-
బయోకాన్ వారసురాలిగా క్లైర్ మజుందార్
భారత బయోటెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన బయోకాన్ సంస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా తన మేధస్సుతో ప్రపంచ స్థాయి బయోటెక్ సామ్రాజ్యాన్ని నిర్మించిన సంస్థ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్షా తన వారసురాలిని ఖరారు చేశారు. తన మేనకోడలు క్లైర్ మజుందార్ బయోకాన్ పగ్గాలు చేపట్టనున్నారని ప్రకటించారు.క్లైర్ మజుందార్37 ఏళ్ల క్లైర్ మజుందార్ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఆంకాలజీ (క్యాన్సర్) పరిశోధన సంస్థ ‘బికారా థెరప్యూటిక్స్’కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2018లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె సంస్థను ఒక నూతన స్థాయికి తీసుకెళ్లారు. సంస్థను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మార్చడంతోపాటు లిస్టింగ్ తర్వాత దాని విలువను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. క్లైర్ నాయకత్వంలో బికారా సంస్థ క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నిర్మూలించే ‘బై-స్పెసిఫిక్ యాంటీబాడీస్’ వంటి అత్యాధునిక చికిత్సలపై దృష్టి సారించింది.క్లైర్ విద్యా నేపథ్యంమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ రంగాల్లో ఆమె పట్టా పొందారు. ఆమె కుటుంబ నేపథ్యం కూడా సైన్స్, టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఆమె సోదరుడు ఎరిక్ మజుందార్ కాల్టెక్లో ఏఐ నిపుణుడిగా పనిచేస్తుండగా ఆమె భర్త థామస్ రాబర్ట్స్ ప్రముఖ క్యాన్సర్ నిపుణులు.భవిష్యత్తు కార్యాచరణకిరణ్ మజుందార్-షా తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఫార్చ్యూన్ ఇండియాకు వివరించారు. ‘ఏకైక యజమానిగా సంస్థను సురక్షితమైన చేతుల్లో ఉంచడం నా బాధ్యత. క్లైర్ సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
‘‘రాజీనామా చేయకపోతే మమతా బెనర్జీని ఇలా తొలగించొచ్చు’’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు."ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేస్తారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అంతే, ఈ ప్రక్రియ సులభం. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు."మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. ఈ ఫలితం చాలా కాలం క్రితమే రావాలి. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. మీరు 'నేను రాజీనామా చేయను' అంటారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్ఐఆర్ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.కాగా, గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇవాళ రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె తీరు వల్ల ఊహించని పరిస్థితి ఏర్పడింది. "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజ్ భవన్కు వెళ్లను. రాజీనామా ఇవ్వను" అని మమతా బెనర్జీ మీడియాతో చెప్పారు.గవర్నర్ సాంకేతికంగా ముఖ్యమంత్రిని తొలగించొచ్చు. అయితే కొన్ని నియంత్రణలు ఉన్నాయి. గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా నిర్దేశించాయి. అసెంబ్లీకి ఉన్న గడువు మే 7. అది పూర్తయ్యేలోపే గెలిచిన పార్టీ ముందుకు వచ్చి “మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని చెబితే.. గవర్నర్ వారిని ఆహ్వానించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. అలా జరిగితే మమతా బెనర్జీని ప్రత్యేకంగా తొలగించే అవసరం ఉండదు. -
ఉచిత డిజిటల్ సహకార కోర్సులు
సహకార రంగానికి సంబంధించి 160కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8 భాషల్లో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతిదారులు, విద్యార్థులకు ఉపయోగపడేలా కృత్రిమ మేధ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సవిద్య.సీఓఓపి’ పేరిట ఒక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది.‘సవిద్య’ అంటే ‘సహకార విద్యాలయం’. (Sahakar Vidyalaya) ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు, విద్యార్థులు, ఎగుమతిదారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించటానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ‘సహకార్ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణను అందిస్తుంది. వ్యవసాయ పద్ధతులు, ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160కి పైగా ఉచిత వీడియో కోర్సులు. తెలుగు సహా 8 భారతీయ భాషల్లో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్ను వ్యక్తిగతీకరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా జ్ఞానాన్ని అందించేందుకు ఏఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది.వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి, పంట దిగుబడిని మెరుగుపరచుకోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధన అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు, ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచటం విశేషం.నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్), క్రిబ్కో వంటి సహకార సంస్థలు ఉమ్మడి కృషితో సహకార విద్యా ప్లాట్ఫారమ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17,000 సహకార సంఘాలను 2 కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయటమే దీని లక్ష్యం. మీరు savidya.coopలో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకొని, సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు. -
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది.ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026 -
అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యాడు!
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ప్రభుత్వం పరాజయం పాలైంది. ద్వంద్వ పార్టీల సంప్రదాయానికి తమిళులు చరమగీతం పాడి మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన టీవీకే విజయ్వైపు మొగ్గుచూపారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరాటంకంగా కొనసాగిన ద్రవిడ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని బీజేపీ నేత అన్నామలై ముందే పసిగట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది.“తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అన్నామలై చెన్నైలో కాకుండా కొలంబోలో ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈరోజు సాధించిన గెలుపు, 2024లో అన్నామలై ఊహించినదే. ఆయన దానిని ముందుగానే పసిగట్టారు, కానీ తమిళులు బీజేపీకి తమ విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు” అని ఎక్స్ పోస్ట్ పెట్టారు. దీనిపై అన్నామలై మద్దతుదారులు ఆయనకు సానుకూలంగా స్పందించారు. కాగా, ఆదివారం సాయంత్రం కొలంబోలో ఉన్న అన్నామలై.. సోమవారం ఎన్నికల ఫలితాల సమయానికి చెన్నైకు తిరిగి వచ్చినట్టు ఆమె మరో పోస్ట్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.బీజేపీ ఒంటరిగా పోటీచేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని అన్నామలై మద్దతుదారులు వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రెండేళ్ల క్రితమే అన్నామలై పసిగట్టారని అంటున్నారు. డీఎంకే వ్యతిరేక ప్రచారాలు, పాదయాత్రలు, అవినీతి బట్టబయలు చేయడం ద్వారా తమిళనాడులో మార్పు కోసం ఉన్న ఆకాంక్షను అన్నామలై ముందుగానే గుర్తించారని చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం.. క్షేత్రస్థాయి మద్దతు ఉన్న అన్నామలైని పక్కన పెట్టిందని ఆయన సానుభూతిపరులు అభిప్రాయపడ్డారు.పొత్తుతో చిత్తు'అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యారు' అన్నట్టుగా ఎక్స్లో పోస్టులు పెట్టారు. ''తమిళనాడు ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయారని అన్నామలై ముందే చెప్పారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. ఆయన మాటలను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు విజయ్ సాధించిన విజయంతో అన్నామలై మాటలు నిజమయ్యాయ''ని ఒకరు పేర్కొన్నారు. అన్నామలై మూడేళ్లకు పైగా కష్టపడి డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో విజయ్ ఫలితం పొందారని మరొకరు అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పు చేసిందని ఎక్కువ మంది పేర్కొన్నారు.చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!రిస్క్ తీసుకోవాలి2024, ఫిబ్రవరి 16న జరిగిన పార్టీ సమావేశంలో అన్నామలై మాట్లాడిన వీడియోను తాజాగా వెలుగులోకి తెచ్చారు. 2026 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదు. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. తమిళనాడులో మొట్టమొదటి సారిగా ప్యూర్ అలయెన్స్ గవర్నమెంట్ ఏర్పడబోతోంది. ఈ రెండేళ్లలో పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్దంగా పనిచేసి క్షేత్రస్థాయిలో నాయకులకు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి 500 రోజుల ముందే 234 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలి. వారం, పది రోజుల అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు. బీజేపీ రిస్క్ తీసుకుని ఈ విధంగా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నామలై అప్పట్లో అన్నారు. பிப்ரவரி 16, 2024. சரியாக 2 வருடம் முன்பு அண்ணாமலை சொன்ன வார்த்தைகள் இன்று அச்சு பிசுறாமல் 200% அப்படியே நடந்துள்ளது.பாஜகவின் வெற்றியை தடுத்து, ரிஸ்க் எடுக்கவும் உழைக்கவும் பயந்து இன்று தமிழக பாஜகவை ஒழித்தது யார்? @annamalai_k 🙇🏻🔥🔥 pic.twitter.com/FTFJERVEX9— ᴋᴀʀᴛʜɪ (@TwitzKarthi) May 5, 2026 -
తృణముల్ చాప్టర్ ముగిసింది: మాజీ క్రికెటర్
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తృణముల్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తనకు హౌరాలోని షిబ్పుర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. ఇక రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్తో తన అధ్యాయం ముగిసిందని మనోజ్ తివారి పేర్కొన్నాడు. సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడిన బెంగాల్ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో బీజేపీ గెలుపుపై మనోజ్ తివారి స్పందించాడు. ఈ సందర్భంగా తృణముల్ అవినీతి, పార్టీ చేసిన అరాచకాలను మనోజ్ తివారి ఎండగట్టాడు. ‘హౌరాలోని శిబ్పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను.ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది. క్రీడా మంత్రి బిస్వాస్కు క్రీడలపై కనీస అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు.ఇక తన రాజకీయ జీవితం ముగిసిందని ప్రకటించిన మనోజ్ తివారి త్వరలో క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్ పాత్రలో వస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే బీసీసీఐ లెవెల్ 2 కోచ్ పరీక్షను కూడా పాసైనట్లు తెలిపాడు. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మనోజ్ తివారి దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అత్యధిక పరుగులు (10,195 పరుగులు) చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇక టీమిండియా తరఫున 2008 నుంచి 2015 మధ్య ఆడిన మనోజ్ తివారి 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఐపీఎల్లో మనోజ్ తివారి కేకేఆర్, పంజాబ్, రైజింగ్ పూణే, ఢిల్లీ డేర్డెవిల్స్ ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్! -
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఎస్ఆర్హెచ్ అభిమానులకు శుభవార్త
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో రేపు (మే 6) జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా కేకేఆర్ మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నాడని తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ విషయంపై జట్టు కోచ్ డేనియల్ వెటోరీ క్లారిటీ ఇచ్చాడు.కాగా, నితీశ్ స్థానంలో కేకేఆర్ మ్యాచ్లో బరిలోకి దిగిన స్మరణ్ రవిచంద్రన్ (4) ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్లో నితీశ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో మిగతా జట్లకంటే ముందుండేది.ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పంజాబ్ (13), ఆర్సీబీ (9 మ్యాచ్ల్లో 12) తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్, గుజరాత్కు సైతం తలో 12 పాయింట్లు ఉన్నప్పటికీ.. రన్రేట్ పరంగా సన్రైజర్స్ కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్-5లో ఉండి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. ఇకపై ఈ జట్లకు ప్రతి మ్యాచ్ కీలకంగా ఉంటుంది. -
మమత వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందన
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తాము ఓడిపోలేదని, నైతికంగా తామే గెలిచామని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి స్పందించారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయనంటే కుదరదని సువేందు అధికారి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీది రాసి ఉందని, ఓడిపోయాక రాజీనామా చేయనంటే సాధ్యమయ్యే పనినే అంటూ ప్రశ్నించారు. మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని సువేందు అధికారి తెలిపారు. కాగా, బెంగాల్లో నైతిక విజయం తమదేనని అన్నారు మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్భవన్కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు’ అంటూ ధ్వజమెత్తారు. -
కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.రూ.2,600 కోట్ల పైచిలుకు వ్యయంఈ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం కాగ్నిజెంట్ 230 మిలియన్ డాలర్ల నుంచి 320 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,900 కోట్ల నుంచి రూ.2,600 కోట్లు) నిధులను కేటాయించింది. ఇందులో ప్రధానంగా 200 మిలియన్ల నుంచి 270 మిలియన్ డాలర్లను ఉద్యోగులకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కంపెనీ అధికారికంగా తొలగింపుల సంఖ్యను వెల్లడించనప్పటికీ అంతర్గత వ్యయ అంచనాలు, వివిధ ప్రాంతాల్లోని జీతభత్యాల ప్రమాణాల ఆధారంగా ఈ గణాంకాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.భారత్పైనే తీవ్ర ప్రభావం?కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3,57,000 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండగా ఇందులో 2,50,000 మందికి పైగా భారత్లోనే పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ జీతభత్యాల వ్యయం తక్కువగా ఉండటం, ఉద్యోగ విరమణ/తొలగింపు ప్రక్రియకు సంబంధించిన ఖర్చులు సాపేక్షంగా తక్కువ కావడంతో ఈ కోతలు భారత్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించిన ఆయన పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా తెలుగులో నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించారు. తమిళ హీరో విజయ్తో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. విజయ్తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో చివరిసారిగా చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని నిర్మించారు.అర్బీ చౌదరి సినీ ప్రస్థానం..ఆయన పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. మొదట మలయాళం సినిమాలతో నిర్మాతగా ప్రవేశం చేశారు. 1989లో తమిళ సినిమాల్లో ప్రవేశించి, "సూపర్" బ్యానర్ కింద సినిమాలు నిర్మించారు. అటు తరువాత "గుడ్ నైట్" బ్రాండ్ నుండి "గుడ్" అనే పదాన్ని తీసుకుని, "సూపర్ గుడ్ ఫిల్మ్స్" అనే పేరుతో స్వతంత్రంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు.ఆయన పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. మొదట మలయాళం సినిమాలతో నిర్మాతగా ప్రవేశం చేశారు. 1989లో తమిళ సినిమాల్లో ప్రవేశించి, "సూపర్" బ్యానర్ కింద సినిమాలు నిర్మించారు. అటు తరువాత "గుడ్ నైట్" బ్రాండ్ నుండి "గుడ్" అనే పదాన్ని తీసుకుని, "సూపర్ గుడ్ ఫిల్మ్స్" అనే పేరుతో స్వతంత్రంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారుఆయన జన్మించింది తమిళనాడులోని చెన్నై. ఆయనకు నలుగురు కుమారులున్నారు. జీవన్(స్టీల్ కంపెనీ యజమాని), జితన్ రమేష్ (నటుడు, నిర్మాత),సురేష్(నిర్మాత), జీవా(ప్రముఖ నటుడు). సూపర్ గుడ్ ఫిల్మ్స్ దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఆయన కుమారులు, ముఖ్యంగా జీవా మరియు జితన్ రమేష్, సినీ పరిశ్రమలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.ఫిల్మ్ఫేర్ అవార్డ్స్1990 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) –వసంతం1999 – బెస్ట్ ఫిల్మ్ (తెలుగు) – రాజా2001 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) – ఆనందంతమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్:నాటామై (1994), సూర్యవంశం (1997), తుల్లాధ మనముమ్ తుల్లుం (1999) వంటి చిత్రాలకు ఉత్తమ చిత్ర అవార్డులు. -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్కే అప్డేట్స్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా 48వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్కింగ్స్ తలపడుతున్నాయి.4 వికెట్లు డౌన్నితీశ్ రాణా, కరుణ్ నాయర్ ఔటయ్యారు. నితీశ్ రాణా 15 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్లో కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 13 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్లో గుర్జప్నీత్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అకిల్ హొసేన్ బౌలింగ్లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది.తొలి వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్లో బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.టాస్ నెగ్గిన ఢిల్లీ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే రెండు మార్పులు చేసింది. అకిల్ హొసేన్, గుర్జప్నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు. సీజన్ తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయాన్ని అందుకుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూపర్కింగ్స్దే పైచేయి. 32 మ్యాచ్ల్లో 20 సార్లు సీఎస్కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారికి చెంపపెట్టు లాంటిది’
తాడేపల్లి : మార్గదర్శి బాధితులకు న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈనాడు కిరణ్కు చెంపపెట్టులాంటిదన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. మార్గదర్శి బాదితులకు న్యాయం జరగాలని సుప్రీం ఇచ్చిన తీర్పు అద్భుతమైనదన్నారు. రామోజీరావు చనిపోయినందున కేసు కొట్టేయాలంటూ కిరణ్ కోర్టును అడగటం సిగ్గుచేటన్నారు. ‘రూ.600 కోట్లు ప్రజల నుండి అక్రమంగా డిపాజిట్టు తీసుకున్నారు. ఆ డబ్బంతా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ లాంటి వాడినే మానసికంగా చంపేశారు. మద్యపాన నిషేధాన్ని తనకు అవసరమైనట్టుగా వాడుకున్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలనే బెదిరించారు. మార్గదర్శి ద్వారా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో ఇష్టానుసారం చేశారు. తనకు నచ్చని నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. అలాంటి కిరణ్కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలకు బలం చేకూరింది. ఆర్బిఐతో సహా రెండు తెలుగు రాష్ట్రాల వివరణ కోరటం అభినందనీయం. మార్గదర్శి బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
లేఆఫ్స్ వేళ ఉద్యోగుల హక్కులివే!
ప్రస్తుత కాలంలో అగ్రశ్రేణి టెక్ కంపెనీలు చేపడుతున్న సామూహిక తొలగింపులు (లేఆఫ్స్) ఉద్యోగ రంగంలో అనిశ్చితిని పెంచుతున్నాయి. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం ఏ ఉద్యోగికైనా ఒత్తిడితో కూడిన విషయమే. అయితే, తొలగింపునకు గురైనప్పుడు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు.. తమకు ఎటువంటి సమయం లేదా బేరసారాలు ఆడే అవకాశం లేదని భావించడం. కానీ, చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకుంటే మీకు కొన్ని అవకాశాలున్నాయని ఉపాధి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.40 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక రక్షణముఖ్యంగా 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులకు ‘ఓల్డ్ వర్కర్స్ బెనిఫిట్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఓడబ్ల్యూబీపీఏ)’ కింద ఫెడరల్ చట్టం(యూఎస్) ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం.. సెవెరెన్స్ అగ్రిమెంట్ పరిశీలించడానికి మీకు కనీసం 21 రోజులు (సామూహిక తొలగింపులైతే 45 రోజులు) గడువు ఇవ్వాలి. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా మనసు మార్చుకోవడానికి మీకు 7 రోజుల సమయం ఉంటుంది.కంపెనీలు హడావిడిగా సంతకం చేయమని ఒత్తిడి చేయడం సరికాదు. పైన పేర్కొన్న గడువును ఎవరూ తప్పించలేరు. బలవంతపు సంతకాలు చేయించుకోకూడదు.ప్యాకేజీని చర్చించడం ఎలా?చాలామంది ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన మొదటి ఆఫర్ను అంగీకరిస్తుంటారు. కానీ, ఆ గణాంకాలు వేరేలా చెబుతున్నాయి. నోలో/మార్టిన్ డేల్-నోలో డేటా ప్రకారం, బేరసారాలు జరిపిన ఉద్యోగులు సగటున 41,500 డాలర్లు వరకు అందుకుంటే, నేరుగా సంతకం చేసిన వారు సగటున 19,200 డాలర్లు పరిహారం మాత్రమే పొందగలిగారు.చర్చించాల్సిన అంశాలుసాధారణంగా సర్వీసులో ఉన్న సంవత్సరానికి ఒకటి లేదా రెండు వారాల వేతనం ప్రాతిపదికగా ఉంటుంది. దీన్ని పెంచే అవకాశం ఉంటుంది.కోబ్రా వంటి ఆరోగ్య బీమా కవరేజీని కంపెనీయే చెల్లించేలా బేరమాడవచ్చు.స్టాక్ ఆప్షన్లను వేగవంతం చేయమని చర్చించవచ్చు.రెజ్యూమ్ సపోర్ట్, జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, పాజిటివ్ రిఫరెన్స్ లెటర్లు అడగడం మర్చిపోవద్దు.సంతకానికి ముందు..చాలా ఒప్పందాల్లో వేధింపులు, వివక్ష లేదా తప్పుడు తొలగింపులకు వ్యతిరేకంగా మీరు పోరాడే హక్కులను వదులుకోవాలంటూ క్లాజ్లుంటాయి. ఈ క్లాజులపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీపై అకస్మాత్తుగా ఏదైనా ఒక కారణంచేత తొలగించామని ముద్ర వేస్తే అది మీ కెరీర్కు ఆటంకం కావచ్చు. మీ పనితీరు బాగున్నప్పటికీ ఇలా జరిగితే రికార్డులను సవరించమని కోరండి. కంపెనీ సిస్టమ్ల నుంచి యాక్సెస్ కోల్పోయేలోపే.. మీ పనితీరు సమీక్షలు, ఈమెయిల్స్, ఒప్పంద పత్రాలను డౌన్లోడ్ చేసుకోండి.న్యాయ సలహా అవసరమా?న్యాయవాదిని సంప్రదించడం ఖరీదైన వ్యవహారమని భావించకండి. చాలామంది న్యాయవాదులు నిర్ణీత ఫీజుతో సర్వీసులు అందిస్తారు. మీ కంపెనీతో ఉన్న ఒప్పందంలోని లొసుగులను గుర్తించి చర్చల ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందడంలో వారి సలహా ఎంతో కీలకం. కంపెనీలు పెట్టే గడువుల కంటే మీ హక్కులు గొప్పవి. తొలగింపునకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
బుమ్రా ఫెయిల్యూర్కు కారణమిదే: రవిశాస్త్రి
ఐపీఎల్-2026లో టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ కొనసాగుతోంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ బుమ్రా విఫలమయ్యాడు. తన శైలికి విరుద్దంగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. జస్ప్రీత్ తన నాలుగు ఓవర్ల కోటాలో 11.20 ఏకానమీ రేటుతో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీనియర్ పేసర్ కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో బుమ్రా మొత్తంగా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ప్రతీ సీజన్లో పర్పుల్ క్యాప్ రేసులో ఉండే బుమ్రా.. ఈసారి ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది.ఈ నేపథ్యలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరాయంగా మ్యాచ్లు ఆడటం వల్ల బుమ్రాపై వర్క్లోడ్ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక పనిభారం వల్లే బుమ్రా రాణించలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చారు."బుమ్రా గత 12 నెలలుగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ భారీ వర్క్లోడ్తో అతడు ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అతడు శారీరకంగా, మానసికంగా అలిసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడు పేలవ ప్రదర్శనకు ఇది ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల జాగ్రత్త వహించాలి. రాబోయే రెండు ఏళ్లలో భారత జట్టు బిజీ షెడ్యూల్తో గడపనుంది. పలు టెస్టు సిరీస్లు, అలాగే వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నమెంట్లు జరగనున్నాయి. బుమ్రా భారత జట్టకు చాలా కీలకం కాబట్టి, ముంబై మేనెజ్మెంట్ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని" ఛాంపియన్స్ వాలీ కామెంటరీ కార్యక్రమంలో రవిశాస్త్రి పేర్కొన్నారు.చదవండి: IPL 2026: 'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు' -
సౌతాఫ్రికా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సౌతాఫ్రికా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను నియంత్రిస్తుందని ఆరోపించాడు. భారత్ వాణిజ్య శక్తి కారణంగా అంతర్జాతీయ క్రికెట్పై భారీ ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డాడు.అంతర్జాతీయ క్రికెట్లో శక్తి సమతౌల్యం ఇంకా మారలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్లోని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆ విజయం తర్వాత కూడా మారని సమీకరణలుగతేడాది లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది. 1991-92లో క్రికెట్లోకి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఇది తొలి రెడ్బాల్ టైటిల్.అయితే ఈ విజయం తర్వాత కూడా ప్రపంచ క్రికెట్లో శక్తి సమతౌల్యత మారలేదన్నది సైమన్ అభిప్రాయం. ఐసీసీపై ఇంకా భారత్ పెత్తనమే కొనసాగుతుందన్నది అతని వాదన. బీసీసీఐ ధనబలంతో ఐసీసీని నియంత్రిస్తోందన్నది అతని వాదన. బవుమా, కాన్రాడ్పై ప్రశంసలుఇదే సందర్భంగా సైమన్ తన సొంత జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోచ్ షుక్రి కాన్రాడ్, కెప్టెన్ టెంబా బవుమాను ఆకాశానికెత్తాడు. వారి జట్టు ఒకరిద్దరి స్టార్ ప్లేయర్ల జట్టు కాదని.. కోచ్ ప్రతి విషయాన్ని నేరుగా మాట్లాడటం చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్ వ్యవస్థపై కూడా విమర్శలుసైమన్ ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టులో స్పిన్నర్లకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించాడు. కౌంటీ క్రికెట్ నిర్మాణం వల్ల వారు లీడర్షిప్ పాత్రలో ఎదగలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.మొత్తంగా సైమన్ తన వ్యాఖ్యల్లో బీసీసీఐ పెత్తనం చేస్తోందని, ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థలో లోపాలున్నాయని అన్నాడు. సైమన్ గతేడాది స్వదేశంలో టీమిండియాను ఓడించిన (టెస్ట్ సిరీస్) జట్టులో సభ్యుడు. -
'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్కు సత్యరాజ్ చురకలు
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. Congratulations #ThalapathyVijay & #TVK on your victory. You’ve cited Periyar & Ambedkar as your ideological leaders—hope you uphold their values and ensure social justice. Saddened by #MKStalin’s defeat, but I’ll continue supporting #DMK.– #Sathyaraj pic.twitter.com/c5Q7ikwpBo— Movies Singapore (@MoviesSingapore) May 5, 2026 -
ఎల్పీజీపై రూ.300 తగ్గించుకోండిలా!
అంతర్జాతీయంగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం సామాన్యుడి వంటగదిపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరడం హోటల్, రెస్టారెంట్ రంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, దేశీయ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొంతవరకు ఊరటనిస్తోంది.గరిష్టానికి కమర్షియల్ గ్యాస్ ధరలుమే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచింది. రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.993 పెరిగి రూ.3,071.50కు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక ధర. కేవలం మూడు నెలల కాలంలోనే ధరలు రూ.1,303 మేర పెరగడం వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గత మూడు నెలల గణాంకాలుమార్చి: రూ.114.50 పెంపుఏప్రిల్: రూ.195.50 పెంపుమే: రూ.993 పెంపుచిన్న సిలిండర్లు: 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.549 నుంచి రూ.810.50కి పెరగడంతో చిన్న వ్యాపారులకు కూడా భారం పెరిగింది.డిమెస్టిక్ వినియోగదారుల పరిస్థితి ఏమిటి?ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ (14.2 కేజీలు) ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, మార్చి నెలలో జరిగిన చివరి సవరణలో సిలిండర్పై రూ.60 పెంచిన విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా చమురు ధరల అస్థిరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.సబ్సిడీతో ఉపశమనం.. రూ.300 ఆదా ఇలా!ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఉజ్వల లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల సిలిండర్పై రూ.300 సబ్సిడీని పొందుతున్నారు. ఇది సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్లకు వర్తిస్తుంది. 5 కిలోల సిలిండర్ వాడే వారికి దామాషా పద్ధతిలో సబ్సిడీ అందుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, ఇన్స్టలేషన్ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఉజ్వల 2.0 కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మొదటి రీఫిల్, స్టవ్ను కూడా ఉచితంగా అందిస్తూ సామాన్యులు క్లీన్ ఫ్యూయెల్ ఎల్పీజీ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది.వాణిజ్య సిలిండర్ ధరల పెంపు ప్రభావం హోటల్ మెనూ ధరలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి సబ్సిడీల రూపంలో కొంత రక్షణ ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు గ్యాస్ ధరలను ఎలా శాసిస్తాయనేది వేచి చూడాలి. ఈ తరుణంలో ఉజ్వల పథకం వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సామాన్యులకు ఊపిరినిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్
వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.మే 1న యూరప్లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కాగా మిలింద్ సోమన్ ఫిట్నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్. సోమన్ తాజాగా తన ఫిట్నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.ఇక సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో తన నటనతో మొప్పించారు.At 60, most people slow down. Milind Soman chose to cross continents.On May 1, he swam 15 km across the Strait of Gibraltar, from Tarifa in Europe to the coast of Morocco in Africa.Calling the experience “beautiful,” he reminded the world that endurance isn’t about age, it’s… pic.twitter.com/Icx6mRgJFr— The Better India (@thebetterindia) May 5, 2026 -
విజయ్ VS ఉదయనిధి.. అసెంబ్లీ ఇలా దద్దరిల్లాల్సిందే..
తమిళనాడు రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఇప్పుడు ప్రధానంగా కనిపించబోయే పోరు టీవీకే నేత విజయ్, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్యనే సాగనుంది. ఒకరు కాబోయే సీఎం, మరొకరు కాబోయే ప్రతిపక్ష నేత. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన విజయ్ ఒకవైపు, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించబోయే ఉదయనిధి మరోవైపు ఉండటంతో సభ చర్చలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ఉదయనిధికి ఉన్న పాలనా అనుభవం ముందు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది కీలకం.అసెంబ్లీలో జరిగే వాగ్వివాదాలు ఈ ఇద్దరు నేతల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. పాలన, సంక్షేమం, చట్టం, వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ ఇద్దరు నేతలే. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఎంతవరకు విజయవంతం అవుతుంది? ప్రతిపక్షం ఎంత బలంగా నిలబడుతుంది? అన్నదే ముందున్న రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. ఆ వ్యవహారాలే భవిష్యత్తులో విజయ్ను మరోసారి సీఎంగా నిలబెడతాయి. ఇక, ఉదయనిధి స్టాలిన్ బలంగా పనిచేస్తేనే విజయ్ను సీఎం పీఠం నుంచి దించి, మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తోంది. మొత్తంగా చూస్తే, విజయ్-ఉదయనిధి మధ్య ఈ రాజకీయ పోరు తమిళనాడు రాజకీయాలకు కొత్త శక్తిని తీసుకురానుంది. సభలో ప్రతి చర్చ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉండటం ఖాయం.తమిళనాట ఓ ఆశగా విజయ్బాలనటుడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఎదిగారు టీవీకే విజయ్. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే శాసనసభా పక్ష నేతగా ఇప్పటికే విజయ్ ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు ఉండనున్నాయి. పాత పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ రెండు పార్టీలే తప్ప మరో పార్టీ లేదా? అనుకుంటున్న సమయంలో తమిళనాట ఓ ఆశగా వెలిగారు విజయ్. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని కొందరు అంటున్న సమయంలో పార్టీని పెట్టి.. పోటీ చేసిన తొలిసారే అధికారంలోకి తీసుకొచ్చారు. డీఎంకే ఆశ అంతా ఉదయనిధిపైనే..మరోవైపు, తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా తనను నియమించే నిర్ణయం పార్టీ నాయకత్వానిదేనని ఉదయనిధి స్టాలిన్ మంగళవారం తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన ఉదయనిధి స్టాలిన్.. ఈ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గంలో గెలిచారు. శాసనసభా పక్ష నేత విజయ్తో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలినే.ఇద్దరిదీ ఒకే వయసు.. ఇరువురూ సినీనటులేఉదయనిధి స్టాలిన్ వయసు 49 సంవత్సరాలు. విజయ్ వయసు 51. దాదాపు ఒకటే ఏజ్. తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు అంతా వీరిద్దరి కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. ఒకరు సీఎంగా, మరొకరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి వారు కూడా తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏలారు. కాగా, దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులుగా గుర్తింపు పొందిన విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పోరు అసెంబ్లీ వేదికగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. విజయ్, ఉదయనిధి ఇద్దరూ సినీనటులే. అయితే, విజయ్ సినిమాల్లో హిట్స్ అధికంగా ఉండడంతో ఆయనకు అభిమానులు విపరీతంగా ఉన్నారు. విజయ్ జననాయగన్ తర్వాత సినిమాలకు గుడ్బై చెబుతానన్నారు. ఉదయనిధి కూడా సినిమాలకు గుడ్బై చెప్పి, నటనకు విరామం తీసుకుంటున్నట్లు 2023లోనే తెలిపారు.ఒకరు కొత్త.. మరొకరిది వారసత్వ రాజకీయంవిజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఇంతగా రాణించడం ఓ అద్భుతం. ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది. డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. తాత, తండ్రి వారసత్వం నుంచే స్వతహాగా రాజకీయాలను నేర్చుకున్నారు. అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టొచ్చో ఆయనకు తెలుసు. అయితే, విజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ ప్రజలను ఆకర్షించే తత్వం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధానాలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తన పాలనలో విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులోని లోపాలు, లొసుగులను ఎత్తి చూపుతుంది. వీటన్నింటి ఆధారంగా విజయ్పై విమర్శలు చేసే పాత్ర పోషించాల్సింది ఉదయనిధి స్టాలినే. ఉదయనిధి స్టాలిన్కు ఇది కీలక దశ. అధికారంలో ఉన్న సమయంలో పొందిన అనుభవాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించడం ఆయన ప్రధాన బాధ్యతగా మారనుంది. డీఎంకే వారసుడిగా, కరుణానిధి మనవడిగా, ఉదయనిధికి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు, పార్టీకి సంబంధించిన అనుభవం ఆయనకున్న ప్రధాన బలాలు. -
థ్యాంక్యూ మోదీజీ: విజయ్
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ ట్వీట్కు టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal. Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026 -
మెట్ గాలాలో రూ. 142 కోట్ల నెక్లెస్తో మెరిసిన సుధా రెడ్డి..!
న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో మెట్గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్ బిలియనీర్, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన సుధారెడ్డి అద్భుతమైన లుక్లో అలరించారు. ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్ అందాన్ని మరింత హైలెట్ చేశాయి. ఈ నెక్లెస్ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్ మల్హోత్రా డిజైన్ చేసినా ఆమె డ్రెస్ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ. అన్నింటకంటే ఆ డిజైనర్వేర్లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన మెట్ గాలా లుక్ గురించి ఇలా షేర్ చేసుకున్నారు. "హైదరాబాద్ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు". కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రాంచైజీగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. ఆదివారం లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే కొనుగోలు మురిపెం తీరకుండానే రాజస్తాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. తెర ముందు డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. రాజస్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ బృందాలతో చర్చలు జరిపింది. ‘ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్తో మాట్లాడాము. ఇవాళే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము’ అని కల్ సోమని బృందం వెల్లడించింది. పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకునే అవకాశముంది.మిట్టల్ గ్రూప్ కంటే ముందు కల్ సోమని గ్రూప్తో కుదరాల్సిన డీల్ ఆగిపోవడం వెనుక సకాలంలో సోమని బృందం చెల్లింపులు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్, హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందన్నది చూడాలి.ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో చతికిలపడుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్లాడిన రాజస్తాన్ 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మూడింట గెలిస్తే రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంటుంది. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ మే 9న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. ఆ తర్వాత మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 19న లక్నోతో, మే 24న ముంబైతో ఆడాల్సి ఉంది.చదవండి: బాంబు పేల్చిన కేఎల్ రాహుల్! -
చండీగఢ్ ఎయిర్పోర్ట్లో పవర్బ్యాంక్ మంటలు!
