలా విమర్శలను ఎదుర్కొంది. ఎగతాళి చేసే కామెంట్స్కు బాధపడింది. కానీ, ఎవరి కోసమో తన తీరు మార్చుకోనవసరం లేదని, తనకు ఎంతో ఇష్టమైన పనిని ఎంచుకుంది. ముక్తా చిన్నతనంలో స్టైలిష్గా ఉండే వృద్ధమహిళలను ఎప్పుడూ మెచ్చుకునేది. ‘మా అమ్మమ్మపెద్ద వయసులోనూ బెంగాలీ కాటన్ చీరలలో ఎంతో అందంగా కనిపించేది. మరణశయ్యపై ఉండి కూడా మంచి దుస్తులు ధరించాలని కోరుకునేది. వృద్ధాప్యంలో స్టైలిష్గా ఉండటం గురించి ఆలోచనే అవసరం లేదనే మాటలను పట్టించుకోకూడదు. అది ఆత్మగౌరవానికి సంబంధించింది’ అని ముక్తా చెబుతుంది. ఇంగ్లిష్లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ముక్తా యుద్ధ విమాన పైలట్ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు పిల్లలను పెంచడంలో, కంటెంట్ రైటర్గానూ బిజీగా మారిపోయింది. ‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. నా పిల్లలు పెద్దవాళ్లయ్యాక వారిపాత చొక్కాలు, జీన్స్ వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయేదాన్ని. మెల్లగా వయసు పైబడటం జరిగిపోతూనే ఉంది. తెల్లబడుతున్న జుట్టుకు రంగు వేయాలన్న ఆలోచన కూడా లేదు. చాలా మంది జుట్టుకు రంగు వేసుకోకపోతే జీవితాన్ని వదులుకున్నట్టే అని చెప్పేవారు. కానీ, తెల్ల జుట్టుతోనే మెరుస్తాను చూడండి అని వారికి చెప్పేదాన్ని. ఇప్పుడు దానిని నిజం చేస్తున్నాను. మంచి పేరున్న కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నాను. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నాను. ఈ వయసులోనూ నా కలలను నెరవేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని వివరిస్తుంది ముక్తాసింగ్. ఆడ–మగ ఎవరైనా సరే, స్వీయ ఆవిష్కరణ, సాధికారత కోసం తప్పక ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని గినా, ముక్తా తమ జీవనం ద్వారా మనకు విలువైనపాఠాలు బోధిస్తున్నారు. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.వివాద నేపథ్యం ఇదీ..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చారు. సమాధాన పత్రాలను సరైన మోడరేషన్తో తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. ఈ అప్పీళ్లను విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఒకవేళ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
కలల రెక్కలతో...
కార్గిల్ యుద్ధ విషయాలు, విశేషాలు టీవీలో చూసిన సునీత పహాల్ మన రక్షణరంగంలోని వాయుసేనలో పనిచేయాలని కలలు కన్నది. అయితే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయి కల వెక్కిరింపుకు గురైంది. అలాంటి సమయాల్లో ఆకాశం కేసి చూసేది సునీత.‘ఆకాశం అందరిదీ కదా!’ఆ ఎరుకతోనే హరియాణాలోని చిన్న గ్రామం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో(indian air force ) వింగ్ కమాండర్ స్థాయికి చేరింది. ‘పరిమితులను పట్టించుకోకండి. పట్టుదలగా లక్ష్యంపై దృష్టి పెట్టండి’ అంటూ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది సునీత పహాల్ (Sunita Pahal)...హైదరాబాద్లో... నీలిరంగు యూనిఫామ్లో తమ కుమార్తె ఆత్మవిశ్వాసంతో కవాతు చేస్తూ గర్వంగా సెల్యూట్ చేయడాన్ని చూసి సునీత తల్లిదండ్రుల కళ్లు చెమర్చాయి. వారికి ఇది కేవలంపాసింగ్–అవుట్ పరేడ్ కాదు. కలను సాకారం చేసుకున్న కన్నకూతురుని అపురూపంగా చూసుకునే అవకాశం.కార్గిల్ యుద్ధం జరుగుతున్న కాలంలో, మంచుతో నిండిన భూభాగాల్లో పోరాడుతున్న మన సైనికులను టీవీలో చూసింది సునీత. వారి సాహసాల గురించి కథలు కథలుగా విన్నది. అవి తప మనసుపై చెరగని ముద్ర వేశాయి. ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనే కలకు బీజం వేశాయి.పెద్ద కలతో... చిన్న గ్రామం నుంచి హరియాణాలోని దతౌలీ అనే చిన్న గ్రామంలో అమ్మాయిల నోటివెంట ‘సైన్యంలో పనిచేయాలనేది నా కల’ అనే మాట కనీసం ఊహకు కూడా అందదు. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్) రాసింది. ఈ పరీక్ష కోసం ఎలాంటి శిక్షణా తీసుకోనప్పటికీ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది.‘సైన్యంలో మహిళలు పనిచేయలేరు. చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. పెళ్లి చేయడం కూడా కష్టం అవుతుంది. సునీతను ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్యంలో చేర్పించవద్దు’ అని ఇరుగు, పొరుగు, బంధువులు సునీత తల్లిదండ్రులకు చెప్పేవాళ్లు. సునీత తండ్రికి రెండు ఎకరాల భూమి ఉండేది. బతుకు బండి లాగడం అతడికి కష్టం అయ్యేది. అయినప్పటికీ పిల్లలను బాగా చదివించే విషయంలో రాజీ పడేవాడు కాదు.‘నీకు అయిదుగురు ఆడపిల్లలు. వచ్చిన కాస్తో కూస్తో డబ్బును పిల్లల చదువు పేరుతో వృథా చేయకు. వారి పెళ్లిపై దృష్టి పెట్టు’ అనేవారు చాలామంది. వారి ప్రతికూల మాటలు ఆయనను ప్రభావితం చేయలేక పోయాయి.కఠిన శిక్షణ... కన్నీటి ధారఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది సునీత. అంతమాత్రాన కథా సుఖాంతం కాలేదు. అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. శిక్షణ తనకు చాలా కష్టంగా అనిపించింది. ‘నేను చేయగలనా’ అని బెదిరిపోయింది. ఏడ్చింది. అయినప్పటికీ పట్టుదలతో శిక్షణ పూర్తి చేసింది. ఫస్ట్ పోస్టింగ్ ఈశాన్య రాష్ట్రాలలోని ప్రీమియర్ ఫైటర్ బేస్లో. ఎప్పుడూ అనుభవంలో లేని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. అయినాసరే, ఆపరేషన్స్ మేనేజ్ చేయడం నుంచి సంక్లిష్టమైన టెక్నికల్ అసైన్మెంట్స్ హ్యాండిల్ చేయడం వరకు ఎన్నో చేసేది.‘ఇవి చేస్తున్నది నేనేనా!’ అని కూడా అనిపించేది. ‘నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతిరోజూ కష్టపడ్డాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది సునీత.కష్టం వృథా పోలేదుధైర్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, అసాధారణమైన పనితీరు, అంకితభావాన్ని గుర్తించి ఇచ్చే వైమానిక దళ అధికారిక ప్రశంసపత్రాన్ని అందుకుంది సునీత. ‘అమ్మాయిలు సైన్యంలోకి ఎందుకు!’ అంటూ పిల్లల కలలకు అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఇలా అంటుంది సునీత...‘ఆకాశం అందరిదీ. మీ అమ్మాయిల కలలకు రెక్కలు ఇవ్వండి. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. నా కలకు నా తల్లిదండ్రులు అడ్డు చెబితే ఎయిర్ ఫోర్స్లోకి వచ్చేదాన్ని కాదు. వింగ్ కమాండర్ స్థాయికి చేరుకునేదాన్ని కాదు’ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?ఎన్నో రాత్రులు ఏడ్చాను!నేను అథ్లెట్ను కాదు. ఎప్పుడూ అయిదు కిలోమీటర్ల దూరం నడవలేదు. పుషప్లు ఎప్పుడూ చేయలేదు. అలాంటి నేను శిక్షణ కాలంలో రోజుకు పది కిలోమీటర్లు పరుగెత్తాల్సి వచ్చేది. గంటలపాటు డ్రిల్లింగ్ ఉండేది. ఎండ తట్టుకోవడం కష్టం అయ్యేది. ఇవి తట్టుకోలేక ఎన్నో రాత్రులు ఏడ్చాను. కాని ప్రతిరోజూ నిద్ర లేవగానే ఆ బాధను మరిచిపోయి, ఎంత కష్టమైనా చేయాల్సిందే అనుకునేదాన్ని. అడవులు, ఎడారులు... ఎక్కడైనా కావచ్చు, పురుషులతో సమానంగా మహిళలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళలు ఒకటికి రెండుసార్లు తమని తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. – సునీత పహాల్ -
