-
త్వరలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి. త్వరలో విడుదల కాబోతున్న ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, త్వరలో ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని చెబుతున్నారు.సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు. -
పాటిదార్ మహోగ్రరూపం.. ఆల్టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేసింది.రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మహోగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్టైమ్ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగానూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక స్కోరు254/5 RCB vs PBKS ధర్మశాల 2026 *233/3 GT vs MI అహ్మదాబాద్ 2023228/5 MI vs GT న్యూ చండీగఢ్ 2025226/6 PBKS vs CSK వాంఖడే 2014222/5 CSK vs DC చెన్నై 2012ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో అత్యధిక బౌండరీలు38 RCB vs GT ధర్మశాల 2026 *33 CSK vs DC చెన్నై 201232 PBKS vs CSK వాంఖేడే 201431 GT vs MI అహ్మదాబాద్ 202331 MI vs GT న్యూ చండీగఢ్ 2025 -
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సమం
ఐపీఎల్-2026లో ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులు మెరిపించాడు. 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్.. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ధర్మశాల మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాటిదార్.. 5 ఫోర్లు, 8 సిక్స్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడి విధ్వంసం ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్తో పాటు విరాట్ కోహ్లి(43), కృనాల్ పాండ్యా(43), పడిక్కల్(30) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్, డ్వేన్ స్మిత్ రికార్డును పాటిదార్ సమం చేశాడు. వీరిద్దరూ కూడా 21 బంతుల్లో తమ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నారు.IPL నాకౌట్లు/ప్లేఆఫ్స్లో అత్యంత వేగవంతమైన 50లు (బంతుల పరంగా)16 సురేష్ రైనా vs పంజాబ్ కింగ్స్ (వాంఖడే 2014)17 ఆడమ్ గిల్క్రిస్ట్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (సెంచూరియన్ 2009)20 ఎంస్ ధోని vs ముంబై ఇండియన్స్( బెంగళూరు 2012)21 డ్వేన్ స్మిత్ vs సీఎస్కే (ఢిల్లీ 2013)21 వీరేంద్ర సెహ్వాగ్ vs సీఎస్కే (వాంఖడే 2014)21 రజిత్ పాటిదార్ vs పంజాబ్ ధర్మశాల 2026 * -
హనుమంతుడిలా రామ్ చరణ్.. ‘పెద్ది’లో అదే పెద్ద మలుపు!
‘‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. రాత్రిపూట ఆ మ్యాచ్ ఎపిసోడ్ షూట్ చేశాం. స్క్రీన్పై చూసినప్పుడు అది కేవలం క్రికెట్ మ్యాచ్లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది’ అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డీవోపీ రత్నవేలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఇమాజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి, విజువల్గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం.⇢ రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దాన్ని పీరియడ్ సినిమాలకు రిఫరెన్స్గా తీసుకుంటారు. పెద్ది సినిమాకి వస్తే 40 సంవత్సరాల క్రితం విజయనగరంలో ప్రజలు ఒక కలర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటి ఫీలింగ్ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.⇢ ఈ సినిమాలో కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ గారు కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్పై వర్క్ చేశారు. ప్రతి మజిల్ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్లా కనిపించారు. మీరు టీజర్, ట్రైలర్లో చూస్తే ఆయన బాడీలోని ప్రతి మజిల్ కూడా చాలా డీటైల్గా కనిపిస్తుంది.⇢ ఇందులో హనుమంతుడి రిఫరెన్స్తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. అది మీరు థియేటర్లో చూసినప్పుడు గూస్బంప్స్ వస్తాయి. అందులో రామ్ చరణ్లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రను చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. ‘పెద్ది’ పాత్ర విషయానికి వస్తే, చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.⇢ ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. అది ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులని కదిలిస్తుంది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు.⇢ నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. ఏడాదికి ఒక సినిమానే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అదే సినిమా పూర్తయ్యే వరకు చేస్తాను. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చినా చేయలేదు. నాకు ఈ కథ చాలా నచ్చింది. చరణ్ గారు బుచ్చిబాబు అందరం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాం.⇢ ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ నేను లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం ఫిల్మ్ నెగటివ్ను వాడాం. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్ను ఉపయోగించాను. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించడం జరిగింది. అది జర్నీలో ఉన్న రియలిజం చూపించడానికి అది ఉయోగించాం.⇢ శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్ పీరియన్స్. అక్కడో వాటర్ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. అక్కడ చూసిన రైల్వే ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. అలాగే అక్కడ టన్నెల్ కూడా ఉంది. ఇందులో ట్రావెలింగ్ చేసే సీక్వెన్స్లు, కొండ ప్రాంతాలు, వాటర్ఫాల్స్, టన్నెల్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.⇢ నేను చేసే ప్రతి సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఉంటాను. డీఐలో కూడా కూర్చుంటాను. ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్లో విడుదలైతే ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అమెరికా, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసం నేను అంత కష్టపడుతుంటాను. ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్స్లో విడుదల అవుతుంది. విజువల్ గా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.⇢ రెహమాన్ గారితో ఇది నాకు మూడో సినిమా. ఇంతకుముందు ‘రోబో’, ‘లింగా’ చిత్రాలకు కలిసి పని చేశాం. అంతకుముందు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ‘బొంబాయి’ సినిమాకు కూడా పనిచేశాను. రెహమాన్ గారు జీనియస్. ఈ సినిమాకి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.⇢ నేను నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తాను. అలాగే రీ-రికార్డింగ్కి కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడు దర్శకుడికి చాలా హెల్ప్ అవుతుంది. బుచ్చిబాబు గారు నాకు ఈ సినిమా కోసం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ⇢ ఈ సినిమాకి మా అబ్బాయి కూడా పని చేశాడు. తను కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకున్నాడు. నాలాగే తనకూ సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. ‘పెద్ది’కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇందులో ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. అందులోని ఒక పోర్షన్ను తానే చాలా అద్భుతంగా షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు డీవోపీగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కథ కోసం చూస్తున్నాడు. -
సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సుగాలిప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును ఆటకెక్కించటంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వారి ఆవేదనను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు, CDFD ల్యాబ్ రిపోర్టులు, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు.మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం’అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన… pic.twitter.com/0RRSDHwQav— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2026 -
గ్యాస్ వినియోగదారులకు ఊరట!
కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా, పంపిణీ సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా నిబంధనలను సవరించింది.పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కొత్త నిబంధనలతో గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజులలోపు తమ ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారితే.. మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.ఈ నిర్ణయం.. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు పొందేవారికి, వలస కుటుంబాలకు, అద్దె ఇళ్లలో నివసించే వారికి, విద్యార్థులు, తరచూ ప్రాంతాలు మారే కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.దేశంలో ఎల్పీజీ కొరత సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ వారం 68 శాతం భారత కుటుంబాలు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి. గత వారం ఇది 57 శాతంగా ఉండగా ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భారత్ తన అవసరాలకు పెద్దమొత్తంలో దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతోంది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. 20 శాతం మంది తమ అవసరాల కోసం బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ధరల కంటే రూ.300 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. -
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. 28ఏళ్లలో తొలిసారిగా దీదీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు, ముఖ్యంగా లోక్సభ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టీఎంసీ నియంత్రణలో ఉన్న మున్సిపల్ సంస్థల్లో వరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి. భట్పారా మున్సిపాలిటీలో 35 మందిలో 30 మంది, హాలిసహర్లో 23 మందిలో 16 మంది, కంచరపారాలో 14 మంది కౌన్సిలర్లు వైదొలిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వంటి కారణాలతో కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.అవినీతి, దోపిడీ ఆరోపణలు పార్టీపై మరింత ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల ముగ్గురు కౌన్సిలర్లు అరెస్టు అయ్యారు. సౌత్ డుమ్ డుమ్ కౌన్సిలర్ సంజయ్ దాస్ మర్మమైన మరణం ఆందోళనను పెంచింది. మాజీ టీఎంసీ మంత్రి సుజిత్ బోస్ను ఈడీ అరెస్టు చేయడం, మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త దేబ్రాజ్ చక్రవర్తిపై విచారణ కొనసాగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది.కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, బీజేపీ 43 ఆస్తుల జాబితాను విడుదల చేయడం అంతర్గత కలహాలకు దారితీసింది. మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.మే 22న మేయర్తో సహా కౌన్సిలర్లు ప్రధాన ఛాంబర్ వెలుపల సమావేశం నిర్వహించవలసి రావడం, ఎన్నికైన ప్రతినిధులకు అవమానకరంగా మారింది. వరుస రాజీనామాలు మున్సిపల్ సేవలను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. రాబోయే వర్షాకాలం ముందు డ్రైనేజీ, పారిశుధ్యం, అత్యవసర సన్నద్ధతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.కౌన్సిలర్లు అందుబాటులో లేని చోట బీజేపీ ప్రభుత్వం నిర్వాహకులను నియమించడం ప్రారంభించింది. దీంతో, టీఎంసీ సంక్షోభం కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, మొత్తం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలు 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి మమతా బెనర్జీ స్థాపించినప్పటి నుండి టీఎంసీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
బండెనుక బండికట్టి రేపిస్టు పోతుంటే.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్
అత్యాచార దోషి, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు 30 రోజుల పెరోల్ మంజూరయ్యాక అతడు హరియాణాలోని రోహ్టక్లోని సునారియా జైలు నుంచి విడుదలై సిర్సాకు చేరుకున్నాడు. దాదాపు పది కార్లు అతడి ముందు, వెనక ఉండగా దర్జాగా మధ్యలోని కారులో కూర్చొని సిర్సాకు వెళ్లాడు. అత్యాచార దోషి ఇలా ఓ రాజులా విహారానికి వచ్చినట్లు కనపడడంతో తీవ్ర విమర్శలతో పాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.అత్యాచార దోషికి పెరోల్ మంజూరుకు కావడంతో దీనిపై సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఎక్స్లో స్పందిస్తూ.. “గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మరోసారి పెరోల్ మంజూరైంది.. ఈ సారి 30 రోజులు దక్కింది. 2017 ఆగస్టులో శిక్ష పడినప్పటి నుంచి ఇది 16వసారి అతను పెరోల్పై బయటకు వచ్చాడు. అత్యాచార కేసులో అతడు 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో ఉమర్ ఖాలిద్ లాంటి వారు విచారణ కూడా మొదలు కాకుండా దాదాపు 6 ఏళ్లుగా జైలులో ఉన్నారు. ఇదే న్యాయ వ్యవస్థ. ఇకపై మన న్యాయమూర్తులు ఏం ఉపదేశిస్తారో ఆశ్చర్యంగా ఉంది!” అని అన్నారు.గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు 30 రోజుల పెరోల్పై సీపీఎం నాయకురాలు బృందా కారత్ మాట్లాడుతూ.. “ఇప్పటికి 16 సార్లు పెరోల్ ఇచ్చారు. తన శిక్ష కాలంలో సగం సమయం అతను పెరోల్పైనే గడిపాడు. ప్రశ్న ఏంటంటే, మన చట్టం ఎందుకు వివక్ష చూపుతోంది? అతను తీవ్రమైన నేరస్థుడు కాదా? ఎంతో మంది అండర్ట్రయల్స్ సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. కానీ వాళ్లకు పెరోల్ లేదా బెయిల్ నిబంధన లేదు. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హరియాణా ప్రభుత్వం అతనికి ఇస్తున్న మద్దతుపైనా సందేహాలు వస్తున్నాయి” అని అన్నారు. నెటిజన్ల సెటైర్లు ఇలా.. ‘‘ముందే పెట్రోలు ధరలు పెరిగిపోతున్నాయంటే ఆయన పది కార్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. లైఫ్ అంటే మినిమం ఇలా ఉండాలి’’‘‘జోక్ ఏంటంటే.. 75 శాతం హాజరు లేకపోతే మేము పరీక్ష కూడా రాయలేం. కానీ, ఈ అత్యాచార దోషి జైలుకు హాజరుకాకుండా తన భారీ కాన్వాయ్తో తిరుగుతూ విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తున్నాడు’’‘‘ఈ దేశంలో అసలు ఏమి జరుగుతోంది? మీడియాకూ అతడిని అత్యాచార దోషి అని చెప్పే ధైర్యం కూడా లేదు’’‘‘ఈ దేశంలో ఏమి జరుగుతోంది సోదరా? వీళ్లకు ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారు? దీనికి మొత్తం ప్రజలే కారణం. ఈ చెత్త పరిస్థితుల నుంచి మనకు ఎప్పటికీ విముక్తి రాదేమో..’’‘‘ప్రభుత్వం ఇతడి కాన్వాయ్లో ఇంకో 10 వాహనాలు చేర్చాలి. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలి. ఈ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోతే ఎలా?’’‘‘మోదీ తన కాన్వాయ్ను 2 కార్లకు తగ్గించారు. అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ అంతకంటే పెద్ద వ్యక్తినా? పెట్రోల్, డీజిల్ ఖర్చుల నియంత్రణ చర్యల గురించి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయమే అతనికి తెలియనట్టుంది’’."इस देश में न्याय अंधा नहीं है।उसकी आँखें खरीदी जा चुकी हैं।"2026 - 16वीं बार बाहर।उन दो बेटियों से पूछोजिनके साथ यह हुआ.."क्या तुम्हें न्याय मिला?"जवाब system कीसबसे बड़ी सच्चाई है।• Election आने वाला था।बाकी आप समझदार हैं। #RamRahimParole #BalaatkariBahar #IndiaWakeUp pic.twitter.com/xaEBPFuRpu— AVI SHUKLA (@AVINASHKUM41087) May 26, 2026#WATCH | Haryana | Rape convict Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh, who has been released from Sunaria prison in Rohtak after being granted 30-day parole, arrives in Sirsa pic.twitter.com/ifkW47oXNI— ANI (@ANI) May 26, 2026राम रहीम को बैल मिलती रहे वोह वजह से BJP ने कानून ही बदल दिया।#RamRahim#RamRahimParole#RamRahimBail#Haryana#HaryanaBJP#BJPGovernment#VIPTreatment#IndianPolitics pic.twitter.com/s8kxShrkL9— Mayank Solanki 🇮🇳 (@BareTruthX) January 7, 2026pic.twitter.com/UABin1I37q— Mr. X Y Z (@mr_xyz_007) May 26, 2026BJP ka Love Charger 😂 pic.twitter.com/rXy8mwUk4Z— Mi Pan Kakoroz (@BMCInsider_) May 26, 2026 -
చరిత్ర సృష్టించిన రబాడ
ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ రెండో ఓవర్ చివరి బంతికి దూకుడు మీద ఉన్న వెంకటేశ్ అయ్యర్ను (19) ఔట్ చేశాడు. శుభ్మన్ గిల్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టి అయ్యర్ను పెవిలియన్కు పంపాడు.ఈ వికెట్తోనే రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో మొదటి ఆరు ఓవర్లలో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వికెట్కు ముందు రబాడ మహ్మద్ షమీతో (2023 ఎడిషన్) కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. ఈ రికార్డుకు సంబంధించి రబాడ, షమీ తర్వాతి స్థానాల్లో మిచెల్ జాన్సన్ (16 వికెట్లు, 2013), ట్రెంట్ బౌల్ట్ (16, 2020) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 140-3గా ఉంది. వెంకటేశ్ అయ్యర్ (19), విరాట్ కోహ్లి (43), దేవదత్ పడిక్కల్ (30) ఔట్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (21), కృనాల్ పాండ్యా (25) క్రీజ్లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 1, హోల్డర్ 2 వికెట్లు పడగొట్టారు. హోల్డర్ 9వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ చేసిన అతడు.. నాలుగో బంతికి పడిక్కల్ను పెవిలియన్కు పంపాడు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 43 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ఈ క్రమంలో కోహ్లి ఈ ఏడాది సీజన్లో 600 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు.ఇప్పడు ఈ ఏడాది సీజన్లో కూడా కోహ్లి 50.00 సగటు, 164.38 స్ట్రైక్రేట్తో600 పరుగులు చేశాడు. గతంలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. కానీ వరుసగా నాలుగు సీజన్లలో కోహ్లి మినహా మిగితా ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. అదేవిధంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడిన జాబితాలో కోహ్లి నాలుగో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ఇప్పటివరకు 18 ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడి శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, కిరాన్ పొలార్డ్ సరసన కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోని(28) అగ్రస్ధానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, రైనా(24) తర్వాతి స్ధానంలో కొనసాగుతున్నారు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
ఆర్థిక సేవల్లోకి ఐషర్ మోటర్స్
ఐషర్ మోటర్స్ తాజాగా వోల్వో గ్రూప్తో కలిసి ఆర్థిక సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్ (వీఎఫ్ఎస్) ఇండియాలో 50 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సంస్థ రూ. 750 కోట్లు వెచ్చించనుంది.ప్రస్తుతం ఐషర్ (ఈఎంఎల్), వోల్వో గ్రూప్నకు వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) పేరుతో జాయింట్ వెంచర్ ఉంది. ప్రతిపాదిత ఆర్థిక సేవల జాయింటు వెంచరనేది భారత్లో వీఈసీవీ, ఈఎంఎల్, వోల్వో గ్రూప్ ఉత్పత్తులకు క్యాప్టివ్ ఫైనాన్సింగ్ సంస్థగా వ్యవహరిస్తుంది. వోల్వో గ్రూప్తో 18 ఏళ్ల భాగస్వామ్యాన్ని వాహనాలకు ఫైనాన్సింగ్ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు ఈఎంఎల్ చైర్మన్ సిద్ధార్థ లాల్ తెలిపారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు లేవని, మెస్ చార్జీలు పెంచినా, విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదన్నారు. విద్య కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతానని, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తే అవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. అవే డబ్బులు విద్యకు ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన ప్రొటీన్ ఫుడ్ అందడం లేదన్నారు రాజగోపాల్రెడ్డి. -
ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
విజయవాడ: ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఎలిమినేటర్లో భాగంగా ఎస్ఆర్హెచ్ బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ఎస్ఆర్హెచ్ క్యాంప్ను వీడి శ్రీలంకకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మెండిస్ జాతీయ జట్టు కమిట్మెంట్స్ కారణంగా జట్టును వీడినట్లు సమాచారం. శ్రీలంక జట్టు త్వరలోనే ఆల్ఫార్మాట్ సిరీస్లలో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన శ్రీలంక జట్టులో మెండిస్ భాగంగా ఉన్నాడు. ఈ కారణంతో అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు ముందు తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే లంక జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మెండిస్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. గత సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో మెండిస్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, కమ్మిన్స్, మలింగ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లగా తుది జట్టులో కొనసాగుతున్నారు.రాజస్తాన్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంబరీష్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే. -
కాక్రోచ్ జనతా పార్టీని నాకిచ్చేయండి..!
సోషల్ మీడియాలో వ్యంగ్యరూపంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రోజుల వ్యవధిలోనే విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. ఎంతలా అంటే భారత్లో ప్రధానంగా ఉన్న రాజకీయా పార్టీలను వెనక్కు నెట్టి మరీ ఈ పార్టీ దూసుకుపోయింది ఏ నోట విన్నా సీజేపీ అనే స్థాయికి ఈ సోషల్ మీడియా పార్టీ చేరింది. అయితే దీన్ని నెలకొల్పంది అభిజీత్ దిప్కే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన అభిజిత్.. ఇటీవల దీన్ని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేయగా విశేషమైన ఆదరణ లభించింది. అయితే దీనికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఆ పేరును నాకిచ్చేయండి..హరియాణాలోని పానిపట్కి చెందిన న్యాయవాది సుధీర్ జాకర్ సీజేపీని తన పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన తానే పార్టీ జాతీయ కన్వీనర్ అని ప్రకటించుకున్నాడు, దీన్ని అమెరికాలో చదువుకుంటున్న అభిజీత్ దిప్కే నుంచి వేరు చేసి తన పేరుతో పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుధీర్ జాకర్.. కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాడు. ఆ పేరును తనకు కేటాయించాలని కోరుతూ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీని రిజిస్టర్ చేసుకోవడానికి భారత్కు రమ్మంటే రానంటున్న అభిజిత్ దీప్కే నుంచి ఆ పార్టీని వేరు చేయాలని దరఖాస్తులో కోరారు. ‘యువతలో కోపం పెరుగుతోంది. ఎవరైనా ముందుగా ఈ పేరును నమోదు చేసి దుర్వినియోగం చేస్తే ఉద్యమం నశిస్తుంది. అందుకే నేను ముందుకు వచ్చాను’ అని దరఖాస్తు చేసుకునే క్రమంలో చెప్పుకొచ్చారు సదరు న్యాయవాది. ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత గత గురువారం భారతదేశంలో సీజేపీ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ ట్రెండ్లలో ఒకటిగా అవతరించిన సీజేపీని ప్రస్తుతం బ్యాన్ చేశారు. మరి ఇది పార్టీగా రూపాంతరం చెందుతుందా? తుపాను వేగంతో వచ్చిన ఈ పార్టీకి ఇక్కడతోనే కథ ముగిసినట్లా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తంగా సీజేపీ ఇప్పుడు అసలు స్థాపకుడు అభిజీత్ దిప్కే వర్సెస్ జాకర్ మధ్య యాజమాన్య పోరుకు తెరతీయడం మరింత హాట్ టాపిక్గా మారింది. -
అనన్య పాండే వింత డ్యాన్స్.. ట్రోలింగ్పై స్పందించిన చంకీ పాండే
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డ్యాన్స్ వీడియో ఒకటి గత రెండు రోజులుగా నెట్టింట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన కొత్త మూవీ ‘చాంద్ మేరా దిల్’సినిమాలోని వీడియో అది. అందులో అనన్య సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆ డ్యాన్స్ చూస్తే భరతనాట్యంలా అనిపించినప్పటికీ.. స్టెప్పులు మాత్రం ఇబ్బందికరంగా,వింతగా ఉండడంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అలా స్టెప్పులేని భరతనాట్యాన్ని అవమానపరిచిందంటూ అనన్యపై ఫైర్ అవుతున్నారు.‘ట్రెడిషనల్ భరతనాట్యం వర్సెస్ బాలీవుడ్ నాట్యం’ అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసి.. అనన్యను విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ వీడియోపై అనన్య పాండే తండ్రి, ప్రముఖ నటుడు చంకీ పాండే స్పందించాడు. చిన్న క్లిప్పు చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని, సినిమా చూసి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాక స్పందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సినిమాలో భరతనాట్యాన్ని ప్రదర్శించలేదని, అది కల్చరర్ ఈవెంట్లలో విద్యార్థులు ప్రదర్శించే ఫ్యూజన్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ లాంటిదని చంకీ పాండే వివరణ ఇచ్చారు. చాలా మంది అపార్థం చేసుకొని తన కూతురిని విమర్శిస్తున్నారని ఆయన .పేర్కొన్నారు.‘చాంద్ మేరా దిల్’ విషయానికొస్తే.. లక్ష్య్, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి వివేక్ సోనీ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలేజీలోనే ప్రేమించుకున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాక వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా కథ. హైదరాబాద్ నేపథ్యంలోనే కథనం సాగుతుంది. Bollywood rarely creates originals these days, but somehow always finds a way to ruin the originals that already exist.#BharatNatayam #AnanyaPandey pic.twitter.com/fwukikOkhi— MK Sharma ✍️ (@EmediaManoj) May 25, 2026 -
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్గా భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్-2026లో కూడా సూర్య తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.13 ఇన్నింగ్స్లలో అతడు కేవలం 270 పరుగులు సాధించాడు. ఇప్పుడు అతడు తన పేలవ ఫామ్ కారణంగా భారత టీ20 కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత కెప్టెన్గా అతడి భవిత్యవం తేలిపోనుంది. ఈ సిరీస్లోనూ సూర్య విఫలమైతే భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ రావడం ఖాయం కానుంది. ఇక తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి సూర్యకుమార్కు మరో అద్భుత అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ముంబై టీ20 లీగ్-2026లో ‘ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్’ ఫ్రాంచైజీ తరఫున సూర్య బరిలోకి దిగనున్నాడు.ఉగాండా పై ఆడనున్న సూర్యకాగా ఈ టోర్నీ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ ఉగాండాపై ఆడనున్నాడు. ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ను ఉగాండా 4-0తో క్లీన్స్వీప్ చేసింది. ముంబై లీగ్లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఉగాండా తమ తొలి మ్యాచ్లో మే 30న ‘ట్రయంఫ్ నైట్స్’ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో ట్రయంఫ్ నైట్స్ తరపున సూర్య ఆడనున్నట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ ట్రయంఫ్ నైట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఉగాండాపై అతడు ఆడే అవకాశముంది. సూర్య ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్గా ఉన్నాడు. అతడు ఏ జట్టుపై ఆడినా, అది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని ఎంసీఎ కార్యదర్శి ఉన్మేష్ ఖాన్విల్కర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
టీమిండియాతో సిరీస్లకు ఆఫ్ఘనిస్తాన్ జట్ల ప్రకటన
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-ఆఫ్ఘన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ల కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇవాళ (మే 26) ప్రకటించారు. ఈ రెండూ ఫార్మాట్ల జట్లకు హష్మతుల్లా షాహిది కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది.ఇటీవలికాలంలో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్లో లేకపోయినా, కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు.వన్డే జట్టులో అనుభవజ్ఞులైన రహ్మత్ షా, రహ్మానుల్లా గుర్బాజ్తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్కీపర్లుగా అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్లను ఎంపిక చేశారు.బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్లపై ఆఫ్ఘనిస్తాన్కు కీలకంగా మారనుంది.2027 వన్డే వరల్డ్కప్ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. బెంచ్ స్ట్రెంత్ను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు టెస్టు ఫార్మాట్లో భారత్ లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్కు ఈ సిరీస్ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ, రషీద్ ఖాన్.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ.ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్ఏకైక టెస్ట్ మ్యాచ్- జూన్ 6-10 (ముల్లాన్పూర్)తొలి వన్డే- జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే- జూన్ 17 (లక్నో)మూడో వన్డే- జూన్ 20 (చెన్నై) -
పాటిదార్ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్
పాటిదార్ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాటిదార్ క్యాచ్ను రబాడ మిస్ చేయడంతో గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్లు, రనౌట్లు మిస్ చేయడంతో పాటు లేని పరుగులను సమర్పించుకున్నారు. బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్ చేసినా ఫీల్డర్ల పొరపాట్ల కారణంగా గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.6వ ఓవర్- 214 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో టిమ్ డేవిడ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ఆర్సీబీ స్కోర్: 204/4భారీ స్కోర్ దిశగా ఆర్సీబీఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(43), పాటిదార్(49) ఉన్నారు.మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ9వ ఓవర్లో ఆర్సీబీ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జేసన్ హోల్డర్ బౌలింగ్లో విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (30) పెవిలియన్కు చేరాడు. పవర్ ప్లేలో దుమ్మురేపిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపింది. సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (19) ఔటైనా, విరాట్ కోహ్లి (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (23 నాటౌట్) మెరుపులు కొనసాగించారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 76-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.6వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెంకటేశ్ అయ్యర్ (19) ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 26) జరుగుతున్న తొలి క్వాలిఫయర్ పోటీలో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ సలాం దార్ -
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్లో సత్తాచాటాలని 15 ఏళ్ల వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్కు ముందు వైభవ్ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో వైభవ్ రెండో స్ధానంలో న్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 232.27 స్ట్రైక్ రేట్తో 583 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ ఆటగాడు జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ పేరిట ఉంది. ఐపీఎల్-2024 సీజన్లో మెక్గర్క్ 234.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇప్పుడు సన్రైజర్స్పై వైభవ్ డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తే స్ట్రైక్ రేట్ పరంగా మెక్గర్క్ను అధిగమించే అవకాశముంది.500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్ (232.27) నమోదు చేసిన రికార్డు వైభవ్ పేరిటే ఉంది.గేల్ రికార్డుపై కన్నుకాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డుపై కూడా వైభవ్ కన్నేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) పేరిట ఉంది. వైభవ్ మరో 7 సిక్సర్లు కొడితే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల సుదీర్ఘ రికార్డు బద్దలవుతుంది.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2012)వైభవ్ సూర్యవంశీ: 53 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ - ఐపీఎల్ 2026)*ఆండ్రీ రస్సెల్: 52 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2019)క్రిస్ గేల్: 51 సిక్సర్లు (16 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2013)చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
భారత్ను అధిగమించిన తైవాన్!
గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్బెర్గ్ డేటా వెల్లడించింది.తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, క్వాల్కామ్ ఉపయోగించే అధునాతన చిప్లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. -
అటల్ పెన్షన్ యోజన కొత్త రికార్డు!
సామాజిక భద్రతా పథకం ‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) కింద సభ్యుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ ఎస్ రామన్ తెలిపారు. 2026 మార్చి చివరికి ఏపీవై సభ్యులు 8.96 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2025 మార్చి నాటికి)లో సభ్యుల సంఖ్య 7.61 కోట్లతో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది కొత్త సభ్యులు జతయ్యారు. 18 శాతం వార్షిక వృద్ధి అంచనా ఆధారంగా సభ్యుల సంఖ్య 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్టు రామన్ పేర్కొన్నారు.ఎన్పీఎస్ కూడా పీఎఫ్ఆర్డీఏ నియంత్రణల కిందే నడుస్తుండడం గమనార్హం. 18–25 ఏళ్ల వయసు వారి నుంచి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారని.. దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువతలో అవగాహన పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తున్నట్టు రామన్ చెప్పారు. ఎన్పీఎస్ కింద 2026 మార్చి నాటికి 2.17 కోట్ల మంది సభ్యులు ఉండగా, వీరికి సంబంధించి రూ.15.95 లక్షల కోట్ల పింఛను నిధి నిర్వహణలో ఉన్నట్టు రామన్ తెలిపారు. ఈ ఏడాది ఎన్పీఎస్ సభ్యుల సంఖ్య 22 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. -
బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడిని మూడు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంది. కాగా, ఈనెల 16న బండి భగీరథ్ను అరెస్టు చేసి, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. అతడిని కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ విచారించారు.మరోవైపు, భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇటీవలే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భగీరథ్ కోరారు. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్పై రిలీజ్ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంఆర్వో సుచరిత
సాక్షి,హైదరాబాద్: ఏసీబీ అధికారులకు శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్కి సుచరిత ఎకరాకు లక్షరేట్ కార్డ్ ఫిక్స్ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్కి 30లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్గా సుచరిత కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్ నీళ్లు నమిలారు.ఎమ్మార్వో సుచరిత శామీర్పేట్ ఆఫీస్నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.2024లో శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
కర్ణాటక సీఎం మార్పు? కుండ బద్దలుకొట్టినట్లు వేణుగోపాల్ ప్రకటన
న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహగానాలు వస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేర్వేరుగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన మేరకు తనకు సీఎం పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఐదేళ్లపాటు తననే సీఎంగా కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నారు. సీఎం సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, డీకే శివకుమార్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన్నదే అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది.సిద్ధరామయ్యకు క్షేత్రస్థాయిలో ప్రజాబలం, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నాయి. డీకే శివకుమార్కు మంచి వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్గా అనుభవం ఉంది. సిద్ధరామయ్యను మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్ఠానం ఉంది. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, తదితర అంశాలను సిద్ధరామయ్య వివరించారు. ఏ మార్పు అయినా రాజ్యసభ ఎన్నికల తర్వాత ఉండొచ్చు.దీనికి మించి ఏమీ లేదు: వేణుగోపాల్ స్పష్టం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ ఊహగానాలేనని తెలిపారు. రాజ్యసభ , కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించామని, ఇవి కాక మరే విషయాలపైనా చర్చించలేదని చెప్పుకొచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా ఉన్నారు.‘‘మీవన్నీ కేవలం ఊహాగానాలే, అందులో నిజం ఏమీ లేదు. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం నిర్వహించాం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శి, నేను ఈ చర్చలో పాల్గొన్నాం. మొత్తం చర్చ రానున్న రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపైనే సాగింది. కర్ణాటక రాజ్యసభ, కౌన్సిల్ స్థానాల అభ్యర్థుల పేర్లను ఇతర రాష్ట్రాల స్థానాల అభ్యర్థులతో పాటు ప్రకటిస్తాం. ఈ రోజు మేం తీసుకున్న నిర్ణయం ఇదే, దీనికి మించి ఏమీ లేదు" అని వేణుగోపాల్ అన్నారు. -
ఐపీఎల్కు రిటైర్మెంట్.. రోజుల వ్యవధిలో మరో లీగ్లో చేరిక
ఐపీఎల్కు గుడ్బై చెప్పిన కొద్ది రోజులకే భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. అంతర్జాతీయ ఫ్రాంచైజీ క్రికెట్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అతడు.. లంక ప్రీమియర్ లీగ్లోని క్యాండీ రాయల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలై 17 నుంచి ప్రారంభంకానున్న ఎల్పీఎల్ ఆరో సీజన్లో విజయ్ క్యాండీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.విజయ్ ఐపీఎల్తో పాటు భారత దేశవాళీ క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెట్తో బంధాన్ని పూర్తిగా తెంచుకుంటేనే భారతీయులకు ఇతర దేశాల క్రికెట్ లీగ్ల్లో ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టే విజయ్కు లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది. విజయ్ తన రిటైర్మెంట్ ప్రకటనలోనే కొత్త అవకాశాలు, మరింత క్రికెట్ ఆడేందుకు అంటూ లంక ప్రీమియర్ లీగ్ ఎంట్రీపై సంకేతాలు ఇచ్చాడు. విజయ్.. క్యాండీ రాయల్స్లో వనిందు హసరంగ, ఏంజెలో మాథ్యూస్, మొయిన్ అలీ తదితర స్టార్లతో కలిసి ఆడతాడు.35 ఏళ్ల విజయ్ భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లు 324 పరుగులు, 9 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం బౌలర్ అయిన విజయ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 4253 పరుగులు, లిస్ట్-ఏలో 2790, టీ20ల్లో 2583 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 154 వికెట్లు కూడా తీశాడు.తమిళనాడు జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించిన విజయ్.. విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను గెలిపించాడు. 2025-26 సీజన్కు ముందు విజయ్ త్రిపుర జట్టుకు మారాడు. విజయ్ తన చివరి రంజీ మ్యాచ్లో గుజరాత్పై అజేయంగా 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.విజయ్ ఐపీఎల్ ప్రస్తానాన్ని పరిశీలిస్తే.. 2014 అరంగేట్రం చేసిన ఇతగాడు.. 2025 వరకు 78 మ్యాచ్లు ఆడి 1233 పరుగులు, 9 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విజయ్ను.. 2026 సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్ విజయ్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించి 6 మ్యాచ్ల్లో 118 పరుగులతో పర్వాలేదనిపించాడు. -
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే, నేత మధ్య రాళ్లదాడులు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎస్ మాల్ అంశం టీడీపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఎస్ఎస్ షాపింగ్ మాల్లో వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఈ మాల్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రవీణ్ రెడ్డి కలెక్టర్, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదుతో ఎస్ఎస్ షాపింగ్ మాల్లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు వెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రవీణ్ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై రాళ్లదాడి చేశారు.ప్రతిగా ఎమ్మెల్యే వర్గీయులు కూడా రాళ్లు విసిరారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు. -
‘నేనెవరు?’.. మే 29న తెలుస్తుంది
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నేనెవరు?’. చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘నువ్వేకావాలి’, ‘ప్రేమించు’ వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్, రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది. మే 29న థియేటర్లలో విడుదల కానున్న “నేనెవరు?” చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. -
‘తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా, ఇంతవరకూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందని, దాన్నుంచి తెప్పించుకునేందుకు జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయని, ఏ వర్గానికీ కూడా మేలు జరిగిన పరిస్థితే లేదన్నారు.ఈరోజు(మంగళవారం, మే 26వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి.. మాట్లాడితే అసెంబ్లీకి రమ్మంటారు.. వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసన్నారు. జగన్ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. కనీసం అప్పులు దేనికి ఖర్చు చేశారో కూడా చెప్పటం లేదు. వైఎస్సార్సీపీ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని గతంలో ప్రచారం చేశారు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసింది. సంక్షేమం, అభివృద్ధి అజెండా గా మా ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..గతంలో పవన్ 35 వేల మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయితులపై మాట్లాడే దైర్యం చేయటం లేదు. అప్పట్లో సుగాలీ ప్రీతి విషయంలో ఊగిపోయారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తూ లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి మేలు జరగటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ అన్నారు. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించకపోవటంతో అనేక విమర్శలు వస్తున్నాయి. డిఎస్సీ లో పేపర్ లీక్ దగ్గర నుంచి అనేక మోసాలు చేశారు..ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారు. కక్ష్య కట్టుకుని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.మెడికల్ కళాశాలల పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ల కోసం పోలవరం అస్తవ్యస్తం చేశారు. పోర్ట్స్ కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధం అయ్యారు. మంత్రులు తమ శాఖల సంగతి వదిలేసి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. క్యాబినెట్ మొత్తం జగన్ ను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేంద్రం నిర్ణయంపై అన్నామలై అభ్యంతరం
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై అభ్యంతరం వ్యక్తం చేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు భిన్నంగా సీబీఎస్ఈ వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని 'ఎక్స్'లో పేర్కొన్నారు.పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేయడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయడం తగదని హితవు పలికారు. తక్కువ సమయంలోనే ఒక కొత్త భాషను నేర్చుకోవాలని పిల్లలపై ఒత్తిడి చేస్తే వారి చదువులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో చెప్పినట్టుగానే 2029 నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం అమలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరారు.''ఆరో తరగతి నుంచే విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని, వాటిలో రెండు భారతీయ భాషలు ఉండాలని ఏప్రిల్లో సీబీఎస్ఈ చేసిన ప్రకటనను స్వాగతించిన వారిలో నేనూ ఒకడిని. ఈ నిర్ణయం వల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే అనేక భాషలను నేర్చుకోవడానికి వీలవుతుంది. భారతదేశపు విభిన్న సాహిత్య ప్రపంచంపై వారి అవగాహనను విస్తృతం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సీబీఎస్ఈ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మూడో భాషను 2029-30 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే తప్పనిసరి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.అయితే ఈనెల 15న తన అనుబంధ పాఠశాలలన్నింటికీ సీబీఎస్ఈ పంపిన ఉత్తర్వుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులు కొత్తగా మూడో భాషను నేర్చుకోవాలని ఆదేశించారు. దీని ప్రకారం జూలై 1 నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పసరిగా మూడు భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత స్వల్ప వ్యవధిలో కొత్త భాష నేర్చుకోవాలంటే ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సీబీఎస్ఈ తాజాగా వెలువరించిన ఉత్తర్వులు తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తక్షణమే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. గత ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగానే 2029-30 విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదవ తరగతికి త్రిభాషా సూత్రం అమలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాన''ని అన్నామలై ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఏమిటీ త్రిభాషా సూత్రం? జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ త్రిభాషా సూత్రం వర్తిస్తుంది. ఏయే భాషలు బోధించాలన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. ఫలానా భాష కచ్చితంగా ఉండాలన్న బలవంతం ఏమీ లేదు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది. విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమై, తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్ పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే -
బాబర్ ఆజం కోసం విరాట్ కోహ్లికి డిమోషన్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన ఆల్ టైమ్ బెస్ట్ వన్డే వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి మిస్బా చోటిచ్చాడు. కోహ్లితో పాటు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఛాన్స్ లభించింది. అయితే ఈ జట్టులో బాబర్ ఆజం కోసం కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్ను మిస్బా మార్చడం గమనార్హం.వన్డేల్లో కోహ్లి సాధరణంగా మూడో స్ధానంలో బ్యాటింగ్ వస్తాడు. ఇదే స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి కోహ్లి ఎన్నో వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ మిస్బా మాత్రం విరాట్కు నాలుగో స్ధానంలో ఛాన్స్ ఇచ్చాడు. కోహ్లి స్ధానాన్ని బాబర్తో ఈ పాక్ లెజెండ్ భర్తీ చేశాడు.ఇక ఓపెనర్లగా శ్రీలంక స్టార్ కుశాల్ మెండిస్, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ను అతడు ఎంపిక చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ జోఫ్రా ఆర్చర్, సౌతాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, మార్కో జానెసన్ ఈ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి మిచెల్ శాంట్నర్కు ఒక్కడికే ఈ జట్టులో చోటు దక్కింది.వన్డేల్లో తిరుగులేని విరాట్విరాట్ కోహ్లి 37 ఏళ్ల వయస్సులోనూ వన్డే క్రికెట్లో దూసుకుపోతున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్(14,797) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ కంటే మాత్రమే వెనుకబడి ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రం కోహ్లి(54) పేరిటే ఉంది. వచ్చే నెలలో అఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్లో కోహ్లి తిరిగి మళ్లీ భారత జెర్సీలో కన్పించనున్నాడు.చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
66 హార్డ్ డిస్క్లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్లో డైరెక్టర్లు
ప్రముఖ చలనచిత్ర దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీలకు భారీ షాక్ తగిలింది. వీరి నిర్మాణ సంస్థ ‘టైగర్ బేబీ’ (Tiger Baby)లో విలువైన డేటాను తస్కరించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ సంస్థ కార్యాలయం నుండి, ముఖ్యమైన సినిమా , OTT సంబంధిత డేటా నిక్షిప్తమై ఉన్న 66 హార్డ్ డిస్క్లు దొంగతనం ఆరోపణలపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ డిస్క్ల మార్కెట్ విలువ సుమారు రూ. 13 లక్షలు ఉంటుందని అంచనా. ఇంకా విడుదల కాని సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధించిన 2026 మే నెలలో 66 హార్డ్ డిస్క్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ డిస్క్లలో 16TB నుండి 72TB వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని వారి ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. ఈ ఫుటేజ్తోఆటు, రఫ్ ఎడిట్స్, యాడ్ ప్రాజెక్ట్లు, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , ముగిసిన సినిమాల బ్యాకప్ డేటా ఉన్నాయి.ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ (Made in Heaven) సిరీస్, అలాగే 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘ఘోస్ట్ స్టోరీస్’ (Ghost Stories) ప్రాజెక్ట్లకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.వీటిల్లో కొన్ని డిస్క్లు గ్రే మార్కెట్లో విక్రయించగా, గోప్యమైన డేటా లీక్ అయ్యే అవకాశాలపై నిపుణుల విచారణ చేపట్టారు.ఇంటిదొంగల పనే మే 21న ఆఫీస్ సిబ్బంది పని కోసం హార్డ్ డిస్క్లను వెతకగా అవి కనిపించలేదు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ , హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న మెహజబీన్ ముస్తాక్ షేక్ అంతర్గతంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. స్టోరేజ్ క్యాబినెట్లో ఉన్న అసలైన హార్డ్ డిస్క్లను దొంగిలించి, వాటి స్థానంలో ఖాళీ లేదా పాడైపోయిన డబ్బాలను ఉంచినట్లు గుర్తించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటివాడు ఆ స్టోరేజ్ క్యాబినెట్ను పర్యవేక్షించే ఆఫీస్ ఉద్యోగే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గ్రే మార్కెట్ (Grey Market)లో ఒక్కో హార్డ్ డిస్క్ను రూ. 15,000 నుండి రూ. 20,000 లకు విక్రయించినట్లు తెలిపాడు. ఇక రెండో నిందితుడు బోరివలికి చెందిన ఒక వ్యక్తి ఈ డిస్క్లను కొనుగోలు చేయగా, పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి మే 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది.సైబర్ నిపుణుల దర్యాప్తుదొంగిలించబడిన వాటిలో 24 హార్డ్ డిస్క్లను నిందితుడు అమ్మేయగా, మిగిలిన వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, హార్డ్వేర్ దొరకడం కంటే కూడా అందులోని రహస్య డేటాను ఎవరైనా కాపీ చేశారా? లేదా ఆన్లైన్లో ఎక్కడైనా లీక్ చేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వినోద పరిశ్రమలో డేటా సెక్యూరిటీ (సమాచార భద్రత) ఎంత ముఖ్యమనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. -
పెట్రోల్ ధరలు రూ.10 పెరగాల్సింది!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై అదనపు భారం పడకుండా 76 రోజుల పాటు ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలు, చాలా రోజులకు ముందే పెరగాల్సి ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొంతకాలం వరకు ప్రజలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా.. ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉపశమనం కల్పించిందని సీతారామన్ చెప్పారు. ప్రభుత్వం ఆ సమయంలో పన్ను తగ్గింపులు చేయకపోయి ఉంటే, అప్పుడే లీటరుకు రూ.10 వరకు ధరలు పెరిగేవని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ధరల పెంపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయమని, ఎందుకంటే ఆయా సంస్థలే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురును కొనుగోలు చేసి విక్రయిస్తున్నాయని వివరించారు.ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొంటోందని, దీని ప్రభావం భారతదేశంపై కూడా పడుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ముఖ్యంగా 'మూడు ఎఫ్లు' - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) విషయంలో దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ ఖర్చులు కూడా అధికమవుతున్నాయని ఆమె హెచ్చరించారు.ఇక విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఇంధనంతో పాటు.. ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయని సీతారామన్ తెలిపారు. అలాగే బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. భారతదేశం బంగారం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇది ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.రూపాయి విలువ పడిపోవడంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. రూపాయి బలహీనత, పెట్టుబడుల పరిస్థితులపై ప్రజల నుంచి, వివిధ విభాగాల నుంచి అనేక సూచనలు వచ్చాయని తెలిపారు. వాటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోందని, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్! -
ధోని సరసన రియాన్.. భారీ కెప్టెన్సీ రికార్డు
ఫుల్టైమ్ కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ రాయల్స్ను ప్లే ఆఫ్స్కు చేర్చిన రియాన్ పరాగ్ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి సీజన్లోనే తన జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చిన 24వ సారధిగా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా లెజెండరీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ సరసన చేరాడు.కెప్టెన్గా మొదటి సీజన్లో తమ జట్లను ప్లే ఆఫ్స్కు చేర్చిన కెప్టెన్లుషేన్ వార్న్ - RR, 2008యువరాజ్ సింగ్ - KXIP, 2008ఎంఎస్ ధోని - CSK, 2008వీరేంద్ర సెహ్వాగ్ - DC, 2008అనిల్ కుంబ్లే -RCB, 2009డేనియల్ వెట్టోరి - RCB, 2011గౌతమ్ గంభీర్ - KKR, 2011హర్భజన్ సింగ్ - MI, 2012రోహిత్ శర్మ - MI, 2013కెమరాన్ వైట్ - SRH, 2013జార్జ్ బెయిలీ - KXIP, 2014స్టీవ్ స్మిత్ - RR, 2015సురేష్ రైనా - GL, 2016కేన్ విలియమ్సన్ - SRH, 2018దినేష్ కార్తీక్ - KKR, 2018అజింక్యా రహానే - RR, 2018రిషబ్ పంత్ - DC, 2021హార్దిక్ పాండ్యా - GT, 2022ఫాఫ్ డు ప్లెసిస్ - RCB, 2022కేఎల్ రాహుల్ - LSG, 2022కృనాల్ పాండ్యా - LSG, 2023పాట్ కమిన్స్ - SRH, 2024రజత్ పాటిదార్ - RCB, 2025రియాన్ పరాగ్ - RR, 2026కాగా, గత సీజన్ వరకు రాజస్థాన్ కెప్టెన్గా వ్యవహరించిన సంజూ శాంసన్ సీఎస్కేకు ట్రేడ్ కావడంతో.. ఈ సీజన్తోనే రియాన్ పరాగ్ ఫుల్ టైమ్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రియాన్.. సీజన్ ఆరంభంలో జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మధ్యలో తడబడినా, చివరికి మళ్లీ పుంజుకొని తన జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చాడు.ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో (ముంబై ఇండియన్స్) రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటి అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకొని ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్తో అమీతుమీకి సిద్దమైంది. తొలి మూడు ప్లే ఆఫ్స్ బెర్త్లను దక్కించుకున్న జట్లుగా ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఉన్నాయి. ఇవాళ (మే 26) జరిగే క్వాలిఫయర్-1లో టాప్-2 జట్లు ఆర్సీబీ-గుజరాత్ తలపడనుండగా.. రేపు (మే 27) జరుగబోయే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్-రాజస్థాన్ ఢీకొంటాయి. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో పోటీపడుతుంది. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్లో టైటిల్ కోసం పోరాడతాయి.బ్యాటర్గా విఫలంకెప్టెన్గా మెప్పించిన రియాన్, బ్యాటర్గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్ల్లో కేవలం 272 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్రేట్ బాగానే ఉన్నప్పటికీ, అతడి నుంచి భారీ ఇన్నింగ్స్లు రావాలని జట్టు ఆశించింది. -
‘లావు.. మొరటు’!.. కండబలం, గుండెబలంతో ముందడుగు!