చంఢీగడ్: ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు రావడంతో చంఢీగఢ్ విమానాశ్రాయంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడి పవర్బ్యాంక్ నుంచి మంటలు వచ్చి పొగ తీవ్రంగా వ్యాపించింది. దాంతో ప్రయాణికుల్ని అత్యవసర తరలింపు చేపట్టారు. విమానాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) హైదరాబాద్ నుంచి చండీగఢ్కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 108 ల్యాండింగ్ తర్వాత నిలిచి ఉన్నప్పుడు, ఒక ప్రయాణికుడికి చెందిన పవర్బ్యాంక్కు నిప్పంటుకున్న ఘటన చోటు చేసుకున్నట్లు, ఇండిగో ఎయిర్లైన్స్ ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. భద్రతా దృష్ట్యా, వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించామని,, సంబంధిత అధికారులందరికీ తక్షణమే సమాచారం అందించడం జరిగిందని ఆ ప్రకటనలో ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్కు తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడానికి మా బృందం వారిని పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. DRAMATIC IN-FLIGHT EVACUATION AFTER POWER BANK CATCHES FIRE IN AN INDIGO PLANE IN CHANDIGARH AIRPORT. pic.twitter.com/2DpL8HSS6G— Rahul Shivshankar (@RShivshankar) May 5, 2026 -
సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు,అధినేత సి. జోసెఫ్ విజయ్ 'జన నాయగన్' (Jana Nayagan)గా సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శాసనపక్ష నేతగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆస్తులు, ఆర్థిక వివరాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2026 మార్చి 30న భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 27 పేజీల అఫిడవిట్లో సమర్పించిన వివరాలు విశేషంగా నిలుస్తున్నాయి.దీని ప్రకారం విజయ్ ప్రకటించిన నికర విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ. 404 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 220 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు; ఈ ఆదాయం స్వయం ఉపాధి, అద్దె ఆదాయం , వడ్డీ ఆదాయం ద్వారా సమకూరింది.ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి నాలుగు బకాయి డిమాండ్లు పెండింగ్లో ఉండగా, వాటి మొత్తం విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంది. ఒకే సేవింగ్స్ ఖాతాలో రూ. 213 కోట్లు విజయ్ పేర్కొన్న అఫిడవిట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మార్చి 27, 2026 నాటికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సాలిగ్రామం శాఖలోని ఒకే ఒక పొదుపు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉండటం. ఇది ఏదో ఒక నిర్దిష్ట పెట్టుబడి పథకం గానీ, మార్కెట్తో అనుసంధానమైన ఉత్పత్తి గానీ కాదు; కేవలం ఒక సాధారణ పొదుపు ఖాతా మాత్రమే. ఆయన ప్రకటించిన మొత్తం నికర విలువలో మూడో వంతుకు పైగా వాటా ఈ ఖాతాదే కావడం విశేషం.స్థిర డిపాజిట్లు (Fixed Deposits): నాలుగు బ్యాంకుల్లో కలిపి రూ. 100 కోట్లుAxis Bank : ఇందిరా నగర్ శాఖ : రూ. 40 కోట్లుIndian Overseas Bank, కోడంబాక్కం శాఖ : రూ. 25 కోట్లుHDFC Bank, బసంత నగర్ శా ఖ: రూ. 20 కోట్లుState Bank of India, శాస్త్రి నగర్ శాఖ : రూ. 15 కోట్లుIOB పొదుపు ఖాతాలోని నిల్వను కూడా కలిపి చూస్తే, ఆయన ప్రకటించిన సంపదలో రూ. 313 కోట్లకు పైగా మొత్తం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. ఇవి ఎటువంటి మార్కెట్ రిస్క్ లేని, హామీతో కూడిన రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు.ఈక్విటీలో షేర్ల విలువ రూ. 19.37 లక్షలుస్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆర్కైవ్ చేసిన అఫిడవిట్ ప్రకారం, జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్లో రూ. 19.03 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రూ. 9,600 విలువైన షేర్లు, మరియు సన్ పేపర్ మిల్ లిమిటెడ్లో రూ. 25,000 విలువైన షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీటి మొత్తం ఈక్విటీ వాటా రూ. 19.37 లక్షలు, ఇది ఆయన ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ. ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా డిబెంచర్లను ప్రకటించలేదు.స్థిరాస్తులు: విజయ్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిరాస్తులు విలువ రూ. 220 కోట్లు. ఇవి నాలుగు వర్గాలలో విస్తరించి ఉన్నాయి. నీలన్కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్ , సమీప ప్రాంతాలలో ఉన్న నివాస ఆస్తులు, వీటి విలువ పది ఆస్తులలో సుమారుగా రూ. 115 కోట్లు.పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్ మరియు కొప్పూర్లలో ఉన్న వాణిజ్య ఆస్తులు, వీటి విలువ సుమారుగా రూ. 82.8 కోట్లు. అతిపెద్ద ఏకైక వాణిజ్య ఆస్తి కొప్పూర్ గ్రామంలోని 2.30 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2023లో నవంబర్ 2023లో రూ. 35.81 కోట్లకు కొనుగోలు చేశారు.పోరూర్, సాలిగ్రామం మరియు నీలన్కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ రూ. 22 కోట్లు. ఒక్క ఆయన పోరూర్ ప్లాట్ మాత్రమే 33,955 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.కొడైకనాల్లోని విల్పట్టి గ్రామంలో ఉన్న 0.25 ఎకరాల చొప్పున రెండు వ్యవసాయ ప్లాట్లను 1997లో ఒక్కొక్కటి రూ. 15,000కు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 10 లక్షలుగా ప్రకటించారు.ఇదీ చదవండి : విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?ఈ ఆస్తుల నుండి వచ్చే అద్దె ఆదాయాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రియాశీల ఆదాయ వనరుగా ప్రకటించారు. విజయ్ తన వ్యక్తిగత ఆస్తులకు అతీతంగా, అధికారిక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్! అదిరిపోయే వాహనాలు: విజయ్ గ్యారేజ్లో కొలువు దీరిని లగ్జరీ కార్ల విలువ రూ. 13.52 కోట్లకు పైమాటే.2024 Toyota Lexus 350: రూ. 3.01 కోట్లు2015 Tata Caravan: రూ. 6 కోట్లు2024 BMW i7: రూ. 2 కోట్లు2014 Toyota Vellfire: రూ. 1.63 కోట్లు2020 BMW 530: రూ. 80.54 లక్షలు2024 Maruti Swift: రూ. 5.35 లక్షలు2025 TVS XL Super: రూ. 67,400ఆభరణాలు: విజయ్ వ్యక్తిగతంగా 883 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 1.20 కోట్లు) మరియు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులను ప్రకటించారు. ఆయన సతీమణి సంగీత, విడిగా 3,132 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 4.07 కోట్లు), 2 కిలోల వెండిని (విలువ రూ. 4.75 లక్షలు), మరియు 134.91 క్యారెట్ల వజ్రాలను (విలువ రూ. 1 కోటి) ప్రకటించారు.ఇవి కాకుండా రుణాలు ,అడ్వాన్సుల రూపంలో : రూ. 75.5 కోట్లున్నాయని ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే!సంగీత ఆస్తులు రూ. 15.76 కోట్లువిజయ్ భార్య( విడాకుల కేసు పెండింగ్లో ఉంది) సంగీత విజయ్ తన మొత్తం ఆస్తులను రూ. 15.76 కోట్లుగా విడిగా ప్రకటించారు. ఇందులో రూ. 15.51 కోట్ల చరాస్తులు (HDFC బ్యాంక్, బసంత నగర్ శాఖలో ఉన్న రూ. 10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మరియు రూ. 43.41 లక్షల పొదుపు నిల్వతో కలిపి) , రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా -
మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడింది దానివల్లే..?
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఓడిపోవడానికి కారణం కేంద్రం నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియే అన్నారు. వారి నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం ద్వారే స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోయారన్నారు.ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ "మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ల నియోజకవర్గాల్లో వరుసగా ఎస్ఐఆర్ నిర్వహించగా, ఇద్దరూ ఓడిపోయారు. పౌరసత్వాన్ని ఎస్ఐఆర్తో ముడిపెట్టడం తప్పు అని నేను పార్లమెంటులో కూడా ఇదే చెప్పాను. పౌరసత్వానికి హోం మంత్రిత్వ శాఖకు నియమాలు ఉన్నాయి; ఎన్ఆర్సి, ఎన్పిఆర్ నియమాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఓటు వేయడం గురించే కాదు, మీ పౌరసత్వాన్ని కాపాడుకోవడం గురించి కూడా. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి." అని అన్నారు.SIR ద్వారా ఓక వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించడం. మరణించిన వారి వివరాలను ఓట్లర్ల జాబితా నుండి తీసివేయడం వలస వెళ్ళిన వారు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని గుర్తించి ఓట్ల తొలగింపు చేస్తారు. అదే విధంగా 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చుతారు. వివాదం ఏంటంటే? పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ) మరియు తమిళనాడు (ఎం.కె. స్టాలిన్) ముఖ్యమంత్రులు ఈ SIR ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్ఐఆర్ పేరుతో తమకు మద్దతు ఇచ్చే వర్గాల ఓట్లను (ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు) కావాలనే తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. బెంగాల్లో సుమారు 90 లక్షల మంది ఓటర్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించారని, ఇది ఫలితాలను తారుమారు చేసిందని మమతా బెనర్జీ అన్నారు.ఎంఐఎంకు ఘోర ఓటమికాగా ఎంఐఎం పార్టీ ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులను దింపగా ఘోర పరాజయం మూటగట్టుకుంది. 12 చోట్ల తమ అభ్యర్థులకు ఎక్కడా కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మాల్దా, ముర్షీదాబాద్, బీర్బుమ్, పశ్చిమ్ బర్ధమాన్, ఉత్తర 24 పరగణాలు, ఉత్తర దినాజ్పూర్ ఏడు జిల్లాలోని 12 నియోజక వర్గాల్లోని మోథాబరి, సుజాపూర్, సుతి, రఘునాథ్గంజ్, కండి, నలహతి, మురారయ్, అసన్సోల్ నార్త్, హబ్రా, బరాసత్, బసిర్హట్ సౌత్, కరిందిఘిలో తన అభ్యర్థులను పోటీకి దింపింది. -
పాలిచ్చే తల్లులూ.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో మార్పులుచోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనవీ, మానసికమైనవికూడా. అయితే... ప్రసవం తర్వాత అవన్నీ వెంటనే ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ప్రసవం తర్వాత ఓ మహిళమళ్లీ మామూలు స్థితికి రావాలంటే కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఇక కాన్పు తర్వాత చాలా మంది మహిళలు తమకు పుట్టిన బిడ్డ గురించి శ్రద్ధ తీసుకుంటారు తప్ప తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కాన్పు తర్వాత మహిళలు...తమ బిడ్డ విషయంలోనే కాకుండా తన కోసం కూడా కొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఆ టైమ్లో బాలింతకు వచ్చే కొన్ని సమస్యలూ... వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలను తెలుసుకుని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...గర్భం దాల్చినప్పుడు మామూలుగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తనలో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లమెల్లగా సైజు తగ్గుతూపోతూ ఆరువారాలకు తన మొదటి స్థితిని చేరుతుంది. కాన్పు తర్వాత వారం రోజుల వరకు బొడ్డు కింది భాగంలో గర్భాశయం గట్టిగా స్పర్శకు తెలుస్తుంటుంది. గర్భిణిగా ఉన్న సమయంలో లోపల గర్భాశయంతో పాటు బయట పొట్ట కండరాలూ బాగా సాగుతాయి. ఫలితంగా కాన్పు తర్వాత కూడా పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా కనిపిస్తుండవచ్చు. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడం వల్ల కొందరిలో చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి లేదా నల్లటి చారికలు (స్ట్రెచ్మార్క్స్) ఏర్పడవచ్చు. ఇవన్నీ కాస్మటిక్గా మహిళలకు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. ఈ స్ట్రెచ్మార్క్స్ నివారణ కోసం: పొట్ట మీద, తొడల మీద ఉండే చర్మం సాగి, చిట్లడం వల్ల వచ్చే స్ట్రెచ్మార్క్స్ పూర్తిగా పోవడానికి గాని, అస్సలే రాకుండా ఉండటానికి ఎలాంటి మందులూ, క్రీములు ఉండవు. ఆలివ్ ఆయిల్, విటమిన్–ఈ, కొన్ని మాయిశ్చరైజర్స్ వంటి వాటిని గర్భవతిగా ఉన్నప్పటినుంచే పొట్ట, తొడల మీద రాసుకోవడం వల్ల చర్మం మెత్తబడి సాగడానికి వీలుగా ఉంటుంది. దురదలు రావు. కాబట్టి దీనివల్ల స్ట్రెచ్మార్క్స్ నివారణ కొంతవరకు సాధ్యమవుతుంది. ప్రసవం అయిన తర్వాత మహిళ (బాలింత)లో కొన్ని రకాల సమస్యలు / ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు. అవి... బాలింత జ్వరం : కాన్పు తర్వాత కొందరు మహిళల్లో ఒళ్లు కొంచెం వేడిగా ఉంటూ, తర్వాత మామూలుగా అవుతుంటుంది. కొంతమందిలో మాత్రం కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. పరిష్కారం : కోల్డ్ స్పాంజింగ్తోనే చాలావరకు జ్వరం తగ్గిపోతుంది. అయితే ఏదైనా నిర్దిష్ట కారణం వల్ల జ్వరం వచ్చినట్లు డాక్టర్లు గుర్తిస్తే... ఆ కారణాన్ని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.బాలింత జ్వరాలకు కొన్ని కారణాలు... జననాంగాల్లో ఇన్ఫెక్షన్ : రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవడం, రోగకారకక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాలింత జ్వరం రావచ్చు. పరిష్కారం : డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలి. రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్ : కొత్తగా తల్లి అయిన మహిళ తన బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, నిపుల్స్ సరిగా లేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడంతో పాలు లోపలే గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి దేహంలోకి రోగక్రిములు చేరవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ముల్లోకి పాకి అది తల్లిలో ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు. పరిష్కారం: డాక్టర్ సలహా మేరకు తగిన మందులు తీసుకుంటూ, వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించాలి.జ్వరాలకు మరికొన్ని కారణాలు : సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వేసే కుట్లలో చీము పట్టడం మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ముప్పు ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా దేహమంతటా పాకి కొంత ప్రమాదాలకు తావిచ్చే అవకాశం. పరిష్కారం : కారణాలను బట్టి తగిన మందులు ఇవ్వడం, ఆ మేరకు బాలింత తగిన జాగ్రత్తలు పాటించేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. నొప్పులు : కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల దగ్గర నొప్పులు రావచ్చు. కొందరిలో అవి మరీ ఎక్కువగానూ ఉండవచ్చు. గర్భాశయం బరువు మొత్తం వెన్నుపూసపై పడటం వల్లా, అలాగే కండరాలు సాగి మునపటి బలం కొద్దిగా తగ్గడం వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టంకావడంతో ఫోర్సెప్ సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్పుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కొంతమందిలో కాన్పు తర్వాత కాళ్లు కదల్చలేకపోవడం, స్పర్శ తగ్గడం వంటివీ కనిపించవచ్చు. పరిష్కారం : వీటిని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలావరకు డాక్టర్ల సలహాలూ, మందులతోనూ లేదా ఇవన్నీ కొద్దిపాటి ఫిజియోథెరపీతో తగ్గిపోయే సమస్యలే. మూత్రసమస్యలు : కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి సమస్య కనిపించవచ్చు.అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత ఉండే నొప్పి వల్ల కూడా మూత్ర విసర్జన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచి మూత్రవ్యవస్థకూ ఇన్ఫెక్షన్ పాకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే ముప్పు కూడా ఉంది. పరిష్కారం : ఈ సమస్యలు తగ్గడానికి పెల్విక్ఫ్లోర్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మలబద్దకం : కాన్పు తర్వాత మహిళలకు పెద్దగా నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడవచ్చు. పరిష్కారం : తగినన్ని నీళ్లు తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలూ, కాయగూరలతో ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు చాలా కొద్దికాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం : గర్భవతిలో కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని ఆపడం కోసం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలు (ఫ్యాక్టర్లు) ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో బాధపడేవారు, ఎక్కువ వయసున్న వారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తరాళాల ద్వారా వేరే చోట్లకు పాకి సాధారణ రక్తప్రసరణకు అడ్డుగా మారే (ఎంబాలిజమ్) ముప్పు ఉంటుంది. ఉదాహరణకు... కొందరిలో ఇలాంటి రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తే... అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశమూ లేకపోలేదు. ఈ కండిషన్ను ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అంటారు. పరిష్కారం : కాన్పు తర్వాత ఎక్కువగా కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్ సలహా మేరకు చురుగ్గా ఉండటం అవసరం. తీవ్రమైన రక్తస్రావం : కాన్పు తర్వాత కొంతసేపు సాధారణంగా 200 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఆ కండిషన్ను పోస్ట్పార్టమ్ హేమరేజ్ (పీపీహెచ్) అంటారు. పీపీహెచ్ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మందిలో ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదముంటుంది. దాదాపు 90 శాతం పీపీహెచ్ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడం (యుటరైన్ ఎటోనీ) వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) చీరుకుపోవడం వల్ల, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం, రక్తం గూడుకట్టుకునే స్వభావంలో లోపాలు కూడా పీపీహెచ్కు కారణం కావచ్చు.పరిష్కారం : ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు... అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సిన రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే కొందరిలో గర్భసంచి తొలగించాల్సిరావచ్చు. రక్తహీనత : అధిక రక్తస్రావం కావడం లేదా ముందు నుంచే రక్తహీనత ఉన్నవారిలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేక΄ోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనంగా ఉండటం వంటివి కనిపించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ సోకడం, అవి ఒకపట్టాన తగ్గకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.పరిష్కారం : తల్లికి పాలకూర వంటి ఆకుకూరలూ, నువ్వుల వంటి వాటితో చేసిన రుచికరమైన పదార్థాలు... అంటే ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు పెడుతుండాలి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్, టాబ్లెట్లు వంటివి వాడాల్సిరావచ్చు. ఫిట్స్ (హైబీపీ వల్ల) : కాన్పుకి ముందు కొంతమందిలో బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిష్కారం : నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. మానసిక సమస్యలు : కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3–5 రోజుల తర్వాత డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కండిషన్నే పోస్ట్పార్టమ్ బ్లూస్ లేదా బేబీ బ్లూస్ అంటారు. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల తాలూకు ఆందోళనా, భయం, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులతో కనిపించే మానసిక సమస్యలూ, కుటుంబంలో ఉండే సమస్యలూ, కలహాల వంటి ఎన్నో కారణాల ఈ డిప్రెషన్ రావచ్చు. కుటుంబసభ్యుల సహకారం వల్ల కొందరిలో ఇది 2–3 రోజుల్లోనే చక్కబడుతుంది. కానీ... మరికొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుంది. పరిష్కారం : ఈ సమస్యకు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అవసరం. బాలింత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుకాన్పు తర్వాత అటు తల్లి విషయంలోనూ, ఇటు బిడ్డ విషయంలోనూ తగిన జాగ్రతలు పాటించి, ఎలాంటి సమస్యలూ రాకుండా చూసుకోవాలి. కాన్పు జరిగిన 24 నుంచి 48 గంటల వరకు బాలింత ఆరోగ్యంతో పాటు ఆమెలో జ్వరం, బీపీ, రక్తస్రావం వంటివి ఏవైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.ఆహారం : కాన్పు తర్వాత బాలింతకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. మామూలుగా కంటే రోజుకు 600 కేలరీలు అధికంగా శక్తినిచ్చే ఆహారంతోపాటు బాగా పాలుపడేలా ఉండే ఆహారం తల్లికి ఇవ్వాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం ఇవ్వాలి. పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది అపోహ మాత్రమే. రోజుకు కనీసం 10 గ్లాసులు (రెండు లీటర్ల) నీళ్లు తప్పనిసరిగా తాగించాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. నీరు తాగడం వల్ల పొట్టపెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట త్వరగా తగ్గుతుంది. కుట్లు త్వరగా/తేలిగ్గా మానుతాయి. పాలు బాగా పడతాయి. (బిడ్డ... తన తల్లిపాల నుంచి ఐరన్, క్యాల్షియమ్ గ్రహిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెలలు తల్లి తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియమ్ మాత్రలు వాడాలి. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహ మాత్రమే.విశ్రాంతి : కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక విశ్రాంతి ఇవ్వడం వల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను ఉయ్యాలలో కాకుండా తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. పాలు బాగా పడతాయి.అటు ఇటు తిరగడం : సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించడం మంచిది. ఆపరేషన్ చేసిన వాళ్ల విషయంలో... ఆమె బెడ్ మీదే ఉన్నప్పటికీ 4–6 గంటల తర్వాత నుంచి మంచంలోనే కాళ్లు అటూ–ఇటూ కదపడం, ముడుచుకోవడం–స్ట్రెచ్ చేయడం వంటివి చేయవచ్చు. ఆరోగ్యపరిస్థితిని బట్టి 12–24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పునూ... ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే (ఎంబాలిజమ్) రిస్క్ను నివారించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత : కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల,మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధారణ కాన్పు తర్వాత కుట్లు వేయాల్సివస్తే వాటిపై యాంటీసెప్టిక్ పౌడర్ వేసుకోవచ్చు. బట్టలు కాకుండా డయాపర్లు వాడుకోవడం మంచిది. తడిసినవాటిని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. యోనిస్రావాల పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.రొమ్ములపై శ్రద్ధ : తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొమ్ము మొనలను సాగదీస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత బిడ్డ పాలు తాగడానికి అనువుగా మారతాయి. బిడ్డ పుట్టగానే గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే పాలు మరింత త్వరగా ఊరతాయి. బిడ్డకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్) ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో బిడ్డకు వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్ ఉంటాయి. బిడ్డకు మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే పట్టాలి. అవి మినహా మరేవీ ఇవ్వడం సరికాదు.వ్యాయామాలు : కొన్ని వ్యాయామాలతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవి నడుము నొప్పిని నివారిస్తాయి. ప్రారంభంలో కాళ్లు కదపడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. డాక్టర్ సలహా మేరకు ఆరు వారాల తర్వాత క్రమేపీ పొత్తికడుపు కండరాలు, పెల్విక్ఫ్లోర్ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయవచ్చు. వీటివల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్ బెల్ట్ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు తర్వాత అలసట తగ్గాక మెల్లగా వాకింగ్వంటి తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు.కుటుంబ నియంత్రణ : ప్రసవం తర్వాత వెంటనే గర్భం అందకుండా డాక్టర్ సలహా మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మంచిది. కాన్పు తర్వాత 2–3 నెలల నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ (పీరియడ్స్ రాకుండానే కూడా). అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే, అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయిన శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉన్న సమయాన్ని బిడ్డకి కేటాయించడం వల్ల బిడ్డలోనూ మంచి ఎదుగుదల, వికాసం కనిపిస్తాయి. ఇక పిల్లలు వద్దు అనుకున్న వారు శాశ్వత సంతాన నియంత్రణ పద్ధతుల కోసం డాక్టర్ను సంప్రదించవచ్చు. దాంపత్య జీవితం : బాలింతలో జరిగే మార్పులు యథాతథ స్థితికి వచ్చేందుకు, జననాంగాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా ఉంటే, ప్రసవం అయ్యా ఆరు వారాల తర్వాతి నుంచి దాంపత్య జీవితం గడపవచ్చు. ఒకవేళ సిజేరియన్ అయిన వారు కుట్లలో ఎలాంటి నొప్పులు లేకపోతే 8–10 వారాల తర్వాత దాంపత్యంలో పాల్గొనవచ్చు.కుటుంబ సభ్యుల పాత్ర : కాన్పు తర్వాత బాలింతకు ఇంట్లో వాళ్ల చేయూత, మద్దతు ఎంతో అవసరం. ముఖ్యంగా భర్త పోషించాల్సిన భూమిక చాలా ప్రధానం.డాక్టర్ చెకప్ : కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారం తర్వాత ఒకసారి, ఆరు వారాల తర్వాత మరోసారి డాక్టర్ను సంప్రదించాలి. లేదా డాక్టర్ సూచించిన విధంగా చెక్అప్కు వెళ్లాలి. తనకు వచ్చే సందేహాలన్నింటినీ మొహమాటపడకుండా డాక్టర్ను అడిగి తీర్చుకోవాలి. కాన్పుకు ముందు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని డాక్టర్కు వివరించి, వాటి విషయంలో కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అవసరం.డాక్టర్ సరోజ బానోతు,కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ (చదవండి: మామిడి పండ్లను తినేముందు ఇలా చేయడం తప్పనిసరి..! హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు) -
పూరన్ సిక్సర్ల వర్షం.. దెబ్బకు వైభవ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎట్టకేలకు తన బ్యాట్ను ఝూళిపించాడు. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పూరన్.. తన తుఫాన్ బ్యాటింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న 8 సిక్సర్లు, ఒక ఫోర్తో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. పూరన్ ఇప్పటివరకు 5 సార్లు 20 కంటే తక్కువ బాల్స్లోనే ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు వైభవ్ సూర్యవంశీ(4) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో వైభవ్ను పూరన్ అధిగమించాడు. ఈ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ(6) అగ్రస్ధానంలో ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే..లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు.చదవండి: 'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్' -
45 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చా? చాట్ జీపీటీ రెస్పాన్స్
వేగవంతమైన జీవనశైలిలో 60 ఏళ్ల వరకు పనిచేయడం అనేది ఒకప్పుడు సాధారణం. కానీ, ఇప్పటి యువతరం 40 ఏళ్లకే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటోంది. 30 ఏళ్ల యువకుడు నెలకు రూ.1.5 లక్షల ఆదాయంతో ముంబై వంటి నగరంలో ఉంటూ 45 ఏళ్లకే పదవీ విరమణ ఎలా చేయాలి? ఈ ప్రశ్నపై ఏఐ దిగ్గజం చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక లెక్కల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలియే ముందస్తు పదవీ విరమణకు కీలమని ఏఐ స్పష్టం చేస్తోంది.పెట్టుబడి కంటే పొదుపే ముఖ్యం!త్వరగా రిటైర్ అవ్వాలంటే చాలామంది ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది? ఏ స్టాక్లో లాభాలు వస్తాయి? అని వెతుకుతుంటారు. కానీ, చాట్ జీపీటీ ఇచ్చిన సలహా ఆశ్చర్యకరంగా ఉంది. దీని ప్రకారం, ముందస్తు పదవీ విరమణకు పెట్టుబడి రాబడి ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామనేదే కీలకం.ఏఐ సూచించిన ప్రాథమిక సూత్రం60:40 నిష్పత్తి: ఉదాహరణకు నెలకు వచ్చే మీ రూ.1.5 లక్షల ఆదాయంలో రూ.60,000 మాత్రమే ఖర్చు చేయాలి. మిగిలిన రూ.90,000ను కచ్చితంగా పెట్టుబడిగా మార్చాలి.ముంబైలో జీవనశైలి పెరిగే ప్రమాదం ఉంది. ఎంత జీతం పెరిగినా ఆ అదనపు మొత్తాన్ని కూడా పెట్టుబడికే మళ్లించాలని ఏఐ సూచిస్తోంది.కేవలం డబ్బు దాచడమే కాకుండా దానిని సరైన మార్గాల్లో మళ్లించడం ద్వారా 15 ఏళ్లలో మెరుగైన కార్పస్ను నిర్మించవచ్చని ఏఐ విశ్లేషించింది.విభాగంనెలవారీ కేటాయింపుసూచనఈక్విటీ/ఇండెక్స్ ఫండ్స్రూ. 75,000దీర్ఘకాలిక కాంపౌండింగ్ కోసం డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవాలి.డెట్/ఎమర్జెన్సీ ఫండ్రూ. 15,000లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆర్థిక భద్రత.నిర్వహణ వ్యయంరూ. 60,000అద్దె, ఆహారం, బీమా, ఇతర ఖర్చులు. సెబీ నిబంధనల ప్రకారం, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్స్ ఖర్చు తక్కువ. కాబట్టి లాభాలు ఎక్కువగా ఉంటాయని ఏఐ గుర్తుచేస్తోంది.వ్యూహాత్మక మార్పుముంబైలో పెరుగుతున్న జీవన వ్యయం మీ పొదుపు లక్ష్యానికి అతిపెద్ద అడ్డంకి. కాబట్టి 45 ఏళ్ల వయసులో పదవీ విరమణ తర్వాత ముంబై నుంచి ప్రశ్న అడిగిన వ్యక్తి స్వస్థలమైన లఖ్నవూకు మారిపోవాలనే ఆలోచన చాలా తెలివైనదని ఏఐ అభినందించింది. లఖ్నవూలో నివసించడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది మీ కార్పస్ మరింత కాలం మన్నేలా చేస్తుంది.చాట్ జీపీటీ మాటల్లో చెప్పాలంటే, 10 నుంచి 15 ఏళ్ల పాటు డబ్బు విషయంలో కాస్త విసుగుగా అనిపించినా సరే, క్రమశిక్షణ తప్పకూడదు. ఏఐ చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే మీ 45వ ఏట ఆర్థిక స్వేచ్ఛను పొందడం అసాధ్యమేమీ కాదు. అయితే, పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని, ఏదైనా పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం ఉత్తమమని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
బీసీసీఐపై కేఎల్ రాహుల్ ఆగ్రహం!
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్కు చెందిన సూపర్స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ‘పదేళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నన్ను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు. కేవలం ఒక టెస్టు ప్లేయర్గానే నాపై ముద్రను వేశారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడి వైట్బాల్ క్రికెట్లో నా ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది.అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఫలితంతో సంబంధం లేకుండా నా ఆటను నేను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఆటగాడిగా నాకు ఇంకా సమయం మిగిలి ఉంది. కాబట్టి నేను నా వంతుగా జట్టుకు తరఫున మ్యాచ్లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గతేడాది నేను తండ్రి కావడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్కు కూడా ఎంతో సహాయపడింది. నా కూతురు నవ్వినప్పుడు అప్పటివరకు నేను బాధపడిన క్షణాలన్నీ మాయమౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. సూపర్ఫామ్లో ఉన్న రాహుల్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్ల్లో 433 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటినుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్! -
భారీ వర్షం.. ఢిల్లీ-సీఎస్కే మ్యాచ్పై అనిశ్చితి
ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 5) కీలక సమరం జరగాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే పరిస్థితి ఉంది. మ్యాచ్కు కొన్ని గంటలకు ముందు (సాయంత్రం 4 గంటల ప్రాంతంలో) ఢిల్లీలో భారీ వడగండ్ల వాన కురిసింది.మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్సింది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉండటంతో వాష్ ఔట్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా. It's delhi at 3.15 pm not Manali #weather pic.twitter.com/kB9JwzVkeJ— vipul kashyap (@kashyapvipul) May 5, 2026ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే ప్లే ఆఫ్స్ బెర్త్పై భారీ ఆశలు పెట్టుకున్న ఇరు జట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సీఎస్కే, ఢిల్లీ తలో 9 మ్యాచ్ల్లో నాలుగేసి విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పోలిస్తే సీఎస్కే రన్రేట్ మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించబడుతుంది. అప్పుడు ఇరు జట్లకు అది సంకటంగా మారే ప్రమాదం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు రంజుగా సాగుతుంది. 13 పాయింట్లతో పంజాబ్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్ తలో 12 పాయింట్లతో వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నాయి. సీఎస్కే, ఢిల్లీ తలో 8 పాయింట్లతో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్ సైతం తాజాగా ఓ విజయం సాధించి అధికారికంగా రేసులో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా వదులుకున్న జట్టు ఏదైనా ఉందా అంటే, అది లక్నో మాత్రమే. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. అధికారికంగా రేసులో ఉన్నప్పటికీ.. అది జరిగే పని కాదు. -
విజయ్ గెలుపు వెనక.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ముద్ర..!
ప్రస్తుతం ఎక్కడా చూసిన విజయ్ పేరే వినిపిస్తోంది. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఈ అసాధారణ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం దళపతికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, నాని లాంటి స్టార్స్ కూడా విజయ్పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు వెనక ఎవరెవరు కృషి చేశారా అన్న విషయాలంపై చర్చ నడుస్తోంది.ఈ విజయంలో ముఖ్యంగా విజయ్కు ఉన్న క్రేజ్ ఒక కారణం అయినప్పటికీ.. మరెన్నో సానుకూల అంశాలున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంగ్స్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో పాటలు కూడా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పొలిటికల్ సాంగ్స్కు మ్యూజిక్ కంపోజ్ చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.అయితే విజయ్ అరంగేట్ర ప్రచారంలో వచ్చిన సాంగ్స్ అభిమానులను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్కు టాలీవుడ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. టాలీవుడ్లో బీజీఎం కింగ్ పేరున్న తమన్యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మూడు ప్రచార పాటలను కంపోజ్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. విజయ్ కోసం తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. దీంతో విజయ్ విజయం వెనక తమన్ మ్యూజిక్ పాత్ర కూడా ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బోర్ కొట్టేస్తున్న తెలుగు సినిమాలు.. ఎందుకిలా!?
తెలుగు దర్శకుల్లో చాలామంది తాము తీసేదే అద్భుతమైన కళాఖండం అనుకుని భ్రమపడుతున్నారు. బాగోలేదని ఒప్పుకోవడానికి కూడా వాళ్లకు మనసు రావట్లేదు. రొటీన్ ఫక్తు కమర్షియల్ అంశాలతో బోర్ కొట్టిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సంగతి అటుంచి ఏ జానర్ ట్రెండ్ అవుతుంటే దాని వెంట పడుతున్నారు. అయినా గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంతకీ డైరెక్టర్స్ అప్డేట్ అవ్వట్లేదా? లేదంటే ప్రేక్షకులు అడ్వాన్స్ అయ్యారా? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)టాలీవుడ్ అనగానే చాలామందికి కమర్షియల్ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ తరహా చిత్రాలే దాదాపుగా వచ్చేవి. అప్పట్లో మొబైల్, టెక్నాలజీ లాంటివి పెద్దగా లేకపోవడంతో సినిమా ఒక్కటే వినోద సాధనంగా ఉండేది. దీంతో లాజిక్స్ పట్టించుకోకుండానే మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఎక్కువపోయాయి. మొబైల్, టీవీ, క్రికెట్ ఇలా కళ్లముందు చాలానే కనిపిస్తున్నాయి. వీటన్నింటిని దాటుకుని సినిమా చూడాలంటే అందులో కచ్చితంగా సమ్థింగ్ స్పెషల్ ఉండాలి. ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో అదే మిస్ అవుతోంది.ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో కొన్ని అంశాలైనా ప్రేక్షకులు తమని తాము రిలేట్ చేసుకునేలా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి వాటిని డైరెక్టర్స్ మిస్ చేస్తున్నారు. కథల్లో సహజత్వం పెద్దగా కనిపించట్లేదు. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. కొత్తగా కామెడీ, డ్రామా సృష్టించడం లాంటివి చేయకుండా వింటేజ్ పేరు చెప్పి పాత సినిమాల్లో పాటలు, కామెడీని, డ్రామాని వాడేయాలని చూస్తున్నారు. అవి ఎందుకో సరిగా కుదరట్లేదు.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఈ ఏడాదే తీసుకుంటే సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్' సినిమా తప్పితే ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. బైకర్, డెకాయిట్ లాంటివి కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి గానీ వీటిలో కథ ఉన్నప్పటికీ అనవసరమైన కమర్షియల్ అంశాలు చేర్చి సూపర్హిట్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇకపోతే 'నారీ నారీ నడుమ మురారి', 'యుఫోరియా', 'శ్రీ చిదంబరం గారు', 'కపుల్ ఫ్రెండ్లీ' లాంటి కొన్ని మూవీస్ మంచి కంటెంట్తో వచ్చాయి గానీ వీటికి థియేటర్లలో సరైన సపోర్ట్ దొరకలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాదరణ పొందాయి.మొత్తంగా చూస్తే చాలామంది దర్శకులు.. తెలుగు ప్రేక్షకుల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏం తీసినా చూస్తారులే అనుకుంటున్నారు. మరికొందరైతే ప్రమోషన్లలో నవ్విస్తున్నారు గానీ సినిమాలో తీసికట్టు కంటెంట్తో విసుగు తెప్పిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మలయాళ, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే, అవి కూడా బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తాడు. రొటీన్ కంటెంట్తో ఇంకా బోర్ కొట్టిస్తే వాటికి కూడా వెళ్లాలా వద్దా అని సందేహపడతాడు! అప్పుడు టాలీవుడ్కే కష్టకాలం!(ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
ఐదు పదుల వయసులో నీట్ పరీక్ష..! ఐతే..
జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నీట్NEET)కు హాజరైన అభ్యర్థులలో ఒక అభ్యర్థి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఐదుపదుల వయసులో ఈ పరీక్షకు పోటీపడటమే. లక్నోలోని చందర్నగర్ నివాసి అయిన అశోక్ బహార్ మాంటిస్సోరి పాఠశాలలో గత ఆదివారం ఈ పరీక్షక రాశారు. నీట్ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దిగ్విజయంగా నిర్వహించన సంగతి తెలిసిందే. ఇక బహార్ గతంలో ఒక ఎరువుల తయారీ సంస్థలో మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన వైద్య రంగంపై ఉన్న మక్కువతో ఎంతో కాలంగా ఈ పరీక్ష రాయలని అనుకున్నారట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందంగా చెబుతున్నారు. ఆయన 2000వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్(స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)) తీసుకున్నప్పటి నుంచి నీట్ పరీక్ష రాయాలనే ఆలోచన ఉందట. తాను సమాజానికి అర్థవంతమైన రీతీలో సేవ చేయాలంటే ఇదే సరైన రంగం అని అనిపించదట. అందుకు తనకు సరైన గుర్తింపు, అర్హత ఉండాలని భావించే నీట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఇందుకు ఒకరకంగా తన కుటుంబ ప్రభావం కూడా ఒక కారణమని చెప్పడం విశేషం. బహార్ భార్య డాక్టర్ మంజుల్ బహార్ ప్రస్తుతం అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఈ వృత్తితో దశాబ్దాల పాటు అనుబంధం ఉండటం వల్ల ఔషధాల గురించి కొంత అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. కానీ వైద్యవృత్తిని చేపట్టేలా అధికారికంగా అర్హతలు లేవని చెప్పారు. నిజానికి నీట్ ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. దీనికి ఎక్కువగా 17 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారే హాజరవుతారు. కానీ దాన్ని సవాలు చేసే 57 ఏళ్ల వ్యక్తి ఈ పరీక్ష రాయడం విశేషం. ఆయన ఇతర అభ్యర్థులు మాదిరిగానే ఈ పరీక్ష రాశారు. చాలాకాలం తర్వాత చదవడం వల్ల.. కాస్త కష్టమైందని, అయితే ఏకాగ్రతతో దాన్ని సాధించగలిగానని అన్నారు. గతకొంతకాలంగా కొందరు పెద్దలు లేటు వయసులో తిరిగి ఉన్నత చదువుపై అడుగుల వేస్తున్న కేసులు పెరుగుతుండటం విశేషం. ఇక బహార్ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, కష్టపడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు..ఏ దశలోనైనా ముందుకు సాగొచ్చని అన్నారు. ఏదీఏమైనా కఠినతరమైన ఆ నీట్ పరీక్షను రెస్ట్ తీసుకునే వయసులో పోటీపడటం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం. కాగా, అతనికి వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుందో లేదా అనేది నీట్ ఫలితాలే నిర్ణయిస్తాయి. మరి ఆ తాతగారికి ఆల్ ది బెస్ట్ చెబుదామా..!. -
ఈరోజు స్టాక్ మార్కెట్లో కుదుపులు ఎందుకంటే..