ఆర్టీసీ డ్రైవర్లు, శ్రామిక పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి బుధవారం (అక్టోబర్ 8 ) ఉదయం 8 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుతోపాటు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్లో (నిర్దిష్ట గ్రూప్ అంటే గ్రూప్– ఐ /గ్రూప్– ఐఐ / గ్రూప్– ఐఐఐ యొక్క ఉప–వర్గీకరణతో) ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్ను పొందలేకపోతే, వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవచ్చని సూచించారు. అయితే, ఆయా అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్ను సమర్పించాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని వెల్లడించారు. కాగా, టీజీఎస్ ఆర్టీసీలోని మొత్తం వెయ్యి డ్రైవర్ పోస్టులకు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో డ్రైవర్పోస్టుకు పేస్కేల్ రూ.20,960 నుంచి రూ.60,080 కాగా, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030గా ఉన్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వివరాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఠీఠీఠీ.్టజpటb. జీnలో చూడాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
దబంగ్ ఢిల్లీ జైత్రయాత్ర
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న అశు మలిక్ సారథ్యంలోని దబంగ్ ఢిల్లీ లీగ్లో 11వ విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ ‘టైబ్రేక్’లో 9–3తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్ల స్కోర్లు 33–33తో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘5 రెయిడ్స్’ నిర్వహించారు. ఇందులో ఢిల్లీ 9 పాయింట్లతో సత్తాచాటగా... స్టీలర్స్ 3 పాయింట్లకే పరిమితమైంది. స్టీలర్స్కు ఇది వరుసగా నాలుగో పరాజయం. నిర్ణీత సమయంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున అజింక్య పవార్ 8 పాయింట్లు సాధించగా... నీరజ్, సౌరభ్ చెరో 6 పాయింట్లతో రాణించారు. స్టీలర్స్ తరఫున శివమ్ పతారే 10 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన ఢిల్లీ 11 విజయాలు, 1 పరాజయంతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్లో కొనసాగుతోంది. స్టీలర్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టిక ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 56–37 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 26 పాయింట్లతో విజృంభించగా... పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 16, అంకిత్ 14 పాయింట్లు సాధించారు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోవడంతో పైరెట్స్ ఓటమి తప్పలేదు. లీగ్లో భాగంగా బుధవారం హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
గూగుల్ నుంచి గూగుల్ వరకు
లక్ష్యాన్ని వీడక ప్రయత్నిస్తూ ఉంటే విజయం ఏదో ఒకనాటికి వరిస్తుందని రాగిణి దాస్(Ragini Das) నిరూపించింది. 12 ఏళ్ల క్రితం గూగుల్ ఇంటర్వ్యూకు హాజరైన రాగిణి అందులో సెలెక్ట్ కాలేదు. దాంతో జొమాటో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంది. జొమాటోలో చేరి ఆ సంస్థ ఉన్నతికి తోడ్పడింది. ఇప్పుడు గూగుల్ రాగిణిని పిలిచి మరీ గూగుల్ ఇండియాకు ‘హెడ్ ఆఫ్ స్టార్టప్స్’గా నియమించింది. బాణం ఒకసారి గురి తప్పేది ఈసారి కచ్చితంగా గురికి చేరుకోవడానికే అని నిరూపించిన రాగిణి దాస్ పరిచయం.‘అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అన్నాడో సినీ కవి. అందరి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు. కాని శ్రమ, పట్టుదల ఉంటే వెనుదిరిగిన చోటే మళ్లీ ముందడుగు వేయడం సాధ్యమని నిరూపించారు రాగిణి దాస్. ప్రస్తుతం ఆమె గూగుల్ మెచ్చిన బిజినెస్ స్ట్రాటజిస్ట్. అందుకే ఆ సంస్థ గూగుల్ ఇండియా స్టార్టప్స్ విభాగానికి ఇటీవల ఆమెను హెడ్గా నియమించింది. ఆశ్చర్యం ఏమంటే పన్నెండేళ్ల క్రితం అదే గూగుల్ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లి వెనుదిరిగిన ఆమె ప్రస్తుతం అదే సంస్థలో ఉన్నత ఉద్యోగానికి ఎంపికవడం విశేషం.చురుకైన విద్యార్థినిహరియాణా రాష్ట్రం గురుగ్రామ్లో జన్మించిన రాగిణి– చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్లో చదువుకున్నారు. చదువుతోపాటు అక్కడ ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గాపాల్గొన్నారు. ఆ తర్వాత లాన్ కాస్టర్ యూనివర్సిటీ (ఇంగ్లాండ్) నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. అక్కడ చదువుతున్న సమయంలోనే స్టాండర్డ్ చాటర్డ్ బ్యాంక్తోపాటు ఇతర సంస్థల్లో ఇంటర్న్గా పని చేశారు రాగిణి. భారతీయ మార్కెట్కు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించడంపై ఆ సమయంలోనే దృష్టి సారించారు.గూగుల్ కాదు పొమ్మంది2012లో ట్రిడెంట్ గ్రూప్ ఇండియా సంస్థ ద్వారా తన కెరీర్ని ప్రారంభించారు రాగిణి. మొదట స్వదేశంలో మార్కెటింగ్ పర్యవేక్షించిన ఆమె ఆ తర్వాత యూరప్, అమెరికాల మార్కెటింగ్నూ నిర్వహించారు. సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. 2013 ఆమె కెరీర్కు అత్యంత కీలకమైన సంవత్సరం. ఆ సమయంలో గూగుల్, జొమాటో సంస్థల్లో ఇంటర్వ్యూలకు వెళ్లారు రాగిణి. గూగుల్లో చివరి రౌండ్ దాకా నిలిచి, ఆ తర్వాత వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడు జొమాటో ఆమెను సగౌరవంగా సంస్థలోకి ఆహ్వానించింది.అలా జొమాటోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరిన రాగిణి అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో కీలకస్థానాల్లో పని చేశారు. 2017లో జొమాటో గోల్డ్ ఫౌండింగ్ టీంలో సభ్యురాలిగా మారి, సంస్థ ఉన్నతికి కృషి చేశారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ తదితర దేశాల్లో జొమాటో గోల్డ్ ఆరంభానికి ఆమె కీలకంగా వ్యవహరించారు. ‘జొమాటో నా కెరీర్ని తీర్చిదిద్దింది. నా భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాలు, స్నేహితులను అక్కడే పొందాను’ అని ఆమె అంటుంది.మహిళల కోసం...జొమాటో నుంచి బయటకు వచ్చాక 2020లో ఆనంద్ సిన్హాతో కలిసి ముంబయి కేంద్రంగా ఆమె లీప్.క్లబ్ అనే ఆన్ లైన్, ఆఫ్లైన్ క్లబ్ని స్థాపించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు, వృత్తి నైపుణ్యాలు, నెట్వర్కింగ్ అంశాలను చేరువ చేసేందుకు ఈ క్లబ్ పని చేసింది. ఈ ఏడాది మేలో దీన్ని నిలిపి వేసేనాటికి ఈ క్లబ్లో సుమారు 25 వేల మంది పెయిడ్ సభ్యులు ఉండటం విశేషం. ‘ఈ క్లబ్ వల్ల చాలా మంది మహిళలు మేలు పొందడం నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది రాగిణి. పలు కారణాలతో లీప్.క్లబ్ను ఆపేసిన అనంతరం తన పెంపుడు శునకం జిమ్మీతో ఉల్లాసంగా గడుపుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అదే సమయంలో గూగుల్ ప్రకటన ఆమెను ఆకర్షించింది.గూగుల్ నుంచి గూగుల్కు...గూగుల్ స్టార్టప్స్ ఇండియా హెడ్ స్థానానికి అభ్యర్థుల కోసం వెతుకుతున్న సమయంలో మరోమారు గూగుల్ గడప తొక్కారు రాగిణి. ఇన్నాళ్ల తన అనుభవం తప్పక ఆ స్థానాన్ని తనకు అందిస్తాయని నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. ఆమెను గూగుల్ ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలనకునే వారిని సమన్వయం చేసి, గూగుల్ ద్వారా వారికి తగిన ్రపోత్సాహం అందించడం, మెంటర్స్ను ఇవ్వడం, ఫండింగ్ రిసోర్సస్ను తెలియచేయడం ఆమె పని. ‘భూమిలాగే జీవితం కూడా గుండ్రంగా ఉంది’ అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు రాగిణి. -