తల్లిదండ్రులు ఇద్దరూ క్రీడాకారులే. తండ్రి జయశంకర్ భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు కెప్టెన్ అయితే.. తల్లి ప్రసన్న భారత మహిళల బాస్కెట్బాల్ జట్టుకు సారథి. ఆ తర్వాత ఇద్దరూ కోచ్లుగా మారి ఆటతో ప్రయాణం కొనసాగించారు.అలా ఆ అమ్మాయికి చిన్ననాటి నుంచే క్రీడా వాతావరణం అలవాటైపోయింది. అయితే, తల్లిదండ్రుల్లా ఆమె బాస్కెట్బాల్ను ఎంచుకోలేదు. అందుకు బదులు ‘షాట్పుట్’ ఆమెను ఎంచుకుంది. ఆ అమ్మాయి పేరు క్రిష్ణా జయశంకర్ మీనన్. ఇండోర్ షాట్పుట్లో 17 మీటర్ల మార్కు దాటిన తొలి భారత మహిళా అథ్లెట్గా ఆమె ఇటీవలే చరిత్ర సృష్టించింది.ఒలింపిక్స్ లక్ష్యంగా..అంతేకాదు.. అమెరికాలో NCAA డివిజన్ 1 స్కాలర్షిప్ పొందిన ఏకైక భారత మహిళా షాట్పుటర్గానూ క్రిష్ణ రికార్డు సాధించింది. తదుపరి అవుట్డోర్ సీజన్పై దృష్టి పెట్టిన ఈ తమిళనాడు అథ్లెట్.. కామన్వెల్త్, ఆసియా క్రీడలు.. ఆపై లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్క్రీడా కుటుంబంలో జన్మించినప్పటికీ క్రిష్ణ ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. తన ‘కండబలం’ చూసి అందరూ హేళన చేస్తుంటే.. తాను మహిళా అథ్లెట్కు నిజమైన ప్రతినిధిని కాదేమోనంటూ కుంగిపోయేది క్రిష్ణ. అలా ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె.. ఎనిమిది సార్లు జాతీయ సెలక్షన్స్లో విఫలమైంది.నిజానికి షాట్పుట్ శిక్షణ కారణంగానే ఆమె దేహం కండలు తిరిగింది. త్రోయింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్ను ఎదుర్కొంది. తనలో ఆడతనం కనిపించడం లేదంటూ కొంతమంది హద్దుదాటి మరీ కామెంట్ చేసేవారు.ఈ ప్రభావం క్రిష్ణ ఆట తీరుపై పడింది. అయితే, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడింది. తనను గేలి చేసిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెట్టిన క్రిష్ణ.. ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పింది.జమైకాలో ఇలాగే ఉంటారుకోవిడ్ సమయంలో క్రిష్ణ శిక్షణ కోసం ఇండియాను వీడి జమైకాకు వెళ్లింది. అక్కడ తనలాగా ఉండే కండలు తిరిగిన ఆడ అథ్లెట్ల విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అక్కడ అచ్చంగా తన లాంటి శరీరాకృతితో ఉన్న అథ్లెట్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఫలితంగానే ఇప్పుడు ఈ రికార్డు విజయం ఆమె సొంతమైంది.త్యాగాల ఫలితంక్రిష్ణ తల్లిదండ్రులది కేరళ. అయితే, బాస్కెట్బాల్ కోసం వాళ్లు తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కెప్టెన్ స్థాయికి ఎదిగారు. క్రిష్ణ కూడా చిన్ననాటి నుంచే షాట్పుట్పై దృష్టి సారించింది.కఠినమైన శిక్షణ, ఆటను మరింత మెరుగుపరచుకోవడం కోసం విదేశాలకు వెళ్లింది. చాలాకాలం పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నగానే కనబడ్డాయి. తన సోదరి నిశ్చితార్థ సమయంలోనూ క్రిష్ణ ప్రాక్టీస్ కోసం విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా.. కెరీర్ కోసం ఇలాంటి త్యాగాలు తప్పవని మొండిగా ముందుకు సాగింది. 23 ఏళ్ల వయసులోనే సరికొత్త చరిత్ర సృష్టించి.. ఒలింపిక్స్ పతకం గెలవడమే లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగిస్తున్న క్రిష్ణ యువతకు ఆదర్శం. View this post on Instagram A post shared by RF Youth Sports (@rfyouthsports) -
ముస్లిం సంఘాలకు సీఎం హిమంత కృతజ్ఞతలు
డిస్పూర్: ఇస్లాం మత ఆచారం ప్రకారం బక్రీద్ రోజున ప్రత్యేక నమాజ్ అనంతరం జంతువులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వారం జరగనున్న బక్రీద్లో గోమాతను బలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు తీర్మానం చేశాయి. ఈ తీర్మానంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.అస్సాం అసెంబ్లీలో హిమంత మాట్లాడుతూ.. ‘ఈసారి అస్సాంలోని అనేక ముస్లిం సంఘాలు హిందువుల భావాలను గౌరవిస్తూ గోవు బలి చేయకూడదని నిర్ణయించాయి’ అని అన్నారు. హోజాయ్, ధుబ్రి, బోంగాయిగావ్, ఉదర్బోండ్ ప్రాంతాల్లోని ఇద్గాహ్, కబ్రిస్తాన్ కమిటీలు అధికారిక ప్రకటనలు జారీ చేసి, బక్రీద్ సందర్భంగా గోవు బలి చేయకూడదని విజ్ఞప్తి చేశాయి. ధుబ్రి టౌన్ ఇద్గాహ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో, బక్రీద్ రోజున గోవు బలి చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది.కమిటీలు పేర్కొన్నది ఏమిటంటే, ఇస్లాంలో గోవు బలి తప్పనిసరి కాదు. హలాల్ జంతువులలో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా బలిదానం చేయవచ్చని ఇస్లామిక్ న్యాయశాస్త్రం చెబుతోంది. అందువల్ల గోవు బలి చేయకపోవడం మతపరమైన ఆచారానికి విరుద్ధం కాదని వారు వివరించారు. హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ‘సామాజిక-మతపరమైన ఐక్యతను బలపరిచే గొప్ప అడుగు’గా అభివర్ణించారు. ఇంకా నిర్ణయం తీసుకోని సంఘాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. VIDEO | Guwahati: In state assembly session, Assam CM Himanta Biswa Sarma (@himantabiswa) says, “This time, many Muslims and several Muslim groups in Assam have decided that they will not use cows for sacrifice during Bakrid. Respecting the sentiments of Hindus, they have decided… pic.twitter.com/6eekzhroAR— Press Trust of India (@PTI_News) May 26, 2026 -
ఎన్నికల ముందు ‘చేప కూర’ ఫైట్.. ఇప్పుడు రూ.5కే ఫిష్ రైస్ పథకం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలను చేపలు తిననివ్వకుండా చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ముందు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్లో జరిగిన ఓ బహిరంగ సభలో మమత బెంగాల్ ఆహార సంస్కృతిపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. “బెంగాల్ ప్రజలు చేప-అన్నంతో జీవిస్తారు. బీజేపీ వాళ్లు బెంగాల్ ప్రజలను చేపలు తినొద్దు, మాంసం తినొద్దు, గుడ్లు తినొద్దు అంటున్నారు. మరి వాళ్లు ఏమి తింటారు?” అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయితే, అధికారంలోకి వచ్చినా అలాంటి చర్యలు తీసుకోబోమని బీజేపీ అప్పట్లోనే హామీ ఇచ్చింది. అనురాగ్ ఠాకూర్ సహా పలువురు బీజేపీ నేతలు బహిరంగంగా మాఛ్-భాత్ విందుల్లో పాల్గొన్నారు. బెంగాలీ సంస్కృతిపై తమకు అనుబంధం ఉందని చూపించే ప్రయత్నంలో నామినేషన్ ర్యాలీల్లో చేపలు చేతబట్టి కనిపించారు. ఇప్పుడు బీజేపీ చెప్పింది చెప్పినట్లు చేస్తోంది. ఇప్పుడు సీఎం ఏం చేశారు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. వాటిల్లో తక్కువ ధరలో చేప కూరతో భోజనం అందించే పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5కే ఫిష్ రైస్ మీల్స్ అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.అలాగే, అన్నపూర్ణ యోజన, మద్యం దుకాణాలపై నిబంధనలు, ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఆయన ప్రకటించారు. సువేందు అధికారి మాట్లాడుతూ.. మే 27 నుంచి అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.3,000 అందిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు.“అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాలు రాష్ట్ర సచివాలయం నుంచి అందిస్తాం. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు భారతీయులందరికీ అర్హత ఉంటుంది” అని కల్యాణి, నాడియా జిల్లాలో జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో చెప్పారు. ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి ఉంటుందన్న విషయం తెలిసిందే.మే 9న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సువేందు అధికారి వరుసగా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తూ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. -
‘ఎల్లమ్మ’ స్పెషల్ వీడియో.. దేవిశ్రీ సొంతూరులో జాతర చూశారా?
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే సినిమా టైటిల్తో పాటు హీరోగా దేవిశ్రీని పరిచయం చేస్తూ రిలీజ్ చేసి గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రత్యేక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ సొంతూరు వెదురుపాక, అక్కడ అమ్మవారి జాతర విశేషాలను పంచుకున్నాడు.తాను చెన్నైలో పెరిగినప్పటికీ.. నాన్నగారి సొంతూరు వెదురుపాక(తూర్పు గోదావరి జిల్లా) కు తరచూ వచ్చేవాడినని దేవి గుర్తు చేసుకున్నాడు. తమ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు వీడియో ద్వారా పంచుకున్నాడు. వెదురుపాక గ్రామ సంస్కృతి, అక్కడి జానపద కళల గురించి వివరిస్తూ.. ఆకారణంగానే తాను ‘ఎల్లమ్మ’ కథకి ఎస్ చెప్పానని ఆయన అన్నారు. ఈ వీడియోలో పల్లెటూరి వాతావరణాన్ని, పోలేరమ్మ, ఎల్లమ్మ జాతరను, శివసత్తుల పూనకాలు, సాంప్రదాయ పులి వేషాలు, డప్పు వాయిద్యాలను చూపించారు. అంతేకాదు ఊరి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. డ్యాన్స్ కూడా చేశాడు. -
ఆర్బీఎల్కు ఎమిరేట్స్ ఓపెన్ ఆఫర్
ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ సాధారణ వాటాదారులకు దుబాయ్ సంస్థ ఎమిరేట్స్ ఎన్బీడీ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా 26 శాతం వాటాకు సమానమైన దాదాపు 41.56 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 280 ధరలో చేపట్టిన ఆఫర్ జూన్ 12న ముగియనుంది.ఈ నెల మొదట్లో ఆర్బీఎల్లో 74 శాతం వాటా కొనుగోలుకి ఎమిరేట్స్ ఎన్బీడీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిపాదిత 3 బిలియన్ డాలర్ల(రూ. 26,850 కోట్లు) డీల్ దేశీ బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత భారీ పెట్టుబడికాగా.. బ్యాంక్ తదుపరి వృద్ధికి నిధులు ఉపయోగపడనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో ఆర్బీఐ సైతం ఇందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. -
భారీ మూల్యం : అష్టకష్టాల్లో జిమ్ ఓనర్ దీపక్
ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో జిమ్ ట్రైనర్ మహ్మద్ దీపక్ గుర్తున్నారా? ఓ వృద్ధ ముస్లిం వ్యాపారిని వేధింపుల నుండి కాపాడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపక్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు, అనేక ఇతర ప్రముఖులు, నేతలు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.. ఆ సంఘటన జరిగిన కేవలం నాలుగు నెలలకే సర్వస్వం కోల్పోయే స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగింది? మానవత్వం చాటుకున్నందుకే ..ఇలా ఆ ప్రశంసలు మాట ఎలా ఉన్నా,ప్రస్తుతం ఆయన భారీ అప్పుల్లో మునిగిపోవడమే కాకుండా, తన జిమ్ వ్యాపారాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మానవత్వాన్ని చాటుకున్నందుకు ఒకవైపు న్యాయపరమైన పోరాటం, మరోవైపు ఆర్థిక దివాలా అంచున ఉన్న కుమార్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన తర్వాత కుమార్ తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. జిమ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. గతంలో 150 మంది సభ్యులతో కళకళలాడే జిమ్కు, ఇప్పుడు రోజుకు కేవలం 15 మంది మాత్రమేపరిమితమైపోయింది. ఆర్థికంగా చితికిపోయాడు. మతపరమైన విభజన కారణంగా కుమార్ ఒంటరివాడయ్యారు. గత నాలుగు నెలలుగా జిమ్ అద్దె చెల్లించలేక, అటు ఇంటి లోన్ ఈఎంఐలు (EMIs) కూడా నానా కష్టాలు పడుతున్నారు.ఖాళీ చేయాలని నోటీసుప్రస్తుతం ఆర్థిక ఒత్తిడి తారస్థాయికి చేరిన వేళ, కుమార్ ఉంటున్న ఇంటి యజమాని ఆయనకు ఎగ్జిట్ (ఖాళీ చేయాలంటూ) నోటీసు ఇచ్చారు. అయితే ఇది కేవలం అద్దె బకాయిల కోసం ఇచ్చిన నోటీసు కాదని, ఆ వృద్ధ ముస్లిం వ్యాపారికి మద్దతుగా నిలిచినందుకు ప్రతికారంగానే తనను ఇల్లు ఖాళీ చేయిస్తున్నారని కుమార్ ఆరోపిస్తున్నారు. స్థానికంగా తనపై ఉన్న సామాజిక ముద్ర కారణంగానే వ్యాపారం చేసుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మతపరమైన అసహనానికి వ్యతిరేకంగా తాను తీసుకున్న నిర్ణయమే తన ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన వాపోతున్నారు.ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈకాగా ఈ ఏడాది జనవరి 26న కోట్ద్వార్లో 'కుమార్' అనే జిమ్ యజమాని, స్థానిక దుకాణదారుడైన వకీల్ అహ్మద్ను బజరంగ్ దళ్ సభ్యులు వేధించడాన్ని చూశారు. వకీల్ అహ్మద్ తన షాప్ పేరులో ఉన్న "బాబా" అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పదం కేవలం స్థానిక దేవుడికి మాత్రమే పరిమితమని వారు వాదించారు. అయితే ఈవివాదంలో కుమార్ జోక్యం చేసుకుని వృద్ధుడికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కుమార్ ధైర్యాన్ని, మత సామరస్య నిబద్ధతను అభినందించారు.ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..! -
న్యూజిలాండ్ను కుప్పకూల్చిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్కప్కు (జూన్ 12) ముందు ఇంగ్లండ్ మహిళల జట్టుకు మంచి బూస్టప్ లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. హోవ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను చేజిక్కించుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్దిని 19.1 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్.. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.ఇంగ్లండ్ బౌలర్లలో డేనియల్ గిబ్సన్, కెప్టెన్ ఛార్లెట్ డీన్ తలో 3, లిన్సే స్మిత్ 2, ఇస్సీ వాంగ్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసిన జెస్ కెర్ టాప్ స్కోరర్ కాగా.. ఇసబెల్లా గేజ్ (17), మ్యాడీ గ్రీన్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూజీ బేట్స్ (3), కెప్టెన్ అమేలియా కెర్ (5), బ్రూక్ హ్యాలిడే (2), నెన్సీ పటేల్ (2), బ్రీ ఇల్లింగ్ (3) సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. సోఫీ డివైన్, ఇజ్జీ షార్ప్ డకౌట్ అయ్యారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో సోఫీ డంక్లీ 22, హీథర్ నైట్ 18, అలైస్ క్యాప్సీ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. మియా బౌచియర్ (19 నాటౌట్), ఫ్రేయా కెంప్ (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్, నెన్సీ పటేల్, అమేలియా కెర్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి వన్డే ఇంగ్లండ్, మూడో వన్డే న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే డ్రాగా ముగిసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించింది. -
‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’
తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. Mega Dsc లో ‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’ అని విమర్శించారు. పేపర్ లీక్, డేటా డిలీట్, సూట్కేస్ రాజకీయాలతో పచ్చ నేతలు పండగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రం దోపిడీకి గురవుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు. ‘‘సూట్కేస్ మంత్రి” ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారు. నారా లోకేష్ను “సకల శాఖ మంత్రి”గా మార్చారు. ఐటీ శాఖను “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” నుంచి “ఇల్లీగల్ టెక్నాలజీ”గా మార్చారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? , స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?, 1999, 2014లో నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు. వారే పరీక్షలు నిర్వహిస్తారు.. వారే పేపర్ లీక్ చేస్తారు.. వారే డేటా డిలీట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి రహస్యంగా మెసేజ్లు పంపించారు. మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు?, డీఎస్సీని “పచ్చ తమ్ముళ్ల కలెక్షన్ కౌంటర్”గా మార్చారు. చంద్రబాబు, లోకేష్, అధికారులు ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు. మరోసారి నిరుద్యోగులను మోసం చేశారు.లోకేష్కు, వైఎస్ జగన్కు పోలికే లేదు. వైఎస్ జగన్ విద్యాశాఖను గొప్ప వ్యవస్థగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాల్లా తీర్చిదిద్దిందీ జగనే. లోకేష్ వచ్చాక డిజిటల్ క్లాస్రూమ్స్, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లను తొలగించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాసిరకం భోజనం, మురుగునీరు, డ్యామేజ్ షూలు, నాసిరకం బ్యాగులు ఇస్తున్నారు. నెల వచ్చిందంటే పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. డీఎస్సీ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును దిగజారుస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
'పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ అంటే..?
అది కీలకమైన మెదడు కణమైనా.... లేదా కాళ్లూ చేతుల్లో ఉండే మామూలు కణమైనా... అది ఏదైనా సరే... దేహంలోని ప్రతి జీవకణానికీఆహారం, ఆక్సిజన్ అందడం అవసరం. ఒకవేళ అలా అందకపోతే... కీలకమైన మెదడూ, గుండె లాంటి వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో... మనం అంత ప్రధానం అనుకోని మిగతా కణజాలానికీ అలాంటి ప్రమాదమే జరుగుతుంది. అంటే... కాళ్లూ, చేతుల విషయంలోనూ జరుగుతుంది. అలా కణజాలానికి తగినంత ఆక్సిజన్, ఆహారం అందనందువల్ల వచ్చే అనారోగ్యం... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’. ఈ సమస్య ఏమిటో, దానితో వాటిల్లో అనర్థాలేమిటో చూద్దాం...మన కాళ్లూ, చేతుల్లోని ప్రతి కణానికీ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడే అవి సమర్థంగా తమ విధులు నిర్వహించగలుగుతాయి. ఏదైనా కారణాల వల్ల మన కాళ్లూ, చేతులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటంగానీ లేదా వాటిల్లో కొవ్వు పేరుకోవడంగానీ జరిగితే... నిరంతరమూ కొనసాగాల్సిన రక్తసరఫరా సాఫీగా జరగకపోవచ్చు. అలా రక్తసరఫరా జరగనందువల్ల వచ్చే ఆరోగ్య సమస్యను ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ (ప్యాడ్) అంటారు. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఈ వ్యాధి స్త్రీలూ, పురుషులూ అనే తేడాలేకుండా అందరిలో కనిపించే అవకాశముంది. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ ఉన్నవారిలో కాళ్లలోని పిక్కలు, నడుం కింది భాగం (హిప్)లో తరచూ తీవ్రమైన నొప్పితో కూడిన తిమ్మిర్లు (క్రాంప్స్) వస్తాయి. చాలా సందర్భాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లక్షణం... అంటే పిక్కలు పట్టేయడం ఎక్కువగా కనిపింవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అంటే ఆ సమయంలో కాలూ, చేతిలోని సదరు భాగానికి తగినంత రక్తసరఫరా అందకపోవడం వల్లనే ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశాముంది. ఇలాంటప్పుడు ఆ భాగానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వగానే ఆ నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. కొందరిలో తాత్కాలికంగా స్పర్శ తెలియకుండా పోవడం (నంబ్నెస్) లేదా సూదులతో పొట్లుగా అనిపించడం (టింజ్లింగ్). మరికొందరిలో ఒక్కోసారి ఆ కాలు లేదా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపించవచ్చు. ఇంకొందరిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాలకింద మంటగా ఉన్నట్లుగా లేదా పాదాలు, కాలివేళ్ల కింది భాగంలో నొప్పిగానూ, మంటగానూ ఉన్నట్లు అనిపించడం. ఇక కొందరిలో పాదాలకు లేదా కాలి కింది భాగంలో ఏదైనా పుండు వంటిది వస్తే అది ఒక పట్టాన మానకపోచ్చు.పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ తర్వాతి దశలో కాలు/చేయి తాలూకు రంగు మారడం, అది చల్లబారినట్లుగా ఉండటం మామూలే. ఈ దశలో కొంతమందిలో కాలు /చేతి పైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపో ఇక రక్తసరఫరాకు పూర్తిగా ఆటంకం ఏర్పడి గ్యాంగ్రీన్లా పరిణమించిన కొందరిలో... కాలు / చేయి తొలగించాల్సిన (యాంప్యుటేషన్కు వెళ్లాల్సినంత) తీవ్రమైన పరిస్థితి కూడా రావచ్చు.గుండె జబ్బులకూ/ స్ట్రోక్కూ అవకాశం:పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే అది కేవలం కాలూ, చేతికే పరిమితం అవుతుందనేందుకు వీల్లేదు. అంటే... ఎవరిలోనైనా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే ఆ వ్యక్తిలో రక్తం సాఫీగా ప్రవహించేలాంటి తత్వం (టెండెన్సీ) లేదని అర్థం. ఇది కాళ్లూ, చేతుల్లోనే ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కీలకమైన అవయవాలైన గుండె లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అదెంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్నవారికి గుండెపో పక్షవాతం ముప్పుండే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిర్థారణ: ఫిజికల్గా బయటకు కనిపించే లక్షణాలతోపాటు... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ను నిర్ధారణ చేయడానికి ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ (ఏబీఐ) అనే పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ఎంతమాత్రమూ నొప్పి ఉండదు. ఈ పరీక్షలో అల్ట్రా సౌండ్ తరంగాల సహాయంతో భుజాలు / పాదాలు ఉండాల్సిన రక్తపోటునుకొలుస్తారు. ఈ ఏబీఐ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలనూ, వ్యాధి ఉందని అనుమానిస్తున్న వ్యక్తిలోని రిస్క్ ఫ్యాక్టర్లనూ సరిపోల్చి చూస్తారు. ఈ పరిశీలన తర్వాత... వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని ఫిజీషియన్ నిర్ణయిస్తారు. ఏబీఐ టెస్ట్లో... మొదట భుజం లేదా చేతిలోని రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)ను... మామూలు బీపీ యంత్రంలో కొలవడంతోపాటు, డాప్లర్ అని పిలిచే ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ స్టెతస్కోపు సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ వ్యాధినిర్థారణ కోసం శరీరంపై గాటు పెట్టకుండా కూడా నిర్ధారణ చేసే (నాన్ ఇన్వేజివ్) పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమేజింగ్ టెక్నిక్స్ సహాయంతో ఈ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు... మాగ్నెటిక్ రిజోనెన్స్ యాంజియోగ్రఫీ (ఎమ్మార్ఏ), సీటీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ వంటి పరీక్షలు ఈ వ్యాధినిర్ధారణకు తోడ్పడతాయి.ఈ వ్యాధి ఎవరెవరిలోనంటే.. వయసు యాభై ఏళ్లు పైబడ్డ ఏ వ్యక్తిలోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పెరిగే వయసు(ఏజింగ్)తోపాటు మరికొన్ని అంశాలూ ఈ వ్యాధికి కారణమవుతుంటాయి. అవి... పొగతాగే అలవాటు ఉండటం ∙వ్యాయామం చేయకపోవడం స్థూలకాయం ∙డయాబెటిస్ ∙నియంత్రణలో లేని రక్తపోటు / రక్తపోటు పెరగడం రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండటం ఈ లక్షణాలతో పాటు కుటుంబ సభ్యుల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉండటం అనేది ఆ ముప్పును మరింత పెంచే అంశం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకూ ‘ప్యాడ్’ రిస్క్ ఉందనే అంశాన్ని గుర్తెరిగి... దగ్గరి కుటుంబ సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కారణాలు...పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది... రక్తనాళాల్లోపల రక్తం ప్రవహించే పైప్ లోపలి పొర గట్టిబారడం. ఈ కండిషన్ను అథెరోస్కీఫ్లోరోసిస్ అంటారు. నునుపుగా ఉండే తలం మీద ద్రవం ఎలాంటి అంతరాయమూ లేకుండా సాఫీగా జారిపోతుంటుంది. ఒకవేళ ఆ తలం గరుగ్గానూ, గట్టిబారినట్లుగా మారడం వల్ల రక్తసరఫరా సాఫీగా జరగదు. దాంతో రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలా రక్తనాళంలోని లోపలి తలం గరుగ్గా, గట్టిబారినట్లుగా మారడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి రక్తప్రవాహం సాఫీగా వెళ్లే ఆ పైప్లోపలి తలంపై అంటుకుని అక్కడ గారలా ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి అంతరాయాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. దాంతో ఒకచోట క్రమంగా రక్తానికి ఏదైనా తట్టుకుంటూ తట్టుకుంటూ ఉండటం వల్ల క్రమంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లుగా ఓ ఉండలాగా (క్లాట్స్) ఏర్పడవచ్చు. ఇది ఒక్కోసారి రక్తనాళాన్ని బ్లాక్ చేసి రక్తసరఫరాను అపేయవచ్చు.చికిత్సపెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు చికిత్స చేసే ముందర బాధితుల ఫిట్నెస్, వ్యాధి తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కేవలం బాధితుడి జీవనశైలిలో మార్పులు చేయడంతోనే వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశముంది.ఉదాహరణకు బాధితుడికి పొగతాగే అలవాటు ఉంటే, పూర్తిగా మానేయడం ద్వారా మున్ముందు కాలూ / చేయి కోల్పోయే పరిస్థితి తప్పిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులతో పాటు, వ్యాధి మరింత ముదరకుండా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు మూసుకుపోయిన చోట వాటిని తెరచేందుకు అవసరమైన చికిత్స ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.వాడాల్సిన మందులురక్తనాళాలు మూసుకుపోవడం అన్నది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల జరుగుతుంటే దేహంలో కొలెస్ట్రాల్ మోతాదులను నియంత్రించడానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో కాలు /చేయి తిమ్మిర్లు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా మందులు వాడాల్సి రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ (క్లాట్)ను కరిగించే మందులూ ఉపయోగించాల్సి రావచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు బాధితులకు రక్తపోటును నియంత్రించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.ఒకవేళ జీవనశైలి మార్పులూ... మందులూ సరిపోకపోతే?కొందరిలో కేవలం జీవనశైలి మార్పులతోనూ లేదా మందులు వాడటం వల్ల గాని ఈ జబ్బు అదుపులోకి రాకపోతే అప్పుడు కూడా రక్తనాళాల్లో రక్తసరఫరాను సాఫీగా జరిగేలా చూడటానికి అనేక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... ఎక్కడైతే రక్తసరఫరాకు అడ్డంకి ఏర్పడి... తట్టుకుంటూ రక్తసరఫరా జరుగుతుంటుందో ఆ ప్రాంతాన్ని అక్కడికక్కడే తెరచి సాధారణ రక్తసరఫరాను పునరుద్ధరించవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియను గతంలోలా సంప్రదాయిక సర్జరీ రూపంలోగాక ఎలాంటి గాటూ లేకుండానే కొన్ని ప్రక్రియల ద్వారా చేయడమిప్పుడు సాధ్యమవుతుంది.గాటు పెట్టకుండా రక్తప్రవాహాన్ని సరిచేయడం ఇలా...రక్తప్రవాహానికి అడ్డుపడ్డ క్లాట్ను తొలగించి, రక్తసరఫరాను పునరుద్ధరించడానికి ఈ కింది పద్ధతులను అవలంబిస్తారు. యాంజియోప్లాస్టీ : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు చేసినట్లుగానే కాళ్లూ/ చేతుల తాలూకు రక్తనాళంలోనూ... అడ్డు పడ్డ ప్రాంతానికి ఒక బెలూన్ లాంటి దాన్ని పంపి... ఆ బెలూన్ను రక్తం ఆగిన చోట ఉబ్బేలా చేస్తారు. దాంతో రక్తనాళంలోని ఆ ప్రదేశంలో అడ్డు తొలగిపోయి, రక్తసరఫరా మామూలుగా అవుతుంది.అథెరెక్టమీ: ఈ ప్రక్రియలో రక్తనాళం (ధమని)లోకి ఒక క్యాథెటర్ను పంపుతారు. రక్తనాళంలోకి వెళ్లే ఒక నునుపైన పైప్ లాంటి దాన్ని క్యాథెటర్ అంటారు. దీని ద్వారా రక్తనాళం లోపలి ఉన్న గారను తొలగిస్తారు. గట్టిగా మారి ఉన్న ప్రాంతాన్ని నున్నగా అయ్యేలా చేయడం, లేదా షేవ్ చేసినట్లుగా నునుపుగా మార్చడం జరుగుతుంది.స్టెంట్ వేయడం: గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళం సన్నబడ్డప్పుడు ఆ సన్నటి ప్రాంతాన్ని మళ్లీ మామూలుగానే తెరుచుకుని ఉంచేలా చేస్తారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి పైప్ లాంటి దాన్ని వేసి తెరచి ఉండేలా చేసినట్లే (స్టెంట్ వేసినట్లే)... అచ్చం అదే తరహాలో కాలు / చేతిలోని రక్తనాళాల్లోని మూసుకుపోయి ఉన్నభాగానికి ఒక స్టెంట్ వేస్తారు. దాంతో మూసుకుపోయిన భాగం తెరచుకుంటుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం లేకుండా రక్తసరఫరా సాఫీగా జరిగిపోతుంది. స్టెంట్ గ్రాఫ్ట్స్: కొన్ని సందర్భాల్లో ఈ స్టెంట్లలో సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటిదాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కేవలం ఇలాంటి మార్గాలే కాకుండా కొన్నిసార్లు సాంప్రదాయికంగా చేసే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళంలో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తనాళం అంతా మూసుకుపోతే బైపాస్ కూడా చేయాల్సి రావచ్చు. వ్యాయామం లేకుండా ఉండటం వంటి బద్ధకంగా ఉండే జీవనశైలి, పొగతాగడం వంటి దురలవాట్ల కంటే మన దేహంలోని అవయవాలు విలువైనవి కాబట్టి... అలాంటి దురలవాట్లను వదులుకొని, చురుకైన జీవితం గడపడం అవసరం. దాంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగించవచ్చు.డాక్టర్ రాజా వి కొప్పాల సీనియర్ ఇంటర్వెన్షనల్ , రేడియాలజిస్ట్నిర్వహణ: యాసీన్చదవండి: అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..! నో ఐస్ బాత్, నో క్రేజీ డిటాక్స్.. -
IPL 2026 Qualifier 1: అదే జరిగితే.. ఫైనల్కు ఆర్సీబీ?
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరింది. మంగళవారం ధర్మశాల వేదికగా జరగనున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తుది పోరుకు అర్హత సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో ధర్మశాలలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.మ్యాచ్ రద్దు అయితే?ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్లకు ఎలాంటి 'రిజర్వ్ డే' లేదు. లీగ్ దశ మ్యాచ్లలో వర్షం కారణంగా అంతరాయం కలిగితే మ్యాచ్ ఫలితం తేల్చేందుకు అదనంగా కేవలం ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది.కానీ ప్లేఆఫ్స్ మ్యాచ్ విషయంలో మాత్రం అదనంగా రెండు గంటల సమయం కేటాయిస్తారు. కనీసం సూపర్ ఓవర్లో అయినా ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు.అప్పటికి కూడా ఆట వీలుకాకపోతే మ్యాచ్ను అంపైర్లు రద్దు చేస్తారు. అదే జరిగితే లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్నందున ఆర్సీబీ నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.అప్పుడు గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. కాగా లీగ్ దశ ముగిసేసరికి రెండు జట్లు చెరో 14 మ్యాచ్లు ఆడి, 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించడంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది.చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
ఆహారమే ఔషధం!
‘ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణమైన ఆహారం’ ఉత్పత్తి అయ్యేలా చూడాలన్న నిర్ణయానికొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘ప్రజలు తినే ఆహారం ΄పౌష్టిక విలువలతో కూడిన ఔషధం’గా ఉండేలే గాని, వారిని అనారోగ్యం పాలు చేసే విధంగా ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం ‘సేహత్’ (సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్– ఎస్ఈహెచ్ఏటీ) పేరిట ప్రత్యేక మిషన్ ప్రారంభమైంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లు ‘సేహత్ మిషన్’ను సంయుక్తంగా అమలు చెయ్యనున్నాయి. వ్యవసాయం, పౌష్టికత, ప్రజల ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించటానికి సేహత్ మిషన్ దోహదపడుతుంది. దేశం పోషకాహార లోపం, పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సేహత్ మిషన్ ప్రారంభమైంది. సమీకృత సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు, తోటలు, కోళ్లు, పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈసరైన ఆహారపు అలవాట్లు, పంటల ఎంపిక, ఆరోగ్యదాయకమైన పశు పోషణకు సరైన శాస్త్రీయ పద్ధతులను వర్తింపజేస్తుంది. తద్వారా అనారోగ్యాలను నివారించడంలో, వ్యాధుల నిర్వహణకు తోడ్పడటంలో, తద్వారా ఔషధంగా పనిచేయడంలో ఆహారం ΄పోషించే పాత్రను ఈ మిషన్ నొక్కి చెబుతుంది. ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..! -
బక్రీద్పై కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్లకు సెలవా?
భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లైన.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు 2026 మే 28, గురువారం రోజున బక్రీద్ పండుగ సందర్భంగా మూతపడనున్నాయి. కాబట్టి.. స్టాక్ మార్కెట్లలో అన్ని ప్రధాన ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఎన్ఎస్ఈ విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ రోజు ఈక్విటీ ట్రేడింగ్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి విభాగాలలో ట్రేడింగ్ ఉండే అవకాశం లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఆ రోజున షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు చేయలేరు.అయితే.. ఈసారి బక్రీద్ సెలవు మే 27న ఉంటుందా?, లేదా మే 28న ఉంటుందా? అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాలు, సంస్థలు మొదట మే 27ను పరిగణించినప్పటికీ.. ఎక్కువ శాతం ఆర్థిక సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు మే 28నే అధికారిక సెలవు రోజుగా ప్రకటించాయి. దీంతో పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ప్రణాళికలను దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.అదేవిధంగా.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా మే 28 ఉదయం సెషన్ మూతపడనుంది. అయితే.. సాయంత్రం సెషన్లో కమోడిటీ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే.. బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ వంటి వస్తువుల ట్రేడింగ్ సాయంత్రం తర్వాత కొనసాగుతుందన్నమాట.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక! -
లొంగిపోయిన మావోయిస్టు నేత నరహరికి రూ.25 లక్షలు అందజేత
హైదరాబాద్: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, అతని భార్య ధనమ్మ మే 12న పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. వారిని ఇవాళ (మంగళవారం) మీడియా ముందు ప్రవేశపెట్టారు. నరహరికి రూ.25 లక్షలు, ధనమ్మకు రూ.20 లక్షల చెక్ అందజేశారు డీజీపీ సీవీ ఆనంద్. ఇక సెంట్రల్ కమిటీలో మిగిలింది ఇద్దరేనని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 45 మంది మావోయిస్టులు మాత్రమే అండర్గ్రౌండ్లో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారు కూడా లొంగిపోవాలని నరహరి పిలుపునిచ్చారు. దాదాపు 45 ఏళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ కీలక పాత్ర పోషించారు.మావోయిస్టు సెంట్రల్ కమిటీ మొత్తంగా తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇప్పటికే పలువురు నేతలు ఎన్కౌంటర్లో మృత్యువాత పడగా మెజారిటీ నాయకులు లొంగిపోయారు. నరహరి లొంగుబాటుతో ఇక యాక్టివ్గా ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత వార్త శేఖర్ను మాత్రమే కీలకంగా భావించవచ్చు. -
రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య..
కొన్ని కథలు డేరింగ్ నిర్ణయాలు ఎలా తెసుకోవాలో తెలియజేస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి రిస్క్ తీసుకోవడానికి చాలా కంగారుపడిపోతాం. కానీ మనలాంటి వారెందరో అదే బాటలో పయనించి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కథలు వింటే ధైర్యంగా అడుగు వేసే ప్రయత్నం చేయడమే కాదు..ఏనాటికైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంతో తనతో ఎలా ప్రవర్తించిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అశ్వనీ కుమార్ అనే పారిశ్రామిక వేత్త 40 ఏళ్ల వయసులో ఏకంగా రూ. 300 కోట్ల కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేసున్నాడు. అధికజీతం, విదేశీ పర్యటను, ఏసీ క్యాబిన్లతో బిందాస్గా సాగిపోతోంది లైఫ్. ఏ చీకు చింత లేదు అయినా సరే మనోడు మానసిక ప్రశాంతతే ప్రధానం అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తత్ క్షణమే తన తల్లి తనతో మాట్లాడటే మానేసిందని, భార్య తనకు పిచ్చి పట్టిందేమో అన్నట్లుగా చూసిన చూపుని ఇప్పటికీ మర్చిపోలేనంటున్నాడు. ఆయన సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికాడు. అనుకున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడిగా మారి విజయవంతంగా సొంతంగా బ్రాండ్ని నిర్మించే రేంజ్కు చేరుకున్నాడు. సొంతంగా వ్యాపారం లేదా ఇంకేదైనా ప్రారంభించాలనుకునేవారికి తన కథ స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నా అంటూ తన వ్యక్తిగత సాహసోపేతమైన జర్నీ గురించి వివరించాడు. నెటిజన్లు ఇది నిజంగా ప్రేరణకు పరాకాష్ట అని కొందరు, మరికొంతమంది మీ కథ అసలైన స్ఫూర్తి అంటూ అశ్విని కుమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashwani kumar (@thedhandhaguru) (చదవండి: వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..) -
IPL 2027: సీఎస్కేలోకి ఊహించని ఆటగాడు!
ఐపీఎల్లో గత రెండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్ 2025లో అత్యంత దారుణ ప్రదర్శనతో కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో 2026 వేలానికి ముందు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసిన చెన్నై.. అతడికి బదులు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. చెన్నై తరఫున ఆరంభంలో విఫలమయ్యాడు.సంజూ ధనాధన్అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని రెండు శతకాల సాయంతో 14 మ్యాచ్లలో కలిపి 477 పరుగులు సాధించాడు సంజూ. తద్వారా సీఎస్కే తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కానీ.. జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంతో ముగించింది.భారీ మార్పులకు ఆస్కారంఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగానూ అతడు విఫలం కావడంతో వేటు వేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా జట్టులో భారీ మార్పులకు ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీఎస్కేలోకి వస్తాడనే అర్థంలో పోస్టు పెట్టాడు.కాగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట నాలుగే గెలిచి తొమ్మిదో స్థానంలో ముగించింది. ఇక నాలుగు మ్యాచ్లకు హార్దిక్ దూరం కాగా.. యాజమాన్యంతో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.07:07 కథేంటి?ఈ నేపథ్యంలో ఇటీవల హార్దిక్ ఇన్స్టాలో ఓ స్టోరీ షేర్ చేశాడు. ఇందులో.. ‘07:07’ అని తన ఫోన్లో టైమ్ చూపిస్తున్న ఫొటో పంచుకున్నాడు. దీంతో చెన్నై లెజెండ్ ధోని (జెర్సీ నంబర్)ని ఉద్దేశించే ఈ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది.అశూ ఏమన్నాడు?ఈ క్రమంలో ఓ నెటిజన్.. వచ్చే సీజన్లో చెన్నై జట్టులో మార్పుల గురించి అశూని అడుగగా.. ‘‘పతిరణ, 07:07, స్టోక్స్, దూబే, 07:07 మిడిలార్డర్/ఫినిషింగ్, ఓవర్టన్, స్టోక్స్ బ్యాలెన్స్’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో హార్దిక్ గురించే అశూ చెప్పాడనే చర్చ నడుస్తోంది. కాగా పతిరణను గతేడాది సీఎస్కే రిలీజ్ చేయగా.. కోల్కతా కొనుక్కుంది. కానీ గాయం వల్ల అతడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దీంతో కోల్కతా అతడిని రిలీజ్ చేయనుందనే వార్తలు రాగా.. పతిరణ తిరిగి మళ్లీ సీఎస్కేలోకే వస్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెరో ఐదుసార్లు ముంబై, చెన్నై చాంపియన్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అలాంటిది ఊహించని రీతిలో హార్దిక్ ముంబైని వీడి ఐపీఎల్-2027 సందర్భంగా చెన్నైలో చేరతాడనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.Pathirana, 07:07 & Stokes !Opening✅Dube & 07:07 MiddleOrder/Finishing✅Overton & Stokes Balance✅ https://t.co/kSALlKQDCp— Ashwin 🇮🇳 (@ashwinravi99) May 26, 2026 -
షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..!
దక్షిణ కరోలినాలో ఊహించని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరస్సు ఒడ్డున ఉన్న ఒక రెస్టారెంట్ ఆరుబయటి ప్రాంగణంలో తన భర్తతో కలిసి భోజనం చేస్తున్న ఒక మహిళ అనూహ్యంగాప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న ఆమె జీవితం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. మృత్యువు ఎపుడు? ఎలా? ముంచుకొస్తుందో తెలియదు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. బాధితురాలు హ్యూగర్కు చెందిన 56 ఏళ్ల డానా వీంగర్. ఈమె తన భర్తతో కలిసి 'లేక్ మేరియన్' (Lake Marion) వద్ద ఉన్న డ్రిఫ్ట్వుడ్ గ్రిల్ (Driftwood Grill) రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా, అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా బలమైన గాలులు తీవ్రమవ్వడంతో, ఆ గాలుల తాకిడికి ఆరుబయటి ప్రాంగణంలోని ఒక బరువైన ప్యాటియో గొడుగు (Patio Umbrella) ఊడిపోయి బాధితురాలిని బలంగా తాకింది. అత్యవసర సహాయక బృందాలు చేరుకునే సమయానికే ఆమె ప్రాణాలు విడిచింది.క్లారెండన్ కౌంటీ కరోనర్ జాక్వెలిన్ బ్లాక్వెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గొడుగు డైనా తల, మెడ భాగంలో బలంగా తాకడంతో తీవ్రమైన గాయమైంది. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాండర్స్ (EMS) ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. క్లారెండన్ గొడుగు బలంగా తగలడం వల్ల ఆమె మెడలోని ప్రధాన రక్తనాళం (Carotid Artery) తెగిపోవడంతోనే మరణం సంభవించినట్టు అంచనా వేశారు.తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అవుట్డోర్ ఫర్నిచర్ భద్రతా ప్రమాణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి బుధవారం (మే 27) పోస్టుమార్టం నిర్వహించనున్నారు.రెస్టారెంట్ స్పందనఈ ఊహించని ప్రమాదంపై 'డ్రిఫ్ట్వుడ్ గ్రిల్' రెస్టారెంట్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేసింది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల జరిగిన ఈ ఘోర ప్రమాదం తమను ఎంతగానో కలచివేసిందంటూ బాధితకుటుంబానికి సానుభూతి ప్రకటించింది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమర్జెన్సీ సిబ్బందికి, స్థానికులకు ధన్యవాదాలు తెలిపింది. ఇదీ చదవండి: 3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 479.26 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 76,009.70 వద్ద, నిఫ్టీ 118.00 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 23,913.70 వద్ద నిలిచాయి.ఇండో రామా సింథటిక్స్ (ఇండియా) లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఆగ్రో ఫోస్ ఇండియా లిమిటెడ్, ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్నో ఎలక్ట్రిక్ & ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్, డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్, అజ్మేరా రియల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసిన హీరో.. వీడియో వైరల్
మంచు మనోజ్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నాడు. నిర్వాహకుల అభ్యర్థన మేరకు రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమానికి కావాల్సిన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా అందజేశారు. అంతేకాదు అక్కడున్నవారందరికీ కొత్త దుస్తులను కూడా పంపిణీ చేశాడు. అలాగే ఓ మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు మనోజ్. సెలెబ్రెటీని అనే ఫీలింగ్ లేకుండా సామాన్య వ్యక్తిగా వెళ్లి.. అతనికి కటింగ్ చేశాడు. ఈ సందర్భంగా అతని పేరు కూడా అడిగి తెలుసుకున్నాడు. అతనికి పేరు తప్ప ఇంకేమి గుర్తు లేదని నిర్వాహకులు చెప్పడంతో.. ‘పేరు చాలా బాగుంది’ అంటూ కటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కాగా, మనోజ్ ఇప్పటికే ఈ మధ్యే తన సతీమణితో కలసి ఐక్య అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానంతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సొంత డబ్బుతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నట్లు ప్రకటించారు. Manchu Manoj Emotional Service 😍 | Helping Orphans on Roadside Viral Video#ManchuManoj #TeluguNews #ViralVideo #Humanity #HelpingHands #SocialService #HeartTouching #InspiringStory #GoodDeeds #Orphans #TeluguCinema #BRKNews pic.twitter.com/W9vzabUkzb— BRKNews (@BRKTelugu_1) May 26, 2026 -
ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు
పాకిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గైర్హజరీలో స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్కు జట్టు పగ్గాలను ఆసీస్ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే ఇప్పుడు వర్క్లోడ్ మేనెజ్మెంట్లో భాగంగా మార్ష్కు కూడా విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ పర్యటనలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ బదులుగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ నడిపించనున్నట్లు సమాచారం. ఇంగ్లిష్కు జాతీయ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇంగ్లిష్ తొలిసారిగా 2024లో పాకిస్తాన్తో జరిగిన వైట్-బాల్ సిరీస్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ చేశాడు. రెగ్యులర్ కెప్టెన్లు పాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్లకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లిష్ను ఆస్ట్రేలియా సెలక్టర్లు పరిగణిస్తున్నారు. అతడు భవిష్యత్తులో ఆస్ట్రేలియాకు రెగ్యులర్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఇంగ్లిష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అద్భుతంగా రాణించాడు. వ్యక్తిగత కారణాలతో తొలి హాఫ్ సీజన్కు దూరమైన ఇంగ్లిష్.. సెకెండ్ హాఫ్లో మాత్రం దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును పాక్ గడ్డపై కొనసాగించేందుకు జోష్ సిద్దమయ్యాడు. ఇక పాక్-ఆసీస్ వన్డే సిరీస్ మే 30 నుంచి ప్రారంభం కానుంది.పాక్తో మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపాచదవండి: ఆకలి, కసి: శ్రేయస్ అయ్యర్ పోస్ట్ వైరల్! -
వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్న జంటలు కోకొల్లలు. తీవ్రంగా పరిగణించాల్సిన సమస్యలేవి లేకపోయినా..విడాకులు కోరుతుండటం బాధకరం. ఇక్కడ ఈ కేసులో కూడా అలాంటి వింతే చోటు చేసుకుంది. కేవలం భార్యకు వంట రాదని విడాకులు ఇవ్వమంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు భర్త. అతడికి ధర్మాసనం దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి చివాట్లు పెట్టింది. అసలేం జరిగిందంటే..ఈ జంటలకు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వివాదాలు మొదలయ్యాయి. అదే సంవత్సంరలో అతడు "మానసిక క్రూరత్వం" అనే కారణంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు వంట చేయడం రాదని, ఆమె మొరటుగా, మాట వినకుండా ఉంటుందని, ఇంటి పనులను సరిగ్గా చేయలేదని, దీనివల్ల తనకు మానసిక ఒత్తిడి కలిగిందని ఆరోపణలు చేశాడు. పైగా వైవాహిక చట్టం ప్రకారం ఈ చర్యలు క్రూరత్వం కిందకు వస్తాయని కూడా అతను వాదించాడు.అయితే భార్య ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. వాస్తవానికి, పాత్రలు కడగడం, శుభ్రం చేయడం, వంట చేయడం వంటి అన్ని ఇంటి పనులను తనతోనే చేయించారని, మిగిలిపోయిన ఆహారాన్ని కూడా తినమని బలవంతం చేశారని ఆమె పేర్కొంది.ధర్మాసనం ఏం చెప్పిందంటే..జస్టిస్ భారతి డాంగ్రే మరియు జస్టిస్ మంజుషా దేశ్పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాహం అనేది సమానుల భాగస్వామ్యం, అంతేగాని సేవా ఒప్పందం కాదు. భార్యను పనిమనిషిగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. వంట చేయడం లేదా శుభ్రపరచడం వంటి పనులు చేయడంలో విఫలమైనంత మాత్రాన అది మానసిక క్రూరత్వంగా పరగణించలేమని పేర్కొంది. వివాహం జరిగిన తొలినాళ్లలో జరిగిన అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసుకునే ధోరణిలో చూడాలి తప్ప క్రూరత్వ ఆరోపణల కిందకు రాదంటూ మండిపడింది. పైగా ఫ్యామిలీ కోర్టు 2010లో భార్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతుల కోసం ఇచ్చిన ప్రకటన ఆధారంగా స్వతంత్రంగా సంపాదించుకోగలదని నిర్థారించి, ఆమెకు భరణం నిరాకరిస్తూ.. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సవాలు చేస్తూ భార్య ముంబై హైకోర్టుని ఆశ్రియంచింది. ఆ నేపథ్యంలోనే ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు తీర్పుని కొట్టివేస్తూ..చిన్న తరహా కార్యకలాపాలను ఆదాయానికి రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాగే విడాకుల కేసులలో చట్టపరంగా మానసిక క్రూరత్వం అంటే ఏమిటో కూడా ధర్మాసనం వివరించింది. క్రూరత్వంలో అవమానం, భావోద్వేగ బాధ కలిగించే లేదా వివాహాన్ని కొనసాగించడం అసాధ్యం చేసే తీవ్రమైన ప్రవర్తన ఉండాలని పేర్కొంటూ విడాకులను రద్దు చేసింది. అలాగే భర్తను నెలకు రూ. 20,000 చెల్లించాలని అదేశించింది. (చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ) -
రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈ
ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ (Vedant Srivastava), తన రీ-వాల్యూయేషన్ ఫిజిక్స్ జవాబు పత్రం వేరే వారిది వచ్చిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దీనిని సరిదిద్దే చర్యలు చేపట్టింది.రీ-వాల్యూయేషన్ కోసం వేదాంత్ అప్లై చేయగా, బోర్డు తనకు పంపిన ఆన్సర్ షీట్ తనది కాదని, అది వేరే విద్యార్థి జవాబు పత్రమని అతను ఎక్స్ ద్వారా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ విషయాన్ని వివరిస్తూ అతడు ఎక్స్లో పెట్టిన పోస్ట్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.I am a CBSE Class 12 student.After receiving unexpectedly low marks in Physics, we applied for photocopies of my answer sheets through the CBSE reevaluation process.Today we received the copies.And I am shattered because the Physics answer sheet uploaded by CBSE is not mine— VEDANT (@VEDANTSHRIV17) May 23, 2026తప్పు ఒప్పుకున్న సిబిఎస్ఇ (CBSE)దీంతో సిబిఎస్ఇ అధికారికంగా రంగంలోకి దిగింది. తమ కొత్త ఆన్లైన్ స్క్రిప్ట్ మానిటరింగ్ (OSM) వ్యవస్థలో సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి గందరగోళం జరిగిందని బోర్డు అంగీకరించింది. వేదాంత్ కేసే కాకుండా, మరికొన్ని కేసుల్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు ఇలాగే పరస్పరం మారిపోయాయని బోర్డు స్పష్టం చేసింది. బాధిత విద్యార్థులందరి మార్కులను సరిదిద్దే ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోందని సీబీఎస్ఈ తెలిపింది. సీబీఎస్ఈ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) స్వయంగా వేదాంత్కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఆ లేఖతో పాటు వేదాంత్ రాసిన అసలైన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ను బోర్డు జత చేసింది.ఈ కొత్త మార్కుల ఆధారంగా , వెబ్సైట్లో త్వరలోనే అప్డేట్ చేస్తామని వివరణం ఇచ్చింది. ఇదిలా ఉండగా, మరో 12వ తరగతి విద్యార్థిని సంజన కూడా, పునఃమూల్యాంకన ప్రక్రియలో అప్లోడ్ చేసిన కెమిస్ట్రీ జవాబు పత్రం తన చేతిరాతతో సరిపోలలేదని సోషల్ మీడియాలో ఆరోపించింది. తన వ్యక్తిగత వివరాలు ఉన్న మొదటి పేజీ తనదిగా కనిపించినప్పటికీ, లోపలి పేజీలు తన చేతిరాత శైలిని పోలి లేవని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలు, సీబీఎస్ఈ ఓఎస్ఎం (OSM) వ్యవస్థ అమలుపైనా, మూల్యాంకనం సమయంలో ఉపయోగించే డిజిటల్ స్కానింగ్, ట్యాగింగ్ ప్రక్రియల కచ్చితత్వంపైనా ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: 66 హార్డ్ డిస్క్లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్లో డైరెక్టర్లు -
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా దంపతులు శుభవార్త చెప్పేశారు. తమకు మంగళవారం కవల మగబిడ్డలు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మేము ఆనందాన్ని కోరుకున్నాం. దేవుడు 'డబుల్గా తీసుకోండి' అన్నాడు. మా జీవితంలోకి కవల మగబిడ్డలు వచ్చారు' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)కొన్ని నెలల క్రితం దివ్యాంక తాను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచామని ఆమె చెప్పుకొచ్చింది. మాకు ఇప్పుడు బిడ్డ కావాలని అనిపించింది. ప్రయత్నించాం… దేవుడు ఆశీర్వదించాడు అని అప్పట్లో ఆమె చెప్పింది. ఇప్పుడు ఇద్దరబ్బాయిలకు తల్లయింది. 'యే హై మొహబ్బతేన్' సీరియల్ షూటింగ్ టైంలో దివ్యాంక, వివేక్ ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. 2016 జూలై 8న పెళ్లి చేసుకున్నారు. (ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్తో ఈమెకు సంబంధమేంటి?) View this post on Instagram A post shared by Vivek Dahiya (@vivekdahiya) -
ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్తో ఈమెకు సంబంధమేంటి?