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచగా, దేశీయ సూచీలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో నిఫ్టీ ఒకానొక దశలో 23,882 పాయింట్లకు పడిపోయి, ఆ తర్వాత కోలుకుని 24,032 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ కూడా 76,515 పాయింట్ల డే కనిష్టాన్ని తాకి చివరకు 77,017 పాయింట్ల వద్ద స్థిరపడింది.మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు(అంచనా)పశ్చిమాసియా యుద్ధంపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న వివాదం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ప్రతిష్టంభన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లో భయాన్ని పెంచాయి.క్రూడాయిల్ ధరల సెగచమురు సరఫరాలో అంతరాయాల భయం క్రూడాయిల్ ధరలను రికార్డు స్థాయిలకు చేర్చింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల భయంఅంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదని, పైగా అవి మరింత పెరగవచ్చనే ఆందోళనలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తోంది.లాభాల స్వీకరణ, అప్రమత్తతగత కొద్ది రోజులుగా మార్కెట్ స్వల్పంగా కోలుకోవడంతో లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు అప్రమత్తమై లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా కీలకమైన ప్రతిఘటన స్థాయిల వద్ద (రెసిస్టెన్స్ లెవల్స్) ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని పెంచడం వల్ల సూచీలు ఒక దశలో బలహీనపడ్డాయి.నెక్ట్స్ ఏంటి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ కాన్సాలిడేషన్లో ఉందని తెలుస్తుంది. నిఫ్టీ 23,800-24,300 శ్రేణిలో కదలాడుతోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, క్రూడాయిల్ ధరలు స్థిరీకరణ చెందితే తప్ప మార్కెట్ పురోగతిని సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భౌగోళిక పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని మార్కెట్ నిపుణుల సూచన.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు.. మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్ షమీమ్ అక్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది. -
మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్!
ప్రముఖ వ్యాపారవేత్త వారసురాలు, గాయని, స్వయంగా వ్యాపారవేత్త అనన్య బిర్లా తన తొలి మెట్ గాలా 2026 ఈవెంట్ అరంగేట్రంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్తో అదర గొట్టేశారు. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, సరికొత్త అర్థాన్నివ్వడం విశేషంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు మరింత వైరల్గా మారాయి. రెడ్ కార్పెట్ అనగానే సాధారణంగా సిల్క్ , వెల్వెట్ గౌన్లతో నిండి ఉంటాయి. కానీ అనన్య బిర్లా మెట్ గాలా 2026లో ఈ ట్రెండ్ను మార్చేశారు. ఏకంగా స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన గౌను ధరించి అందరినీ షాక్కు గురిచేశారు. అందుకే ఆ డ్రెస్ హాట్ టాపిక్గా నిలిచింది. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన భావప్రకటనా రూపమని ఆమె లుక్ నిరూపించింది.స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్ ప్రత్యేకతఅనన్య ధరించిన ‘ధరించగలిగే శిల్పం’ (Wearable Sculpture) ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. దీనికి స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించి 'క్రోమ్ ఫినిషింగ్' తో తయారు చేశారు. దీంతో ఆమె ఒక ఆధునిక దేవతలా లేదా శక్తివంతమైన యోధురాలిలా మెరిసిపోయారు.ఈ డ్రెస్ భుజాల భాగం ఎంతో ధీమాగా, ఆర్కిటెక్చరల్ శైలిలో రూపొందించబడింది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని బలాన్ని ప్రదర్శిస్తోంది.ఈ మెటల్ డ్రెస్ ఒక 'కవచం' (Armor) లాగా కనిపిస్తూ.. ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నుండి ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తుంది. View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)ఈ డ్రెస్ డిజైనర్లుబాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ రియా కపూర్ (Rhea Kapoor) దార్శనికతతోనే ఈ అవుట్ఫిట్ ఇంత పవర్ఫుల్గా తయారైందట. అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రాబర్ట్ వున్ (Robert Wun), నిత్యావసర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించే భారతీయ సమకాలీన కళాకారుడు సుబోధ్ గుప్తా (Subodh Gupta) సమన్వయంతో దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)అనన్య బిర్లా గురించి క్లుప్తంగాఅనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. అనన్య ఆర్సిబి ఫ్రాంచైజీ కొత్త యజమాని ఆర్యమాన్ బిర్లా సోదరి కూడా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో 'స్వతంత్ర'ను స్థాపించి, గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్నారు. బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా ఉన్నారు. 'లివిన్ ది లైఫ్', 'మీంట్ టు బి' వంటి ప్రసిద్ధ ఆల్బమ్లతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయని. మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఆ సమస్యలతో బాధపడుతోన్న వారికి నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించే లక్ష్యంతో అమ్మతో కలిసి ‘Mpower’ అనే సంస్థ ని స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల ‘బిర్లా స్టూడియోస్’ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వేదికగా యువ ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటున్నారు.ఆమె నికర విలువసుమారు రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా. ఇదీ చదవండి: విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా? -
సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
కోల్కతా: బెంగాల్లో నైతిక విజయం తమదేనని అంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్భవన్కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా. ఈసీ బీజేపీ ఏజెంట్గా పనిచేసింది. ఎన్నికలకు రెండురోజుల ముందే టీఎంసీ నేతల్ని అరెస్ట్ చేశారు. బెంగాల్లో మాది ఓటమి కాదు. బీజేపీ చోరీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మా పాలిట విలన్. మేం విలన్లపై పోరాటం చేశాం. కౌంటింగ్ సెంటర్లలో మా ఏజెంట్లను అనుమతించలేదు. SIR ప్రక్రియలో మోదీ, అమిత్ షా తలదూర్చారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడుతాం. సీఆర్పీఎఫ్ బలగాలు మా పాలిట గూండాల్లా మారాయి. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం అలవాటే. మాకు ఇండియా బ్లాక్ మద్దతు ఉంది’ అని స్పష్టం చేశారు. కాగా, నిన్న(సోమవారం) వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200పైగా సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ ప్రభంజనంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది. -
tvk vijay : ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) అతి పెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, ప్రజల తీర్పుతో కొత్త శక్తిగా ఎదిగింది. అయితే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు విజయ్ను సంప్రదించాయి. అదే సమయంలో విజయ్ సైతం పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడం, మంత్రి వర్గంలో ఏ పార్టీకి చోటివ్వాలి. ప్రమాణ స్వీకారం తదిదర అంశాలపై స్పష్టత వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మిత్రపక్షాల ప్రతిపాదనలుసీపీఎం, సీపీఐ, పీఎంకే, వీసీకే పార్టీలు విజయ్కు తమ ప్రతిపాదనలు పంపాయి.పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి) - నాలుగు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.సీపీఎం- భావజాల పరంగా టీవీకేకు దగ్గరగా ఉన్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.సీపీఐ - మరో వామపక్ష పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి)- సామాజిక న్యాయం కోసం పోరాడే ఈ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ప్రతిపాదించారని సమాచారం.విజయ్ వ్యూహంకేవలం బయటి నుంచి మద్దతు కాకుండా, మిత్రపక్షాలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్థిరమైన పాలన అందించాలనేది విజయ్ వ్యూహం. గత 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎకే పార్టీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.వినూత్న మంత్రివర్గంమిత్రపక్షాల సీనియారిటీతో పాటు, తన పార్టీలోని యువ నాయకులను కలిపి ఒక వినూత్నమైన మంత్రివర్గాన్ని విజయ్ రూపొందిస్తున్నారు. ప్రజలు కోరుకున్న ‘మార్పు’ తీర్పును గౌరవిస్తూ, పాత రాజకీయ శక్తులకు దూరంగా ఉండాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.ముఖ్యమంత్రి పదవికి విజయ్అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గురువారం (మే 7)న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్'
ఐపీఎల్-2026 సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, టెక్నికల్గా మాత్రం ఇంకా చాలా మెరుగుపడాలి అని మంజ్రేకర్ అన్నాడు. అంతేకాకుండా భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు సూర్యవంశీకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు. కాగా వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, హేజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం విడిచిపెట్టలేదు.ఐపీఎల్ సీజన్కు ముందు జరిగిన అండర్-19 వరల్డ్కప్లోనూ వైభవ్ దుమ్ములేపాడు. దీంతో సంజయ్ మంజ్రేకర్ మాత్రమే కాకుండా సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని సూచిస్తున్నారు."వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై సెంచరీ, ఐపీఎల్లో ఫామ్ను బట్టి చూస్తే భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడు. ఐపీఎల్ వంటి మహా వేదికపై ఎవరైనా అద్భుతాలు సృష్టిస్తే, కచ్చితంగా జాతీయ జట్టు అరంగేట్రానికి సిద్దంగా ఉన్నట్లే.ఇప్పుడు వైభవ్ కూడా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ప్రస్తుత భారత టీ20 జట్టులో ఇప్పటికే ఓపెనింగ్ స్ధానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి వారు కూడా ఓపెనర్లగా రాణిస్తున్నారు.ఈ క్రమంలో వైభవ్ను ఓపెనర్గా ఆడిస్తే ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వైభవ్కు మంచి టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టెక్నికల్గా మాత్రం ఇంకా మెరుగుపడాలి. వైభవ్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్సైడ్లో షాట్లు కొడుతున్నాడు. ఇది కేవలం టీ20ల మాత్రమే సరిపోతుంది. టెస్టులకు సరిపోదు. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి పిచ్లపై రాణించాలంటే బంతికి దగ్గరగా వెళ్లి ఆడాలి. ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆడితే పరుగులు సాధించలేరు. టీ20 క్రికెట్ ఆటగాళ్లకు డబ్బుతో పాటు మీకు మంచి పేరును తీసుకురావచ్చు. కానీ నిజమైన గౌరవం మాత్రం టెస్టు క్రికెట్లో రాణిస్తానే దక్కుతుందని" మంజ్రేకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. -
'ఆ బాధ జీవితాంతం గుర్తుంటుంది..' మోహన్ బాబు ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ నటుడు, హీరో మోహన్ బాబు ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవలే మోహన్ బాబు క్యారెక్టర్ సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత విలన్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా సంగతి పక్కనపెడితే మోహన్ బాబు డైరెక్టర్స్ డే 2026 ఈవెంట్కు హాజరయ్యారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరి నారాయణరావును తలచుకుని ఎమోషనలయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఆయన బర్త్ డేను మనం సెలబ్రేట్ చేసుకున్నప్పటీకీ.. చాలా బాధకరమైన రోజేనని అన్నారు. తండ్రి లాంటి వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ నాకు జీవితమంతా ఉంటుందని తెలిపారు. ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి మోహన్బాబుగా ఈ స్థాయికి తీసుకొచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ జనరేషన్ వాళ్లకు చాలామందికి డైరెక్టర్ అనే పదానికి అర్థం తెలియదు.. దర్శకుడు అనే పదానికి సరైన అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావుగారే అన్నారు. -
డీఏంకేను వీడేది లేదు.. వీసీకే చీఫ్
సినీ స్టార్ విజయ్కు ఊహించని షాక్ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది. ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ని విజయ్ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.#WATCH | Chennai | Viduthalai Chiruthaigal Katchi (VCK) Chief, Thol. Thirumavalavan, "We are not thinking about a coalition govt along with TVK. We are still with DMK. We are for secularism. We will proceed with this alliance for the welfare of the people of Tamil Nadu. We are… pic.twitter.com/WXpUBTWYPH— ANI (@ANI) May 5, 2026 -
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ వీరోచిత పోరాటం.. ప్రాణాలకు తెగించి..
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. ✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేతనేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026 -
దేవుళ్లు కూడా నన్ను ఆపలేరు.. విజువల్ వండర్లా కొత్త ట్రైలర్
క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పట్టానా అర్థం కావనే కామెంట్స్ వినిపిస్తాయి గానీ సూపర్ హిట్ అవడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ. ఈయన చేసిన లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ కొత్తది రిలీజ్ చేశారు. ఇది విజువల్ వండర్లా ఉంటూ మూవీపై హైప్ పెంచుతోంది.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఒడియన్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒడియన్ పాత్రలో మ్యాట్ డామన్, పెనెలోపీగా అన్నా హాత్వే, టెలిమాకస్గా టామ్ హోలండ్ కనిపించనున్నారు. రాబర్ట్ ప్యాటిన్సన్, ఛార్లెజ్ థెరోన్ కూడా కీలక పాత్రలు చేశారు. ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం విశేషం.ట్రైలర్ బట్టి చూస్తే ఒడియన్ అనే రాజు, ఓ యుద్ధంలో పాల్గొనేందుకు తన రాజ్యాన్ని, భార్య కొడుకుని వదిలి మరో చోటకు వెళ్తాడు. యుద్ధం గెలిచి తిరిగొస్తుంటే సముద్రంలో ఇతడి సైన్యం ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురవుతుంది. కానీ ఒడియన్ రాజు ప్రాణాలు దక్కించుకుంటాడు. తర్వాత ఏమైంది? భార్య-కొడుకుని కలిశాడా అనేది మిగతా స్టోరీ. ప్రాచీన కవి హోమర్ రాసిన 'ద ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
పానీ పూరీపై మనసు పారేసుకున్న జపాన్ చిన్నది..!
నోరూరించే మసాలాలు, పుల్లని చల్లటి నీరు.. సాయంత్రం వేళ పానీ పూరీ ఇచ్చే మజాయే వేరు. అందుకే పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. తాజాగా ఓ జపనీస్ పారిశ్రామికవేత్తకు కూడా మన పానీ పూరీ తెగ నచ్చేసిందంట. హెర్మెస్ అనే జపనీస్ మహిళ ఎక్స్ వేదికగా పానీ పూరీపై తనకున్న మక్కువను పంచుకోవడంతో.. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. వారంలో రెండు రోజులు పానీ పూరీ తింటున్నాననీ.. బయట ఫుడ్ని ఇష్టపడని తన భర్త కూడా నీ పూరీ రుచికి ఫిదా అయిపోయారని ఆమె అందులో రాసుకొచ్చారు. అందుకే తను జపాన్లో ఏకంగా ఓ పానీ పూరీ సెంటర్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోకి ఒక పానీ పూరీ కిట్ను కూడా తెచ్చుకున్నట్లు హెర్మెస్ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారతీయుల ఫేవరెట్ స్నాక్కు జపాన్లో కూడా క్రేజ్ రావడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పానీ పూరీ పవర్ అలాంటిది’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. パニプリにハマりすぎて、気軽に食べ歩きできるパニプリ屋でも起業しようかなって真剣に思うくらいハマってる。エキゾチック料理NGな夫すら、「俺ハマったかもしれん、パニプリのことをすぐ考えてしまう」と言うくらい中毒性ある、、週2くらいで食べてるし、パニプリキットも買った笑 pic.twitter.com/LXqtiklwS6— エルメス (@hermes_ooo) April 20, 2026 (చదవండి: Met Gala 2026: గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..) -
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్’ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.అర్ధరాత్రి ఒంటి గంటకు స్పందననియామకాల విషయంలో తాను ఎందుకు భారతీయులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానో అలబ్బార్ తనదైన శైలిలో వివరించారు. ‘మీరు ప్రపంచాన్ని జయించాలంటే భారతీయ ప్రతిభ అవసరం. ప్రపంచమంతా పని గంటలకు సంబంధించి గడియారంవైపు చూస్తుంటే భారతీయ నిపుణులు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకైనా ఫోన్ తీసి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అసాధారణమైన పనితీరు వారిని ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది’ అని ఆయన కొనియాడారు.అలబ్బార్ ఎత్తిచూపిన లక్షణాలు2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్-19 వంటి గడ్డుకాలంలో ఎమార్ గ్రూప్ ఎలా నిలదొక్కుకుందో వివరిస్తూ, భారతీయ శ్రామిక శక్తిలో తాను గమనించిన ప్రధాన లక్షణాలను ప్రస్తావించారు.క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.రోజూ పనులను తనిఖీ చేస్తూ ముందస్తుగా ప్రమాదాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతారు.మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యం భారతీయుల సొంతం.తన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ‘నా ఐక్యూ సగటు మాత్రమే కావచ్చు, కానీ నా కృషి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది’ అని అలబ్బార్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత అదృష్టవంతులు అవుతారు’ అన్నది తన విజయ రహస్యమని పేర్కొన్నారు.భారతదేశంతో అనుసంధానంభారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి ఎమార్ గ్రూప్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. రాజస్థాన్లోని రాఫెల్స్ యూనివర్సిటీతో కలిసి అలబ్బార్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి దుబాయ్, యూరప్, ఆసియాలోని తమ కార్యాలయాల్లో నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.అలబ్బార్ భరోసాభారతదేశం పట్ల ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం కంటే మెరుగైన, విస్తృతమైన, స్థిరమైన, నిరంతరం వృద్ధి చెందుతున్న మరో దేశం ఏదీ లేదు’ అని ఆయన నమ్మకంగా చెప్పారు. దాంతో ప్రపంచ నిర్మాణ రంగంలో భారతీయ నిపుణుల సత్తా మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగింది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్న టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత్, తాజా ర్యాంకింగ్స్లో 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.ఈ జాబితాలో ఇంగ్లండ్ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య తేడా స్వల్పంగా తగ్గినప్పటికీ, భారత్ టాప్ ర్యాంక్ను నిలుపుగోగలిగింది.గత రెండు సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్లో భారత్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుసగా 2024, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకోవడంతో పాటు, ఈ మధ్యకాలంలో ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్లలో అజేయంగా నిలిచింది. ఈ విజయాలే భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాయి.ఇక ర్యాంకింగ్స్లో నాలుగో నుంచి ఏడో స్థానాల వరకు పెద్ద మార్పులు లేవు. న్యూజిలాండ్ (247), సౌతాఫ్రికా (244), పాకిస్తాన్ (240), వెస్టిండీస్ (233) వరుస స్థానాలు దక్కించుకున్నాయి.దిగువ స్థానాల్లో మాత్రం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, శ్రీలంక తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 220 పాయింట్లతో పదో స్థానాన్ని నిలబెట్టుకుంది.పసికూన అమెరికా జట్టు మంచి పురోగతి సాధిస్తూ 13వ స్థానానికి చేరుకోగా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు ఒక్కో స్థానం దిగజారాయి. 2026 ప్రపంచకప్లో ఆకట్టుకున్న ఇటలీ జట్టు గణనీయంగా మెరుగై 23వ స్థానానికి ఎగబాకింది.మొత్తంగా తాజా ర్యాంకింగ్స్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుండగా, ఇతర జట్లు కూడా క్రమంగా పోటీని పెంచుతున్నాయి. -
Karimnagar: అగ్రహారం నుంచి బీసీసీఐ దాకా!
క్రికెటర్గా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల్లో చాలా మందికి ఈ కల అందని ద్రాక్ష లాంటిదే. రంజిత్ విషయంలోనూ ఇదే జరిగింది. క్రికెటర్ కావాలన్న ఆశయానికి మధ్యలోనే గండిపడింది. కారణాలు ఏవైనా.. ప్రతిభ ఉన్నా సరే అతడు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు.అయినప్పటికీ క్రికెట్పై ప్రేమను వదులుకోలేకపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా అతడికి కొత్త దారి చూపించింది. ఆట, ఆటగాళ్లతో మమేకమయ్యే వీలు కల్పించింది. హైదరాబాద్ మేటి క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు.. అమన్ రావు వంటి వర్ధమాన క్రికెటర్లకు ఫిట్నెస్ మెళకువలు నేర్పే స్థాయికి చేర్చింది.తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని అగ్రహారం రంజిత్ కుమార్ స్వస్థలం. తల్లిదండ్రులు ఏనుగుల బీరయ్య, ఏనుగుల భాగ్య. వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉపాధి నిమిత్తం రంజిత్ తండ్రి హైదరాబాద్కు వలస వచ్చారు. ఓవైపు చదువుకుంటూనే క్రికెట్పై మక్కువ పెంచుకున్న రంజిత్.. తండ్రికి మనసులోని మాట చెప్పాడు.ఎంబీఏ చదివాడుఆర్థికంగా కష్టంగా ఉన్నా కుమారుడి ఆశయానికి ఆయన అడ్డుచెప్పలేదు. జూనియర్ లెవల్లో హైదరాబాద్ తరఫున కొడుకు సత్తా చాటుతుంటే మురిసిపోయారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.. ప్రతిభ ఉన్నా కొన్ని అనుకోని అడ్డంకుల వల్ల క్రికెటర్ కావాలన్న రంజిత్ కల ముగిసిపోయింది.ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టిన రంజిత్.. ఎంబీఏ పూర్తి చేశాడు. అయితే, భవిష్యత్తుపై అప్పుడు అతడికి ఎలాంటి స్పష్టతా లేదు. మనసంతా క్రికెట్ మీదే ఉంది. ఆ సమయంలోనే స్నేహితుడొకరు ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి రంజిత్కు చెప్పాడు. అసలు తనకు ఏమాత్రం అవగాహన లేని రంగంలోకి వెళ్లడం సరైందేనా అని అతడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు.అవగాహన లేని రంగంలోకి వెళ్లి.. సక్సెస్ఏం జరిగినా మన మంచికే అనుకుని రంగంలోకి దిగాడు. కొన్నాళ్లపాటు దారీతెన్నూ లేకుండా రంజిత్ ప్రయాణం సాగింది. అయితే, కఠిన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందంటారు. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న రంజిత్.. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎదిగాడు.ఆటగాళ్ల జీవితంలో అత్యంత కీలక పాత్ర స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్దేనన్న సంగతి తెలిసిందే. ప్లేయర్ల ఫిట్నెస్, బలం, వేగం, చురుకుదనాన్ని పెంచడం.. అదే విధంగా గాయాల బారిన పడకుండా వారి ఆట తీరును మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతలు.తిలక్ వర్మ, సిరాజ్ వంటి ఆటగాళ్లతోఇక ఒక్కో మెట్టు ఎక్కిన రంజిత్ కుమార్.. హైదరాబాద్ సీనియర్ మెన్స్ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో తిలక్ వర్మ, సిరాజ్ వంటి ఆటగాళ్లతో నిండిన జట్లకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించాడు. బీసీసీఐ-ఎన్సీఏ అక్రిడేషన్ పొందిన రంజిత్ కుమార్.. ప్రస్తుతం పెర్ఫామెన్స్ కోచింగ్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఇటీవలే BCCI COE అండర్-19 బాయ్స్ క్యాంప్నకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికయ్యాడు.చిన్ననాడు కలలు కన్నట్లుగా తానొక స్టార్ క్రికెటర్ కాలేకపోయినా.. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్ సజావుగా కొనసాగించేందుకు కోచ్గా రంజిత్ తన ప్రతిభను ఉపయోగిస్తున్నాడు. విధి తనకు ఓ దారి మూసివేసినా.. కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో మరో దారిలో తన గమ్యాన్ని చేరుకున్న రంజిత్ కుమార్ యువతకు ఆదర్శం.చదవండి: హార్దిక్ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్గా తొలగింపు? -
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
మెట్ గాలాలో గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..
మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్ రిటైల్ బ్రాండ్ స్వదేశ్కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్ చేశారు. ఆఖరికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్లను ఈ వస్రం(బ్లౌజ్)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్ గౌరవ్ గుప్తా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్ బ్యాగ్లో సుబోధ్ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్కార్పెట్పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్గాలా 2026 థీమ్ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్కు చెందిన సౌరబ్ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం
ఏది జరిగినా మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్’ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.ఆలస్యమే ఆమృతం..ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్ అయితే.. కొంతవరకు పొలిటికల్ కెరీర్కి కూడా ప్లస్ అవుతుందని విజయ్ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. ఓటీటీ బిజినెస్ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్ రిలీజ్ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత జననాయగన్ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్, క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది.బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే..టాక్ని బట్టి కలెక్షన్స్ ఉండేవి. హిట్ టాక్ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
తెరవెనుక మస్క్ బెదిరింపులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ మధ్య న్యాయ పోరాటం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు విచారణ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మస్క్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మన్కు పంపిన సందేశాలు ప్రస్తుతం ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఏమిటా సందేశం?సీఎన్బీసీ నివేదికల ప్రకారం, విచారణకు కేవలం రెండు రోజుల ముందు ఎలాన్ మస్క్, గ్రెగ్ బ్రోక్మన్కు సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలను విరమించుకుని కేసును పరిష్కరించుకుందామని బ్రోక్మన్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనకు మస్క్ ఇచ్చిన స్పందన అత్యంత తీవ్రంగా ఉంది. ‘ఈ వారం చివరి నాటికి మీరు, సామ్ ఆల్ట్మాన్ అమెరికాలోనే అత్యంత అసహ్యించుకునే వ్యక్తులుగా మారుతారు. మీరు పట్టుబట్టి ముందుకు వెళితే అలాగే ఉంటుంది’ అని మస్క్ హెచ్చరించినట్లు న్యాయస్థానంలో దాఖలు చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.ఓపెన్ఏఐ వాదనఈ సందేశాన్ని ఓపెన్ఏఐ న్యాయ బృందం చాలా సీరియస్గా పరిగణించింది. మస్క్ తన పోటీదారులను, ఆ సంస్థల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఓపెన్ఏఐ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మస్క్ ఈ దావాను కేవలం ఒక పోటీ వ్యూహంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.వివాదం నేపథ్యం2024లో మొదలైన ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 2015లో ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలాన్ మస్క్, ఆ సంస్థకు దాదాపు 38 మిలియన్ డాలర్ల విరాళం అందించారు. ఆ సంస్థ లాభాపేక్ష లేని (నాన్ ప్రాఫిట్), అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేయాలని మస్క్ అప్పట్లో ఆకాంక్షించారు. అయితే, సంస్థ ప్రస్తుతం లాభాపేక్ష దిశగా మళ్లడంపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వారం కోర్టులో సాక్ష్యం చెబుతూ సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్లు ఒక స్వచ్ఛంద సంస్థను తీరునే మారుస్తున్నారని ఆరోపణలు చేశారు.తదుపరి పరిణామాలుమస్క్ ఆరోపణలను ఓపెన్ఏఐ వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి మరింత వ్యాపారం లభించేందుకు, మార్కెట్ పోటీని దెబ్బతీయడానికి ఆడుతున్న నాటకమని సంస్థ వాదిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
తమిళనాడు సీఎంగా విజయ్.. రెండేళ్ల క్రితమే చెప్పేశాడుగా..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ విజయకేతనం ఎగరేశాడు. పోటీ చేసిన తొలిసారే అత్యధిక సీట్లు సాధించిన సినీ గ్లామర్ పర్సన్గా చరిత్ర సృష్టించాడు. సింగిల్గా పోటీ చేసి.. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారిన పార్టీలకు చెక్ పెట్టాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను ఓడించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే వందకు పైగా సీట్లు సాధించి తానేంటో నిరూపించాడు. ఇక మిగిలింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే.అయితే విజయ్ సీఎం అవుతాడాని ముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. గతంలో విజయ్ సహనటుడు ప్రేమ్జీ అమరన్ కూడా విజయ్ సీఎం అవుతాడని చెప్పారు. 2026లో నేను అతనికే ఓటు వేస్తాను.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హామీ ఇస్తున్నానని మాట్లాడారు. అతను అన్నట్లుగానే విజయ్ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కనున్నారు.విజయ్ కూడా ముందే హింట్..టీవీకే అధినేత, హీరో విజయ్ సైతం తాను సీఎం అవుతానని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరలవుతోంది. తాను హీరోగా నటించిన గోట్ మూవీలో TN 07 CM 2026 అనే నంబర్ ఉన్న కారును నడుపుతూ కనిపించారు. టీఎన్ అంటే తమిళనాడు.. 2026లో సీఎం అంటూ కారు నంబర్తోనే ముందే చెప్పేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ఫిక్సయ్యారు. తాజా ఎన్నికల్లో అదే చేసి చూపించాడు. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఆ కారు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే కావాలి. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. తిరుచ్చి (తూర్పు), పెరంబూరులో గెలిచారు. TVK formed in Feb 2024The Greatest of All Time release Sep 2024Look at the Car number.TN 07 CM 2026 ❤️❤️❤️The Election Results came out First in Theatre Screens 🔔Peak Detailing by @vp_offl Venkat Prabhu in Thalapathy Vijay movie GOAT 🔥🔥🔥#FI pic.twitter.com/Uv5M7RZR5A— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) May 4, 2026 -
'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు'
ఐపీఎల్-2026 సీజన్లో సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ తన లోని క్లాస్ను మరోసారి చూపించాడు.229 పరుగుల భారీ లక్ష్య చేధనలో హిట్మ్యాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో కలిసి స్కోర్ బోర్డును రోహిత్ పరుగులు పెట్టించాడు. రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అతడి బ్యాటింగ్ తగ్గలేదని ఈ ఇన్నింగ్స్ చూస్తే మనకు అర్ధమవుతోంది. ఓవరాల్గాఈ సీజన్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన రోహిత్, 174.01 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వాట్ ఏ ప్లేయర్.. వాట్ ఏ ప్లేయర్. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా కోచ్గా ఉన్నప్పుడు ప్రత్యర్థిగా అతడి సత్తాను చూశాను. ఇప్పుడు ఎల్ఎస్జీ కోచ్గా అదే చూస్తున్నాను. అతడి బ్యాటింగ్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రపంచంలోని గొప్ప ప్లేయర్లు అందరిని చూసేందుకు ఐపీఎల్ ఒక వేదిక" అని లాంగర్ పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాపై గొప్ప రికార్డు ఉంది. ముఖ్యంగా వైట్బాల్ క్రికెట్లో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించేవాడు. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్లపై సైతం రోహిత్ తనదైన శైలిలో చెలరేగిపోయేవాడు.చదవండి: ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్? -
ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్ దిండా.దిండా పూర్వ మిడ్నాపూర్ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ (మనోజ్ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో 78 మ్యాచ్లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. -
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026 -
భారత రాజకీయాల్లోనే పెను సంచలనం!
పశ్చిమ బెంగాల్.. దశాబ్దాల పాటు వామపక్షాలకు అండగా నిలిచింది. ఆ తర్వాత 'దీదీ' మమతా బెనర్జీని అక్కున చేర్చుకుంది. కానీ, నిన్నటి సోమవారం వెలువడిన ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్రను లిఖించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ, అసాధ్యమనుకున్న బెంగాల్ కోటను బద్ధలు కొట్టింది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని తనదైన శైలిలో మార్చాలనుకుంటున్న బీజేపీకి దక్కిన అతిపెద్ద విజయం.పదేళ్ల క్రితం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ, నేడు 294 స్థానాలకు గాను 208 సీట్లు గెలుచుకోవడం ఒక అద్భుతం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన కుప్పకూలిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ కోల్పోయి దెబ్బతిన్న బీజేపీకి, ఈ విజయం సంజీవనిలా మారింది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి, బెంగాల్ విజయం కిరీటంలో మణి లాంటిది.ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు. ఎన్నికల కంటే ముందే దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం పెను దుమారం రేపింది. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్లను లూటీ చేసింది.. ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని 100కు పైగా సీట్లలో మోసానికి పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా.. మమత ఓటమి ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి గురించి గట్టిగా మాట్లాడే ఒక బలమైన గొంతుక ఇప్పుడు మూగబోయింది. చివరకు తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో కూడా మమత ఓడిపోవడం శోచనీయం. తన పాత మిత్రుడు, ప్రస్తుతం బీజేపీ నేత అయిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఆయనే ఇప్పుడు బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అవినీతి. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు, ఇతర కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని నింపాయి. రెండోది భద్రత. గతేడాది కోల్కతా ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ రేప్, హత్య ఉదంతం దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఆ బాధితురాలి తల్లిని అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా తనవైపు తిప్పుకుంది. దీదీ మంచిదే కానీ, ఆమె పార్టీ అవినీతిమయం.. పరిశ్రమలను తరిమేశారు అన్న సామాన్యుడి మాటలే బెంగాల్లో ప్రతిధ్వనించాయి. సెక్యులరిజం వర్సెస్ హిందూత్వ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా, లౌకికవాదానికి, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న బెంగాల్, ఇప్పుడు హిందూత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. మమత బెంగాలీ సంస్కృతిని రక్షించాలని పిలుపునిచ్చినా, ప్రజలు మాత్రం ఉద్యోగాలు మరియు అభివృద్ధికే ఓటు వేశారు.దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడూ ఒక ఉద్వేగభరితమైన ప్రయోగశాలే. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత శూన్యంగా మారిన ఆ గడ్డపై, ఇప్పుడు 'దళపతి' విజయ్ ఒక ఆశగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఒక రాజకీయ నూతన విదేశీయుడిగా అడుగుపెట్టి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల పునాదులను కదిలించడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ విజయం వెనుక విజయ్ పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. గ్లామర్, అధికారం మధ్య ఆయన నలిగిపోలేదు. అటు ప్రజల ఆకాంక్షలకు, ఇటు తన వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న సన్నని గీతపై నడుస్తూ ఈ ఘనత సాధించారు. సొంత కుటుంబం తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మానసికంగా ఎంతో కుంగదీశాయి. కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తి, పేరు ప్రఖ్యాతుల గొడవలు బహిరంగమైనప్పుడు, శత్రువులు ఆయనను విమర్శించడానికి అస్త్రాలుగా వాడుకున్నారు. కానీ, తన ఇంట్లో రగులుతున్న ఆ వేదనను దిగమింగుకుని, బయట ప్రజల కోసం నిలబడ్డ విజయ్ తీరు చూసి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. ఆయన గెలుపు వెనుక కేవలం స్టార్డమ్ మాత్రమే లేదు, ఒంటరిగా నిలబడి పోరాడిన ఒక వ్యక్తి తాలూకు నిశ్శబ్ద ఆవేదన కూడా ఉంది.ఇక చివరగా, కేరళం,అక్కడ రాజకీయాల గురించి చెప్పాలంటే అది ఎప్పుడూ ఎల్.డి.ఎఫ్, యు.డి.ఎఫ్ మధ్య సాగే హోరాహోరీ పోరాటం. కానీ, ఈసారి దేవుడి సొంత గడ్డపై కమలం పువ్వు వికసించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉన్న కేరళలో, బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం అంటే అది ఒక భావజాల విప్లవమే అని చెప్పాలి. క్రైస్తవ మైనారిటీలతో చేతులు కలుపుతూ, మోదీ గ్యారంటీ ని కేరళంలో ఇంటింటికి తీసుకెళ్లడంలో ఆ పార్టీ సఫలమైంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన భారీ విజయంతో పోలిస్తే కేరళలో వచ్చిన ఓట్ల శాతం అతి తక్కువే కావొచ్చు, కానీ కేరళ ఓటరు మదిలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ముద్ర వేయడం మాత్రం ఆ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. అజేయమైన కోటలుగా భావించిన నియోజకవర్గాల్లో కూడా బిజెపి ఓట్ల శాతం పెరగడం చూస్తుంటే, కేరళలో మార్పు మొదలైందని స్పష్టమవుతోంది.మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక నూతన శకాన్ని ఆవిష్కరించాయి. అజేయమని భావించిన మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడం, అస్సాం నుంచి కేరళ దాకా బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు.. అది దేశంలో మారుతున్న సామాన్యుడి ఆకాంక్షలకు నిదర్శనం. ప్రాంతీయ భావోద్వేగాలు, సంస్కృతి పేరుతో చేసే రాజకీయాల కంటే అభివృద్ధి, భద్రత, అవినీతి రహిత పాలనే ముఖ్యమని ఓటరు తీర్పునిచ్చాడు. అటు తమిళనాడులో విజయ్ వంటి కొత్త తరం నాయకుల రాక, ఇటు బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలు.. వెరసి 2026 నాటి ఈ రాజకీయ చిత్రం దేశ భవిష్యత్తును సరికొత్త తీరాలకు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. పాత వ్యవస్థలు పోయి, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసం పెరిగేలా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ పక్షాలు ఎలా గౌరవిస్తాయో వేచి చూడాలి. -
స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ?