భారత్, పాక్ మధ్య మ్యాచ్లు పదే పదే వద్దు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లలో ఆర్థిక అవసరాల కోసం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు పెట్టే సంస్కృతిని ఇప్పటికైనా వీడాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరగగా... మూడింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్పై విజయానంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచే ఇరు జట్ల కెపె్టన్లు, ఆటగాళ్ల మధ్య ‘షేక్ హ్యాండ్’ కూడా జరగలేదు. తొలి మ్యాచ్ అనంతరం భారత జట్టు చేయి కలపలేదనే అంశాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాల ను బలిగొంటున్న వారికి అండగా నిలుస్తున్నంత కాలం... తమ తీరు మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి రెండు మ్యాచ్ల్లో తేల్చిచెప్పింది. ఈ పూర్తి విషయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడు... విన్నర్స్ ట్రోఫీ తానే అందించాలని మంకుపట్టు పట్టాడు. దీంతో టీమిండియా ట్రోఫీ అందుకోకుండానే... స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్... భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు... వాటిని ఐసీసీ వినియోగించుకుంటున్న తీరును ఓ పత్రికకు రాసిన కాలమ్లో వివరించాడు. వారానికో మ్యాచా? ఇలాంటి చేదు అనుభవాలకంటే... ఇరు దేశాల మధ్య క్రికెట్ను పూర్తిగా నిలిపివేయడం మంచిదని సూచించాడు. ‘మూడు వారాల పాటు సాగిన ఆసియా కప్లో... ప్రతి ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కేవలం ఇదొక్కటే కాదు... ఆ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయినప్పటి నుంచి గమనిస్తే... అన్నీ ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలోనే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ చేస్తున్నారు. 2013 నుంచి చూసుకుంటే 3 వన్డే ప్రపంచకప్లు, 5 టి20 ప్రపంచకప్లు, 3 చాంపియన్స్ ట్రోఫీలు జరగగా... వాటన్నింటిలో గ్రూప్ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి. రౌండ్ రాబిన్ పద్ధతైనా... లేక గ్రూప్ల విధానమైనా... ఆరంభ దశలోనే ఈ రెండు టీమ్ల మధ్య మ్యాచ్ పరిపాటిగా మారింది’ అని అథర్టన్ రాసుకొచ్చాడు. 2008 ముంబై దాడుల సమయం నుంచే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోగా... ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ ఘటనలో 26 మంది అమాయకులు మృతిచెందగా... దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి తుదముట్టించింది. ఆర్థిక అంశాలే ముఖ్యమా! ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్కు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నో ఆర్థిక అంశాలతో కూడింది. ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులకు విపరీతమైన డిమాండ్ ఉండటానికి ఈ మ్యాచ్ ప్రధాన కారణం. ద్వైపాక్షిక సిరీస్లకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో... ఐసీసీ ఈవెంట్ల ప్రాముఖ్యత పెరిగింది. దీంట్లో తరచూ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. దీన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దౌత్యానికి ఆట దోహదం చేస్తే... ఇప్పుడదే ఉద్రిక్తతలు, ప్రచారానికి ప్రతినిధిగా మారింది. కేవలం ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఆ రెండు జట్ల మధ్య పదే పదే మ్యాచ్లు నిర్వహించడం ఇప్పటికైనా మానుకుంటేనే మంచిది’ అని అథర్టన్ పేర్కొన్నాడు. విస్తృత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ సారథి సూచించాడు. కావాలనే రెండు జట్ల మధ్య మ్యాచ్లు ఉండే విధంగా చూసుకోవడానికి బదులు... ‘డ్రా’ పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంశాన్ని సైతం అథర్టన్ లేవనెత్తాడు. పాకిస్తాన్లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో... భారత ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించగా... ఆతిథ్య హోదా ఉన్న పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్లు ఆడేందుకు పదేపదే దుబాయ్కు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోతుండటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఐసీసీ టోర్నీల్లో పదే పదే ఇలాంటి ఏర్పాట్లు చేయడం తగదని అథర్టన్ సూచించాడు. -
స్టార్క్ పునరాగమనం
మెల్బోర్న్: ఆ్రస్టేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్... టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్... దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. గతేడాది నవంబర్లో పాకిస్తాన్తో చివరిసారి వన్డే ఆడిన స్టార్క్... తిరిగి ఇప్పుడు టీమిండియాతో సిరీస్లో పాల్గొననున్నాడు. యాషెస్ సిరీస్కు ముందు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్క్ పలు అప్ర«దాన్య మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 19 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా... దీంతో పాటు టి20 సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్ల కోసం మంగళవారం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. గత పది ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని లబుషేన్పై వేటు పడగా... అతని స్థానంలో రెన్షాకు తొలిసారి చోటు దక్కింది. 29 ఏళ్ల రెన్షా 14 టెస్టుల్లో ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని కలిసొస్తే భారత్పై రెన్షా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. మరోవైపు రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ సారథిగా కొనసాగనున్నాడు. ఈ నెల 19న జరగనున్న తొలి వన్డేకు పెర్త్ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత 23న అడిలైడ్లో, 25న సిడ్నీలో రెండో, మూడో మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. ఆ్రస్టేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), బార్ట్లెట్, కేరీ, కొనొల్లీ, డ్వార్షుయ్, ఎలీస్, గ్రీన్, జోష్ హాజల్వుడ్, హెడ్, ఇన్గ్లిస్, ఓవెన్, రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. టి20 జట్టు (తొలి రెండు మ్యాచ్లకు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), అబాట్, బార్ట్లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షుయ్, ఎలీస్, హాజల్వుడ్, హెడ్, ఇన్గ్లిస్, కూనెమన్, ఓవెన్, షార్ట్, స్టొయినిస్, జంపా. -