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అని అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఒక్క సాంగ్తో తెలుగులో ఈమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఐదారేళ్ల పాటు తెలుగులో అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. అలాంటి ముమైత్ అసలేమైపోయింది? ఇప్పుడేం చేస్తోంది? ఈమెకు పాకిస్తాన్ ఉన్న సంబంధమేంటి?(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ముమైత్ ఖాన్ పుట్టి పెరిగిందంతా ముంబైలో. ఈమె అసలు పేరు ఇది కాదు ముంతాజ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని ముమైత్ అని మార్చుకుంది. 2001లో రిలీజైన తమిళ మూవీ 'మజ్ను'తో ఐటమ్ డ్యాన్సర్గా అరంగేట్రం చేసింది. తెలుగులో అయితే హరికృష్ణ హీరోగా నటించిన 'సామి'తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఛత్రపతి, యోగి, సామాన్యుడు, ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యధన, నేనింతే, మగధీర తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఓ హీరో మూవీ వస్తుందంటే ముమైత్ పాట కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లింది. అలా 2006-11 మధ్య కాలంలో ఏడాది ఐదారు సినిమాలు చేసింది.ఐటమ్ సాంగ్సే కాదు మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. అలాంటి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈమె సినిమాల్లో కనిపించడం మానేసింది. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడిన ముమైత్.. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు సినిమాలు మానేశానని అంతా అనుకున్నారు. కానీ నేనెప్పుడూ సినిమాలు మానలేదు, మానాలని అనుకోలేదు. యాక్సిడెంట్ జరిగింది. నా మెదడులో 5 నరాలు చిట్లాయి. ఈ ప్రమాదం తర్వాత కనీసం ఏడేళ్లు పని చేయకూడదని డాక్టర్లు చెప్పారు. చిన్న వస్తువు మోయడం కూడా చాలా కష్టంగా అనిపించేది.ఈ ప్రమాదం తర్వాత 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. దేవుడు నన్ను ముమైత్ ఖాన్గా మార్చాడు. ఆయనే దీనంతటికీ ఫుల్స్టాప్ పెట్టమని హింట్ ఇచ్చాడు. దాన్ని నేను అంగీకరించాను. ఏడేళ్ల పాటు నన్ను నేను తెలుసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించాను. ఈ సమయంలో నన్ను మా అమ్మే చూసుకుంది. నన్ను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. నా లైఫ్ స్టైల్ని మారకుండా చూసుకుంది. ఈ ఏడేళ్లలో నాకేం ఇష్టమనే విషయాలను బాగా తెలుసుకున్నా. నేను బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్కి, మేకప్ కిట్స్కి, స్టైయిలింగ్ టీమ్స్ని ముంబై నుంచి తెప్పించాల్సి వచ్చేది. వాటిని హైదరాబాద్లోనే ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచనతోనే వ్యాపారం మొదలెట్టా. ఇప్పుడు అదే నా కెరీర్గా ఎంచుకున్నానని గతంలో ముమైత్ చెప్పుకొచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికొస్తే ముమైత్ తల్లిది తమిళనాడు కాగా తండ్రిది పాకిస్తాన్. ముమైత్ పుట్టిన తర్వాత వీళ్ల కుటుంబం ముంబైకి వచ్చేసింది. 13 ఏళ్ల వయసు నుంచే పని చేయడం మొదలెట్టిన ముమైత్ ఖాన్, చిన్నతనంలో ఆకలి కష్టాలని కూడా అనుభవించింది. బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో పాల్గొంది కానీ డ్రగ్స్ కేసు వల్ల మధ్యలో బయటకొచ్చి మళ్లీ షోలోకి వెళ్లింది. కానీ 49వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు చేయడం తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) -
వైఎస్ జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
సాక్షి,తాడేపల్లి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి ముద్దాయిలు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి ఆవేదన చెందారు.ప్రెస్మీట్లో సుగాలి పార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:పవన్కళ్యాణ్ పచ్చి స్వార్థం:వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబుని నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావుని పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు. పవన్కళ్యాణ్ను కలిసినప్పుడు కూడా ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని అన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా?.నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్కళ్యాణ్కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు.పవన్కళ్యాణ్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి అత్యాచారం జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసు వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి. ముద్దాయిలను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.వీల్ ఛైర్ యాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదు?:నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్తో 2025 లో వీల్ ఛైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్ ఛైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న వైఎస్ జగన్గారు చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే దాకా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ద్రవ్యోల్బణం దాడి.. సామాన్యుడి జేబుకు అధిక ధరల మంటలు!
భారత్లో 2026 ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వినియోగదారుల ధరల సూచీ (CPI) ప్రకారం ఇది 3.48 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 3.4 శాతంగా ఉండగా, ఇప్పుడు స్వల్పంగా పెరిగింది.పైకి చూస్తే ఈ పెరుగుదల పెద్దగా ప్రమాదకరంగా కనిపించకపోయినా, అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం టోకు ధరల ద్రవ్యోల్బణం (Wholesale Inflation). మార్చిలో 3.88 శాతంగా ఉన్న హోల్సేల్ ఇన్ఫ్లేషన్, ఏప్రిల్లో 8.3 శాతానికి ఎగసిపడింది. ఇది గత 42 నెలల్లోనే అత్యధిక స్థాయి.ఈ గణాంకాలు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లో పెరుగుతున్న వ్యయభారం ఇంకా పూర్తిగా వినియోగదారులపై పడలేదని సూచిస్తున్నాయి. అంటే రాబోయే నెలల్లో సాధారణ ప్రజలపై ధరల భారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధన, విద్యుత్ ధరల పెరుగుదల. ఫ్యూయల్, పవర్ విభాగంలో ధరలు 24.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలియం, సహజ వాయువు ధరలు 67 శాతానికి పైగా ఎగిశాయి.ఇంధన వ్యయాల పూర్తి ప్రభావం ఇంకా వినియోగదారులకు చేరలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ భారం ఇక తప్పనిసరిగా ప్రజలపై పడే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలకు దాదాపు రూ.30 వేల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని సమాచారం.దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల వ్యాఖ్యానించారు. రిటైల్ ఇంధన ధరల్లో పెరుగుదల అంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి.కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ మార్చిలో 3.87 శాతంగా ఉండగా, ఏప్రిల్లో అది 4.2 శాతానికి చేరింది. వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవల ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత 19.2 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.850 నుంచి రూ.1000 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.ఆహార ఖర్చులు పైపైకి.. వలస కార్మికులు ఎక్కువగా ఉపయోగించే 5 కిలోల సిలిండర్ల ధరలు కూడా పలు ప్రాంతాల్లో రూ.200కు పైగా పెరిగాయి. ఇది నేరుగా ప్రజల ఆహార ఖర్చులను పెంచడమే కాకుండా వినియోగ డిమాండ్ను కూడా తగ్గించే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు, వివాహాలు, విదేశీ పర్యటనల వంటి ఖరీదైన ఖర్చులను తగ్గించాలని, బంగారం వంటి విలువైన లోహాల కొనుగోళ్లు నియంత్రించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.దీనికి కొనసాగింపుగా బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను పెంచింది. భారతీయులు ‘సేఫ్ ఇన్వెస్ట్మెంట్’గా భావించే బంగారం, వెండిపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. గత రెండున్నర నెలల్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ దాదాపు 8.5 శాతం పడిపోయింది.ఇది సాధారణ పరిస్థితి కాదు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూపాయి సగటున ఏడాదికి 2 నుంచి 3 శాతం మాత్రమే బలహీనపడింది. దీంతో ప్రస్తుత పరిస్థితి తీవ్రమైన నిర్మాణాత్మక ద్రవ్యోల్బణ ఒత్తిడిని సూచిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సీపీఐ (Consumer Price Index), డబ్ల్యూపీఐ (Wholesale Price Index) మధ్య భారీ అంతరం ఉండటం వల్ల ఉత్పత్తిదారులు పెరిగిన వ్యయాన్ని ఇంకా పూర్తిగా వినియోగదారులపై మోపలేదని అర్థమవుతోంది.కానీ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని అంచనా. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన 2 నుంచి 6 శాతం పరిమితిలో ఉంచేందుకు RBI వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ద్రవ్యోల్బణం తాత్కాలిక ధరల పెరుగుదల కాదని, ఇది వ్యవస్థాత్మక ఆర్థిక ఒత్తిడి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ప్రపంచంలో ఎన్ని రకాల కోకిలలు ఉన్నాయో తెలుసా?
వసంతకాలం వచ్చిందంటే లేతచివుళ్లు ఆరగించి "కుహూ.. కుహూ.. రాగాలతో మనల్ని ఆదరించే పక్షి కోకిల. దాని గాత్రం అంత మధురం కాబట్టే, గాన కోకిల అంటారు. ముఖ్యంగా వసంత కాలంలో మగ కోకిలలు పాడే రాగాలు ప్రకృతికి ప్రాణం పోస్తాయి. కోకిలలు తమ సొంత గూళ్ళను నిర్మించుకోవు. ఆడ కోకిలలు కాకులు లేదా ఇతర చిన్న పక్షుల గూళ్ళను కనిపెట్టి, వాటి గూటిలో తమ గుడ్లను పెడతాయి. వీటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చూద్దామా.ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి. వీటి ప్రధాన ఆహారం...గొంగళి పురుగులు. ఆకులు, పండ్లు కూడా తింటాయి కానీ, గొంగళి పురుగులను చాలా ఇష్టంగా తింటాయి! కాకికీ కోకిలకీ తేడా కనిపెట్టాలంటే వాటి ఈకలు చూడాలి. మగ కోకిల మెడ నుంచి తల వరకూ నలుపు కాకుండా నీలం, బూడిదరంగు కలిసినట్టుగా ఉంటుంది. కొన్ని ఆడవి కూడా ఇలానే ఉంటాయి కానీ... వాటికి ఛాతీమీద ఈకల రంగు ముదురుగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ఎరుపు, బ్రౌన్ కలర్స్లో కూడా ఉంటాయి. కాకపోతే... అత్యంత దగ్గర్నుంచి చూస్తే తప్ప ఈ తేడాలను మనం గమనించలేం! వీటి రెక్కలు పొడవుగా, సూదిగా ఉంటాయి. ముక్కు కూడా సూదిగా ఉంటుంది. ఎగిరినప్పుడు కాస్త గద్దల మాదిరిగా కనిపిస్తాయివి! వేసవికాలం కోకిలలకు సంతానోత్పత్తి కాలం. మగ కోకిల ప్రధానంగా ఆడ కోకిలను ఆకర్షించడానికి పాడుతుంది. దాని పాట ఆడ కోకిలలకు సంభోగ సంకేతంగా పనిచేస్తుంది. ఇవి గూళ్లు కట్టుకోవు. పిల్లల్ని పొదగవు. వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. పట్టుకు పది నుంచి 22 గుడ్లు పెడతాయి. అయితే అన్నీ ఒక గూటిలో పెట్టవు. వేర్వేరు చోట్ల పెడతాయి. ఆయా పక్షులన్నీ తమ గుడ్లతో పాటు తన గుడ్లను పొదుదుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉంటాయి. -
‘సింగిల్ రాజు’ కథ ఆసక్తికరంగా ఉంది: వేణు ఊడుగుల
విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’. ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక–నిర్మాత వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్, గ్లింప్స్ను విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలి’’ అని తెలిపారు. ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ–‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నలు కష్టపడ్డారు. ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్టైనర్గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘వర్మ, మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్న చిత్రమిది’’ అన్నారు విశ్వాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయితేజ కుందారపు, నితీష్. -
మైక్రోసాఫ్ట్ వర్సెస్ ఎంసీఏ
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మధ్య న్యాయ పోరాటం మరింత ముదిరింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సహా ఇతర అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లపై ఢిల్లీ-హరియాణా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) విధించిన జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ లింక్డ్ఇన్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించింది.మే 15, 2026న దాఖలైన ఈ అప్పీల్ను పరిశీలించిన ట్రైబ్యునల్ ఈ వివాదంపై తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్ఓసీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ (స్టే) మధ్యంతర ఉపశమనం కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీల (ఎంఎన్సీ) భవిష్యత్తుపై దీని ప్రభావం ఉండనుండటంతో లీగల్ సర్కిల్స్లో ఈ కేసు హాట్ టాపిక్గా మారింది.అసలు వివాదం ఏమిటి?లింక్డ్ఇన్ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉంది. 2016లో సుమారు 26.2 బిలియన్ డాలర్ల డీల్తో మైక్రోసాఫ్ట్ దీనిని సొంతం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ కార్పొరేట్ నిర్మాణంలో అగ్రస్థానంలో ఉండగా లింక్డ్ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే, మే 5, 2024న జారీ చేసిన ఒక ఉత్తర్వులో లింక్డ్ఇన్ ఇండియా, లింక్డ్ఇన్ ఐర్లాండ్లతో పాటు సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీలపై ఆర్ఓసీ రూ.27 లక్షల జరిమానా విధించింది. కంపెనీల చట్టం ప్రకారం వీరు ‘గణనీయమైన ప్రయోజనకరమైన యజమానుల’ (సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్స్-ఎస్బీఓ) నిర్వచనం కిందికి వస్తారని, అయితే ఈ వివరాలను దాచారని ఆర్ఓసీ పేర్కొంది.లింక్డ్ఇన్ వాదనలింక్డ్ఇన్ ఇండియా అనేది మైక్రోసాఫ్ట్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. అయితే, మాతృ సంస్థలో ఏ ఒక్క నిర్దిష్ట వాటాదారుకూ గణనీయమైన వాటా లేదు. అందువల్ల ఎంసీఏ ఫైలింగ్స్లో తాము ‘శూన్య’ (నిల్) ఎస్బీఓలను ప్రకటించామని, చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని లింక్డ్ఇన్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందన కోరుతూ పంపిన ఈమెయిల్స్కు లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్ లేదా ఎంసీఏ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.ఎస్ఈసీ మాటేంటి..ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ముందు మైక్రోసాఫ్ట్ సమర్పించిన పత్రాలను ఆర్ఓసీ పరిగణనలోకి తీసుకోవడం. సత్య నాదెళ్లకు లింక్డ్ఇన్ ఇండియాపై నియంత్రణ ఉందనే నిర్ధారణకు రావడానికి, ఆయన ఎస్ఈసీకి సమర్పించిన ‘ఫారం 4ఎస్’ ఫైలింగ్స్ను ఆర్ఓసీ తన 63 పేజీల ఉత్తర్వులో ప్రధానంగా ప్రస్తావించింది. కంపెనీ అంతర్గత వ్యక్తులు (ఇన్సైడర్స్), డైరెక్టర్లు తమ వాటాల మార్పులను వెల్లడించడానికి అమెరికాలో ఈ ఫారం 4ఎస్ ఉపయోగిస్తారు.బహుళజాతి కంపెనీలపై పడే ప్రభావంభారతీయ చట్టాల ప్రకారం ప్రయోజనకరమైన యాజమాన్యాన్ని (ఎస్బీఓ) రెండు పరీక్షల ద్వారా గుర్తిస్తారు. షేర్హోల్డింగ్ టెస్ట్.. కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండటం. నియంత్రణ టెస్ట్.. ప్రత్యక్ష వాటాతో సంబంధం లేకుండా కంపెనీ వ్యవహారాలపై గణనీయమైన ప్రభావం లేదా నియంత్రణను (వీటో హక్కులు వంటివి) కలిగి ఉండటం. ప్రస్తుత కేసులో ఆర్ఓసీ ఏ వాటాదారుకో కాకుండా, ఏకంగా గ్లోబల్ సీఈఓకు జరిమానా విధించడం గమనార్హం.‘సీఈఓ విధి కంపెనీని నడపడమే. నిర్ణయాధికారాల కోసం వారికి కొన్ని అధికారాలు సహజంగానే ఉంటాయి. అంతమాత్రాన సీఈఓలు తీసుకునే ప్రతి నిర్ణయం ఎస్బీఓ నిబంధనల ప్రకారం ‘నియంత్రణ’ కిందికి రాదు’ అని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
ఆటా మహాసభలకు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్ బాల్టిమోర్లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా బృందం మహాసభ కార్యక్రమ వివరాలను సీఎంకు వివరించారు. ఎన్నారైలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దత్తత అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎంను కలిసిన వారిలో ఆటా నేషనల్ కో–ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కో–ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహాసభలకు హాజరవుతానని ఆటా ప్రతినిధులకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. చదవండి: ఇకపై ప్రభుత్వ ఆస్తిగా హైదరాబాద్ మెట్రోముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (#ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అటా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న… pic.twitter.com/g7WTYtpWl1— Telangana CMO (@TelanganaCMO) May 25, 2026 -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ పోస్ట్ వైరల్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం విచిత్రంగా సాగింది. ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్లలో ఓటమన్నదే ఎరుగని శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడిపోయింది.పంజాబ్కు తప్పని పరాభవంఫలితంగా ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచి.. ముంబై ఇండియన్స్పై ఆశలు పెట్టుకుంది. అయితే, రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఓడిపోవడంతో పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పైసా వసూల్ ప్రదర్శనఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు వచ్చాయి. కాగా గతేడాది వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ శ్రేయస్ను కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే ఈ ముంబైకర్ పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.బ్యాటర్గా 604 పరుగులు సాధించిన అయ్యర్.. కెప్టెన్గా జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే, టైటిల్ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పంజాబ్.. తొలిసారి ట్రోఫీని గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.ఆరంభంలోనూ అదుర్స్ఇక గతేడాది మాదిరే ఐపీఎల్-2026లోనూ జోరు కొనసాగించిన పంజాబ్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ ఫేవరెట్గా ముందుకు సాగింది. కానీ అనూహ్య రీతిలో డబుల్ హ్యాట్రిక్ ఓటములతో డీలా పడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.స్పందించిన శ్రేయస్ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ఇన్స్టా వేదికగా జట్టుతో ఉన్న దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు.. ప్రతీ క్షణం.. ప్రతీ పోరాటం. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగిసింది. ఆకలి, కసితో తదుపరి అధ్యాయం మొదలవుతుంది’’ అని శ్రేయస్ అయ్యర్ క్యాప్షన్ జతచేశాడు.తద్వారా 2027లో తాము రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని అయ్యర్ చెప్పకనే చెప్పాడు. కాగా ఈ సీజన్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 14 మ్యాచ్లలో కలిపి 498 పరుగులు సాధించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నోపై శ్రేయస్ (101 నాటౌట్) శతక్కొట్టడం విశేషం.చదవండి: వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Shreyas Iyer (@shreyasiyer96) -
అక్కడ గంగానదిలో పిల్లలు గాజు ముక్కతో ఎందుకలా వెతుకుతారో తెలుసా..!
భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు గంగానది ఒడ్డున పిల్లలు గాజుముక్కతో ఏదో వెదుకుతూ, ఆడుతుండటం చూస్తుంటారు. ఈ దృశ్యం చూడడానికి ఎంతో ఉల్లాసంగానూ, ముచ్చటగా కనిపించినా.. దాని వెనక ఎంతో సహనం, ఓర్పు, శ్రమ కూడుకుని ఉంటుందని తెలుసా? నిజానికి పిల్లలు ఎందుకలా చూస్తుంటారు? ఇంతకీ ఏం వెతుకుతుంటారనేది తెలుసుకుందాం!గంగానది మన దేశ విశ్వాసానికి, సంస్కృతికి గొప్ప ప్రతీక. ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలతో పుణ్యక్షేత్రాలు కిటకిటలాడటం, వేలాదిమంది తరలి రావటంవంటి దృశ్యం ఒకవంతు అయితే, గంగానది తీరంలో నివసిస్తున్న కొంతమంది పిల్లల జీవితాలు మరోవంతు. ఆ తీరంతో వారి జీవితాలే ముడిపడి ఉన్నాయి. ప్రజలు పూజ చేసేటప్పుడు, తరచుగా నాణెములు, విలువైన వస్తువులను, ఆభరణాలను వారి మొక్కుబడిగా నదిలో విసిరేస్తారు. కాలక్రమేణా.. ఇవి నీటి అడుగున పూడుకుపోతాయి. అలా నీటి అడుగున స్పష్టంగా చూడడానికి ఈ గాజుముక్క వారికి ఎంతగానో సహాయపడుతుంది. దాంతో పిల్లలు నీటిలో పడిపోయిన పాత నాణేలు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల కోసం వెతుకుతుంటారు. కొన్నిసార్లు గంటల తరబడి చూస్తున్నాగానీ వారికి ఏమీ దొరకదు.నిజానికి ఈ గాజుముక్క వారికి ఎలా ఉపయోగపడుతుందంటే? నీటి ఉపరితలంపై పడే సూర్యకాంతి కింద ఉన్న దృశ్యాన్ని అస్పష్టంగా మారుస్తుంది. ఆ పరిస్థితులలో పిల్లలు గాజును ఒక ప్రత్యేక పద్ధతిగా.. నీటిలో ముంచడంతో సూర్యకాంతి తగ్గి, నది అడుగున ఉన్న వస్తువులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా వెతకడం చూడడానికి చాలా సులభంగా అనిపించినా, గంటల తరబడి కష్టపడినా పిల్లలకు ఏమీ దొరకదు. కానీ అదృష్టం కలిసొచ్చి పాత వెండి ఆభరణాలు, విలువైన నాణాలు, ఏదైనా లోహ వస్తువు దొరికితే లాభం పొందవచ్చనేది వారి ఆశ.కొందరు దీనిని అదృష్టంతో కూడిన ఆటగా భావిస్తే, మరికొందరు ఇది కఠోర శ్రమ, నైపుణ్యానికి సంబంధించిన విషయమని అంటారు. నిజం ఏమిటంటే? ఈ నది తీరాన నివసిస్తున్న పిల్లలు తమ ఇంటి ఖర్చులు తీర్చడానికో? కుటుంబ కష్టాలను తగ్గించడానికో ఉపయోగపడే ఏదైనా వస్తువు గంగానదిలో దొరుకుతుందని ఇలా వెతుకుతుంటారు. వీటిని పురాతన వస్తువుల సేకర్తలు అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. ఆ ఆశతో పిల్లలు ప్రతిరోజూ గంగా నది ఒడ్డుకు తరలివస్తుంటారు.చూడటానికి ఇదొక ఆటలా అనిపించినా, ఈ పని చాలా ప్రమాదకరమైనది. నదిలోని బలమైన ప్రవాహాలు, లోతైన నీటిస్థలాలు, జారే నేల తరచుగా ప్రమాదాలకు దారితీస్తాయి. స్థానికంగా నివసిస్తున్న పిల్లలు నదిలోకి దిగి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొన్నిసార్లు గాయపడతారు కూడా. గాజు ముక్కతో గంగానదిలోకి తొంగిచూస్తున్న ఈ పిల్లలు కేవలం వస్తువుల కోసం వెతకడమే కాదు, తమ అదృష్టాన్ని కూడా పరీక్షిస్తుంటారు. -
తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్
తమిళనాడు విజయ్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్ను నిలదీశారు. ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. -
ముందు ఇండియా కూటమి ఎక్కడుందో తెలుసుకోవాడానికి అర్జంటుగా ఓ సమావేశం పెట్టాలి
-
లేఆఫ్స్కు సాకు చెప్పడం సీఈఓల సోమరితనం
టెక్ ప్రపంచంలో కొంతకాలంగా సాగుతున్న ఉద్యోగాల కోత (లేఆఫ్స్)పై కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీల్లో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపునకు ఏఐ సాంకేతికతను సాకుగా చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంతమంది టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, కేవలం స్మార్ట్గా కనిపించడానికి ఏఐని వాడుకుంటున్నారని ఇది వారి సోమరితనం(లేజీ నారేటివ్) అని మండిపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.రెండేళ్ల క్రితం తీసేసి.. ఇప్పుడు ఏఐ అనడం ఏంటి?ఉద్యోగ నష్టాలకు, ఏఐ విస్తరణకు ముడిపెడుతూ సాగుతున్న ప్రచారాన్ని జెన్సెన్ హువాంగ్ పూర్తిగా ఖండించారు. సాంకేతికత ఇప్పుడిప్పుడే వ్యాపారాలకు ఉపయోగకరంగా మారుతోందని, కానీ కంపెనీలు మాత్రం చాలా కాలం క్రితమే ఉద్యోగులను తొలగించాయని ఆయన గుర్తుచేశారు. ‘ఏఐ అనేది కేవలం గత ఆరు నెలలుగా మాత్రమే పూర్తిస్థాయిలో ఉత్పాదకతను ఇస్తూ కంపెనీలకు ఉపయోగకరంగా మారింది. మరి అలాంటప్పుడు రెండేళ్ల క్రితమే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు.. దానికి ఏఐ కారణమని ఎలా చెబుతాయి? టెక్నాలజీ ఇప్పుడే మార్కెట్లోకి వస్తే.. అప్పుడే ఉద్యోగాలు ఎలా పోతాయి? నేను ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషిస్తున్నాను’ అని హువాంగ్ అన్నారు. కొంతమంది వ్యాపార నాయకులు శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ఉన్న అసలైన అంతర్గత కారణాలను దాచిపెట్టి కేవలం చర్చనీయాంశంగా మార్చడానికి ఏఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యంప్రస్తుతం మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు ఏఐ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ కార్మికులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళనను ఉద్యోగుల్లో పెంచుతున్నాయి. ఈ అంశంపై హువాంగ్ స్పందిస్తూ.. కార్పొరేట్ నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘మనం అనవసరంగా ప్రజలను భయపెడుతున్నాం, ఇది చాలా బాధ్యతారాహిత్యం. ఏఐ చుట్టూ ఉన్న వాస్తవాలను, దానివల్ల కలిగే సమతుల్య ప్రయోజనాలను సమాజానికి వివరించడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలి’ అని ఆయన స్పష్టం చేశారు.పీక్ స్టేజ్లో ఉద్యోగాల కోత: గణంకాలు ఏం చెబుతున్నాయి?ఉత్పాదకతను పెంచడానికి, పనులను ఆటోమేట్ చేయడానికి పరిశ్రమలు ఏఐ సాధనాలను వేగంగా స్వీకరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ లేఆఫ్స్కు కేవలం అదే కారణం కాదని మార్కెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ తాజా గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు 150 టెక్ కంపెనీల్లోని 1,14,210 మందికి పైగా ఈ లేఆప్స్ ద్వారా ప్రభావితమయ్యారు. మొత్తమ్మీద, లేఆఫ్స్ వెనుక ఉన్న ఆర్థిక మాంద్యం భయాలు, కంపెనీల మితిమీరిన విస్తరణ, వ్యయాల తగ్గింపు వంటి అసలు కారణాలను పక్కనబెట్టి ప్రతిదానికీ సరికొత్త టెక్నాలజీ వైపు వేలెత్తి చూపడం సరికాదన్న ఎన్విడియా చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
అన్నాడీఎంకేకు షాక్ల మీద షాకులు
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్లు తగులుతున్నాయి. మరో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా.. అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్కు రాజీనామా సమర్పించారు. ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోవడం తెలిసిందే. మొత్తం 47 మందికిగాను పళణి స్వామి వర్గంలో 22 మంది, సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో శాసనసభా పక్షం, విప్ హోదాపై వివాదం కొనసాగుతోంది.ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు బృందంలోని మరగతం కుమరవేల్, సత్యభామ, జయకుమార్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు రాజీనామా లేఖలను సమర్పించారు. వాటిని ఆయన వెంటనే ఆమోదించడం, టీవీకే ముఖ్య నేత, మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో పార్టీ విప్ను ధిక్కరిస్తూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం. -
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
టాయిలెట్లో బిడ్డను కని.. వెంటిలేటర్ నుంచి విసిరేసి..
హరిపాడు: కేరళలోని అలప్పుజ జిల్లా, హరిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కడుపునొప్పిగా ఉందని చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని, టాయిలెట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆ నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్ వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసింది.ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో..తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో విద్యార్థిని టాయిలెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే, బయట నుంచి పసికందు ఏడుపు వినిపించడాన్ని డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించారు. డాక్టర్లు తిష, డాక్టర్ ఆల్ఫీ, నర్సింగ్ ఆఫీసర్ జిషా, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో గాలించారు. ఆస్పత్రి భవనం వెలుపల పడి ఉన్న శిశువును గుర్తించి రక్షించారు.ప్రాణాపాయం నుంచి..ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల, చిన్నారికి ప్రమాదం పొంచి ఉండేది. కానీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, వేగంగా స్పందించడం వల్ల శిశువు ప్రాణాలతో దక్కింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, పసికందు సురక్షితంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తల్లికి, బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరినీ ఆలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు! -
ప్లేఆఫ్స్ చేరని పంజాబ్.. అర్ష్దీప్ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. లీగ్ దశలో పంజాబ్ తమ చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ, ముంబైపై రాజస్తాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరని నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ అర్ష్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అర్ష్దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను చాలా వరకు క్లియర్ చేశాడు. దాదాపు 200 పోస్టులను ఇన్స్టా ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోహ్లీతో కలిసి రీల్ చేసిన వీడియోను తొలగించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీతో చేసిన రీల్ దాదాపు 15 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం అర్ష్దీప్ ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే అర్ష్దీప్ ఉన్నపళంగా తన ఇన్స్టా నుంచి పోస్టులు తొలగించడం వెనుక బలమైన కారణముంది. లీగ్ స్టేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం.. అర్ష్దీప్ సింగ్ ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పంజాబ్ స్పిన్నర్ చాహల్.. చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్దీప్ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాంచైజీ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు ఇకపై ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే రూపొందించి విడుదల చేయాలనే యాజమాన్యం కఠిన సూచనలు చేసింది. అందుకే అర్ష్దీప్ తన పోస్టులను తొలగించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో అర్ష్దీప్ సింగ్ పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్లాడిన అర్ష్దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు. అందునా ప్రతీ మ్యాచ్లోనూ ఓవర్కు దాదాపు 10 పరుగుల పైనే సమర్పించుకున్నాడు.Arshdeep Singh to Virat Kohli ; Paaji run km rah gye century pakki thi. Kohli ; Toss jeet gye nhi to teri bhi pakki thii dew mein 🤣#INDvSA #ViratKohli pic.twitter.com/hSxkG4ma5n— Ali Tweets (@ali_tweets05) December 6, 2025చదవండి: క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన! -
టీడీపీ నేత పొట్టలో మేక ‘మే..మే’ అని అరిచింది..!
‘అధికారంలోకి వచ్చాక ఎక్కువగా తిని పొట్ట ముందుకు వచ్చింది.. ఉక్కకు తట్టుకోలేకపోతున్నాం.. కాసింతైనా వాన పడింటే బాగుండు’ అనుకుంటున్న టీడీపీ నేతలను చల్లబరుస్తూ మేఘం వర్షించింది. అంతా బాగానే ఉన్నా వానలో ఒక ముక్క అయినా నమిలితే బాగుంటుందని కొందరు టీడీపీ నాయకులు మేకను కొట్టేశారు. ఎవరికీ తెలియకుండా దాన్ని కైమా చేసి ఆరగించారు. మేక ఊరుకుంటుందా? వారి పొట్టలోకి వెళ్లినా ‘మే..మే..’ అని అరిచింది.. విషయం అందరికీ తెలిసింది. పంచాయితీ పోలీస్ స్టేషన్కు వరకు వెళ్లింది. ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టిని దోచుకుంటున్న టీడీపీ నేతలు తామేం గొప్పవారు కాదని, మేకను తిన్నవారే సంపద సృష్టించే అసలైన పార్టీ నాయకులని కీర్తిస్తూ గీతాలు పాడుతున్నారు. ఇది కథ కాదు.. గోనెగండ్లలో జరిగిన వాస్తవం. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. గోనెగండ్లలో ఒక మేక పొలం నుంచి దారితప్పి దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి చేరింది. దీన్ని గమనించి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు డైరెక్టర్, టీడీపీ నాయకుడు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు, మరో ముగ్గురు కలిసి మేక తీసుకెళ్లారు. కోసుకొని కుప్పలుగా వేసి, పంపకాలు చేసుకుని, ఎవరికీ తెలియకుండా ఆరగించారు. ఈ విషయం మేక యాజమానికి తెలిసి స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచారణ చేసి మేక మాంసాన్ని ఆరగించిన టీడీపీ నాయకులను విచారణకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీపీఐకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ‘మీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు రచ్చకెక్కితే బాగోదు’ అంటూ సర్దిచెప్పారు. మేకను ఖరీదు చేసి పరిహారాన్ని బాధితుడికి ఇప్పించే విధంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ విషయం తెలిసి గోనెగండ్ల మండల ప్రజలు టీడీపీ నాయకులు ఇలాగా కూడా ఉంటారా అని నవ్వుకున్నారు. కర్నూలు -
సూర్యపై వేటు తగదు.. కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!
భారత టీ20 జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ రానున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత యాజమాన్యం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ఇటీవల వెల్లడించడం ఇందుకు కారణం.వేటు తప్పదనే సంకేతాలుటీమిండియాకు 2026లో కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం తేలిపోయాడు సూర్యకుమార్ యాదవ్. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాటింగ్లో పస లేకుండా పోయింది. ఇక ఐపీఎల్-2026లోనూ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 13 ఇన్నింగ్స్లో కలిపి 270 పరుగులే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో సూర్యపై వేటు పడటం దాదాపుగా ఖాయమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించాడు. క్రిక్బజ్కు రాసిన కాలమ్లో..అత్యంత విలువైన ఆటగాడు‘‘ఆధునిక టీ20 క్రికెట్లో కేవలం టెక్నిక్ ద్వారానే మ్యాచ్లు గెలవలేము. భయం లేకుండా వినూత్న షాట్లు కొట్టడం, కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉండటం అత్యంత ముఖ్యం. ఆ లక్షణాలన్నీ సూర్యకుమార్లో ఉన్నాయి.అందుకే భారత టీ20 క్రికెట్లో ఇప్పటికీ అతడు అత్యంత విలువైన ఆటగాడే. అతడి ఫామ్ గురించి ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే. అయితే, భారత టీ20 జట్టు నుంచి సూర్యను తొలగిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు.భవిష్య కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!ఇప్పటికీ టీమిండియాలో విభిన్న, అత్యంత ప్రత్యేకమైన బ్యాటర్ సూర్యనే. 360 డిగ్రీస్లో షాట్లు ఆడగల అతి కొద్దిమంది బ్యాటర్లలో అతడు ఒకడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం కష్టం’’ అని ఎమ్ఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.ఇక సూర్యను ఆటగాడిగా కొనసాగించాలన్న ఎమ్ఎస్కే ప్రసాద్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్లలో ఒకరిని తదుపరి కెప్టెన్గా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్కప్-2026 తర్వాత 2028 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని 35 ఏళ్ల సూర్య తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: కోహ్లికి షాక్.. వైభవ్కు చోటు! -
ఆయన ఎంత అడిగితే… అంత ఇచ్చేయండయ్యా!
సాక్షి, విజయవాడ: ప్రముఖ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు మరోసారి భారీ ఫీజులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం రూ.44 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.33 లక్షలు, రూ.11 లక్షలు చొప్పున విడతల వారీగా విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించినందుకుగానూ ఈ చెల్లింపులు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సిద్ధార్థ లూథ్రా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరఫున కూడా వాదనలు వినిపించడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.అంతేకాదు… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తరఫున కూడా సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. దేశంలోనే టాప్ మోస్ట్ లాయర్గా ఉన్న లూథ్రా.. తనను తాను పేదవాడిగా చెప్పుకునే దస్తగిరికి ఎంత ఫీజు చెల్లిస్తున్నాడు? ఎలా చెల్లిస్తాడు? అనేది ఆశ్చర్యం కలిగించే అంశమే. “ఒకవైపు ప్రభుత్వ కేసులు… మరోవైపు చంద్రబాబు కేసులు… ఇంకోవైపు దస్తగిరి కేసు… మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పెద్ద కేసు ఉంటే అక్కడ లూథ్రా ఉంటారన్న మాట” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ లూథ్రాకు రూ.13 కోట్లకుపైగా ఫీజులు చెల్లించినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో నెట్టింట “రాష్ట్రానికి ఫుల్టైమ్ లాయరా? లేక ప్రతి హైప్రొఫైల్ కేసుకీ కామన్ అడ్రస్నా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని సమర్థించుకుంటున్నాయి. దేశంలోని ప్రముఖ సీనియర్ అడ్వొకేట్లలో సిద్ధార్థ లూథ్రా ఒకరని, సుప్రీంకోర్టు స్థాయి కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులను నియమించడం సహజమేనని.. కాబట్టి ఆ మాత్రం ఖర్చులు తప్పవని అధికారులు వివరిస్తున్నారు.అయితే ప్రజలు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాల నిధుల కొరతపై చర్చ జరుగుతున్న సమయంలో… కోట్ల రూపాయలు న్యాయవాదుల ఫీజులకే వెళ్తుండటం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. -
అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..!
40 ప్లస్ అనగానే వృద్ధాప్య ఛాయలు ప్రారంభమవుతుంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అయ్యే సమయం కూడా. ఈ వయసులోనే అత్యంత కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఇక్కడొ తల్లి 47 ఏళ్ల వయసులో కూడా పదహారణాల అమ్మాయిలా అందర్నీ ఆకర్షిస్తుంది. అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా ఆ పిల్లల తల్లి యంగ్లుక్లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా యవ్వనంగా కాంతింగా కనిపించేందుకు ఆమె ఏమి ఐస్బాత్లు, విపరీతమైన డిటాక్స్లు ఫాలో అవ్వనని చెబుతోందామె. కేవలం సాధారణ దినచర్యతోనే ఇలాంటి యవ్వనపు లుక్ని సొంతం చేసుకోవచ్చని అంటోంది. అవేంటంటే..చెఫ్ కమ్ డైటీషియన్ రాఖీ గనేరివాల్ ఇద్దరు పిల్లల తల్లి 47 ఏళ్ల వయసులోనే ఎంతో అందంగా ఆకర్షణీయమైన లుక్లో ఉంటారామె. అందుకోసం కేవలం పది సాధారణ పనులనే చేస్తానని అంటోంది. తీవ్రమైన వెల్నెస్ ట్రెండ్ల కంటే..నిలకడకే ప్రాధాన్యత ఇస్తానంటోంది.చురుగ్గా ఉండటం..ప్రతిరోజూ పదివేలకు పైగా అడుగులు వేస్తానని చెబుతుంది. ఇంటి పనులు దగ్గర నుంచి ఉద్యోగ విధుల వరకు అన్నీ చురుగ్గా చేస్తానని చెబుతుంది. అయితే ఒక వ్యూహంలా చేసుకుంటూ పోతానంటోంది. అయితే ఎంత తీరిక లేకపోయినా..ఒక గంట పాటు వర్కౌట్లు చేసేందుకు కట్టుబడి ఉంటానంటోంది. రోజంతా బాడీ వెయిట్, స్క్వాట్స్, క్యాల్ఫ్ రైజర్ వంటి వ్యాయామాలు చేస్తానని చెబుతోంది. అయితే సాధారణ చిన్న చిన్న వ్యాయామాలే చాలా ప్రభావవంతంగా ఉంటాయని అంటోంది.డిజిటల్ డిటాక్స్..అలాగే రాత్రినిద్రపోయే ముందు, రోజులో మొదటి మూడు గంటలు ఫోన్కి దూరంగా ఉంటానని అంటున్నారు. దీనివల్ల నాడివ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. పైగా ఒత్తిడిని నియంత్రించి మంచిగా నిద్రపోగలుగుతామని అంటున్నారామె.మంచి ఆహారం..ప్రతి ఉదయం నిమ్మరసం,కొబ్బరి నూనె డ్రింక్తో రోజుని ప్రారంభిస్తుందట. ఇది రోజంత శక్తిమంతంగా ఉండేలా చేసి ఆకలి కోరికలను నియంత్రిస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయట. కడుపు నిండిన భావన కోసం రోజూ 110–120 గ్రాముల ప్రోటీన్ని తీసుకునేలా కేర్ తీసుకుంటారట. సాధారణంగా నిద్రలేచిన గంటలోపు ప్రోటీన్ పౌడర్ను తీసుకుని, ఆ తర్వాత గుడ్లు, పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, వంటి ఇతర ఆహారాలను తీసుకుంటుందట. అయితే అన్నింట్లకంటే ముఖ్యం మూడు లీటర్ల నీళ్లు తాగడం అనేది కీలకం అంటోంది. రోజూ రెండు పండ్లు తప్పనిసరి అని చెబుతోంది. అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలనే సాధారణ చిన్న చిన్న పనులతోనే ఇదంతా సాధ్యమని అంటోందామె. పరిపూర్ణత కంటే నిలకడక పాటించేందుకు ప్రాధాన్యత ఇవ్వమని కోరుతోంది. View this post on Instagram A post shared by Chef-Dietitian Raakhi Ganerriwal (@raakhiganerriwal)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ) -
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఈ అభ్యర్థన రావడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చివరి నిమిషంలో పిటిషన్ ఎందుకు?అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గోవధను నిషేధించే చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని, అలాగే వధశాలల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. బుధవారమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని న్యాయవాది బారున్ కుమార్ సిన్హా కోర్టును కోరారు.సుప్రీంకోర్టు ఘాటు స్పందనఈ అభ్యర్థనను విన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘పండుగకు ఒక్కరోజు ముందు మీకు ఇది గుర్తుకొచ్చిందా? ఇందులో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదు. ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానిస్తూ, విచారణను చేపట్టేందుకు స్పష్టంగా నిరాకరించింది. సమయానుకూలంగా కాకుండా, పండుగ వేళ ఇలాంటి అంశాలను కోర్టు ముందుకు తేవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.న్యాయపరమైన పరిణామాలుప్రస్తుతానికి ఈ పిటిషన్పై ఎలాంటి అత్యవసర ఉత్తర్వులు జారీ కాకపోవడంతో, పాత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారమే పండుగ ఏర్పాట్లు కొనసాగనున్నాయి. చట్టాల అమలు, వధశాలల నియంత్రణకు సంబంధించి పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తదుపరి సాధారణ విచారణలో పరిశీలించాల్సి ఉంటుంది. అత్యవసర విచారణ కోరిన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో, ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. -
క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న పోరులో అందరి కళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్లో కోహ్లీ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఆర్సీబీ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్లో 17 మ్యాచ్లాడిన కోహ్లీ 121 స్ట్రైక్రేట్తో 396 పరుగులు సాధించాడు. మరి గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే గుజరాత్తో మ్యాచ్లో పిచ్పై అవగాహన వచ్చేవరకు నిలదొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. పైగా ధర్మశాలలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో 557 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఇరుజట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్-1 పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.చదవండి:‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’ -
బైక్పై స్టంట్లు.. లైక్ల కోసం స్టేటస్..
హైదరాబాద్: బైక్పై స్టంట్లు చేయడమే కాక లైక్ల కోసం స్టేటస్ పెట్టిన బంజారాహిల్స్ రోడ్ నంబర్–5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్ (19)ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జెప్టో డెలివరీ బాయ్గా పనిచేసే ఇతడు ఇటీవల శామీర్పేట రోడ్లోకి వెళ్లి బైక్ను గాల్లోకి లేపి ఫోన్ మాట్లాడుతూ విన్యాసాలు చేశాడు. దానిని వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. షాబాద్ను అదుపులోకి తీసుకుని బైక్ను సీజ్ చేశారు. స్నేహితుల్లో తాను ప్రత్యేకత చాటుకోవాలని, తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనే స్టంట్లు చేసినట్లుగా నిందితుడు వెల్లడించాడు. షాదాబ్పై చోరీ కేసు నమోదై ఉందని దర్యాప్తులో తేలింది. బైక్పై ప్రమాదకర స్టంట్లు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులులైక్ల కోసం బైక్ పై స్టంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బంజారాహిల్స్ రోడ్ నంబర్-5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్ (19)గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు https://t.co/gipROq3UKL pic.twitter.com/wdx1J8kxMN— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026 -
3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు
మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్ఇప్పటికే వరకట్నం డిమాండ్ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్ చేయించారని ట్విషా వాట్సాప్ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడుబైపోలార్ డిజార్డర్దీంతోపాటు మరో షాకింగ్ ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) 'అడ్జస్ట్మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్లైన్ జాబ్స్ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె మామూలుగానే ఉందనీ, ఇద్దరమూ జిమ్కు వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు, దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్లు, వైద్య రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
క్లైమాక్స్కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు హస్తినలో వాడీవేడిగా సాగుతున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఇందిరాభవన్లో అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లు భేటీ అయ్యారు. సమావేశంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా, గత డిసెంబరు నుంచి(రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు. అయితే.. మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, తననే కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వీళ్లిద్దరి నుంచి అభిప్రాయసేకరణ చేశారు. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు తదితరు అంశాలను సిద్దరామయ్య ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. ఆయన్ని మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే తనకే సీఎం పదవి ఇవ్వాలని డీకే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు సమీకరణాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న అధికారం పోరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు చేయడం ఏమాత్రం మంచిది కాదు. పార్టీ 2028లో మళ్లీ అధికారంలోకి రావాలంటే స్థిరత్వం.. బలమైన టీమ్ అవసరం. అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగితే బీజేపీకి లాభం కలుగుతుంది అని హెచ్చరించారాయన. అదే సమయంలో అధిష్టానం నుంచి త్వరలోనే ఓ ప్రకటన వెలువడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒకవేళ మార్పు గనుక ఉంటే.. ఇప్పుడే చేస్తారా?.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పు ఉంటుందా? ఒకవేళ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా?.. డీకేను ఎలా సంతృప్తి పరుస్తారు? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
టాలీవుడ్ హీరోగా.. హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు
తెలుగులో నిన్నుకోరి, జెంటిల్మేన్, 35 ఇది చిన్న కథ కాదు, జై లవకుశ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్ తమ్ముడు ప్రస్తుతం తెలుగులో హీరోగా చేస్తున్నాడు. 'బెంగుళూరు మహానగరం లో బాలక'తో టాలీవుడ్లోకి వస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయింది.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మహి-రాజ్ ద్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్ లుక్ని ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు. తెలుగు కుర్రాడు.. బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ చేశారు. (ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు) -
Odisha: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ.. ఆరుగురు మృతి
కలహండి: ఒడిశాలోని కలహండి జిల్లాలో మంగళవారం జరిగిన ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మదన్పూర్-రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరియాఖుంట గ్రామంలో చోటుచేసుకుంది.మృత్యువుకు చిరునామాగా..నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు, నిర్మాణ సంబంధిత పనుల కోసం మంగళవారం ఆరుగురు వ్యక్తులు లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువుల కారణంగా వారందరికీ ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: డేరా బాబాకు మళ్లీ పెరోల్.. 16వ సారి బయటకు.. -
ఆహార అలవాట్లలో మార్పు
భారతీయుల రోజువారీ ఆహార అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు జిమ్కు వెళ్లేవారో, బాడీ బిల్డర్లో అధికంగా తీసుకునే ప్రోటీన్ (మాంసకృత్తులు)పై ఇప్పుడు సామాన్యులకు ఆసక్తి పెరిగింది. దేశవ్యాప్తంగా హెల్త్, ఫిట్నెస్ పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఫుడ్మెనూలో ప్రోటీన్ ఆధారిత ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ ఇన్స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన 2023-2025 కాలానికి సంబంధించిన నివేదికలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. గడిచిన రెండేళ్లలోనే ఇన్స్టామార్ట్లో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు ఏకంగా 150 శాతం వృద్ధి చెందగా వినియోగదారులు వీటికోసం చేసే ఖర్చు ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.టైర్-2 నగరాల్లో వృద్ధి!ఒకప్పుడు హెల్తీ లైఫ్స్టైల్ ట్రెండ్స్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మెట్రో నగరాలతో పోలిస్తే టైర్-2, 3 నగరాల్లో ప్రోటీన్ ఆర్డర్ల వృద్ధి రేటు 200 శాతం వేగంగా ఉంది. వైజాగ్ వంటి నగరాలు ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ వినియోగ హబ్లుగా మారుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ రోజువారీ సరుకుల లిస్ట్లో సాంప్రదాయ ఆహారంతో పాటు ఆధునిక ప్రోటీన్ ప్రొడక్ట్స్ను కూడా చేరుస్తున్నారు.ప్రోటీన్ ఆర్డర్ల ట్రెండ్పై ఇన్స్టామార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరి కుమార్ మాట్లాడుతూ ‘మేం నిత్యావసరాలను వేగంగా అందించడంతోపాటు భారతీయుల జీవన విధానంలో వస్తున్న ఒక ప్రాథమిక మార్పులో భాగస్వామ్యం అవుతున్నాం. ఇది హెల్తీ లైఫ్స్టైల్ వైపు మళ్లుతున్న ట్రెండ్ను సూచిస్తుంది. మెట్రోల నుంచి చిన్న నగరాల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.నివేదికలోని కొన్ని అంశాలు..మార్నింగ్ విండో క్రేజ్ (ఉదయం 7 నుంచి 11 గంటలు): దేశవ్యాప్తంగా ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు అత్యధికంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యే వస్తున్నాయి. అంటే ప్రజలు తమ బ్రేక్ఫాస్ట్ను ప్రోటీన్-రిచ్గా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.నంబర్ 1 కాంబో: భారతీయుల ఇన్స్టామార్ట్ కార్ట్లో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న నంబర్ వన్ హెల్తీ కాంబో.. కోడిగుడ్లు, పనీర్. వీటి తర్వాత చికెన్, శనగలు ఉన్నాయి.2025 నాటి డేటా ప్రకారం.. యాప్లో అత్యధికంగా వెతికిన ప్రోటీన్ పదం ‘పీనట్ బటర్’. రెండో స్థానంలో గ్రీక్ యోగర్ట్ నిలిచింది.చెన్నై యూజర్ రికార్డ్: ప్రోటీన్ డైట్ కోసం ఒక చెన్నై వినియోగదారుడు ఏకంగా రూ.2,71,385 ఖర్చు చేశాడు. ఇందులో ఎక్కువ భాగం పీనట్ ఆధారిత ప్రోటీన్ స్టేపుల్స్ ఉండటం విశేషం.ట్రెండీ స్నాక్స్ వైపు మొగ్గు..సాధారణ చిప్స్, స్నాక్స్ స్థానంలో ఇప్పుడు హెల్తీ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ప్రోటీన్ యోగర్ట్, ప్రోటీన్ స్నాక్స్ (ప్రోటీన్ చిప్స్) కేటగిరీ ఏటా ఏకంగా 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. యువత ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇటువంటి హై-ప్రోటీన్ స్నాక్స్ను ఎంచుకుంటున్నారు.సాంప్రదాయ ప్రోటీన్కు డిమాండ్ఆధునిక మార్పులు వస్తున్నప్పటికీ మన దేశీయ పాతకాలపు ప్రోటీన్ వనరుల క్రేజ్ తగ్గలేదు. భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ అయిన సోయా చంక్స్, సత్తు (వేయించిన శనగల పిండి)ల డిమాండ్లో కూడా 100 శాతానికి పైగా వృద్ధి కనిపించింది. మొత్తంగా చూస్తే.. భారతదేశంలో క్విక్ కామర్స్ విప్లవం వస్తువులను వేగంగా డెలివరీ చేయడంతోపాటు ప్రజలు మరింత ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రోటీన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్
ఐపీఎల్-2026 ఫైనల్ తొలి బెర్తు కోసం రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ రేసులో నిలిచాయి. ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి క్వాలిఫయర్-1 మ్యాచ్కు ధర్మశాల వేదిక. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆర్సీబీ- గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటాయి.ఆర్సీబీకి కీలక సూచనలుకాగా ఈ మైదానం బౌండరీలు చిన్నగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆర్సీబీకి కీలక సూచనలు చేశాడు. లీగ్ దశలో చివరి మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడ్డ ఆర్సీబీ.. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు.ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కంటే బలంగాప్రస్తుతం గుజరాత్ బౌలింగ్ విభాగం.. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కంటే బలంగా కనిపిస్తోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే, గత చేదు అనుభవాన్ని మరిచి ఆర్సీబీ బౌలర్లు క్వాలిఫయర్-1పై దృష్టి సారిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు.తేలిపోయిన భువీ, హాజిల్వుడ్కాగా ఆర్సీబీ లీగ్ దశలో చివరగా సన్రైజర్స్తో తలపడి.. 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సొంతమైదానం ఉప్పల్లో సన్రైజర్స్ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.నాలుగు ఓవర్ల కోటాలో భువీ 51, హాజిల్వుడ్ 55 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక రసిఖ్ సలామ్ దర్ 52 పరుగులు ఇచ్చినప్పటికీ రెండు వికెట్లు తీయగలిగాడు. మిగిలిన వారిలో సూయశ్ శర్మ మూడు ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. కృనాల్ పాండ్యా రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక రొమారియో షెఫర్డ్ మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే, ఈ మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడినప్పటికీ నెట్రన్రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉండటంతో టేబుల్ టాపర్ స్థానాన్ని పదిలం చేసుకుని క్వాలిఫయర్-1లో అడుగుపెట్టింది.ప్లే ఆఫ్స్లో కూడా విఫలమైతే..ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సన్రైజర్స్తో మ్యాచ్ను ఆర్సీబీ వీలైనంత త్వరగా మర్చిపోవాలి. భువీ, హాజిల్వుడ్ విఫలమయ్యారు. వారికి అదొక దుర్దినం. ఇద్దరిలో ఒక్కరూ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు.అయితే, ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు సాగాల్సిన కీలక సమయం ఇది. ఒకవేళ ప్లే ఆఫ్స్లో కూడా ఆర్సీబీ బౌలర్లు విఫలమైతే.. గుజరాత్ 255కు పైగా పరుగులు స్కోరు చేయవచ్చు. ఇక్కడ బౌండరీలు చాలా చిన్నవి కాబట్టి ఆ అవకాశం ఉంది.ఆర్సీబీ బౌలింగ్ విభాగం గొప్పగా రాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే.. గుజరాత్ బౌలర్లు వీరి కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ ఈ విషయంలో తప్పక జాగ్రత్త వహించాలి’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ బౌలర్లు తేలిపోతే మాత్రం ఈ మ్యాచ్లో విజయం కష్టమేనని సెహ్వాగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.చదవండి: మరీ ఇంత కుళ్లు పనికిరాదు! -
సైలెంట్గా స్కెచ్.. పెద్ద రిస్క్ చేస్తున్న విజయ్
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.“ఆపరేషన్ L” అలా మొదలైందా?అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే..మిత్రపక్షాలు ఊరుకుంటాయా?అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది.చట్టపరమైన చిక్కుల్లేకుండా..అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు.టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు… సామాజిక లెక్కతో కూడిన వ్యూహమన్న మాట.అసలు సమస్య అదే..అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉపఎన్నికల రాజకీయ, ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే… అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలుచోట్ల ఉపఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. “రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు” అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉపఎన్నిక అనేది గెలుపు గ్యారెంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా… రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది.అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు “హై రిస్క్ – హై రివార్డ్” ఆపరేషన్గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే… టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజారిటీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే, ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగానే ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి. -
అమెరికాలో భారతీయ మహిళ హత్య
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్లో గుజరాత్కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డేరా బాబాకు మళ్లీ పెరోల్.. 16వ సారి బయటకు..