ప్రపంచవ్యాప్తంగా టెక్ విప్లవానికి నాంది పలికిన ఓపెన్ఏఐ సంస్థ ఇప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించనుందనే వార్తలొస్తున్నాయి. యాపిల్, శామ్సంగ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సంస్థ తన సరికొత్త ఏఐ ఏజెంట్ ఫోన్ను అభివృద్ధి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం యాప్ల మీద ఆధారపడకుండా కృత్రిమ మేధ ద్వారా నేరుగా పనులను పూర్తి చేసేలా ఈ ఫోన్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ అంశాలను అధికారికంగా కంపెనీ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.ఏమిటీ ఏఐ ఏజెంట్ ఫోన్?ప్రస్తుత స్మార్ట్ఫోన్ల్లో మనం ఒక పని కోసం వివిధ యాప్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఓపెన్ఏఐ అభివృద్ధి చేస్తున్న ఈ ఏజెంట్ ఫోన్ ఆ పద్ధతినే మార్చేయనుంది. ఇందులో యూజర్లు పనులను పూర్తి చేయడానికి ఏజెంట్ పైన ఆధారపడతారు. అంటే, ఫోన్లోని ఏఐ యూజర్ తరఫున వివిధ యాప్ల మధ్య నావిగేట్ చేస్తూ పనిని పూర్తి చేస్తుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మొబైల్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చనుంది.లీక్ అయిన స్పెసిఫికేషన్స్ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కుయో వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఈ స్మార్ట్ఫోన్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. అందుకోసం మీడియాటెక్ ప్రాసెసర్తో ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది డైమెన్సిటీ 9600 ప్రాసెసర్పై పనిచేయనుంది. టీఎస్ఎంసీ అధునాతన N2P (2nm) నోడ్ సాంకేతికతతో ఈ చిప్ తయారవుతుంది. ఇందులో డ్యూయల్-ఎన్పీయూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ఏఐ గణనలను వేగంగా పూర్తి చేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం ఎల్పీ డీడీఆర్6 ర్యామ్ యూఎఫ్ఎస్ 5.0 స్టోరేజ్ సాంకేతికతను వాడుతున్నారు. ఇన్-లైన్ హ్యాషింగ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి’ అన్నారు.ఎందుకు ఈ ఫోన్ అవసరం?ఓపెన్ఏఐ ఈ ఫోన్ను తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వ్యాపార వ్యూహం. రాబోయే కాలంలో కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి బలమైన ప్రొడక్ట్ స్టోరీ అవసరం. రెండు.. మార్కెట్ ఆధిపత్యం. యాపిల్, గూగుల్, శామ్సంగ్ వంటి కంపెనీలు ఏఐ ఫీచర్లను తమ ఫోన్లలో వేగంగా ప్రవేశపెడుతున్నాయి. ఈ పోటీలో వెనుకబడకుండా ఉండాలంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండింటిపై నియంత్రణ ఉండాలని ఓపెన్ఏఐ భావిస్తోంది.ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ 2027 మొదటి అర్ధభాగంలో భారీ ఉత్పత్తి దశలోకి వెళ్లనుంది. 2027-2028 మధ్య సుమారు 30 మిలియన్ల యూనిట్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ఓపెన్ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్లు లేదా సామ్ ఆల్ట్మాన్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏదేమైనా ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం సొంత హార్డ్వేర్తో వస్తుందంటే అది మొబైల్ పరిశ్రమలో పెను సంచలనమే కానుంది. టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏఐ ఏజెంట్ ఫోన్ స్మార్ట్ఫోన్ వినియోగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందో లేదో చూడాలి.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు -
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు -
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్టైం రికార్డు
సాక్షి,విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. మంగళవారం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. ఫలితంగా అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. స్వల్ప కాలంలో చంద్రబాబు పాలన అప్పు రూ.3,62,855 కోట్లకు చేరింది. తద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక అప్పులు చేసిన సీఎంగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3,62,855 కోట్లు అప్పు చేసింది. అంటే సగటున రోజుకి రూ.15,766 కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ.2,02,964 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు రూ.1,12,504 కోట్లు, రాజధాని అప్పులు 47,387 కోట్లుగా ఉన్నాయి. -
అంతులేని దోపిడీ జరుగుతోంది: మేరుగు నాగార్జున
తాడేపల్లి: ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.ఇవాళ మేరుగు నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా పడకన పడ్డాయి. రాజధానిలో ఎకరం రూ.50 కోట్లు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. వారు మాత్రం ఐదు ఎకరాలను కూడా రూ.3.5 కోట్లకే ఎలా కొన్నారు? అంటే జనాన్ని మోసం చేస్తున్నారా? లేక సీఆర్డీఏకి ట్యాక్సులు ఎగ్గొట్టారా? వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు మాత్రం భారీ బంగ్లాలు కట్టుకోవచ్చుగానీ పేదలు మాత్రం ఇళ్లు కట్టుకో కూడదా? ఇదేనా చంద్రబాబు రాజనీతి? చివరికి చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండకుండా గ్రీన్ జోన్ ప్రకటించటం అన్యాయం. రెండు లక్షల కోట్ల ప్రజాధనంతో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు ఎవరి కోసం?’’ అని మేరుగు నాగార్జున నిలదీశారు. -
నమస్కారం తమిళనాడు: ప్రకాశ్ రాజ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఎక్కువ మంది స్పందిస్తున్నారు. బెంగాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం, తమిళనాడులో విజయ్ సంచలన విజయం నమోదు చేయడంతో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై సోషల్ మీడియాలో స్పందన అధికంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపే సత్తా విజయ్కు ఉందా అని ఒకరు సందేహిస్తే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు మంచి చేయాలని మరొకరు హితవు పలికారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాజ్దీప్ సర్దేశాయితో పాటు పలువురు తమ అభిప్రాయాలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.‘అభిమాన’ సమాజంనమస్కారం తమిళనాడు. కామరాజర్ ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం ‘అభిమాన గణం’గా మారిందే తప్ప, రాజకీయ చైతన్యం పొందలేదని నిరూపితమవుతోంది. రాజకీయ అవగాహన కల్పించే వారి పని ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజయం సాధించినవారు ప్రజలకు చేసే సేవ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.– ప్రకాశ్ రాజ్, నటుడు‘టీవీకే’ నడపగలదా?బెంగాల్లో బీజేపీ విజయం కేవలం ప్రజాభిప్రాయంలో మార్పు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా సవరణలతో ఆట మైదానాన్ని మార్చినప్పుడు, స్కోర్బోర్డు అసలైన ఆటకు ప్రతిబింబంగా ఉండదు. తమిళనాడులో యువత ఒక ‘కొత్త ముఖానికి’ ఓటు వేసినప్పటికీ, సినిమా ఆకర్షణ, సోషల్ మీడియా ప్రదర్శనలకు అతీతంగా టీవీకే దగ్గర ఏమైనా విషయం ఉందో లేదో చూడాల్సి ఉంది. కేరళ ఫలితాల్లో యూడీఎఫ్ విజయం అతి తక్కువ ఆశ్చర్యం కలిగించేదీ, అత్యంత నిజాయితీతో కూడినదీ అని నా భావన.– యోగేంద్ర యాదవ్, పొలిటికల్ సైంటిస్ట్పింగ్–పాంగ్బెంగాల్లో 15 ఏళ్ల పాలన నుండి కొత్త సైద్ధాంతిక పాలనకు జరిగే ఈ పరివర్తన... రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అంతిమ పరీక్ష అవుతుంది. తమిళనాడు తన సంప్రదాయ ‘పింగ్–పాంగ్’ (రెండు పార్టీల మధ్యనే మారుతుండే) రాజకీయాల నుండి, అంచనా వేయలేని విధంగా మూడో ముఖం వైపు మళ్లింది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యత, అక్కడ చారిత్రకంగా నెలకొన్న ‘రివాల్వింగ్ డోర్’ విధానానికి తిరిగి వెళ్లటంగా మాత్రమే చూడాలి.– ప్రణయ్ రాయ్, ఎన్నికల డేటా విశ్లేషకులువిద్య... ఆరోగ్యంఅధికారంలో మార్పు వచ్చినా, బెంగాల్లో లోతుగా పాతుకుపోయిన సమ్మిళిత మేధో సంస్కృతి చెక్కుచెదరకుండా ఉంటుందని, ‘సంకుచిత వర్గవాదం’ దానిని కబళించదని ఆశిస్తున్నాను. తమిళనాడులో కొత్త ఆటగాళ్లు ఆవిర్భవించారు. ఆ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిది. అది స్థిరపడిన పార్టీలను అప్రమత్తం చేస్తుంది. కేరళలో భావోద్వేగపూరితమైన మతపరమైన అంశాల కంటే.. పరిపాలన, విద్య, ఆరోగ్యమే ఎప్పటికీ ప్రధానాంశాలుగా ఉంటాయిని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.– జావేద్ అఖ్తర్, గీత రచయితవిసుగు ఫలితం!సరిహద్దు జిల్లాల్లో భారీగా హిందువుల ఏకీకరణ, టీఎంసీ స్థానిక నాయకత్వంపై నెలకొన్న విసుగు – వీటి ఫలితమే బెంగాల్లో తాజా పరిణామం. తమిళనాడులో, స్థిరపడిన ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా యువత చేసిన తిరుగుబాటే టీవీకే విజృంభణ. కేరళలో ద్రవ్యోల్బణం, దాదాపు 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలు ఎల్.డి.ఎఫ్.పై ప్రభావం చూపాయి.– రాజ్దీప్ సర్దేశాయ్, సీనియర్ జర్నలిస్ట్మూడో శక్తిపశ్చిమ బెంగాల్ ఫలితాలు మార్పు కోరు కుంటున్న ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. కానీ అవి ఆ రాష్ట్ర మేధో చరిత్రను నిర్వచించిన ‘బహుళత్వం’, భావప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు రానున్న కొత్త పరిపాలనపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపుతాయి. రాజకీయ వారసత్వాలు శాశ్వతం కాదని తమిళ నాడులో ఆవిర్భవించిన మూడో శక్తి నిరూపించగా; కేరళ ఎప్పటిలా తన విశిష్టమైన ప్రజాస్వామ్య విజ్ఞతను ప్రదర్శించింది. – అరుణా రాయ్, ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సభ్యురాలుమార్పే బలంబెంగాల్లో ఎన్నికల అనంతర ఘర్షణల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వా మ్యంలోని అత్యంత బలహీన వర్గాల భద్రతను, ముఖ్యంగా మైనారిటీలకు, ప్రతిపక్షానికి ఓటు వేసిన వారికి రక్షణ కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తమిళనాడులో సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురైన ఎదురు దెబ్బ... చారిత్రక వారసత్వంపై ఆధారపడకుండా క్షేత్రస్థాయి క్రియాశీలత వైపు తిరిగి రావడానికి నాయకులకు ఒక మేల్కొలుపుగా పని చేయాలి. ఇక కేరళలో ప్రభుత్వాలు తరచుగా మారడమే ఆ రాష్ట్రానికి అతి పెద్ద బలం. ఎందుకంటే ఇది ప్రతి నాయకుడిని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.– హర్ష్ మందర్, సామాజిక కార్యకర్త, రచయితకట్టుబడి లేరుటీఎంసీని ‘బుజ్జగింపు పార్టీ’గా చిత్రీకరించే ప్రయత్నంలో సఫలం అవటం వల్లే బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో జెన్ జడ్, మిలీనియల్ ఓటర్లు ఇకపై డీఎంకే– ఏఐఏడీఎంకేకి కట్టుబడి లేరని స్పష్టం అయింది. కేవలం ఒక సినిమా నటుడికి ఓటు వేయటం మాత్రమే కాదు, ‘ద్వంద్వ పాలనను తిరస్కరించడం’ కూడా అక్కడి ఫలితాలకు సంకేతాలు! కేరళలో గత ఎన్నికల్లో పాక్షికంగా ఎల్డిఎఫ్ వైపు మళ్లిన తమ సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించుకోగలగడమే యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణం.– నీరజా చౌధరి, రాజకీయ విశ్లేషకురాలుఅందరూ దూరమే!గత నెలలో నేను మాట్లాడిన దాదాపు ప్రతి జర్నలిస్టు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కే అనుకూలమని చెప్పారు. కొందరైతే టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంచనా వేశారు. కానీ, పశ్చిమ బెంగాల్పై పరిశోధన చేసిన విద్యావేత్తలు మాత్రం టీఎంసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనీ, బీజేపీ గణనీయమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనీ అన్నారు. హిందువులు దూరమవ్వడం వల్లే మమతా బెనర్జీ ఓడిపోయారా? ముస్లింలు అధికంగా ఉన్న టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్పు కనిపించింది. టీఎంసీ నుంచి వచ్చిన హిందూ ఓట్ల కంటే, కాంగ్రెస్, లెఫ్ట్ నుంచి వచ్చిన హిందూ ఓట్లనే బీజేపీ ఎక్కువగా సాధించగలిగింది. మరోవైపు, టీఎంసీకి రావాల్సిన ముస్లిం ఓట్లలో పెద్ద భాగాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ దక్కించుకున్నాయి.– అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్రౌండర్గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్మన్గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. -
ఫైమాతో కటీఫ్.. నటితో నిశ్చితార్థం చేసుకున్న కమెడియన్
తెలుగులో రియాలిటీ షోలతో చాలాజంటలు పాపులారిటీ సంపాదించాయి. అలాంటి వాటిలో ప్రవీణ్-ఫైమా జోడీ ఒకటి. కలిసి స్కిట్స్ చేశారు. యూట్యూబ్ వ్లాగ్స్ కూడా చేశారు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఫైమా తన జీవితంలో ప్రవీణ్ అనే మరో వ్యక్తి ఉన్నాడని అతడే తన ప్రియుడి అని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఫైమాతో కలిసి నటించిన ప్రవీణ్ విషయానికొస్తే ఇప్పుడు మరో నటితో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పలు ఆల్బమ్ సాంగ్స్లో చేసిన వంశిత అనే అమ్మాయితో పటాస్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో తోటి కమెడియన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లి వార్త కూడా చెప్పే అవకాశముంది.ప్రవీణ్ పెళ్లి చేసుకోబోతున్న వంశిత.. బంధువుల అమ్మాయి అని అంటున్నారు. పటాస్ ప్రవీణ్ విషయానికొస్తే చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్తో తండ్రి కూడా చనిపోయాడు. ఇతడికి ఓ అన్న ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్) -
హార్దిక్ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్గా తొలగింపు?
రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ముంబై సారథిగా అరంగేట్రంలోనే చేదు అనుభవం చవిచూశాడు. ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.మళ్లీ పాత కథే అయితే, గతేడాది మాత్రం మంచి ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట ఎనిమిది గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు తగ్గాయి. కానీ ఈ సీజన్లో మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఐపీఎల్-2026లో ఇప్పటికి పది మ్యాచ్లు పూర్తి చేసుకున్న ముంబై కేవలం మూడు గెలిచింది.సొంతమైదానం వాంఖడేలో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత సోమవారం లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచి.. మూడో విజయం నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బదులు సూర్యకుమార్ యాదవ్ ముంబై సారథిగా వ్యవహరించాడు. వెన్నునొప్పి కారణంగా హార్దిక్ మ్యాచ్కు దూరమైనట్లు యాజమాన్యం వెల్లడించింది.కావాలనే పక్కనపెట్టారుఅయితే, ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్లో విఫలమవుతూ.. కెప్టెన్గానూ తేలిపోతున్న హార్దిక్ పాండ్యాను కావాలనే పక్కనపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హార్దిక్పై వేటు వేసి అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.యాజమాన్యం ఆలోచన ఏమిటి?ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు మద్దతుగానే ఉండనున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. హార్దిక్ కెప్టెన్సీ శైలిపై యాజమాన్యానికి ఎలాంటి ఫిర్యాదులూ లేవని.. అతడు జట్టును విజయవంతంగా నడిపించగలడనే నమ్మకంతో ఉన్నట్లు పేర్కొంది.కాగా వరుస ఓటముల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తగా.. జట్టు సమిష్టి వైఫల్యానికి పాండ్యా ఒక్కడినే బాధ్యుడిని చేయలేమని హెడ్కోచ్ మహేళ జయవర్దనే ఇప్పటికే స్పష్టం చేశాడు. యాజమాన్యం సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. చదవండి: జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ -
విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్ ‘విజిల్’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్ విక్టరీని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్.విజయే సీఎం..ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ.. తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్..వీటీవీ గణేష్ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’ అంటూ ఓ సినిమాలో గణేష్ చెప్పిన డైలాగ్స్ని కోట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. This Actor Confidence on #Vijay's Victory before result... ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ #TVKVijay #TVKVijayHQ pic.twitter.com/jlueARDA12— Rajesh Manne (@rajeshmanne1) May 4, 2026 -
మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే!
బెంగళూరులోకారులో కాలిపోయిన స్థితిలో ఒక మహిళా ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది. వాహనం మంటల్లో కాలిపోతున్న ప్పుడు, చూసిన స్థానికులు దొడ్డబళ్లాపూర్ గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక వాహనాలతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘోరంపై కూపీ లాగిన అధికారులకు సంచలన విషయాలు తెలిసాయి.పోలీసుల కథనం ప్రకారం, వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. స్వల్ప వివాదంతో ప్రియరాల్ని పెట్రోలు పోసి తగుల బెట్టాడు. ఒక రోజు తర్వాత నిందితుడి మృతదేహం రైల్వే ట్రాక్పై లభ్యమైంది. జరిగిన కథ ఏంటీ అంటే.రాజనకుంటె సమీపంలోని మరసంద్ర నివాసి, దేవనహళ్లి తాలూకా కార్యాలయంలో పనిచేస్తున్న 45 ఏళ్ల సి. రామన్జినప్ప, బెంగళూరు ఉత్తర జిల్లాలోని దేవనహళ్లిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో కన్నడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 40 ఏళ్ల సరోజ జె. మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రామన్జినప్ప విడాకులు తీసుకున్న వ్యక్తి కావడంతో, వారిద్దరూ ఈ విషయాన్ని దాచి పెట్టి, గోప్యంగా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి వీకెండ్లో ఔటింగ్కి వెళ్లారు.ఇందుకోసం రామన్జినప్ప అర్జంట్ అవసరమని చెప్పి తన స్నేహితుడు సురేష్ కుమార్ వద్ద నంచి కార్ తీసుకున్నాడు. అక్కడినుంచి దేవనహళ్లికి వెళ్లి, అక్కడ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో స్థానిక బస్ స్టాప్ నుండి సరోజను పిక్ చేసుకున్నాడు. వారిద్దరూ ఉదయం నంది హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి, ఉత్సాహంగా గడిపారు.మధ్యాహ్నం చివరికల్లా,ఈ జంట దొడ్డబళ్లాపూర్లోని జింకెబచ్చహళ్లి శివార్లలోని ఏకాంత ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసుల విచారణ ప్రకారం, ఇక్కడే కథ విషాదమైన మలుపు తీసుకుంది.వాహనం లోపల ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో రామంజినప్ప సరోజ తలపై సుత్తితో కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమె శరీరాన్ని వెనుక సీటులోకి తరలించి, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అతనికీ కొన్ని కాలిన గాయాలయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోరెన్సిక్స్ ఆధారాలతోపాటు, కారు, దాని అలారం, ఆధార్ ఆధారం కీలకంగా మారింది.కారు కాలిపోతున్న సమయంలో, కారులోని ఫీచర్ ఆధారంగా కార్ ఓనర్ సురేష్ కుమార్ మొబైల్ ఫోన్కు ప్రమాద ఆటోమేటిక్ అలర్ట్ వచ్చింది. దీంతో కుమార్ రామన్జినప్పకు కాల్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదే సమయంలో పోలీసులు కాలిపోయిన వాహనాన్న కుమార్కు చెందినదిగా గుర్తించి కాల్ చేశారు. దీంతో అతను సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఉదయమే రామన్జినప్ప తన కారు తీసుకున్నాడనే విషయాన్ని తెలిపాడు.దీనిపై సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇంతలో బెంగళూరు సౌత్లోని బిడది సమీపంలో రైలు పట్టాలపై ఒక మృతదేహం లభ్యమైందని, పూర్తిగా ఛిద్రమై, అవయవాలు తెగిపోయి ఉన్నాయని రైల్వే పోలీసులు సమాచార మిచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని రామంజినప్పగా గుర్తించారు. ఇదీ చదవండి: 75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామిఇదిలా ఉండగా శనివారం రాత్రి దేవనహళ్లికి చెందిన మృతురాలు సరోజ భర్త జయశంకర్ తన భార్య అదృశ్యమైనట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశాడు. కారులో లభ్యమైన కాలిపోయిన మృతదేహం నుండి అధికారులు కాలిపోయిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సరోజ భర్త జయశంకర్ను సంప్రదించగా, ఆ ఆభరణాలు తన భార్యవేనని ఆయన ధృవీకరించినట్లు ఆ అధికారి తెలిపారు. గతవారం చోటుచేసుకున్న ఈ కేసు దిగ్భ్రాంతి రేపింది. ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా -
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
సంతోషంగా ఉంది: ఎన్నికల ఫలితాలపై అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నాయకుడు అన్నామలై తనదైన శైలిలో స్పందించారు. ధన, వారసత్వ రాజకీయాలకు తమ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారని.. మార్పునకు ఓటేశారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చినందుకు తమిళనాడు ప్రజలకు నమస్కరించారు. ఎన్నికల ఫలితాలపై 'ఎక్స్'లో సోమవారం పోస్ట్ పెట్టారు. ఓటర్ల అభిమానం పొందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్కు అభినందనలు తెలిపారు. ఓటమి పాలైన స్టాలిన్కు సానుభూతి ప్రకటించారు. మంచి రోజులు వస్తాయని బీజేపీ శ్రేణులకు భరోసాయిచ్చారు.''అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నమస్కరిస్తున్నాను. నా గడ్డపై ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పడం సంతోషంగా ఉంది. డబ్బుతో ఓట్లు కొనడాన్ని వ్యతిరేకించారు. వంశపారంపర్య రాజకీయాలను వద్దన్నారు. రాజకీయాల్లో కొత్త మార్పునకు నాంది పలికారు. టీవీకే, విజయ్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన ఆరంభానికి సిద్ధంగా ఉన్న మీకు దేవుడు తోడుగా ఉంటాడు.క్షేత్రస్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులు హోరాహోరీ తలపడ్డారు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఓడిన వారు డీలా పడకుండా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. పరాజయం పాలైన స్టాలిన్, సీమాన్లకు సానుభూతి తెల్పుతున్నాను. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. మంచి రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నానని తన పోస్ట్లో పేర్కొన్నారు. కాగా, ఎన్డీఏ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా అన్నామలై పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఇందు కోసం ఎన్నికల్లో పోటీకి సైతం ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం పోటీ చేయమని సూచించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి! -
ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది.ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా బదులుగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. హార్దిక్ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు టాస్ సందర్భంగా సూర్యకుమార్ తెలిపాడు.అయితే ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్ల్లో పాండ్యా ఆడే సూచనలు కన్పించడం లేదు. లక్నోతో మ్యాచ్ అనంతరం హార్దిక్ గాయంపై ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ రికెల్టన్ అప్డేట్ ఇచ్చాడు. హార్దిక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడని, అతడు ప్రస్తుతం జట్టుతో లేడని రికెల్టన్ చెప్పుకొచ్చాడు."హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాని ఈ రోజే నాకు తెలిసింది. అయితే ఆ గాయం తీవ్రత ఎలా ఉందన్న విషయం నాకు తెలియదు. మా తదుపరి మ్యాచ్కు దాదాపు ఆరు రోజుల విశ్రాంతి లభించింది. ఈ సమయంలో హార్దిక్ కోలుకుని, తిరిగి రాయ్పూర్లో జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నా" అని రికెల్టన్ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది సీజన్లో కూడా పాండ్యా కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోయాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఈ బరోడా క్రికెటర్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. వెంటనే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పాండ్యా గాయం కారణంగా తనంతట తానే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడింది.చదవండి: అర్జున్ టెండుల్కర్ను ఎందుకు ఆడించట్లేదు? -
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
ఇక బంగారం కొనడం ఈజీ.. EGR గురించి తెలుసా?
భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువ. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే దాని నిల్వ, భద్రత, స్వచ్ఛత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ).. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది.ఈజీఆర్ అంటే ఏమిటి?ఈజీఆర్ అనేది సెబీ గుర్తింపు పొందిన వాల్ట్ మేనేజర్ వద్ద జమ చేసిన భౌతిక బంగారానికి బదులుగా జారీ చేసే ఒక ఎలక్ట్రానిక్ రసీదు. ఇవి డీమ్యాట్ రూపంలో ఉండే సెక్యూరిటీస్ కాబట్టి, స్టాక్ల మాదిరిగా ఎక్స్చేంజ్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. అంటే, బంగారం ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా ట్రేడ్ చేయగలిగేలా మారిందన్నమాట.EGRలు ఎలా పనిచేస్తాయి?ప్రతి ఈజీఆర్ వెనుక నిజమైన ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎన్ఎస్ఈ ఒక 1000 గ్రాముల బంగారు గడ్డిని EGRగా మార్చింది. దీని ద్వారా భౌతిక బంగారం.. డిజిటల్ ఆస్తిగా మారుతుంది. పెట్టుబడిదారులు ఈ EGRలను స్టాక్ల మాదిరిగా ట్రేడ్ చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ EGRలకు తగిన పరిమాణంలో భౌతిక బంగారాన్ని కూడా పొందవచ్చు.EGR ప్రయోజనాలుబంగారాన్ని భద్రపరచడం కోసం బ్యాంక్ లాకర్ అవసరం లేదుదొంగతనం లేదా నష్టం ఉండదుబంగారం స్వచ్ఛతపై సందేహం ఉండదు (ఎందుకంటే ఇది ప్రమాణిత సంస్థల ద్వారా ద్రువీకరిస్తారు)చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చుమార్కెట్లో సులభంగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చుఇదీ చదవండి: బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం! -
ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కోల్కతా, దక్షిణ 24 పరగణాల్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచినా తమ ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత డెరెక్ ఓబ్రియన్ విసిరిన సవాలు ఇప్పుడు ఆ పార్టీకే రివర్స్ అయ్యింది. ఇప్పుడు టీఎంసీ నేతలు తమ సవాల్ను నిలబెట్టుకుంటారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది.గత నెలలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. ‘మేము గొప్పలు చెప్పదలుచుకోలేదు, మే 4 లెక్కింపు రోజు వరకు వేచి చూస్తాం. కోల్కతాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా మా ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారు’ అని సవాల్ విసిరారు. దక్షిణ 24 పరగణాల్లోని 31 స్థానాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని ఆయన నాడు తెలిపారు. 2021 ఎన్నికల్లో సాధించిన 215 సీట్ల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎన్నికల సమయంలో ధీమా వ్యక్తం చేశారు. అయితే తుది ఫలితాలలో టీఎంసీ కనీసం 100 మార్కును కూడా దాటలేకపోయింది.ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం -
ఒక్క ఓటు.. ఎంత పని చేసింది?
టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు. ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026 -
సరికొత్త రికార్డులు నెలకొల్పిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లేటుగా అయినా లేటెస్ట్గా లైన్లోకి వచ్చింది. నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్పై భారీ విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఈ జట్టు.. ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఐపీఎల్లో లక్నోపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. అలాగే ఐపీఎల్లో అత్యధిక సార్లు (7) 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ (6), సన్రైజర్స్ హైదరాబాద్ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో పంజాబ్ (11) మాత్రమే ముంబై ముందుంది. ఈ భారీ రికార్డులు నెలకొల్పే క్రమంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా ఓ వ్యక్తిగత రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 7 సిక్సర్లు బాదిన అతను.. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డును నమోదు చేశాడు. తొలి వికెట్కు ర్యాన్ రికెల్టన్తో కలిసి 143 పరుగులు జోడించిన రోహిత్.. ముంబై ఇండియన్స్ పై రికార్డులు నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించాడు.రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) చెలరేగడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.అంతకుముందు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. -
రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్
ఏ వ్యాపారం అయినా లాభాల సంపాదనే కీలకం. దానికోసమే ప్రతిఒక్కరూ ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలా అని చూస్తుంటారు. మలయాళ దర్శకనిర్మాతల ఆలోచన ఇప్పుడు అదే. 'పుష్ప' ఫేమ్ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ఇదే విషయాన్ని తెలుగు నిర్మాత 'మైత్రీ' రవిశంకర్తో పంచుకోగా.. ఆ విషయాన్ని ఈయన ఇప్పుడు బయటపెట్టారు.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మలయాళ సీనియర్ నటుడు)'కేరళ ఇండస్ట్రీలో రూ.20 కోట్లతో సినిమా తీసి 'బాహుబలి' స్థాయి కలెక్షన్స్ ఎలా సాధించాలా అని ఆలోచిస్తున్నామని ఫహద్ ఫాజిల్ నాతో అన్నారు. చాలా ముచ్చటగా అనిపించింది. అలాంటి వందల వేల కోట్ల కలెక్షన్స్ చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ల ఆలోచన' అని 'మైత్రీ' నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన దాసరి జయంతి వేడుకల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు.ఫహద్ చెప్పింది గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది మలయాళం వచ్చిన 'లోక' సినిమానే తీసుకుంటే రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. కానీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెలరోజుల క్రితం రిలీజైన 'వాలా 2' సెన్సేషనల్ సక్సెస్ అయింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మలయాళ మేకర్స్.. తక్కువ బడ్జెట్ పెట్టి 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే మలయాళ సినిమాలపై జనాల్లో అభిప్రాయం మారింది. థియేటర్లలో వీలుకానప్పటికీ ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎగబడి చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులైతే కొన్ని మలయాళ మూవీస్కి ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు!ఫహద్ ఫాజిల్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా టాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. వేల కోట్ల కలెక్షన్స్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఫిక్సయిపోయింది. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సినిమాలు రాబట్టుకోలేకపోతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొందరు యువ దర్శకులు సైతం రూ.100 కోట్లకు పైనే నిర్మాతలతో ఖర్చు పెట్టించేస్తున్నారు. ఈ విషయమే చాలామంది నిర్మాతలని భయపెట్టేస్తోంది! ఫహద్ ఆలోచిస్తున్నట్లు మన దర్శకనిర్మాతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది! ఒకవేళ ఆలోచించినా ఇది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న!(ఇదీ చదవండి: కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం)Shocking Statement by #FahadhFaasil 🚨Actor #FahadhFaasiil told me that in the #Keralafilmindustry, we think about how to make #Baahubali level revenue Film with a 20 crore budget.:- Mythri #RaviShankar pic.twitter.com/X8CbrVJ8vC— Milagro Movies (@MilagroMovies) May 4, 2026 -
వైఎస్సార్సీపీ చలో దుప్పుతూరు.. గ్రామస్తులకు మద్దతుగా నిరసన
సాక్షి, అనకాపల్లి: చలో దుప్పుతూరు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొడ్డేడ ప్రసాద్, ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి, కంబాల జోగులు.. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పరిశ్రమలు రావాలనేది వైఎస్ జగన్ విధానమని.. ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ జగన్ ఉపేక్షించరన్నారు. 750 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. గ్రామాన్ని తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలు మీద లాఠీఛార్జ్ చేశారు. గతంలో ఎన్నడు ఈ ప్రాంతంలో మహిళలు మీద లాఠీఛార్జ్ జరగలేదు.. ప్రజల డిమాండ్స్ న్యాయ పరమైనవి. పరిహారం ఇచ్చిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకు తట్ట మట్టి ఎత్తడానికి వీల్లేదు. మీ మీద పెట్టిన తప్పుడు కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తారు. మీకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు దుప్పుతూరు గ్రామంలో పర్యటించాము. మంచి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న గ్రామం కంటే మంచి గ్రామాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 22 ఏళ్లు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోడ నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. వారి సమస్య పరిష్కారం అయిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దాడి చేశారు. అనేక పోలీసులు స్టేషన్లు తిప్పారు’’ అని ఆయన మండిపడ్డారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఈడ్చుకుంటూ మహిళలను వ్యాన్లు ఎక్కించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు?. మహిళలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా’’ అంటూ ఆమె నిలదీశారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. పరిహారం చెల్లించే వరకు గోడ నిర్మాణాన్ని ఆపాలి. ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. న్యాయం కోసం పోరాటం చేసే ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గోడ కట్టలేక పోయారు?. దొర స్వామి దగ్గర కూటమి నాయకులు డబ్బులు తీసుకుని దగ్గరుండి గోడ కట్టిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. -
ఇరాన్ దాడి అమానుషం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పొరుగు దేశాలకు పాకుతున్నాయి. తాజాగా యూఏఈలోని కీలకమైన ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన తొలి భారీ దాడి ఇదే. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆమోదయోగ్యం కాదు: ప్రధాని మోదీసామాన్య పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో యూఏఈకి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. దౌత్యం, పరస్పర చర్చల ద్వారానే అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి సహకరించాలని కోరింది.డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ఫుజైరాపై ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులు, నాలుగు డ్రోన్లను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఒక డ్రోన్ అక్కడి చమురు కేంద్రంపై పడటంతో మంటలు చెలరేగి, అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. బ్రిటన్కు చెందిన రెండు కార్గో నౌకలు సైతం ఈ దాడుల వల్ల మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దాడిపై ఇరాన్ నేరుగా స్పందించకపోయినా.. అమెరికా, యూఏఈలు అకారణంగా బురదలో కూరుకుపోవద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. Our statement on the attack on Fujairah ⬇️🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026హార్ముజ్ జలసంధిలో రగులుతున్న అగ్నిజ్వాలలుప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ తీరుతో గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు మండిపోతున్నాయి. అక్కడ చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలకు రక్షణగా తమ బలగాలను పంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మామిడిపండ్లను నేరుగా తినేస్తున్నారా..? హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ పండ్లను తినేమందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడటమే గాక శరీర ఉష్ణోగ్రతన నియంత్రించి, జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. ఈ మామిడిలో విటమిన్లు ఏ,సీల తోపాటు, పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి శక్తి కేంద్రం అయినప్పటికీ..పచ్చి రూపంలో కొన్ని జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పండు మన జీర్ణక్రియకు సురక్షితమైనదిగా ఉండాలంటే..ఈ సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గించేలా నీటిలో అరగంటపాటు నానబెట్టక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా చూద్దామా..!.ఫైటిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం: మామిడి పండ్లను నానబెట్టమని సిఫార్సు చేయడానికి ప్రాథమిక శాస్త్రీయ కారణం ఫైటిక్ ఆమ్లం ఉండటమే. ఫైటిక్ ఆమ్లం అనేది వివిధ మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఒక సహజ పదార్ధం. ఇది ఫాస్ఫరస్ను నిల్వ చేసే రూపంగా పనిచేస్తుంది. పోషకాహార శాస్త్ర ప్రకారం..ఖనిజాల జీవ లభ్యతపై దాని ప్రభావం కారణంగా దీనిని తరచుగా "పోషక విరోధి"గా వర్గీకరిస్తారు.జీర్ణవ్యవస్థలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన ఖనిజాలతో బంధం ఏర్పరచుకోవడానికి ఫైటిక్ ఆమ్లానికి అధిక అనుబంధం ఉంటుంది. ఈ ఖనిజాలు ఫైటిక్ ఆమ్లంతో బంధం ఏర్పరచుకున్నప్పుడు, అవి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి. అయితే వీటిని మానవ శరీరంలోని చిన్న ప్రేగు గ్రహించలేదు. అందువల్ల ఈ మామిడి పండ్లను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల, వాటిలోని అదనపు ఫైటిక్ ఆమ్లం కరిగిపోవడం లేదా విచ్ఛిన్నం కావడం జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ "యాక్టివేషన్" ప్రక్రియ కారణంగా పండులోని సూక్ష్మపోషకాల పూర్తి పోషక విలువను సులభంగా పొందగలమని చెబుతున్నారు.మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం..జీర్ణవ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే అధికంగా ఉండే ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎప్పుడైతే సుమారు 30 నిమిసాలు నానబెడతామో అప్పుడు ఈ పోషక వ్యతిరేక పదార్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా పండు మంచి పోషకవంతమైనదిగా, అలాగే జీర్ణవ్యవస్థకు సులభంగా జీర్ణమయ్యేదిగా మారుతుంది.ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా..మామిడిలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే జీవక్రియ వేడిని పెంచడానికి దారితీస్తుంది. శరీరంలో అంతర్గత వేడి చర్మంపై ప్రభావం చూపి దద్దుర్లు, మొటిమలు లేదా వేడి కురుపులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో ఇవి సాధారణంగా కనిపించే సమస్యలు. ఈ వేడి కారణంగా కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అంటున్నారు. మనం ఎప్పుడైతే మామిడి పండుని నీటిలో నానబెడతామో అప్పుడు దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. మానవ శరీర అంతర్గత వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే పేగులు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.రసాయన అవశేషాల నిర్మూలనఈ మామిడి పండ్లు పండించేందుకు కృత్రిమ పురుగుల మందులు, శిలీంధ్రనాశకాలు వంటివి అధికంగా వినియోగిస్తారు రైతులు. అంతేగాక పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. ఫలితంగా రవాణ సమయంలో పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా చేయడమేగాక, నిల్వ కాలాన్ని పొడిగిస్తాయి. అలాగే వాణిజ్య మామిడి పండ్డు అందంగా కనిపించేలా పలుచటి మైనపు పొరను పూస్తారు కూడా. అందువల్ల ఇలాంటి మామిడిపండ్లను పారే నీటి కింద త్వరగా కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వంటి వాటి వల్ల ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే గాక సురక్షితమైన ఆహారంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇలా నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు లేదా లేటెక్స్ అనే రసం ఘాటు తొలిగిపోతుందట. ఈ రసం గనుక నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి చర్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!) -
13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ను చాటుకున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా 13 ఏళ్ల పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వాంఖడే వేదికగా నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో దుమురేపాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఓ భారీ వ్యక్తిగత రికార్డు నెలకొల్పాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల (7) రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 6 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదీ 13 ఏళ్ల కిందట తొలిసారి ఈ ఫీట్ను సాధించాడు. 2013 ఎడిషన్లో ఇదే వాంఖడే వేదికగా పంజాబ్పై సిక్సర్ల సిక్సర్ కొట్టాడు. ఆతర్వాత 3 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో రెండు సెంచరీలు చేసినా, వాటిలోనూ తలా ఐదు సిక్సర్లు మాత్రమే బాదాడు.తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో రోహిత్ అలవోకగా సిక్సర్లు బాదుతుంటే చూడముచ్చటగా ఉండింది. వింటేజ్ రోహిత్ శర్మను గుర్తు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సహచర ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 143 పరుగులు జోడించి, గెలుపుకు బలమైన పునాది వేశాడు.రోహిత్-రికెల్టన్ వీరవిహారం చేయడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సునాయాసంగా (మరో 8 బంతులు మిగిలుండగానే) ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యధిక ఛేదనగానూ నిలిచింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ఉండే అవకాశం ఉంది. మే 10న జరిగే తదుపరి మ్యాచ్లో ముంబై ఆర్సీబీతో తలపడనుంది. ఆతర్వాతి మ్యాచ్ల్లో పంజాబ్, కేకేఆర్, రాజస్థాన్ జట్లను ఢీకొట్టాల్సి ఉంది. -
అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు. రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్బ్యాక్లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అలాంటప్పుడు ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా? ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి, మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్లో ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు తీర్చవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు. ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న విమర్శ ఉంది.ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది? టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది. చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అర్జున్ టెండుల్కర్ను ఎందుకు ఆడించట్లేదు?