యూరప్లో ఫ్యామిలీ డ్రామా
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లోని ఈ 46వ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల యూరప్లో మొదలు పెట్టారట. సూర్యతోపాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్.ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
గట్టెక్కిన ఇంగ్లండ్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలిచింది. వన్డౌన్లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్కు డీన్తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో ఆ్రస్టేలియా తలపడనుంది. -
ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం: నీరజ కోన
‘‘స్కూల్ డేస్ నుంచే నాకు రైటింగ్ అంటే ఇష్టం. కథలు చెప్పడం ఇంకా ఇష్టం. అలా కొన్ని కథలు రాసుకున్నాను. నా స్నేహితులు రానా, నాని వంటివారు బాగా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమా కథ రాయగలననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథే ఈ ‘తెలుసు కదా’’ అని అన్నారు నీరజ కోన. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ఆమె పంచుకున్న విశేషాలు...⇒ ‘తెలుసు కదా’ మంచి ప్రేమ కథా చిత్రం. ప్రేమకథతోపాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. నేను మహిళా దర్శకురాలిని కనుక ఈ సినిమా కథను మహిళా దృష్టి కోణంలో చెప్పలేదు. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫస్ట్ సిట్టింగ్లోనే నా కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేయడం, దర్శకురాలిగా నాకు అవకాశం రావడం నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్. ⇒ సిద్ధుపై టిల్లు క్యారెక్టర్ షాడో ఉండొచ్చు. కానీ, తను మంచి పెర్ఫార్మర్. ఈ సినిమాలో స్క్రీన్ పై తను పోషించిన వరుణ్పాత్రని మాత్రమే ఆడియన్స్ చూస్తారు. కథలో కాంప్లెక్స్గా ఉండే రాగపాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నాం. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంజలిపాత్రకి రాశి సరిపోయారు. టీజీ విశ్వప్రసాద్గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ సినిమా ప్రయాణంలో కృతీ ప్రసాద్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ .⇒ నేను ఏ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు. కానీ, కాస్ట్యూమ్ డిజైనర్గా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్ స్టార్టింగ్లోనే ఎన్టీఆర్, రామ్చరణ్, రవితేజ, విజయ్, సూర్య వంటి టాప్ హీరోలు చేసిన సినిమాలకు పని చేశాను. అదే నా లెర్నింగ్ స్కూల్, ఎక్స్పీరియన్స్. ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నేను ప్రతిదీ నా తొలి సినిమా అన్నట్లుగా భయం, టెన్షన్ తో పనిచేస్తుంటాను. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రం కూడా లవ్స్టోరీనే. త్వరలోనే వివరాలు చెబుతాను. -
అమన్పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్పై ఏడాది నిషేధం పడింది. నిర్ణీత బరువు కంటే అధికంగా ఉన్న కారణంగా ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్నకు దూరమైన అమన్పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చర్యలు తీసుకుంది. గత నెలలో క్రొయేషియా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ 57 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన అమన్... 1700 గ్రాములు అధిక బరువు కారణంగా పోటీలకు దూరమయ్యాడు. దీంతో పతకం సాధిస్తాడనే ఆశలు ఉన్న అమన్ పోటీకి అనర్హుడిగా తేలడంతో డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. అమన్ వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ... ఏడాది కాలం పాటు అతడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం గత నెల సెప్టెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. అతడి శిక్షణ సిబ్బందిని హెచ్చరించి వదిలేసింది. పోటీలకు రెండు వారాల ముందే క్రొయేషియాకు వెళ్లిన అమన్... పోటీలు ప్రారంభమయ్యే సమయానికి నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం తప్పుడు సంకేతమని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. ‘ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ నుంచి అత్యుత్తమ క్రమశిక్షణ ఆశిస్తాం. అలాంటిది నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం సరైంది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో తాత్సారానికి తావు లేదు. ఇది దేశ ప్రజల ఆశలను వమ్ము చేయడమే’ అని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా వినేశ్ ఫొగాట్, ఈ ఏడాది ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్ సందర్భంగా నేహా సాంగ్వాన్ కూడా ఇలాగే అధిక బరువుతో పోటీలకు దూరమయ్యారు. -
ఆనంద్ x కాస్పరోవ్
సెయింట్ లూయిస్ (అమెరికా): చదరంగ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్ (రష్యా), విశ్వనాథన్ ఆనంద్ (భారత్) మరోసారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ‘క్లచ్ చెస్: ద లెజెండ్స్ టోర్నమెంట్’ పేరుతో ఈ ఇద్దరి మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లో మూడు రోజులపాటు టోర్నీని నిర్వహించనున్నారు. ‘చెస్ 960’ మ్యాచ్లో భాగంగా ఆనంద్, కాస్పరోవ్ 12 గేమ్లు ఆడతారు. ప్రతి రోజు వీరిద్దరి మధ్య నాలుగు గేమ్లు (రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్) జరుగుతాయి. మొదటి రోజున గేమ్ గెలిస్తే ఒక్కో పాయింట్ దక్కుతుంది. రెండో రోజున గేమ్ గెలిస్తే రెండు పాయింట్ల చొప్పున... మూడో రోజున గేమ్ గెలిస్తే మూడు పాయింట్ల చొప్పున లభిస్తాయి. విజేతకు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ప్లేయర్కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) అందజేస్తారు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో క్లాసికల్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు. కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్పై గెలిచి ప్రపంచ టైటిల్ దక్కించుకున్నాడు. 2004లో చెస్కు వీడ్కోలు పలికిన కాస్పరోవ్ ఎగ్జిబిషన్, బ్లిట్జ్ ఈవెంట్లలో... ఆనంద్ కొన్ని ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నారు. -
శింబు @ అరసన్
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్ని ఖరారు చేశారు. కలైపులి ఎస్. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని టాక్. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.శింబు కెరీర్లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తార ని కోలీవుడ్ టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
Sagubadi: రైతు విత్తన హక్కులకు తూట్లు!