సునారియా: హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి బయటకు వచ్చారు. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్కు తాజాగా 30 రోజుల పాటు పెరోల్ మంజూరైంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఆయనకు పెరోల్ లభించడం ఇది 16వ సారి కావడం గమనార్హం.కట్టుదిట్టమైన భద్రత మధ్య విడుదలమంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చారు. భారీ పోలీసు కాన్వాయ్ మధ్య ఆయన సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందు గత జనవరి లో కూడా ఆయన 40 రోజుల పాటు పెరోల్పై బయటకు వచ్చారు. ఆయన మరోమారు జైలు నుంచి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.పలుమార్లు పెరోల్2017లో ఇద్దరు మహిళా అనుచరుల అత్యాచారం కేసులో దోషిగా తేలిన రామ్ రహీమ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గత ఆరేళ్ల కాలంలో ఆయన పదేపదే పెరోల్ పొందడంపై పలు విమర్శలు వస్తున్నాయి. 2022 నుంచి 2026 మధ్య కాలంలో ప్రతి ఏటా పలుమార్లు ఆయన జైలు నుంచి బయటకు రావడం గమనార్హం.జర్నలిస్ట్ హత్య కేసులో నిర్దోషిగా..గత మార్చి నెలలో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 2002 నాటి జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో రామ్ రహీమ్ను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అంతకుముందు సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు కొట్టివేసింది. ఒకప్పుడు ‘డేరా’లో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టినందుకు జర్నలిస్ట్ ఛత్రపతి హత్యకు గురికావడం సంచలనం కలిగించింది.ఇది కూడా చదవండి: ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు -
ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్
మధ్యప్రదేశ్లోని భోపాల్లోట్విషా శర్మ మరణానికి సంబంధించిన కేసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి తరువాత వధువును అత్తవారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం సందర్భంగా, ఆమె అత్త, తన కోడలి వరకట్నం మరణం కేసులో నిందితురాలిగా ఉన్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి గిరిబాల సింగ్ రూ. 2 లక్షల వరకట్నం డిమాండ్ చేసిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్విషా శర్మ వరకట్న మరణం కేసును విచారిస్తున్న సీబీఐ ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా కేసునమోదు చేసి, భోపాల్ పోలీసుల నుండి ఆధారాలను స్వాధీనం చేసుకుంది.గత ఏడాది డిసెంబర్ 9న మోడల్, నటి ట్విషా శర్మకు , న్యాయవాది సమర్థ్ సింగ్తో వివాహం జరిగింది. కట్నం భారీగానే చెల్లించారు. అయితే పెళ్లి ముగిసి అత్తగారింటికి పంపించే సమయం (విదాయి)లో సమర్థ్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, ఒత్తిడి తట్టుకోలేక వధువు కుటుంబం ఆ డబ్బు చెల్లించిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అదీ చాలదన్నట్టు పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తగారు కలిసి ట్విషాను శారీరకంగా, మానసికంగా వేధించారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట జరిగిన రూ. 2 లక్షల డిమాండ్ తదుపరి తీవ్ర వేధింపులకు దారితీసిందా? అసలు ఆమె మరణానికి గల కారణాలేంటి? అనే కోణంలో సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.కాగా పెళ్లైన ఐదు నెలలకే అత్తగారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసింది. అలాగే పోస్ట్మార్టంలో అవకవతవకలు జరిగాయంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో మధ్య ప్రదేశ్ హైకోర్టు రీ పోస్ట్మార్టంకు ఆదేశించింది. అంతకు ముందే భోపాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక బృందం భోపాల్ చేరుకుని ఆధారాలను సేకరించడం, నిందితులను విచారించడం ప్రారంభించింది. భార్య మరణం తరువాత పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సమర్థ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. సెక్షన్లు 80(2), 85, 3(5) లతో పాటు, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ట్విషా కుటుంబం చేస్తున్న ఆరోపణలను భర్త సమర్థ్ సింగ్ కుటుంబం పూర్తిగా నిరాకరిస్తోంది. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, దానివల్లే ఆమె ఇబ్బంది పడేదని గిరి బాల సింగ్ వెల్లడించారు. ఈమె వ్యాఖ్యలపై ఇంటర్నెట్లో దుమారంరేగింది. విక్లిమ్ను బ్లేమ్ చేస్తూమొసలి కన్నీళ్లు కారుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకొని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం గమనార్హం. -
కోడలిపై కన్నేసిన 75 ఏళ్ల మామ..!
బెంగళూరు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మామ (75), కేసు సామరస్యంగా పరిష్కరించుకుంటామని బాధితురాలు (కోడలు) దయతల్చడంతో హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. వివరాలు.. బాధిత మహిళ.. భర్త, అత్త, మామ నిరంతరం లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై వారిపై కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మామ బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు, తన వయసు 75 సంవత్సరాలని, 9 నెలలుగా కారాగారంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. కుటుంబ గొడవలతో తప్పుడు ఫిర్యాదు చేశారన్నాడు. దీనిని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకిస్తూ, పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ నిరాకరించాలని కోరారు. అయితే బాధిత మహిళ.. కేసును సామరస్యంగా పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది. బెయిలు ఇవ్వవచ్చని తెలిపింది. జస్టిస్ జిఎస్ కమల్ వాదనలను ఆలకించి బెయిలుకు ఆమోదించారు. రూ.లక్ష పూచీకత్తు, పలు నిబంధనలను పాటించాలని ఆదేశించారు. కేసు విచారణ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. -
‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లాఫ్ షో కనబరిచాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీజన్లో రాజస్తాన్తో మ్యాచ్లో 60 పరుగుల ఇన్నింగ్స్ సూర్యకు ఈ సీజన్లో చెప్పుకోదగిన ప్రదర్శన. ఇది మినహా అతడు రాణించిన దాఖలాలు లేవు. అయితే రాజస్తాన్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడని, అందుకే అతడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. తనకు ఏ గాయం కాలేదని, సరిగ్గా ఆడనంత మాత్రానా గాయంతో బాధపడుతున్నట్లు ఊహించుకున్నవారంతా మూర్ఖులేనంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అంతేకాదు తనపై వచ్చిన వార్తలన్నీ అబద్దాలేనంటూ కొట్టిపారేశాడు. సూర్యకుమార్ మాట్లాడుతూ..‘ఒక విషయంపై నేను స్పష్టత ఇవ్వదలచుకున్నా. నేను మణికట్టు గాయంతో బాధపడుతున్నా అని మాట్లాడుకుంటున్నవాళ్లు ఫిజియోథెరపిస్టులు కాకపోవడం లేదా క్రికెట్ గురించి అవగాహన లేని వాళ్లు అయి ఉంటారు. ఎందుకంటే, ఒకవేళ నిజంగా నేను మణికట్టు గాయం లేదా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. ప్రాక్టీస్లోనూ, మ్యాచ్లలోనూ షాట్లు కొట్టడంలో ఇబ్బంది ఎదుర్కొనేవాడిని. నేను మ్యాచ్ల్లో ఆడే చాలా షాట్లతో పాటు ఫ్లిక్ షాట్లు నా మణికట్టుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రూమర్లను పట్టించుకునే సమయం నాకు లేదు. కానీ నేను పూర్తి ఫిట్గా ఉన్నప్పటికీ గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం ఆగ్రహం తెప్పించింది. అందుకే పని గట్టుకొని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఈ సీజన్లో నా నుంచి బ్యాటింగ్లో మంచి ప్రదర్శన రాకపోవడంపై అసంతృప్తిగానే ఉన్నా. కానీ ఈ ఏడాది మంచి హార్డ్వర్క్తోనే క్రికెట్ సీజన్ను స్టార్ట్ చేశాను. న్యూజిలాండ్తో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నా. టీ20 ప్రపంచకప్లో ఆరంభంలో విఫలమైనప్పటికీ ఆఖర్లో మంచి ప్రదర్శనే కనబరిచాను. కానీ ఐపీఎల్లో మాత్రం లయను కోల్పోయి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. నా ప్రదర్శన బాగాలేదని సర్దిచెప్పుకోలేను. దానిని మెరుగుపరుచుకునేందుకు ఇంకా కష్టపడుతా. ఫలితం వస్తే సంతోషం లేకుండా మళ్లీ కష్టపడతా. దేవుడు అన్నీ చూస్తున్నాడు. త్వరలోనే మళ్లీ కమ్బ్యాక్ ఇస్తానని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.Suryakumar Yadav on his Wrist Injury : "First of all, I'd like to clear the air a little bit. The people talking about a wrist injury are either pure physios or people who don't understand cricket. Because if I really had a wrist injury or such a problem, then the shots I've… pic.twitter.com/cNvibE9e3j— Vipin Tiwari (@Vipintiwari952) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
జాన్వీ కపూర్ చెప్పిన బెస్ట్ వెయిట్ లాస్ టిప్
సాధారణ ప్రజలు నచ్చినవి నచ్చినట్లు తినేస్తుంటారు కానీ సినిమా సెలబ్రిటీలకు ఇలాంటివి కుదరదు. మూవీల్లో చేసే పాత్ర కోసం పక్కా డైట్ మెంటైన్ చేస్తూ బాడీ ఫిట్గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ వెయిట్ లాస్ టిప్ చెప్పింది. 'పెద్ది' చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరో కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ముంబైలో ట్రైలర్ లాంచ్ చేయగా.. రీసెంట్గా భోపాల్లో ఐటమ్ గీతాన్ని ఆవిష్కరించారు. సోమవారం బెంగళూరులోని మరో ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ సర్తో ఓ పాటలో గనక మీరు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తే సగం రోజులోనే బక్కగా అయిపోతారు' అని చెప్పుకొచ్చింది.జాన్వీ ఇలా చెబుతున్నప్పుడు ఎదురుగా కూర్చుని ఉన్న రామ్ చరణ్ సిగ్గు పడిపోతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కొందరిని మాత్రమే ఆకట్టుకుంది. మాస్ మూమెంట్స్ కంటే స్టోరీని చూపించడంతో కొందరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఐటమ్ సాంగ్కి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)Best Weight Loss Tip by #JanhviKapoor:"Try Dancing with #RamCharan...You'll Become Skinny in Half a Day!" 😂🔥#PEDDI pic.twitter.com/Wxg7sTPC5i— Shubh Naam TV (@VaibhavRaj99329) May 25, 2026 -
గ్యాస్ సిలిండర్ల వరుస పేలుళ్లు.. ఒకరు మృతి!
చండీగఢ్: చండీగఢ్లోని బరిల్ ప్రాంతంలో వరుసగా సంభవించిన ఎల్పీజీ సిలిండర్ పేలుళ్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సోమవారం సాయంత్రం ఒక నివాస గృహంలో జరిగిన ఈ వరుస పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.ఇళ్ల గోడలకు పెద్ద ఎత్తున పగుళ్లు ప్రమాదం జరిగిన ఇంటితో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి ఇళ్ల గోడలకు పెద్ద ఎత్తున పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన స్థలంలో సుమారు 10 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ రీఫిల్లింగ్పై అనుమానాలుఈ పేలుళ్లకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, ప్రమాదం జరిగిన ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ గుర్జీత్ కౌర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహంనివాస ప్రాంతాల్లో సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, రీఫిల్లింగ్ చేయడం బరిల్ ఏరియాలో సర్వసాధారణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇరుకైన సందుల్లో ఇలాంటి కార్యకలాపాలు సాగించడం వల్ల అత్యవసర సమయంలో అగ్నిమాపక వాహనాలు కూడా లోపలికి రాలేని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!?
భారతదేశంలో విడాకులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. పైగా చాలా జంటలు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా..సమాజం కోసం లేదా మరే ఇతర కారణాల వల్లనో కొనసాగతుంటారు. ఆ బంధం ఊపిరాడనంతగా చేస్తున్నా బలవంతంగా కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే అలాంటి వివాహ బంధాన్నే భారత కుటుంబ వ్యవస్థ విజయవంతమైన వివాహ బంధంగా పేర్కొనడం విచిత్రం. ఇది నిజంగా ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీశారు నాట్ డేటింగ్ యాప్ సీఈవో. అసలు విజయవంతమైన వివాహ బంధం అంటే అసలే ఏంటి అంటూ సోషల్మీడియా వేదికగా చర్చ లేవదీస్తూ..తన అభిప్రాయన్ని పంచుకున్నారు.ఆయన ఏమన్నారంటే..ఇటీవల కాలంలో అసంతృప్తికరమైన వివాహాలు, భావోద్వేగ అనుకూలత గురించిన సంభాషణలు ఆన్లైన్లో సర్వసాధారణంగా మారాయి. ఆ నేపథ్యంలో నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు సీఈవో జస్వీర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న వివాహంలో కొనసాగడాన్ని విజయవంతమైన వైవాహికి బంధంగా పరగణించాలా అనే ప్రశ్నను లెవనెత్తారు. చాలామంది తమ ఆనందం కోసం కాకుండా సామాజిక అంచనాల కారణంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని వాదించారు. ఈ మేరకు జస్వీర్సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో ఇలా రాశారు. భారత దేశానికి తక్కువ విడాకులు రేట్లు అవసరం లేదు. ఊపిరాడకుండే చేసే వివాహాలు తక్కువగా కావాలన్నారు. భారత్లో విడాకులు రేట్లు తక్కువగా ఉన్నాయనేది గొప్పగా విజయం సాధించనట్లుగా గర్వంగా చెబుతుంటారు. కానీ లక్షలాదిమంది తమ వివాహ బంధంలో మానసికంగా చచ్చిపోయి, బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. వాళ్లంతా ప్రతిరోజూ తమ లోపల చనిపోతున్నారు. అందుకు ఉదాహరణ ట్విషా శర్మ ఉదంతమే. 30 ఏళ్ల వివాహం దాని విజయానికి తప్పనిసరిగా హామీ ఇవ్వదని, ఎందుకంటే కొంతమంది భాగస్వాములు నిజంగా కలిసి జీవించకుండా కేవలం ఒకరినొకరు భరిస్తారని పేర్కొన్నారు. సంతోషంగా లేని ఇద్దరు వ్యక్తులను దశాబ్దాల పాటు కలిసి ఉండమని బలవంతం చేయడం, విడాకుల కన్నా చాలా బాధాకరమైనది. మీరు ప్రతిరోజూ చిక్కుకుపోయినట్లుగా, మానసికంగా అలసిపోయినట్లుగా, ఒంటరిగా, ఊపిరాడనట్లుగా భావిస్తూ నిద్రలేస్తే, వాళ్లు ఒక వివాహాన్ని కాపాడటం లేదు. సమాజ పరువును కాపాడుతున్నారు, అని ఆ సీఈఓ పోస్ట్లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే భారతీయ కుటుంబాలు వివాహం అంటే సర్దుబాటు అని చెప్పి..కొనసాగించాడమే పరవు అని నొక్కి చెబుతుంది. ఆమె లేదా అతడు మానసికంగా లోలోపల కుంగిపోయినా అలా కాపురం చేస్తే..దాన్ని విజయవంతమైన వివాహం అనే చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా భావోద్వేగ బంధనం. ఇక్కడ విడాకులు నిషిద్ధంగా చూడకూడదు. జీవితాంతం దుఃఖంలో మునిగిపోవడమే నిషిద్ధం కావాలి అంటూ పోస్టుని ముగించారు. నెటిజన్లు ఆయన మాటలకు ఏకీభవిస్తూ భారతదేశంలో విడాకులను సాధారణీకరించాలి. మనకు విఫలమైన వ్యాపారాలు ఉన్నట్లే, విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయని అంగీకరించాలి, సాధారణ విషయంగా పరిగణించాలి. అయితే భారతదేశం సంతోషంగా కలిసి జీవించడాని కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుందని అదే అసలైన సమస్య అని పోస్టులు పెట్టారు. కాగా, ఈ చర్య మానసిక ఆరోగ్యం, విడాకులపై మారుతున్న అభిప్రాయాలను హైలెట్ చేసింది.(చదవండి: నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!) -
మరీ ఇంత కుళ్లు పనికిరాదు!.. నీకంటే అతడే బెస్ట్!
పద్నాలుగేళ్ల వయసులోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు దేశీ క్రికెట్లో.. అటు ఐపీఎల్లో సత్తా చాటుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారిన ఈ బిహారీ కుర్రాడు ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.583 పరుగులుఇక ఇటీవలే పదిహేనవ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్లలో కలిపి ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం ఉంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తరఫున లీడ్ రన్స్కోరర్గా ఉన్న వైభవ్.. ఓవరాల్గా టాప్-5లో కొనసాగుతున్నాడు. తన అద్భుత బ్యాటింగ్తో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైభవ్కు రోజురోజుకూ ఆదరణ మరింత పెరుగుతోంది. నిజానికి ప్రస్తుతం రాయల్స్ పోస్టర్ బాయ్గా వైభవ్ అవతరించాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ సూర్యవంశీ పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.వైభవ్ పట్ల రియాన్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్ కోసం వైభవ్ సహా రాయల్స్ జట్టు మొత్తం ముల్లన్పూర్కు పయనమైంది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.సెలబ్రిటీలను కెమెరాలో బంధించే పాపరాజీలు.. రియాన్ పరాగ్ను పిలిచి.. ‘రియాన్ వైభవ్తో ఒక్క ఫొటో కావాలి’ అని అడిగారు. ఇందుకు.. ‘మేమేమీ సినిమా స్టార్లము కాదు’ అని రియాన్ బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.Look at Vaibhav Suryavanshi’s reaction when the paparazzis said to Riyan Parag, “Riyan, Vaibhav ke saath ek photo please,” and Riyan replied, “Hum koi film star nahi hain.” After hearing this, Vaibhav Suryavanshi’s smile disappeared. 👀Later, the paparazzis said to Vaibhav,… pic.twitter.com/sXsyhTGgCb— Sonu (@Cricket_live247) May 26, 2026అందరి రికార్డులూ బద్దలు కొడతాడుదీంతో అప్పటిదాకా చిరునవ్వులు చిందించిన వైభవ్.. కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో ఓ పాపరాజీ.. ‘వైభవ్ ఏ సినీ స్టార్ కంటే కూడా తక్కువ కాదు. అతడు అందరి రికార్డులూ బద్దలు కొడతాడు’’ అని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ నవ్వులు చిందించాడు. ఆ తర్వాత అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరీ అంత కుళ్లు పనికిరాదుఈ నేపథ్యంలో.. ‘‘వైభవ్పై మరీ అంత కుళ్లు పనికిరాదు.. జట్టుకు నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు?.. పిల్లాడిని ఇంతలా అప్సెట్ చేస్తావా? నీ ఇగోకు మూల్యం చెల్లించకతప్పదులే’’ అని నెటిజన్లు రియాన్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా రాజస్తాన్ విజయాల్లో ఆటగాడిగా రియాన్ పాత్ర పెద్దగా లేదు. పైగా ఇటీవల డ్రెసింగ్రూమ్లో చట్టవిరుద్ధంగా ఇ- సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కి రాజస్తాన్ పరువు తీశాడు. ఇందుకు బదులుగా బీసీసీఐ జరిమానాతో సరిపెట్టగా.. రియాన్ ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి: ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్ -
బాంబుల మోత మధ్య ట్రంప్ బిగ్ డిమాండ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ బిగ్ డిమాండ్ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. -
ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బియ్యం, మినప్పుతో పనిలేకుండా క్షణాల్లో దోసె చేసేయండిలా..!
మీరు ఇప్పటివరవకు ప్లెయిన్ దోసె నుంచి చీజ్, పనీర్ దోసల వరకు రుచి చూసి ఉంటారు. కానీ ఉన్నఫలంగా దోసె తినాలనిపించినప్పుడు.. తగిన పిండి, పులియబెట్టడంవంటి ప్రక్రియ ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితిలో దోసను మార్కెట్కు వెళ్లి లేదా ఆర్డర్ చేసి మాత్రమే తినగలం. కానీ పిండి అవసరం లేని ఈ దోస వంటకాన్ని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ మనతో పంచుకున్నారు.ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే? ఈ దోసె తయారీకి బియ్యం, పప్పులు, పిండి పదార్థాలు అవసరం లేదు. దీనికోసం కేవలం పాపడ్, నీళ్లు, నెయ్యి ఉంటే చాలు. పులియబెట్టే ప్రక్రియ లేకుండానే.. నిమిషాల్లో సూపర్ క్రిస్పీ 'పాపడ్ దోసె'ను తయారు చేసుకోవచ్చు. వైరల్ అవుతున్న ఈ రెసిపీతో కమ్మని రుచిని ఆశ్వాదించవచ్చు. క్షణాల్లో మీ ముందుండే ఈ పాపడ్ దోసెను ఎలా తయారు చేయాలో చూద్దాం!కావలసినవి:- పాపడ్- నీరు- నెయ్యితయారుచేసే విధానం:1. ముందుగా పాపడ్ను కత్తెరతో గానీ, చేతితో రెండు భాగాలుగా విరవండి.2. వాటిని నీటిలో వేసి కాసేపు నానబెట్టాలి. దీంతో పాపడ్ పూర్తిగా మెత్తగా అవడంతోపాటు కొద్దిగా జిగురుగా మారుతుంది.3. నానబెట్టిన పాపడ్ను మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయాలి. ఇదే మీ తక్షణ దోసె పిండి.4. ఒక బాణలిని వేడి చేసి, దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి, గరిటెతో పిండిని పోసి దోసెలాగా పలుచగా పరచాలి.5. అవసరమైతే కారం, ఉల్లిపాయలు కలిపి, పైన కొద్దిగా నెయ్యి వేసి దోసెను బాగా కాల్చండి. దీంతో.. కరకరలాడే పాపడ్ దోసె రెడీ. దీనిని చట్నీలో, సాంబార్తో కూడా వేడివేడిగా తినవచ్చు.ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..! -
అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం) -
ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు
రాజ్గిర్: బిహార్లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు భారతదేశ పురాణ ఇతిహాసాలను దౌత్యపరమైన ఆయుధాలుగా మలుచుకుంటూ అంతర్జాతీయ సంబంధాల (ఐఆర్పీఎస్) విభాగంలో సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు.ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలునలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం మన పురాతన జ్ఞాన సంపదను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానించడమే. ఒక సంక్షోభ సమయంలో భారతదేశం తన వ్యూహాలను ఎలా రూపొందించుకోవాలి? అగ్రరాజ్యాల మధ్య సంబంధాలను ఎలా నిర్వహించాలి? వంటి ప్రశ్నలకు పురాతన భారతీయ గ్రంథాలు గొప్ప పరిష్కారాలను చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.రామాయణం - సుగ్రీవ మైత్రి ఒక వ్యూహంఈ కోర్సులో భాగంగా విద్యార్థులు వివిధ పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్నారు. ఉదాహరణకు, ‘రామాయణంలోని కిష్కింధ కాండ’ దౌత్యం, సార్వభౌమాధికారం, నైతికతకు ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ అని ఒక విద్యార్థి తన పరిశోధనలో పేర్కొన్నారు. రాముడు-సుగ్రీవుల మధ్య కుదిరిన మైత్రి కేవలం స్నేహం మాత్రమే కాదు, అది ఆధిపత్యం లేని భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వానికి ప్రతీక అని విద్యార్థులు వివరిస్తున్నారు.మహాభారతం - నేటి ప్రపంచానికి సరికొత్త పాఠాలుమహాభారతంలోని శ్రీకృష్ణుడి నీతిని, ప్రస్తుత యుద్ధ తంత్రాలతో పోల్చి చూస్తున్నారు. ‘జస్ట్ వార్’ భావనను మహాభారత ఘట్టాలతో అనుసంధానిస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఉగ్రవాద సంస్థలు లేదా అరాచక శక్తులను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా పురాతన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల ద్వారా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను కూడా వారు చర్చిస్తున్నారు. ప్రపంచం అశాంతితో ఉన్న తరుణంలో, భారతీయ ఇతిహాసాల నుండి తీసుకున్న ఈ పరిష్కారాలు ప్రపంచ శాంతికి బాటలు వేస్తాయని నలంద విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది.ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు -
నెక్స్ట్ ఫ్లైట్ 6 గంటల తర్వాతా?.. అప్పటివరకు తింటా!
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్ టేబుల్ పైకి ఎక్కి అక్కడ మిగిలి ఉన్న ఆహారాన్ని వీధి కుక్క తింటుండడం కలకలం రేపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాల్సిన చోట పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీఎంఆర్ సంస్థ స్పదించింది. వీధి కుక్కల నియంత్రణకు తాము జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. జనవరి నుంచి 21 వీధి శునకాలను సంబంధిత అధికారులు పట్టున్నట్లు తెలిపారు. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల ముందు ఘన, ద్రవ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాటి నిర్వహణపై నిరంతరం శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. -
గన్నవరం ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: ఎబోలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ పాసింజర్స్కు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో విమానం రాగా, వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్మీడియాలో హైలైట్గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు
నేటి ఆధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని శాసిస్తున్నది ఒక్కటే.. అదే డబ్బు. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలు, అనురాగాలు, ఆప్యాయతలే ప్రాధాన్యతలుగా సాగిన సమాజంలో నేడు ఆర్థిక ప్రయోజనాలు చుట్టుముట్టాయి. ‘ధనమూలం ఇదం జగత్’ అన్న సూక్తి నేటి కాలానికి అక్షరాలా సరిపోతుంది. అయితే, ఈ డబ్బు మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది బంధాలను ముక్కలు చేస్తోందా లేక మరింత బలోపేతం చేస్తోందా? అనే అంశాన్ని చూద్దాం.ధన వ్యామోహం.. బంధాలు చిన్నాభిన్నంనాణేనికి ఒకవైపు చూస్తే.. డబ్బు అనేది అత్యంత బలమైన బంధాలను సైతం ముక్కలు చేయగలదని నిత్యం మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.ఆస్తి తగాదాలు - కుటుంబాల విచ్ఛిన్నం: ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కేవలం గజం భూమి కోసమో లేక కొంత డబ్బు కోసమో కోర్టుల చుట్టూ తిరగడం, ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.డబ్బుతో ముడిపడిన పెళ్లిళ్లు: నేటి రోజుల్లో కొన్ని పెళ్లిళ్లు రెండు మనసుల కలయిక కంటే, రెండు కుటుంబాల ఆర్థిక హోదాల బేరసారాలుగా మారిపోతున్నాయి. వరకట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య ఆర్థిక అసమానతల వల్ల విడాకుల రేటు గణనీయంగా పెరుగుతోంది.వృద్ధాప్యంలో ఒంటరితనం: తల్లిదండ్రులు ఎంతో శ్రమించి పిల్లలను ప్రయోజకులను చేస్తే వారు సంపాదన ధ్యాసలో పడి వృద్ధులైన కన్నవారిని అనాథాశ్రమాల్లో వదిలేస్తున్న హృదయవిదారక సంఘటనలు సమాజంలో పెరిగిపోతున్నాయి. ఇక్కడ బంధాల కంటే డబ్బు సంపాదనకే ప్రాధాన్యత పెరిగింది.డబ్బు మనుషులను దగ్గర చేయాల్సింది పోయి.. అహంకారాన్ని పెంచి, ఆత్మీయులకు దూరం చేస్తోంది. మనిషి కంటే బ్యాంకు బ్యాలెన్స్కే విలువ ఇచ్చే సంస్కృతి పెచ్చరిల్లుతోంది.డబ్బు మరో రూపండబ్బు ఎప్పుడూ కీడే చేయదు. నాణేనికి మరోవైపు చూస్తే.. డబ్బు మానవ సంబంధాలను నిలబెట్టడానికి, సమాజంలో ఆనందాన్ని నింపడానికి ఒక గొప్ప సాధనంగా మారుతోంది.కష్టకాలంలో ఆపన్నహస్తం: కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు సమయానికి చేతిలో డబ్బు ఉండటం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం. ఆ సమయంలో ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తులు జీవితాంతం గుండెల్లో నిలిచిపోతారు.పిల్లల భవిష్యత్తుకు పునాది: తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుతో పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించడం వల్ల ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతోంది. ఇది కుటుంబాల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.సేవా దృక్పథం: సమాజంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, దాతలు తాము సంపాదించిన సొమ్మును విరాళాలుగా ఇస్తూ.. అనాథలను, పేద విద్యార్థులను ఆదుకుంటున్నారు.బంధాలను నిలుపుకుంటూ.. డబ్బును సమర్థంగా నిర్వహించడం ఎలా?డబ్బు అనేది జీవితాన్ని నడిపించే ఇంధనమే కానీ అదే జీవితం కాకూడదు. డబ్బు వల్ల బంధాలు పాడవకుండా ఉండాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఆర్థిక పారదర్శకత: భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక విషయాల్లో దాపరికం ఉండకూడదు. సంపాదన, ఖర్చులు, అప్పుల గురించి స్పష్టంగా మాట్లాడుకోవడం వల్ల అనవసరమైన అనుమానాలు, గొడవలు రావు.పరిమితులు విధించుకోవడం: స్నేహితులు లేదా బంధువులతో ఆర్థిక లావాదేవీలు (అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం) జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు సహాయం చేయాలో అంతే చేయాలి. ఒకవేళ ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా బంధం చెడిపోకూడదు అనుకుంటేనే ఆ సాయం చేయాలి.సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం: పిల్లలకు, కుటుంబ సభ్యులకు కేవలం డబ్బు, విలాసవంతమైన వస్తువులు ఇస్తే సరిపోదు. వారితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే, డబ్బుతో వస్తువులను కొనగలం కానీ ప్రేమను, ఆప్యాయతను కొనలేం.ఆశకు, అత్యాశకు మధ్య తేడా గుర్తించడం: లగ్జరీ జీవితం కోసం బంధుత్వాలను, స్నేహాలను పణంగా పెట్టకూడదు. తృప్తి లేని సంపాదన మనిషిని ఒంటరిని చేస్తుంది.డబ్బు అనేది ఒక మంచి సేవకుడిగా ఉండాలి కానీ, అత్యంత ప్రమాదకరమైన యజమానిగా మారకూడదు. దాన్ని మన జీవితాన్ని, బంధాలను శాసించే స్థాయికి రానివ్వకూడదు. డబ్బు కోల్పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి విడిపోయిన బంధాలను, దూరమైన మనసులను ఎంత డబ్బు పెట్టినా తిరిగి తీసుకురాలేం.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ఏడు వికెట్ల తేడాతో భారత్ జయభేరి
చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఈసీబీ డెవలప్మెంట్ ఉమెన్ ఎలెవన్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఈసీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఫ్లోరెన్స్ మిల్లర్ (48; 7 ఫోర్లు), జోన్ గార్డ్నర్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), సోఫియా స్మేల్ (27; 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 17వ ఓవర్ రెండో బంతికి భారత్ 155 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా...మరింత ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్ను 20 ఓవర్ల వరకు కొనసాగించారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 50 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... భారతి ఫుల్మలి (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు), యస్తిక భాటియా (35 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఈ నెల 28, 30 తేదీల్లో చెమ్స్ఫోర్డ్, బ్రిస్టల్లలో తొలి రెండు టీ20లు జరగనుండగా... జూన్ 2న టాంటన్లో చివరి టి20 నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్లో భారత బృందం బరిలోకి దిగుతుంది. చదవండి: నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం -
'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం
'ధురంధర్' రెండు సినిమాలతో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన హీరో రణ్వీర్ సింగ్పై నిషేధం. బాలీవుడ్లో ఇకపై ఇతడు సినిమాలు చేయడం కష్టమే అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం 'డాన్ 3' అనే మూవీ. సడన్గా తప్పుకోవడంతో ఆ చిత్ర దర్శకనిర్మాత.. రణ్వీర్పై ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. మరి ఈ నిషేధం వల్ల రణ్వీర్కి నష్టమేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) హిందీ హీరోల్లో రణ్వీర్ సింగ్ పేరున్న హీరోనే. పద్మావత్, రామ్ లీల్ లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఇతడికి గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేది లేదు. సరిగ్గా ఈ టైంలో 'ధురంధర్' మూవీస్ సక్సెస్ కావడం ఇతడి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రాల్లో నటించడానికి ముందే 'డాన్ 3' అనే ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాడు.2023 ఆగస్టులోనే 'డాన్ 3'కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు అని అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. 'ధురంధర్' రావడానికి ముందు కూడా ఫర్హాన్, రణ్వీర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ వినిపించింది. తర్వాత కొన్నాళ్లకు రణ్వీర్ ఈ మూవీ నుంచి తప్పుకొన్నాడు. అయిత షూటింగ్ మొదలవడానికి కొన్నివారాల ముందు ఇలా చేయడంతో తమకు రూ.40-45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE)ని ఆశ్రయించాడు.ఈ క్రమంలోనే సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. రణ్వీర్ సింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాదు. కాకపోతే ఈ ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్లు, ఇతర సినీ ఉద్యోగులు రణవీర్ సింగ్తో కలిసి పని చేయడానికి కుదరదు. బాలీవుడ్ చాలావరకు ఈ వర్గాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల, ఇది సదరు హీరో భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ తరఫు ప్రతినిధి మాత్రం పబ్లిక్గా దీని గురించి స్పందించడం ఇష్టం లేదని.. వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని రణవీర్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనంతటికి 'ధురంధర్' సక్సెస్ కారణమా అని సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయినా సరే బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకనిర్మాతలు కనీసం స్పందించలేదు. బహుశా ఈ కారణంతోనే రణ్వీర్పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం) -
తోపుదుర్తి సోదరుడి అక్రమ అరెస్ట్
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో రైల్వే పీఎస్ నుంచి అనంతపురం రూరల్ పీఎస్కు కేసును బదిలీ చేశారు. తోపుదుర్తి రాజాపై 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.తోపుదుర్తి రాజాకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన్ని కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి ఇటీవల గన్మెన్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆయన సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి ప్రోద్భలంతోనే మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తోపుదుర్తి రాజాను ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. -
రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి
అది అడవుల మధ్య దాగి ఉన్న ఓ మారుమూల గిరిజన గ్రామం. నక్సలిజం ప్రభావం కారణంగా చాలాకాలం అభివృద్ధి పనులకు నోచుకోలేకపోయింది. పదేళ్ల కిందట ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. “నక్సల్ సమస్య తుడిచేశాం” అని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాక ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడవ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఓ పని చేశారు. దశాబ్దాల నుంచి గుంతల దారే దిక్కుగా మిగిలిన ఆ గ్రామం.. ఇప్పుడు అసాధారణ విజ్ఞప్తితో వార్తల్లోకి ఎక్కింది.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మారుకి గ్రామం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వెళ్లింది. “ అయ్యా.. రోడ్లు నిర్మించలేకపోతే కనీసం హెలికాప్టర్లు అయినా పంపండి” అంటూ కాస్త వెటకారంగానే అక్కడి వాస్తవ దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. ఆ లేఖ ఎలాగోలా సోషల్ మీడియాకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతం నడుమ బస్తర్ ప్రాంతానికి సమీపంగా ఉండే మారుకి గ్రామం.. కొండలు, వాగులు, గాఢమైన అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడి గ్రామాలు పెద్దగా ఉండవు. కొన్ని వందల మంది మాత్రమే నివసించే చిన్న గిరిజన గూడేలు మాత్రమే కనిపిస్తాయి. గోండ్, మరియా వంటి ఆదివాసీ సముదాయాలకు చెందిన ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రహదారి అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అయితే మారుకి గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి గత ఏళ్లు గడుస్తున్న మారలేదు. దశాబ్దం కిందట.. బ్రిడ్జిలు, కల్వర్టులు వంటి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అవి మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాలు చేసిన గుంతలు అలాగే వదిలేయడం వల్ల మార్గం పూర్తిగా ధ్వంసమై, రాళ్లు, మట్టి, గుంతలతో నిండిపోయిన ప్రమాదకర దారిగా మారింది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారి గ్రామం బయట ప్రపంచానికి పూర్తిగా తెగిపోతుంది. చిన్న వర్షానికే రహదారి జారిపోవడం లేదంటే వాగులు పొంగిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యమవుతుంది.ఈ దారుణ పరిస్థితుల్లో గర్భిణీలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని కూడా కొయ్య మంచాలపై కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో నిత్యకృత్యంగా మారింది. అంబులెన్స్లు గ్రామం లోపలికి రాలేకపోవడంతో ముందుగా అడవిలో కాలినడక, తర్వాత ప్రధాన రహదారికి చేరుకుని అక్కడి నుంచి మాత్రమే ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఆలస్యాల కారణంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్తో పాటు స్థానికులు చెబుతున్నదేమిటంటే.. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా అధికారులు మొదలుకొని ఉన్నతస్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని. ప్రతి సారి హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఈ పరిస్థితికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. భౌగోళికంగా అత్యంత కఠినమైన అటవీ ప్రాంతం కావడం, గతంలో నక్సలిజం ప్రభావం ఉండటం, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వంటి కారణాలతో రహదారి నిర్మాణం ఆలస్యమైందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల సుక్మా ప్రాంతంలో నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రహదారి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని, మిగిలిన రహదారి భాగాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ఐదారు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు చేసిన చివరి ప్రయత్నం.. “రోడ్లు ఇవ్వలేకపోతే హెలికాప్టర్లు అయినా ఇవ్వండి” ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. -
నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!
జీవితం చాలా పరీక్షలు పెడుతుంది. ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటుంది. నిరాశతో నిండిపోయి ఉంటాం. అయినాసరే లేచి నిలబడి.. ఓటమికి తలవంచక పోరాడితే..ఎవరో ఒకరి రూపంలో సాయం అందుతుంది అనేందుకు ఈ ఘటన ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వన్-డే స్పోర్ట్స్ ఈవెంట్ అయిన ఐరన్మ్యాన్ ఎండ్యూరెన్స్ పోటీకి సన్నద్ధమువుతున్నాడు మాజీ నావికా ఇంజనీర్ విన్సెంజో గరోఫాలో. ఆ నేపథ్యంలోనే సైకిల్ రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా అతడి కృత్రిమ కాలు బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోతుంది. అతడు వెంటనే సైకిల్పై నుంచి దిగి బ్యాలెన్స్ చేసుకుని సైకిల్ ఒక పక్క వద్ద పెడుతుండగా..ఇంతలో ఒక వ్యక్తి పరుగుపరుగున వచ్చి అతడి కృత్రిమ కాలుని ఇవ్వడమే గాక అతడి సైకిల్ని ఒక పక్కకు పెట్టి అతడి కాలుకి ఆ కృత్రికాలుని అమర్చడంలో సాయం అందించాడు. ఆ అపరిచిత వ్యక్తి దయకు విన్సెంజో గరోఫాలో కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పరిగెత్తుకుంటూ వచ్చి తక్షణమే సాయం చేసిన ఆ పెద్దమనిషికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్స్టాగ్రామ్లో షేర్ చశాడు. చివరగా విన్సెంజో గరోఫాలో జీవితం నా పట్ల చాలా కఠినంగా ఉంది. తనను లెక్కలేనన్ని సార్లు కిందపడేలా చేసింది. కానీ అది నన్ను ఆపలేకపోయింది. ఈ ప్రపంచాన్ని భిన్నంగా చూడటం నేర్పించింది. చిన్న చిన్న విషయాలను, ప్రయత్నాలను ఎవరు చూడని అదృశ్య పోరాటాలను అభినందించడం నేర్పింది అని భావోద్వేగంగా చెప్పాడు. అయితే ఏం జరిగినా ఎప్పటికీ గివ్అప్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానన అన్నాడు. View this post on Instagram A post shared by Malta Daily (@maltadaily.mt) (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 24,023 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు నష్టపోయి 76,451 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం పెరిగింది.నాస్డాక్ 0.19 శాతం పుంజుకుంది.Today Nifty position 26-05-2026(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Uttar Pradesh: బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిల్లీ నుంచి బీహార్ వైపు వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు వేగంగా వెళ్తుండగా..ఈ ప్రమాదం ఉన్నావ్ పరిధిలోని అరస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, ఎక్స్ప్రెస్వేపై 262వ కిలోమీటర్ మైలురాయి వద్ద చోటుచేసుకుంది. బస్సు వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేశాయి. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.బాధితుల్లో పోలీసు అధికారి, ఖైదీఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక సబ్ఇన్స్పెక్టర్, ఒక ఖైదీ ఉన్నట్లు అరస్ ఎస్.ఓ సంజీవ్ కుశ్వాహా తెలిపారు. మృతుడైన సబ్-ఇన్స్పెక్టర్ను రామచంద్రగా గుర్తించారు. ఆయన తన విధి నిర్వహణలో భాగంగా ఖైదీ ఛత్రపాల్ను సివాన్ నుంచి డిల్లీకి తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలింపుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన వైద్యం కోసం లక్నోలోని ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. కాగా మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. -
విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్
ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20లు)కు లంక జట్టు కొత్త కెప్టెన్గా కుశాల్ మెండిస్ను నియమిస్తూ లంక బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వన్డేలకు కెప్టెన్గా ఉన్న షనక, టీ20లకు కెప్టెన్గా వ్యవహరించిన చరిత్ అసలంకలను ఆ పదవి నుంచి తప్పించి రెండు ఫార్మాట్లలోనూ కుశాల్ మెండిస్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టెస్టు జట్టును మాత్రం ధనుంజయ డిసిల్వానే నడిపించ నున్నాడు. పనిలో పనిగా వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు 16 మందితో, టెస్టు సిరీస్కు 17 మందితో కూడిన జట్లను ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయినప్పటికీ షనక, చరిత్ అసలంకలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కమిందు మెండిస్ కుశాల్కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. గాయంతో టీ20 ప్రపంచకప్కు దూరమైన లంక ఆల్రౌండర్ వనిందు హసరంగ విండీస్తో సిరీస్కు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచకప్కు భారత్తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన శ్రీలంక టోర్నీలో సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. చచ్చీ చెడీ సూపర్-8కు చేరుకున్నప్పటికీ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ దారుణ పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్లను మార్చేందుకు లంక క్రికెట్ బోర్డు మొగ్గుచూపింది.శ్రీలంక టూర్ ఆఫ్ వెస్టిండీస్:జూన్ 3: మొదటి వన్డే, జమైకాజూన్ 6: రెండో వన్డే, జమైకాజూన్ 8: మూడో వన్డే, జమైకాజూన్ 11: తొలి టీ20, జమైకాజూన్ 13: రెండో టీ20, జమైకాజూన్ 14: మూడో టీ20, జమైకాజూన్ 25 నుంచి 29 వరకు: మొదటి టెస్టు, అంటిగ్వాజూలై 3 నుంచి 7 వరకు: రెండో టెస్టు, అంటిగ్వావిండీస్తో సిరీస్కు శ్రీలంక జట్టు:వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, మిలన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మదుషన్.టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, లసిత్ క్రూస్పుల్లే, దాసున్ షనక, మిలన్ రత్నాయకే, దునిత్ వెల్లలగే, వనీందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుషంక,ఇషాన్ మలింగ, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార.టెస్టు జట్టు: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, పాతుమ్ నిస్సంక, లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, కుసాల్ మెండిస్, మిలన్ రత్నాయకే, ప్రబాత్ జయసూర్య, రమేశ్మెండిస్, అసితా ఫెర్నాండో, విశ్వా ఫెర్నాండో, లాహిరు కుమారా, ఇసితా విజ్వేసుందర, కాసున్ రజిత.Sri Lanka Tour of West Indies 2026🏏Sri Lanka Cricket’s Selection Panel has selected the following squads for Sri Lanka’s Tour of the West Indies 2026.The tour will feature matches across all three formats - ODI, T20I, and Test cricket.The tour will begin with the ODI series,… pic.twitter.com/rnZYZZHm0S— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
గబ్బర్ సింగ్ పారిపోయావా..!
భానుడి భగభగలు, కార్మికుల నిరసనల మధ్య ప్రయాణం ఎందుకనుకున్నారో ఏమో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తన పర్యటనను సూర్యుడు రాక ముందే ప్రారంభించి చకచకా పూర్తి చేసుకున్నారు. సోమవారం గోదావరి పుష్కర పనుల పరిశీలనలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకు పుష్కరఘాట్ వద్దకు చేరుకుని బోట్లో అధికారులతో కలిసి కోటిలింగాల రేవు వద్దకు చేరుకున్నారు.బోట్లోనే అధికారులు ఆయనకు గోదావరి పుష్కర పనుల గురించి వివరించారు. పేపరుమిల్లు వల్ల జరుగుతున్న నదీ కాలుష్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనదైన స్టైల్లో బోట్లో స్టిల్స్ ఇచ్చి కార్యక్రమాన్ని గంటన్నరలో పూర్తి చేశారు. కోటిలింగాల రేవు వద్ద నుంచి కొద్ది దూరంలో ఉన్న నల్లకాలువ మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం కూడా కొన్ని నిమిషాలలో ముగిసిపోవడం విశేషం. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్మికుల ధర్నా రెల్లి జాతి ఇష్టమని చెప్పి కార్మికులను చూసి పారిపోతావా? అంటూ మున్సిపల్ కార్మికులు తమ నిరసనను తెలియచేశారు. కాకినాడ ఎన్నికల సభలో రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ తమను చూసి పారిపోయారని రెల్లి కార్మికులు ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి పవన్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి ‘మేము ఆయనను కలవనిస్తాం. మీరు జెండాలు తీసివేయాల’ని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించారు. మూడు గంటలపాటు అక్కడే నిరీక్షించగా పవన్కల్యాణ్ బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు. కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చుని ఆందోళన చేశారు. సుమారు గంటపాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ‘గబ్బర్ సింగ్ పారిపోయావా, మా గోడు వినవా, మున్సిపల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం అదనపు కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాల్లో పని చేయగలమా అని నిలదీశారు. ఆప్కాస్ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరారు. చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం రూ.9,000కు పని చేస్తున్నారని ఇప్పుడున్న ధరలతో ఆ వేతనంతో కుటుంబం జీవించగలదా అని ప్రశ్నించారు. రిక్షా కార్మికులను ఆప్కాస్లో కలిపి రూ.21 వేలు జీతం ఇవ్వాలన్నారు. లేకుంటే పుష్కరాల కంటే ముందుగానే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఒక్క రోజు ముందే ఘాట్ల శుభ్రంపవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు ఒక్క రోజు ముందు గోదావరి ఘాట్లలో ఉన్న చెత్త, చెదారాలను శుభ్రం చేశారు. ఘాట్ల వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించారు. నల్లా చానల్ వద్ద ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఘాట్ల వద్ద చెత్త, చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వెయ్యకుండా మున్సిపల్ సిబ్బందిని కాపలాగా పెట్టారు. అయినా గోదావరి నదీ కాలుష్యాన్ని చూసిన పవన్ కల్యాణ్ ఆ«శ్చర్యపోయారు. ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా నీటిలో కలుస్తున్నాయో తెలుసుకుని నదీ జలాల్లో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): -
ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?
సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే ఫ్రూట్.. జామ (Guava). ఇందులో విటమిన్ సీ తోపాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణంగా మార్కెట్లలో మనకు తరచుగా రెండు రకాల జామకాయలు కనిపిస్తుంటాయి. ఒక రకానికి చెందినవి తెల్లగా ఉంటే, మరొకటి ఎర్రగా ఉంటుంది. ఈ తెల్ల జామ, ఎర్ర జామలు రెండూ పోషకాలతో నిండి ఉన్నప్పటికీ టేస్ట్, న్యూట్రిషన్ వాల్యూ, హెల్త్ బెనిఫిట్స్లో కాస్త విభిన్నంగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ మాటల్లో తెలుసుకుందామా.!.ఎర్ర జామ, తెల్ల జామ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఎర్ర జామలో నీటి శాతం ఎక్కువ, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. తెల్ల జామలో విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. మధుమేహం (షుగర్) ఉన్నవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర జామ కొంత మేలు చేస్తుంది. రెండింటిని పోల్చి చూస్తే..తెల్ల జామకాయతెల్ల జామ ఎక్కువ తియ్యగా, రుచిగా ఉంటుంది. దీంట్లో షుగర్, స్టార్చ్, గింజల పరిమాణం అధికంగా ఉంటుంది. ఈ తెల్ల జామలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తెల్ల జామను తింటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజేషన్ మెరుగై బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మహిళలకు తెల్ల జామతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ కణాలకు హైడ్రేషన్ని పెంచి తాజాగా ఉండేలా చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి ఈ వ్యాధి ముప్పుని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్త పరంగా తెల్లజామకాయ బెస్ట్ అని చెబుతున్నారు ఆదర్శ గౌడ. డయాబెటిస్ పేషెంట్లకు ఎర్రజామ మేలు..ఎర్ర జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తెల్ల జామతో పోలిస్తే షుగర్, స్టార్చ్, విటమిన్ C కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ ఎర్రజామలో గింజలు అంత ఎక్కువగా ఉండవు. లైకోపీన్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, కెరోటినాయిడ్ల కారణంగా దీనిలోని గుజ్జుకి ఎరుపు రంగు వస్తుంది. ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉండటంతో గుండెకు రక్షణగా నిలుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ A, ఒమేగా-3, ఒమేగా- 6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్తో నిండి ఉండటంతో డైజేషన్ మెరుగై వెయిట్ మేనేజ్మెంట్కు తోడ్పడుతుంది. ఇందులో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది.అయితే రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకుంటుంటే జామకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామ తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు ఆదర్శ గౌడ .(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?) -
బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ(మే 28) సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా బకరా మండీలలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన రవాణా ఖర్చులు, భారంగా మారిన మేత ధరలు, పండుగ గిరాకీ కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మేకల ధరలు 20 శాతం నుండి 40 శాతం వరకు పెరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ విపరీతంగా ఉండగా, ప్రత్యేక జాతి మేకల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా కొందరు వెనుకాడటం లేదు.ధరల పెరుగుదలకు అసలు కారణాలుప్రధాన నగరాల్లోని బకరా మండీలలో ధరలు భారీగా పెరగడానికి పలు కారణాలున్నాయి. పశువుల రవాణాకు అయ్యే ఖర్చులు, డీజిల్ ధరలు, పశుగ్రాసం ఖర్చులు విపరీతంగా పెరగడం వ్యాపారులపై భారాన్ని పెంచింది. వీటితో పాటు పండుగ సమయంలో పెరిగిన డిమాండ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రత్యేక జాతి మేకలపై పెరిగిన క్రేజ్ కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. మే 28న జరగనున్న బక్రీద్ కోసం మేకల కొనుగోలుదారులు మార్కెట్ల ముందు బారులు తీరుతున్నారు.మేకల కేటగిరీలు.. ధరలుసాధారణంగా 20-25 కిలోల బరువుండే చిన్న రకం మేకలు 11,000 నుండి 25,000 రూపాయల మధ్య లభిస్తున్నాయి. మధ్య తరహా (30-50 కిలోలు) మేకలకు 20,000 నుండి 50,000 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే సోజాత్, బీతల్ వంటి ప్రీమియం జాతులు మాత్రం 55,000 నుండి లక్ష రూపాయల పైన ధరలు పలుకుతున్నాయి. ప్రత్యేక రకపు జాతికి చెందిన భారీ బరువుండే మేకలు ఏకంగా 1.5 లక్షల నుండి 3.5 లక్షల రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి.కొనుగోలుదారులకు సూచనలుపండుగ వేళ మేకల కొనుగోలులో మోసపోకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారులు మొదట చెప్పే ధరలలో 20 శాతం నుండి 30 శాతం వరకు బేరమాడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వీలైతే ‘లైవ్ వెయిట్’ (బరువుకు తగిన ధర) పద్ధతిలో మేకలను ఎంచుకోవడం మంచిది. అలాగే, ఖుర్బానీ కోసం కొనే పశువులకు సంబంధించిన టీకా రికార్డులను, వాటి ఆరోగ్య పరిస్థితిని పశువైద్యుల సహాయంతో లేదా అనుభవజ్ఞుల ద్వారా సరిచూసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినవాడే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు. గతంలో ఈయన చేసిన చిత్రాలు కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన అన్న కొడుకు, హీరో నిరంజన్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ సుధీంద్ర.. 2018లో వచ్చిన 'సెకండాఫ్' మూవీతో నటుడిగా పరిచయమయ్యాడు. 2022లో రిలీజైన 'నమ్మ హుడుగురు' మూవీలోనూ నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'సీతా పయనం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహించగా ఇతడి కూతురు ఐశ్వర్య హీరోయిన్గా చేసింది. భాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.నటుడు నిరంజన్ సుధీంద్ర.. డాక్టర్ సంజనా రాజ్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరైన ఉపేంద్ర.. కాబోయే వధూవరులని మనసారా దీవించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపేంద్ర సతీమణి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం చాలా బెటర్: టాలీవుడ్ హీరోయిన్) -
ట్రంప్ పోస్ట్ బాంబ్.. పాక్ ప్రధానికి ఘోర అవమానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అబ్రహం అకార్డ్స్ విస్తరణపై మాట్లాడిన ట్రంప్.. తన సోషల్ మీడియా సందేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించలేదు. బదులుగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను పేర్కొనడం ఇస్లామాబాద్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అబ్రహం అకార్డ్స్ విస్తరణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త ఒత్తిడిని సృష్టించాయి. ఇజ్రాయెల్తో సంబంధాలను విస్తరించే ప్రయత్నంలో పాకిస్తాన్ పేరు కూడా చర్చలోకి రావడం ఇస్లామాబాద్కు అత్యంత సున్నితమైన పరిణామంగా మారింది. ఇజ్రాయెల్ను గుర్తించే అంశం దేశంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రభుత్వానికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతను తెచ్చాయి. ఆయన తన పోస్టులో సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల నాయకులను ప్రస్తావించినప్పటికీ.. పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ను పక్కన పెట్టి అసిమ్ మునీర్ను మాత్రమే పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజకీయ నిర్మాణంలో సైనిక వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యంపై అంతర్జాతీయ దృష్టిని మరింత బలపరిచినట్టుగా కనిపిస్తోంది.మిగిలిన దేశాల నాయకులను వారి రాజ్యాంగ పదవుల ద్వారా గుర్తించగా, పాకిస్తాన్ను మాత్రం దాని సైనిక అధిపతి ద్వారా గుర్తించారు. అక్కడ షరీఫ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతర్జాతీయ సంప్రదాయానికి భిన్నంగా.. ఈసారి ట్రంప్ చేసిన ఎంపిక పాకిస్తాన్లో అధికార కేంద్రం ఎక్కడ ఉందన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో విదేశాంగ విధానాలు, భద్రతా నిర్ణయాల్లో సైన్యం ప్రభావం పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రస్తావన ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల్లో సైన్యం ప్రభావమే ఎక్కువగా ఉందన్న పాత చర్చను ఇది మళ్లీ వేడెక్కించింది.ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ అవగాహన లోపం కాదని.. దేశంలో సివిలియన్ ప్రభుత్వం కంటే సైనిక వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అబ్రహం అకార్డ్స్ అంశం పాకిస్తాన్కు మరో దౌత్యపరమైన చిక్కును తెచ్చిపెట్టింది. ఒకవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం, మరోవైపు దేశంలో ఉన్న తీవ్ర భావోద్వేగ రాజకీయ వాతావరణం మధ్య ఇస్లామాబాద్ సున్నితమైన సమతుల్యతను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ఒత్తిడుల మధ్య ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయ స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. -
వార్త రాస్తే నోటీసులా?
అనకాపల్లి జిల్లా: హోంమంత్రి నియోజకవర్గంలో ఎన్ని ఘోరాలు జరిగినా చేతులు ముడుచుకుని కూర్చోవాలన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వార్తలు రాసే విలేకర్లకు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. దీనికి ఉదాహరణ ఈ నెల 20వ తేదీన పాయకరావుపేట కంటోన్మెంట్ ఏరియాలో దళిత మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేరోజు లీడర్ పత్రికలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు వార్త ప్రచురితమైంది. ఈ వార్త రాసిన పాయకరావుపేట విలేకరి బి.రమేష్ బాబుకు పోలీసులు బిఎన్ఎన్ చట్టం 179కింద పాయకరావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసరు పేరుతో నోటీసు ఇచ్చారు. ఈనెల 26వ తేదీన స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. బాధితులు తెలిపిన వివరాలు, తమకు అందిన సమాచారం మేరకు వార్త రాస్తే జరిగిన ఘటనపై మీకు అవగాహన ఉందని స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లైంగిక దాడిని సెల్ఫోన్ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కేసు సెక్షన్లు వేసి నిందితులు ఇద్దరిని ఆదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బాలికపై జరిగింది లైంగికదాడి కాదని సెల్ఫోన్ వివాదమని..దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మరుసటిరోజు నర్సిపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వివరణ ఇచ్చినప్పటికీ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ శంకర్రావు కూడా ఫిర్యాదు అందింది, పోక్సో కేసు కాబట్టి గోప్యత పాటిస్తున్నాం అని తెలిపారు. పోలీసులే పోక్సో కేసు వర్తిస్తుందంటూ కేసు నమోదు చేసినప్పుడు వార్త రాసిన విలేకరికి నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్న వాదన వినిపిస్తోంది. హోం మంత్రి నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో మంత్రి మెప్పుకోసమే ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి అనిత కూడా ఇటీవల దళిత బాలికపై జరిగింది అత్యాచారం కాదంటూ చెప్పడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తెను నిందితులు కొబ్బరితోటలోకి తీసుకెళ్లి కొట్టడంతో పాటు, లైంగిక దాడికి పాల్పడ్డారని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయంటూ బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది. మంత్రి నియోజకవర్గంలో భవిష్యత్లో ఎటువంటి వ్యతిరేక వార్తలు రాయకూడదన్న బెదిరింపు ధోరణితోనే విలేకరికి పోలీసులు నోటీసులు ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
కర్ణాటక పవర్ గేమ్లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్!
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీ చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సీఎం మార్పు ఊహాగానాల నడుమ.. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.ఈ భేటీ ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్ దిశ, పరిపాలనా మార్పులు.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “పాలిటికల్ రీసెట్”పై కేంద్రంగా సాగనుందని సమాచారం. ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడం, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలు కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం మూడు ఆప్షన్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది.. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించడం. అంటే నాయకత్వ మార్పు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఆప్షన్గా ఉంది. ఇందులో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తొలగించి, సామాజిక సమతుల్యత (అహిందా ఫార్ములా.. మైనారిటీలు+వెనుకబడిన వర్గాలు+దళితులు) ఆధారంగా కొత్త సమీకరణాలు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది.రెండో ఆప్షన్గా.. నాయకత్వ మార్పు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి తీసుకురావడం. అదే సమయంలో సీనియర్ నేత హోదాలో సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించడం. అయితే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మూడో ఆప్షన్.. దీనికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే జరిగితే.. నిజంగా కర్ణాటక రాజకీయాలకు పెద్ద సర్ప్రైజే. అదే మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్రలో తీసుకురావడం. అంటే ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను.. “వైల్డ్ కార్డ్” ఎంట్రీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి సీఎంను చేయడం. ఇది జరిగితే రాష్ట్రంతో పాటు జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరు వర్గాలను చల్లబర్చే ఈ ఆప్షన్ కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పై మూడు ఆప్షన్లలో ఏది అమలు చేసినా.. అది కర్ణాటక రాజకీయాల వరకు సంచలనమే కానుంది.పార్టీ లోపల వర్గపోరు, నాయకత్వ ఆశలు, సామాజిక సమీకరణాలు.. వెరసి ఢిల్లీలో ఇవాళ్టి కర్ణాటక కాంగ్రెస్ నేతల కీలక భేటీని అత్యంత కీలకంగా మార్చాయి. మరోవైపు.. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో, టికెట్ల పంపకం గురించీ చర్చించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్చలు కర్ణాటకలో కేవలం పాలన మార్పుల గురించి కాకుండా.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కృత్రిమ మేధో ప్రవాహం.. ఉపాధికి శరాఘాతం!
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా మానవీయ విలువలను విస్మరిస్తే సమాజ సమతుల్యత దెబ్బతింటుందని వాటికన్ వేదికగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మే 25న వాటికన్ ఆడిటోరియంలో పోప్ లియో చారిత్రాత్మక ఎన్సైక్లికల్ (పోప్ అధికారిక పత్రం) ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టోఫ్ ఓలా పాల్గొని ఏఐ వల్ల భవిష్యత్తులో సంభవించబోయే ఉద్యోగ నష్టాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పోప్ పక్కనే కూర్చున్న క్రిస్టోఫ్ ఓలా ఏఐ విస్తరణ వల్ల మానవ శ్రమకు పొంచి ఉన్న ముప్పును స్పష్టంగా వివరించారు.భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకంప్యూటర్ కోడింగ్, కంటెంట్ రైటింగ్, డేటా అనలిటిక్స్, రోజువారీ ఆఫీస్ పనులను క్షణాల్లో పూర్తి చేయగల సరికొత్త ఏఐ సాధనాలను కంపెనీలు మార్కెట్లోకి వదులుతున్న తరుణంలో ఓలా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఏఐ సాంకేతికత మానవ శ్రమను భారీగా భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఉపాధి కోల్పోయి వీధిన పడే లక్షలాది మందికి సామాజిక, ఆర్థిక మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాల చారిత్రక, నైతిక బాధ్యత అవుతుంది’ అన్నారు. సమాజాలు, ప్రభుత్వాలు ఊహించిన దానికంటే అత్యంత వేగంగా ఏఐ ఉపాధి రంగాలను పునర్నిర్మిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మాగ్నిఫికా హ్యుమానిటాస్పోప్ లియో విడుదల చేసిన ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ ఎన్సైక్లికల్ పూర్తిగా కృత్రిమ మేధస్సు యుగంలో మానవాళి ఉనికిని, హక్కులను రక్షించడంపైనే దృష్టి సారించింది. అదుపు లేని, వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి వల్లే ప్రస్తుత ఆధునిక సంక్షోభాలు మరింత తీవ్రమవుతున్నాయని ఈ పత్రంలో పోప్ హెచ్చరించారు.ఎన్సైక్లికల్లోని ముఖ్యమైన అంశాలులగ్జరీగా మారిన ఏఐ కంపెనీలపై ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణను కలిగి ఉండాలి.డిజిటల్ ప్రపంచంలో కేవలం కొన్ని సంస్థల చేతుల్లోనే అధికారం ఏకీకృతం కావడం సమాజానికి శ్రేయస్కరం కాదు.ఏఐ అనేది కేవలం సాంకేతిక ఆవిష్కరణ లేదా వ్యాపార సమస్య కాదు, అది నేరుగా మానవ జీవితాలను ప్రభావితం చేసే నైతిక అంశం.ఒత్తిడిలో ఏఐ సంస్థలుప్రస్తుతం ఫ్రాంటీర్ ఏఐ ల్యాబ్లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను కూడా క్రిస్టోఫ్ ఓలా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తీవ్రమైన వ్యాపార పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆశయాల నడుమ ఈ కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన అంగీకరించారు. తీవ్రమైన అంతర్జాతీయ వాణిజ్య పోటీ వల్ల నైతిక విలువల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. దాంతో సాంకేతికత దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. మంచి ఉద్దేశాలు ఉన్న పరిశోధకులు సైతం మార్కెట్ శక్తుల ఒత్తిడికి లొంగిపోక తప్పడం లేదని పేర్కొన్నారు. అందుకే ఏఐ సంస్థలపై విమర్శలు, పారదర్శకమైన బహిరంగ పరిశీలన అత్యంత అవసరమని ఓలా స్పష్టం చేశారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
‘దయచేసి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి’
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన ఆటగాళ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం అర్థించాల్సి వస్తోంది. పతకాలు గెలిచినప్పుడు వారి ప్రదర్శనను గుర్తిస్తున్నట్లుగా చెబుతూ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఏళ్లు దాటినా... దానిని రెగ్యులరైజ్ చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం. ఇదే విషయంపై రెజ్లర్ రవి దహియా, పారా హైజంపర్ శరద్ కుమార్ పోరాడుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో రవి దహియా (57 కేజీలు) రజత పతకం సాధించి సత్తా చాటగా... శరద్ కుమార్ 2020 టోక్యో పారాలింపిక్స్లో కాంస్యం, 2024 పారిస్ పారాలింపిక్స్లో రజతం సాధించాడు. తమ వేదనను తెలియజేస్తూ వీరిద్దరు వేర్వేరుగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఢిల్లీ ప్రభుత్వం పదే పదే తమ ‘తాత్కాలిక’ ఉద్యోగాన్ని పొడిగిస్తూనే ఉంది తప్ప రెగ్యులరైజ్ చేయడం లేదంటూ వీరిద్దరు ఫిర్యాదు చేశారు. తమ ఒలింపిక్ ఘనతలకుగాను ఢిల్లీ ప్రభుత్వం గ్రూప్ ‘ఎ’ ఉద్యోగాన్ని ఇచ్చిందని.. నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు తాత్కాలిక ఉద్యోగం ఇచ్చినా, ఆపై రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తర్వాత కూడా తమను రెగ్యులరైజ్ చేయడం లేదని రవి, శరద్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు అప్పగించిన అన్ని రకాల బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నామని రవి వెల్లడించగా... దివ్యాంగుడినైన తాను కనీస సౌకర్యాలు లేకపోయినా, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా డ్యూటీ చేస్తున్నానని శరద్ చెప్పాడు. ఇతర శాఖలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న తాము ఢిల్లీ ప్రభుత్వ ఆహ్వానంతో వాటిని వదిలి ఇక్కడకు వచ్చామని ప్లేయర్లు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలు అందేలా చూడాలని రవి, శరద్ ‘క్యాట్’ను కోరారు.చదవండి: ‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన! -
'బాహుబలి' ఓ డేంజరస్ ప్రయత్నం
తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాల్లో 'బాహుబలి' ఒకటి. ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్లతో పాటు తమన్నా లాంటి హీరోయిన్లని గర్వపడేలా చేసింది. పాన్ ఇండియా గుర్తింపు దక్కేందుకు కారణమైంది. ఈ మూవీలో వీరోచిత నారీ అవంతికగా తమన్నా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. 'బాహుబలి' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) 'గత కాలాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. అప్పట్లో ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి తీయడమనేది ప్రమాదకరమైన ప్రయత్నమే. ఎందుకంటే ఒకవేళ వ్యాపార పరంగా అటూ ఇటూ అయితే అందులోంచి బయటపడటం అనేది కష్టం. భారీ నష్టం వాటిల్లేది. దర్శకుడు రాజమౌళి దూరదృష్టి, ఏ విషయంలోనూ రాజీపడని తత్వం, ధృఢమైన నమ్మకమే 'బాహుబలి'ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. అనూహ్య విజయానికా కారణమైంది. బాహుబలి రెండు భాగాలు వ్యాపార పరంగా అత్యధిక వసూళ్లు సాధించాయి. అలానే ఇండస్ట్రీలోని మిగతా దర్శక నిర్మాతల్లో నమ్మకాన్ని కలిగించాయి. ఆ తర్వాత పలు ప్రాంతీయ భాషా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొంది విజయాలను అందుకుంటున్నాయి' అని తమన్నా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ బ్యూటీ.. తమిళంలో విశాల్కు జంటగా 'మకుటం' సినిమా చేస్తోంది. అలానే హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.(ఇదీ చదవండి: అమ్మ బాబోయ్.. రూ.10 కోట్లు బడ్జెట్ రూ.1000 కోట్ల కలెక్షన్?) -
ఇది తమిళనాడా లేదా యూపీనా..?
తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేరాలు జరిగాయని ఆరోపిస్తూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ తీసుకుంటున్న చర్యలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. తమిళనాడులో గత 15 రోజుల్లోనే 25 హత్యలు, 4 జంట హత్యలు , 19 లైంగిక దాడులు జరిగాయని వివరించారు. ఇవి కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధా రంగా తెలిసిన గణాంకాలు మాత్రమేనని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. తమిళనాడు శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘోరాలే నిదర్శనం అని వివరించారు. అసలు ఇది తమిళనాడా లేక ఉత్తర ప్రదేశా?‘ అని ఆయన ప్రశ్నించారు. వరుస నేరాల తో విమర్శల దాడి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు దారుణ ఘటనలను ఉదయనిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ సూలూర్ పరిధిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి కోలుకోకముందే, విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలోనే ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడని, కోయంబత్తూర్లో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి భయాందోళనలు సృష్టించారని వివరించారు. సీఎం నియోజకవర్గంలోనే అరాచకం స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన పెరంబూర్లో మత్తు ముఠా ఏకంగా 13 వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ అరాచకానికి ఒడిగట్టిందన్నారు. ఎన్నికల ముందు వీర నినాదాలు చేసిన సీఎం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? మీ ’సింగపెన్’ (మహిళా రక్షణ) టాస్క్ ఫోర్స్ ఏమైంది? అని ఉదయనిధి నిలదీశారు. పెరుగుతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్న తరుణంలో.. కేవలం కంటితుడుపు చర్యగా ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోదని సీఎంను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని, మహిళలు, చిన్నారు లకు రక్షణ కలి్పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. -
‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఒక విషాదగాథ అని చెప్పొచ్చు. సీజన్ తొలి దశ పోటీల్లో ఓటమి ఎరుగని పంజాబ్ టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో దశ పోటీలకు వచ్చేసరికి పంజాబ్ కథ అడ్డం తిరిగింది. వరుసగా ఆరు పరాజయాలు ఆ జట్టును ఇవాళ ప్లేఆఫ్స్కు చేరకుండా అడ్డుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్లో గెలిచినప్పటికీ ముంబై ఇండియన్స్ఫై రాజస్తాన్ రాయల్స్ గెలవడంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ సంగతి పక్కనబెడితే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ ఒక వీడియోను విడుదల చేసింది. శ్రేష్ట ఉన్నపళంగా వీడియో రిలీజ్ చేయడం వెనుక ఒక కారణముంది. అదేంటంటే.. సీజన్ ఆరంభంలో పంజాబ్, కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ సమయంలో అయ్యర్ సోదరి శ్రేష్ట పంజాబ్ జెర్సీ ధరించి ఒక వీడియో రిలీజ్ చేసింది. 'మేము పంజాబీలం. మా మనసు చాలా పెద్దది. అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చాము' అని సరదాగా కేకేఆర్ను ట్రోల్ చేసింది. అయితే శ్రేష్ట మాటలను సీరియస్గా తీసుకున్న కేకేఆర్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన ట్రోలింగ్ యుద్ధం తనపై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉందంటూ శ్రేష్ట అయ్యర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని, కేవలం సరదా కోసమే వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు శ్రేష్ట తెలిపింది. 'నేను వీడియోలు పెట్టడం వెనుక అసలు ఉద్దేశం కేవలం ఫన్ మాత్రమే. నేను ఎవరిని ట్రోలింగ్ చేయాలనుకోవడం లేదు. ఎవరి మీద నాకు అలాంటి దురుద్దేశం లేదు. ప్రతీ క్రికెటర్ను గౌరవిస్తాను.. ఎందుకంటే నా సోదరుడు కూడా ఒక క్రికెటరే. కానీ మీరు మాత్రం నేను చేసిన చిన్న తప్పుకు నాపై కక్ష కట్టి వేధింపులకు దిగారు. ఆ దూషణల పర్వం నేను పనిచేసే చోటు వరకు రావడం బాధాకరం. నాకు ఫోన్ చేసి నన్ను, నా సహ ఉద్యోగులను, విద్యార్థులను, కుటుంబాన్ని అసభ్యంగా దూషిస్తున్నారు. ట్రోల్ చేయండి.. కానీ అవి కుటుంబాలను లక్ష్యం చేసుకునేలా ఉండకూడదు. ఇప్పటికైనా నన్ను టార్చర్ పెట్టడం ఆపండి' అని వీడియోలో శ్రేష్ట పేర్కొంది. View this post on Instagram A post shared by Shresta Iyer (@shrestaiyer29) చదవండి: IPL 2026: క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ వెళ్లేదెవరు? -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు.. అదీ భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ సంస్థలు కిలో రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ రేటు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న సీఎన్జీ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీ-NCR రీజియన్లో కిలోకు రూ.83 కు చేరింది. మే 15 నుంచి ఇలా పెంచుకుంటూ రావడం ఇది నాలుగోసారి. అంతకు ముందు.. మే 15న రూ2, మే 18న రూ1, మే 23న మరో రూ.1 పెంచాయి. ఇప్పుడు తాజాగా రూ.2 పెంపుతో కేవలం 11 రోజుల్లోనే దాదాపు రూ.6 వరకు ధరలు పెరిగాయి.సీఎన్జీ ధరలు – నగరాల వారీ లిస్ట్ (కేజీకి)ఢిల్లీ – రూ.83ముంబై – రూ.81పుణే – రూ.92.50నాగ్పూర్ – రూ.88.90అహ్మదాబాద్ – రూ.82.30వడోదరా – రూ.81.35గాంధీనగర్ – రూ.76.98నోయిడా – రూ.85.07ఫరీదాబాద్ – రూ.88.72హైదరాబాద్ – రూ.99విజయవాడ – రూ.93గుంటూరు – రూ.92బెంగళూరు – రూ.90చెన్నై – రూ.91.5కోల్కతా – రూ.93.5గమనిక: నగరాల వారీ ధరలు గ్యాస్ కంపెనీ + రాష్ట్ర ట్యాక్స్లపై ఆధారపడి మారుతాయికాలుష్య నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వాలు సీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నది తెలిసిందే. భారత్లో ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పాటు టైర్ టూ సిటీల్లో, పట్టణాల్లోనూ సీఎన్జీ వాహనాల వినియోగం అధికంగా ఉంది. ఆటోలు, క్యాబ్లు, నగర బస్సులు వంటి రవాణా రంగం పెద్ద మొత్తంలో ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. అయితే ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా భావించిన సీఎన్జీ కూడా పెరుగుతున్న రేట్ల వాహనదారుల్ని బెంబేలెత్తిస్తోంది. సీఎన్జీ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితే. పశ్చిమాసియా సంక్షోభం, గ్యాస్ సరఫరా మార్గం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, గ్లోబల్ గ్యాస్ ధరల్లో మార్పులు.. ఫలితంగా భారత్ వంటి దేశాల్లో ఎల్ఎన్జీ (Liquefied Natural Gas) కొనుగోలు( దిగుమతి) ఖర్చు పెరుగుతోంది. తద్వారా ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసి వాహన ఇంధనంగా మార్చే సీఎన్జీ సరఫరా వ్యయం కూడా పెరుగుతోందన్నమాట. రవాణా, నిల్వ, పంపిణీ వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టే గ్యాస్ పంపిణీ సంస్థలు రేట్లను సవరించాల్సి వస్తోంది. అయితే అంతిమంగా మాత్రం భారం వాహనదారులపైనే పడుతోంది. -
రేపు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 27న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరుగుతుంది. -
40 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ.. సవాళ్లు ఇవే
ప్రస్తుతం సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ విషయంలో సరికొత్త ట్రెండ్కు తెరలేపారు. సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ తదితర ప్రముఖ తారలు 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల వయసులో మాతృత్వాన్ని స్వీకరించి, సరికొత్త ఆలోచనలకు పురిగొల్పారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులు 30 ఏళ్లు దాటాక గర్భధారణ ప్రక్రియను సాధ్యం చేస్తున్నప్పటికీ, ఈ వయసులో గర్భం దాల్చడం అనేది శరీరానికి ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.‘అడ్వాన్స్డ్ ఏజ్ ప్రెగ్నెన్సీ’ అంటే ఏమిటి?వైద్య పరిభాషలో 35 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు జరిగే ప్రసవాలను ‘అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్’ (ఏఎంఏ) అని పిలుస్తారు. ఇది ప్రమాదకరమని కాదుగానీ.. వయసు పెరిగేకొద్దీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత, అవయవాల పనితీరులో మార్పులు సహజం. ఈ మార్పులు ప్రసవ సమయంలో కొన్ని ఇబ్బందులకు దారితీయవచ్చు. సరైన వైద్య పర్యవేక్షణ, జీవనశైలి మార్పులతో ఈ ముప్పులను తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.రక్తపోటుపై ప్రత్యేక దృష్టివయసు పైబడిన ప్రెగ్నెన్సీలలో డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా గమనించే అంశం ‘బ్లడ్ ప్రెషర్’. వయసు పెరిగేకొద్దీ రక్తనాళాలు బిగుతుగా మారి, రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ‘ప్రీఎక్లాంప్సియా’ అనే స్థితికి దారితీయవచ్చు, దీనివల్ల కాలేయం లేదా మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే, ఫిట్స్ రావడం లేదా ముందస్తు ప్రసవం వంటి తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.గర్భస్రావం: మానసిక, శారీరక వేదనదురదృష్టవశాత్తూ, వయసు పెరిగేకొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది? ఇది గర్భస్రావం లేదా పిండం ఎదుగుదలలో సమస్యలకు కారణమవుతుంది. 40 ఏళ్ల దాటిన మహిళల్లో క్రోమోజోమ్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా, మహిళల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మళ్లీ గర్భం దాల్చడం లేదా ‘వైఫల్యాలు’ ఎదురైనప్పుడు ఆ బాధ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.గెస్టేషనల్ డయాబెటిస్ ముప్పువయసు పెరిగిన మహిళల్లో జీవక్రియ, ఇన్సులిన్ ప్రతిస్పందనలో వచ్చే మార్పుల వల్ల ‘గెస్టేషనల్ డయాబెటిస్’ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవడంలాంటివి సంభవించవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.ముందస్తు ప్రసవం మరియు రికవరీ40 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వారిలో 37 వారాల కంటే ముందే ప్రసవం జరిగే అవకాశాలు అధికం. అకాలంగా జన్మించే శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. ఇది తల్లికి మరింత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రసవం తర్వాత రికవరీ కావడానికి కూడా ఎక్కువ సమయం పట్టవచ్చు. అధిక రక్తస్రావం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.ప్రసవ సమయంలో అనిశ్చితిప్రసవం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరిగిన మహిళల్లో గర్భాశయ ముఖద్వారం, కండరాలు చిన్న వయసువారితో పోలిస్తే నెమ్మదిగా స్పందించవచ్చు. దీనివల్ల ప్రసవం ఆలస్యమయ్యేందుకు అవకాశముంది. శిశువు స్థానం లేదా తల్లి ఆరోగ్య పరిస్థితులను బట్టి ‘సిజేరియన్’ అవసరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 40 ఏళ్ల వయసులో మాతృత్వం అసాధ్యం కాకపోయినప్పటికీ, మరిన్ని జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘యోగి’ మార్క్ రూల్స్: నమాజ్లు, బలులు బ్యాన్ -
యూపీ సీఎం పీఏ నెంబర్ కావాలి
సాక్షి,హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) చీఫ్ షెహజాద్ బట్టీ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ, మేడ్చల్ పోలీసులకు చిక్కిన జాయిద్ ఖాన్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి నుంచి షెహజాద్ అనుచరులు అబిద్, రానాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నెంబర్ తీసుకోవాలని భావించారు. మరికొన్ని ఆపరేషన్లకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచి్చంది. తదుపరి విచారణ కోసం జాయిద్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో షెహజాద్తో పాటు అబిద్, రానాలను వాంటెడ్గా చేర్చారు. పోలీసుల దర్యాప్తు, నిందితుడి విచారణలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చిన అంశాలివి... ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన జాయిద్ అలియాస్ ఆదిల్ ఖాన్ (22) నాలుగో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఇతడి బంధువైన ఫైజాన్ మేడ్చల్లోని ముబారక్ రెస్టారెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతడి ద్వారానే జాయిద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్ వచ్చి అదే హోటల్లో సర్వర్గా చేరి అదే రెస్టారెంట్లో నివసిస్తున్నాడు. 2021 నుంచి జాయిద్కు రెండు ఇన్స్ట్రాగామ్, ఓ ఫేస్బుక్, మరో వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. 2023లో ఓ బొమ్మ పిస్టల్ ఖరీదు చేసిన జాయిద్ దాంతో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజమైన తుపాకీ ఖరీదు చేయాలని భావించిన జాయిద్ దానికోసం గూగుల్తో పాటు ఇన్స్ట్రాగామ్లో సెర్చ్ చేశాడు. వాటి ద్వారా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్కు చెందిన వ్యక్తి విదేశీ పిస్టల్స్ విక్రయిస్తాడని తెలిసింది. అతడి ఫోన్ నెంబర్ సంగ్రహించిన జాయిద్ సంప్రదించాడు. ఫిబ్రవరి 27న అతడు కొన్ని తుపాకుల ఫొటోలను షేర్ చేశాడు. ఇలా ఇన్స్ట్రాగామ్లో అబిద్ జట్, రానా హుస్సేన్లను ఫాలో అవడం ప్రారంభించాడు. వీళ్లు ఆయుధాలతో అనేక ఫొటోలు, వీడియోలను తమ పేజ్ల్లో పోస్టు చేశారు. ఈ ద్వయం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) ఉగ్రవాద సంస్థను నిర్వహిస్తున్న షెహజాద్ బట్టీ అనుచులుగా ఉన్నారు. అక్రమ ఆయుధాల వ్యాపారం, టార్గెట్ కిల్లింగ్ చేసే బట్టీ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఐఎస్ఐ కోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలిసీ జాయిద్ వారితో సంబంధాలు కొనసాగించాడు. అబిద్ జట్ కోరడంతో జాయిద్ ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రయాగ్రాజ్కు చెందిన చోటా యోగి అనే వ్యక్తి వివరాలను ఇన్స్ట్రాగామ్ ద్వారా షేర్ చేశాడు. అప్పటి నుంచి అబిద్, రానాలు తమ ఫోన్ నెంబర్లు పంపి, వాట్సాప్ సంప్రదిపులు ప్రారంభించారు. ఈ నెల 10న అబిద్ జట్ తన పోస్టర్ను జాయిద్కు షేర్ చేశాడు. ‘పాకిస్థానీ డాన్ అబిద్ జట్’ అనే క్యాప్షన్తో ఉన్న ఈ పోస్టర్స్ను వెయ్యి ప్రింట్ తీసి, ఘజియాబాద్ ప్రాంతంలో అంటించాలని, ఆ వీడియోలను తనకు పోస్టు చేయాలని, అలా చేస్తే ఓ అసలైన పిస్టల్ పంపిస్తానని అబిద్ చెప్పాడు. దీనికి జాయిద్ అంగీకరించాడు. ఈ నెల 20న జాయిద్ను సంప్రదించిన రానా తనకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పీఏ ఫోన్ నెంబర్ కావాలని కోరాడు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన జాయిద్ యూపీ క్యాబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు చెందిన వారి వివరాలను దొరకడంతో అవన్నీ షేర్ చేశాడు. ఘజియాబాద్ వెళ్లినప్పుడు అబిద్ జట్ పోస్టర్లు అంటించి, అసలు పిస్టల్ పొందాలని జాయిద్ ఎదురు చూస్తున్నాడు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. గుత్తి వద్ద కేకే ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. బోల్తాపడింది.ఆంధ్రప్రదేశ్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల నక్కపల్లి జాతీయపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తిరుపతి జిల్లాలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. -
కుమార్ నెలవారీ బండి ఖర్చు పెరిగింది
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ నుంచి రోజూ బంజారాహిల్స్లోని ఆఫీసుకు బైకుపై వచ్చేందుకు కుమార్ అనే ఉద్యోగికి నెలకు పెట్రోలు ఖర్చు రూ.1500 అయ్యేది. కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల అతని నెలవారి బండి ఖర్చు రూ.1800కు చేరుతోంది. ఇలా నగరంలో మధ్యతరగతి అల్పాదాయ వర్గాలపై చమురు ధరల పెంపు ప్రభావం గణనీయంగా ఉంటోంది. సోమవారం లీటర్పై ఏకంగా రూ. 2.84 పైసలు పెరిగింది. గడిచిన పది రోజుల్లోనే మొత్తం రూ.8.23 పైసలు అదనపు భారం పడటంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. నగరంలో సుమారు 66 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయన్నది అంచనా. మెట్రో, సిటీ బస్సుల్లో రద్దీని తట్టుకోలేక, ఆటోలు, క్యాబ్ల చార్జీలు భరించ సొంత బండిని ఆశ్రయించిన వారికి పెట్రోల్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఒక సగటు ఉద్యోగి, వ్యాపారి తన విధులు, పనులకు వెళ్లి రావడానికి మొత్తం నెలవారీ పెట్రోల్ బిల్లును లెక్కగడితే భారం అధికంగానే ఉంది. -
సీజ్ఫైర్ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్పై దాడులకు దిగాయి. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ Reuters నివేదిక ప్రకారం.. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో.. హర్ముజ్లో సీమైన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్తో పాటు మిస్సైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది.అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికే అని యూఎస్సీసీ స్పష్టం చేసింది. “ప్రస్తుతం కొనసాగుతున్న సీజ్ఫైర్ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా, పరిమితంగా చర్యలు తీసుకుంటున్నాం” అని నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు.అమెరికా వర్గాల ప్రకారం.. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు తమ దళాలపై ముప్పు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని, అందుకే ఈ “ప్రివెంటివ్ స్ట్రైక్స్” తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని ధృవీకరించాల్సి ఉంది. ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటు లెబనాన్లోనూ కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు “సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలు”గా వివరణ ఇస్తుండగా.. లెబనాన్ వర్గాలు మాత్రం దీనిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఖండిస్తున్నాయి.ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా? అనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఎలా చూడబోతుందన్నది కూడా కీలకంగా మారింది. -
క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ అడుగు ఎవరిది?
ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్ జట్లు మరో టైటిల్ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టీమ్ల మధ్య మ్యాచ్ తొలి క్వాలిఫయర్ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్ దశ రెండు ముఖాముఖి మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి క్వాలిఫయర్–1 ద్వారా నేరుగా ఫైనల్కు చేరుతుందా? గత సీజన్లో ఎలిమినేటర్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్ దూసుకొచ్చింది. ఐపీఎల్లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి. ఆద్యంతం నిలకడగా..వరుసగా రెండో సీజన్లో టాప్–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంటే టీమ్ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్ (433), పాటీదార్ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్లో భువనేశ్వర్ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. హాజల్వుడ్, రసిఖ్ సలామ్లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్రౌండర్గా కృనాల్ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్ డేవిడ్ కూడా కీలక ఇన్నింగ్స్లతో తన బాధ్యతను నెరవేర్చాడు. చివరి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్వుడ్ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్ అయ్యర్నే కొనసాగిస్తారు. స్పిన్నర్ సుయాశ్ స్థానంలో పేసర్ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. టాప్–3 బ్యాటింగ్తోనే..గుజరాత్ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్ బౌలింగ్ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా, అర్షద్ ఖాన్ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్ ఎంతో ప్రభావం చూపించాడు. ఆల్రౌండర్ హోల్డర్ పేస్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్ ఖాన్ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిధ్ లేదా సాయికిషోర్లలో ఒకరికి చాన్స్ లభిస్తుంది. బ్యాటింగ్లో మరోసారి టైటాన్స్ టాప్–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్ (638), శుబ్మన్ గిల్ (616), జోస్ బట్లర్ (469) చెలరేగడంతోనే టైటాన్స్ ప్రస్థానం ప్లే ఆఫ్స్ వరకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.పిచ్, వాతావరణంభారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఛేదన చేసిన టీమ్ విజయం సాధించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో బ్యాట్ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్పై ముంబై గెలిచిన మ్యాచ్లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. The steepest climb of the season, but the view from the top is a spot in the Final! 🏔️Dharamshala is READY for the #Qualifier1 🏟️#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/sCdPkNMzyZ— IndianPremierLeague (@IPL) May 25, 2026 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
మళ్లీ సీఎం కుర్చీ రచ్చ
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం, అదే సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆకస్మిక పిలుపు రావడం.. భారీ ఊహాగానాలకు దారి తీసింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరిగే అవకాశం ఉండటంతో సీఎం మార్పు అంశం మళ్లీ కేంద్ర బిందువుగా మారింది.“కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందా?” అనే ప్రశ్న మరోసారి రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవర్షేరింగ్ ఫార్ములాతో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం గురించి తెలిసిందే. దానిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డీకే వర్గం, సీనియర్ నేత నాయకత్వంలోనే ఐదేళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకోవాల్సిందేనని సిద్దూ వర్గం అధిష్టానంపై ఒత్తిళ్లు దిగాయి. ఈ తరుణంలో ఇవాళ్టి భేటీలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.సిద్ధరామయ్య వైఖరి ఏమిటి?ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ప్రస్తుతం “ప్రభుత్వ స్థిరత్వమే ప్రధాన లక్ష్యం” అనే వైఖరిని బలంగా వినిపిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు, ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగాలంటే నాయకత్వ మార్పు అవసరం లేదని ఆయన వర్గం హైకమాండ్కు వివరించనున్నట్టు సమాచారం. “ప్రభుత్వాన్ని మధ్యలో మార్చడం వల్ల పాలనా స్థిరత్వం దెబ్బతింటుంది” అన్నది సిద్ధరామయ్య వర్గం ప్రధాన వాదనగా చెబుతున్నారు.డీకే శివకుమార్ వాదన ఏమిటి?మరోవైపు డీకే శివకుమార్ వర్గం మాత్రం “పార్టీకి ఇచ్చిన రాజకీయ హామీల అమలు” అంశాన్ని ముందుకు తెస్తోందని సమాచారం. 2023లో జరిగిన అనధికారిక ఒప్పందాల ప్రకారం నాయకత్వ మార్పుపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని డీకే వర్గం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో తన పాత్ర కీలకమని, అందుకే భవిష్యత్ నాయకత్వ బాధ్యతపై చర్చ జరగాలని ఆయన వర్గం అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు.ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం?ఇప్పుడు మొత్తం వ్యవహారం ఢిల్లీ హైకమాండ్ చేతిలోకి వెళ్లింది. ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సిద్ధరామయ్య–డీకే మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. అయితే తక్షణ సీఎం మార్పు కన్నా, “పార్టీ అంతర్గత సమతుల్యత, భవిష్యత్ రోడ్మ్యాప్”పై నిర్ణయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఇది అధికారిక సంక్షోభం కంటే “పవర్ షేరింగ్ చర్చల పొడిగింపు”గానే కనిపిస్తోంది. కానీ ఢిల్లీ భేటీల తర్వాత తీసుకునే నిర్ణయం కర్ణాటక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆన్సర్ షీట్లు తారుమారు!