గత రెండేళ్లుగా ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్. గతేడాది మెగా వేలంలో అతడి కోసం పోటీ పడి మరీ లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా లీగ్ చరిత్రలోనే అతడు అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు.బ్యాటర్గా, సారథిగా విఫలంఈ క్రమంలో పంత్కు లక్నో కెప్టెన్గా పగ్గాలు అప్పగించిన యాజమాన్యం.. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma) మాదిరి ఐపీఎల్లో దిగ్గజ సారథి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, పంత్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలోనూ విఫలమవుతున్నాడు.గతేడాది 13 ఇన్నింగ్స్ ఆడిన పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. కెప్టెన్గా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ ఏడాది లక్నో పరిస్థితి ఇంకా దిగజారింది. ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది లక్నో. ముంబై ఇండియన్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడి ఏడో పరాజయాన్ని నమోదు చేసింది.High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026వ్యూహాత్మకంగా వ్యవహరించాలిఈ నేపథ్యంలో పంత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ... ‘‘పంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నాడు. ముంబైతో మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.అర్జున్ టెండుల్కర్ను ఎందుకు ఆడించట్లేదు?ఎందుకంటే అతడు యార్కర్లు సంధించడంలో సఫలమయ్యాడు. అతడు ఒక్కడే రాణించగలిగాడు. కెప్టెన్గా పంత్ మిగతా బౌలర్లనూ అదే ఫార్ములా పాటించమని చెప్పాలి. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చూశాను.. అందులో అర్జున్ టెండుల్కర్ నెట్స్లో మంచిగా యార్కర్లు వేస్తున్నాడు.కాబట్టి పంత్ అతడిని తుదిజట్టులో ఆడిస్తే బాగుండేది’’ అని మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. ఇక గతంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా.. పంత్ ధోని, రోహిత్ అంతటి వాడు కావాలని ఆశించిన విషయం ప్రస్తావనకు రాగా.. ‘‘ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కెప్టెన్లుగా చాలా భిన్నమైనవారు. వారితో పోలిక సరికాదు’’ అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండుల్కర్ను లక్నో ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను ఇప్పటి వరకు బెంచ్కే పరిమితం చేసింది లక్నో నాయకత్వ బృందం. ఇప్పటి వరకు ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చదవండి: జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ -
విడుదలకు సిద్ధమైన 'కృష్ణావతారం పార్ట్ 1'
'కృష్ణావతారంపార్ట్ 1' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారం(మే 07) థియేటర్లలోకి రానుంది. అత్యంత మహత్తరమైన దివ్యగాథతో తీసిన ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా సత్యభామగా సంస్కృతి జయన నటించారు. రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసి కృష్ణన్ కనిపించబోతున్నారు.హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సజన్ రాజ్ కురుప్, శోభాసాంత్, పూనం ష్రాఫ్, పార్థ్ గజ్జర్ నిర్మాతలుగా వ్యవహరించారు. నిర్మాతరాజ్ కురుప్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఆశయంతో పాటు బాధ్యతని మోసుకుని వస్తోంది. మనం లోతైన సాంస్కృతిక జ్ఞాపకాలలో ఉన్న కథని చెబుతున్నప్పటికీ, దాన్ని ఎంతో ఆత్మీయమైన మానవీయకోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. కృష్ణుడి ప్రయాణాన్ని సత్యభామ కళ్ల ద్వారా అనుభవించి ప్రేక్షకులు బయటకు వస్తే ఈ మూవీకి మేము న్యాయం చేసినట్టే' అని చెప్పుకొచ్చారు. ఈ కథ సత్యభామ కళ్ల ద్వారా ఆవిష్కృతమవుతూ కృష్ణుడి ప్రయాణం, అతని సంబంధాలు, భావోద్వేగ ప్రపంచాన్ని ప్రేక్షకులకు కొత్తగా, ఆత్మీయంగా చూపిస్తుంది. -
బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ, రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతను మేళవిస్తూ.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ సమాచారం.మోదీ చెప్పినట్లే..మే 9న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్పూర్లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్లో నిర్మిస్తామని అన్నారు.అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభంబెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు (మే 5) ఢిల్లీ నుంచి కోల్కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆమెను కోరనున్నారు.బెంగాలీల మనోభావాలకు పెద్దపీటమే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. బెంగాలీలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ‘పొచిషే బోయిశాఖ్’ (రవీంద్ర జయంతి) రోజున ప్రమాణస్వీకారం చేయడం ద్వారా స్థానికుల మనోభావాలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఠాగూర్ జయంతి బెంగాల్లో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో భాగం. నాలుగున్నర దశాబ్దాల వామపక్ష, టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ రాబోతున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది. -
సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకే ఇతర పార్టీలతో కీలక మంతనాలు జరుపుతోంది. మరోవైపు దారుణ పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ఓటమిపై స్పందించిన స్టాలిన్.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను ఇక మీదట డీఎంకే సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఘోర ఓటమి పాలైంది. కేవలం 59 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కొలతూర్లో డీఎంకే అధినేత స్టాలిన్ సహా మంత్రులంతా దాదాపుగా ఓటమి పాలయ్యారు. చెపాక్లో డిప్యూటీ సీఎం, ఆయన తనయుడు ఉదయనిధి మాత్రం నెగ్గారు. ఇవాళ స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరగనుంది. ఓటమిపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా స్టాలిన్ తనయుడు ఉదయనిధిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో)
చైనాలోని జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్లోని ఒక పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక రోబో అదుపుతప్పి.. విద్యార్థులను భయబ్రాంతులకు గురించి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విద్యార్థులను అలరించడానికి ఏర్పాటు చేసిన రోబో అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆ తరువాత అక్కడున్న ప్రదర్శనకారులపై కుంగ్-ఫూ కిక్లు విసరడం ప్రారంభించింది. దిక్కుతోచని విధంగా.. అడ్డదిడ్డంగా పరుగులు పెట్టింది. మైదానంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.పరిస్థితిని అర్థం చేసుకుని, దానిని కంట్రోల్ చేసే వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రోబోట్ను పట్టుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే మైదానంలోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.ఇదే మొదటిసారి కాదురోబోలు తడబడటం ఇదే మొదటిసారి కాదు. 2026 మార్చి నెలలో.. చైనాలోని షాన్సీ ప్రావిన్స్లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.Reported on Telegram 🤣The robot went berserk and almost attacked the dancers at a festival in China: the Unitree android malfunctioned severely and started swinging its "iron" in the style of Bruce LeeFortunately, it was quickly shut down — a full-blown "fight" didn't… pic.twitter.com/FH38FFrjZV— Beefeater (@Beefeater_Fella) May 3, 2026రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుంటే.. ప్రజలకు ఇబ్బంది, తద్వారా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం
కేరళలో అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతోంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా
పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన బాధితురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్న దేబ్నాథ్ (Ratna Debnath) అద్భుత విజయాన్ని సాధించారు. కన్నబిడ్డను అత్యంత దారుణ పరిస్థితుల్లో కోల్పోయిన ఆమె తన తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి అడుగుపెట్ట బోతున్నారు. న్యాయకోసం సాగిన పోరులో జనం ఆమెకు అండగా నిలబడ్డారు. దీంతో పానిహాటిలో రత్నమ్మ అఖండ విజయాన్ని అందుకున్నారు. కన్నీటి గాథ నుంచి విజయ తీరాలకు చేరిన ఆమె ప్రస్థానం బెంగాల్ గడ్డపై ప్రత్యేకంగా నిలుస్తుంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసిన రత్నా దేబ్నాథ్ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదీ అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న TMC అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై గెలవడం విశేషం. అయితే ఆమె పొలిటిక్ ఎంట్రీ మాత్రం ఒక విషాదం తరువాత జరిగింది. కానీ తనబిడ్డకు జరిగిన అన్యాయంపై పోరుచేసి విజయాన్ని అందుకున్న అమ్మగా ఆమె చరిత్రలో నిలిచిపోతారు.ఆమె పొలిటికల్ ఎంట్రీ2024 ఆగస్టులో తన కుమార్తెపై జరిగిన అమానుష ఘటన తర్వాత,తన కుమార్తెకున్యాయం జరగాలనే డిమాండ్తో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మహిళల రక్షణ , జవాబుదారీతనం ప్రధాన ఎజెండాగా ఆమె ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం జరిగిన పోరాటానికి ప్రజలు పట్టం కట్టారని, బాధితురాలి తల్లి విజయం అత్యంత కీలకమైనదని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా ఆగస్టు 9 న నార్త్ కోల్కతాలోని ఆర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. వైద్యురాలిపై ఆస్పత్రిలోనే అతికిరాతంగా అత్యాచారం చేసి హతమార్చిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అప్పటి మమతా సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పెద్ద ఎత్తు నిరసనలు చెలరేగాయి. నిరసనల వెనుక బీజేపీ, సీపీఐ(ఎం) కుట్రలు ఉన్నాయని, రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం, ఉద్యమకారులపై దాడి చేయించడం, సాక్ష్యాలను నాశనం చేయడం, పోలీసులు, ఇతర అధికారులు తీరును సమర్ధించడంపై ఆగ్రహం పెల్లుబుకింది. ఒక విధంగా ఈ ఘటనలో నేరస్తులకు వత్తాసు పలకడమే అటు మమతా బెనర్జీకి, ఇటు టీఎంసీ పతనానికి పునాది వేసిందని విశ్లేషకుల అంచనా.రేఖా పాత్రమరోవైపు 2024 ప్రారంభంలో బెంగాల్లోని సందేశ్ఖాలీలో TMC నేతలు షాజహాన్ షేక్, అతని అనుచరులు, భూములను లాక్కున్నారని , మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలతో గ్రామీణ మహిళలు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. వీరిపైనా కూడా దీదీ ఉక్కుపాదం మోపారు. ఈ సందేశ్ఖాలీ నిరసనల్లో కీలక ముఖచిత్రంగా నిలిచిన రేఖా పాత్ర కూడా బీజేపీ తరపున హింగల్గంజ్ నుంచి విజయం సాధించారు. ఆమె 5,421 ఓట్ల మెజారిటీతో తృణమూల్ అభ్యర్థి ఆనంద సర్కార్ను ఓడించారు. గతంలో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఈసారి హింగల్గంజ్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.కాగా బీజేపీ బెంగాల్లో 294 స్థానాలకు గాను 202 స్థానాలను కైవసం చేసుకుంది. భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిజెపి నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విజయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్ -
చరిత్ర సృష్టించకపోగా.. నవ్వుల పాలయ్యారు!
ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!.. పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు. పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన. కట్ చేస్తే.. పూన్జార్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు. 2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!. -
నెలరోజుల క్రితం సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం
మలయాళ ఇండస్ట్రీలో విషాదం. ప్రముఖ నటుడు సంతోష్(66).. రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మంగళవారం ఉదయం కేరళలోని పతనంతిట్ట దగ్గర ఈ సంఘటన జరగ్గా.. సంతోష్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యాన్ని ఢీ కొట్టడంతో ఈయన అక్కడిక్కడే ప్రాణాలు వదిలేయగా, ఇతడి భార్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సంతోష్ మరణవార్త తెలుసుకున్న స్టార్ హీరో మోహన్లాల్ బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి)1960లో పుట్టిన సంతోష్ కేశవన్ నాయర్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. కాలేజీలో మోహన్లాల్కి ఈయన జూనియర్. ఆ టైంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న సంతోష్.. తన అక్కాచెల్లెల్లు వైద్యవృత్తిని ఎంచుకుంటే ఈయన మాత్రం నటుడు అయ్యారు. 1982లో విడుదలైన 'ఇతు నాన్గులడే' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. 100కి పైగా సినిమాల్లో విలనీ, కామెడీ తరహా పాత్రలు చేశారు.గత నెల 10వ తేదీన విడుదలైన 'భరతనాట్యం 2 మోహినీయాట్టం' సినిమాలోనూ నటించారు. ఈ శుక్రవారమే ఇది ఓటీటీలోకి కూడా రానుంది. ఇంతలోనే సంతోష్.. రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడంతో మలయాళ నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?) -
గవర్నర్కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్భవన్కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్ ఆర్.ఎన్. రవికి లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్ని స్పెషల్గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ
ఐపీఎల్లో పద్నాలుగేళ్లకే సంచలనాలు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో గుజరాత్పై) నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఐపీఎల్-2026 సందర్భంగా తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) వైభవం ఇలా ఉంటే.. రఘు శర్మ (Raghu Sharma)ది మరో కథ.33 ఏళ్ల వయసులో...పంజాబ్కు చెందిన లెగ్ స్పిన్నర్ రఘు శర్మ. అతడి వయసు ఇప్పుడు 33 ఏళ్లు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఐపీఎల్లో అరంగేట్రం కోసం అతడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చింది. రఘును తొలుత నెట్బౌలర్గా చేర్చుకున్న ముంబై ఇండియన్స్.. గతేడాది వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అరంగేట్ర మ్యాచ్లో అలాకానీ.. 2025లో రఘు శర్మకే బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఎట్టకేలకు అతడిని ముంబై యాజమాన్యం కరుణించింది. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా రఘు ముంబై తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్లో పూర్తి నాలుగు ఓవర్ల కోటా వేసిన రఘు శర్మ.. 24 పరుగులే ఇచ్చాడు.ఇప్పుడిలా..పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ చెన్నైతో మ్యాచ్లో రఘు వికెట్లు తీయలేకపోయాడు. అయితే, తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మాత్రం అతడి కల నెరవేరింది. లక్నో అరంగేట్ర బ్యాటర్ అక్షత్ రఘువన్షి (11) రూపంలో రఘు శర్మ ఐపీఎల్లో తన తొలి వికెట్ తీశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. #RaghuSharma makes a statement with that wicket 🔥Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg— Star Sports (@StarSportsIndia) May 4, 2026ఈ నేపథ్యంలో రఘు శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, దూకుడుగా సెలబ్రేట్ చేసుకోకుండా.. తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి డ్రెసింగ్రూమ్ వైపు చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. అందులో..ఆ బాధ నేటితో తీరిపోయింది‘‘రాధే రాధే. గత పదిహేనేళ్లు ఎంతో బాధగా గడిచాయి. అయితే, ఆ గురుదేవుడి దయ వల్ల ఆ బాధ నేటితో తీరిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్కు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. జై శ్రీరామ్’’ అని రఘు శర్మ రాశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో సోమవారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సీజన్లో పదింట తమ మూడో విజయాన్ని నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్! -
బెంగాల్లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్
పశ్చిమ బెంగాల్లో ఒక సాధారణ మహిళ అనూహ్య విజయం సాధించారు. దీదీ సర్కార్కు ఝలక్ ఇచ్చి బీజేపీ సాధించిన ప్రభంజనంలో గుస్కారాకు చెందిన గృహ కార్మికురాలు కలితా మాఝీ(37) విజయం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. గతంలో గృహ కార్మికురాలిగా పనిచేసిన కలితా మాఝీ, ఆస్గ్రామ్ నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించడం విశేషంగా నిలుస్తోంది.కలితా మాఝీ వంటి సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ ప్రజలకు చేరువయ్యింది. పార్టీ లోతైన సంస్థాగత నిర్మాణం, ఓటర్లను ఆకట్టుకోవడం దీదీ ఇలాకాలో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇంటి పనిమనిషిగా నెలకు రూ.2,500 సంపాదించే కలితా మాఝీ బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా అవతరించారు. తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు వచ్చాయి. ఇది సిండ్రెల్లా స్టోరీ కాదు ఇది కలితా 'హిస్టరీ. పనిమనిషి నుంచి శాసనసభ వరకు ఎదిగిన ఆమె తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తి.ఇదీ చదవండి: బెంగాల్ పోరులో ఒక సెన్సేషన్ కలితా మాఝీకాగా రాష్ట్రంలో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. -
'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?
చిన్న సినిమాలు అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిపోతుంటాయి. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా గతేడాది వచ్చిన వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. తెలంగాణలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంతో సాయిలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలో మెప్పించాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన అఖిల్ రాజ్, తేజస్వి కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో తానే హీరోగా చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల వదిలేశానని 'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నా. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని అన్నతో చెప్పా. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా తీశాడు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా ప్రెజెంట్ చేశాడు'యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్తో నటుడిగా మారిన సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడు, నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'గోదారి గట్టుపైన' మూవీ చేశాడు. ఇది ఈ శుక్రవారం(మే 08) ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకి తగ్గట్లే గోదావరి బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. దీని ప్రమోషన్లలో భాగంగానే సుమంత్ ప్రభాస్.. 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో అవకాశం వదులుకున్న సంగతి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి) -
విజయ్ అప్పటి నుంచే మారిపోయాడు!
తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ పూర్తి పేరు... జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. సినిమాల్లో రాణించి అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో.. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం, సోదరి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.అన్నయ్య చేతుల్లోనే..తన చెల్లి విద్య చిన్న వయస్సులోనే మరణించడం విజయ్పై తీవ్ర ప్రభావం చూపింది. 1980లో జన్మించిన విద్య సుమారు నాలుగేళ్ల వయసులో 1984 మే 20వ తేదీన ఆనారోగ్యంతో మరణించారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ 'ఎనక్కుల్ నానే నీధిపతి' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యా విజయ్.. తన అన్నయ్య చేతుల్లోనే ప్రాణాలు విడిచారని.. ఆ సంఘటన విజయ్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.ఈ విషాదం జరగక ముందు..ఈ విషాదం జరగక ముందు.. దళపతి విజయ్ ఎంతో చురుకుగా.. అల్లరి చేస్తూ.. అతిగా మాట్లాడే బాలుడిగా ఉండేవారు. కానీ విద్యా విజయ్ మరణం తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఆయన అంతర్ముఖుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఆయన బహిరంగ ప్రదేశాల్లో కనిపించే శాంత స్వభావానికి ఆనాటి ఆ ఘటనే కారణమని చెబుతుంటారు. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎంతో ఆప్యాయంగా విద్యకు తనే స్నానం చేయించి అన్నం కూడా తినిపించేవాడు. చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా..గతంలో ఓ కార్యక్రమంలో తన చెల్లెలు విద్య గురించి విజయ్ మాట్లాడుతూ.. తన జీవితంలో చెల్లెలు మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైందన్నారు.. కానీ ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడంటూ.. వారందరిలో తన చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటానని తెలిపారు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని నామకరణం చేశారు.విజయ్ కార్ నంబర్ వెనుక రహస్యంవిజయ్ తన కార్లకు 0277 అనే ప్రత్యేక నంబర్ను వాడుతుంటారు. ఈ నంబర్ తన సోదరి విద్యాకు అంకితం చేశారు. 14-02-77 అనేది ఆమె పుట్టిన తేదీ. తన సోదరిపై ఉన్న ప్రేమతో విజయ్ ఇప్పటికీ ఆ నంబర్ను వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నారు.తండ్రిపై విజయ్ కేసు..కాగా, గతంలో విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టిన సంగతి కూడా అభిమానులు గుర్తుకుచేసుకుంటున్నారు. 2020లో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎస్.ఎ.చంద్రశేఖర్, ట్రెజరర్గా శోభా చంద్రశేఖర్ వ్యవహరించారు. అయిత.. తన తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తండ్రి స్థాపించిన ఆ పార్టీకి తన పేరుని ఉపయోగించుకుంటే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనంగా మారింది. -
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!
పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..
న్యూఢిల్లీ: వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా ఇప్పుడు రాజకీయ రణరంగంలో కూడా ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబం సంచలనం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. ఒకే ఇంట్లో మూడు వేర్వేరు రాజకీయ జెండాలు ఎగరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.అల్లుడి అదుర్స్.. టీవీకే నుంచి ఘన విజయంమార్టిన్ అల్లుడు (కూతురు డైసీ భర్త), నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ సీనియర్ నేత అయిన ఆధవ్ అర్జున రెడ్డి విల్లివాక్కం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల బరిలో తన సమీప ప్రత్యర్థిపై 17,302 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు.అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ గెలుపుమరోవైపు శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్ కూడా తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే టికెట్పై పోటీ చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆమె సుమారు 2,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.పుదుచ్చేరిలో సత్తా చాటిన జోస్పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి 10,205 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. ఆయన గతేడాది స్థాపించిన ‘లక్ష్య జననాయక కట్చి’ (ఎన్డీయే మిత్రపక్షం) తరపున పోటీ చేసి ఈ గెలుపును నమోదు చేశారు. దాదాపు రూ.15,000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న మార్టిన్ గ్రూప్.. ఎన్నికల బాండ్ల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు సుమారు రూ.1,300 కోట్లు విరాళంగా ఇచ్చి, గతంలో ఈడీ విచారణను సైతం ఎదుర్కోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
అదృష్టం ఉండాలి.. వాళ్లను తప్పుబట్టను: పంత్
లక్నో సూపర్ జెయింట్స్ రాత మారలేదు. ముంబై ఇండియన్స్తో సోమవారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. తద్వారా ఐపీఎల్-2026లో వరుసగా ఆరో (డబుల్ హ్యాట్రిక్) ఓటమి నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారుఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము శుభారంభం అందుకున్నాం. అయితే, అదే ఆట తీరు కొనసాగించి మరికొన్ని పరుగులు రాబడితే ఇంకా బాగుండేది. ఈ మ్యాచ్లో మాకూ సానుకూలాంశాలు ఉన్నాయి.కానీ అవేంటో ఇప్పుడు చెప్పలేను. మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారు. అయితే, ఆఖర్లో ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సొంతమైదానం కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితులకు వాళ్లు బాగా అలవాటు పడ్డారు. ముందుగా చెప్పినట్లు మేము ఇంకో 10-15 పరుగులు చేసి ఉంటే బాగుండేది.వారిని తప్పుపట్టలేనుఈ వికెట్ మీద 220-230 పరుగులు చేయడం కాస్త సులువే. ఆరంభంలో మాదే పైచేయిగా ఉంది. బౌలర్లను ఓటమికి బాధ్యులను చేయలేను. వారిని తప్పుపట్టలేను. మా బౌలర్లు అత్యద్భుతంగా బౌల్ చేశారు’’ అని పంత్ పేర్కొన్నాడు.అదృష్టం కావాలయ్యా!ఈ క్రమంలో..‘బాగానే ఆడుతున్నారు. అయినా ఓడిపోతున్నారు. మీ జట్టుకు ఇంకేం కావాలి?’ అని హోస్ట్ అడుగగా.. ‘‘మాకు కొంచెం అదృష్టం కావాలయ్యా!.. అదొక్కటే నేను ఇప్పుడు చెప్పగలను’’ అని పంత్ సమాధానం ఇచ్చాడు. ‘ఎలాంటి అదృష్టం?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘మాకు ఆశీర్వాదాలు కావాలి. మేము ఇంకాస్త పట్టుదలగా ముందుకు సాగాలి’’ అని పంత్ బదులిచ్చాడు.పూరన్ బ్యాట్ ఝులిపించినా..కాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. నికోలస్ పూరన్ విధ్వంసకర అర్ధ శతకం (21 బంతుల్లో 63)తో మెరవగా.. మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) తమ వంతు సాయం అందించారు. ఇక పంత్ 15 పరుగులే చేశాడు.High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026అయితే, ముంబై ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83), రోహిత్ శర్మ (44 బంతుల్లో 84) ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నోకు షాకిచ్చారు. వీరిద్దరితో పాటు నమన్ ధిర్ (12 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వాంఖడేలో ఈ సీజన్లోవరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్! -
శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారు కానీ.., : రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. మొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన ఆయన..ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ మూవీలో శర్వానంద్ తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి.శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్..రాజశేఖర్, జీవితలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. `తలంబ్రాలు`(1986) సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే జీవిత కంటే ముందు శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్ వచ్చిందని గతంలో ఓ న్యూస్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పాడు. ఇదే విషయాన్ని తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గుర్తు చేసింది. ‘జీవిత కంటే ముందు శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందట కదా.. నిజమేనా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నిజమే. శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె మన మధ్య లేరు. అందుకే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదు. వదిలేద్దాం’ అని రాజశేఖర్ చెప్పాడు.ఆర్టిస్ట్ అని శ్రీదేవిని రిజెక్ట్ చేశారుఅయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో రాజశేఖర్ వివరించాడు. ‘శ్రీదేవి నాన్నతో మా నాన్నకు మంచి స్నేహబంధం ఉండేది. కులం కూడా ఒకటే. దూరపు బంధువులు అవుతారు. అందుకే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి నాకు పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అప్పటికీ నేను సినిమాల్లోకి రాలేదు. ఎంఎస్ చదవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మా నాన్న వాళ్లకు పెళ్లి.. వారి ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు. సినిమాల్లో నటించేవాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ని పక్కన పెట్టారు’ అని రాజశేఖర్ అన్నారు. -
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ యూనియన్ సభ్యుల కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపుర్మెట్ దగ్గర డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1940ల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్. ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం.(ఇదీ చదవండి: విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!) -
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్షిప్లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 243.41 పాయింట్ల నష్టంతో 77,025.99 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్ల నష్టంతో 24,029.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్, డైనాకాన్స్ సిస్టమ్స్ & సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అవ్రో ఇండియా లిమిటెడ్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్ లిమిటెడ్, నాథ్ బయో-జీన్స్ (ఇండియా) లిమిటెడ్, డి నోరా ఇండియా లిమిటెడ్, జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల్లో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
వైట్హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: వైట్హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వాషింగ్టన్ మాన్యూమెంట్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్చల్ చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను చూసిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడ్డాడు.తుపాకీ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందు.. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల గస్తీ తిరుగుతున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు,ఏజెంట్లు తుపాకీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారని యూఎస్ఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ మీడియా సమావేశంలో చెప్పారు. యూనిఫాంలో ఉన్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఆ వ్యక్తిని సమీపించగా.. అతను పారిపోతూ అధికారులపై కాల్పులు జరిపారని క్విన్ తెలిపారు. అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఆ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.సదరు వ్యక్తి అంతకుముందు సోమవారం వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు మేరీల్యాండ్కు చెందిన శ్వేత జాతీయుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయంతో బయటపడ్డారని డీసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ ప్రాంతం మీదగా వెళ్ళింది.కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని ఈస్ట్ రూమ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అధ్యక్షుడు ట్రంప్కు ఎలాంటి ముప్పు లేదని.. ఈ ఘటనకు వైట్ హౌస్తో సంబంధం ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని క్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పుల ఘటన జరిగిన రెండు వారాల లోపే ఈ రెండో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్డేట్స్ఇతర పార్టీలతో టీవీకే చర్చలురేపు గవర్నర్ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలుతమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్ భేటీ ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం? టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నికఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్తెరపైకి రిసార్ట్ రాజకీయంతమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్ రాజకీయంమల్లాపురంలోకి రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపుప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బసమరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకేవెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపుసమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్విజయ్ విక్టరీపై ప్రేమలత విజయ్కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలువిజయ్ మా బిడ్డలాంటోడుఅందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదుమొదటి నుంచి ఆయన కెప్టెన్(విజయ్కాంత్)తో ఉన్నారువిజయ్ చక్కగా పాలించాలితమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకేటీవీకే ఫ్లోర్ లీడర్గా విజయ్!టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్ భేటీఫ్లోర్ లీడర్గా విజయ్ ఎన్నికఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చతమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేకీలకంగా మారిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలువిజయ్ వదులుకునేది ఆ స్థానాన్నే?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయంపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయంరెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితితిరుచ్చి ఈస్ట్ను వదులుకునే యోచనలో విజయ్?విజయ్ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠటీవీకే ఆఫీస్లో విజయ్తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే108 స్థానాల్లో విజయ్ పార్టీ విక్టరీపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్లో విజయ్ భేటీ (106+విజయ్+విజయ్)ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభంఇవాళ అన్నాడీంకే కీలక సమావేశంతమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేనేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశంగెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపుటీవీకే కీలక ప్రకటనప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకేఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలుఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్యఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశంకొనసాగుతున్న టీవీకే కీలక సమావేశంఎమ్మెల్యేలతో విజయ్ భేటీమరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్స్టాలిన్ రాజీనామాతమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామారాజీనామా లేఖను గవర్నర్కు పంపిన డీఎంకే అధినేతఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్ ప్రకటనప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడితమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికొలతూర్లో ఓడిన ఎంకే స్టాలిన్కాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం టీవీకే ఆఫీస్కు విజయ్టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశంశాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశంప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలుకాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్?ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాంతమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుతమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలుసీపీఐ రెండు, సీపీఎం 2ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తివిజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలుఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులుడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేఅధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలుకీలకంగా ఆ పార్టీలు?తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికేరెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరిన విజయ్ గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖకీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలుఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలుఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలుఏం తేలుస్తారో?టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడితమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులుఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్విజయ్ వెంట ఎవరెవరు?ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయంలార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేమ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంవిజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠఅన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలునేడు గవర్నర్ను కలవనున్న విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి!తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకేమరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంకొళత్తూర్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్చెపాక్లో తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ విజయంప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్కాంగ్రెస్తో సెంగోట్టయన్ చర్చలు!తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలువిజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీకాంగ్రెస్తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలుఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్లోక్భవన్కు విజయ్?తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకేసమావేశం తర్వాత నేరుగా లోక్భవన్కు దళపతి?ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకేతమిళనాడులో హంగ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువ!ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠనేడు టీవీకే కీలక సమావేశంవిజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశంనెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశంఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్విజయ్ నివాసం వద్ద కోలాహలంచెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలంభారీగా పోలీసు భద్రత ఏర్పాటువిజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులుమరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులువిజయ్కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువటీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలుమొదలైన సంప్రదింపులుతమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలుఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులుఅందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపీఎంకే నుంచి మరో నలుగురువామపక్షాల సంఖ్య 2,ఐయూఎంఎల్ 2విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చమరో 10 సీట్ల దూరంలో.. ఉత్కంఠగా తమిళనాడు రాజకీయంసింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయండీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరంపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..ఓటమిపై స్పందించిన స్టాలిన్ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేతకొలతూర్లో స్టాలిన్ ఓటమిస్టాలిన్ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్ను ఎద్దేవా చేసిన బాబువిజయహో..మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళండీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకేతొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్డీఎంకే కూటమి దారుణ ఓటమిడీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమిమొత్తం మంత్రులంతా ఓటమిమూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమిమ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్ -
తన పరువు తానే తీసుకున్న బాబర్ ఆజం!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం కల ఎట్టకేలకు నెరవేరింది. అతడి సారథ్యంలో పెషావర్ జెల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2026 టైటిల్ గెలిచింది. హైదరాబాద్ కింగ్స్మెన్తో ఆదివారం జరిగిన పోరులో పెషావర్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా తొలిసారి పీఎస్ఎల్లో చాంపియన్గా అవతరించింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam).. ఈ మ్యాచ్లో మాత్రం గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. రాణించిన ఆరోన్ హార్డీఅయినప్పటికీ హైదరాబాద్ విధించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పెషావర్ విజయవంతంగా ఛేదించింది. ఆరోన్ హార్డీ (39 బంతుల్లో 56 నాటౌట్), అబ్దుల్ సమద్ (34 బంతుల్లో 48) రాణించి జట్టును గెలిపించారు.దీంతో తొలిసారి పీఎస్ఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో బాబర్ ఆజం ఎగిరి గంతేశాడు. ముఖ్యంగా ట్రోఫీ అందుకునే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ శైలిని అనుకరించబోయి నెటిజన్ల చేతికి చిక్కాడు. రోబో మాదిరి నడిచి వెళ్లి..కాగా 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపిన సారథి రోహిత్.. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లి ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు బాబర్ కూడా అదే స్టైల్లో వెళ్లి ట్రోఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోబో మాదిరి కాకుండా వెనుక నుంచి ఎవరో తరిమినట్లుగా చిన్న పిల్లాడిలా పరిగెత్తుకు వచ్చి ట్రోఫీ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Babar Azam tried to copy Rohit Sharma’s ICC Men's T20 World Cup celebration but turned a legendary moment into a meme 😭😭😭 pic.twitter.com/xrxjxsRI55— Ankur (@flick_class) May 4, 2026రోహిత్ను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడుదీంతో.. ‘‘రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడు. మీమర్లకు పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు’’ అంటూ బాబర్ ఆజంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. పదకొండు మ్యాచ్లలో కలిపి 588 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్లో పీఎస్ఎల్ మ్యాచ్లు నిర్వహించింది. ప్లే ఆఫ్స్నకు ప్రేక్షకులను అనుమతించినా ప్రజా రవాణా ద్వారానే స్టేడియానికి చేరుకోవాలనే షరతు పెట్టింది. ఏదేమైనా మరోసారి ఐపీఎల్కు పోటీగా వచ్చి బొక్కబోర్లా పడింది. కాగా మార్చి 26 నుంచి మే 3 వరకు పీఎస్ఎల్ తాజా ఎడిషన్ నడించింది.చదవండి: ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..! -
బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం
కోల్కతా: మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం.. ఇలాంటి పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇస్తూ, బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలు కాదు.. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం! షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.షేక్ హసీనా పతనం తర్వాత..డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి నిరసనగా కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు, సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులపై మమతా బెనర్జీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీదీ ప్రభుత్వం కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మాత్రమే కొమ్ముకాస్తోందని, బెంగాల్ హిందువుల పక్షాన నిలబడలేదనే వాదనను ఆ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.అక్రమ చొరబాటుదారులపై బీజేపీ అస్త్రంబంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్, ఈసారి ఆ ప్రభావానికి లోనైంది.గేమ్ ఛేంజర్గా ‘మతువా’ ఓటుబ్యాంక్ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది ‘మతువా’ సామాజిక వర్గం. 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆవిర్భవించిన ఈ వర్గానికి బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో బలమైన పట్టుంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు స్థానికులను బీజేపీ వైపు నిలబడేలా చేశాయి. తాము మతపరమైన వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో, బీజేపీ మాత్రమే తమకు పౌరసత్వం కల్పిస్తుందన్న ఆశతో వారు బీజేపీ పక్షాన నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి -
టాటా కర్వ్ ఈవీ కొత్త మోడల్ లాంచ్
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, తన కర్వ్ ఈవీలో సరికొత్తగా ‘సిరీస్ ఎక్స్’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ.16.99 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ వద్ద) కంపెనీ నిర్ణయించింది.ఈ సిరీస్లో అకంప్లిష్డ్ ఎక్స్ 55, ఎంపవర్డ్ ఎక్స్ 55 అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. వీటిలోని 55 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రియల్ వరల్డ్ కండిషన్స్ లో ఈ బ్యాటరీ సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.లెవెల్-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, పానోరామిక్ సన్రూఫ్, హర్మాన్ సినిమాటిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీపై 15 ఏళ్ల (లైఫ్–టైమ్) హెచ్వీ బ్యాటరీ వారంటీని టాటా మోటార్స్ అందిస్తోంది.మిడ్-ఎస్యూవీ విభాగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సిరీస్ ఎక్స్’ శ్రేణి విడుదల చేసినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీసీఓ వివేక్ శ్రీవత్స తెలిపారు. ఈ కారు ఐదు ఆకర్షణీయమైన రంగులతో పాటు ఐకానిక్ ‘డార్క్’ ఎడిషన్లోనూ లభించనుంది. -
M4M: కిల్లర్ ఎవరో చెబితే లక్ష రూపాయల నగదు బహుమతి
జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన తారాగణంగా మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుడు వి. సముద్ర హాజరై, సినిమా హిట్టవ్వాలని కోరారు. ‘‘మా చిత్రానికి ఇప్పటికే 25 దేశాల్లో 50కిపైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు జో శర్మ. ‘‘ఈ మూవీలోని సీరియల్ కిల్లర్ ఎవరో ముందుగా చెప్పిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఉంటుంది’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. -
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ
గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్జోర్ దళ్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. మహిళా మంత్రి అజంతా నియోగ్ మొదలు పిజూశ్ హజారికా, రనోజ్ పెగూ దాకా హిమంత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి ప్రద్యూత్ బోర్డోలాయ్ సైతం దిస్పూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్ఠాకూర్ గోస్వామి కంటే ప్రద్యూత్ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జొర్హాట్ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో గొగోయ్ ఓడిపోయారు. జాగిరోడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్ హజారికా సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బుబుల్ దాస్పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్ అధ్యక్షుడు అతుల్ బోరా సోమవారం బోకాఖాట్లో రాయ్ జోర్ దళ్ అభ్యర్థి హరిప్రసాద్ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్ అభ్యర్థి రీజౌల్ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) నేత మొహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. సంబరాల్లో మునిగిన శ్రేణులు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్పేయీభవన్) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్మాతాకీ జై అని నినదించారు. పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్ బోరా ఏడుస్తూ చెప్పారు. -
నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్!