విత్తనం.. ప్రకృతి మనుగడకు, ఆహార భద్రతకు, వ్యవసాయానికి, రైతుల సంప్రదాయ పారంపర్య హక్కులకు విత్తనం మూలాధారం. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో ఎన్నోన్నో ప్రత్యేక విత్తనాలు, విలక్షణ వంగడాలు ఉన్నాయి. సార్వభౌమత్వం గల ఒక దేశంలో అనాదిగా ఉన్న విత్తనాలు, మొక్కలు, వంగడాలు, వాటి జన్యువనరులు ఆ దేశం సొత్తు. ఇంకా చెప్పాలంటే గత పదివేల సంవత్సరాల నుంచి వీటిని నిరంతరాయంగా సాగు చేస్తూ, తమవైన పద్ధతుల్లో పరిరక్షించుకుంటూ, తమ పొలాల్లో వాడుకోవటంతోపాటు, తమ దేశవాసులతో పంచుకుంటూ జీవనయానం కొనసాగిస్తున్న వ్యవసాయ సమాజాల లేదా రైతుల అపురూపమైన వారసత్వ సొత్తు విత్తనం! ఒక దేశం వ్యవసాయక వారసత్వ సంపదైన విత్తనాన్ని లేదా జన్యు వనరులను ఇతర దేశాలకు ఇచ్చి పుచ్చుకోవటానికి ఎటువంటి నియమ నిబంధనలుపాటించాలో నిర్దేశించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంతర్జాతీయ ఒడంబడికను కుదిర్చింది.దాని పేరే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐటీపీజీఆర్ఎఫ్ఏ). దీన్ని అంతర్జాతీయ విత్తన ఒడంబడిక లేదా మొక్కల ఒడంబడిక (సీడ్ ట్రీటీ లేదా ప్లాంట్ ట్రీటీ) అని కూడా పిలుస్తారు. 154 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. ఇది 2004లో అమల్లోకి వచ్చింది. ఇది సభ్యదేశాలన్నీ విధిగాపాటించి తీరవలసిన ఒడంబడిక (లీగల్లీ బైండింగ్ ట్రీటీ) కావటంతో దీని ప్రభావం వారసత్వ మేధో హక్కులపై గణనీయంగా ఉంటుంది. 64 రకాల విత్తనాలు/ మొక్కలు/ వంగడాలు దీని పరిధిలోకి వస్తాయి.ఈ పంటలకు సంబంధించిన 70 లక్షలకు పైగా విత్తనాల నమూనాలు అంతర్జాతీయ స్థాయి విత్తన నిధుల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకొని సరికొత్త వంగడాల తయారీపై 28,000కు పైగా విత్తన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇతర దేశపు విత్తనాలను పరిశోధనలకు వాడుకుంటే ఆ దేశానికి కంపెనీ కొంత మొత్తాన్ని చెల్లించాలన్నది ఒక నియమం. అయితే, 20 ఏళ్ల తర్వాత ఈ ఒడంబడికకు సవరణలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సవరణలు రైతుల హక్కులకు భంగం కలిగిస్తూ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని విమర్శలు రావటంతో వివాదం రాజుకుంది. ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుందాం...అంతర్జాతీయ విత్తన ఒడంబడిక (ఐటీపీజీఆర్ఎఫ్ఏ)కు సవరణ ప్రయత్నాల నేపథ్యంలో ఇటీవల వివాదం నెలకొంది. ప్రధానంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విత్తన జన్యు వనరుల పంపిణీకి సంబంధించిన మేధో సంపత్తి హక్కులు, ప్రయోజన భాగస్వామ్యం (బెనిఫిట్ షేరింగ్), సింపుల్గా చెప్పాలంటే రాయల్టీ, చెల్లింపు విషయంలో కొనసాగుతున్న అసమానతల కారణంగా వివాదం నెలకొంది. ఈ వ్యవస్థ చిన్న తరహా రైతులు, జీవవైవిధ్యం అధికంగా ఉన్న భారత్ తదితర దేశాల ప్రయోజనాల కంటే బహుళజాతి విత్తన సంస్థలకు ఎక్కువ అనుకూలంగా ఉందని.. అంతేకాకుండా ప్రతిపాదిత సవరణలు ఈ సమస్యలను మరింతగా పెంచుతాయని విమర్శకులు వాదిస్తున్నారు.నవంబర్లో లిమాలో కీలక సమావేశంనవంబర్ 24 నుంచి 29 వరకు పెరూలోని లిమాలో జరగనున్న విత్తన ఒడంబడిక 11వపాలకమండలి సమావేశంలో సవరణలపై చర్చ జరగనుంది. వర్కింగ్ గ్రూప్ తయారుచేసిన చర్యల ముసాయిదాప్యాకేజీపై చర్చిస్తారు.వివాదానికి దారితీసిన కీలక అంశాలు: 1. ప్రపంచంలోని పంటల జీవవైవిధ్యం (అంటే.. వైవిధ్యమైన వంగడాలు, పంటల జాతుల సంఖ్య) ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఈ దేశాలు తమ జన్యు పదార్థాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు అనాదిగా అందిస్తున్నాయి. అయితే, అందుకు తగిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు తిరిగి పొందలేక΄ోతున్నాయి. 2. జన్యు వనరుల వాణిజ్యీకరణతో కలిగే ప్రయోజనాలను బెనిఫిట్–షేరింగ్ ఫండ్ ద్వారా సేకరించి విత్తన హక్కులున్న దేశాలకు పునఃపంపిణీ చేయడానికి బహుళ పక్ష వ్యవస్థ (ఎంఎల్ఎస్) ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ వ్యవస్థ చాలా తక్కువ డబ్బును మాత్రమే రాబట్టగలుగుతోంది. ప్రయోజనాలు తరచుగా ద్రవ్యేతరమైనవి లేదా కేవలం ప్రతీకాత్మకమైనవిగా అరకొరగా మాత్రమేనని విమర్శకులు వాదిస్తున్నారు.3. విత్తన ఒడంబడిక ఎజెండాలోనే తేడా ఉందన్న అభిప్రాయం ఉంది. రైతులు, స్వదేశీ వ్యవసాయ సమాజాల హక్కుల పరిరక్షణపై కంటే.. తమ వాణిజ్య ప్రయోజనాలకు ్రపాధాన్యత ఇచ్చే కార్పొరేట్ సంస్థలకే విత్తన ఒడంబడిక ఉపయోగపడుతోందని చాలామంది భావిస్తున్నారు.ప్రపంచ రైతుల కూటమి హెచ్చరికఐక్యరాజ్యసమితి విత్తన ఒప్పందంలో ప్రతిపాదించిన సంస్కరణలు రైతుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలతో కూడిన ‘ప్రపంచ రైతుల కూటమి’ హెచ్చరిస్తోంది. ప్రతిపాదనలు రైతుల డిమాండ్లను పక్కన పెట్టి విత్తన కంపెనీలకు బహుళ పక్ష వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చడంపై దృష్టి పెడుతున్నాయని కూటమి ఆరోపిస్తోంది. రైతుల హక్కులను దెబ్బతీసే విత్తన ఒప్పంద సంస్కరణలను ప్రపంచ రైతు కూటమి వ్యతిరేకిస్తోంది. బహుళ పక్ష వ్యవస్థ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న 64 పంటలతోపాటు ఇతర మొక్కల జన్యు వనరులను చేర్చాలన్న ప్రతిపాదన ఉంది.ఇది జాతీయ విత్తన హక్కుల దోపిడీకి దారితీస్తుందని కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్పులు రైతుల హక్కులను, విత్తనాలపై ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఒప్పందం పరిధిని విస్తరించే లక్ష్యంతో ఉన్న సంస్కరణలు బహుళజాతి విత్తన సంస్థలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇవి తగిన రక్షణలు లేకుండా సాంప్రదాయ విత్తన రకాలను దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తాయని కూటమి తెలిపింది.మన దేశంలోని రైతు సంఘాల జాతీయ కూటమి అయిన భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, ప్రపంచవ్యాప్తంగా 280 కంటే ఎక్కువ సంస్థలు, 100 మంది వ్యక్తులతో కలిసి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యు, విత్తన ఒడంబడిక కార్యదర్శి కెంట్ న్నాడోజీకి గత నెల 12న లేఖ రాశారు. చర్చల దశలో ఉన్న ప్రస్తుత చర్యల ముసాయిదాప్యాకేజీ రైతుల హక్కులను, విత్తనాలపై జాతీయ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదని, అదే సమయంలో ఒప్పంద వ్యవస్థను బహుళజాతి విత్తన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని ఆ లేఖ హెచ్చరించింది.కొత్త ప్రతిపాదనలు ప్రపంచ కార్పొరేషన్లు తగిన రక్షణ చర్యలు లేకుండా భారతదేశ సాంప్రదాయ విత్తనాలను, వాటి జన్యు డేటాను దొరకబుచ్చుకోవటానికి వీలు కల్పించవచ్చని రైతులు ఆందోళనలు వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మే 21న ఈ సంస్కరణల ప్రమాదాలను పౌర సమాజం ఎత్తి చూపింది. జూలై 7న రైతు సంఘాలు, దేశీ విత్తన సంరక్షకులు, పర్యావరణ న్యాయవాదులు ఉమ్మడి లేఖలో ఇదే హెచ్చరిక చేశారు. జూలై 10న శాస్త్రవేత్తల బృందం కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాసింది. ఒప్పందం భారతదేశ విత్తన సార్వభౌమత్వానికి గండి కొట్టేలా ఉందని హెచ్చరించింది.