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్నెట్లో బోర్డు అప్లోడ్ చేసిన తమ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) వ్యవస్థలో జవాబు పత్రాల మధ్య పొంతన కుదరడంలో లోపం ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల అసలైన జవాబు పత్రాలు, ఇంటర్నెట్లోని స్కాన్డ్ కాపీల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి రెండూ ఒక్కటి కాదని అంటున్నారు. అంటే మిస్మ్యాచ్ జరుగుతోందని విమర్శిస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలామంది మార్కులు తక్కువగా రావడంతో పునర్మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి జవాబు పత్రాలను సీబీఎస్ఈ సిబ్బంది నెట్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిశీలించిన విద్యార్థులు కంగు తింటున్నారు. అవి తాము సమాధానాలు రాసిన పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరొకరి జవాబు పత్రాలను తమ పేరిట అప్లోడ్ చేశారని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే విద్యార్థి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. తనది కాని ఫిజిక్స్ ఆన్సర్ షీట్ను తన పేరిట అప్లోడ్ చేశారని తెలిపాడు. అందులో ఉన్న చేతిరాత తనది కాదని పేర్కొన్నాడు. రీవాల్యుయేషన్లో తనకు అన్యాయం జరిగిందని వెల్లడించాడు. సాంకేతిక సమస్యలపై దృష్టి పెట్టాం: ప్రధాన్ వేదాంత్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు అతడికి మద్దతిచ్చారు. కానీ, కొందరు వ్యతిరేకించారు. జాతి వ్యతిరేకిగా, పాకిస్తానీగా వేదాంత్పై ముద్రవేశారు. సంజన అనే మరో విద్యార్థినిది కూడా ఇదే వ్య«థ. ఆమె కెమిస్ట్రీ ఆన్సర్ షీట్ తారుమారయ్యింది. 70 మార్కులకు గాను 11 మార్కులే వచ్చాయి. ఆన్సర్ షీట్ మొదటి పేజీలో విద్యారి్థని పేరు, వివరాలు సరిగ్గానే ఉన్నాయి. రెండో పేజీ నుంచి మొత్తం మారిపోయాయి. సీబీఎస్ఈ అధికారులను సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని సంజన కన్నీరు పెట్టుకుంది. చాలామంది విద్యార్థులు ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ ఆవేదనను సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం: సీబీఎస్ఈ ఈ ఏడాది పరీక్షల్లో పునర్మూల్యాంకన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి వెలుగులోకి వచ్చిన అన్నిరకాల సాంకేతిక సమస్యలపై ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–కాన్పూర్ నిపుణులు దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా సీబీఎస్ఈకి సహకరిస్తారని తెలిపారు. రీవాల్యూయేషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మిస్మ్యాచ్ ఆన్సర్ షీట్ల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీబీఎస్ఈ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్లో గానీ, ఆఫ్లైన్లో గానీ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా స్వీకరిస్తున్నామని, విద్యార్థులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశాయి. విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో ఉన్నతాధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారని తెలియజేశాయి. ప్రతి ఫిర్యాదునూ చురుగ్గా పరిష్కరిస్తున్నట్లు సీబీఎస్ఈ అధికారులు చెబుతున్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహిగా ముద్ర వేస్తారా? ప్రధాని మోదీ అహంకారాన్నిజెన్ జెడ్ దించేయడం తథ్యం సీబీఎస్ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వయం మరో కీలక సంస్థను అక్రమాలకు ప్రతీకగా మార్చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అహంకారాన్ని జెన్ జెడ్ దించేయడం తథ్యమని తేల్చిచెప్పారు. సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం)లో లోపాలపై రాహుల్ సోమవారం స్పందించారు. ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పునర్ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్సర్ షీట్లు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి జవాబు పత్రాన్ని మరొకరి పేరిట అప్లోడ్ చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పట్ల రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షల నిర్వహణలో ఎన్ని అవినీతి, అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఇంకా కురీ్చని పట్టుకొని వేలాడుతున్నాడని మండిపడ్డారు. సీబీఎస్ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారని ఆరోపించారు. -
అతిచిన్న ఆక్టోపస్
వాషింగ్టన్: సముద్ర జీవులైన ఆక్టోపస్లు సాధారణంగా ఒక మీటర్ పొడవు, 9 కిలోల వరకు బరువు ఉంటాయి. కానీ, కేవలం గోల్ఫ్ బంతి పరిమాణంలోని అతిచిన్న ఆక్టోపస్ను పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఈక్వెడార్ తీరానికి సమీపంలో గాలాపాగోస్ దీవుల వద్ద సముద్ర ఉపరితలం నుంచి 6 వేల అడుగుల లోతున చిమ్మచీకటిలో ఇది సంచరిస్తుండగా జాగ్రత్తగా బయటకు తీశామని చెబుతున్నారు. ఇది ఇప్పటిదాకా ఎవరికీ తెలియని కొత్తరకం ఆక్టోపస్ అని అంటున్నారు. గాలాపాగోస్ దీవులు అరుదైన జీవజాలానికి నిలయంగా మారాయి. భూమిపై మరెక్కడా కనిపించని వెయ్యికి పైగా వృక్ష, జంతు జాతులు ఇక్కడున్నాయి. ఈ ద్వీపాల చుట్టూ ఉన్న లోతైన జలాల్లో కొత్తరకం ఆక్టోపస్ ఉనికి తొలిసారిగా బయటపడింది. ఈ నీలి రంగు బుల్లి ఆక్టోపస్కు మైక్రోఎలిడోన్ గాలాపాగెన్సిస్ అని పేరుపెట్టారు. షికాగోలోని ఫీల్డ్ మ్యూజియం, చార్లెస్ డారి్వన్ ఫౌండేషన్, గాలాపాగోస్ నేషనల్ పార్క్ డైరెక్టరేట్లోని సైంటిస్టులు 2015 నుంచి సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఈవీ నాటిలస్ అనే అన్వేషణ నౌక ద్వారా లోతైన సముద్ర యాత్రలో ఆక్టోపస్ను మొదటిసారిగా గుర్తించారు. ఓడ నుంచి సిబ్బంది రిమోట్తో పనిచేసే అండర్వాటర్ రోబోను సముద్రం అడుగుభాగంలోకి పంపించారు. సముద్ర ఉపరితలం నుంచి 5,800 అడుగుల లోతులో ఒక పర్వతం సమీపంలో ఆక్టోపస్ను గమనించి, రోబోటిక్ వాహనాన్ని ఉపయోగించి పట్టుకున్నారు. గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉన్న నీలిరంగు చిన్న ఆక్టోపస్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. కొత్త ఆక్టోపస్ జాతిని అధ్యయనం చేయాలంటే సాధారణంగా దానికి కోసి చూడాల్సి ఉంటుంది. కానీ, గోల్ఫ్ బంతి పరిమాణంలోని ఆక్టోపస్ ఇదొక్కడే దొరకడంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మైక్రో సీటీ స్కానింగ్తో ఆక్టోపస్ శరీరం లోపలి భాగాలను పరిశీలించారు. 3డీ నమూనాను తయారు చేశారు. దానికి అధికారికంగా ఒక కొత్త జాతి ఆక్టోపస్గా ధ్రువీకరించారు. సువిశాలమైన మన భూగోళంపై ఇప్పటిదాకా మానవుడి దృష్టికి రాని జీవులు ఎన్నో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. -
ఘనంగా ‘పద్మ’ల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. 2026 సంవత్సరానికిగాను వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్ పురస్కారాలతోపాటు 58 మంది పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పురస్కారాలు స్వీకరించారు. తెలుగు పద్మాలు వీరే.. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు గూడూరు వెంకట్రావు, పాల్కొండ విజయ్ ఆనంద్రెడ్డి మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. కళల విభాగంలో దీపికారెడ్డి పద్మ అవార్డు అందుకోగా సాహిత్యం–విద్య విభాగంలో ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి పద్మ పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మ అవార్డు ప్రకటించగా ఆయన కుమారుడు గరిమెళ్ల అనిల్ కుమార్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ సాహిత్యం–విద్య విభాగంలో ఢిల్లీ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. ధర్మేంద్ర తరఫునఅందుకున్న హేమమాలిని దివంగత బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించగా ఆయన భార్య, బీజేపీ ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో ఎన్. రాజమ్ పద్మ విభూషణ్ అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ, కళల విభాగంలో ఆర్. గణేశ్, వాణిజ్యం–పరిశ్రమల విభాగంలో ఉదయ్ కోటక్ పద్మ భూషణ్ అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మరణాంతరం వీకే మల్హోత్రాకు పద్మ భూషణ్ ప్రకటించగా ఆయన కుమారుడు పురస్కారాన్ని స్వీకరించారు. క్రీడల విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పద్మశ్రీ అందుకున్నారు. తొలి విడతలో 66 మందికి.. పద్మ అవార్డులను తొలివిడతలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం 66 మందికి ప్రదానం చేశారు. మిగిలిన అవార్డులను త్వరలో నిర్వహించే రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. 2026కుగాను కేంద్రం మొత్తం 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం తెలిసిందే. -
హెచ్డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (హెచ్డీబీఏ) అధ్యక్షుడిగా మరోసారి వంకిన చాముండేశ్వరనాథ్ ఎంపికయ్యారు. కానూరి వంశీధర్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. ఆరుగురు ఉపాధ్యక్షులలో మాజీ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, జాస్తి శారదా గోవర్ధిని ఉన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు (2026–30) ఈ కార్యవర్గం కొనసాగుతుంది. హెచ్డీబీఏ కొత్త కార్యవర్గం వివరాలు: అధ్యక్షుడు:వి.చాముండేశ్వరనాథ్; ఉపాధ్యక్షులు: దగ్గుబాటి సురేశ్బాబు, ఒంటెద్దు శ్రీనివాస రెడ్డి, ఇందుకూరి వెంకటసోమరాజు, ఆదినారాయణ కమ్మ, జాస్తి శారదా గోవరి్ధని, పారుపల్లి కశ్యప్; ప్రధాన కార్యదర్శి: కానూరి వంశీధర్;నిర్వాహక కార్యదర్శి: గున్ను విజయ్ రాఘవన్కోశాధికారి: కొల్లి నాగవేణి; సంయుక్త కార్యదర్శులు: చిట్టబోయిన రమేశ్ యాదవ్, గంటా శారదా రెడ్డి; సభ్యులు: జయేశ్ రంజన్, మున్నంగి బంగారుబాబు, బొంబోజి రాజ్గోపాల్ చారి, సిద్ధార్థ్ రెడ్డి ఆరంరెడ్డి, మొహమ్మద్ మఖ్దూమ్ అహ్మద్ ఖాద్రీ, సీబీ తారాప్రశాంత్ చంద్ర, పల్లె చంద్రశేఖర్ రావు, వంకిన రమ్య, నామాల పురుషోత్తం రావు. -
మెరిసిన సుహాస్, వర్షిత్, శ్రీనిత్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా స్విమ్మర్లు పతకాల పంట పండించారు. పురుషుల విభాగంలో మైలారి సుహాస్ ప్రీతమ్, ధూళిపుడి వర్షిత్... జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్... మహిళల విభాగంలో వ్రిత్తి అగర్వాల్, శ్రీనిత్య సాగి పతకాల మోత మోగించారు. హైదరాబాద్లోని అంబర్పేట జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో జరిగిన ఈ పోటీల్లో సుహాస్ ప్రీతమ్, ధూళిపుడి వర్షిత్ నాలుగు స్వర్ణ పతకాల చొప్పున నెగ్గగా... జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ మూడు బంగారు పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్, శ్రీనిత్య మూడు బంగారు పతకాల చొప్పున సొంతం చేసుకున్నారు. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి. మహిళల విభాగం (ఫ్రీస్టయిల్): 50 మీటర్లు: 1. సు«దీక్ష కృష్ణ (మేడ్చల్–మల్కాజిగిరి; 27.36 సెకన్లు), 2. జొహన్నా షిజు (రంగారెడ్డి), 3. హేమ వర్షిణి జంబులూరి (మేడ్చల్–మల్కాజిగిరి). 100 మీటర్లు: 1. మండూరి ప్రీతిక (రంగారెడ్డి; 1ని:06.95 సెకన్లు), 2. హేమ వర్షిణి జంబులూరి, 3. అవిశా రాచెల్ (హైదరాబాద్). 200 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (మేడ్చల్–మల్కాజిగిరి; 2ని:12.76 సెకన్లు), 2. కర్రా శివాని (రంగారెడ్డి), 3. జొహన్నా షిజు. 400 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (4ని:40.32 సెకన్లు), 2. కర్రా శివాని, 3. జొహన్నా షిజు. 800 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (9ని:47.14 సెకన్లు), 2. జొహన్నా షిజు, 3. మండూరి ప్రీతిక. 1500 మీటర్లు: 1. మెరుపుల లిఖిత గౌడ్ (మేడ్చల్–మల్కాజిగిరి; 21ని:10.42 సెకన్లు), 2. నుహా ఫాతిమా (హైదరాబాద్). బ్యాక్స్ట్రోక్: 50 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (మేడ్చల్–మల్కాజిగిరి; 32.36 సెకన్లు), 2. నాదెళ్ల అదితి (హైదరాబాద్), 3. కర్రా శివాని. 100 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (1ని:09.31 సెకన్లు), 2. కర్రా శివాని, 3. ఇషి అగర్వాల్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (2ని:27.42 సెకన్లు), 2. అనిక దెబోరా (మేడ్చల్–మల్కాజిగిరి), 3. కర్రా శివాని. బ్రెస్ట్స్ట్రోక్: 100 మీటర్లు: 1. జొహన్నా షిజు (1ని:24.83 సెకన్లు), 2. గిడిజల దాక్షిణ్య హరిణి (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఫాతిమా మెహ్రీన్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. గిడిజల దాక్షిణ్య హరిణి (3ని:03.48 సెకన్లు), 2. ఫాతిమా మెహ్రీన్, 3. పుట్టా సుష్మ (వరంగల్). బటర్ఫ్లయ్: 50 మీటర్లు: 1. సుదీక్ష కృష్ణ (29.57 సెకన్లు), 2. అద్దంకి మోక్షిత (హైదరాబాద్), 3. నాదెళ్ల అదితి. 100 మీటర్లు: 1. అద్దంకి మోక్షిత (1ని:19.96 సెకన్లు), 2. మేఘన అబినేశ్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. మెరుపుల లిఖిత గౌడ్ (2ని:49.89 సెకన్లు), 2. అద్దంకి మోక్షిత. వ్యక్తిగత మెడ్లీ: 200 మీటర్లు: 1. జొహన్నా షిజు (రంగారెడ్డి; 2ని:46.07 సెకన్లు), 2. భూపతిరాజు హర్షిత వర్మ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. జంబులూరి హేమ వర్షిణి. 400 మీటర్లు: 1. జంబులూరి హేమ వర్షిణి (మేడ్చల్–మల్కాజిగిరి; 6ని:03.31 సెకన్లు), 2. మేఘన అబినేశ్. పురుషుల విభాగం (ఫ్రీస్టయిల్): 50 మీటర్లు: 1. కాసుల తన్మయ్ రిత్విక్ (రంగారెడ్డి; 25.21 సెకన్లు), 2. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (హైదరాబాద్), 3. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు (మేడ్చల్–మల్కాజిగిరి). 100 మీటర్లు: 1. కాసుల తన్మయ్ రిత్విక్ (రంగారెడ్డి; 55.90 సెకన్లు), 2. మైలారి సుహాస్ ప్రీతమ్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఎడక్కొలాతుర్ స్టాష్ జోసెఫ్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (మేడ్చల్–మల్కాజిగిరి; 2ని:07.86 సెకన్లు), 2. స్టాష్ జోసెఫ్, 3. అరుంబక రిత్విక్ కమల్ (రంగారెడ్డి). 400 మీటర్లు: 1. రేవెళ్లి అమోఘ్ (హైదరాబాద్; 4ని:38.55 సెకన్లు), 2. స్టాష్ జోసెఫ్, 3. భట్టిప్రోలు ప్రభాత్ ముత్తుస్వామి (రంగారెడ్డి). 1500 మీటర్లు: 1. బండారి సాయిశ్రీ ప్రణీత్ (హైదరాబాద్; 19ని:54.58 సెకన్లు), 2. జితేశ్ అవిరినేని (రంగారెడ్డి), 3. పెన్మత్స బాల సిద్ధార్థ వర్మ (మేడ్చల్–మల్కాజిగిరి). బ్యాక్స్ట్రోక్: 50 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (27.31 సెకన్లు), 2. సచిన్ సాత్విక్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. సింకా అనీశ్ రెడ్డి (రంగారెడ్డి). 100 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (1ని:01.33 సెకన్లు), 2. లక్కోజు అభయ్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఆరుష్ దాస్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (2ని:09.60 సెకన్లు), 2. ధూళిపుడి వర్షిత్. బ్రెస్ట్స్ట్రోక్: 50 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (30.95 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. నూనె యశస్వి. 100 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (1ని:07.99 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. దారా యక్షిత్ (హైదరాబాద్). 200 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (2ని:36.41 సెకన్లు), 2. దారా యక్షిత్, 3. యెర్రం అనుదీప్ రాజ్ (ఆదిలాబాద్). బటర్ఫ్లయ్: 50 మీటర్లు: 1. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు (26.08 సెకన్లు), 2. ఇషాన్ దాస్ (రంగారెడ్డి), 3. లక్కోజు అభయ్. 100 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (57.96 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. టీఎస్ తేజస్ కుమార్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (2ని:15.94 సెకన్లు), 2. టీఎస్ తేజస్ కుమార్. వ్యక్తిగత మెడ్లీ: 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (2ని:19. 32 సెకన్లు), 2. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్, 3. టీఎస్ తేజస్ కుమార్. 400 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (5ని:16.99 సెకన్లు), 2. బండారి సాయిశ్రీ ప్రణీత్, 3. ఆరుష్ దాస్. -
రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రోద్బలంతోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. రంగా హత్యకు చంద్రబాబు సూత్రధారి అయితే, నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, ఎస్పీ వ్యాస్ పాత్రధారులు. రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని గట్టిగా విశ్వసించబట్టే మంత్రి పదవితోపాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నానని హరిరామ జోగయ్య అప్పుడే చెప్పారు. విజయవాడలో ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా వంగవీటి రంగాను చంద్రబాబే చంపించాడని చెబుతారు.’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టంచేశారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రంగా హత్య జరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర బయటపడుతుందనే సీబీఐ విచారణకు నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ చేయాలని కోరింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దర్యాప్తును ప్రభావితం చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారు. రంగా హత్య జరిగినప్పుడు, కేసును కొట్టేసినప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది.రంగా హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు జైలులో ఉండేవారు. అప్పట్లో దర్యాప్తును ప్రభావితం చేయడానికే వర్గ విభేదాల పేరుతో కట్టుకథలు అల్లారు. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగానే తనను ఈ కేసులో ఇరికించాడని దేవినేని నెహ్రూ పలు సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా కాపు కులానికి చెందిన జర్నలిస్టు పింగళి దశరథరామ్ దారుణ హత్య వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని ప్రజలందరూ నమ్ముతున్నారు.’ అని వంగవీటి నరేంద్ర చెప్పారు. చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట‘రంగా హత్యకు కడప నుంచి బాంబులు తెచ్చారని చంద్రబాబు ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ పోలీసులకు ఎందుకు చెప్పలేదు. సీబీఐ విచారణను ఎందుకు కోరలేదు. కాంగ్రెస్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా మధ్య ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వికృతంగా చూపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట. 1985లో రంగాకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చాలా మంది అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు.అలాంటి సన్నిహితుల మధ్య కూడా వివాదాలు ఉన్నట్లు వారు చనిపోయిన తర్వాత కట్టుకథలు సృష్టించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకుని దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరితే వైఎస్సార్పై బురదచల్లడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ అడిగి ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేక వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.’ అని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
భర్తను హత్య చేసిన భార్య
తగరపువలస: భర్తను భార్య హతమార్చిన ఘటన విశాఖ జిల్లా భీమిలి పోలీస్స్టేషన్ పరిధిలోని వలందపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణి(26)కి వలందపేట రజక వీధికి చెందిన తాపీ మేస్త్రి బోర సూరితాత(35)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాగమణి నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సూరితాత ఆమెను తరచూ నిలదీసేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు..భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది.అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో తానే చున్నీని బిగించి సూరితాతను హతమార్చానని ఒప్పుకుంది. ఈ హత్యలో ఆమెకు ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంటోనెల్లి అదరహో
మాంట్రియల్: టీనేజ్ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి నిరూపించాడు. ఫార్ములావన్–2026 సీజన్లో వరుసగా నాలుగో విజయంతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ ఐదో రేసు కెనడియన్ గ్రాండ్ప్రిలో 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణీత 68 ల్యాప్లను ఈ ఇటలీ డ్రైవర్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 15.758 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా 76 ఏళ్ల ఫార్ములావన్ చరిత్రలో తమ కెరీర్ ప్రారంభంలో నాలుగు వరుస రేసుల్లో టైటిల్ సాధించిన తొలి డ్రైవర్గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. ఈ సీజన్లోని తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన జార్జి రసెల్ టైటిల్ నెగ్గగా... చైనా, జపాన్, మయామి, కెనడియన్ గ్రాండ్ప్రిలలో ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. 1983లో డామన్ హిల్ (హంగేరి, బెల్జియం, ఇటలీ గ్రాండ్ప్రి)... 1998లో మికా హాకినెన్ (చైనా, జపాన్, మయామి గ్రాండ్ప్రి) మాత్రమే తమ కెరీర్లో బరిలోకి దిగిన మూడు వరుస రేసుల్లో గెలుపొందారు. ఇక ఫార్ములావన్లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన 16వ డ్రైవర్గా ఆంటోనెల్లి ఘనత వహించాడు. గతంలో వెర్స్టాపెన్ (వరుసగా 10; 2023లో), సెబాస్టియన్ వెటెల్ (వరుసగా 9; 2013లో), అల్బోర్టో అస్కారి (వరుసగా 7; 1953లో), మైకేల్ షుమాకర్ (వరుసగా 7; 2004లో), నికో రోస్బర్గ్ (వరుసగా 7; 2016లో), జాక్ బ్రాబమ్ (వరుసగా 5; 1960లో), జిమ్ క్లార్క్ (వరుసగా 5; 1965లో), నైజెల్ మాన్సెల్ (వరుసగా 5; 1992లో), లూయిస్ హామిల్టన్ (వరుసగా 5; 2014లో), జోచెన్ రింట్ (వరుసగా 4; 1966లో), అయిర్టన్ సెనా (వరుసగా 4; 1991లో), అలైన్ ప్రాస్ట్ (వరుసగా 4; 1993లో), డామన్ హిల్ (వరుసగా 4; 1995లో), ఫెర్నాండో అలోన్సో (వరుసగా 4; 2006లో), జెన్సన్ బటన్ (వరుసగా 4; 2009లో) ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోనే వరుసగా నాలుగు రేసుల్లో ఒకటికంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు. స్ప్రింట్ రేసులో సహచరుడు జార్జి రసెల్ను ఢీకొట్టిన ఆంటోనెల్లి ప్రధాన రేసులో మాత్రం దూసుకుపోయాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన ఆంటోనెల్లికి ‘పోల్ పొజిషన్’ సాధించిన సహచరుడు రసెల్తో గట్టిపోటీనే ఎదురైంది. తొలి 30 ల్యాపుల్లో వీరిద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు 38వ ల్యాప్లో ఇంజిన్లో సమస్య కారణంగా రసెల్ రేసు నుంచి వైదొలగగా>... అటునుంచి ఆంటోనెల్లి వెనుదిరిగి చూడలేదు. ఏకంగా పది సెకన్ల ఆధిక్యంతో ఆంటోనెల్లి టైటిల్ సాధించాడు. కేవలం నలుగురు డ్రైవర్లే నిర్ణీత 68 ల్యాప్లను పూర్తి చేయగా... 12 మంది డ్రైవర్లు ఒక ల్యాప్ తక్కువ చేశారు. మిగతా ఆరుగురు డ్రైవర్లు రేసు మధ్యలో నుంచి తప్పుకున్నారు. 22 రేసుల ఈ సీజన్లో ఐదు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 88 పాయింట్లతో రసెల్ రెండో స్థానంలో, 75 పాయింట్లతో లెక్లెర్క్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్ప్రి జూన్ 7వ తేదీన జరుగుతుంది. -
పొగాకు రైతు ధర్మాగ్రహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు రీజియన్ పరిధిలో పొగాకు వేలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా మూడు మిలియన్ కేజీల ఉత్పత్తులూ ఇప్పటి వరకు కొనలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే సరైన గిట్టుబాటు ధరలు లేక ఆవేదనలో ఉన్న రైతులు వేలం ప్రక్రియ ఆలస్యంతో మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. రోడ్లపై పొగాకు బేళ్లను పోసి తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు, పొగాకు కొనేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండపి, టంగుటూరు, పొదిలి, కనిగిరి, వెల్లంపల్లి, ఒంగోలు 1 వేలం కేంద్రాల వద్ద రైతులు నిరసనలు తెలిపారు. రోడ్డుపై పొగాకు బేళ్లను వేసి తగలబెట్టారు. చంద్రబాబు పాలనపై కన్నెర్ర చేశారు. రెండు నెలలుగా ధరలు లేక నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు ఇదే విధంగా ఉంటే బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.టీడీపీ నేత ఓవరాక్షన్ ఇదిలా ఉంటే రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సమయంలో టీడీపీ నేత, రైతు నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే యత్నం చేశారు.స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే యత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా.. రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు అండగా నిలబడకుండా వ్యాపారులకు వంతపాడడంపై మండిపడ్డారు. దీంతో రైతులు కూడా రమణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు వేలంలో పాల్గొని పొగాకు కొనేలా చూడాలని బుర్రా మధుసూదన్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంపై వడగాడ్పుల పడగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రచండ భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడగాడ్పుల ప్రభావానికి సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ప్రాణాలు విడిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 14 మంది ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, విశాఖ, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 10 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత అత్యంత తీవ్రంగా, 125 మండలాల్లో తీవ్రంగా ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, కృష్ణా, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు మండలాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేకచోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.నేడు ఎండ తీవ్రంగా ఉండే జిల్లాలుమంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
కర్ణాటక సరిహద్దులో.. 2 బ్రిడ్జి కమ్ బరాజ్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో రెండు బ్రిడ్జి కమ్ బరాజ్లను సంయుక్తంగా నిర్మించాలనే ప్రతిపాదనలపై ఉభయ రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. కొల్పూర్, కొర్తుకుండ వద్ద కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్రిడ్జి కమ్ బరాజ్.. తంగడగి గ్రామం వద్ద భీమా నదిపై 1 టీఎంసీ సామర్థ్యంతో మరో బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టుకు సుమారు 30 కి.మీ.ల ఎగువన కొల్పూర్, కొర్తుకుండ వద్ద ఒక బరాజ్, కృష్ణా ప్రధాన పాయలో భీమా నది కలిసే ప్రాంతానికి ఎగువన తంగడగి వద్ద మరో బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలపై కర్ణాటక అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బరాజ్ల నిర్మాణంతో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని కర్ణాటక మంత్రి చెప్పారు. బరాజ్ల కుడి వైపు నుంచి కర్ణాటక, ఎడమ వైపు నుంచి తెలంగాణ.. నీళ్లను మళ్లించుకోవచ్చని, వేసవిలో తాగునీటి అవసరాల కోసం పంపింగ్ చేసుకోవచ్చని సూచించారు. అయితే ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజా ప్రతినిధుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సమగ్ర అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్), ఇతర నిపుణులతో ఒక కమిటీ వేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంటామని, ఈ మేరకు ఒప్పందం చేసుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రతిపాదనలను కర్ణాటక మంత్రికి వివరించామని ఉత్తమ్ మీడియాకు తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే ప్రతిపాదనలను ఆ రాష్ట్రం ముందు ఉంచినట్టు వెల్లడించారు. ఈ చర్చల్లో సాధించిన పురోగతిని సీఎం రేవంత్రెడ్డికి వివరించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయం కృష్ణా, భీమా నదులపై బరాజ్లు నిర్మిస్తే దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరదలు లేనప్పుడు వచ్చే రీజనరేటెడ్ నీళ్ల ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రధానంగా బీమా నదిపై ఇప్పటికే కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడంతో జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గిపోయిందని ఆయన అన్నారు. కృష్ణా, భీమా నదులపై ఎగువన కర్ణాటకలో ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులతో వర్షాభావ సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కరువు పీడిత మక్తల్ నియోజకవర్గానికి తాగు, సాగునీటి సరఫరా కోసం ఈ రెండు బరాజ్లను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. కర్ణాటకలోని ఆల్మట్టి బరాజ్ ఎత్తు పెంచడానికి ఆ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పలువురు కర్ణాటక మంత్రిని నిలదీసినట్టు తెలిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి కీలకమైన ఆర్డీఎస్ ఆధునికీకరణ ప్రాజెక్టుకు కర్ణాటక సహకరించడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయగా, ఈ విషయంలో ఏపీ సహకరించడం లేదని కర్ణాటక మంత్రి బదులిచ్చారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులు విడుదల చేస్తే సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో రాయచూర్ ఎంపీ జి.కుమార్నాయక్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి మేఘారెడ్డి, శివకుమార్రెడ్డి, వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శ్రమశక్తికి ‘సలాం’...
‘కష్టం వస్తే కాడిపట్టగల.. అవసరమైతే గన్నీ సంచులూ మోయగలం. ఇల్లు అలకడం వంట చెయ్యడమే కాదు.. సమాజం కష్టాల్లో ఉంటే ఆదుకోవడమూ మాకు తెలుసు’ అంటూ మగవారికే పరిమితం అనుకున్న హమాలీ పనిలోనూ తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మహిళలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పెద్దంపేట్, ధర్మారం మండలం కమ్మర్ఖాన్ పేట గ్రామాల్లో ఒక అద్భుతం జరిగింది. మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసి ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనన్న రైతుల ఆందోళనను చూస్తూ ఆ గ్రామ మహిళలు చేతులు ముడుచుకుని కూర్చోలేక పోయారు. ‘మగవారే చేయాలి అనే పని ఏదీ లేదు.. రైతు కష్టం మా కళ్లముందే వృథా కాకూడదు’ అంటూ ఇంటి పనులకే పరిమితమయ్యే ఆ చేతులు.. ఒక్కసారిగా గన్నీ సంచులను అందుకున్నాయి. శ్రమను నమ్ముకున్న ఆ భుజాలు.. క్వింటాళ్ల కొద్దీ ధాన్యం బస్తాలను మోసేందుకు సిద్ధమయ్యాయి. మండుటెండను, అకాల వర్షపు ముప్పును లెక్కచేయకుండా, ఒకరు గన్నీసంచుల్లో ధాన్యం నింపుతుంటే.. వాటిని మోసి తూకం వద్దకు తీసుకెళ్లడం, వరుసగా పేర్చడం వంటి పనులు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నారు. పనికి ఫలితంగా క్వింటాకు రూ.25 చొప్పున వేతనం అందుకుంటున్నారు. సాధారణంగా మగవారే చేయగలరని భావించే అత్యంత కష్టమైన హమలీ పనిని, ఆ మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఐకమత్యంతో చేసి చూపించారు. మండుటెండైనా చెమటలు కారుతున్నా అలసట ముంచుకొస్తున్నా వారి అడుగులు ఆగలేదు. అన్నదాత ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో వారు హమాలీలుగా మారిపోయారు. సమాజం తరచూ మహిళలను ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసే భావనను ఆ మహిళలు చెదరగొట్టారు. వారు కేవలం గన్నీ సంచులు మాత్రమే మోయలేదు. మహిళలపై ఉన్న అపోహలను కూడా తమ భుజాలపై మోసి దూరంగా విసిరేశారు. వారి ఐకమత్యం చూసి రైతులు ‘‘మా ధాన్యం కాపాడారు మా కష్టం వృథా కాకుండా చేశారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.హమాలీల కొరతతో...మా ఊర్లోని కొనుగోలు కేంద్రంలో హమాలీ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు చూడలేక కొంతమంది మహిళలం రెండు గ్రూప్లుగా మారి ధాన్యాన్ని బస్తాల్లో నింపడం, నింపిన బస్తాలను కాంటా వేయటం, కాంటా వేసిన బస్తాలను ఒక క్రమపద్ధతి లో అమర్చటం చేస్తున్నాం. ఇందుకు రైతులు క్వింటాకు రూ.25 రూపాయలు ఇస్తున్నారు. దీంతో మాకు ఉపాధి దొరుకుతుంది. రైతులకు మేలు జరుగుతుంది.– బోయిని లక్ష్మి, పెద్దంపేటరైతన్నలకు ఆసరాగా...బెంగాల్ ఎన్నికలకు హమాలీలు పోవడంతో, వడ్లు, మొక్కజొన్న పంట కాటా వేయటంలో జాప్యం జరుగుతోంది. దీంతో మావాడ కట్టు వాళ్లం అందరం కలిసి గ్రూప్గా ఏర్పడి కాంటా వేయడం లాంటి పనులు చేస్తున్నాం. మేము జోకిన బస్తాలను మగ హమాలీలు లారీల్లో లోడ్ చేస్తారు. దీంతో సమయం కలిసి వచ్చి రైతన్నలకు ఆసరా అవుతుంది. – దబ్బెట స్వప్న, పెద్దంపేటఎండ రాకముందే...అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో హమాలీల సేవలు సరిపోక, ధాన్యం కాంటా వేయటానికి జాప్యం జరుగుతోంది. దీంతో మేమే హమాలీలుగా అవతారమెత్తాం. ఎండరాకముందే ఉదయం 11 లోపు తూకం వేసి కాంటాలు పెడుతున్నాం. పురుషుల ప్రొత్సాహంతోనే రైతులకు ఆసరాగా నిలుస్తున్నాం.– మానుక భీమక్క, పెద్దపేట – గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లిఫోటోలు: మర్రి సతీష్ రెడ్డి -
21,452 మందికి మొండిచేయి
‘లైట్స్.. కెమెరా.. యాక్షన్’ తరహాలో మత్స్యకార సాయం పంపిణీలో సీఎం చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మంటలేని స్టవ్పై గరిట తిప్పి చేపల కూర వండేసిన చంద్రబాబు.. దానిని మత్స్యకార మహిళలకు వడ్డించారు. తాను కూడా నేలపై కూర్చుని వారితోపాటే భోజనం చేశారు. దీనికి పచ్చమీడియా విస్తృత ప్రచారం కల్పించింది. చివరకు అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని తేలిపోయింది. ఇదే విషయాన్ని మత్స్యకారులు కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై మీమ్స్, సెటైర్లు పేలుతున్నాయి. నిజంగా అంతటి అభిమానం, ప్రేమ చంద్రబాబుకు తమపై ఉంటే ఈ రోజు ఇన్ని వేల మందికి వేట నిషేధ భృతికి ఎగనామం పెట్టి రోడ్డున పడేసేవారు కాదని మత్స్యకారులు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘మత్స్యకార సేవలో..’ పథకం వెన్నుపోటు తోవలో నడిచింది. మాటల గారడీతో సీఎం చంద్రబాబు మత్స్యకారులను బురిడీ కొట్టించారు. సముద్రంపై చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార సాయంలో అడ్డగోలుగా కోతలు విధించిన చంద్రబాబు సర్కారు గంగపుత్రులకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో 21,452 మంది మత్స్యకారులకు కొర్రీల మీద కొర్రీలు వేసి దాదాపు రూ.42.90 కోట్లకు పైగా ఎగ్గొట్టారు. దీనిపై మత్స్యకారులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డబుల్ చేస్తానని డబ్బాకొట్టి.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు సముద్రంపై వేట నిషేధ సమయంలో జీవనాధారం కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ భృతి అందిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచి డబుల్ చేస్తామని చంద్రబాబు, పవన్కళ్యాణ్ హామీ ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టగా.. రెండో ఏడాది అరకొర సాయానికే పరిమితమైంది.ఈ ఏడాది ఆదినుంచీ వేట నిషేధ భృతికి అర్హుల సంఖ్యను కుదిస్తూ కోతలు పెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 19న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో చంద్రబాబు ఆర్భాటంగా చేశారు. 1,30,796 కుటుంబాల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేసినట్టు చంద్రబాబు ఆ కార్యక్రమంలో ఘనంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నం తీరాచూస్తే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 18న మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట నిషేధ లబ్ధి కోసం రిజి్రస్టేషన్ ఉన్న బోట్లపై ప్రభుత్వం లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వే చేపట్టింది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, తిరుపతి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే అనంతరం 1,52,248 మంది లబ్ధిదారులను గుర్తించింది.వీరిలో విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని, పింఛను, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారనే సాకులతో 9,045 మందిని జాబితా నుంచి తొలగించింది. మరో 12,407 మంది మెకనైజ్డ్ బోట్ల(సముద్రంలో లోతైన జలాల్లోకి వేటకు వెళ్లే పెద్ద బోట్లు, ట్రాలర్లు) లబ్ధిదారులకు కూడా ఎగనామం పెట్టింది. ఇలా మొత్తంగా 21,452 మంది మత్స్యకారులను అనర్హులుగా తేల్చింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 4,883 మందికి వేట నిషేధ భృతిని ఎగ్గొట్టేసింది. రెండో స్థానంలో కాకినాడ జిల్లాలో 2,692 మందికి కొర్రీలతో కోతపెట్టి రోడ్డున పడేసింది. ఇందుకు చూపించిన కారణం కూడా చాలా అన్యాయంగా ఉందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ డీజిల్ వినియోగించారని.. మెకనైజ్డ్ బోట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం డీజిల్ రాయితీ లీటరుకు రూ.9 వంతున ఇస్తోంది. సముద్ర వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్ల రాయితీ డీజిల్ వెయ్యి లీటర్ల కంటే తక్కువ వినియోగించారనే (సముద్ర వేటకు వెళ్లలేదని నిర్ధారణకు వచి్చ) సాకుతో వారి పేర్లను జాబితా నుంచి తొలగించింది. పోనీ వేట నిషేధ భృతి పొందేందుకు రాయితీ డీజిల్ వినియోగించాలనే విషయాన్ని ఎక్కడైనా చెప్పిందా అంటే అదీ లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆర్థిక సాయం ఎగనామం పెట్టేందుకే ఈ నిబంధనను అర్ధాంతరంగా అమలు చేశారని నిప్పులు చెరుగుతున్నారు.సముద్ర వేట కోసం ఒక్కో బోటుపై 8 నుంచి 10 మంది సముద్రంపై వేటకు వెళుతుంటారు. అటువంటిది ఒక్క కాకినాడ జిల్లాలో 385 మెకనైజ్డ్ బోట్లు ఉంటే 27,070 మందిని అర్హులుగా గుర్తించి జాబితా కూడా తయారు చేశారు. తీరాచూస్తే.. సవాలక్ష కొర్రీలతో ఈ ఒక్క జిల్లాలోనే 2,692 మంది పొట్టగొట్టి నిషేధ భృతికి ఎగనామం పెట్టారు.వీరిలో అత్యధికంగా అన్యాయమై పోయింది కాకినాడ నగరం జగన్నాథపురం, ఏటిమొగ, దుమ్ములపేట తదితర ప్రాంతాల్లో 2,500 మంది కావడం గమనార్హం. వీరంతా కాకినాడ మత్స్యకార అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 61 రోజుల పాటు ఉపాధి లేక అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తే ఇప్పుడు ఇలా కొర్రీల మీద కొర్రీలు వేసి సాయం ఇవ్వకుండా మొండిచేయి చూపించడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జి జేడీ ఎల్బీఎస్ వర్ధన్ వద్ద ప్రస్తావిస్తే మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే మత్స్యకారులకు సాయం జమకాని విషయాన్ని శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. 3 మీటర్లు ఉన్నాయని ఇవ్వలేదు మాది కాకినాడ సమీపంలోని దుమ్ములపేట. ప్రభుత్వం మత్స్యకారుల సేవలో అని వేట నిషేధ భృతిని విడుదల చేసింది. నా పేరు లిస్టులో ఉన్నప్పటికీ నాకు మత్స్యకార భరోసా పడలేదు. ఇదేమని అడిగితే నా పేరిట మూడు కరెంటు మీటర్లు ఉన్నాయని తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. నాకు ఒక్క విద్యుత్ మీటర్ కూడా లేదు. వేట నిషేధ భృతి ఇచ్చి ఆదుకోవాలి. – పేర్ల సత్తిబాబు, దుమ్ములపేట, కాకినాడ70 శాతం మందికి డబ్బులు పడలేదు మా మావయ్యకు బోటు ఉంది. దానిపైనే వేటకు వెళ్తుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఏటా మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు జమైంది. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పైసా జమ కాలేదు. గతేడాది కూడా కొంతమందికి జమ కాలేదు. ఈ ఏడాదైతే ఏకంగా 70 శాతం మందికి డబ్బులు పడలేదు. నాకు కూడా పడలేదు. నిషేధ భృతి డబ్బులు జమ కాకపోతే ఎలా బతికేది? – వాసుపల్లి అప్పన్న, అన్నవరం, భీమిలి మండలం, విశాఖ జిల్లావేటకు వెళ్లినా భృతి ఇవ్వలేదు బోటు నంబర్ 546పై చేపల వేటకు వెళ్లాం. అర్హుల జాబితాలో నా పేరు కూడా ఉంది. ఈ నెల 19న వేట నిషేధ భృతి జమ చేస్తున్నామంటే ఆనందపడ్డాం. కానీ వారం రోజులైనా ఇప్పటివరకు మా ఖాతాలకు డబ్బులు పడలేదు. గతేడాది కూడా చాలా మందికి డబ్బులు పడలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వేట నిషేధ భృతి ఇవ్వాలి. – బడే ఎల్లాజి, కొండరాజుపాలెం, విజయనగరం జిల్లా -
నేడు టాటా సన్స్ భేటీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్లోని పలు అన్లిస్టెడ్ సంస్థల నష్టాలు భారీగా పెరుగుతున్న తరుణంలో టాటా సన్స్ బోర్డు మంగళవారం (నేడు) సమావేశం కానుంది. ఈ సందర్భంగా సంస్థల ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునరి్నయామకం అంశం చర్చకు రాకపోవచ్చని పేర్కొన్నాయి.టాటా గ్రూప్లో అంతర్గతంగా విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో టాటా సన్స్ బోర్డు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్లో భాగమైన అన్లిస్టెడ్ సంస్థలు రూ. 10,905 కోట్ల నష్టాలు ప్రకటించాయి. అటుపైన ఇవి రూ. 29,000 కోట్లకు చేరి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
రెండు ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో హైదరాబాద్ కంపెనీ దీపా జ్యువెలర్స్తోపాటు ఫార్మాస్యూటికల్ రంగ సంస్థ కోటెక్ హెల్త్కేర్ చేరాయి. 2025 సెపె్టంబర్లో కోటెక్ హెల్త్, డిసెంబర్లో దీపా జ్యువెలర్స్ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తాజా అనుమతులతో ఐపీవో చేపట్టడం ద్వారా రెండు కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్కానున్నాయి. ఈక్విటీ జారీ.. ఫార్మా రంగ కంపెనీ కోటెక్ హెల్త్కేర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 295 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 60 లక్షల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 226 కోట్లు కొత్త ప్రాజెక్ట్పై వెచ్చించనుంది. తద్వారా ప్రస్తుత తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంతోపాటు.. కొత్త ప్రొడక్టుల తయారీని చేపట్టనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ ఫార్మా రంగంలో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ(సీడీఎంవో) సేవలను సమకూర్చుతోంది. హాల్మార్క్తో.. ఐపీవోలో భాగంగా హాల్మార్క్ కలిగిన బంగారు ఆభరణాలు సరఫరా చేసే దీపా జ్యువెలర్స్ రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా 1,18,48,340 షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆశిష్ అగర్వాల్, సీమా అగర్వాల్ విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 215 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్కు వెచ్చించనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్సహా.. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కార్యకలాపాలు విస్తరించింది. -
చిలీలో తీవ్ర భూకంపం
శాంటియాగో: నిన్న మధ్యాహ్నం ఉత్తర చిలీలోని అంటో ఫాగస్టా ప్రాంతంలో తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. యూనివర్శిటీ ఆఫ్ చిలీకి చెందిన నేషనల్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం సాయంత్రం 5:52 గంటలకు ఈ భూకంపం వచ్చిందని కలామా నగరానికి దక్షిణంగా 12 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపంలో ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనట్లు తెలుస్తోంది. చిలీ దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతమైన "పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉంది. ఈ భౌగోళిక కదలికల వల్లే చిలీలో నిరంతరం తీవ్రమైన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.చిలీ ప్రాంతం ఇప్పటి వరకూ దాదాపు 100కు పైగా భారీ భూకంపాలను ఎదుర్కొంది. ఇందులో దాదాపు 30 భూకంపాలు 8.0 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన వంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భారత కంపెనీల లాభాలకు రిస్క్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఏర్పడిన సరఫరా పరమైన అవరోధాలు మరింత కాలం పాటు కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు (2 శాతం) తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కాకపోతే బలమైన బ్యాలన్స్ షీట్లు, దేశీ డిమాండ్ స్థిరంగా ఉండడం, ప్రభుత్వ మూలధన వ్యయాల మద్దతుతో భారత కంపెనీలు ఈ సమస్యలను ఎదుర్కొని బలంగా నిలుస్తాయని అంచనా వేసింది. 34 రంగాల్లోని సంస్థలు ఏ మాత్రం ఒత్తిళ్లను ఎదుర్కోగలవన్న దానిపై క్రిసిల్ రేటింగ్స్ ఒక అధ్యయనం చేసింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న పశ్చిమాసియా ఘర్షణ దేశీ కంపెనీలు తమ సరఫరా చైన్లను తిరిగి సమీక్షించుకోవడం, ధరల ఒత్తిళ్లను అధగమించడం, అధిక ఇంధన, రవాణా వ్యయాలను ఎదుర్కోవడం, కరిగిపోతున్న రూపాయి విలువను తట్టుకుని నిలబడేలా ప్రేరేపిస్తున్నట్టు వివరించింది. సంఘర్షణ ముగిసేందుకు, స్థిరీకరణకు ఎక్కువ కాలం పడితే, సరఫరా సమస్యలతో ద్రవ్యోల్బణం పెరిగిపోయి డిమాండ్పై ప్రభావం పడొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు. కనుక ఘర్షణ స్థాయి, అది ఎంత కాలం పాటు కొనసాగుతుంది, చమురు ధరల పెరుగుదల ఎంత కాలం పాటు కొనసాగుతుందన్నది కీలకంగా చూడాల్సి ఉంటుందని.. ఇవన్నీ కంపెనీల క్రెడిట్ నాణ్యతను (రుణాలకు సకాలంలో చెల్లింపులు) ప్రభావం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మూడో నెలలోకి ప్రవేశించడం, ఇంకెంత కాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోవడంతో కంపెనీలపై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు క్రిసిల్ రేటింగ్స్ ఈ అధ్యయం చేయడం గమనార్హం. తొమ్మిది నెలల పాటు సమస్యలే.. సరఫరా సమస్యలు తొమ్మిది నెలల పాటు కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చమురు ధరలు బ్యారెల్కు సగటున 110 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. కనీసం 95 డాలర్ల స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఆదాయ వృద్ధి కంటే ఖర్చులను నియంత్రించుకోవడం, లాభదాయకతను కాపాడుకోవడం కంపెనీలకు సవాళ్లుగా క్రిసిల్ రేటింగ్స్ ఎండీ సుబోధ్ రాయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఎనిమిది రంగాల్లోని కంపెనీల రుణ నాణ్యత ప్రభావితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, రొయ్యల ప్రాసెసర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ దారులు రూపాయి విలువ క్షీణతతో లాభపడొచ్చని తెలిపింది. -
సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఇరాన్తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. ఇరాన్తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు.. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలని సూచించారు. ఆ ఒప్పందాలపై ఇరాన్ కూడా సంతకం చేయడం గౌరవంగా ఉంటుందని వెల్లడించారు. అత్యంత సంక్లిష్టమైన చిక్కుముడిని విడదీయడానికి అమెరికా కృషి చేస్తోందన్నారు. చర్చల్లో పాల్గొంటున్న దేశాలు ఏకకాలంలో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి కావాలని ఆకాంక్షించారు. ఒకరిద్దరు సంతకాలు చేయకపోవడానికి తగిన కారణం ఉంటే అంగీకరించవచ్చని తెలిపారు. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చల్లో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్ భాగస్వామిగా కొనసాగుతున్నాయి. అయితే, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు అబ్రహం ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు చేశాయి. మిగిలిన దేశాలు కూడా అదే బాటలో నడవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఖమేనీ నుంచి ప్రతిస్పందన ఆలస్యం ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన గుర్తు తెలియని ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఆయనను కలుసుకోవడం ఇరాన్లోని అత్యంత ముఖ్యులకు తప్ప ఇతరులకు సాధ్యపడదు. శాంతి చర్చల విషయంలో అమెరికా ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీకి చేరవేయడం, ఆయన నుంచి ప్రతిస్పందన రావడానికి చాలా సమయం పడుతోందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అందుకే శాంతి ఒప్పందం ఖరారు కావడం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఒప్పందం ముసాయిదాను ఖమేనీ దాదాపు అంగీకరించారని సీనియర్ పరిపాలనా అధికారి ఒకరు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్ నుంచి తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చాలామంది ఇరాన్ నాయకులు పగటి వెలుగు చూడకుండా, వారాల తరబడి అత్యంత పటిష్టమైన బంకర్లలో గడుపుతూ, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని అమెరికా మీడియా వెల్లడించింది. చర్చల్లో గణనీయమైన పురోగతి: రూబియో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం చెప్పారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తున్నారని, చెడ్డ ఒప్పందాన్ని ఆయన అంగీకరించబోరని తేల్చిచెప్పారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒప్పందం అత్యవసరమేమీ కాదు: ఇరాన్ అమెరికాతో ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యవసరమేమీ కాదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై స్పష్టంచేశారు. చర్చలో ఉన్న చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చామని చెప్పడం సరైనదే అవుతుందన్నారు. అయితే, దీని అర్థం ఒప్పందంపై సంతకాలు త్వరలో జరగబోతున్నాయని చెప్పడం కాదని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్లు ఇప్పటికే ఈ అవగాహనా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 60 రోజులపాటు కాల్పుల విరమణ, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళిక వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. -
వాహ్.. తాజ్!
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో సోమవారం బిజీబిజీగా గడిపారు. భార్య జీనెట్ రూబియో, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ను, రాజస్తాన్ రాజధాని జైపూర్లోని అంబర్ కోటను సందర్శించారు. తాజ్మహల్ సందర్శన అద్భుతమైన అనుభవమని మార్కో రూబియో కొనియాడారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ప్రేమ సౌధాలలో ఒకటైన తాజ్మహల్ను సందర్శించడానికి మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’అంటూ సందర్శకుల పుస్తకంలో రాశారు. అమెరికాలో వెచ్చని వాతావరణం ఉంటే మియామీలో జన్మించిన రూబియో నిండు వేసవిలో ఆగ్రాలోని మండుటెండకు పెద్దగా చలించనట్లే కనిపించారు. అయితే, ఫొటోలకు పోజులిచ్చే ముందు ఆయన తన నెక్ టైని తీసివేశారు. తాజ్మహల్ సందర్శన అనంతరం ప్రత్యేక విమానంలో జైపూర్కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాజస్తానీ పద్ధతిలో సంప్రదాయ స్వాగతం లభించింది. 16వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన అంబర్ కోటను ఆసక్తిగా తిలకించారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. జానపద నృత్యాలతో కళాకారులు అలరించారు. నేడు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం మార్కో రూబియో మంగళవారం ఢిల్లీలో ‘క్వాడ్’విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు హాజరు కాబోతున్నారు. ‘క్వాడ్’లో భారత్, ఆమెరికా, ఆ్రస్టేలి యా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, ఇండో–పసిఫిక్లో భద్రత వంటి కీలక అంశాలపై క్వాడ్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అరుదైన ఖనిజాలు, టెక్నాలజీ సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై విదేశాంగ మంత్రులు చర్చించబోతున్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ కోసం క్వాడ్ దార్శనికత ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంకేతాలిచ్చింది. అలాగే ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి మంగళవారం నాటి సమావేశంలో విస్తృత ఎజెండాను నిర్ధారించే అవకాశం ఉంది. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు గత ఏడాది అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగింది. తాజ్ చరిత్ర తెలిసి ఉంటే ఫొటో దిగే వారు కాదేమోఅమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఆగ్రాలో తాజ్మహల్ను సందర్శించడం పట్ల హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం స్పందించింది. ‘‘రూబియోకు తాజ్మహల్ చరిత్ర తెలిసి ఉంటే ఆయన ఆ స్మారక చిహ్నం వద్ద ఫొటోకు పోజు ఇచ్చి ఉండేవారు కాదు’’అని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘‘మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఇరానియన్ భార్యపై ఉన్న ప్రేమతో, ఇరానియన్ వాస్తుశిల్పుల మేధస్సుతో తాజ్మహల్ను నిర్మించారు. మరోవైపు అమెరికా ప్రభుత్వం నేడు ఇతర నాగరికతలను అవమానిస్తూ, ఇరానియన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని బెదిరిస్తోంది’’అని ఆరోపించింది. తాజ్మహల్ ఎదుట భార్యతో పాటు రూబియో దిగిన ఫొటోను ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం షేర్ చేసింది. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ 1593లో ఆగ్రాలో జన్మించారు. ఆమె అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. ఆమె తండ్రి అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ ఒక పర్షియన్(ఇరాన్) రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అని చరిత్ర చెబుతోంది. -
గొంతెండుతోంది ‘బాబూ’.. నీరు.. బేజారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె తాగునీటి ఎద్దడితో ఘోషిస్తోంది. మండుటెండల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా చంద్రబాబు సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. వేసవిలో ఏ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తుతుంది? పరిష్కార మార్గం ఏమిటి? ఎంత నిధులు అవసరం? అనే వివరాలతో ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం ఏటా డిసెంబర్, జనవరిలోనే ప్రభుత్వానికి ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటిపారుదలశాఖ) అధికారులు ప్రతిపాదనలు పంపుతారు. వీటిని బుట్టదాఖలు చేసిన చంద్రబాబు సర్కారు మే చివరిలో కేవలం చిల్లర విదిల్చింది. ఈ ఏడాది నదుల్లో ప్రవాహం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడంతో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సమస్య నెలకొంది. కొన్ని చోట్ల వారం పది రోజులకు కూడా నీరు అందడం లేదు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళంతో పాటు చాలా జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నీటి కోసం రాస్తారోకోలు నిర్వహించారంటే ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టమవుతోంది. పాతాళంలో జలాలు..అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం కొత్త కాకపోయినా ఈ ఏడాది తూర్పు గోదావరి లాంటి జిల్లాల్లో కూడా అడుగంటాయి. దీన్నిబట్టే రాష్ట్రంలో బోర్లు పరిస్థితి, తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో పుట్లూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్లకు పడిపోయాయి. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు. మరో 20 మండలాల్లో కూడా భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గాయి. కర్నూలు జిల్లాలో కోసిగి, ప్యాపిలి, దేవనకొండ, బేతంచర్ల, క్రిష్ణగిరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, హాలహర్వి, నందికొట్కూరు, సంజామలలో ప్రమాదకర స్థాయిలో సగటున 100–150 మీటర్ల వరకూ తగ్గిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 40 అడుగులు మేర భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో గతంలో పోలిస్తే రక్షిత మంచినీటి పథకాలకు నీటి లభ్యత 50 శాతం తగ్గింది. ఫలితంగా వీటిపై ఆధారపడిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.అసలే ఎద్దడి.. ఆపై కలుషిత నీరుగుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలుతో పాటు చాలా పట్టణాల్లో మునిసిపాలిటీ పైపులైన్ల లీకేజీతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీనికి తోడు మంచినీటి ఎద్దడి నెలకొంది. కలుషిత నీరు, నీటి ఎద్దడి వెరసి మునిసిపాలిటీ నీటిపై నమ్మకం లేక చాలామంది మినరల్ వాటర్ క్యాన్లు, ఇళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో కూడా మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. మినరల్ వాటర్ ఆటో గ్రామానికి వస్తే బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. తాగునీటి కోసం రోజూ రెండు బిందెలు చొప్పున నెలకు రూ.600 వరకు తాగునీటి కోసం ఒక్కో కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉపాధి హామీ కూలీలు తమ మూడు రోజుల కూలీని తాగునీటి కోసం ధార పోయాల్సిన పరిస్థితి. తాగునీరు సంగతి పక్కనపెడితే వంటకు, స్నానానికి ఇతర అవసరాలకు కూడా నీరు దొరకని దారుణ పరిస్థితి తలెత్తింది.అచ్చెన్న ఇలాకాలో గిరిజనుల అవస్థ..శ్రీకాకుళం జిలాల్లో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలితో పాటు కంచిలి, ఆముదాలవలస, హిర, పాతపట్నంలోని చాలా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉంది. కంచిలి మండలం నువాగడలో గిరిజనులు నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడికి తాగునీటిని సరఫరా చేసే పథకాలు పాడయ్యాయి. ఉద్దానం నీటి పథకం ద్వారా జేజేఎం ట్యాప్ పాయింట్లకు నీటి సరఫరా కావడం లేదు. స్థానిక పంచాయతీ బోరు కూడా పని చేయకపోవడంతో గిరిజనులు దాహార్తితో అల్లాడుతున్నారు.– టెక్కలి మండల కేంద్రంలో తాగునీరు లేదు. దీంతో వైఎస్సార్సీపీ, ఇతర దాతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. – హిర మండలంలో పక్కనే వంశధార ఉన్నా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చిన్నకోరాడ పంచాయతీలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డుపై రాస్తారోకో చేశారు.– ఆముదాల వలస శివారు గ్రామాలు పార్వతీశ్వరునిపేట, జగ్గుశాస్త్రులపేట, తిమ్మాపురంలో వారానికి ఒక్కరోజే తాగునీరు అందుతోంది.– పాతపట్నం మడలం రంకిణీ గిరిజన గూడెంలో బోర్లు లేవు. ఇంటింటికీ తాగునీరు ఇస్తామని పైపులైన్లు వేసి వదిలేశారు.బోర్లు.. భోరు భోరు!– ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం మేజర్ పంచాయతీ జోహరాపురానికి బాపురం రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వక్కిరేణిలోని బురద నీటినే గ్రామ ప్రజలు వినియోగిస్తున్నారు.– అమలాపురంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. గత ప్రభుత్వంలో రూ.20 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు మంజూరై పనులు మొదలైనా కూటమి ప్రభుత్వం వచ్చాక అటకెక్కించింది. అల్లవరం. ఉప్పగుప్తం, అమలాపురం రూరల్ మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. – కాట్రేనికోన శివారు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. బాహ్యప్రపంచానికి దూరంగా సముద్రతీరంలో ఉన్న మగసానితిప్పకు గత ప్రభుత్వంలో పైపులైన్ వేసి నీరు సరఫరా చేశారు. ఇప్పుడు నిర్వహణ సరిగా లేకపోవడంతో నీరు అందడం లేదు. పల్లం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటి మొగ, చిర్రయానం, నీళ్లరేవు, చాకలిపేట, గొల్లపేటలో నీటి కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. కాట్రేనికోనలో 250 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి. కాంట్రాక్టర్కు బకాయిలు పెండింగ్ ఉండటంతో చేతులెత్తేశారు. జలజీవన్ మిషన్ నిధులతో పైపులైన్లు వేసి, ట్యాంకులు నిర్మించినా నిర్వహణ లేక నీళ్లు అందడం లేదు. – జగ్గంపేట నియోజకవర్గం గోకవరం, గండేపల్లి, కిర్లంపూడిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. – కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగితో పాటు శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. – పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం బురుజుల గ్రామస్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. ఇతర అవసరాలకు సుద్దవాగు నుంచి ఫ్లోరైడ్ నీటిని తెచ్చుకుంటున్నారు. – ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురంలో ఎస్ఎస్ ట్యాంకును శుభ్రం చేస్తూ సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు ఈనెల 20న నీటి సంపులో పడి మృతిచెందాడు. సురేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను ఇవ్వాలని కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో 26 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. – శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, రొళ్ల, మడకశిర, అమరాపురం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, రొద్దం, పరిగి, ముదిగుబ్బ, పుట్టపర్తి, ఎన్పీ కుంట మండలాల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు పలుమార్లు రోడ్డెక్కారు. జిల్లా నుంచి మంత్రులు సత్యకుమార్, సవిత ఉన్నా తాగునీటి పరిష్కారానికి చొరవ చూపలేదు. – వినుకొండ నియోజకవర్గం ఉప్పలపాడు, ములకలూరు, తలర్లపల్లి, మూర్తింజాపురం, జంగాలపల్లి, రావులాపురం, ఉప్పరపాలెంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వినుకొండలో నాలుగురోజులకు ఒకసారి తాగునీరు అందుతోంది. –వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు. ఇటీవల అధికారులు నిర్వహించిన వన్మంత్..వన్విలేజ్.. ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాకే సభలు, సమావేశాలు చేపట్టాలని అధికారులను నిలదీశారు.– నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం సోమశిల, పడమటి కంభంపాడులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పైపులైన్ మరమ్మతులతో నీటిని విడుదల చేయకపోవడంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. – రాయచోటి నియోజకవర్గం చక్రాయపేట, రెడ్డివారిపల్లె, ఎర్రగుడిగ్రామం బీఎన్ తాండా లో తీవ్ర నీటి సమస్య ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సురభి హరినజవాడ, కల్లూరిపల్లె గ్రామం సిద్దావాండ్లపల్లె, కాట్లగుంటివారిపల్లెలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ నిధులతో బోర్లు వేయించి సమస్య పరిష్కరించారు. –ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలో 22 గ్రామాలు, కనిగిరి నియోజవర్గంలో 18 గ్రామాల్లో, గిద్దలూరు పట్టణంతో పాటు 10 గ్రామాల్లో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 20 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. – కనిగిరి మండంలో సాగర్ నీళ్లు 20 రోజులకు ఒకసారి వస్తుండడంతో రాత్రిపూట పడిగాపులు కాసి మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారు.నాలుగు కి.మీ. వెళ్లాల్సిందే ...తాగునీటి కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని గూళ్యం, లేదా మూడు కిలోమీటర్ల దూరంలోని బళ్లూరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. గ్రామంలోని బోరు నీరు తాగేందుకు పనికిరాదు. సమీపంలోనే బాపురం రిజర్వాయర్ ఉన్నా మా గ్రామానికి నీటి సరఫరా కావడం లేదు. నిత్యం సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నాం. పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. – బి.గాదిలింగప్ప, ఎంపీటీసీ, సిద్దాపురం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా పొలాల్లో నీళ్లే దిక్కు..ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలువాల ఎస్ఎస్ ట్యాంకు ద్వారా గతంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. వేసవిలో వారం పది రోజులకు ఒక సారి నీటిని విడుదల చేస్తే ఎలా? గ్రామంలోని బోరు నీటిని ఇతర అవసరాలకు వాడుకుంటు తాగునీటి కోసం సమీప పొలాల్లోని వ్యవసాయ బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం. – తిమ్మగురుడు, గార్లదిన్నె, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా⇒ కుళాయిలో బురదనీరు వస్తున్న ఈ దృశ్యం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ఆదివారం కనిపించింది. తాగునీటి సంగతి దేవుడెరుగు.. ఇంటి అవసరాలకు కూడా ఈ నీరు పనికిరాదు. పంచాయతీ పైపులైన్లు దెబ్బ తినడంతో ఈ దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో నీటి సరఫరా ఎంత అధ్వానంగా ఎలా ఉందో చెప్పేందుకు ఇదో మచ్చు తునక!⇒ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం కొనకండ్లలో 12 వేల మంది నివాసం ఉంటున్నారు. రోజూ 6 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. కేవలం శ్రీసత్యసాయి వాటర్ స్కీం ద్వారా మాత్రమే నీరు అందుతోంది. ఈ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో 20 రోజులు సమ్మె చేశారు. దీంతో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి గ్రామస్తులు ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై రెండుసార్లు రాస్తారోకో చేశారు. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకుని రెండు నెలల బకాయిలు ఇస్తామని చెప్పారు. అయినా నీటి సమస్య పరిష్కారం కాలేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా జరుగుతోంది. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దారుణ పరిస్థితి ఇది! ఇక్కడే కాదు.. ఈ నియోజకవర్గంలోని విడపనకల్లు, కూడేరు మండలాల్లో కూడా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.⇒ కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 141 గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, బోర్ల హైరింగ్, ట్యాంకర్ల కోసం రూ.8.48 కోట్లు అవసరమని జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేసవి ముగుస్తున్నా ప్రభుత్వం చలించలేదు. చివరకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఈ నెల మూడో వారంలో కేవలం రూ.50 లక్షలు విదిలించింది. దీంతో జిల్లాలో వందల గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.⇒ నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో చాలా వీధులకు 20 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందిస్తున్నారు. వీరులపాడు మండలంలో 15 గ్రామాలకు వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. నందిగామ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి! జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం, మక్కపేట, మంగోల్లు, మాచినేనిపాలెం, వత్సవాయి మోడల్ కాలనీ, కాకరవాయి గ్రామాలలో కూడా తీవ్ర మంచినీటి సమస్య ఉంది. చంద్రబాబు సర్కారుపై నమ్మకం లేక ప్రజలు డబ్బులు వెచ్చించి మంచినీటిని కొనుగోలు చేస్తున్నారు.⇒ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఓ రాజ్యసభ సభ్యుడి నిధులు, జడ్పీ నుంచి రూ.40 లక్షలు మంజూరు చేయించారు. సాంకేతిక, పాలన అనుమతులు కూడా వచ్చాయి. కానీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ‘క్రెడిట్’ దక్కుతుందనే దుగ్ధతో టీడీపీ ఇన్చార్జ్ ఎరిక్షన్బాబు అడ్డుపడ్డారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు. కొలుకుల, తిరుమలగిరి, వెంకటాద్రిపాలెం, వాదంపల్లి, పెద్దారవీడు మండలంలోని చెట్లమిట్ట, మద్దెలకట్ట, త్రిపురాంతకం పాత అన్న సముద్రం గ్రామాల్లో డీప్ బోర్లు మంజూరయ్యాయి. గురిజేపల్లి, బోయపల్లి ఎస్సీ కాలనీ, ఆర్ ఉమ్మడివరానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ చొరవ చూపి బోర్లు మంజూరు చేయించారు. అయినాకూడా టీడీపీ నేతలు ఈ బోర్లు వేయనివ్వడం లేదు. ఇక పుల్లలచెరువు మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. -
రోప్వే ప్రమాదం.. బిక్కుబిక్కుమన్న 300 మంది
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొండోలా అని పిలిచే కేబుల్ కార్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో 65 క్యాబిన్లు ఎక్కడితక్కడే ఆగిపోయాయి. దీంతో అందులో ఉన్న టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అందులో గడిపారు.సోమవారం మధ్యాహ్నం గుల్మార్గ్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గుల్మార్గ్ను కాంగ్డోరికి వెళ్లే కేబుల్ కార వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అందులోని సుమారు 300 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గాల్లోనే ఉండిపోయారు.వాటిలో కొన్ని క్యాబిన్లు 500 అడుగుల ఎత్తులో ఆగిపోగా పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. ఇది చాలదన్నట్లు భారీ వర్షం కురియడంతో అందులోని పర్యాటకులు బెంబేలెత్తిపోయారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న భారత సైన్యం వెంటనే స్పందించిందిదాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మొదటి విడతగా క్యాబిన్లలో ఉండిపోయిన 179 మంది పర్యాటకులను సైనికులు సురక్షితంగా కిందికి దించారు. అనంతరం మరో రెండు గంటల అనంతరం వారినీ రక్షించారు. పోలీసులు, ఆర్మీతోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే గతంలోనూ ఓ సారి కేబుల్ కార్ వ్యవస్థలో లోపం తలెత్తింది. జూన్ 25, 2017 న బలమైన ఉరుముల సమయంలో, గోండోలా యొక్క కేబుల్ లైన్లో ఒక చెట్టు పడిపోయింది. క్యాబిన్లో 100 అడుగుల కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. Some visuals from the Gulmarg Gondola rescue operation after a technical snag left tourists stranded mid-air.Hats off to all the brave teams involved in the swift and successful rescue!@adgpi @ChinarcorpsIA @JmuKmrPolice @KashmirPolice @KashmirSdrf @NDRFHQ @GulmargGondola… pic.twitter.com/nOd0eibpws— vishal singh (@jammuvishal) May 25, 2026 -
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!!