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఆట తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బుమ్రా వంటి ప్రపంచస్థాయి బౌలర్ ‘ఇలాంటి’ తప్పు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు. ఇంతకీ బూమ్ బూమ్ బుమ్రా ఏం చేశాడంటే?..ఐపీఎల్-2026లో ఏడు ఓటములతో దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన దశలో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై చెలరేగిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా ముంబై సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు లక్నోను బ్యాటింగ్కు ఆహ్వానించింది.చెలరేగిన నికోలస్ పూరన్ఎట్టకేలకు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63) చెలరేగడంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (44), ఐడెన్ మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) రాణించారు.రెండు నో బాల్స్ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వేళ బుమ్రా (Jasprit Bumrah) పద్నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికి మార్క్రమ్ సింగిల్ తీయగా.. రెండో బంతికి పరుగులేమీ రాలేదు.ఇక మూడో బంతికి హిమ్మత్ సింగ్కు సంధించగా.. అది నో బాల్ అయింది. ఆ తర్వాత బంతి వైడ్గా వెళ్లింది. ఆ వెంటనే బుమ్రా మళ్లీ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో బుమ్రా మొత్తంగా ఏడు పరుగులే ఇచ్చినప్పటికీ రెండు నోబాల్స్ వేయడం విమర్శలకు దారితీసింది.🎥 Wickets that didn't count, no-balls, and bat flying out of hands 👀The most eventful over of the season? 🤷♂️Updates ▶️ https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/4OQj5C9R49— IndianPremierLeague (@IPL) May 4, 2026గావస్కర్ ఫైర్ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ బుమ్రా ఆట తీరుపై మండిపడ్డాడు. ‘‘ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు. నువ్వొక ప్రొఫెషనల్ క్రికెటర్వి బుమ్రా. వైడ్లు వేస్తున్నావంటే అర్థం చేసుకోగలను. కానీ నో బాల్స్ వేయడమేంటి?’’ అని కామెంట్రీ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఈ మ్యాచ్లో బుమ్రా చెత్త ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఎట్టకేలకు ఓ విజయంఇక ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (84), రికెల్టన్ (83) చెలరేగడంతో లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆరు వికెట్లతో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ముంబైకి ఈ కీలక విజయం దక్కింది. మరోవైపు లక్నో వరుస ఓటముల్లో ‘సిక్సర్’ నమోదు చేసింది. వరుసగా ఆరో పరాజయంతో జట్టు అట్టడుగున పదో స్థానంలోనే ఉంది. చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్! -
ఆరు ఆప్షన్లు.. ఏది జరిగినా విజయ్ సర్కార్కు లైన్క్లియర్!
తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 52 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమిలో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 2, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 10 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి. రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.ఐదవ మార్గం.. రెయిన్బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
కేరళలో యూడీఎఫ్.. తదుపరి సీఎం ఇతనే?
తిరువనంతపురం: దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కేరళలో అధికారపీఠాన్ని కైవసంచేసుకుంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేరళలో గెలిచి కాంగ్రెస్ దక్షిణాదిన మూడో రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టబోతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరిన విషయం తెల్సిందే. కేరళలో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన వామపక్ష పారీ్టల సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి ఈసారి అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది. శబరిమల ఆలయ వివాదం మొదలు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల అవినీతి, ప్రభుత్వవ్యతిరేకత దాకా ఎన్నో అంశాలు అధికారకూటమి పుట్టిముంచాయి. దీంతో ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 చోట్ల గెలిచింది. కొన్ని జిల్లాల్లో ఎల్డీఎఫ్ పార్టీల అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. 50 ఏళ్ల తర్వాత దేశంలో..ప్రభుత్వ వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ ధాటికి ఐదేళ్లు మంత్రిపదవులు వెలగబెట్టిన వీణా జార్జ్, ఆర్ బిందు, కేబీ గణేశ్, వీఎన్ వాసనన్సహా 13 మంది నేతలు సోమవారంనాటి ఫలితాల్లో ఓటమిని చవిచూడకతప్పలేదు. 21 మంది కేబినెట్ మంత్రుల్లో ముఖ్యమంత్రి విజయన్, పీఏ మొహమ్మెద్ రియాస్, కె.రాజన్, జీఆర్ అనిల్, కేఎన్ బాలగోపాల్, పీ.ప్రసాద్, సాజి చెరియాన్ మాత్రం గెలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం స్థానంలో విజయం సాధించారు. సీపీఐ(ఎం) పార్టీలో అత్యధిక మంది అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్(ఎం) పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఎల్డీఎఫ్ కనీ్వనర్ టీపీ రామకృష్ణన్ సైతం తన సిట్టింగ్ స్థానం పెరాంబ్రలో ఓడిపోయారు. కేరళలో ఓటమితో వామపక్ష పారీ్టలు తొలిసారిగా 50 ఏళ్ల తర్వాత దేశంలో మరే రాష్ట్రంలోనూ అధికారంలోలేకుండా పోయాయి. ద్విముఖ పోరుగా తయారైన కేరళలో హిందూత్వ బీజేపీ తొలిసారిగా మూడుచోట్ల విజయం సాధించి పార్టీ విస్తరణకు ఉపక్రమించింది. తిరువనంతపురం కార్పోరేషన్ పరిధిలోని నిమోమ్, కళాకూట్టం నియోజకవర్గాలతోపాటు కొల్లం జిల్లాలోని ఛథనూర్లలో బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. కేరళ శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి వీడీ సతీశన్ పరవూర్ నియోజకవర్గంలో సీపీఐ నేత ఈటీ టైసన్ మాస్టర్పై 20,600 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి 17 రౌండ్లలో వెనుకబడిన సతీశన్ తర్వాత పుంజుకుని జయకేతనం ఎగరేశారు. 2001 నుంచి వరసబెట్టి ఇక్కడి నుంచే సతీశన్ గెలుస్తున్నారు. ఈయనకు ఇది ఐదో విజయం. ఈసారి ఎన్నికల్లో అన్ని పారీ్టల నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ అగ్రనేత సతీశన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగుపడ్డ ఓట్ల శాతం ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం బాగా మెరుగుపడింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ 28.79 శాతం ఓట్లను సాధించింది. తర్వాత సీపీఐ(ఎం) 21.77 శాతం ఓట్లను సాధించింది. తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) 11.01 శాతం ఓట్లు సాధించింది. అయితే స్థానిక ఎన్నికల్లో 15 శాతం ఓట్లను సాధించిన బీజేపీ తాజా ఫలితాల్లో కేవలం 11.42 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సీపీఐ 6.64 శాతం ఓట్లు సాధించింది. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత కూటమి ఓడిపోయిన వార్త తెలియగానే ముఖ్యమంత్రి పదవికి సీపీఎం అగ్రనేత పినరయి విజయన్ రాజీనామాచేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు అందజేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్కు గవర్నర్ సూచించారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి -
రజనీ-కమల్ మూవీ క్రేజీ అప్డేట్
జైలర్ 2 చిత్రాన్ని పూర్తి చేసిన నటుడు రజనీకాంత్ తదుపరి తన 173వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్,రజనీకాంత్ కలిసి నిర్మించే చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఆరంభ కాలంలో కలిసి పలు చిత్రాల్లో నటించిన కమల్,రజనీ సుమారు 17 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. రెడ్జయింట్స్ పతాకంపై ఇన్భున్ ఉదయనిధి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి రాజీవ్మీనన్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ను ఇటీవల చిత్రీకరించారు. దీని గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ దర్శకుడు నెల్సన్ ఈ చిత్ర కథను వివరించిన విధం చాలా ఆసక్తిగా ఉందన్నారు. ముందుగా ఎలాంటి భావోద్రేకాల గురించి చెప్పకుండా వినోదంగా చెప్పే విధానం మనల్సి నవిస్తుందన్నారు. ఆయన ఒక్క వారంతోనే ఈ చిత్ర ప్రోమోను చిత్రీకరించాలని చెప్పారన్నారు. తాను ఇంతకు ముందు నటుడు కమలహాసన్తో వాణిజ్య ప్రకటనలను చేసిన అనుభవం ఉందనీ,అయితే రజనీకాంత్తో కలిసి పని చేయలేదని చెప్పారు. అలాంటిది వీరిద్దరితో కలిసి ప్రోమో ను చిత్రీకరించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్,కమలహాసన్ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారనీ, దీంతో వారిద్దరూ కలిసి నటించే చిత్రం ఈ ఏడాది ఆగస్టులో గానీ, సెప్టెంబరులో గానీ ప్రారంభం అవుతుందని ఛాయాగ్రహకుడు రాజీవ్ మీనన్ చెప్పారు. -
అస్సాం: 3జీలను మించిన మామ
అస్సాంలో బ్రాహ్మణనేతను ఎలాగైనా ఓడించాల్సిందేనన్న ఏకైక నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మూడు కీలక పార్టీలు చతికిలపడ్డాయి. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(జీ), రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్(జీ), అస్సాం జాతీయ పరిషద్ నేత లురిన్జ్యోతి గొగోయ్(జీ) ఇలా అహోం వర్గానికి చెందిన మూడు పార్టీల (జీ) అగ్రనేతల ఎన్నికల వ్యూహాలను బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మ మరోసారి పటాపంచలు చేశారు.ఎగువ అస్సాంలో భారీగా పెరిగిన మద్దతు అహోం వర్గీయులు ఎక్కువగా నివసించే ఎగువ అస్సాంలో కాంగ్రెస్ హవా కొనసాగేది. ఆ సంస్కృతికి ఈసారీ హిమంత చరమగీతంపాడారు. ఎగువ అస్సాంను హిమంత అభివృద్ధి పథంలో పరుగులుపెట్టించాడు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం హిమంతకు బాగా కలిసొచి్చంది. ఎన్నో ప్రాజెక్టులను రాష్ట్రానికి ముఖ్యంగా ఎగువ అస్సాంలో అమలుపరిచి అభివృద్ధిఫలాలు స్థానికులకు అందేలాచేశారు. గువాహటి–దిబ్రూగఢ్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణంతో ఈ మార్గంలో ప్రయాణసమయంలో భారీగా తగ్గింది. పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు, నాలుగు లేన్ల రోడ్లు, వంతెనలు పూర్తిచేశారు. దీంతో పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్తో అనుసంధానం పెరిగింది. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి వీలుగా ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు.దిబ్రూగఢ్లో సర్వతోముఖాభివృద్ధికి కృషి.. రాష్ట్రంలో రెండో రాజధానిలా దిబ్రూగఢ్ నగరాన్ని హిమంత తీర్చిదిద్దారు. ఇక్కడే నూతనంగా శాసనసభ భవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించారు. దీంతో కేవలం ఒక్క నగరంలో పరిపాలన కేంద్రీకృతంకాకుండా వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని హిమంత విజయవంతంగా అమలుచేశారు. హిమంత మార్గదర్శకంలో డిస్పూర్, దిబ్రూగఢ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయం కోసం అత్యధిక నిధులు వెచి్చంచారు. అస్సాం వైద్యకళాశాలను విస్తరించారు. మరో రెండేళ్లలో ఊహించనంత అభివృద్ధిచేసి చూపుతానని హిమంత గతంలోనే చేసిన ప్రకటన ఎన్నికల ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. అందరూ మెచ్చిన మామ మేనమామతో ఉండే ఆతీ్మయానుబంధం అందరికీ చిరపరిచితమే. అంతే మమకారం ప్రజలపై హిమంత చూపారు. అందుకే అస్సాంలో ఆయనను అందరూ మామా అని ఆప్యాయంగా పిల్చుకుంటారు. నేనూ మీలో ఒకడిని, మనందరం ఒకే కుటుంబం అనేభావనను హిమంత విజయవంతంగా ప్రజల మనసుల్లో నాటారు. అందుకే ఎంతో మంది నేరుగా హిమంతకు తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. వాటిని తీరుస్తూ హిమంత ఓటర్లకు మరింత చేరువయ్యారు.మౌలికసదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిరాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పనకు హిమంత అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బ్రహ్మపుత్ర నదీ సొరంగం, కజిరంగా ఎలివేటెడ్ కారిడార్, సెమీకండక్టర్ ప్లాంట్ స్థాపన కోసం ఏకంగా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం వంటివి హిమంత గెలుపునకు దోహదంచేశాయి. బీజేపీ–ఆర్ఎస్ఎస్ మూలాలున్న నేతకావడంతో పక్కా వ్యూహరచన, అమలులో బిశ్వశర్మది రాటుదేలారు. గతంలో కాంగ్రెస్లో పనిచేసి అనుభవం, ఆ పార్టీలోని లోటుపాట్లపైనా హిమంతకు బాగా పట్టుంది.అహోం వర్గీయులను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(జీ), రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్(జీ), అస్సాం జాతీయ పరిషద్ నాయకుడు లురిన్జ్యోతి గొగోయ్(జీ) చేసిన ప్రయత్నాలను హిమంత వమ్ముచేశారు. బంగ్లాదేశీ చొరబాటుదారులతో యావత్ అస్సాంకు ముప్పువాటిల్లుతోందని హిమంత ఎన్నికల్లో చెప్పారు. మియా ముస్లిం వర్గీయులపై హిమంత తీసుకునే చర్యలను ఓటర్లు సమర్థించే పరిస్థితి తీసుకొచ్చారు.రాష్ట్రంలోని హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. చొరబాటుదారులు స్థానికుల నుంచి భూములు లాక్కుంటున్నారన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన ప్రభుత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఓటర్లు నమ్మేలాచేశారు. ముస్లిం మియాలు స్థానిక గిరిజనులను పెళ్లాడి వాళ్ల గిరిజనభూములను లాక్కుంటున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ఈ ముగ్గురు గొగోయ్ల పార్టీల నుంచి దీటైన పరిష్కార స్పందన కరువైంది. అయోధ్య రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి చొరబాట్ల అంశాలపై మాట్లాడుతూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు. -
మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్పై ఎఫెక్ట్!
గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
ముగిసిన విజయన్ శకం
తిరువనంతపురం: కేరళ రాజకీయ చరిత్రలో 2026 మే 4 తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఓటమి చవిచూడగా.. రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరైన పినరయి విజయన్ కూడా ఒక మలుపుగా నిలుస్తుంది. వరుసగా 16 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం కూటమికి, అలాగే, వరుసగా రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయన్కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. 81 ఏళ్ల విజయన్, ఒక సామాన్య కార్మిక వర్గ నేపథ్యం నుంచి కేరళకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆయన తిరుగులేని అధికార కేంద్రంగా ఎదిగారు. గత దశాబ్ద కాలంగా పార్టీని, ప్రభుత్వాన్ని తిరుగులేకుండా నడిపించారు. ఆయన నేతృత్వంలో సీపీఎం కూడా తన పాత నాయకత్వ పద్ధతి నుంచి క్రమంగా వైదొలుగుతూ సామాజిక మార్పును సంతరించుకుంది.క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరుగాంచిన విజయన్.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తన సుదీర్ఘ పదవీకాలంలో కఠినమైన నిర్వాహకుడిగా పేరు సంపాదించారు. 2026లో, విజయన్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలనే అరుదైన ప్రయత్నంలో, వామపక్షాలకు నాయకత్వం వహించి మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. ఆయన సొంత జిల్లా అయిన కన్నూర్లోని తమ సంప్రదాయ కంచుకోటతో సహా పలుచోట్ల సీపీఎం నేతృత్వంలోని కూటమి పట్టు కోల్పోయింది.ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని... ’దృఢమైన పరిపాలనా పట్టుకలిగిన కఠినమైన కమ్యూనిస్ట్’గా వర్ణించబడే విజయన్.. రాజకీయ సంప్రదాయాలను బద్దలు కొడుతూ, 16 ఏళ్లపాటు పారీ్టకి, వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రానికి నాయకత్వం వహించి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నారు. చేనేత కార్మికుడిగా... విజయన్ 1944లో కన్నూర్ జిల్లాలోని పినరయిలో ముండయిల్ కోరన్, కళ్యాణి దంపతులకు జన్మించారు. థలస్సేరిలోని బ్రెన్నెన్ కాలేజీలో బీఏ (ఎకనామిక్స్) చదువుతున్న సమయంలో కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్కు కన్నూర్ జిల్లా కార్యదర్శిగా చేశారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఉన్నత విద్యకు వెళ్లేముందు ఏడాది పాటు చేనేత కార్మికుడిగా పనిచేశారు. తర్వాత కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. 1968వ సంవత్సరంలో 24 ఏళ్ల వయసులో విజయన్ సీపీఎం కన్నూర్ జిల్లా కమిటీ సభ్యుడిగా చేరారు. రెండేళ్ల తర్వాత కూత్తుపరంబ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి 26 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1996 నుండి 1998 వరకు కేరళ విద్యుత్ శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. అయితే, జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ కోసం ఒక కెనడా కంపెనీకి కాంట్రాక్టులు అప్పగించడానికి సంబంధించిన ఎస్ఎన్సీ–లావలిన్ కేసు ఆరోపణలు చాలా సంవత్సరాలు ఆయనను వెంటాడాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సమయంలో విజయన్కు, ఆయన ప్రత్యర్థి వీఎస్ అచ్యుతానందన్ మధ్య అంతర్గత వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో 2007లో పార్టీ పొలిటికల్ బ్యూరో నుంచి సైతం కొంతకాలం ఇద్దరినీ సస్పెండ్ చేశారు. బంగారం స్మగ్లింగ్ కేసు, డాలర్ స్మగ్లింగ్ కేసు, స్ప్రింక్లర్ ఒప్పందం, తన మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్పై వచి్చన ఆరోపణలతో సహా పలు వివాదాలు ఆయన చుట్టూ ముసురుకున్నాయి. -
విజయ్ విక్టరీ.. కొత్త పేరుతో ‘జననాయగన్’ రిలీజ్?
నటుడు విజయ్ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్ చేశారు. అందులో మాంభూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్ను కూడా పోస్ట్ చేశారు. నిజమే జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి. Maanbumigu Thamizhaga Mudhalvar Dr. C. Joseph Vijay Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026 -
ఇది పెద్ద దెబ్బే.. ‘లెఫ్ట్’ కళ తప్పింది!
న్యూఢిల్లీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ). ఒకప్పుడు కీలకమైన, బలమైన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951–52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ప్రతిపక్షం. ఆ తర్వాత పశి్చమ బెంగాల్కు 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సీపీఎం నేత జ్యోతిబసుకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996లో ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం సైతం వచ్చింది అయితే, పార్టీ పొలిట్బ్యూరో అందుకు వ్యతిరేకత తెలపడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా ఆ పార్టీయే ఒప్పుకుంది.తిరిగి 2008లో, మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 60 మంది సభ్యులున్న వామపక్ష కూటమి మద్దతు ఉపసంహరించుకుంది. భారత్– అమెరికా అణు ఒప్పందమే ఇందుకు కారణం. అప్పట్లో వామపక్షాలు కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురల్లో అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఓటర్లు వామపక్ష భావనను వీడి క్రమక్రమంగా దూరంగా వెళ్లిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ఓటమి కమ్యూనిస్టులకు తాజాగా పెద్ద దెబ్బ. దీంతో, 1970 తర్వాత దేశంలో కమ్యూనిస్ట్లు మొదటిసారిగా అధికారం కోల్పోవడం గమనార్హం. చారిత్రక విజయం.. దేశ రాజకీయ చరిత్రలో వామపక్షాలది విశిష్టమైన స్థానం. 1951–52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో, లోక్సభలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) మాత్రమే. కేవలం ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా నిలిచి వామపక్షాలు చరిత్ర సృష్టించాయి.కంచు కోటలు బెంగాల్, త్రిపుర 1977లో పశి్చమ బెంగాల్లో సీపీఎం అధికారాన్ని దక్కించుకుంది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం పాటు పాలించిన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ నేత జ్యోతి బసు ముఖ్యమంత్రిగా 23 ఏళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. మరో 11 ఏళ్ల పాటు అక్కడ వామపక్షాల పాలన సాగింది. కేరళలో అధికారం మారుతూ వచ్చినప్పటికీ, త్రిపురలో మాత్రం వామపక్షాలు సుస్థిర విజయాన్ని అందుకున్నాయి. 1993లో త్రిపురలో 60 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేశాయి. దశరథ్ దేబ్ 1998 వరకు, ఆపై మాణిక్ సర్కార్ వరుసగా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. క్షీణత..ఆపై పతనం: వామపక్షాల క్షీణత ముందుగానే మొదలైనప్పటికీ, 2011లో అది పతనం దిశగా సాగింది. నందిగ్రామ్, సింగూర్ భూసేకరణ నిరసనలతోపాటు మార్పు నినాదంతో ముందుకు వచి్చన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 2006లో వామపక్ష కూటమికి 235 సీట్లుండేవి. టీఎంసీ దెబ్బకు వామపక్ష కూటమి బలం 62 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. అప్పట్లో దేశవ్యాప్తంగా వచి్చన కాషాయ అనుకూల పవనాల తాకిడికి వామపక్షాల కంచుకోట త్రిపుర కూడా కూలిపోయింది. అసెంబ్లీలోని 60 స్థానాల్లో బీజేపీ 36 గెలుచుకోగా, కమ్యూనిస్టుల బలం 50 నుంచి కేవలం 16కి పడిపోయింది. ఆ ఒక్కటీ పోయింది ఆ తర్వాత కాలంలో వామపక్షాలకు ఊరటగా నిలిచింది కేరళ మాత్రమే. 2016లో పినరయి విజయన్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్, 2021లో కూడా మళ్లీ గెలిచి కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీని తిరగరాసింది. అయితే, తాజా ఎన్నికల్లో వామపక్షాలు దక్షిణాది రాష్ట్రాన్ని కూడా కోల్పోయాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. -
కొత్వాల్గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి
పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. పైపైన చూస్తే ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్పై భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాల లోతుల్లోకి వెళితే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్ద కాలంగా బెంగాల్లో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మళ్లీ ప్రాణం పోశాయి. మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్కు శుభవార్తగా మారిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.శూన్యం నుంచి.. మళ్లీ మొదలైన ప్రస్థానం2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ తాజా ఎన్నికల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా జెండా ఎగురవేయగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కా, రాణినగర్ స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయం కేవలం అంకెల పరమైన పెరుగుదల మాత్రమే కాదు. ఫరక్కాలో కాంగ్రెస్ అభ్యర్థి మోతాబ్ షేక్ 63,050 ఓట్లు సాధించి, తన సమీప బీజేపీ అభ్యర్థిపై 8,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఒకప్పటి బలమైన అధికార పార్టీ టీఎంసీ 47,256 ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.ముక్కోణపు పోటీలో.. ఆశ్చర్యకరమైన ఫలితాలురాణినగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ హోరాహోరీ పోరులో టీఎంసీపై 2,701 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) మరింత వెనుకబడగా, బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న ద్విముఖ పోరు.. ఇప్పుడు బహుముఖ పోటీగా మారిందని ఈ రెండు స్థానాల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మైనారిటీలు, గ్రామీణ ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం.ఓట్ల చీలికతో.. కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలంటీఎంసీ ఓటు బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్కు పరోక్షంగా లాభించింది. అధికార పార్టీకి దూరమైన ఓట్లన్నీ నేరుగా బీజేపీకే వెళ్లిపోలేదు. ఆ ఓట్లు విడిపోయి, స్థానికంగా సంస్థాగత బలం ఉన్న చిన్న పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్కు మళ్లాయి. దీనిని కాంగ్రెస్ వైపు వీచిన గాలి అనడం కంటే, టీఎంసీ పతనంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే ప్రక్రియ అనడం వాస్తవం. అధికార పార్టీ బలహీనపడటం వల్ల బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినప్పటికీ, ఏకకాలంలో కాంగ్రెస్కు కొన్ని చోట్ల అనుకూల వాతావరణం ఏర్పడింది.అధిర్ రంజన్ ఇలాకాలో.. అనూహ్య పరిణామంరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి అటూఇటుగా ఉన్నప్పటికీ, మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్న బహరంపూర్లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీఎంసీ మరింత బలహీనపడి కిందకు పడిపోయింది. చౌదరికి ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో కాంగ్రెస్ ద్వితీయ ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.‘ఇండియా’ కూటమిలో.. మమతకు తగ్గిన పట్టుపశ్చిమ బెంగాల్లో టీఎంసీ పతనం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు, ‘ఇండియా’ కూటమిలోని అంతర్గత సమీకరణలను కూడా సమూలంగా మార్చేసింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా కాంగ్రెస్కు లేదని ఇన్నాళ్లూ మమతా బెనర్జీ బలంగా వాదిస్తూ వచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీకి ఎదురైన పరాభవం కూటమిలో ఆమె ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.పునర్వైభవం కాదు.. మనుగడకు మార్గంమమత పరాజయంతో ఇండియా కూటమిలో నాయకత్వ పోరు తగ్గుముఖం పట్టి, కూటమి పగ్గాలపై కాంగ్రెస్కు పరోక్షంగా మరింత స్వేచ్ఛ లభించింది. అయితే, బెంగాల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి పునర్వైభవంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ పతనంతో లబ్ధి పొంది బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. అయితే, ముర్షిదాబాద్లో లభించిన విజయాలు కాంగ్రెస్ ఉనికికి ఊపిరిపోశాయి. బెంగాల్ రాజకీయ చిత్రం నుంచి దాదాపు కనుమరుగైపోయిన ఒక జాతీయ పార్టీకి, ఫరక్కా, రాణినగర్ ఫలితాలు లబ్ధి చేకూర్చాయని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం! -
బెంగాల్లో బీజేపీ విజయం: ఈ రంగాలకు ఊతం!
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. చాన్నాళ్ల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మార్పు ద్వారా ఆర్ధిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణే ఎన్నికల కౌంటింగ్ రోజునే ఇక్కడున్న చాలా కంపెనీల షేర్స్ పెరగడం. దీన్ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారులు బెంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), రైల్వేస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఎనర్జీ, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా.. రాష్ట్రం మరింత పురోగతి దిశగా అడుగులు వేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇకపోతే.. కొన్ని కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా మమతా బెనర్జీ హయాంలో గుత్తాధిపత్యం చెలాయించిన కంపెనీలు లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.ఇటు హర్ముజ్లోనూ..హర్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్గానే ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.ట్రంప్ ఏమన్నారంటే.. ఇరాన్ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ నౌకలను.. యూఎస్ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.ఇరాన్ వైఖరియూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుల్స్ దగ్ధమయ్యాయి.ఒక్కో షాప్లో సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంది. సంఘటన స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విజయ్ ఇంట్లో విజిల్ సందడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తమిళగ వెట్రి కజగం (టీవీకే) దూసుకుపోతున్న నేపథ్యంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో విజిల్ ఊదుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంట్లో సందడి చేస్తూ చక్కర్లు కొట్టారు. చంద్రశేఖర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇది చారిత్రక విజయమంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఒక తండ్రిగా నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి?‘అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విజయ్ రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ‘తాను ముఖ్యమంత్రి కావాలని విజయ్ రెండేళ్ల క్రితమే నాతో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడ్డాడు. నాకంటే నా భార్య (శోభ) చాలా సంతోషంగా ఉంది‘అని తెలిపారు. విజయ్ ఎప్పుడూ అచంచలమైన విశ్వాసంతో ఉండేవాడని, విజయమే మనది అనే నినాదమే అతని తారక మంత్రంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. విజయ్ను తమిళనాడు ప్రజలు తమ కుటుంబంలో ఒకరిగా చూస్తున్నారని,. ఎన్నో వ్యతిరేకతలు, పరీక్షలను ఎదుర్కొని విజయ్ ఈ స్థాయికి చేరుకున్నాడని కొనియాడారు. ‘ఇది సాధారణ విజయం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా, ఒంటరిగా పోటీ చేసి ఇంతటి విజయాన్ని అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం‘అని పేర్కొన్నారు. 20 ఏళ్ల ప్రణాళిక.. తన కొడుకు రాజకీయ ప్రయాణంపై చంద్రశేఖర్ హర్షం వ్యక్తంచేశారు. విజయ్ సినిమా నుంచి ప్రజాజీవితంలోకి రావడంపై స్పందిస్తూ.. ఇదేదో అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టంచేశారు. దీని వెనుక 20 ఏళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి విజయ్కు కొన్ని పెద్దపెద్ద కలలున్నాయన్నారు. తాను టీవీకే సభ్యుడిగా విజయ్ను తన నాయకుడిగా భావిస్తానని అంటూనే.. ఒక తండ్రిగా తన పాత్రకు, పార్టీ వ్యూహాత్మక కార్యకలాపాలకు మధ్య తేడాను స్పష్టంగా పాటించారు. కాగా, విజయ్ నీలాంకరై నివాసానికి నటి త్రిష చేరుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని త్రిషా నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం గమనార్హం. -
ద్రవిడ అధికార శకానికి ముగింపు
సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ పార్టీల ఐదు దశాబ్ధాల పాలనా శకానికి టీవీకే ముగింపు పలికింది. తమిళనాడులో 1962లో ద్రవిడ పార్టీగా డీఎంకే ఎన్నికలకు వెళ్లగా 50 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. 1967 ఎన్నికల్లో అన్నాదురై నేతృత్వంలో డీఎంకే తొలిసారిగా అ«ధికార పగ్గాలు చేపట్టింది. ఆయన మరణం తర్వాత 1969లో కరుణానిధి డీఎంకే అధ్యక్షపగ్గాలతో పాటు తమిళనాడు సీఎం కురీ్చని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు ఎంజీఆర్, కరుణానిధి మధ్య నెలకొన్న వివాదంతో అన్నాడీఎంకే ఆవిర్భవించింది. 1977 ఎన్నికల్లో తొలిసారిగా ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకుంది. మరణించే వరకు ఎంజీఆర్ సీఎంగా కొనసాగారు. తర్వాతి పరిణామాలతో 1989లో వచ్చిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెండు పార్టీల ప్రభుత్వాలు వరుసగా మారుతూ వచ్చాయి. 1991లో అన్నాడీఎంకే, 1996లో డీఎంకే, 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారం చేపట్టాయి. 2011 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం జయలలిత తన రాజకీయ గురువు ఎంజీఆర్ రికార్డును తిరగరాస్తూ 2016లో మళ్లీ గెలిచారు. ఆమె మరణం తదుపరి పరిణామాలతో 2021 ఎన్నికల్లో డీఎంకే గద్దె నెక్కింది. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి వారసుడైన స్టాలిన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇలా డీఎంకే, అన్నాడీఎంకే అంటూ అధికారం సాగుతూ వచ్చిన సమయంలో తమిళనాడులో మూడోశక్తిగా అవతరించిన విజయ్ రూపంలో ద్రవిడ పార్టీల అధికార శకానికి ముగింపు పలికినట్లయింది. -
49 ఏళ్ల రికార్డు బద్దలు
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్, దళపతి విజయ్ పూర్తి పేరు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. మూడో శక్తిగా ఎదిగేందుకు యత్నించిన ఎందరో సినీ దిగ్గజాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 1970ల తర్వాత ఎంజీ రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్లీ ఎవరూ పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ పాత రికార్డులను చెరిపి వేసి, కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగారు. నాడు.. నేడు నాటి ఎంజీ రామచంద్రన్కు, నేటి విజయ్కు కలిసొచ్చిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంజీఆర్ సినిమాలతో ప్రజాదరణ పొంది డీఎంకే నుంచి బయటకు వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన ఆయనకు సొంత చరిష్మా, ప్రకటించిన సంక్షేమ పథకాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలా తిరుగులేని మెజారిటీ అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. 1977లో సీఎం పదవిని చేపట్టిన ఆయన 1987లో మరణించే వరకు దశాబ్ద కాలంపాటు కొనసాగారు. తనపై ప్రజలకున్న అభిమానాన్ని ఒక పటిష్టమైన రాజకీయ భావోద్వేగంగా మార్చుకున్నారు. వ్యక్తిత్వం, రాజకీయం ఎలా కలిసి ఉండాలో ఆచరించి చూపారు. నేడు విజయ్కి అనుకూలించిన అంశాలు వేరేగా ఉన్నాయి. యువతలో ఆందోళనలు, ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న విసుగు, స్వచ్ఛమైన రాజకీయ మార్పు కావాలనే బలమైన ఆకాంక్ష.. వీటినే విజయ్ తనవాణిగా మార్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించారు. గత 49 ఏళ్లలో ఏ సినీ నటుడు సాధించని అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. 1977లో ఎంజీ రామచంద్రన్ తమిళనాడు రాజకీయాలను తిరగరాసిన తర్వాత, ఒక నటుడు నేరుగా ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎంజీఆర్ తర్వాత సినీ గ్లామర్తో సెయింట్ జార్జి కోటలోని తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. జయలలిత ప్రస్థానం వేరు ఎంజీఆర్ తర్వాత ఎందరో నటులు భారీ అభిమాన గణంతో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ ఆయన రికార్డును అధిగమించలేకపోయారు. జయలలిత కూడా గొప్ప సినీ నటి అయినప్పటికీ, సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేదు. ఆమె ఎంజీఆర్ నెలకొల్పిన అన్నాడీఎంకేను వారసత్వంగా పొంది, దానిని పటిష్టం చేసి అ«దీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం కేవలం రెండేళ్ల క్రితం స్థాపించిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) 100 సీట్లకు పైగా గెలుచుకుంది. దీని వెనుక ముందుచూపు, పక్కా ప్రణాళిక, తీవ్రమైన కృషి ఉన్నాయి. విజయ్ తన అభిమాన సంఘాలను 2009 నుంచే ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం మొదలుపెట్టారు. మక్కల్ ఇయక్కం (వీఎంఐ) పేరుతో సంఘాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చారు. మొదట్లో కేవలం సేవ, సంక్షేమ కార్యక్రమాలకే పరిమితమై పనిచేసినప్పటికీ, క్రమంగా వరదలు వంటి ప్రకృత్తి విపత్తుల వేళ ప్రజలకు సాయం అందించడం, పేద విద్యార్థులకు ఆసరాగా నిలవడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి వాటి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో జనానికి చేరువైంది. 2011లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా విజయ్ మొదటిసారి తన రాజకీయ ఆకాంక్షను చాటారు. నటుడికి ఉన్న ఆకర్షణ ఓట్లుగా మారుతాయా లేదా అనేందుకు ఇదొక తొలి పరీక్ష అయ్యింది. సినిమాల నుంచి సిద్ధాంతాల దాకా 2010– 2020 మధ్య కాలంలో విజయ్ ప్రసంగాలను పరిశీలిస్తే రాజకీయ కోణం కని్పస్తుంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆయన చేసిన విమర్శలు, సినిమాకు మించిన అంశాలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి. ఆడియో లాంచ్లు, అభిమానుల సమావేశాలు, సేవా కార్యక్రమాల ద్వారా పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, అవినీతి, పాలన వంటి అంశాలను ఆయన తరచూ ప్రస్తావించేవారు. ఇవి యువతను, నగరవాసులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా పార్టీని అధికారికంగా ప్రకటించకముందే విజయ్ తన వీఎంఐ సత్తా ఏపాటిదో నిరూపించుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ’విజయ్ మక్కల్ ఇయక్కం’ అభ్యర్థులు పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. కేవలం జనాన్ని కూడగట్టడమే కాకుండా, తనకున్న పాపులారిటీని ఓట్లుగా మార్చగల శక్తి ఈ వ్యవస్థకు ఉందని ఆ ఎన్నికలు రుజువు చేశాయి. టీవీకే ఆవిర్భావం చివరికి 2024 ఫిబ్రవరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం’(టీవీకే) పార్టీని అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎటువంటి ముందస్తు పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే–ఏడీఎంకేల ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తామని స్పష్టం చేశారు. సుమారు 70 చిత్రాలతో తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు కూడా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారానే ప్రచారం గత రెండేళ్లుగా టీవీకే తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన పార్టీగా మార్చింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ విభాగాలు, బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. విద్య, ఉపాధి, అవినీతి నిర్మూలన, జవాబుదారీతనంపై దృష్టి సారించింది. విజయ్ ఒక ఆవేశపూరిత వక్తగా కాకుండా, ప్రజల సమస్యలను వినే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకమవుతూ, పక్కా ప్రణాళికతో బహిరంగ సభలు నిర్వహించారు. మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల వంటివేమీ లేకుండానే తనదైన శైలిలో ప్రచారం సాగించారు. 2025లో కరూర్లో టీవీకే నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటకు దారితీసింది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. విజయ్కు రాజకీయ నాయకుడిగా ఇది మొదటి పరీక్షగా నిలిచింది. ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరించారు. తమిళనాట పెనుమార్పు 2026 ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాల ఒరవడిని విజయ్ ఒక్కసారిగా మార్చేశారు. టీవీకే రాకతో తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–అన్నాడీఎంకే ద్వంద్వ పోరు ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారింది. ఎంజీఆర్ హయాం తర్వాత తమిళనాడులో ఇంతటి బలమైన ముక్కోణపు పోటీ మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇంతకాలం పెద్ద పార్టీల నీడలో ఉన్న చిన్న పార్టీలు ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆంధ్రా సరిహద్దుల్లోనూ మార్మోగిన ‘విజిల్’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ సత్తా చాటింది. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు, కుప్పం సమీపంలో.. తమిళనాడు అసెంబ్లీ నియోజక వర్గాలు గుమ్మడిపూడి, తిరుత్తణి, అరక్కోణం, సోలింగరం, కంచి, కాటా్పడి, వేలూరు, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు, బొడుగూరు, వేపనపల్లి ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో గుమ్మడిపూడి, అరక్కోణం, కంచి, కాట్పాడి, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, హోసూరు, తిరుపత్తూరు అసెంబ్లీ స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఈ నియోజక వర్గాల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితాలపై జిల్లా వాసుల ఆసక్తి ⇒ తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఆసక్తి చూపించారు. సరిహద్దు గ్రామాల ప్రజలతో పాటు చిత్తూరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, నగరి, సూళ్లూరుపేట, తిరుపతి వాసులు ఉదయం నుంచి టీవీలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆరాట పడ్డారు. విజయ్ పార్టీ విజయంపై స్వీట్లు పంచిపెట్టడం కనిపించింది. వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకులు తమిళనాడు ఎన్నికలపై బెట్టింగ్లు కాయడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు విజయ్ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. -
దీదీ పతనానికి కారణాలెన్నో..