ఈ విజ్ఞప్తిపై ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్, ఓషియానియా నుంచి రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలు సంతకం చేశాయి. సంతకాలలో ఆఫ్రికన్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ (దక్షిణాఫ్రికా), అసోసియాసియన్ నేషనల్ డి ్రపొడక్టోర్స్ ఎకోలోజికోస్ డెల్ పెరూ (పెరూ), అన్నదాన సాయిల్ – సీడ్ సేవర్స్ నెట్వర్క్ (ఇండియా), థర్డ్ వరల్డ్ నెట్వర్క్ (మలేషియా) వంటి ప్రసిద్ధ సమూహాలు సంతకాలు చేశాయి.రైతులకు దక్కని ప్రయోజనాలుబహుపాక్షిక వ్యవస్థలోపారదర్శకత లేక΄ోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 28,000 కంటే ఎక్కువ కార్పొరేట్ విత్తన సంస్థలు ఈ ఒప్పందం ప్రకారం 70 లక్షలకు పైగా విత్తన నమూనాలను ఉపయోగించుకున్నాయి. విత్తన కంపెనీలు ఈ వనరులతో అభివృద్ధి చేసిన కొత్త విత్తన రకాలపై మేధో సంపత్తి హక్కులను పొందాయి. అయితే, ఆ వనరులను అందించిన దేశాలకు లేదా రైతులకు ఎటువంటి ప్రయోజనాలు తిరిగి అందలేదని లేఖ ఎత్తి చూపింది. రక్షణ చర్యలు లేకుండా బహుపాక్షిక వ్యవస్థను విస్తరిస్తున్నారని కూడా వారు విమర్శించారు. ప్రస్తుత 64 పంటలకు తోడు మిగతా అన్ని మొక్కల జన్యు వనరులను చేర్చడానికి ఈ వ్యవస్థను విస్తరించాలన్నది ప్రతిపాదన. ఇప్పటికే ఉన్న ప్రయోజన భాగస్వామ్య విధానాలు బలహీనంగా ఉన్నందున ఈ ప్రతిపాదన మరింత దోపిడీకి ఆస్కారం కలిగిస్తుందని అంటున్నారు.రైతుల హక్కులకు రక్షణేదీ?రైతుల హక్కులను గుర్తించాలని లేఖ పిలుపునిచ్చింది. విత్తనాలను పండించిన పంట నుంచి తీసి దాచుకోవటం, ఉపయోగించడం, ఇతరులకు ఇచ్చి పుచ్చుకుంటూ మార్పిడి చేయడం, విక్రయించడం వంటి రైతుల హక్కులను రక్షించడంలో నవంబర్లో జరిగే సమావేశానికి ముందు విడుదలైన ముసాయిదా విఫలమైందని ఎఫ్ఏవో డైరెక్టర్ జనరల్కు రాసిన లేఖపై సంతకాలు చేసినవారు ఆరోపించారు. బయోపైరసీ లేదా సాంప్రదాయ విత్తన రకాల పేటెంట్ మోసాలను అరికట్టే రక్షణలు ఇందులో లేవు. తమ విత్తనాలను స్వాధీనం చేసుకుని కార్పొరేట్ నియంత్రిత వంగడాలుగా మార్చే కంపెనీలు, వాటిని తిరిగి తమకే విక్రయిస్తారని రైతులు భయపడుతున్నారు.ఎక్కువపారదర్శకత, జవాబుదారీతనం కావాలని రైతు సంఘాలు అడుగుతున్నాయి. అంతర్జాతీయ విత్తన ఒడంబడిక ఎవరు ఏ విత్తనాలను తీసుకుంటున్నారు? వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు? అనే విషయాలను గుట్టుగా ఉంచకుండా, బహిరంగంగా వెల్లడించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. విత్తన ఒడంబడికలో సంస్కరణలు చేసే ముందు ప్రపంచవ్యాప్తంగా రైతులతో సంప్రదింపులు జరపాలని పిలుపునిచ్చాయి.జాతీయ సార్వభౌమత్వాన్ని లేదా కంపెనీలు కొత్త వంగడాల తయారీ ద్వారా పొందే ప్రయోజనాలలో అందుకు ఉపయోగపడినపాత విత్తనాల జన్యువనరులపై హక్కుదారులైన రైతులకు సముచిత భాగం పంచే వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. రైతుల జన్యు హక్కులకు బలమైన రక్షణలు కల్పించాలని, డిజిటల్ బయోపైరసీని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
మూడంచెల వ్యూహం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం కీలక భేటీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు. సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ నేతల భేటీ సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
పొన్నంకు ‘లక్ష్మణ’ రేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి.. మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, బాధిత మంత్రి..ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ. కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్కుమార్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభా కర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిమాణాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొన్నం తననుద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్య లు చేశారు. అవసరమైతే రాహుల్గాందీ, సోనియా గాందీని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారని, వివాదం సమసిపోయినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శామేల్, కాలె యాదయ్య పీసీసీ చీఫ్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా.. తనకు ఫోన్ చేసిన వ్యక్తితో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టుగా రికార్డయిన ఓ వీడియో మంగళవారం ఉదయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో మంత్రులు పొన్నం, వివేక్లనుద్దేశించి అడ్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా. అక్కడ మా వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ ఉండి ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తే నేను వెళ్లిపోతా అని నన్ను ఉద్దేశించి అనడం ఇంకా అవమానించడమే. ఇద్దరం ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్లం. ఆయన కష్టసుఖాల్లో ఉన్నా. ఆయన కుమారుడు ఎంపీగా నిలబడితే మీదేసుకుని గెలిపించాం. ఆయన తండ్రి సమయం నుంచి మా తండ్రితో స్నేహితం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలుగా ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించడంలో మా పాత్ర ఉంది. నన్ను అంటుంటే వివేక్ ఒక్క మాట అనడా? తోటి మంత్రి ఆ మాట అంటుంటే మా వాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అనడా? మైనార్టీలకు సంబంధించి ఆ శాఖ మంత్రిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలి. వక్ఫ్బోర్డు చైర్మన్ నాకు ఫోన్ చేసి మీ కోసం ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నారని అంటే.. వాళ్లు నేను వచ్చేంతవరకు ఆగరు. మీరు కార్యక్రమం ప్రారంభించండి. నేను జాయిన్ అవుతా అని చెప్పా. నేను సామాన్య కార్యకర్తను. డబ్బు ఉన్నవాడిని కాదు. మా తండ్రి కేంద్ర మంత్రి కాడు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చా. కష్టాలు తెలిసిన వ్యక్తిని. పొన్నం అలా మాట్లాడతాడని ఊహించలేదు.. పొన్నం ప్రభాకర్లాగా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కాదు. చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఆయన ఆ విధంగా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ కార్యక్రమానికి నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్లా. వారితో సమానంగా డాక్టర్ వివేక్ పక్కన నేను కూర్చోవడం వారికి ఇష్టం లేదు. మొదటి నుంచి మా వర్గీకరణను ఆయన వ్యతిరేకిస్తారు. ఆ వర్గానికి చెందిన వాడు నా పక్కన కూర్చుంటాడా? వాడి లెక్కంత అనే ఆలోచనతోనే నేను వెళ్లిపోతా అన్నాడు. పొన్నం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు.. పొన్నం నన్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడంటే నన్ను కాకపోవచ్చులే అనుకున్నా. అదే విషయాన్ని చెప్పా. ఒక పార్టీ జెండా కింద పనిచేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నాతో కూడా పొరపాట్లు అవుతాయి. కానీ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. నాకు ఫోన్ చేసి.. అన్నా పొరపాటున ఒక మాట అన్నా. మనిద్దరి స్నేహితంతో దాన్ని మనసులో పెట్టుకోకు. ఇద్దరం ఒక్క జిల్లా వాళ్లమంటూ ఒక్క మాట అయినా మాట్లాడతాడని అనుకున్నా. ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసి అడిగినా నేను ఆయన్ను అనలేదు అంటున్నాడు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు.. ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండి మంత్రిగా పనిచేస్తున్నా. ఆవేశపడే విధంగా ఎక్కడా తప్పు చేయడం లేదు. అయినా లక్ష్మణ్కుమార్ను ఏమైనా అనొచ్చు. కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా వేచి చూస్తా. రేపటి వరకు (బుధవారం) చూస్తా. ఆయనలో మార్పు వస్తే ఫర్వాలేదు. అప్పటికీ నన్ను అనలేదు ఇంకా ఎవరినో అన్నాను అంటే మాత్రం రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడం నేను చేసిన పొరపాటా? ఆ సామాజికవర్గంలో పుట్టి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తా. మీనాక్షి నటరాజన్కు ఇప్పటికే లేఖ రాశా. రాహుల్గాం«దీని కలుస్తా. సోనియాగాంధీని కూడా కలుస్తా..’ అని లక్ష్మణ్ అన్నారు. ఇది మా ఇంటి సమస్య: పీసీసీ చీఫ్ దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది తమ ఇంటి సమస్య’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్లో మాట్లా డానని, మరో మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడారని, ఇద్దరినీ బుధవారం పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు. పీసీసీ చీఫ్కు చెప్పిందే ఫైనల్: మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, రహ్మత్నగర్లో ఏం జరిగిందో ఆయనకు వివరించానని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా మహేశ్గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు. -
రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి
రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి -
ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.7.33 వరకు, తదుపరి విదియ తె.5.17 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం: అశ్విని రా.2.14 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.10.30 నుండి 12.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు,అమృత ఘడియలు: రా.7.26 నుండి 8.56 వరకు.సూర్యోదయం : 5.54సూర్యాస్తమయం : 5.42రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.వృషభం... పనులలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.మిథునం..... సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం.... ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.సింహం.... ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.కన్య.... మిత్రుల నుంచి విమర్శలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.తుల.... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.వృశ్చికం..... విందువినోదాలు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.ధనుస్సు... వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మకరం..... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.కుంభం... ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. బంధువులతో తగాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.మీనం.. మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం. -
దిక్కుతోచని ఫ్రాన్స్
తీరి కూర్చుని సమస్యలు తెచ్చుకోవటంలో, ఉన్నవాటిని పెంచుకోవటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్కు ఎవరూ సాటిరారు. స్వీయ సమర్థతపై అతిగా అంచనా వేసుకుని ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలు ఫ్రాన్స్ను నిలువునా ముంచేశాయి. పీఠమెక్కి నిండా నెల రోజులు కాకుండానే ప్రధాని సెబాస్టిన్ లెకొర్నూ సోమవారం నిష్క్రమించటం వాటి పర్యవసానమే. లెకొర్నూ కేబినెట్ ఏర్పాటు ప్రయత్నంలో మెక్రాన్ తలదూర్చి, తన అనుకూలురకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కూటమిలోని ఇతర పక్షాలకు దీంతో ఆగ్రహం కలిగి బడ్జెట్కు మద్దతునీయబోమనీ, అవిశ్వాస తీర్మానం తెస్తామనీ చెప్పటంతో లెకొర్నూ రాజీనామా తప్పలేదు. మరో రెండు నెలల్లో బడ్జెట్ ఆమోదించకపోతే దేశం దివాలా స్థితిలో పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా, తదుపరి ఏం చేయాలన్నది మెక్రాన్కు సైతం బోధపడటం లేదు. కరోనా మహమ్మారి కాటేయకముందు యూరప్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్సే. ఆ తర్వాత పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దాన్ని మరింత దెబ్బతీసింది. జర్మనీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఏదోమేరకు సఫలీకృతమవుతుంటే, ఫ్రాన్స్ మాత్రం గుడ్లు తేలేస్తోంది. అక్కడ పాలన అసాధ్యమైన స్థితికి చేరుకుంది. సామాజిక అశాంతి పెరగటం, నిజ వేతనాలు పడిపోయి ఉద్యోగ వర్గాల ఆగ్రహావేశాలూ, ఉపాధి కొరవడి యువత నిరాశ, ఆకాశాన్నంటుతున్న ధరలూ, అంతంతమాత్రంగా ఉన్న మార్కెట్లూ ఫ్రాన్స్ను కుంగదీస్తుండగా పులి మీద పుట్రలా ఈ రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు. 1946–58 మధ్య ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. ఎవరికీ మెజారిటీ రాని దశలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోవటమే అందుకు కారణం. పర్యవసానంగా అప్పటి అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ భవిష్యత్తులో ఇంకెప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. అటుతర్వాత కూటమికి నాయకత్వం వహించే ప్రధాన పార్టీ మాటేచెల్లుబాటు కావటం రివాజైంది. ఇప్పుడు ఆయన్ను అనుకరించబోయి మెక్రాన్ బోర్లాపడుతున్నారు. ఫ్రాన్స్ కష్టాలకు కేవలం మెక్రాన్ ఒక్కరే కారణం కాదు. కానీ వాటిని మరిన్ని రెట్లు పెంచటంలో ఆయన పాత్ర కాదనలేనిది. 577 మంది సభ్యులుండే దిగువ సభ అసెంబ్లీ నేషనల్లో పాలక పక్షంగా అవతరించాలంటే కనీసం 289 మంది మద్దతు అవసరం. నిరుడు జూలైలో జరిగిన ఎన్నికల్లో వామపక్షాల సారథ్యంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ 182 స్థానాలతో అగ్రభాగంలో ఉంది. మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి ఎన్సెంబుల్కు 168 లభించాయి. వలసలను వ్యతిరేకించే తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ(ఆర్ఎన్) 143తో సరిపెట్టుకుంది. తొలి దశలో అందరికన్నా అత్యధిక శాతం ఓట్లు రాబట్టిన ఆర్ఎన్ను అధికారంలోకి రానీయకుండా రెండో దశలో వామపక్ష, మధ్యేవాద పార్టీలు అనుసరించిన సర్దుబాటు వ్యూహం ఫలించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మెక్రాన్ దీన్ని విస్మరించారు. తన విధానాలను వ్యతిరేకించే వామపక్షాలకు అధికారం అప్పగించరాదన్న కృతనిశ్చయంతో మధ్యేవాద పక్షాలతో ప్రయోగాలు మొదలుపెట్టారు. పర్యవసానంగా ఏడాదిలో ముగ్గురు ప్రధానులు వచ్చారు. పార్లమెంటు రద్దు చేయొద్దని అందరూ ఇచ్చిన సలహాను నిరుడు మెక్రాన్ బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత మధ్యేవాద పక్షాలు పుంజుకుంటాయనీ, అప్పుడు తాననుకున్న రీతిలో పెన్షన్ల కోత, సంపన్నులకు రాయితీలు, ప్రభుత్వ వ్యయం అదుపు వగైరాలు అమలు చేయొచ్చనీ ఆయన భావించారు. కానీ అదంతా అడియాస అయింది. ఇప్పుడు నిజంగానే పార్లమెంటు రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడింది. కానీ అలా చేస్తే ఆర్ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి పుంజుకోవచ్చనీ, దాని ప్రభావం 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై పడుతుందనీ మెక్రాన్ ఆందోళన. తక్షణ కర్తవ్యమైన బడ్జెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయనకు స్పష్టత కొరవడింది. ఏతావతా ఫ్రాన్స్ కింకర్తవ్య విచికిత్సలో పడింది. -
ఊహకందని అంచనాలతో ఉత్కంఠ!