దేవతల రాజధాని అంటే మన ఆలయాల భూములు కూడా ఆక్రమించి అమ్మేసి కట్టేది అని ఇప్పుడే అర్థమైంది స్వామి!! -
ఆల్కా లాంబాను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: 2024నాటి కేసులో మహిళా కాంగ్రెస్ చీఫ్ ఆల్కా లాంబాను ఢిల్లీ కోర్టు దోషిగా ప్రకటించింది. అప్పట్లో ఆమె జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన సమయంలో రహదారిపై బైటాయింపు, పోలీసుల విధులకు ఆటంకం కల్గించడం వంటి ఆరోపణలపై కేసు నమోదైంది. సోమవారం అదనపు చీఫ్ జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ అశ్వనీ పవార్ ఈ కేసు విచారణ చేపట్టారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా నిరసన తెలిపే సమయంలో బాధ్యత గల పౌరురాలిగా ఆల్కా లాంబా వ్యవహరించలేదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నాయంటూ పోలీసులు చేసిన హెచ్చరికలను సైతం ఆమె పట్టించుకోలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. మోపి నాలుగు నేరారోపణల్లోనూ ఆమెను దోషిగా నిర్ధారించవచ్చని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో ఆల్కా లాంబాకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. తీర్పును జూన్ 4వ తేదీన ప్రకటిస్తామని మేజిస్ట్రేట్ తెలిపారు. -
అస్సాం అసెంబ్లీలో యూసీసీ బిల్లు
గువాహటి: బహుభార్యత్వంపై నిషేధం, సహజీవన భాగస్వామ్యాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి వంటి ప్రతిపాదనలతో కూడి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)బిల్లును అస్సాం ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒకరికి మించి భార్యలను కలిగి ఉండేవారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, సహజీవనాలను ముందుగా నమోదు చేయించుకోకుంటే మూడు నెలల కారాగారానికి వీలు కల్పిస్తూ ఇందులో నిబంధనలను పొందుపరిచారు. కనీస వివాహ వయస్సును పురుషులైతే 21 ఏళ్లు, మహిళలయితే 18ఏళ్లుగా ప్రతిపాదించారు. అయితే, ఇవేవీ రాష్ట్రంలో నివసించే షెడ్యుల్డ్ తెగల వారికి వర్తించవని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అతుల్ బోరా బిల్లును ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో చట్టాల ఏకీకృతం, సరళీకృతమే తమ లక్ష్యమని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బిల్లుపై కాంగ్రెస్, టీఎంసీ, రైజోర్ దళ్ వంటి పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపాదిత అంశాలపై ముందుగా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అస్సాం యూసీసీ కూడా ఒకటి. బిల్లుపై బుధవారం చర్చ జరిగే అవకాశముంది. -
త్వరలో మద్యం ధరల పెంపు!
సాక్షి, అమరావతి: మద్యం ధరలు పెంపు దిశగా చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా ఆదాయం భారీగా పెంచుకునేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. మద్యం ధరలు పెంచితే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎలా ఉంటాయనే విషయంపై కూడా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానంపై మంత్రి వర్గ ఉప సంఘం సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. విమానాశ్రయాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన (మద్యం దుకాణాల సంఖ్య పెంచడం) దిశగా ఉప సంఘం చర్చించింది. అధిక శుద్ధి ఆల్కహాల్ తయారీకి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, కమిషనర్ చామకూరి శ్రీధర్ పాల్గొన్నారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.దశమి ఉ.7.47 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఉత్తర ఉ.6.57 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ప.3.36 నుండి 5.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.55 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.34 వరకు, అమృత ఘడియలు: రా.1.30 నుండి 3.10 వరకు.సూర్యోదయం : 5.33సూర్యాస్తమయం : 6.19రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.వృషభం... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.మిథునం.. ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.కర్కాటకం.... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వస్తులాభాలు.సింహం.... రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు.కన్య... కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభసూచనలు. ప్రముఖుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత రాణింపు.తుల.... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక డీలాపడతారు.వృశ్చికం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.ధనుస్సు... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.మకరం..... శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.కుంభం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.మీనం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. -
మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన డీఎస్సీ–2025 పరీక్షలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆక్షేపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పేపర్ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టుల మాయం వంటి ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్త నోటిఫికేషన్ను ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. నారా లోకేశ్ని మంత్రి పదవి నుంచి తప్పించి ... మెగా డీఎస్సీని స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సోమవారం సీఎం చంద్రబాబు సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా ⇒ డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. దీనికేమి సమాధానం చెబుతారు? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘డార్క్ ఆపరేషన్’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? ⇒ రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? ⇒ టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి? మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలి. చంద్రబాబూ..! మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. -
టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాక్
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కుటుంబ ఆర్ధిక అక్రమాల బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీల ముసుగులో అక్రమ నిధులను మళ్లించడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. కేశినేని చిన్ని కుటుంబానికి చెందిన ‘ప్రైడ్ ఇ్రన్ఫాకాన్ ఎల్ఎల్పీ కంపెనీ’ ముసుగులో అక్రమ నిధులు మళ్లించడంపై విచారణ చేపట్టింది. కంపెనీలో డైరెక్టర్గా ఉన్న కేశినేని చిన్ని భార్య జానకీ లక్ష్మికి నోటీసులు జారీ చేసింది.ఈ నెల 27న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో మంత్రి లోకేశ్ క్యాంపుతోపాటు టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. కేశినేని చిన్ని షెల్ కంపెనీల ముసుగులో ఆర్ధిక అక్రమాలకు పాల్పడినట్లు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని గతంలోనే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆమేరకు కీలక ఆధారాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని కుటుంబ కంపెనీల ఆర్ధిక వ్యవహారాలపై ఈడీ విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రమ నిధుల మళ్లింపు..? టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులు. అంతేకాదు.. అక్రమ నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా కాన్ ఎల్ఎల్పీ.. హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వేనంబర్ 403, ప్లాట్ నంబర్ 9 )తో రిజిస్టర్ అయ్యాయి. ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ ( accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారని కేశినేని నాని ఆరోపించారు. కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, డెలావేర్, యూఎస్ఏ కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ కంపెనీలు భారీగా నిధులను అక్రమంగా తరలించి మనీలాండరింగ్కు పాల్పడినట్లు తెలిపారు. రాజ్ కేసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీ లక్ష్మి భాగస్వామిగా ఉన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారు.లోకేశ్ క్యాంపులో గుబులు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేయడం మంత్రి లోకేశ్ క్యాంప్లో గుబులు రేపుతోంది. లోకేశ్కు బినామీగా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) పగ్గాలు ఆయనకు అప్పగించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీగా పేరుపడిన ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఊరూ పేరూలేని కంపెనీకి విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ కేబినెట్ ఆమోదించింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి లోకేశ్ ప్రతినిధిగా చిన్ని చక్రం తిప్పుతున్నారు. లోకేశ్, కేశినేని చిన్ని ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనల వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేశినేని చిన్ని కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేయడంతో తదుపరి పరిణామాలపై చినబాబు క్యాంప్ మల్లగుల్లాలు పడుతోంది. ఈడీ విచారణకు సహకరిస్తాం: కేశినేని చిన్ని, టీడీపీ ఎంపీ తమ కుటుంబానికి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రా కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. తన భార్య జానకీ ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. ఈడీ నోటీసుల మేరకు ఈ నెల 27న విచారణకు హాజరవుతామని, విచారణకు సహకరిస్తామని చెప్పారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీలు ఇవీ.... ⇒ కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్(అమెరికా) ⇒ కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజస్ (దుబాయ్) ⇒ కేశినేని డెవలపర్స్ ప్రై.లిమిటెడ్ ⇒ కేశినేని ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పీ ⇒ పీవీఆర్ సన్నీ రిడ్జ్ హోమ్స్ ఎల్ఎల్పీ ⇒ గ్రాండ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పీ ⇒ ఓబికే ఇన్ఫ్రా హైట్స్ ఎల్ఎల్పీ ⇒ ఓక్వుడ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ ⇒ సెరెనిటీ వెంచర్స్ ఎల్ఎల్పీ ⇒ కేపిటల్ సిరామిక్స్ ఎల్ఎల్పీ ⇒ పయనీర్ లైఫ్ స్పేసస్ ఎల్ఎల్పీ ⇒ ఇఫైసెన్స్ ఇన్ఫ్రా ప్రై.లిమిటెడ్ -
రూ.50 వేల వరకు రైతులకు రుణమాఫీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో రైతులకు రూ. 50 వేల వరకు రుణాలు మాఫీ చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సీఎం విజయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి వినోద్, సహకార శాఖ మంత్రి వి. గాం«దీరాజ్, ఆరి్థక శాఖ మంత్రి ఎన్.మరియ విల్సన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆర్బీఐ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని 01.05.2025 నుంచి 28.02.2026 వరకు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణా లను మాఫీ చేయాలని సీఎం ఆదేశించారు. రూ.50 వేల వరకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తూ సంతకం చేశారు. అలాగే రూ. 50001 నుంచి లక్ష వరకు శ్లాబ్ల వారీగా విభజించి రూ.20వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 14,22,555 మంది రైతులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 5 షోలకు అనుమతితమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజయ్ను కలిసి థియేటర్లలో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వాలని గత వారం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్ 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు ఆటలు, స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవుదినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు. -
ఆకాశానికి ఇంధన రేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వినియోగదారులపై మరోసారి ఇంధన పిడుగు పడింది. గడిచిన పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపుతో సామాన్య, రవాణా రంగం కుదేలవుతోంది. దాదాపు పెట్రోల్పై రూ.7.98, డీజిల్పై రూ.7.75 పెరగడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజులు వ్యవధిలోనే నిత్యం పెరుగుతూ బడుగు జీవుల జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగం కనిపిస్తోంది. ప్రస్తుతం పెరిగిన ఇంధన రేట్లతో సామాన్యులపై ఏడాదికి పెట్రోల్పై రూ.2,600 కోట్లు, డీజిల్పై రూ.5,400 కోట్లు వెరసి మొత్తం రూ.8వేల కోట్లు భారం మోపుతోంది. పది రోజుల్లో నాలుగు సార్లు పెంపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన రేట్లు భారీగా పెరగ్గా.. అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లాలో లీటరు పెట్రోల్ రూ.118.39, డీజిల్ రూ.106.11 వరకు ఎగబాకింది. పదిరోజుల కిందట లీటరు పెట్రోల్ రూ.109.74, డీజిల్ రూ.97.47గా ఉంది. ఈ నెలలోనే వరుసగా 15, 19, 24, 25 తేదీల్లో రేట్లు పెంచడంతో దాదాపు డీజిల్, పెట్రోల్పై సగటున రూ.8(జిల్లాలను బట్టి రేట్లు మారతాయి) వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఫుల్ ట్యాంక్ నిల్.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన రేట్లు పైపైకి ఎగబాకుతుంటే మరోవైపు వాహనాలకు ఫుల్ ట్యాంక్పై పరిమితులు విధిస్తుండడం కొసమెరుపు. రేట్లు పెంచినప్పుడు దానికి తగ్గట్టుగా ఇంధనం సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఒక లావాదేవీకి కేవలం 200 లీటర్లకు మాత్రమే పరిమితి కొనసాగుతోంది. ఇక్కడ వాణిజ్య వాహనాలు, సరుకు, ప్రజా రవాణా వాహనాలు సగటున 350–400 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో నడుస్తాయి. కానీ, ప్రభుత్వం 200 లీటర్ల లోపే కట్టడి చేస్తుండడంతో పదేపదే పెట్రోల్ బంకుల వద్ద సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు నోటీసులా? 200 లీటర్లకు మించి ఇంధనాన్ని ఒకే లావాదేవీలో నింపితే డీలర్లకు ఆయిల్ కంపెనీలు ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా నోటీసులు జారీ చేసి, విక్రయాలను నిలిపివేస్తుంటే ప్రభుత్వం వేడుక చూస్తోంది. ఫలితంగా డీలర్లతో పాటు పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోంది. పైగా ఆస్పత్రులు, ఆక్వా, వ్యవసాయం, బోరువెల్స్ నిర్వహణలో జనరేటర్లు వినియోగించే వారికి అరకొర ఇంధనం అందిస్తే తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇంధన రంగంలో ఇన్ని సమస్యలు ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపకుండా.. ఇష్టారీతిన ఇంధన ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. -
డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వ బరితెగింపు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ/కోరుకొండ : డీఎస్సీ నియామకాల్లోను స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వ బరితెగింపు అత్యంత దుర్మార్గమని మాజీమంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి భావిపౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. వీరు సోమవారం వేర్వేరు చోట్ల డీఎస్సీ అక్రమాలపై స్పందిస్తూ ఏమన్నారంటే.. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా?.. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది? ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా? కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే పైలా పచ్చిస్లా సాగింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ వాళ్లది తడిగుడ్డల పార్టీ. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్కళ్యాణ్ కార్ టాప్పై ఎక్కి మరీ వచ్చారు.. ఇప్పుడు బందరులో కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదు? – పేర్ని నాని, మాజీమంత్రిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. నిరుద్యోగులను చంద్రబాబు, లోకేశ్ దగా చేశారు. అది మెగా డీఎస్సీ కాదు. మెగా స్కామ్. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వ పెద్దల గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నారు? జిల్లా సెలక్షన్ కమిటీలను ఎందుకు నిర్వీర్యం చేశారు? టెట్ నిబంధనలను ఎందుకు మార్చేశారు? ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. – మేరుగు నాగార్జున, మాజీమంత్రిలోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు.. చంద్రబాబు సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. అది మెగా డీఎస్సీ కాదు.. పూర్తిగా మాయా డీఎస్సీ. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖను ఆయన పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం చెప్పడంలేదు. లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. – ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి.. సీఎం చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అవినీతి అడ్డూ, అదుపులేకుండా సాగుతోంది. డీఎస్సీ నిర్వహించిన వ్యక్తే టాపర్గా నిలవడం, ముందుగా పేపర్ లీక్ అవడం భారీస్కామ్ జరిగిందనడానికి బలం చేకూరింది. టాపర్గా నిలిచిన వ్యక్తికి పోస్టు ఇవ్వకపోవడం.. అక్రమాల ఆనవాళ్లు లేకుండా ఆన్లైన్ డేటాను డిలీట్ చేయడం, మెరిట్లిస్టును ప్రకటించకుండా, ఎంపికైన అభ్యర్థులకు మెస్సేజ్లివ్వడం సిగ్గుచేటు. ఈ స్కామ్పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు -
మెగా ‘డీల్’ఎస్సీ..!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీని చంద్రబాబు సర్కారు.. మెగా అవినీతి డీల్గా మార్చేసింది. అభ్యర్థుల బంగారు భవితతో దొంగాట ఆడింది. మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. టెట్ పరీక్షల నిర్వహణ నుంచి డీఎస్సీ నియామక పత్రాలు ఇచ్చే దాకా అడుగడుగునా జరిగిన లోపాలు బయటపడుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన తర్వాత కూడా మరికొందరికి శిక్షణ కేంద్రంలో ఆర్డర్లు ఇచ్చారు. మరోపక్క జిల్లాల్లో సర్టీఫికెట్ల పరిశీలన తర్వాత మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారని ప్రకటించిన అభ్యర్థులను సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగే వేడుకకు రావాలని అధికారులు ఫోన్ చేసి చెప్పి, తర్వాత మీరు ఎంపిక కాలేదని ప్రకటించారు.ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో మెగా డీఎస్సీలో చోటు చేసుకున్నాయి. అలాగే, టెట్ పూర్తయ్యాక పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల డేటా విద్యాశాఖ వద్ద ఉండాలి. కానీ ఈ డేటాను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏపీ టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఎన్నో కూడా ప్రభుత్వం వద్ద లేవు. దీంతో మార్కుల సవరణ చేసే అవకాశం కూడా అభ్యర్థులకే అప్పగించారు. మరోవైపు క్రీడా కోటా డీఎస్సీ పోస్టు భర్తీలో పక్కా ప్రణాళిక ప్రకారమే స్కామ్లకు పాల్పడ్డారు. తొలి దశలో స్క్రీనింగ్ కమిటీ, తుది దశలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అధికారుల కమిటీ పరిశీలించిన తర్వాత కూడా అనర్హులకు పోస్టులు దక్కడం విస్తుగొలుపుతోంది. టెట్ మార్కుల సవరణ అభ్యర్థులకే.. ప్రభుత్వం 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ కంటే ముందే 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్ నిర్వహించారు. అనంతరం సీపీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో అభ్యర్థులు టెట్ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, విద్యాశాఖ వద్ద గతంలో నిర్వహించిన టెట్ స్కోరు వివరాలు లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్లైన్లో టెట్ స్కోరు సవరించుకోవాలని కోరారు. నెలరోజుల్లో దాదాపు నాలుగు సార్లు ఈ అవకాశం ఇవ్వడంతో అభ్యర్థులు టెట్ స్కోరు నమోదు చేశారు. అయితే, ఎవరు ఎంత వేశారో లెక్కాపత్రం సర్కారు వద్ద లేకుండా పోయింది. దీంతో చేసేది లేక విద్యాశాఖ వద్ద ఉన్న స్కోరునే పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 13న సవరించిన టెట్ స్కోరుతో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. దీనిపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా ఎంపిక లిస్టును ప్రకటించారు. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు ఉత్తమ స్కోరు సాధించినా ఉద్యోగాలు కోల్పోయారు.ఎంపికైనవారికి కాదని.. కొత్తవారికి ఆర్డర్లు డీఎస్సీలో 16,347 పోస్టులకు 15,941 పోస్టుల భర్తీ చేశారు. సీఎం తొలి సంతకం చేసిన నోటిఫికేషన్ కావడంతో గతేడాది సెపె్టంబర్ 25న అమరావతిలో నియామకపత్రాల పంపిణీ వేడుక నిర్వహించారు. ఇందుకోసం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులతో భారీస్థాయిలో సభ నిర్వహించారు. తొలుత సెపె్టంబర్ 19న వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఒకరోజు ముందే రావాలని అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, వాతావరణం బాగాలేదని చెప్పి వేడుకలను సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు.అయితే, ఆరురోజుల వ్యవధిలో ఆహ్వానం అందుకున్న పలువురు అభ్యర్థులకు తిరిగి ఫోన్ చేసి మీరు పోస్టుకు ఎంపిక కాలేదని, వేడుకలకు రావొద్దని సమాచారం ఇచ్చారు. దీంతో పలవురు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా ఉన్నట్టు అంచనా. ఇంకోవైపు కొత్త టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10 రోజుల పాటు జిల్లాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆగిరిపల్లిలో జరిగిన పీజీటీ, టీజీటీ శిక్షణ కేంద్రంలో నలుగురు అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ప్రణాళిక ప్రకారం అధికారులు శిక్షణకు పంపించారు.అదే కేంద్రంలో శిక్షణ ప్రారంభమైన అనంతరం విడతల వారీగా వారికి నియామక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలే పలు జిల్లాల్లో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మెరిట్లో ఉండి సర్టీఫికెట్ల పరిశీలన అనంతరం పోస్టుకు ఎంపికైనట్టు ప్రకటించిన అభ్యర్థులను తర్వాత ఎంపిక కాలేదని ప్రకటించడం.. ఎలాంటి ఆర్డర్ లేకుండానే కొందరిని శిక్షణకు పంపడం.. కొన్నిరోజుల తర్వాత వారికి నియామక పత్రాలు అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కా ప్రణాళికతో ‘అవినీతి క్రీడ’ క్రీడా కోటాలో పోస్టులను భర్తీ చేయడంలో శాప్ కీలకంగా వ్యవహరించింది. శాప్ పాలక వర్గంలో సీఎం బంధువు, కీలక వ్యక్తి మాస్టర్మైండ్గా వ్యవహరించి కథ మొత్తం నడిపించారు. ఇక్కడ, శాప్లోని తనకు నచ్చిన అధికారులు, కోచ్లను స్క్రీనింగ్ కమిటీలో నియమించి తాను తలచిందే జరిపించారు. వాస్తవానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ శాప్ పరిపాలన అధికారిని పెట్టారు. సదరు అధికారిని డెప్యూటేషన్పై శాప్లోకి తీసుకొచ్చిందే మాస్టర్మైండ్. ఆరుగురితో స్క్రీనింగ్ కమిటీ వేయాలని ఉత్తర్వులు జారీ చేస్తే శాప్లో 8 ప్రత్యేక కమిటీలను పెట్టి ఇష్టారీతిన దరఖాస్తులను స్రూ్కటినీ చేయడం గమనార్హం. కమిటీలో స్రూ్కటినీ సమయంలో ఉన్న ఉద్యోగులను చివరి ఫైనల్ లిస్టు తయారు చేసే సమయంలో బయటకు పంపిణీ చేయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సర్టీఫికెట్ల పరిశీలనలో కీలకంగా వ్యవహరించిన ఓ డీఎస్డీవో ఇప్పుడు శాప్ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. స్క్రూటినీలో సీనియర్ కోచ్గా వ్యవహరించిన వ్యక్తి ఓ జిల్లాకు డీఎస్డీవో అయ్యారు. పేరుకే అసిస్టెంట్ డైరెక్టర్(టెక్నికల్) స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా పెట్టి ఓ కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో వ్యవహారం జరిపించేశారు. విచిత్రం ఏమంటే! ఆడుదాం–ఆంధ్రాపై లేనిపోని ఆరోపణలు చేసి.. శాప్లో కీలకంగా వ్యవహరించారంటూ పేర్కొన్న సదరు కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగితోనే డీఎస్సీ డీల్స్ చేపట్టడం కొసమెరుపు. అసలు, స్క్రీనింగ్ కమిటీలో ఎవరు ఉన్నారు? ఎవరు ఏం చేశారో బయటకు పొక్కకుండా తంతు ముగించేశారు. ఫేక్ సర్టిఫికెట్లు.. ఫేక్ పుట్టిన తేదీలతో పోస్టులా?ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా మెరిట్ జాబితా సిద్ధం చేయాలి. అది ప్రచురించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరాలి. ఈ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. కేవలం తుది మెరిట్ జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపేశారు. రాష్ట్ర స్థాయిలో కమిటీలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి(సర్వీసెస్/మానవవనరులు), శాప్ ఎండీ ఉంటారు. సదరు రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా సమీక్షించాలి. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిందే తుది జాబితా అవుతుంది. ఇందులో సమగ్ర సమీక్ష, పరిశీలనే చేయకపోవడంతోనే డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఘోరమైన తప్పి దాలు దొర్లాయి. పోస్టుల భర్తీ సమయంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులనూ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా బుట్టదాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. దీనికితోడు ఫేక్ సర్టీఫికెట్లు, దొంగ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలను అత్యంత హేయంగా అమ్మేసుకోవడం గమనార్హం.ఈ తప్పులకు ఎవరు బాధ్యులు..ఫేక్ సర్టీఫికెట్లతో క్రీడాకారులను ఆడిస్తున్న క్రీడా సంఘాలపై శాప్ ఇటీవల కొరడా ఝుళిపించింది. పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపించింది. మరీ, స్పోర్ట్స్ కోటాలో తప్పుల తడకగా పోస్టింగులు ఇచ్చి లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం చేసినందుకు స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీలను బాధ్యులను చేస్తుందా? అంటూ క్రీడాలోకం ప్రశి్నస్తోంది. విజయనగరం జిల్లాలో దొంగ పుట్టిన తేదీతో క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి ఉద్యోగం కట్టబెట్టిన ఘనటలో క్షేత్రస్థాయిలో ఆధారాలన్నీ స్పష్టంగా ఉంటే శాప్ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.కనీసం, విచారణ ముగిసే వరకు కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యను కోరకపోవడం గమనార్హం. నకిలీ క్రీడా సర్టీఫికెట్లు మాత్రమే కాకుండా డిగ్రీ అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు అమ్మేశారు. ప్రతిభ గల క్రీడాకారుడికి డిగ్రీ ఉండి.. మెరిట్ స్పోర్ట్స్ సర్టీఫికెట్ ఉంటే వారికి ముందుగా పీఈటీ/పీడీ పోస్టు ఇచ్చి.. పొస్టు పొందిన ఐదేళ్లలోపు బీపీఈడీ కోర్సు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మాస్టర్మైండ్ డిగ్రీ లేనివ్యక్తులకు ఫేక్ సర్టీఫికెట్లు సృష్టింపజేసి ఉద్యోగాలు అమ్మేశారు.క్రీడల్లో జాతీయ స్థాయి పతకం సాధించిన ఓ వ్యక్తికి డిగ్రీ లేదు. దీంతో అతను వేరే రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్టు ఫొటోషాప్లో పట్టా క్రియేట్ చేసి తెచ్చుకుని పీఈటీ/పీడీ పోస్టు కొట్టేశారు. ఇప్పుడు ఆ ఉద్యోగి పశి్చమగోదావరి జిల్లాలో పీడీగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్హులైన మహిళా అభ్యర్థులతోనూ అసభ్య చాటింగులు చేసి కోరికలు తీర్చాలని మాస్టర్మైండ్ వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన కోరిక తీర్చకుంటే పోస్టులు రావని బెదిరించినట్టు విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. -
ఇరాన్ కీలక నిర్ణయం.. ఆ సేవలు పునరుద్ధరణ
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు నెలలు (87 రోజులు) పాటు కొనసాగిన తీవ్రమైన ఇంటర్నెట్ బ్లాకౌట్ (సేవల నిలిపివేత)ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.గత ఐదు నెలలుగా ఇరాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఫిబ్రవరి 28 న అమెరికా దాడుల ప్రారంభకానికి ముందు సైతం ఆ దేశంలో తీవ్రంగా అంతర్గత సంక్షోభం తలెత్తింది. ఖమేనీ పాలనకు నిరసనగా ఆ దేశ యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ జనవరి 8న ఇరాన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేసింది. మధ్యలొ కొద్దిగా వెసులుబాటు ఇచ్చినప్పటికీ దాదాపుగా నాలుగు నెలల అనంతరం తొలిసారిగా ఆ సేవలనను పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.ఇరాన్ సైబర్ స్పేస్ స్టీరింగ్ అండ్ ఆర్గనైజింగ్ హెడ్క్వార్టర్స్ ఉన్నత స్థాయి సమావేశంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణకు అనుకూలంగా 9 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. అనంతరం ఈ వివరాలను ఇరాన్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు తెలియజేశారు.ఇంటర్నెట్ బ్లాకౌట్ కారణాలుదేశంలో ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా జనవరి 8న తొలిసారిగా ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు. అనంతరం జనవరి 23న ఈ ఆంక్షలను కొద్దిగా సడలించినప్పటికీ, ఫిబ్రవరి 28న అమెరికా ,జ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ 'నెట్బ్లాక్స్' ప్రకారం.. సాధారణంగా 90% నుండి 100% ఉండే ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈ బ్లాకౌట్ సమయంలో కేవలం 1% నుండి 2% శాతానికి పడిపోయింది. ఆధునిక ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన, తీవ్రమైన బ్లాకౌట్ అని నెట్బ్లాక్స్ పేర్కొంది. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో సైనిక ఉద్రిక్తతల సమయంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్వతంత్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కూడా కోల్పోయారు.నిరుద్యోగంయుద్ధం, నిరసనలు మరియు ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా దేశంలో దాదాపు 10 లక్షల (1 మిలియన్) మందికి పైగా ఉపాధి కోల్పోయినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. సోషల్ మీడియా ప్రకటనలపై ఆధారపడిన చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు, టెక్ స్టార్టప్లు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్ల ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొంది. -
కౌన్సిల్ x కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి, కాలేజీ విద్య కమిషనరేట్ మధ్య వివాదం రోడ్డుకెక్కింది. డిగ్రీ కోర్సులపై ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కాలేజీ విద్య కమిషనర్ దేవసేన, మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతోంది. విధానపరమైన నిర్ణయాలపై ఒకరితో ఒకరు ఏకీభవించడం లేదు. ఇద్దరి మధ్య వివాదం డిగ్రీ ప్రవేశాల (దోస్త్)పై పడింది. దోస్త్ వెబ్సైట్ను హైజాక్ చేయడం, కోర్సులకు అనుమతి లేదంటూ రెండు ప్రభుత్వ సంస్థలు విమర్శలు ఆరోపించుకోవడం లక్షలాది మంది విద్యార్థులను గందరగోళంలోకి నెట్టింది.కొంతకాలంగా జరుగుతున్న ఈ కోల్డ్వార్ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. దేవసేన వ్యవహారంపై బాలకిష్టారెడ్డి ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. తన హక్కులను దేవసేన కాలరాస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. అసలేం జరిగింది? కౌన్సిల్, కాలేజీ కమిషనరేట్ మధ్య కొన్ని నెలలుగా కోల్డ్వార్ జరుగుతోంది. మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రతీ ప్రతిపాదనను దేవసేనతోపాటు విద్యాశాఖ ముఖ్య అధికారి అడ్డుకుంటూ వస్తున్నారు. ఏడాది నుంచి బాలకిష్టారెడ్డి డిగ్రీ కోర్సుల స్వరూప స్వభావం మార్చేందుకు కొత్త కోర్సులపై కసరత్తు చేశారు. ఈ ఏడాది నుంచి వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.బీఏలో సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్–అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, బీబీఏలో ఎయిర్పోర్టు, ఎయిర్లైన్స్, ఏరోస్పేస్, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, బీకాంలో ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ టెక్నాలజీ కోర్సులను ప్రతిపాదించారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ఈ కోర్సులను దోస్త్ వెబ్సైట్లోకి రెండో కౌన్సెలింగ్ నాటికి అప్లోడ్ చేయించారు.ఇదే క్రమంలో కాలేజీ కమిషనరేట్ 11 కొత్త అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ) కోర్సులను ప్రతిపాదించడమే కాకుండా దోస్త్ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసింది. బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఈ మొబిలిటీ అండ్ బ్యాటరీ, హారి్టకల్చర్, ఫిషరీస్ ఫుడ్ ప్రాసెసింగ్, బీకాంలో బిజినెస్ ఎనలటిక్స్, బీఏలో యానిమేషన్, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ వంటివి ఉన్నాయి. కమిషనరేట్ ప్రవేశపెట్టిన కోర్సులపై దోస్త్ కనీ్వనర్గా ఉన్న బాలకిష్టారెడ్డి అనుమతి తీసుకోకపోవడం వివాదానికి దారి తీసింది. పోర్టల్లో కోర్సులు బ్లాక్ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన కోర్సులన్నీ అన్ని యూనివర్సిటీలు దోస్త్ రెండో దశ కౌన్సెలింగ్లో అప్లోడ్ చేశాయి. కానీ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేప్పుడు మాత్రం ఆ కోర్సులు చూపించడం లేదు. దోస్త్ పోర్టల్ పాస్వర్డ్ వర్సిటీ ఉన్నతాధికారులు, గుడ్గవర్నెన్స్ (సీజీజీ) అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. సీజీజీ ఉన్నతాధికారిపై కమిషరేట్ నుంచి ఒత్తిడి రావడంతో కౌన్సిల్ ప్రవేశపెట్టిన కోర్సులను బ్లాక్ చేశారు. దోస్త్ కనీ్వనర్ అనుమతివ్వని కమిషరేట్ ఎంబెడెడ్ కోర్సులను మాత్రం అప్లోడ్ చేశారు. దీనిపై దేవసేన వివరణ ఇచ్చారు.ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన కోర్సులను ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ఇచ్చే వర్సిటీలు అనుమతించలేదని తెలిపారు. అసలు కొత్త కోర్సులపై వర్సిటీ అధికారులు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వలేదన్నారు. అందుకే ఆ కోర్సులను అందుబాటులోకి తేవడం కుదరదని చెప్పారు. ఇదంతా అబద్ధమని, వర్సిటీల భేటీలో అనుమతి ఇచి్చనట్టు తమ వద్ద ఆధారాలున్నాయని బాలకిష్టారెడ్డి తెలిపారు.‘ఏడాదిగా కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. డిగ్రీలో నాణ్యత పెంచే కోర్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీటి వల్ల వందశాతం ఉపాధి లభిస్తుంది. కోర్సులు ఆపేస్తే నష్టపోయేది విద్యార్థులే’అని బాలకిష్టారెడ్డి మీడియాతో అన్నారు. వివాదం వల్ల విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రైతు గోస పట్టదా?
సాక్షి, హైదరాబాద్/కుల్కచర్ల/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీకి రైతుల గోస పట్టడం లేదని, పండించిన పంటను అమ్ముకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సోమవారం ‘రైతుగోస– బీజేపీ భరోసా’కార్యక్రమాన్ని ప్రారంభించి, మార్కెట్ యార్డులోని రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును కూడా సందర్శించి రైతులతో మాట్లాడారు. వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ను కాంగ్రెస్ ఏనాడో మర్చిపోయిందన్నారు. రియల్ఎస్టేట్ దందా తప్ప క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో సీఎంకు తెలియదన్నారు. ఇప్పటివరకు ఆయా జిల్లాల వారీగా ఎంతమేర ధాన్యం సేకరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 45 లక్షల టన్నులు సేకరించామని సీఎం పేర్కొంటున్నారని తెలిపారు. ఈ లెక్కన కూడా 30 శాతం మించలేదని మండిపడ్డారు.బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాకుండానే, వారంలో కేంద్రాలను మూసేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని మండిపడ్డారు. అలా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ బీజేపీ బస్సు యాత్ర వస్తుందని తెలిసి...కలెక్టర్ ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డుకు ఆగమేఘాల మీద చేరుకొని లారీలు , గన్నీ బ్యాగులు తెప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇదే ప్రయత్నం నిరంతరంగా ఎందుకు సాగటం లేదని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం నుంచి ఐక్యత చాటుతూ... పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు ఐక్యతను చాటుతూ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు బస్సులో బయలుదేరారు. ఈ బస్సు యాత్రలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యానారాయణగుప్తా, డా.పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, డా.సి.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరును బీజేపీ ప్రతినిధి బృందం సమీక్షించనుంది. -
4 వారాలు.. 4 ఏళ్లు వెనక్కి!
సాక్షి స్పెషల్ డెస్క్: వయసు పెరగడం అనేది శారీరక క్రియ. అయితే వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా, శరీర కణాలను ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం 4 వారాల పాటు సరైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే.. మన శరీర జీవసంబంధిత వయసును (బయలాజికల్ ఏజ్) ఏకంగా 3 నుంచి 4 ఏళ్ల వరకు వెనక్కి మళ్లించవచ్చని ఆ్రస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన విశేషాలు అంతర్జాతీయ జర్నల్ ‘ఏజింగ్ సెల్’లో ప్రచురితమయ్యాయి.ఏమిటీ పరిశోధన?సాధారణంగా మనం పుట్టిన తేదీని బట్టి లెక్కించే వయసును ‘క్రోనలాజికల్ ఏజ్’అంటారు. కానీ మన శరీరంలోని కణాలు, అవయవాల ఆరోగ్యం ఆధారంగా నిర్ణయించే అసలు వయసును బయోలాజికల్ ఏజ్ అంటారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 65 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 104 మంది వృద్ధులను నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి నాలుగు వారాల పాటు నాలుగు వేర్వేరు ఆహార ప్రణాళికలను (డైట్ ప్లాన్లు) అందించి పరిశీలించారు. ఈ ప్రయోగ కాలంలో నాలుగు గ్రూపుల వారి రక్తపోటు, ఇన్సులిన్ స్థాయిలు, కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ (వాపులు) వంటి 20 రకాల ఆరోగ్య సూచికలను, అలాగే శరీరం ఎంత వేగంగా వయసు మీరుతోందో చెప్పే ‘ఎపిజెనెటిక్ క్లాక్’పై నిరంతర అధ్యయనం చేశారు.ఆశ్చర్యకరమైన ఫలితాలు⇒ తక్కువ కొవ్వు తింటూ, కలగూర కార్బోహైడ్రేట్లు (తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, దుంపలు) తీసుకున్నవారిలో అత్యధికంగా 4.1 సంవత్సరాల బయోలాజికల్ వయస్సు తగ్గింది. ⇒ జంతు ప్రోటీన్లను (మాంసాహారం) తగ్గించి, మొక్కల ఆధారిత ప్రోటీన్లు తీసుకున్న వారిలో 2.9 నుంచి 3.2 ఏళ్ల వయస్సు తగ్గింది. ⇒ జంతు ఆధారిత కొవ్వులు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న సాధారణ ఆహారం తిన్న వారి వయస్సులో ఏ మార్పూ కనిపించలేదు.వృద్ధ జన్యువులు – యవ్వన జన్యువులు మన శరీరంలో ‘డీఎన్ఏ మైథెలేషన్’అనే ఒక ముఖ్యమైన ప్రక్రియ జరుగుతుంది. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం ఈ ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తాజా పరిశోధన ప్రకారం.. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు, వృద్ధాప్యానికి కారణమయ్యే జన్యువులు ‘స్విచ్ ఆఫ్’అవుతాయి. అదే సమయంలో మనల్ని యవ్వనంగా ఉంచే జన్యువులు మరింత మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి.ఆహారంతో పాటుగా...వయసును వెనక్కి మళ్లించే మ్యాజిక్ ఫలితం దక్కాలంటే కేవలం తిండి మార్చడమే కాదు.. ప్రతిరోజూ కనీసం 7 గంటల నాణ్యమైన నిద్ర, రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం, శరీరానికి సరిపడా నీరు తాగడం వంటి నియమాలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ఆహార ప్రణాళికలివే.. ⇒ మాంసాహారం,ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం. ⇒ మాంసాహారం, తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం. ⇒ శాకాహారం, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం. ⇒ శాకాహారం, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం. -
ప్రాణం తీసిన వీధి కుక్కలు
చుంచుపల్లి: ఓ మహిళపై వీధి కుక్క లు మూకుమ్మడిగా దాడి చేశాయి. అకస్మాత్తుగా జరిగిన దాడితో ఆమె కేకలు వేస్తున్నా.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో తీవ్రగాయాల పా లైంది. ఆపై ఆస్పత్రికి తరలించినా ఫలితం లేక ఆమె ప్రాణాలు కోల్పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది.స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన మారె రాములమ్మ(40) తన ముగ్గురు కుమా రులతో కలిసి జీవిస్తోంది. సోమవారం ఉద యం కుమారులంతా రోజులాగే పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తమ మేకపిల్లలను రాములమ్మ ఇంటికి కాస్త దూరంలోని వాగు ఒడ్డున పొలాల వద్దకు తీసుకెళ్లింది. అవి మేత మేస్తుండగా.. అక్కడ ఉన్న నాలుగు వీధి కుక్కలు ఒక్కసారి ఆమెపై దాడి చేశాయి. నిలువరించేవారు లేక ఒంటరిగా ఉన్న రాములమ్మను అవి విచక్షణారహితంగా గాయప రిచాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమె సాయంకోసం ఎంతగా అరిచినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో రాములమ్మ కింద పడిపోయింది. కాసేపటికి ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించడంతో రాములమ్మ మృతి చెందింది. -
కీచక తండ్రికి ఇరవయ్యేళ్ల జైలు
షాబాద్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజు (37) తన కన్న కూతురిపై అక్టోబర్ 12, 2024న లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదవగా, నిందితుడిని రిమాండ్కు తరలించారు.కేసు పూర్వాపరాలను పరి శీలించిన ఎల్బీనగర్ కోర్టులోని పోక్సో ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి జి.శ్రీనివాస్ నిందితునికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం మంజూ రు చేశారు. దర్యాప్తు బృందంలోని ఏపీపీ భిక్షప తి గౌడ్, కోర్టు సిబ్బంది ఏండీ హనీఫ్, హెచ్జీవీ ప్రభాకర్, అలివేలును సీఐ అభినందించారు. -
మెట్రోకు రూ.13,600 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ నగర రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి విడతను తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో టేకోవర్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు బలోపేతానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ. 13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ను ప్రభుత్వం పొందింది. సోమవారం ఢిల్లీలో ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్, హెచ్ఎమ్ఆర్ఎల్ ప్రతినిధుల మధ్య ఈ మేరకు రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఐఆర్ఎఫ్సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దూబే, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్లో సుస్థిరమైన, ప్రజానుకూల రవాణా వ్యవస్థను నిర్మించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ వైదొలగనుంది. అధికారులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలు మాత్రం కొంతకాలంపాటు కొనసాగుతాయి. ప్రభుత్వమే వారికి జీతాలను చెల్లిస్తుంది. అలాగే ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లోగోను కూడా మార్చనున్నారు. రెండో దశ మెట్రో రైల్ నిర్మాణం కూడా చేపట్టనున్న దృష్ట్యా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని మెట్రోరైల్ బ్రాండ్కు తగినవిధంగా పేరు, లోగో, తదితర అంశాల్లో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ప్రభుత్వ ఆస్తిగా మెట్రో...: ఎల్ అండ్ టీ మెట్రో రైల్లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ ప్రక్రియ అమలులోకి వచ్చింది. దీంతో 69.2 కి.మీ. పొడవు, 57 స్టేషన్లతో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో మొదటి దశ ఇకపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యూహాత్మక ప్రజారవాణా ఆస్తిగా మారింది. ఒప్పందం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు – అధిక వడ్డీతో కూడిన పాత రుణాల స్థానంలో తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రీఫైనాన్సింగ్ లభించడం వల్ల మెట్రో ప్రాజెక్టుకు భారీ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. – తాజాగా సమకూరిన రూ. 13,600 కోట్ల నిధులను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్కు వినియోగించి ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ కల్పిస్తారు. – ఈ రుణం 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల సౌలభ్యంతో రూపొందడం వల్ల ప్రభుత్వంపై తక్షణ భారం పడదు. – ఈ లావాదేవీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపు గ్యారంటీతోపాటు ఆర్బీఐ మద్దతు గల డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన రక్షణ వ్యవస్థలు మద్దతుగా నిలిచాయి. – ప్రస్తుత రుణ భారం తగ్గడంతో భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలు, కొత్త కారిడార్ల నిర్మాణం, చివరి మైలు అనుసంధాన పనులను వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది. -
బీజేడీకి మరో ఎదురుదెబ్బ
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్కు మరో గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్కు పంపారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి, రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను సమరి్పంచారు. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్కు దీర్ఘకాల సహచరుడైన సమంతరాయ్, త్వరలో బీజేపీలో చేరతానని ప్రకటించారు. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని, బీజేడీ అధినేతను కలవకుండా తనను అడ్డుకున్నారని సమంతరాయ్ ఆరోపించారు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమికి మాజీ బ్యూరోక్రాట్, రాజకీయవేత్త అయిన వీకే పాండియన్ కారణమని ఆయన విమర్శించారు. ‘నేను బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇటీవల, పార్టీలో నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని భావించాను. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాను ఆమోదించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’అని పట్నాయక్కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ఎగువ సభకు తనను నామినేట్ చేసినందుకు పట్నాయక్కు కృతజ్ఞతలు తెలిపారు. పాండియన్పై ఆరోపణలు ఏప్రిల్ 2024లో రాజ్యసభకు ఎన్నికైన సమంతరాయ్, పాండియన్పై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి పాలైన తర్వాత, పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ, పాండియన్ తెరవెనుక ఉండి పార్టీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారని సమంతరాయ్ పదేపదే ఆరోపించారు. గతేడాది నవంబర్లోనే బీజేడీ సీనియర్ సిటిజన్స్ విభాగం ఉపాధ్యక్ష పదవికి సమంతరాయ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో, పార్టీ పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ఆశయాలు, సిద్ధాంతాలకు దూరమైపోయిందని ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే : బీజేడీ సమంతరాయ్ రాజీనామా పార్టీకి ఒక ఎదురుదెబ్బనే అభిప్రాయాన్నీ బీజేడీ తోసిపుచ్చింది. ఆయన నిష్క్రమణ కటక్ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. ఆయన ప్రజాసేవకు కాకుండా వ్యాపారం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే పార్టీని వీడార ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ అన్నారు. అధికారంలో ఉండగా పార్టీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలను పొందిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వీడి వెళ్లిపోయారని విమర్శించారు. బీజేపీ ఆయనను ప్రధానమంత్రిని గానీ, భారత రాష్ట్రపతిని గానీ చేయవచ్చేమోనని ఎద్దేవా చేశారు. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు సుజీత్ కుమార్, మమతా మహంత పార్టీని వీడిన కొన్ని నెలల తర్వాత సమంతరాయ్ రాజీనామా చేయడం గమనార్హం. -
తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య
సూర్యాపేటటౌన్: సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్ను చంపాడనే కక్షతోనే ఆయన కుమారుడు మిద్దె జీవన్తోటు మరో ఐదుగురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను సోమవారం ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. శనివారం తెల్లవారుజామున యర్కారం శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై టేకుమట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్తోపాటు మిద్దె ఆనంద్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా..: 2007లో అప్పటి యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య జరగ్గా.. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు.మధు మద్యం మత్తులో ఉండగా.. జీవన్తోపాటు మిద్దె ఆనంద్ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా.. మటన్ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశాడు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యరా>్కరం శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్ను మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ఫోన్లను అడివెంల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
నేను కుమార్తెను పోగొట్టుకున్నా.. మమత పదవిని కోల్పోయారు
కోల్కతా: ‘ఈ రోజు నేను, మమత(మాజీ సీఎం మమతా బెనర్జీ) విచారంలో మునిగి ఉన్నాం. నేను ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయి దుఃఖంలో మునిగి ఉండగా, ఆమె ముఖ్యమంత్రి పదవినే కోల్పోయారు’అంటూ సోమవారం ఆర్జీ కర్ హత్యాచార ఘటన బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్నా దేవనాథ్ ఎక్స్లో వ్యాఖ్యానించారు. అంతకుముందు, ఆమె కోల్కతాలోని సెక్రటేరియట్లో సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యారు. అనంతరం ఎక్స్లో ..‘ఈ రోజు సెక్రటేరియట్ నబన్నాలోని 14వ అంతస్తులో ముఖ్యమంత్రిని కలుసుకున్నాను. ఆయన పేరు సువేందు అధికారి. నిజాయతీలో అద్భుతమైన శక్తి దాగుంది. అన్యాయానికి వ్యతిరేకంగా ఓరిమితో పోరాటం సాగించాలి’అని రత్న పేర్కొన్నారు. ‘మాజీ సీఎం మమత, ఆమె బృందం మరింత విషాదాన్ని మున్ముందు చవిచూస్తుంది. ఎదురు చూస్తూ ఉండండి’అంటూ వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా ఎన్నికవడం సంతోషకరమే అయినప్పటికీ, తన కుమార్తెకు న్యాయం చేయడమే ఏకైక లక్ష్యమన్నారు. తన కుమార్తె మరణానికి కారణంగా భావించే వారికి సంబంధించిన వివరాలను సీఎంకు అందజేశానన్నారు. -
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ పంటలను మాత్రం పూర్తిస్థాయిలో కొనడం లేదని అన్నారు. సోమవారం సచివాలయంలో సీపీఎం రాష్ట్ర నాయకులు.. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని వారికి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్న సమయంలో పనులు మందగిస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు అక్కడే ఇళ్లు..: కాగా, మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు మంజూరు చేస్తామని సీపీఎం నేతలకు సీఎం హామీ ఇచ్చారు. మూసీ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఆరుట్ల స్కూల్ను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీపీఎం నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
ఒక్కటైనా కట్టారా?