పశ్చిమ బెంగాల్ ప్రజలతో దీదీ(అక్క) అని ఆప్యాయంగా పిలిపించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ రాజకీయంగా సంచలనాలకు మారుపేరు. కరడుగట్టిన కమ్యూనిస్టులకే చుక్కలు చూపించిన నాయకురాలిగా 15 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలన సాగించారు. వరుసగా నాలుగోసారి విజయంపై కన్నేసినప్పటికీ ఆశలు నెరవేరలేదు. దీదీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. మరోసారి ఆమె పాలనను కోరుకోవడం లేదని తేల్చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంగట్టారు. మమతా బెనర్జీ పార్టీ పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, కట్ మనీ సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. మరోవైపు హిందూ ఓటు బ్యాంకు దూరం కావడం దీదీ కొంప ముంచింది. 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాటం సాగించారు. అన్ని స్థానాలకూ తానే అభ్యర్థినని చెప్పుకోగా ప్రజలు అంగీకరించలేదు. ప్రభుత్వంలో, పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మితిమీరిన పెత్తనం మేనత్త ఓటమికి మరో ముఖ్య కారణమైందని సొంత పార్టీ నేతలే ఆక్షేపిస్తున్నారు. భవానీపూర్లో సోమవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన అభిషేక్ బెనర్జీని చూసిన బీజేపీ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. చోర్, చోర్(దొంగ, దొంగ) అంటూ నిందించారు. ప్రజల్లో ప్రబలిన అసంతృప్తి బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పేరిట మమతా బెనర్జీకి అతిపెద్దసవాలు ఎదురైంది. ఎస్ఐఆర్ కింద రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందని, తమ మద్దతుదార్ల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మమతా బెనర్జీ గగ్గోలు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. తొలగింపునకు గురైన ఓటర్లలో చాలామంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదార్లేనని తెలుస్తోంది. 2011 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న దీదీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఒకప్పుడు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెంగాల్లో పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగం పెరిగిపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ప్రధానంగా యువత విరక్తి చెందింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం వారిని కుంగదీసింది. దాంతో ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దెబ్బతీసిన మైనార్టీ సంతుష్టీకరణ 2011లో మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్దికాలానికే కాంగ్రెస్ను అణచివేసేందుకు ప్రయతి్నంచారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి దూరమై, కమ్యూనిస్టులకు దగ్గరయ్యింది. దీదీ పతనానికి అడుగులు అప్పుడే పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలను దీదీ నమ్ముకున్నారు. ఈ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంది. దీదీ హిందువుల వ్యతిరేకి అంటూ ఉధృతంగా ప్రచారం చేసింది. చొరబాటుదార్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు చేస్తోందని ఆరోపించింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇవన్నీ ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్రవేశాయి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్ టైగర్ బీజేపీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ‘పరివర్తన్’కే ప్రజ లు ఓటేశారు. మార్పునకు పట్టంగట్టారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. నిజమైన అభివృద్ధి జరగాలంటే ‘డబుల్ ఇంజన్’ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపును గౌరవించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే విజయం కట్టబెట్టారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చా రు. అంగ, కళింగ రాజ్యాలను ఇప్పటికే కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకుంది. తూర్పు భారతదేశంలోని వంగ రా జ్యాన్ని సైతం జయించింది. మొట్టమొదటిసారిగా బెంగాల్లో జయకేతనం ఎగురవేసింది. దీదీ కోట ను బద్దలుకొట్టి బెంగాల్ టైగర్గా అవతరించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 293 స్థానాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఏకంగా 206 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీఎంసీకి కోలుకోలేని నష్టం ప్రాంతాలు, జనాభా స్థితిగతులకు అతీతంగా అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటల్లోకి సైతం బీజేపీ చొచ్చుకెళ్లింది. ప్రభుత్వ పాలన మాత్రమే కాకుండా బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో నిర్మాణాత్మక మార్పును ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ స్థానం మాత్రమే మారింది, ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. 2021లో ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడిపోగా, ప్రస్తుతం భవానీపూర్లో చేదు అనుభవం చవిచూశారు. తృణమూల్ కాంగ్రెస్కు కోలుకోలేని నష్టం జరిగింది. ఆ పార్టీ 81 స్థానాలకే పరిమితమైంది. 100కుపైగాసీట్లను లూటీ చేశారంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. సీపీఎం 1, ఇతరులు మరో మూడు సీట్లు గెల్చుకున్నారు. ఒక నియోజకవర్గంలో ఈనెల 21న రీపోలింగ్ జరుగనుంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ బెంగాల్ చరిత్రలో 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలించబోతోంది. 54 ఏళ్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావడం గమనార్హం. బెంగాల్లో తమ పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రజా తీర్పును ప్రశంసించారు. రాష్ట్రంలో కమలం వికసించిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ కృషి చేస్తుందని ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి మోదీయే కేంద్రబిందువుగా నిలిచారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బూత్స్థాయి నెట్వర్క్, అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాలను సమన్వయం చేస్తూ ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరించారు. బీజేపీ ఆధిక్యం ఉత్తర బెంగాల్ నుంచి జంగల్మహల్, దక్షిణ బెంగాల్ వరకు, సరిహద్దు జిల్లాల నుంచి పారిశ్రామిక ప్రాంతాల వరకూ విస్తరించింది.రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టించింది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. 2021 నాటి ఎన్నికల్లో 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 45 శాతానికిపైగా ఓట్లు చేజిక్కించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 48 శాతం నుంచి 40.94 శాతానికి పడిపోయింది. బీజేపీకి ఉత్తర బెంగాల్లో గట్టి పట్టుంది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోనూ మంచి ఫలితాలు సాధించింది. రాజధాని కోల్కతా సహా హౌరా, హూగ్లీ జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించింది.బ్రాత్య బసు, మానస్ రంజన్ భూనియా, శశి పంజా, చంద్రిమా భట్టాచార్య సహా 20 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. ఈ తీర్పు బీజేపీకి ఒక కీలక మలుపు. 1990వ దశకం వరకు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న ఆ పార్టీ అధికార పీఠం అధిరోహించే స్థాయికి చేరింది. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఇకపై బీజేపీ పాలనకు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారు. -
అట్టడుగు నుంచి అధికార పీఠానికి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి అధికార స్థానానికి ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకమే. బీజేపీ మాతృసంస్థ అయిన భారతీయ జనసంఘ్ను బెంగాలీ బాబూ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. 1951లో భారతీయ జనసంఘ్ పురుడు పోసుకుంది. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఉనికిలోకి వచ్చింది. 1980వ దశకంలో బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసిరాలేదు. 1982 అసెంబ్లీ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 1.29 లక్షల ఓట్లు వచ్చాయి. సీట్లేవీ రాలేదు. 1984 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీచేసి, 1.01 లక్షల ఓట్లు సాధించింది. 1987లో 57 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగింది. 1.34 లక్షల ఓట్లు దక్కించుకుంది. 1989 లోక్సభ ఎన్నికల్లో 19 సీట్లలో పోటీకి దిగి 5.29 లక్షల ఓట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పరాజయాలు తప్పలేదు. బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న బీజేపీ కోరిక దశాబ్దాలపాటు నెరవేరలేదు. అప్పట్లో వామపక్షాలు అత్యంత బలంగా ఉండడం కాషాయ పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. అయితే, ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ రావడం బీజేపీకి ఊరటనిచ్చింది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ ఏనాడూ నిరాశ చెందలేదు. పట్టుదలతో పోరాడుతూ పైకి ఎదిగింది. ప్రతి ఎన్నికలోనూ పెరిగిన ఓట్ల శాతం 1990వ దశకంలో రామజన్మభూమి ఉద్యమం బెంగాల్లో ఆ పార్టీకి మంచి ఊపునిచ్చింది. 1998లో 14 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ తొలిసారిగా ఒక స్థానాన్ని గెల్చుకుంది. 37.24 వేల ఓట్లు లభించాయి. 1999లో తృణమూల్ కాంగ్రెస్తో జట్టుకట్టి 13 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. 39.28 లక్షల ఓట్లు వచ్చాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో 266 స్థానాల్లో పోటికి దిగింది. సీట్లు రాకున్నా 19.01 లక్షల ఓట్లు సాధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 291 సీట్లలో పోటీచేసి, తొలిసారిగా మూడు స్థానాలు గెల్చుకొని పెను సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి బీజేపీకి ఎదుగుదలకు అడ్డే లేకుండాపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లలో పోటీకి దిగి, 2.89 కోట్ల ఓట్లు సాధించి, 77 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారిగా రెండో అతిపెద్ద పార్టీగా మారింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఐదేళ్లలోనే ఏకంగా అధికార పీఠం దక్కించుకుంది. -
తల్లి కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు జలసమాధి
సీతారామపురం: ఆ ఇల్లు నిన్నటి దాకా ఇద్దరు అన్నదమ్ముల అల్లరితో సందడిగా ఉండేది. అమ్మ పిలుపులు.. అన్నదమ్ముల నవ్వుల కేరింతలతో కళకళలాడింది. కానీ ఇప్పుడు గుండెలు పగిలే రోదనలు మిగిలాయి. విధి ఆటలో మృత్యువు ఆ పసి మొగ్గలను చెరువు రూపంలో కన్నతల్లి కళ్ల ముందే కబళించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం బెస్త కాలనీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టా సుబ్బారావు, స్వర్ణలత దంపతుల కుమారులైన కిష్ణా రేవంత్ (14), కిష్ణా ఆది (13) నెల్లూరులో ఉంటూ 9వ, 8వ తరగతి చదువుకుంటున్నారు.వేసవి సెలవులకు తల్లితో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటికి సమీపంలో ఉన్న ఊర చెరువులో దుస్తులు ఉతుక్కునేందుకు తల్లి స్వర్ణలత, పిన్ని సుమలతతో కలిసి వెళ్లారు. ఒక వైపు తల్లి, పిన్ని దుస్తులు ఉతుక్కుంటుండగా మరో వైపు రేవంత్, ఆది సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి గిలగిలా కొట్టుకోవడాన్ని గమనించిన పిన్ని సుమలత కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా మునిగిపోయింది. ఇదంతా చూస్తున్న తల్లి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సుమలతను ఒడ్డుకు చేర్చారు.అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెరువులో నీటి లోతు ఎక్కువగా ఉండడంతో కొన్ని గంటల వరకు ఆ అన్నదమ్ముల జాడ తెలియలేదు. బెస్త కాలనీకి చెందిన యువకులు చెరువులోకి దిగి రేవంత్, ఆదిలను బయటకు తీయగా అప్పటికే వారు చనిపోయారు. మృత్యువులోనూ అన్నదమ్ముల బంధం విడిపోలేదు. ఒకరినొకరు గట్టిగా పట్టుకున్న స్థితిలోనే వారి నిర్జీవ దేహాలు బయటపడ్డాయి. కళ్లముందే ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లి రోదనలు మిన్నంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి మృత్యువాత పడడంతో బెస్త కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్’
ఫ్లోరిడా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు టీనేజ్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్’ విజయం అందుకున్నాడు. సీజన్లోని నాలుగో రేసు మయామి గ్రాండ్ప్రిలో ఇటలీకి చెందిన 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణిత 57 ల్యాప్ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఆంటోనెల్లి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 33 నిమిషాల 19.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానాన్ని పొందాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో నలుగురు రేసును పూర్తి చేయలేకపోయారు. సీజన్ తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్కే చెందిన జార్జి రసెల్ విజేతగా నిలువగా... తర్వాతి మూడు రేసుల్లో (చైనా, జపాన్, మయామి) ఆంటోనెల్లికి టైటిల్ దక్కింది. ఫార్ములావన్ చరిత్రలో తన కెరీర్లోని తొలి మూడు పోల్ పొజిషన్ల నుంచి మూడు రేసుల్లోనూ గెలిచిన తొలి డ్రైవర్గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్ప్రి ఈనెల 24న జరుగుతుంది. 22 రేసుల ఈ సీజన్లో నాలుగు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 100 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా జట్టు 12వసారి విజేతగా నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనా 3–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ షి యుకీ 85 నిమిషాల్లో 21–16, 16–21, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ను ఓడించి చైనాకు 1–0 ఆధిక్యం అందించాడు.రెండో మ్యాచ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ షి ఫెంగ్ 43 నిమిషాల్లో 13–21, 10–21తో ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లానియర్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. 96 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మూడో మ్యాచ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ 22–20, 20–22, 21–19తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్లో హీ జి టింగ్–రెన్ జియాంగ్ యు ద్వయం 38 నిమిషాల్లో 21–13, 21–16తో ఎలోయ్ ఆడమ్–లియో రోసీ జోడీని ఓడించి చైనాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన భారత్, డెన్మార్క్ జట్లకు కాంస్య పతకాలు లభించాయి.12: థామస్ కప్ టైటిల్ను చైనా జట్టు ఇప్పటి వరకు 12 సార్లు గెల్చుకుంది. 1982, 1986, 1988, 1990, 2004, 2006, 2008, 2010, 2012, 2018, 2024, 2026లలో చైనా టైటిల్స్ సాధించింది. అత్యధిక సార్లు థామస్ కప్ నెగ్గిన జట్టుగా ఇండోనేసియా (14 సార్లు) అగ్రస్థానంలో ఉంది. మలేసియా (5 సార్లు) మూడో స్థానంలో ఉంది. భారత్, డెన్మార్క్, జపాన్ ఒక్కోసారి థామస్ కప్ టైటిల్ను సాధించాయి. -
అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్’
సాక్షి, అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తాజాగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి మార్క్ఫెడ్ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్ఫెడ్ తీసుకునే రూ.1,800 కోట్ల అప్పునకు అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ ద్వారా రూ.12,053 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ప్రస్తుత రూ.1,800 కోట్ల అప్పు కూడా కలిపితే మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి తీసుకున్న అప్పు రూ.13,853 కోట్లకు చేరనుంది.చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే బడ్జెట్ పరిధిలో, బడ్జెట్ వెలుపల కలిపి సోమవారం వరకు మొత్తం రూ.3,56,455 కోట్లు అప్పు చేసింది. అయితే, బడ్జెట్ పరిధిలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (మే 5, మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.4,600 కోట్లు రుణం సమీకరించి ఇవ్వనుంది. సోమవారం ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీతో అనుమతిచ్చింది.దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు చేసిన అప్పు మొత్తం రూ.3,62,855 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,776 కోట్లు, రోజుకు సగటున రూ.526 కోట్లు అప్పు చేస్తోంది. కాగా, గ్రామీణ విద్యుద్ధికరణ సంస్థ (ఆర్ఈసీ) నుంచి డిస్కమ్స్ తీసుకున్న రూ.7,000 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీని పొడిగిస్తూ సోమవారం ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బెంగాల్లో సువర్ణాధ్యాయం మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత సువర్ణాధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హింస, భయం, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికి బెంగాల్ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన చరిత్రాత్మక విజయాలను ఆయన అపూర్వం, అద్వితీయంగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన మార్గదర్శనం సత్తా చాటిందని మోదీ ప్రశంసించారు. ప్రజలే దేవుళ్లు.. బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలకు సైతం కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’కి భారత్ ఎందుకు మాతృభూమిగా ఉందో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచానికి చాటిచెప్పాయన్నారు. గతేడాది బిహార్ ఎన్నికల సమయంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ఎన్డీఏ ప్రభంజనం విస్తరిస్తుందని తాను చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని చెప్పారు. గంగామాతతోపాటు బ్రహ్మపుత్ర, కామాఖ్యా మాతల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందన్నారు. అందుకే అస్సాం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యమైందన్నారు. పుదుచ్చేరిలో గత ఐదేళ్లలో ఎన్డీఏ అమలు చేసిన విజన్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇ చ్చారన్నారు. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ‘నాగరిక్ దేవో భవ’(ప్రజలే దేవుళ్లు) అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. శ్యామాప్రసాద్ కల సాకారం పశ్చిమ బెంగాల్ను భారత్లో అంతర్భాగంగా ఉంచేందుకు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ధారపోశారని మోదీ గుర్తుచేశారు. 1951లో ‘దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి’అన్న ఆశయంతో ఆయన ప్రారంభించిన ప్రస్థానం, నేటి చారిత్రక విజయంతో ఆయన కల సాకారమైందన్నారు. బెంగాల్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, నేటి నుంచి భయం నుంచి విముక్తి పొందిందని ‘బాంగ్లాయ్ పోరిబోర్తన్ హోయే గెచే’(బెంగాల్లో మార్పు వచ్చేసింది) అని నినదించారు. వందేమాతరం 150వ వసంతంలో భరతమాతకు, బంకించంద్ర ఛటర్జీకి, అరవిందుడికీ బెంగాల్ ఓటర్లు చారిత్రక నివాళి అర్పించారన్నారు. ఇకపై అభివృద్ధి, విశ్వాసం, కొత్త ఆశలు బెంగాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారుల ఆటకట్టిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్ భారత్’పథకానికి పచ్చజెండా ఊపుతామని స్పష్టం చేశారు. అంగ్, బంగ్, కలింగ్...ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ సైరన్లు మోగుతూ, అస్థిరత, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో, పశ్చిమాసియా సంక్షోభం వెంటాడుతున్నా.. భారత ప్రజలు మాత్రం స్థిరత్వం కోసం ఓటు వేశారని మోదీ విశ్లేషించారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ఏకతాటిపై నిలబడి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో అంగ్ (బిహార్), బంగ్ (బెంగాల్), కలింగ్ (ఒడిశా) రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, వాణిజ్య మూలస్తంభాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఆసియా ఖండం మొత్తం కళింగ ఓడరేవుల ద్వారా వాణిజ్యం సాగేదని, బెంగాల్ సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. బానిసత్వంలో ఆ స్తంభాలు బలహీనపడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఆ మూడు ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎంచుకోవడం ద్వారా వికసిత భారత్కు బాటలు వేస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.మహిళా వ్యతిరేకులకు గుణపాఠంపార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఆ ఆగ్రహాన్ని రుచి చూశాయన్నారు. మహిళా విరోధిగా ముద్రపడిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి సైతం యూపీలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కేరళలో కమ్యూనిస్టుల పదేళ్ల దుష్పరిపాలనను ప్రజలు తిరస్కరించారని, అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కు కూడా మహిళలు తగిన సమాధానం ఇస్తారన్నారు. నేడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం కేవలం రాజకీయ మార్పు కాదని, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన భారీ మార్పు అని మోదీ విశ్లేషించారు. యావత్ ప్రపంచం, దేశం కమ్యూనిజాన్ని, అడవుల్లో అంతరించిపోతున్న మావోయిజాన్ని తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం అదే భావజాలాన్ని అక్కున చేర్చుకుంటూ విపరీత దిశలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలవి కేవలం విభజన రాజకీయాలైతే, తమవి విశ్వాసం నింపే రాజకీయాలని వ్యాఖ్యానించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.మోదీపై చెక్కుచెదరని విశ్వాసం: నితిన్ నబిన్12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నాయకత్వంపై, మోదీ గ్యారంటీపై ప్రజల్లో నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మభూమి అయిన బెంగాల్ను మోదీ బీజేపీ మయం చేశారని కొనియాడారు. విజయోత్సవ సంబరాల అనంతరం మంగళవారం నుంచే బీజేపీ శ్రేణులు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమవుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభంలో మోదీకి పూలమాల వేసి సత్కరించేందుకు నబిన్ ముందుకు రాగా, ఆ మాలను మోదీ ఆప్యాయంగా తిరిగి నబిన్ మెడలోనే వేసి నాయకుల పట్ల తనకున్న గౌరవాన్ని, నిరాడంబరతను చాటుకున్నారు. -
శ్రీకాళహస్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాళహస్తి రూరల్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోల్కతాకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆస్తమా చికిత్స చేయించుకునేందుకు కోల్కతా నుంచి బెంగళూరుకు అంబులెన్స్లో బయలుదేరిన వారు తిరుపతి–పూతలపట్టు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు శ్రీకాళహస్తి పోలీసులు వెల్లడించారు. కోల్కతాకు చెందిన బ్రజ డోలాయ్ (48) ఆస్తమాతో బాధపడుతున్నాడు.వైద్యుల సూచన మేరకు బెంగళూరులో చికిత్స కోసం ఈనెల 2న బ్రజ డోలాయ్తోపాటు భార్య టగారి డోలాయ్ (35), అంబులెన్స్ డ్రైవర్ రితేష్ (24), అతని సోదరుడు జతిన్ డోలాయ్ (63), మరో మహిళ ధగోడిస్ (45), మరో డ్రైవర్ రాకేష్ పండిట్ (29) బయలుదేరారు. సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న వీరి అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బ్రజ డోలాయ్, భార్య టగారి డోలాయ్, జతిన్ డోలాయ్, రితేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ధగోడిస్ (45), అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ పండిట్ (29) శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్కతాలోని బంధువులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పిల్లల పొలం బడి
మీరెప్పుడైనా పచ్చని పంట పొలాల దగ్గరకి వెళ్లారా? వ్యవసాయం గురించి ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగితే... మీలాంటి పిల్లలలో చాలామంది చెప్పే జవాబు...‘వెళ్లలేదు’... ‘తెలియదు’ పాలు ఎక్కడినుంచి వస్తాయి? ఒక అమ్మాయిని ఎవరో అడిగారట... ‘పాలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని! దానికి ఆ పాప... ‘టెట్రా ప్యాక్లో నుంచి వస్తాయి’ అని చెప్పిందట!ఇది విన్న ఆ పాప తండ్రి కిరుబ శంకర్ ఆశ్చర్యపోయారు. కిరుబ శంకర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయనకు పంటపొలాలు మరో స్కూల్. స్కూల్ అయిపోగానే అక్కడికి పరుగెత్తుకు వెళ్లేవాడు. గొర్రెలతో, మేకలతో ఆడుకునేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసు.వెల్కమ్ టు వక్సాన ఫార్మ్స్మరేమో, మీ తరం పిల్లల విషయానికి వస్తే... చాలా మందికి వ్యవసాయం గురించి బొత్తిగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ అంకుల్ తమిళనాడులోని రెట్టనై గ్రామంలో మీలాంటి పిల్లల కోసం వ్యవసాయ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. పద్నాలుగు ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రం (వక్సాన ఫార్మ్స్)లోకి మీరు అడుగుపెడితే వ్యవసాయం గురించి సమస్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘వక్సాన’ అంటే పచ్చదనంతో నిండిన సారవంతమైన భూమి అని అర్థం.ఎంచక్కా... విత్తనాలు నాటవచ్చు, పొలం దున్నవచ్చు...‘వక్సాన ఫార్మ్స్’లో పంటలు, రకరకకాల చెట్లు, జంతువులు, కాలువలు... ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు. పొలంలోనే మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి. ఆ తరువాత జంతుప్రపంచంలోకి తీసుకువెళతారు. అక్కడ గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె... మొదలైన వాటితో పాటు బాతులు, హంసలు, టర్కీలు ఉంటాయి.‘జంతువులు, వ్యవసాయం వేరు కాదు’ అంటూ వ్యవసాయ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యం, కష్టం గురించి తెలియజేస్తారు. మీలాంటి పిల్లలకు ఇప్పుడు ఈ ‘ఫార్మ్ క్యాంప్’ ఫెవరెట్ స్పాట్ అయింది. ఈ ‘ఫార్మ్స్ క్యాంప్’లో మీరు ఒక రోజు పూర్తిగా గడపవచ్చు.పొలం దున్నడం, సాగు కోసం భూమిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, ట్రాక్టర్ సవారీలు... ఇలా ఎన్నో ఉంటాయి. ఈ పనులన్నీ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎద్దులను ఉపయోగించి చేసే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కూడా మీకు ఇక్కడ పరిచయం చేస్తారు. ఆధునిక వ్యవసాయానికి, ఒకప్పటికి వ్యవసాయానికి తేడా ఏమిటో వివరంగా చెబుతారు. పిల్లలు వాటికి ఆహారం పెడతారు. వాటి ప్రవర్తనను దగ్గరి నుంచి గమనిస్తారు. పొలం పనులకు అవి ఎలా ఉపయోగపడుతాయో ప్రత్యక్షంగా చూస్తారు.రాత్రి ఆరు బయట భోజనం... ఆ తరువాత కథలుసాయంత్రం కావడానికి ముందు పొలానికి దగ్గరలోని చెరువులో పిల్లలు ఈత కొడతారు. పంపు సెట్ల కింద స్నానం చేస్తారు. పొలాల్లో నడుస్తూ, కూరగాయలు కోసి రాత్రి భోజనానికి ఏమి వండాలో చెబుతారు. తల్లిదండ్రులు, అక్కడ ఉన్నవారితో కలిసి వంట చేస్తారు. రాత్రి భోజనాన్ని ఆరుబయట వడ్డిస్తారు. ఆ తరువాత మంట చుట్టూ చేరి కథలు చెప్పుకుంటారు. ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీలాంటి పిల్లలు రైతు జీవితాన్ని గడపవచ్చు. మీరు ఒకరోజు పొలంలో పనిచేయడం వల్ల వ్యవసాయం గురించి మాత్రమే కాదు పర్యావరణం గురించి కూడా తెలుసుకోవచ్చు. బంబరం, తాయంబాస్, కిట్టి పుల్, ఉరియడిలాంటి సంప్రదాయ గ్రామీణ ఆటలను, వ్యాయామాలను పరిచయం చేస్తారు. ‘పిల్లలు భవిష్యత్లో తల్లిదండ్రులవుతారు. వారు ఇక్కడ పొందిన అనుభవం వారి భవిష్యత్కు బాగా ఉపయోగపడుతుంది’ అంటున్నారు కిరుబ శంకర్.24 గంటలుప్రతి క్యాంపులో పదిమంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫార్మ్క్యాంప్లో ఏప్రిల్, మే నెలలో క్యాంప్లు నిర్వహిస్తారు. మేలో జరిగేవి... 9–10 మే, 16–17 మే, 30–31 మే. కార్యక్రమాలు శనివారం ఉదయం పదిగంటల నుండి ఆదివారం ఉదయం పది గంటల వరకు జరుగుతాయి.vaksanafarms.in/special/summer-camp/– యాకూబ్ -
భద్రంగుండేనా..!
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు మరింత తీవ్రతరం అవుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో సంభవించే గుండె జబ్బులు ఇప్పుడు పాఠశాల విద్యార్థులు, యువకుల్లోనూ అధికం అవుతున్నాయి. 2022–23లో దేశంలోని ప్రతి వెయ్యి మందిలో 131 మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా 2025 నాటికి ఆ సంఖ్య 152కు పెరిగింది. మొత్తం రోగాల్లో గుండె జబ్బుల వాటానే అధికం. ఈ అంశం ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్)–80వ నివేదికలో వెల్లడైంది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం నమోదవుతున్న మొత్తం వ్యాధుల్లో 25.6 శాతం వాటాతో గుండె జబ్బులే ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏడేళ్లలో మూడు రెట్లు పెరుగుదల దేశంలోని 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో గుండె జబ్బులు ముప్పే అధికంగా ఉంది. వృద్ధుల్లో నమోదవుతున్న మొత్తం జబ్బుల్లో హృద్రోగ సమస్యల వాటా 37.8 శాతం ఉంది. ఇక 15 నుంచి 44 ఏళ్ల యువత, మధ్యవయసు్కల్లో మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం వంటి మెటబాలిక్, ఇన్ఫెక్షన్ల అనంతరం గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టమైంది. 30 నుంచి 44 ఏళ్ల వారిలో 15.3 శాతం వాటాతో గుండె సమస్యలు మూడో స్థానంలో ఉన్నాయి. 45–59 ఏళ్ల వారిలో 30.1 శాతంతో రెండో ప్రధాన అనారోగ్య సమస్యగా కనిపిస్తోంది.2017–18లో చేపట్టిన ఎన్ఎస్ఎస్ సమయంలో ప్రతి లక్ష మందిలో 1333 మంది గుండె సమస్యలతో బాధపడుతున్నట్టుగా వెల్లడించగా, 2025 నాటికి వారి సంఖ్య 3,891కు పెరిగింది. ఈ లెక్కన పరిశీలిస్తే గుండె జబ్బుల సమస్యలు ఏడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు తేటతెల్లమవుతోంది. ఇంత వేగంగా సమస్య పెరగడమంటే ఇది సైలెంట్ ఎపిడెమిక్ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంటు వ్యాధుల కంటే వేగంగా జీవనశైలి వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ఇది దేశానికి పెద్ద ఆరోగ్య సవాలని స్పష్టం చేస్తున్నారు. గుండె జబ్బుల బారినపడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. -
‘దళపతి’ దండయాత్ర.. అధికారానికి అడుగు దూరంలో..