పండుగల సమయంలోనూ బిహార్ రాజకీయాలలో మునిగితేలుతుంది. బిహా రీలకు రాజకీయాలకు మించిన కాలక్షేపం లేదు. బిహార్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగ నున్న నేపథ్యంలో ఎన్నికల పండుగ మొద లైపోయింది. నితీశ్ కుమార్ ఎక్కడుంటే అధికారం అక్కడేనని గడిచిన రెండు దశాబ్దాలలో బిహార్లో ఒక కొత్త నానుడి రూపుదిద్దు కుంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరం పెట్టేదిగా బీజేపీ పేరు మోసినప్పటికీ, రాష్ట్రంలో అది జూనియర్ భాగస్వామిగా సంతృప్తి పడటానికి బహుశా అదే కారణం. నితీశ్ నేతృత్వంలోని జేడీ (యు)తో పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నాయక త్వంలోని ఆర్జేడీ కూడా అదే రకమైన సంకట స్థితిని ఎదుర్కొంది.నితీశ్ సరసన లేని ఏ పార్టీ అయినా, ఆయనపై విషం చిమ్మడం ఖాయం. అయినప్పటికీ, ఆయనతో అంటకాగాలని రహస్యంగా కోరుకుంటాయి. లాలూ 2022లో నితీశ్తో చేతులు కలపడానికి ఇదే కారణం. 2017లో చీలిక చేదును మిగిల్చినా లాలూ దాన్ని దిగ మింగుకోవాల్సి వచ్చింది. మహాఘట్ బంధన్ రెండు విడతల హయాంలో నితీశ్తో ఎన్నడూ పొత్తు పెట్టుకోమని బీజేపీ నాయ కులు బాహాటంగా ప్రతిన బూనారు. కానీ తమ ‘సహజ భాగ స్వామి’తో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. నితీశ్ బలాబలాలుగతంలో బిహార్లో ఎన్నికల విజయాన్ని నితీశ్ ఎలా సొంతం చేసుకున్నట్లు? నితీశ్ 2005లో బిహార్ సీఎం అయినపుడు తన శక్తి యుక్తులన్నింటినీ శాంతి భద్రతల నిర్వహణపై కేంద్రీకరించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్యా రంగాలు మెరుగుపడ్డాయి. స్కూళ్ళలో అడ్మిషన్లను, హాజరును పెంపొందించేందుకు ఆయన 2006లో ‘స్కూల్ చలో అభియాన్’ ప్రారంభించారు. బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అలా 2005లో ఒక మౌన విప్లవం మొదలైంది. రాష్ట్రంలో 2005లో కేవలం 1.8 లక్షల మంది బాలికలు 10వ తరగతి పరీక్షకు కూర్చుంటే, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయ బోతున్న 15.85 లక్షల మంది విద్యార్థులలో సగంపైగా బాలికలే. ప్రతి ఒక్కరికీ ఇల్లు, తాగునీటి సదుపాయం కార్యక్రమాన్ని నితీశే మొదట ప్రారంభించారు. కానీ, అంతగా సఫలీకృతులు కాలేక పోయారు. రాష్ట్రం నుంచి జనం ఇప్పటికీ వలస పోతూనే ఉన్నారు. అనేక మానవ, అభివృద్ధి సూచికలలో బిహార్ అట్టడుగున ఉంది. నితీశ్ మూడవ, నాల్గవ విడత పాలన అనేక కారణాల రీత్యా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నితీశ్ వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితి కూడా నిశిత పరిశీలనకు గురవుతోంది. ఈ కారణంగానే, ఈసారి నితీశ్ ప్రభుత్వం కోటి మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున నగదు జమ చేసింది. రకరకాల రాయితీలను, వరాలను ప్రకటించింది. తేజస్వి ప్లస్ కూటమినితీశ్ ప్రధాన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, గత ఎన్నికల్లో అద్భు తమైన ఫలితాలు సాధించారు. ఆయన మహాఘట్ బంధన్ కేవలం 16,825 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్, వామ పక్షాలు ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్ల పునాదికి కోత పడినప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రలో తేజస్విని పటిష్ఠపరచేందుకు ప్రయత్నించారు. మొత్తం ప్రతిపక్షమంతా తేజస్వి వెనుకనే నిలిచిందని చాటేందుకు దీపాంకర్ భట్టాచార్య (వామపక్షం), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరేన్ (జేఎంఎం), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్) ఆయన యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఆయన సహచరుల,సొంత కుటుంబ సభ్యుల మితిమీరిన ఆశలు పెను సవాలును విసురుతున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితా 69 లక్షల ఓటర్ల తొలగింపును, 21 లక్షల మంది పేర్ల కొత్త జోడింపును చవి చూసింది. మహాఘట్ బంధన్ కొన్ని నెలలుగా దాన్నొక రాజకీయ అంశంగా మారుస్తూ వస్తోంది. సీట్ల పంపకంపై ప్రస్తుతం మహా ఘట్ బంధన్లో బురద జల్లుకునే కార్యక్రమం సాగుతోంది. ఇది ప్రతిసారీ కనిపించేదే. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలసి పోటీ చేయడం మాత్రం ఖాయం. పీకే ప్రభావంప్రశాంత్ కిశోర్, ఆయన ‘జన్ సురాజ్’ పార్టీ మరో ప్రభావిత అంశం కానుంది. ఆయన గతంలో, 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్నికల నిర్వహణ సేవలందించారు. తదనంతరం,కాంగ్రెస్, వైసీపీ, తృణమూల్, ఆప్, డీఎంకేలతో పాటు, చివరకు నితీశ్ కుమార్కు కూడా సేవలందించారు. రాష్ట్రంలో ఈ విడత ఎన్నికల సందర్భంగా, ప్రతి జిల్లాలోనూ ప్రశాంత్ కిశోర్ పాదయాత్రలు చేశారు. గత ఏడాదిగా ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా సంభాషించారు. రాత్రిపూట గ్రామాల్లోనే బస చేశారు. నితీశ్, బీజేపీ, ఆర్జేడీలపై సమానంగా విమర్శలు గుప్పించారు. ఆయన పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన పార్టీకి నిధుల కొరత కూడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో కింగ్ మేకర్గా మారతారా? విజ యానికి పెద్ద సంఖ్యలో జన వాహినులు, ఆకర్షణీయమైన నినా దాలు అవసరమేగానీ, అవి విజయానికి పూచీ నివ్వలేవు. బీజేపీ గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ కాషాయ పార్టీకి అద్భుతమైన సంస్థాగత బలం ఉంది. కుల సమీకరణలు కూడా దానివైపు పటిష్ఠంగా ఉన్నాయి. జేడీ(యు)తోపాటు, చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయేను తిరుగులేని కూటమిగా నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో, జేడీ (యు)తో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు సీట్లకు పైగా గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టలేదు. విశ్వస నీయమైన ముఖం ఏదీ లేకపోవడం దాని బలహీనత. ఈ అంశంపై ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లోనైనా ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. బిహార్ ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగిడుతోంది. చివరి నిమిషం వరకు అంతిమ ఫలితం నిర్ణయం కాదని గత అసెంబ్లీ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంరంభపు హడావిడి సద్దుమణగి,అంతిమ సంఖ్యా బలాలు వెల్లడైన తర్వాత, అసలు క్రీడ ఆరంభం కాబోతోంది. శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్
తిరుపతి జిల్లా: సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టింది. పేరెంట్స్ అసోసియేషన్ పిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా 26 కోట్లు అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ 15 లక్షలు రూపాయలు ఫైన్ విధించింది.ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) తిరుపతిలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం, 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్ వీడియో వైరల్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025