కూకట్పల్లి (హైదరాబాద్): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లు మొదలుకుని టిమ్స్ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటీ తామే నిర్మించామని, ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్రెడ్డి రిబ్బన్ కట్ చేస్తూ తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం కూకట్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మోసం చేసింది.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం. తెలంగాణకు 24 గంటల కరెంటు, తాగునీటిని అందించింది కేసీఆరే. కానీ అసెంబ్లీ ఎన్నిలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తాం. ఈ బాధ్యత నేనే తీసుకుంటా..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలి ‘ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారీ్టకి అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం. ‘సర్’విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ విధానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘సర్’పై కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’పై విచారణకు నో!
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవల పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’కి సంబంధించిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని మరీ సెంటిమెంట్గా తీసుకోవద్దని, ఇందులో అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సీజేపీ వెనుక ఉన్న వ్యక్తులపై, అలాగే నకిలీ న్యాయవాద డిగ్రీల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది రాజా చౌదరి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున ఎన్.కె.గోస్వామి వాదనలు వినిపించారు. సీజేపీ సోషల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తోందని పేర్కొన్నారు. కోర్టులో జరిగే సంభాషణలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు వ్యాఖ్యలను కత్తిరించి, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తాము వాక్ స్వాతం్రత్యానికి, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకం కాదని, కేవలం కోర్టు వ్యాఖ్యలను స్వార్థానికి వాడుకోవడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిల ధర్మాసనం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మరీ అంత సెంటిమెంట్గా తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వెంటనే విచారించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
రక్తమోడిన రహదారులు
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. ఈ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందులో ఉమ్మడి నల్లగొండ ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి వరంగల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నేపాల్కు చెందిన మీనాబుల్ (21), రవీబుల్ (28) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వారిద్దరూ బైక్పై ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.మరో ఘటనలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కుమార్తె మృతి చెందారు. వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య(65)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రాజయ్య రెండో కుమార్తె సునీత (43)తో కలిసి మునగాలలోని బ్యాంక్కు వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా మొద్దుల చెరువు గ్రామ స్టేజీ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సునీతను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.సూర్యాపేట జిల్లాలోనే మోతె మండలం రాఘవాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఖమ్మం పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన రామిశెట్టి వెంకటరమణమ్మ (63), రామిశెట్టి వెంకాయమ్మ (70) కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. సోమవారం బంధువుల అబ్బాయితో కలిసి కారులో తిరిగి ఖమ్మంకు వెళ్తుండగా.. మార్గమధ్యలో రాఘవాపురం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే.. పక్కన ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో వెనుక వస్తున్న కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వెంకాయమ్మను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ, మల్లయ్యల కుమారుడు వెంకటేశ్ (24) సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బైక్పై జనగామ నుంచి బసిరెడ్డిపల్లికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మరో ప్రమాదంలో జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కాటారం నుంచి ధర్మసాగర్ వైపు వెళ్తున్న కారు గుమ్మళ్లపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది.కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్(22) మృతిచెందగా శశివరణ్, రాజుకుమార్ల కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెకి చెందిన బొక్కల ఐలయ్య (75) సోమవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన మచ్చిక సాయికుమార్ (25) ఆదివారం మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న మద్ది సాంబయ్య (36)ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. కారు ఢీకొని హెడ్కానిస్టేబుల్ మృతి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హెడ్కానిస్టేబుల్ జాడి బాపురావు (59) సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే పులికుంట వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాపురావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. -
వడదెబ్బతో 49 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో 49 మంది చనిపోయారు. వరంగల్ జిల్లా బుధరావుపేటలో గుండ్రపల్లి సదయ్య (58), ధర్మారంలో అంకేశ్వరపు సమ్మక్క (70), దమ్మన్నపేటలో అనసూర్య (68), ఖిలా వరంగల్ పడమరకోటలో బొల్లం వీరమల్లు (68), మొండ్రాయిలో తండ చేరాలు (75), పుల్లయబోడులో భూక్య నరేశ్ (29), సర్వాపురానికి చెందిన మండల వీరయ్మ (74) వడదెబ్బతో మృతిచెందారు. ⇒ పరకాల డిపోనకు చెందిన కండక్టర్ బి.శంకర్ (48) విధుల్లో భాగంగా భద్రాచలం నుంచి పరకాల బయలుదేరి కొత్తగూడెం దాటిన తర్వాత అనిశెట్టిపల్లి వద్ద వేడిగాలితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణికులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణం కోల్పోయాడు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నగరంపల్లిలో గొర్రెలకాపరి కోడారి సాంబయ్య(52), అంకుషాపూర్లో వ్యవసాయ కూలీ మహమ్మద్ సైద్ఖాన్ (42), జనగామ జిల్లా రంగరాయగూడెంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అదే గ్రామానికి చెందిన రైతు నెలమంచ ఎలేందర్రెడ్డి (39) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై చనిపోయాడు. శివునిపల్లికి చెందిన పిట్టల శంకర్–రవళి దంపతుల కుమారుడు అక్షిత్ (4) ఎండ తీవ్రతతో మృతి చెందాడు. ఘన్పూర్లో తాటికొండ నర్సమ్మ(65), కామారపు విజయ్ (60), వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో కూలీ నైనబోయిన రాజు(44) హనుమకొండ జిల్లా నీరుకుళ్లలో మేస్త్రీ వద్ద పనిచేసే కూలీ వడదెబ్బతో చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెయింటర్ కొమిరె రమేశ్ (39), బైపాస్రోడ్డులో ఉండే యాచకుడు షేక్ లతీఫ్ (50), ములుగుకు చెందిన బీజేపీ నేత అన్నపురెడ్డి ప్రమోద్రెడ్డి (49), కమలాపురంలో అన్నపు రెడ్డి లక్ష్మీబాయి (80), తిరువాయిపేట వెంకటరమణ (48), తాడి సత్యవతి (80) వడదెబ్బతో చనిపోయారు. ⇒ నిజామాబాద్ జిల్లా అంజుమాన్ ఫారమ్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పడారి గంగన్న (40), బౌరంపేటలో రైతు రమేశ్ (42), ఉమ్మడి కరీంనగర్ జిల్లా..జగిత్యాలలో గొల్లపల్లి శివప్రసాద్గౌడ్ (50), రామడుగులో లక్ష్మీరాజం (48), గోపాల్రావుపేటలో షేర్ల నరేశ్ (30), ఘన్ముక్కులలో బొంగోని రాజవీరు (65), జమ్మికుంటలో దాసారపు కాంతమ్మ (59), సుల్తానాబాద్లో తోడేటి లక్ష్మి (44), వెన్నంపల్లిలో ఉపాధి కూలీ గోసు్కల గట్టయ్య (52), రామగుండంలో కుమార్ (40), యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో సుంకరి భాగ్యమ్మ (79), పెద్దగూడెంలో కౌలు రైతు కాకారం ధర్మారెడ్డి (70), తోపుచర్లలో వేముల సైదమ్మ (42), మంచిర్యాల జిల్లా జన్నారంలో యాట ఇందయ్య (60), మైలారంలో బర్ల బుచ్చయ్య (71), చెన్నూర్లో తోగటి అశోక్ (46), సీసీసీ రిటైర్మెంట్ కాలనీలో ఆటో డ్రైవర్ రెడ్డిమల్ల లక్ష్మణ్ (49), నర్సింగపూర్లో సిడం వెంకటేశ్(33), ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో బోనగిరి లస్మన్న(70), సిద్దిపేట జిల్లా తెల్లపలుగు తండాకు చెందిన బానోతు సంగ్లనాయక్ (65) వడదెబ్బతో చనిపోయారు. ⇒ భద్రాద్రి జిల్లాలోని చలమప్పగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్లిన బండారు నాగమణి (40), అశ్వారావుపేటలో బోగి మంగ (62), జగన్నాథపురంలో ముత్తిని నర్సింహారావు (70), టేకులచెరువులో దాసరి దుర్గమ్మ (56), ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉస్మాన్ (54), నారపునేనిపల్లిలో మంచికంటి విజయ(80), దారేడులో కూలీ షేక్ ఇమామ్ (45) వడదెబ్బతో మృతి చెందారు.మూడు రోజుల తర్వాత..భార్య కూతురి ఇంటికి వెళ్లడంతో తల్లాడలో మిర్చి కమీషన్ వ్యాపారి బండారు మోహన్రావు (65) ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం నిద్రించాడు. ఎండల తీవ్రతతో వడదెబ్బ బారిన పడగా తాగునీరు ఇచ్చేవారు కూడా లేక రెండు రోజుల క్రితమే మృతి చెందాడు. ఇరుగు పొరుగు వారికి వాసన వస్తుండటంతో తలుపులు పగులగొట్టే సరికి కుళ్లిన స్థితిలో మృతదేహం బయటపడింది. -
డ్యాన్స్ బార్లు, స్పాలు, ఆర్కేస్ట్రాల్లో బాల కార్మికులు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లు, స్పాలు, ఆర్కేస్ట్రాలు వంటి వాటిలో బాలలను పనిలో పెట్టుకోవడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి వాటిపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది. వినోదం, ఆతిథ్య రంగాల్లో బాల కార్మీకులను నియమించుకోవడాన్ని కఠినంగా నిషేధించాలంటూ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’అనే సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. డ్యాన్స్ బార్లు, స్పాలు, మసాజ్ పార్లర్లు, ఆర్కెస్ట్రాలు, నౌటంకీ ప్రదర్శనల వంటి వాటిలో పిల్లలు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని సీనియర్ న్యాయవాది సొనాలీ జైన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. బాల, కౌమార కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం–1986లోని సెక్షన్–4 కింద కేంద్రం తన అధికారాలను ఉపయోగించి, బాల కార్మిక వ్యవస్థలో పూర్తిగా నిషేధించాల్సిన వృత్తుల జాబితాను విస్తరించాలని కోరారు. పిటిషన్లో ఏముందంటే ‘18 ఏళ్లలోపు పిల్లలను ఆర్కెస్ట్రాలు, డ్యాన్స్ బార్లు, డ్యాన్స్ ట్రూపులు, నౌటంకీ ప్రదర్శనలు, మసాజ్ పార్లర్లు, స్పాలు, సెలూన్లు వంటి వాటిలో పనిలో పెట్టుకోరాదు. వారితో ప్రదర్శనలు చేయించరాదు. బాల, కౌమార కార్మీక చట్టం షెడ్యూల్లోని ‘పార్ట్–ఏ’లో చేర్చి, వర్గీకృత నిషేధం విధించాలి. అశ్లీలంగా లేదా దోపిడీకి గురిచేసే విధంగా పిల్లలను చూపించే సంస్థలన్నిటినీ దీని పరిధిలోకి రావాలి. వినోదం ముసుగులో పనిచేస్తున్న సంస్థలతో సహా ఇలాంటి చోట్ల పనిచేస్తున్న పిల్లలను రక్షించి, పునరావాసం కల్పించేందుకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఓపీ) రూపొందించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఆదేశించాలి’అని పిటిషన్ కోరింది. చాలా రాష్ట్రాలు 18 ఏళ్ల లోపు వారిని స్పాలు, మసాజ్ పార్లర్లలో నియమించుకోవద్దని చట్టాలు చేసినా అమలు కావడం లేదని తెలిపింది. వాస్తవానికి వారిని విక్రయించారు 2025 మార్చి– 2026 మే మధ్య కాలంలో బిహార్, పశ్చిమ బెంగాల్లలోని ఆర్కెస్ట్రాలు, డ్యాన్స్ గ్రూపుల నుంచి 212 మంది మైనర్లను అధికారులు రక్షించారు. అదేవిధంగా, ఢిల్లీ, రాజస్తాన్లలోని మసాజ్ పార్లర్లు, స్పాల్లో పనిచేసే 12 మంది బాలలను యంత్రాంగాలు రక్షించినట్లు గణాంకాలు చెబుతన్నాయని పిల్ పేర్కొంది. బాధితుల్లో 12 ఏళ్ల లోపువారు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. పేదరికంలో ఉన్న వీరికి నృత్య శిక్షణ, సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తామనే తప్పుడు వాగ్దానాలతో ప్రలోభపెట్టి తీసుకువచ్చారని అది తెలిపింది. నిజానికి, చాలామందిని రూ.10 వేల నుంచి రూ.50వేలు వరకు విక్రయించారని పేర్కొంది. వారిని అప్పుల ఊబిలో ముంచి మద్యం మత్తులో ఉన్న ప్రేక్షకుల ఎదుట ’లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులలో’ ప్రదర్శనలు ఇచ్చేలా బలవంతం చేశారని పేర్కొంది. దేశంలో గుర్తించిన మొత్తం మానవ అక్రమ రవాణా బాధితుల్లో 44% మంది మైనర్లేనని, స్పాలు లైంగిక దోపిడీకి వేదికలుగా మారినట్లు భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’(బర్డ్)– 2023 నివేదిక తెలిపిందని పిటిషనర్ పేర్కొన్నారు.వారికి బలమైన రక్షణలు కల్పించాలి ప్రస్తుత చట్టంలోని నిబంధనల్లో అనేక లొసుగులు ఉన్నాయని న్యాయవాది సొనాలీ జైన్ తెలిపారు. ఈ లోపాలను ఆసరాగా తీసుకుని మనుషుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రంగాల్లో పిల్లలను నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. రక్షించిన పిల్లలకు సమర్థవంతమైన రక్షణ, పునరావాసం కల్పించేందుకు బలమైన చట్ట పరమైన రక్షణలు, సంస్థాగత ప్రొటోకాల్లు అవసరమని విన్నవించారు. వాదనలను విన్న ధర్మాసనం ఎక్కడెక్కడ బాల కార్మీకులు పనిచేస్తున్నారు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, స్పందనను వెంటనే తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్ రైట్స్(ఎన్సీపీసీఆర్), జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లకు నోటీసులు జారీ చేసింది. -
డిపాజిట్లు రూ.లక్ష కోట్లు అప్పులు రూ.లక్షన్నర కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా నగదు డిపాజిట్లు, అప్పులు పెరుగుతున్నాయి. 2026 మార్చి నాటికి గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని రకాల బ్యాంకుల్లో కలిపి రూ. 9.43 లక్షల కోట్లు ఉంటే, అన్ని రకాల బ్యాంకుల ద్వారా తీసుకున్న మొత్తం అప్పులు రూ.12.33 లక్షల కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) గణాంకాలు చెబుతున్నాయి. 2025–26 సంవత్సరంలో ఈ డిపాజిట్లు, అప్పులు కొత్త బెంచ్ మార్కులను అధిగమించాయి. ఒకే సంవత్సరంలో నగదు డిపాజిట్లు రూ.లక్ష కోట్లు పెరగ్గా, అప్పులు రూ.1.5 లక్షల కోట్లు పెరిగాయి. 2025 మార్చి నాటికి రూ.8.40 లక్షల కోట్లు ఉన్న డిపాజిట్లు ..రూ.9.43 లక్షల కోట్లు కాగా, రూ.10.81 లక్షల కోట్లున్న రుణాలు.. రూ.12.33 లక్షల కోట్లకు పెరిగాయని ఎస్ఎల్బీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఆరేళ్లలో 70 శాతం పెరుగుదల డిపాజిట్ల విషయానికి వస్తే 2021 మార్చి నాటికి రాష్ట్ర ప్రజలు రూ.5.71 లక్షల కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఆరేళ్ల కాలంలో ఈ డిపాజిట్లు దాదాపు 70 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డిపాజిట్ల విషయానికి వస్తే 2020–21లో రూ.87,649 కోట్లు, 2021–22లో రూ. 60, 616 కోట్లు, 2022–23లో రూ. 50,481 కోట్లు, 2023–24లో రూ. 96,947 కోట్లు, 2024–25లో రూ.60,477 కోట్లు, 2025–26లో రూ.1,02,995 కోట్లు పెరిగాయి. ⇒ అప్పుల విషయానికి వస్తే 2021 మార్చి నాటికి రూ.6.27 లక్షల కోట్లు ఉన్న అప్పులు దాదాపు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలోని అన్ని రకాల బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం అప్పు 2026 మార్చి నాటికి రూ.12,33,858 కోట్లకు చేరింది. ఇక, సంవత్సరాల వారీగా పరిశీలిస్తే 2020–21లో రూ.56,662 కోట్లు, 2021–22లో రూ.1,05,292 కోట్లు, 2022–23లో రూ.81,564 కోట్లు, 2023–24లో రూ.1,65,163 కోట్లు, 2024–25లో 1,02,302 కోట్లు, 2025–26లో రూ. 1,52,497 కోట్లు పెరిగాయని ఎస్ఎల్బీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ⇒ క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తి (సీడీఆర్) ఆర్బీఐ లెక్కల ప్రకారం 60 శాతం ఉండాల్సి ఉండగా, ఈ రెండింటి నిష్పత్తి 2026 మార్చి నాటికి తెలంగాణలో 130.78 శాతానికి పెరగడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ బ్యాంకు శాఖల సంఖ్య ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోంది. 2021 మార్చి నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,783 బ్యాంకు శాఖలుండగా, 2026 మార్చి నాటికి ఆ సంఖ్య 1,918కి చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో 1,283 నుంచి 1,649కి పెరిగాయి. వీటితోపాటు అర్బన్, మెట్రో ప్రాంతాల్లో కలిపి 2021 మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా 5,762 బ్యాంకు శాఖలుండగా, 2026 మార్చి నాటికి 6,801కి పెరిగాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కలు వెల్లడించాయి. -
అంతా మీ ఆశీర్వాదమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మళ్లీ ఈ సర్కార్ను అధికారంలోకి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉందని అన్నారు. రాష్ట్ర మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని, మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా నిలబడాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అన్నారు. ‘మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది.. కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. ఈ దిశలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది..’ అని అన్నారు. సోమవారం సచివాలయంలో..ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా..8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం స్విచ్ నొక్కి వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక బలోపేతానికి కీలక నిర్ణయాలు ‘రాష్ట్ర వ్యాప్తంగా రూ.800 కోట్లతో 8 వేల మహిళా సంఘాల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశాం. ఈ మేరకు ప్రభుత్వం దేశంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీలు) మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంలో భాగంగా మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం అవసరమైన భూమి, బ్యాంకు రుణాలు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. మహిళా సంఘాలు మండలాల్లో గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం వంద ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తాం. అలాగే మహిళా సంఘాలతో మహిళా శక్తి సూపర్ బజార్లు కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేస్తాం. ఈ బజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది. వీటిల్లో నాణ్యమైన వస్తువులు దొరికేలా చూడాలి. పట్టణ ప్రాంతాల్లో వీటి కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకు లీజుకు ఇస్తాం. ఇవి దేశంలోనే బెస్ట్ సూపర్ బజార్లుగా తయారు కావాలి. డీమార్ట్, బిగ్ బజార్ల కంటే బెస్ట్గా మహిళా శక్తి సూపర్ బజార్లు ఉండాలి..’ అని సీఎం అన్నారు. 5వ తేదీన మహిళలకు మరో 553 బస్సులు ‘మహిళలను బస్సుల యజమానులను చేయాలని వెయ్యి బస్సులు కొనుగోలు చేసి ఆరీ్టసీకి అద్దెకు ఇచ్చాం. అదే విధంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్లో మహిళా సంఘాల ద్వారా నడిచే మరో 553 బస్సులను ప్రారంభిస్తున్నాం. మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వ చేయం భవిష్యత్తులో మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టం. మహిళా ఎస్హెచ్జీలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారిగా ఉంటారు. ఇకపై రూ.10 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ రుణాలు సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ గుర్తుకు వస్తారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తోంది. రిలయన్స్ వాళ్లు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని కూడా మహిళా స్వయం సహాయ సంఘాలతో చేయిస్తున్నాం. మహిళలకు సంబంధించి రూ. 5 లక్షల వరకున్న బ్యాంక్ లింకేజీ లోన్లను రూ.10 లక్షలకు పెంచుతున్నాం. మహిళలు తాము తీసుకున్న ప్రతి రూపాయిని నిక్చచ్చిగా చెల్లించి ముందుకు వెళ్తున్నారు. లోన్లు తీసుకున్న వ్యాపారులు మాత్రం ఎగ్గొట్టి పారిపోతున్నారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలు ‘రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డకు సారెలా చీరలు అందజేసింది. గతంలో ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగించారు. ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణి చేస్తాం. చిలుక పచ్చ రంగులో కొత్త డిజైన్లో ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నాం. అన్నదమ్ములు కొందరు ఇంట్లో నుంచి చెల్లెళ్లను వెళ్లగొడుతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు చెల్లెళ్లను బయటకు వెళ్లగొడితే బయటకు వెళ్లి ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నాం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. మహిళా వారోత్సవాల పురస్కరించుకుని మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే మట్టా రాగమయికి సీఎం చీరలు బహూకరించారు. మహిళా సమాఖ్యలతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో రేవంత్ ముఖాముఖిలో పాల్గొన్నారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు రూ.27 లక్షలు సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్ చేసిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.దానకిశోర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పనులు షురూ మహిళా శక్తి భవనాల వర్చువల్ ప్రారంభం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఆయా భవనాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో కలిసి అధికారులు పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ పనులు పూర్తయిన వందకు పైగా మహిళా భవనాలను ఎక్కడికక్కడ ప్రారంభించారు. -
టాయిలెట్లు, నాప్కిన్ల కొరత సాకుతో బాలికలను బడికి దూరం చేయరాదు
న్యూఢిల్లీ: స్కూళ్లలో శానిటరీ నాప్కిన్లు, వేరుగా టాయిలెట్లు లేవనే ఒకే ఒక్క కారణంతో బాలికలు చదవుకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 30వ తేదీన తాము వెలువరించిన ఆదేశాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో తుచ తప్పక అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని మరోసారి కోరింది. విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు అందించడం, పాఠశాలల్లో బాలికలకు వేరుగా నీటి వసతి కలిగిన పనిచేసే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించేలా చర్యలు వేగవంతం చేశామని సోమవారం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనానికి కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అర్చనా పాఠక్ దవే విన్నవించారు. స్పందించిన ధర్మాసనం..‘ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. అవి మన దేశంలోని మహిళలు, బాలికల మేలు కోసమే. కేవలం టాయిలెట్లు, నాప్కిన్లు లేవని బాలికలు చదువు మానేసి ఇంటి పనులకు పరిమితం కారాదు’అని పేర్కొంది. అదేవిధంగా, తమ ఆదేశాల అమలు తీరుపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివరాలను సేకరించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష కొనసాగిస్తూనే ఉండాలని తెలిపింది. ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకోసారి తమకు నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది. తాము వాటిపై సమీక్ష చేపడతామంది. ఈ అంశంపై సెప్టెంబర్ ఒకటో తేదీన తదుపరి విచారణ జరుపుతామని, ఇందుకుగాను ఆగస్ట్ 15కల్లా నివేదిక అందజేయాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని పేర్కొంది. ఈ సందర్భంగా ఒక మధ్యంతర పిటిషనర్ తరఫు న్యాయవాది జనవరి 30వ తేదీ నాటి ఆదేశాల్లో ఉన్న ఆక్సో–బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ల గురించి ప్రస్తావించారు. అవి పర్యావరణ హితమైనవి కావని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది.ఆ కీలక తీర్పులో ఏముంది? జనవరి 30వ తేదీన అత్యున్నత న్యాయస్థానం..‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా భాగమే. రుతుక్రమ పరిశుభ్రతకు తగు సదుపాయాలు లేకుంటే బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. అంతిమంగా వారు వెనుకబాటుకు గురవుతారు. వీటిని నివారించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్లను బాలికలకు పూర్తిగా ఉచితంగా అందించాలి. అదేవిధంగా, సక్రమంగా పనిచేసే, నీటి వసతి కలిగిన టాయిలెట్లను బాలికల కోసం వేరుగా నిర్మించాలి’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. -
ఎబోలాపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ గా ఎబోలాను ప్రకటించడంతో ఆందోళన మరింత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటి వరకూ ఎబోలా కేసులు నమోదు కాలేదని తెలిపింది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం, విమానాశ్రయాలు మరియు ఓడరేవుల్లో విదేశీ ప్రయాణికులకు కఠిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఎబోలా కలకలంఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా, దక్షిణ సూడాన్లలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రాణాంతకమైన ‘బుండిబుగ్యో’ రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో, భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులను హెచ్చరించింది.అత్యవసర పరిస్థితిప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17న, ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’గా ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఈ వైరస్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) సైతం, దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ’గా పేర్కొంటూ కఠిన నిఘా ఉంచాలని సూచించింది.ఎబోలా వ్యాప్తి ?ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల రక్తం, వాంతులు, వీర్యం, చెమట, ఇతర శరీర ద్రవాలతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత, వ్యాధి తీవ్రత చాలా వేగంగా పెరుగుతుంది. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మొరాయించిన గుల్మార్గ్ గొండోలా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో సోమవారం సాయంత్రం తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. గొండోలా అని పిలిచే కేబుల్ కార్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో 65 క్యాబిన్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అందులోని సుమారు 300 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గాల్లోనే ఉండిపోయారు. కొన్ని క్యాబిన్లు 500 అడుగుల ఎత్తులో ఆగిపోగా పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. దీనికి తోడు భారీ వర్షం కురియడంతో రక్షణ చర్యలకు విఘాతం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మొదటి విడతగా క్యాబిన్లలో ఉండిపోయిన 179 మంది పర్యాటకులను సురక్షితంగా కిందికి దించారు. తాళ్లు, నిచ్చెనల సాయంతో మరో రెండు గంటల అనంతరం మిగతా వారినీ రక్షించారు. పోలీసులు, ఆర్మీతోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 500 అడుగుల ఎత్తులో నిలిచిపోయిన క్యాబిన్లలో వారిని కిందికి దించడం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారిందని అధికారులు చెప్పారు. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
ఆశలు ఆకాశం... రూపాయి పాతాళం
భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందన్న ఉత్సాహం ఓవైపు వ్యక్తమవు తుంటే, మరోవైపు రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోతోంది. ఇది సగటు భారతీయుడి కొనుగోలు శక్తినీ, దేశ ఆర్థిక స్వావలంబననూ ప్రత్యక్షంగా ప్రభావితం చేసే పరిణామం. ఈ నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన 5 బిలియన్ డాలర్ల విలువైన ‘డాలర్–రూపాయి మార్పిడి ఒప్పందం’ (స్వాప్) మే 26న అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో భాగంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను తాత్కాలికంగా రిజర్వ్ బ్యాంక్కు అప్పగించి, బదులుగా రూపాయిలను పొందుతాయి. ముందే నిర్ణయించిన షరతుల ప్రకారం, మూడేళ్ల అనంతరం ఈ మార్పిడి వ్యతిరేక దిశలో జరుగుతుంది. మార్కెట్లో ద్రవ్యలభ్యతను సమతుల్యం చేయడం, ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే స్వల్పకాలిక ఒత్తిడిని తగ్గించడం వంటి లక్ష్యాలతో, తాత్కాలిక తరుణోపాయంగా ఈ చర్యను చేపడుతున్నారు. రూపాయి బలహీనతకు కారణాలెన్నో!రూపాయి బలహీనతకు దారితీసిన మూలకారణాలు, సంబంధిత అంశాలను పరిశీలించినప్పుడే – ఈ ఒప్పందం ప్రభావాన్ని, దాని పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం. గతంలో నెమ్మదిగా, క్రమపద్ధతిలో సాగిన రూపాయి క్షీణత, గత పద్దెనిమిది నెలల్లో ఊహించని వేగాన్నందుకుంటూ, ప్రస్తుతం 96.90 రూపాయల కనిష్ఠాన్ని చేరుకుంది. ఈ పతనానికి ప్రధాన కారణం – పశ్చి మాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడమే. మన దేశ చమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, సహజంగానే రూపాయి విలువపై ఒత్తిడి తీవ్రతరమైంది. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఈ ప్రతికూలతను మరింత పెంచింది.మన వాణిజ్య లోటు వంటి అంతర్గత లోపాలు కూడా రూపాయి బలహీనతకు తోడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు–సేవల నికర వాణిజ్యలోటు సుమారు 120 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎన్నో ఆకాంక్షలతో ప్రారంభమైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమం ద్వారా రక్షణ, చరవాణులు, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ; వాటి తయారీకి అవసరమైన విడిభాగాలను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం – ముడిపదార్థాల సమీకరణ నుంచి ప్రాసెసింగ్, అంతిమ తయారీ, వినియోగం లేదా ఎగుమతి వరకు విస్తరించిన సమగ్ర పారిశ్రామిక శృంఖలాలను దేశీయంగా నిర్మించలేకపోవడమే.వ్యవసాయాధారిత భారతదేశంలో, గ్రామీణ సరఫరా గొలుసులను ఆధునికీకరించి; వాటిని ప్రధాన స్రవంతి తయారీ రంగంతో అనుసంధానించినప్పుడే, మేక్ ఇన్ ఇండియా ఉద్యమ లక్ష్యం సాకారమవుతుంది. ఉదాహరణకు – నిజామాబాద్లో ఉత్పత్తయ్యే దారంతో పోచంపల్లిలో నేసిన పట్టు చీరను, హైదరాబాద్లోని గోల్కొండ వంటి హస్తకళా కేంద్రాల్లో ప్రదర్శించి; హైటెక్ సిటీలోని అంకుర సంస్థలు – ఆ సంప్రదాయ ఉత్పత్తులు విదేశాల్లోని ప్రవాస భారతీయులకు చేరేలా, డిజిటల్ వేదికల ద్వారా ప్రచారం చేయగలగాలి. ఇందులో ఏ దశ కోసం విదేశాలపై ఆధారపడినా, దేశం ఎంతోకొంత విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుంది.హాట్ మనీ కూల్ కాదు!రూపాయి పతనం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి పరిణామాలకు ప్రతిస్పందనగా, విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐలు) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్లుగా మార్చుకుంటారు. దీంతో రూపాయి మరింత బలహీనపడుతుంది. ఇటువంటి స్వల్పకాలిక ‘హాట్ మనీ’ లేదా ‘చంచలమైన పెట్టుబడుల’పై అధికంగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థలు, మరింత సులభంగా బాహ్య ప్రకంపనలకు గురవుతాయి. వీటికి భిన్నంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తాయి. ఈ దిశగా, ప్రభుత్వం రక్షణ, టెలికాం, ఇన్సూరెన్స్, అంత రిక్ష అన్వేషణ వంటి రంగాల్లో పరిమితులను పెంచడం ద్వారా; ఈ ప్రవాహాలు పెరిగే మార్గం సుగమం చేసింది. అందుకు తోడుగా– అనుమతుల ప్రక్రియను ఏకగవాక్ష విధానాల ద్వారా మరింత సరళీకరించడం, మౌలిక సదుపాయాలను ఇతోధికంగా బలోపేతం చేయడం, వనరుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం, అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించడం వంటి చర్యలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. సమాంతరంగా, అనవసర విదేశీ మారకద్రవ్య వ్యయానికి కత్తెర వేయడం కూడా అంతే ముఖ్యం. సికింద్రాబాద్ వేదికగా ప్రధాని సూచించిన విదేశీ మారకద్రవ్య పొదుపు సూచనలు, ప్రభుత్వపరంగా తగిన విధానపరమైన చర్యలు చేపట్టినప్పుడే సమర్థవంతమైన ఆచరణకు నోచుకుంటాయి. విధానపర సంస్కరణలుప్రస్తుతం మన ముందున్న సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో, దేశానికి ఉన్న ప్రధాన రక్షణ కవచం మనవద్దనున్న దాదాపు 700 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు. వీటిని మరింత బలోపేతం చేయాలంటే, మరికొన్ని విధానపరమైన సంస్కరణలు అవసరం– విలాసవంతమైన దిగుమతి వస్తువులపై సుంకాలను పెంచడం, ప్రపంచ స్థిరాదాయ పెట్టుబడి పత్రాల సూచీలలో భారత్కు మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకోవడం; రష్యా, ఇరాన్ వంటి దేశాలతో అమలు చేస్తున్న రూపాయి చెల్లింపు విధానాలను, మరిన్ని దేశాలకు విస్తరించడం. ఈ చర్యల ద్వారా డాలర్పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించవచ్చు.చరిత్రను పునరావలోకనం చేసుకుంటే, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు ప్రభుత్వాల కాలంలో, అత్యవసర స్థితిలో దేశాన్ని గట్టెక్కించేందుకు, రిజర్వ్ బ్యాంక్ దాదాపు 67 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి డాలరు రుణాలను సమీకరించింది. ఆ గడ్డు పరిస్థితితో పోల్చితే, నేడు భారత్ మరింత సురక్షితంగా ఉంది. అయితే, ఒకప్పుడు గణనీయమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కలిగి ఉన్న టర్కీ, అర్జెంటీనా వంటి దేశాలు కూడా తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఆ దేశాల అనుభవాలు... విదేశీ మారక నిల్వలు ఒక విధమైన రక్షణ కవచమే గానీ శాశ్వత పరిష్కారం కావన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి.క్లుప్తంగా చెప్పాలంటే రూపాయి నిరంతర బలహీనత, మన ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణ పరమైన లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తుచేస్తోంది. ఆకాశమంత ఉన్నతంగా ఉన్న మన ఆర్థిక ఆకాంక్షలు నిజం కావాలంటే; ఉత్పాదకత పెంపు, స్థిరమైన పెట్టుబడుల ఆకర్షణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక సంస్కరణలు చేపట్టాలి. ఆర్థిక ప్రయోజనాలు ఆకాశాన్ని తాకాలంటే, రూపాయి పాతాళం వైపు జారకుండా నిలబెట్టే పటిష్ఠమైన పునాదులు ఉండాలి.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐ మాజీ ఉన్నతాధికారి -
టీఎఫ్సీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి: చిరంజీవి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్సీసీ) అన్నది హయ్యెస్ట్ బాడీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. థియేటర్స్లో పర్సెంటేజీ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదు. ఇలాంటివాటి వల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం అందరికీ సముచితం’’ అని హీరో చిరంజీవి తెలిపారు. మల్టీప్లెక్స్లోలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా పర్సెంటేజీ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం చిరంజీవిని కలిసి, వివరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్సీసీ) ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పనితీరు, ఫలితాల పట్ల కొందరు ఎగ్జిబిటర్స్లో అసంతృప్తి, అపనమ్మకం ఉందన్న విషయం అర్థం అయింది.ఫిల్మ్ చాంబర్ కమిటీ జూన్ 30వ తేదీ వరకూ అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించి,ప్రోడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజీ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. కమిటీ సకాలంలో నివేదిక ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సురేష్బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు శేఖర్, నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్తో పాటు భరత్ నారంగ్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది: శివ రాజ్కుమార్
‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేయడం ఇష్టం. ‘పెద్ది’ సినిమాలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే’’ అని చెప్పారు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్. హీరో రామ్చరణ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్వేందు, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ మాట్లాడుతూ– ‘‘పెద్ది’ కథ విన్న తర్వాత, ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించి, ఈ సినిమా చేశాను. ఇందులో ఓ కోచ్ తరహా పాత్రలో నటించాను. కథలో గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటాయి. ఈ పాత్రను బుచ్చిబాబు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. పెద్ది–గౌర్నాయుడు పాత్రల మధ్య అనుభందం ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రల మధ్య నెలకొన్న ఎమోషన్కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం ‘గుమ్మడి నర్సయ్య’, ‘జైలర్ 2’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
వివాదంలో రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. దానికి కారణం ‘డాన్ 3’ సినిమా. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా 2023లో ‘డాన్ 3’ సినిమా ప్రకటన వచ్చింది. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటివరకూ ఈ సినిమా సెట్స్కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ సడన్గా తప్పుకోవడం వివాదమైంది. దీంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అక్తర్ ఆరోపించి, ‘ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎం΄్లాయిస్’ (ఎఫ్డబ్ల్యూఐసీఈ)కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ మాట్లాడుతూ– ‘‘రణ్వీర్ సింగ్ వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఏప్రిల్ 10న ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేశారు.మరో మూడు వారాల్లో ‘డాన్ 3’ప్రారంభమవ్వాల్సిన సమయంలో రణ్వీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాదాపు 200మంది వర్కర్స్కు హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ప్లాన్, లొకేషన్ బుకింగ్ వంటివాటికి ఫర్హాన్, రితేష్ ఖర్చు చేశారు. అలాగే ఫర్హాన్ నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్తో మూడు సినిమాలు చేసేందుకు రణ్వీర్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఆయన సమక్షంలోనే జరిగింది. రణ్వీర్ సింగ్ను తన తరఫు వాదనలు వినిపించాలని మూడు నోటీసులు పంపాం. కానీ స్పందన లేదు’’ అని తెలిపారు. ‘‘ఎంతటి సూపర్ స్టార్ హీరో అయినా చట్టం ముందు గొప్ప కాదని మేం ఇండస్ట్రీకి చెప్పాలనుకుంటున్నాం. రణ్వీర్ సింగ్ వచ్చి, మమ్మల్ని కలిసేంత వరకు ఆయనపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది’’ అని ఎఫ్డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు. హుందాగా పరిష్కరించుకోవాలి: రణ్వీర్ఈ నేపథ్యంలో ‘‘ఈ తరహా విషయాలను పరిణతితో, పరస్పర గౌరవంతో పరిష్కరించుకుంటే బాగుంటుంది. ‘డాన్’ ఫ్రాంచైజీతో సంబంధం ఉన్నవారితో సహా, చిత్ర పరిశ్రమలోని అందరి పట్ల మా నటుడికి అత్యంత గౌరవం ఉంది’’ అంటూ రణ్వీర్ సింగ్ తరపున ఆయన అధికార ప్రతినిధి ఓ లేఖ విడుదల చేశారు. అందులోని సారాంశం ఈ విధంగా... ‘‘డాన్ 3’కి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆయన (రణ్వీర్) మౌనంగా ఉండాలనుకున్నారు. వృత్తికి సంబంధించిన చర్చలు, వ్యక్తిగత అనుబంధాలకు సంబంధించిన విషయాలను హుందాగా, పరిణతితో పరిష్కరించుకోవాలి.అయితే ఈ మధ్య పలు ఊహాగానాలు నెలకొనడంతో రణ్వీర్ స్పందించాలనుకున్నారు. ఆయన ఫోకస్ మొత్తం ప్రస్తుత కమిట్మెంట్స్, చేసే పని మీద మాత్రమే ఉన్నాయి’’ అన్నది ఆ లేఖ సారాంశం. అలాగే ‘‘ఈ చిత్రంతో అసోసియేట్ అయిన అందరి మీదా ప్రగాఢమైన గౌరవం, సానుకూలత ఉన్నాయి. ఈ ‘డాన్’ ఫ్రాంచైజీ తన విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను’’ అని కూడా రణ్వీర్ పేర్కొన్నారు. -
ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్ పునఃప్రారంభం..?
ప్రస్తుతం దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురించాయి. ఇదే జరిగితే హర్ముజ్లో ప్రపంచ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమచారం.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్భందించడం. దీంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దోహలో జరుగుతున్న చర్చలు సఫలమైతే 30 రోజుల్లో హర్ముజ్ తెరిచేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.హర్ముజ్లో ఇరాన్ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటిని ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగా ఇక్కడ ప్రయణించడానికి మార్గం సుగమం అవుతుంది. అదే విధంగా జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ వసూలు చేస్తున్న రవాణా రుసుములను పూర్తిగా రద్దు చేస్తుందని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇటీవల ఇరాన్ సైతం కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ అణు నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాగా ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇంతకాలం ప్రపంచం ఎదుర్కొన్న చమురు సంక్షోభానికి ముగింపు లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్లో సమంత
సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్' అని ప్రశంసించింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్లో సమంత తన స్టంట్స్తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. -
ట్రంప్పై.. మార్కో రూబియో సెటైర్.. క్లిప్ డీలీట్
అమెరికా విదేశాంగ శాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార చర్యలపై వివరణ ఇచ్చారు. తాజాగా ఆవీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు అధికారిక ఖాతా నుంచి తొలిగించారు. ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు అన్న పదం పరోక్షంగా ట్రంప్కు చురకులంటించే విధంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న(ఆదివారం) భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మార్కో రూబియో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, అలాగే భారతదేశాన్ని "నరకకూపం"గా పేర్కొంటూ చేసిన ట్రంప్ చేసిన ఒక పోస్ట్ అంశమై మీడియా ప్రతినిధులు మార్కో రూబియోను ప్రశ్నించారు.దీనికి మార్కో రూబియో వివరణ ఇస్తూ.. “ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలివితక్కువ మాటలు మాట్లాడే మూర్ఖులు ఉంటారు. వారి మాటలను మెుత్తం దేశానికి ఆపాదించకూడదన్నారు. ట్రంప్ భారతదేశానికి, ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని అన్నారు." అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు వెంటనే తమ అధికారిక ఖాతా నుంచి తొలగించారు.మార్కో రూబియో చేసినా వ్యాఖ్యలు పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ను "తెలివితక్కువ మాటలు మాట్లాడే" "మూర్ఖులలో" ఒకరిగా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ విమర్శకులు ప్రస్థావించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. -
‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అధికార పార్టీ టీవీకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 126 చోట్ల ప్రజలు విజయ్ టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కొన్ని పార్టీల వద్దకు వెళ్లి మద్దతు కోరారని విమర్శించారు.“అదే కాకుండా, ‘పుష్ప’ సినిమా శైలిలో సోఫా చేతిలో పట్టుకుని వెళ్లినట్టు.. అన్నాడీఎంకే తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారి మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నించారు. ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఇదేనా నిజాయితీగల రాజకీయ నాయకుడి ప్రవర్తన అని ప్రశ్నిస్తున్నారు” అని పేర్కొన్నారు. కాగా, పుష్ప సినిమాలో సోఫాల్లో హీరో డబ్బుల కట్టలు పంపుతాడు.తమిళనాడులో ఈ ఘటనను “ముందే పన్నిన కుట్ర”గా ఈపీఎస్ పేర్కొన్నారు. రాజీనామాలు, టీవీకేలో చేరికలు సచివాలయం లోపలే సమన్వయంతో జరిగాయని పళనిస్వామి ఆరోపించారు. “సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాజీనామా లేఖలు ఆమోదిస్తుండగా, ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి చేతుల మీదుగా సభ్యత్వ కార్డులు ఇచ్చారు” అని చెప్పారు. దీంతో ఇది ముందే పన్నిన కుట్ర అని, బేరసారాల రాజకీయాలు బయటపడ్డాయని ఈపీఎస్ అన్నారు.ఇలాంటి మోసపూరిత చర్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్తవని, ఎన్నో ద్రోహాలు, వెన్నెపోట్లను ఏఐఏడీఎంకే ఎదుర్కొని నిలబడిందని చెప్పారు. విజయ్పై ఈపీఎస్ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. “సినిమా ప్రముఖుడి గుర్తును” ప్రజలు తిరస్కరించడంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారని అన్నారు. టీవీకే విజిల్ గుర్తును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇతరుల భుజాలపై ఎక్కి ప్రయాణిస్తున్న వారికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు.అన్నాడీఎంకేలో విభేదాలు మరింత తీవ్రంఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ రాజీనామాలు మరో ఎదురుదెబ్బగా మారాయి. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం పళనిస్వామికి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణికి మద్దతు ఇస్తోంది.రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన షణ్ముగం-వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలలో ఉన్నారు. అయితే, మరో పరిణామంలో, తిరుగుబాటు వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం తిరిగి పళనిస్వామి వర్గంలో చేరారు. దీంతో ఈపీఎస్కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 27కి పెరిగింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు తర్వాత స్పీకర్ను కలిసి, పళనిస్వామి నాయకత్వంలో పనిచేస్తామని లేఖ ఇచ్చారు.నిబంధనల ప్రకారమే..: స్పీకర్ బేరసారాల జరిగాయన్న ఆరోపణలపై స్పందించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. తన బాధ్యత రాజీనామా లేఖలు అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడటమేనని చెప్పారు. “సమర్పించిన లేఖలు నిబంధనలకు సరిపోతున్నాయా లేదా మాత్రమే నేను పరిశీలించగలను. బయట ఏం జరుగుతుందో నేను మాట్లాడలేను” అని విలేకరులతో చెప్పారు.రాజీనామాలు ఆమోదం పొందడంతో, మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో గెలిచి తర్వాత విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో కూడా ఉపఎన్నిక జరగనుంది.తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, టీవీకేలో చేరడంతో దీనిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఇప్పటికే ఆమోదించారు. దీంతో 234 సభ్యుల అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 47 నుంచి 44కి తగ్గింది. మే 13న విశ్వాస పరీక్షలో సి.జోసఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ కూడా ఉన్నారు.శరవేగంగా బేరసారాలు: స్టాలిన్డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దీనిపై మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. శరవేగంగా బేరసారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మొదట మిత్రపక్షాల మద్దతు కోరిన టీవీకే తర్వాత ఫ్లోర్ టెస్ట్ సమయంలో అన్నాడీఎంకేలోని కొంతమందితో చర్చలు జరిపిందని, చివరకు కొంతమంది అన్నాడీడీఎంకే సభ్యుల రాజీనామాలు చేయించి, వారినే సచివాలయ ప్రాంగణంలో తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపించారు. ఇలాంటి అవమానకర దృశ్యాలు చూడటానికే ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని స్టాలిన్ అన్నారు.టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్పై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకతంగా వ్యవహరించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని కపటత్వంగా ఉందని పేర్కొన్నారు. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. ఈ ఫిరాయింపులపై “ఆయా రామ్, గయా రామ్” అన్న వ్యాఖ్య చేశారు. -
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు. President Donald Trump posts on Truth Social- "Negotiations with the Islamic Republic of Iran are proceeding nicely! It will only be a Great Deal for all or, no Deal at all to the Battlefront and shooting, but bigger and stronger than ever before, and nobody wants that! During my… pic.twitter.com/D1IhQaGjim— ANI (@ANI) May 25, 2026 -
పెట్రోల్ మంటలు.. వంటింటికి సెగలు!
గత రెండు వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో.. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మే 15 తర్వాత నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడంతో ప్రజల రోజువారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 నుంచి రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.95.2కు పెరిగింది. అదే సమయంలో సీఎన్జీ ధరలు కూడా కేజీపై సుమారు రూ.4 వరకు పెరిగింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. ముఖ్యంగా అక్కడి యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులపై మాత్రమే కాదు, సాధారణ కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సరుకుల రవాణాకు ఇంధనం కీలకం. రైతుల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగడంతో వాటి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే వంటింటి ఖర్చులు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధర కేజీకి రూ.11.2 పెరిగింది. సోయా ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోకు రూ.7కిపైగా పెరగగా, నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వంటనూనెల విషయంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం వల్ల ప్రపంచ మార్కెట్ ప్రభావం నేరుగా కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకేసారి రెండు రకాల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రయాణ ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు వంటింటి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే సాధారణ జీవనం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్! -
ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్
తమిళనాడు చెందిన మరో క్రికెటర్ ఐపీఎల్ సహా దేశవాలీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట ఆల్రౌండర్ విజయ్ శంకర్ దేశవాలీ క్రికెట్తో పాటు ఐపీఎల్కు వీడ్కోలు పలకగా.. తాజాగా మురుగన్ అశ్విన్ కూడా రెండు విభాగాలకు బై బై చెప్పాడు.35 ఏళ్ల అశ్విన్ లెగ్ బ్రేక్ బౌలర్గా సుపరిచితుడు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మురుగన్.. 2018లో ఆర్సీబీకి, 2019-21 వరకు పంజాబ్ కింగ్స్కు, 2022లో ముంబై ఇండియన్స్కు, 2023లో రాజస్థాన్ రాయల్స్కు ఆడాడు. View this post on Instagram A post shared by Ashwin Murugan (@ashwinmurugan)అప్పటి నుంచి అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మురుగన్ తన ఐపీఎల్ కెరీర్లో 44 మ్యాచ్లు ఆడి 35 వికెట్లు తీశాడు.2012లో తమిళనాడు తరఫున దేశవాలీ అరంగేట్రం చేసిన మురుగన్.. 2023, 24లో చండీఘడ్కు, 2025లో జమ్మూ కశ్మీర్కు ఆడాడు. దేశవాలీ కెరీర్లో 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 29 లిస్ట్-ఏ, 105 టీ20లు ఆడిన మురుగన్.. మొత్తంగా 130 వికెట్లు తీశాడు. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా-ఏ జట్టు ఘన విజయం సాధించింది. అరండల్ (ఇంగ్లండ్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పెద్దగా అనుభవం లేని లయన్స్ను ప్రొటీస్-ఏ టీమ్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 157, రెండో ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లోనే (331 ఆలౌట్) భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకొని, రెండు ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని (214) కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో సెనోక్వానే (55), జోర్డన్ హెర్మన్ (70 నాటౌట్), జుబేర్ హంజా (54 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ మార్కస్ అకెర్మన్ (173) భారీ సెంచరీతో కదంతొక్కాడు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. కనీసం ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. 25 పరుగులు చేసిన ఏకాన్ష్ సింగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జేసన్ స్మిత్ 4, మొకోయెనా 3, డేన్ పీటర్సన్ 2, బార్ట్మన్ ఓ వికెట్తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైన లయన్స్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్నారు. ఓపెనర్ ఆసా ట్రైబ్ (135), బెన్ మేస్ (105) సెంచరీలతో సత్తా చాటారు. అయినా వారు సౌతాఫ్రికా ముందు సరిపడా లక్ష్యాన్ని ఉంచలేకపోయారు. దీంతో స్వదేశంలో లయన్స్కు ఓటమి తప్పలేదు. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మే 29న మొదలవుతుంది.