సాక్షి, చెన్నై: అంచనాలకు ఏమాత్రం అందని విజయం..! ఒంటరి పోరులో ‘దళపతి’ విజయ విహారం..! పెరంబూర్, తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్ రెండు చోట్లా ‘విజిల్’మోత! చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్గా విజయ్.. రెండేళ్లలోనే బలమైన రెండు ద్రవిడ పార్టీలను మట్టి కరిపించారు.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించారు.. తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు.. అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అధికార పీఠానికి మరొక్క అడుగు దూరంలో నిలిచింది. టీవీకే 107 స్థానాలలో విజయం వైపుగా దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది. రెండు చోట్లా గెలిచిన ‘దళపతి’ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. డీఎంకే అధికారాన్ని కోల్పోగా ఈ కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలను దక్కించుకుంది. తమిళనాడు ఎన్నికలలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేయగా రికార్డు స్థాయిలో 85.15 శాతం ఓటింగ్ నమోదైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు డీఎంకే వైపు మొగ్గుచూపగా మరికొన్ని అన్నాడీఎంకేకు అనుకూలంగా వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికారం విజయ్దే అని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా సోమవారం ఉదయం కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠ పోరులో.. తమిళనాడులోని 234 అసెంబ్లీ సీట్లకు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించినా క్రమంగా టీవీకే పుంజుకోవడ ం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు టీవీకే ఖాతాలో పడ్డాయి. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతి స్వల్ప మెజారిటీతో డీఎంకే, టీవీకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ నెలకొంది. రెండు ద్రవిడ పార్టీ లను వెనక్కి నెట్టి ఈవీకే క్రమంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యాహ్నం సమయానికి డీఎంకే మూడో స్థానంలో నిలవగా అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంది. అనంతరం 1,000 నుంచి 2 వేల ఓట్ల ఆధిక్యంతో టీవీకే, డీఎంకే మధ్య నువ్వా..నేనా అన్నట్లుగా కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. వంద నియోజక వర్గాలు దాటిన తదుపరి టీవీకే తన ఆధిపత్యం చాటుకుంది. మధ్యాహ్నం సమయానికి పలు నియోజకవర్గాలలో తుది ఫలితం వెలువడాల్సి ఉండగా కొద్దిగా జాప్యమైంది. సాయంత్రం మదురై దక్షిణం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి గోపీషన్ తొలుత విజయకేతనం ఎగుర వేశారు. అనంతరం అదే పార్టీకి చెందిన సీనియర్ నేత సెంగోట్టయన్ గోబి చెట్టి పాళయంలో విజయం సాధించారు. క్రమంగా టీవీకే అభ్యర్థుల విజయ పర్వం కొనసాగడం మొదలైంది. గెలిచిన వారిలో అత్యధిక శాతం మంది రెండు వేలు, ఐదు వేలు, పది వేలలోపు మెజారిటీకే పరిమితమయ్యారు. అధికారానికి అడుగు దూరంలో..తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టేందుకు 118 స్థానాలు అవసరం. ఇప్పటివరకు ద్రవిడ పార్టీలు సంపూర్ణ మెజారిటీతో సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. తాజాగా టీవీకే సునామీ సృష్టించినా అధికారానికి స్పల్ప దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేనా? అనే చర్చ సాగుతోంది. ఫలితాలలో టీవీకేకు నగర ఓటర్లు అండగా నిలిచారు. నగరాలలో 69 నియోజకవర్గాలు ఉండగా 60 స్థానాలను టీవీకే కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో 165 స్థానాలు ఉండగా, టీవీకే 47 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందిన చాలా చోట్ల టీవీకే అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెన్నైలో 16 నియోజకవర్గాలు ఉండగా కేవలం రెండు చోట్లే ఆ పార్టీ గెలిచింది. మిగిలినవన్నీ టీవీకే ఖాతాలో చేరాయి. సంకీర్ణం దిశగా.. ⇒ విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదు ర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవ కాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. ⇒ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న కాంగ్రెస్ 28 చోట్ల, దివంగత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే 10 చోట్ల, ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే 8 చోట్ల, సీపీఎం, సీపీఐ చెరో ఐదు చోట్ల, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రెండు స్థానాల్లో పోటీ చేశాయి. 58 స్థానాలు పైన పేర్కొన్న మిత్రులకు పోగా మిగిలిన 176 స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంతో అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో డీఎంకే అభ్యర్థులు 164 మంది బరిలో నిలవగా 12 మంది చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులున్నారు. ⇒ అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న బీజేపీ 27 చోట్ల, పీఎంకే 18 చోట్ల, ఏఎంఎంకే 11 చోట్ల, టీఎంసీ 5 చోట్ల, ఏజేకే 2 చోట్ల, టీఎంఎంకే, పురట్చి భారతం, పుదియ నిధి కట్చిలు తలా ఒకచోట పోటీ చేశాయి. ఇందులో టీఎంసీ బీజేపీ కమలం చిహ్నంతో పోటీ చేసింది. అన్నాడీఎంకే 168 చోట్ల బరిలో నిలిచింది. ⇒ ఎన్నికలలో మార్పు నినాదంతో తొలిసారిగా, ఒంటరిగా బరిలో దిగిన సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ 233 స్థానాలలో పోటీ చేసింది. (సేలం ఎడప్పాడిలో పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది). మరో నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి 234 స్థానాలలో పోటీ చేసింది. ఇందులో 50 శాతం మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. విజయ్.. విన్నింగ్ షాట్సాక్షి, అమరావతి: 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు... పోలింగ్ రోజు విజయ్ చెన్నైలోని తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తానని తొలిసారిగా సంకేతం ఇచ్చారు.. ఐదేళ్ల తర్వాత ఆయన రాజకీయ తొలి ఇన్నింగ్స్లోనే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవరూ ఊహించలేదు.. 50 ఏళ్లుగా బలంగా పాతుకు పోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూకటి వేళ్లను పెకలిస్తారని దిగ్గజ విశ్లేషకులు కూడా అంచనా వేయలేదు.. అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ఇన్నింగ్స్లోనే విన్నింగ్ షాట్ కొట్టిన సరికొత్త రాజకీయ సూపర్స్టార్గా విజయ్ నిలిచారు. తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం..విజయ్ రాత్రి 7 గంటలకు చెన్నై అడయార్లోని నివాసంలో తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నుంగంబాకంలోని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఎన్నికల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికిన అభిమానులకు విజయ్ అభివాదం చేశారు. -
ఆకివీడు రామాలయ అనుమతులపై పిటిషన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగా జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వివరించారు.ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ సోమవారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముందు ప్రస్తావించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. -
బీజేపీ పంచతంత్రం
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనను కమలం పార్టీ కూలదోసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పొరపాటని రుజువు చేస్తూ ఊహించని విజయం దక్కించుకుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ‘దీదీ’మమతా బెనర్జీ ఆశయం నెరవేరలేదు. ‘మా, మాటీ, మానుష్’నినాదాన్ని ఈసారి బెంగాలీలు విశ్వసించలేదు. 34 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా సాగిన కమ్యూనిస్టుల పరిపాలనను అంతం చేసి 2011లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ 15 ఏళ్ల తర్వాత పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మహిళలు, ముస్లింలు, వలసదార్లు, హిందూ మతస్థులైన మథువా సామాజికవర్గం, బీజేపీ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో తమ పార్టీకి ప్రధాని మోదీ ఏకైక ఆకర్షణగా నిలిచారు. ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. పార్టీకి ఆయనే అతిపెద్ద ఆశాకిరణంగా మారారు. గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని పనిచేశారు. పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. విజయంలో ఆయనకు సింహభాగం వాటా దక్కుతుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు స్ట్రీట్ ఫైటర్ అనే ఇమేజ్తో సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, ఈసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లు తొలగింపునకు గురికావడం, హిందూ ఓటు బ్యాంకు బీజేపీ వెనుక సంఘటితం కావడం, శాంతి భద్రతలు దిగజారడం వంటివి తృణమూల్ను ఓడించాయి. మహిళలుబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లూ మహిళలే వెన్నుముకగా నిలిచారు. ఆ పార్టీ వరుసగా మూడుసార్లు గెలిచిందంటే మహిళల ఆదరణే ప్రధాన కారణం. వారి సంక్షేమం కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది ‘లక్ష్మీ భండార్’. ఈ పథకం కింద పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. చదువుకొనే బాలికలను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కన్యాశ్రీ పథకాన్ని అమలు చేశారు. కానీ, కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటన టీఎంసీ సర్కార్పై మాయని మచ్చగా మిగిలిపోయింది. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెచ్చుమీరాయి. దీంతో ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. పరిస్థితిని గమనించిన బీజేపీ మహిళలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తామని, వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో మహిళా సంక్షేమ పథకాలు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో బలైపోయిన విద్యార్థిని తల్లిని బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు. ఇవన్నీ బీజేపీ పట్ల మహిళల్లో సానుకూలత పెంచాయి. ముస్లింలుబెంగాల్ జనాభాలో ఏకంగా 27 శాతం ఉన్న ముస్లింలు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదార్లు. 30 శాతం నుంచి 90 శాతం దాకా ముస్లిం జనాభా ఉన్న నియోజవకర్గాలు 146 ఉండగా, 2021లో టీఎంకే 131 స్థానాలు గెల్చుకుంది. గత 15 ఏళ్లుగా మెజార్టీ సీట్లు దక్కించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) వంటి ముస్లింలలో భయాన్ని పెంచాయి. బెంగాల్లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ పరిణామాల వల్ల ముస్లింలు ఈసారి కూడా అండగా నిలవడంతో దీదీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెల్చినట్లు స్పష్టమవుతోంది. మైనార్టీల అండ లేకపోయినా హిందువులు తమకు అనుకూలంగా ఓట్లు సంఘటితం కావడం బీజేపీకి కలిసొచ్చింది. వలసదార్లుబెంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక స్థానికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం పరిపాటి. ఈ వలసదార్లు అత్యంత ప్రభావవంతమైన వర్గంగా మారిపోయారు. చాలాస్థానాల్లో ఫలితా లను నిర్దేశించేది వారేనంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండటానికి, చట్టబద్ధమైన నివాసితులుగా గుర్తింపు పొందడానికి ఓటు వేయడం తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీ వలస కార్మికులు, ఇతర వృత్తి నిపుణులు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. స్థానికంగానే ఉద్యోగా లు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ బీజేపీ ఇవ్వ డం వలసదార్లను ఆకర్శించింది. అందుకే వారు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.మథువాలుదళితులైన మథువాలు హిందువులే. వీరు రాష్ట్ర జనాభాలో 17% దాకా ఉంటారు. బీజేపీకి మద్దతుగా నిలిచారు. పొరుగుదేశాల్లో మత హింసకు గురై శరణార్థులుగా వచ్చిన మథువాలకు భారత పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. బెంగాల్లో అట్టడుగున ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి చేరుకోవడానికి కారణం మథువాల మద్దతే. ప్రస్తుత ఎన్నికల్లోనూ వారు బీజేపీని బలపర్చారు. బీజేపీ యంత్రాంగంబెంగాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాపకిందనీరులా చొచ్చుకొచ్చారు. గత రెండేళ్లుగా ఇంటింటి ప్రచారం, ప్రతి ఓటర్ను కలవడం వంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేశారు. బూత్స్థాయిలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు సైతం తరలిరావడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రబాబు పాపం.. సీమకు శాపం
మార్కాపురం: చంద్రబాబు పాపం.. సీమకు శాపంగా పరిణమించిందని, రానున్న రోజుల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటి కోసం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా శైలజానాథ్, కారుమూరి, ఇతర వక్తలు మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లనుందని, దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి తానే చంద్రబాబుతో మాట్లాడి సీమ ప్రాజెక్టును ఆపించానని చెప్పారని, దీనిని బట్టి చంద్రబాబు రేవంత్తో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయం స్పష్టమైందని ధ్వజమెత్తారు. సీమకు అడుగడుగునా ద్రోహం చంద్రబాబు సీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారని, మెడికల్ కాలేజీలనూ పూర్తి చేయకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. నాడు శ్రీకృష్ణ కమిటీ దొనకొండను రాజధాని చేయాలని సిఫార్సు చేస్తే.. దానిని పక్కన పెట్టి తన బినామీలు, అనుచరుల కోసం అమరావతిని బాబు రాజధాని చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరితే పోలవరం నుంచి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు అందిస్తానని చెప్పడం ఎంత వరకు సబబని నిలదీశారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ సీమ హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. వెలుగొండ ప్రాజెక్టుపై బాబు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి, ఒంగోలు ఇన్చార్జిలు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, చుండూరి రవిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు మాట్లాడారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
జగనే నయం.. రైతులను ఆదుకున్నారు
కడప (సెవెన్ రోడ్స్): ‘గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే నయం. అన్నమయ్య డ్యామ్ తెగిపోయి తీవ్రంగా నష్టపోతే మా పక్క గ్రామమైన పులపత్తూరు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. మేట వేసిన ఇసుకను తోలుకోవడానికి పర్మీషన్ ఇచ్చారు. టీడీపీ కూటమి ఏదో ఒరగబెడుతుందని నమ్మి ఓట్లువేస్తే.. రెండున్నర సంవత్సరాలైనా మా పొలంలో ఇసుక మేటలు తొలగించలేదు.కలెక్టరేట్కు తిరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం చింతలకోన గ్రామ రైతు, జనసేన కార్యకర్త కూటాలగారి వెంకటయ్య అధికారుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరును ఎండగడుతూ బైఠాయించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి కలెక్టర్ వచ్చాక తామే ఆయన వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వెంకటయ్య వినలేదు. దీంతో పోలీసులు అతడిని బయటకు పంపించివేశారు. -
మార్గదర్శి కేసు ముగించాలంటే.. ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం
ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన.. కొనసాగుతున్న ఆర్థిక సంస్థపై నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజా ధనానికి సంబంధించి చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..! – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంకోర్టులో తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన నిందితుడు రామోజీరావు మరణించినందున ఈ కేసును కొట్టివేయాలన్న మార్గదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. రామోజీరావు మరణించినా.. సంస్థ కార్యకలాపాలు ఇంకా కొనసాగిస్తున్నందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని తేల్చి చెప్పింది. ‘ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి, ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. మార్గదర్శిపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్, మార్గదర్శి ఫైనాన్షియర్స్కు నోటీసులు జారీ చేసింది. బాధితులందరికీ చెల్లింపులపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏకంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు సేకరించడంపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసు మెయింటెనబుల్ కాదన్న మార్గదర్శి వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించటాన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్, న్యాయవాదులు అల్లంకి రమేష్, మమత వాదనలు వినిపించారు. వ్యక్తి మరణిస్తే.. సంస్థపై కేసు ఆగిపోదు విచారణ ప్రారంభం కాగానే మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన నిందితుడు మరణించిన నేపథ్యంలో ఈ కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనాన్ని కోరారు. దీన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన కేసు ముగియదని, జరిమానా చెల్లించే బాధ్యత హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్)పై ఉంటుందని నివేదించారు. దర్యాప్తు పెండింగ్లో ఉండగానే.. రామోజీ మరణించారన్న కారణంతో ఆయనతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై గతంలో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసిందన్నారు. భారీ ఆర్థిక అవకతవకలను, ప్రజా ప్రయోజనాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన విషయం స్పష్టంగా రుజువవుతున్నా హైకోర్టు సాంకేతిక కారణాలతో కేసును కొట్టేసిందన్నారు. అటు ఐటీ శాఖ, ఇటు ఆర్బీఐ వద్ద మార్గదర్శి అక్రమాల వివరాలు ఉన్నాయని నివేదించారు. మార్గదర్శిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించాలని ధర్మాసనాన్ని కోరారు. ఎఫ్ఐఆర్ అనేది ’ఎన్సైక్లోపీడియా’ కాదు దర్యాప్తు ఇంకా పూర్తికాని దశలో హైకోర్టు కేసును కొట్టివేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎఫ్ఐఆర్ అనేది నేరాలకు సంబంధించిన ‘పూర్తి ఎన్సైక్లోపీడియా’ కాదని ఉదహరించారు. డిపాజిట్ల సేకరణపై దశాబ్దాలుగా నియంత్రణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. మార్గదర్శి రూ.వేల కోట్లు వసూలు చేస్తూ కార్యకలాపాలు సాగించిందని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, రెగ్యులేటరీ సంస్థ ఆర్బీఐ వాదనలను సైతం హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని నివేదించారు. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన కేసులో దర్యాప్తును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందన్న రంగాచారి... ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజున జీవో 800 జారీ చేసింది. రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. రంగాచారి విచారణను పూర్తి చేసి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల వద్ద నుంచి రూ.వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాక మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన నివేదికలో పేర్కొన్నారు. అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు అధీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ 2008 జనవరి 23న హైదరాబాద్ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58 కింద శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. అందరి వాదనలు వినాలన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉండవల్లి అరుణ్కుమార్తో పాటు అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి, అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టిన తెలంగాణ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆయనతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై కేసును కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా సోమవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ జరిపింది. రూ.వేల కోట్లు కొల్లగొట్టిన రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యాలయాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ఇలా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిన వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని కూడా చెప్పడంతో డిపాజిటర్ల ప్రయోజనాల కోసం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
అయ్యో ‘బాబు’!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ గెలుపొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు మద్దతుగా చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి అశి్వన్కుమార్కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు. -
కరెంట్ అక్రమాలపై సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా..వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. జస్టిస్ లోకూర్ నివేదికను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించింది. సీఎం ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 9 నెలల క్రితం సీబీఐ విచారణను కోరిన రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా విద్యుత్ రంగ నిర్ణయాలపై సైతం సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం గమనార్హం. మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి..మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. కొనుగోళ్లు, నిర్మాణం పేరిట నిధుల దుర్వినియోగం ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అలాగే 4000 మెగావాట్ల యాదాద్రి, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే ఏడాది జూలైలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జస్టిస్ లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, అదే ఏడాది అక్టోబర్లో ప్రభుత్వానికి 114 పేజీల నివేదికను సమర్పించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. కాగా నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు..’ అని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆదాయ వనరుల నివేదికపై చర్చ ‘ఆదాయ వనరుల సమీకరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి 4 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యం సిఫారసుల మేరకు శాస్త్రీయ విధానంలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీలోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి కొత్త ధరలు, చార్జీలను ప్రకటించాలని అధికారులను ఆదేశించింది. పరిహారం రేట్లపై అసంతృప్తి వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తి ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల పరిహారం ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరించనున్నాయి. హిల్ట్ పీ దరఖాస్తుదారులకు అవకాశం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేలోపు హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ) కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించేలా వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి..’ అని మంత్రి చెప్పారు. ఎన్డీడీబీకి నార్మాక్ ‘నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల సహకార సంస్థ (నార్మాక్)ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంఓయూను ఆమోదించింది. – యాసంగిలో పండిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరూ అభద్రతకు లోనుకావద్దని సూచించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంట నష్టం అంచనాలను తెప్పించాలని ఆదేశించింది. – 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బకాయిల వసూళ్లకు ఓటీఎస్ – క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడిన పన్నుల వసూళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5,864 కోట్ల బకాయిలుండగా.. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి ఓటీఎస్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ జల మండలికి ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉన్న నీటి బకాయిలపై వడ్డీలు, జరిమానాలు రద్దు చేయాలని నిర్ణయించింది. – రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లో అధునాత కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు గాను 42 ఎకరాలను అప్పగించాలని తీర్మానించింది. ‘స్కిల్స్’ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్లు – రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. – ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది..’ అని పొంగులేటి తెలిపారు. -
మన పవన్లో ఆ ఫైరేదీ?!
సాక్షి, అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య విజయం తర్వాత జనసేన పార్టీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. ఆ రాష్ట్రంలో విజయ్కు ఉన్నంత సినిమా గ్లామర్ మన రాష్ట్రంలో పవన్కళ్యాణ్కూ ఉన్నా.. ఆ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయారనే చర్చ సాగుతోంది. సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఒంటరిగా పోటీ చేసి సత్తాచాటి సీఎం కాగలుగుతున్నప్పుడు పార్టీ పెట్టి 12 ఏళ్లయినా పవన్ ఇంకా పొత్తుల జపం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ కి ఊడిగం చేయాల్సిన దుస్థితి తమకేంటని మథనపడుతున్నాయి. ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్నా.. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం తమకు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల పంపకంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధ పడుతున్నారు. పదవుల సంగతి దేవుడెరుగు కనీస గౌరవమూ దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మిమ్మల్ని టీవీకే జెండా తప్ప మరే జెండా మోయనివ్వను’ అని తన కార్యకర్తలకు టీవీకే అధినేత విజయ్ భరోసా ఇచ్చినట్టు తమ అధినేత పవన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైగా ఇంకో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతోందని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పటి నుంచి జనసేనలోని పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఇదే విధంగా విస్తృతంగా చర్చసాగుతోంది. విజయ్తో పవన్ను పోల్చి చూసుకుని సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా విజయ్ అభ్యర్థులను పెట్టి పోటీ చేసి సత్తాచాటిన నేపథ్యంలో ఏపీలో ఉన్న 175 స్థానాల్లో్ల తమ పార్టీ కి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని గతంలో పవన్ అన్న మాటలను గుర్తుచేసుకుని జనసేన నేతలు రగిలిపోతున్నారు. తొలి నుంచీ పవన్ భయం భయంగానే.. పవన్ తొలి నుంచీ భయం భయంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారన్న చర్చ నడుస్తోంది. విజయ్ మాదిరి ధైర్యంగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2014లో జనసేన పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీ కూటమికి మద్దతు తెలిపి పలాయనవాదం అందుకోవడంతోనే ప్రజల్లో పవన్ పలుచనైపోయారనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినా.. పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన పవన్ ఏమాత్రం ఎందుకు ప్రభావం చూపలేకపోయారన్న చర్చ నడుస్తోంది.2024 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పడేసిన 21 సీట్లతో సర్దుకుని పోటీ చేసిన పవన్ తనకు బలం లేదని, అన్ని చోట్లా పోటీ చేయడానికి తమకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని ఎన్నికల ప్రచారసభల్లో బేల వచనాలు పలకడాన్ని బట్టి ఎన్నడూ పవన్ రాజకీయంగా ధైర్యం కనబరచలేదని జనసేన శ్రేణులు మథనపడుతున్నాయి. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడూ మరో 15ఏళ్లు పొత్తులే అంటూ చేస్తున్న ప్రకటనలపైనా విస్మయం వ్యక్తమవుతోంది.తెగువే ‘విజయ్’బావుటా.. తమిళనాడులో విజయ్ చూపిన తెగువే ఆ రాష్ట్రంలో 60 ఏళ్లుగా అధికారం దక్కించుకుంటున్న ద్రవిడ పార్టీ ల పీచమణిచింది. అక్కడ ఉండే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన విజయ్ తొలినుంచి ధైర్యంగా ముందడుగేశారు. ఎవరితోనూ ‘పొత్తులు పెట్టుకోనని కరాఖండీగా తేల్చిచెప్పారు. ‘‘ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించను, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయను.’ అంటూ తన అభిమానులు, పార్టీ శ్రేణుల్లోనూ ధైర్యం నింపి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన సినిమాను ఆపినా, లీక్ చేసినా, 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేసినా ధీరుడిగా పోరాడారు. చివరకు అంచనాలను తలకిందులు చేసి అనూహ్యంగా జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికైనా సొంతంగా ఎదిగే ధైర్యముందా? పవన్ ఇప్పటికైనా ఏపీలో సొంతంగా ఎదిగే ధైర్యం చేస్తారా? విజయ్ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతారా? తెలుగుదేశం కబంధహస్తాల నుంచి బయటకొచ్చి సొంతంగా సత్తాచాటే స్థాయికి ఎదుగుతారా? అనే చర్చ జనసేనలో విస్తృతంగా సాగుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందే ఓట్లు చీలనివ్వను అంటూ పొత్తుల బాట పట్టిన పవన్.. అప్పటికే అవసాన దశలో ఉన్న టీడీపీకి ఊపి రి పోసి.. తాను మాత్రం ఎదగలేకపోయారనే భావన జనసేనలో ఇప్పటికీ వ్యక్తమవుతోంది. ఎన్నికల్లోనూ టీడీపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని తన ఎదుగుదలకు తానే గండికొట్టుకున్నారనే ఆవేదన వినిపిస్తోంది. ఇప్పటికైనా పవన్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు రాబట్టవచ్చని జనసేన శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఇంకో 15ఏళ్లు పొత్తు అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై తలలు పట్టుకుంటున్నాయి. పవన్ తీరే వేరు.. ఏపీలో సినీ గ్లామర్తోనే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తీరు వేరేగా ఉందని జనసేన శ్రేణులే వాపోతున్నాయి. తొలి నుంచి పొత్తుల పేరుతో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారని, జనసేన కార్యకర్తల చేత తెలుగుదేశం జెండాలు మోయిస్తూనే ఉన్నారని వాపోతున్నారు. ఈ విషయంపై జనసేనలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతూనే ఉంది. దీనిపై చాలామంది నేతలు బహిరంగంగానే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. -
బీహెచ్ఈఎల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్, తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 2.5 రెట్లు ఎగసి రూ. 1,290 కోట్లను అధిగమించింది. ప్రధానంగా విద్యుత్ ఉపకరణాల విభాగం జోరు ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 504 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 1.40 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 9,143 కోట్ల నుంచి రూ. 12,554 కోట్లకు జంప్చేసింది. దీనిలో విద్యుత్ విభాగం టర్నోవర్ రూ. 9,510 కోట్లకు బలపడింది. అంతక్రితం క్యూ4లో రూ. 6,192 కోట్లు మాత్రమే నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీహెచ్ఈఎల్ నిక ర లాభం మూడు రెట్లు వృద్ధిచెంది రూ. 1,600 కోట్లను దాటింది. 2024–25లో కేవలం రూ. 534 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 28,805 కోట్ల నుంచి రూ. 34,590 కోట్లకు పుంజుకుంది. దీనిలో విద్యుత్ ఉపకరణాల టర్నోవర్ రూ. 20,937 కోట్ల నుంచి రూ. 25,407 కోట్లకు పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు బీఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 377 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 399కు దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
ఏప్రిల్లో కోలుకున్న తయారీ
న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్ నెలలో కాస్తంత మెరుగుపడింది. తయారీ రంగంలో పనితీరును సూచించే హెచ్ఎస్బీసీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ సర్వే) 54.7 పాయింట్లుగా నమోదైంది. మార్చిలో ఇది 53.9గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగేందుకు దారితీసింది. కానీ, గత నాలుగేళ్లలో ఇది రెండో బలహీన వృద్ధి కావడం గమనార్హం. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి, ఉపాధి కల్పన తదితర అంశాల ఆధారంగా పనితీరును హెచ్ఎస్బీసీ ప్రతి నెలా అంచనా వేస్తుంటుంది. సాధారణంగా 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన తగ్గుదల చూస్తారు. విక్రయాలు, ఉత్పత్తికి బలమైన డిమాండ్ అనుకూలించినట్టు పీఎంఐ సర్వే తెలిపింది. ‘‘పశి్చమాసియా ఘర్షణల ప్రభావం తయారీపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2022 ఆగస్ట్ తర్వాత తయారీ వ్యయాలు వేగంగా పెరిగాయి. దీంతో తుది ధరలు సైతం ఆరు నెలల్లోనే అధికంగా పెరిగాయి’’అని హెచ్ఎస్బీసీ ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. కొత్త ఎగుమతుల ఆర్డర్లు, ఉపాధి కల్పన మోస్తరుగా పెరిగినట్టు చెప్పారు. ఎగుమతి ఆర్డర్లు ఏడు నెలల్లోనే వేగవంతంగా పెరిగినట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెన్యా, చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే నుంచి ఆర్డర్లు పెరిగాయి. మరోవైపు తయారీలో ఉపాధి కల్పన మోస్తరుగా పెరిగింది. 400 తయారీ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించి హెచ్ఎస్బీసీ ప్రతి నెలా ఈ వివరాలు విడుదల చేస్తుంటుంది. -
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు,వైశాఖ మాసం, తిథి: బ.చవితి తె.4.51 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి పంచమి, నక్షత్రం: జ్యేష్ఠ ఉ.10.41 వరకు తదుపరి మూల, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.58 వరకు తదుపరి రా.10.48 నుండి 11.33 వరకు,అమృత ఘడియలు: లేవు, సంకటహర చతుర్ధి.సూర్యోదయం : 5.37సూర్యాస్తమయం : 6.16రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... ఆకస్మిక నిర్ణయాలు. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.వృషభం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.మిథునం..... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.కర్కాటకం..... శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.సింహం..... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.కన్య..... కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.తుల.... శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.వృశ్చికం.... సన్నిహితులతో తగాదాలు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.ధనుస్సు.... మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మకరం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు. దైవదర్శనాలు.కుంభం... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.మీనం.... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత. -
తమిళనాట టీవీకే ప్రభంజనం
తమిళనాట టీవీకే ప్రభంజనం -
10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ సంస్థ శ్రేయాస్ గ్రూప్ తాజాగా మీడియా, స్పోర్ట్స్ తదితర రంగాల్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10,000 మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్రావు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారు శ్రేయాస్ ప్రతినిధిగా చేరి, ఈవెంట్స్, రిటైల్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్లాంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విధానంలో యువత తమ సొంత ప్రాంతాల్లోనే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని శ్రీనివాస్రావు చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా గ్రూప్ హిందీ, పంజాబీలాంటి ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోకి విస్తరిస్తోంది. అలాగే కార్పొరేట్ క్లబ్, ఉత్సవ్ పేరిట ఈవెంట్స్ రంగంలో, ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ద్వారా రియల్టీలోనూ అడుగుపెట్టింది. ఏఐ ఫ్రేమ్స్ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత వీడియో ప్రొడక్షన్ స్టూడియో, ఎనీటైమ్ థియేటర్ అనే వినూత్న వినోద ప్లాట్ఫాంను ప్రారంభిస్తోంది. -
మరో రూ. 4 వేల కోట్ల అప్పు
సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బహిరంగ మార్కెట్లో బాండ్లను వేలం వేసి, రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణ సేకరణకు సిద్ధమైంది. ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం మంగళవారం ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అప్పు తీసుకోనుంది. 30 ఏళ్ల కాలపరిమితితో 8.07 శాతం వడ్డీ చెల్లించే విధంగా రూ.2 వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో 7.97 శాతం వడ్డీ చెల్లించేలా మరో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం తీసుకోనుంది.దీంతో గత నెలలో చేసిన రూ.6,900 కోట్ల అప్పుతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాల మొత్తం రూ.10,900 కోట్లకు చేరనుంది. ఏప్రిల్ నెల ఏడో తేదీన రూ.3,900 కోట్లు, అదే నెల 21న రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. ఇప్పుడు మరో రూ.4 వేల కోట్లను తీసుకోనుంది. దీంతో పాటు ఈ నెల, వచ్చే నెల కలిపి మరో రూ.5,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్బీఐకి షెడ్యూల్ ఇవ్వడం గమనార్హం. -
టీఎస్పీఎస్సీ నియామకాలు తుది తీర్పునకు లోబడే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టే నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీల చెల్లుబాటు, తెలంగాణ వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్ల గుర్తింపునకు సంబంధించిన వివాదంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది. ఈలోగా జరిగే నియామకాలు కేసు తుది తీర్పునకు లోబడే ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నోటిఫికేషన్లో ఆమోదం.. 2022లో తిరస్కరణ రాష్ట్రానికి చెందిన ఎ. విజయచంద్రారెడ్డి తదితరులు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ 2014 రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీలు పొందారని తెలిపారు. 2017లో టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ సర్టీఫికెట్లను ఆమోదించారని.. కానీ 2022 నోటిఫికేషన్లో యూజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణ వెలుపల ఉన్న వర్సిటీల పరిధిలోకి వస్తాయనే కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారన్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని.. ఈ డిగ్రీల ఆధారంగా అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వాదించారు. ఈ వాదనలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైన విశ్వవిద్యాలయం కేవలం ఆ రాష్ట్ర భౌగోళిక పరిధి లోపలే పనిచేయాలి. ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదు’అని యూజీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలకు యూజీసీ లాంటి చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు లేకుంటే ఆయా డిగ్రీలను విద్యాపరమైన అర్హతలుగా పరిగణించలేమని పేర్కొంది.అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. అలాంటప్పుడు 2017 నుంచి 2020 మధ్య విద్యార్థులు తెలంగాణలో ఉంటూ వేరే రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లలో ఎలా ప్రవేశాలు పొందారని, వాటికి గుర్తింపు ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి నియామక ప్రక్రియను నిలిపివేయబోమని.. కానీ నియామకాలన్నీ తమ తుది తీర్పునకు లోబడే జరుగుతాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
భావోద్వేగాలు మెప్పిస్తాయి: నిర్మాత అభినవ్
‘‘నేను పదేళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నప్పటికీ సినిమాఅంటే ప్యాషన్ . యూనివర్సల్ సబ్జెక్ట్తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేయాలనుకున్నాను. అలాంటి కథ ‘గోదారి గట్టుపైన..’తో కుదిరింది. ఈ సినిమా కోసం సుమంత్ గోదారి యాస నేర్చుకుని నటించాడు. జగపతిబాబు–నిధిగార్ల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అని నిర్మాత అభినవ్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ–‘‘దర్శకుడు సుభాష్కు సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ కథలో ఎమోషన్ , కామెడీ, డ్రామా అన్నీ కుదిరాయి. నిర్మాత సునీల్గారు నాకు మార్గదర్శి. నా తొలి సినిమాలోనే జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాలగార్ల వంటి నటీనటులు ఉన్నారంటే ఇందుకు కారణం ఆయనే. నాగవంశీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాను ఏపీలో సురేశ్ బాబుగారు, నైజాంలో నేను–సునీల్గారు, సీడెడ్లో తిరుపతి ప్రసాద్గారు రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రం కూడా సుభాష్ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని చెప్పారు. -
ఏం జరుగుతుంది?
రాజ్ తరుణ్, అమృతా చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకంపై రాజ్ విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘నిద్రలో నడిచే అలవాటు ఉన్న హీరో ఒక అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? అనే కాన్సెప్ట్తో ‘టార్టాయిస్’ రూపొందింది’’ అని యూనిట్ సభ్యులు తెలిపారు. -
విప్లవాల నేల మీద వినూత్న తీర్పు
నాలుగు రాష్ట్రాలు (కేరళం, తమిళ నాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన వేసవి ఎన్నికల్లో తమిళ శాసనసభ ఫలితాలు చాలావరకు అనూహ్యంగా వచ్చాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధారణ మెజారిటీకి సమీపంలోకి రావడం నిజంగా రాజకీయ పండితుల అంచనాలకు అందని విషయం. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పదిహేనేళ్లుగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ను కేంద్రంలో పాలకపక్షం బీజేపీ ఓడించి 200కు పైగా సీట్లు సాధించి తొలిసారి అధికారంలోకి రావడం కూడా అత్యధిక ఎన్నికల విశ్లేషకుల లెక్కలకు చిక్కని వాస్తవం. 1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే)లు ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత జీవించి ఉండగా జరిగిన 2016 ఎన్నికల్లో మాత్రం ఈ సాంప్రదాయం మారింది. 2011 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆమె పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఊహించని సంచలనానికి దారితీశాయి. ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం లేని మూడో పెద్ద రాజకీయ పక్షం టీవీకే 107 సీట్లు గెలుచుకుని తమిళ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. పార్టీ నిర్మాణం, తెలివైన రాజకీయ వ్యూహం, రాజకీయ అనుభవం లేకుండానే విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించడం తమిళ ప్రజల కొత్త ఆలోచనా ధోరణికి అద్దం పడు తోంది. జనాకర్షక పథకాలు, ప్రజలు ఉపయోగించే అనేక వస్తువు లను ఉచితంగా ఇవ్వడం, ఇంకా చాలా సౌకర్యాలు, పథకాల పేరిట సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీలు గుప్పించే తమిళ ఎన్నికల్లో ఇలాంటివి ఏవీ లేకుండా టీవీకే విజయం సాధించడం అంత తేలికగా బయటివారికి అర్థంకాని అంశమే.ద్రవిడ సిద్ధాంత పునాది లేకుండా గెలుపెలా?తమిళనాడులో (పాత పేరు మద్రాస్) 1952 ముందు నుంచీ సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికాయి 1967 శాసనసభ ఎన్నికలు. దశాబ్దాలుగా తమిళ నేలలో ప్రజలను ఆకట్టుకుని వేళ్లూ నిన ద్రవిడ సిద్ధాంతం పునాదిగా (బ్రాహ్మణేత వర్గాల సంక్షేమం, తమిళ భాషకు గౌరవం) ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఈ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ప్రాంతీయపక్షంగా రికార్డు నమోదు చేసుకుంది. సీఎం అణ్ణాదురై నాయకత్వంలో ఎం.కరుణానిధి వంటి పలువురు హేమాహేమీలైన నేతల ఉమ్మడి కృషితో నాడు డీఎంకే విజయం కాంగ్రెస్పై సాధ్యమైంది. అలాగే, డీఎంకే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సినీ నటుల జనాకర్షక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ పార్టీ అన్నాడీఎంకే విజయానికి ఆయన ఆకర్షణేగాక, ద్రవిడ సిద్ధాంత బలం ఉన్న డీఎంకేతో ఆయన దశా బ్దాల అనుబంధం కూడా ఉపయోగపడింది. అయితే, విజయ్ పార్టీ టీవీకేకు ఎంజీఆర్ పార్టీకి ఉన్న నేపథ్యం లేదు. యువతలో విపరీ తమైన ‘క్రేజ్’ ఆయనకు ఉందిగానీ ఎంజీఆర్లా విస్తృత రాజకీయ అనుభవం లేదు. సిద్ధాంతాలు అసలు లేకపోలేదు...2024 అక్టోబర్లో విక్రవండిలో జరిగిన టీవీకే తొలి రాజకీయ మహాసభలో ‘‘బీజేపీ మితవాద పోకడల కారణంగా ఇది టీవీకేకు ‘సైద్ధాంతిక ప్రత్యర్ధి’; డీఎంకే అనుసరించే అవినీతి, వారసత్వ రాజకీయాల వల్ల అది మాకు ‘రాజకీయ శత్రువు’ అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ లెక్కన మతతత్వ వ్యతిరేక ధోరణి, లౌకిక విశ్వాసాల కారణంగా బీజేపీని తన రాజకీయ శత్రువుగా ప్రకటించడం టీవీకే మౌలిక సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వడమే అవుతుంది. అందుకే, ఫలితాలు ప్రకటించిన రోజున డీఎంకే నేతృత్వంలోని తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కాంగ్రెస్తో కొత్తగా కూటమి కట్టడానికి విజయ్ పార్టీ సిద్ధమని ప్రకటించింది. పూర్వ పాలకపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే బదులు కేవలం ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్తో దోస్తీ తన పార్టీకి క్షేమమేగాక, సైద్ధాంతిక అనుకూల అంశమని విజయ్ గుర్తించినట్టు కనిపిస్తోంది. అత్యధిక సర్వేలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా టీవీకే గెలుపునకు కారణాలు ఏమిటనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1977లో ఎంజీఆర్ మొదటిసారి సీఎం అయి నప్పటి నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజకీయ పెత్తనం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఈ రెండు పార్టీల వ్యవస్థ తమిళులకు విసుగు పుట్టించినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్న సూపర్స్టార్ రజనీకాంత్, సొంత పార్టీ పెట్టి బోల్తాపడిన మరో స్టార్ హీరో కమల్హాసన్ అనుభవాలు గమ నించిన తమిళ ప్రజానీకం కొత్త తరం హీరో 51 ఏళ్ల విజయ్ పార్టీ టీవీకేను ఈసారి ఆదరించాలని నిర్ణయించుకున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న యువత, దళితులు పార్టీ పెట్టినప్పటి నుంచీ విజయ్కు అనుకూలంగా మారారు. యువతరంలో విజయ్పై ఉన్న మోజు గట్టి పునాదులు లేని ఆయన పార్టీకి ఏకంగా దాదాపు 110 సీట్లు వచ్చేలా చూడటం రాజకీయ విప్లవం కింద పరిగణించాలి. టీవీకే పుట్టినప్పటి నుంచీ దానికి జనంలో పెరిగిన ఆదరణ చూసిన కాంగ్రెస్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు దానితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఒంటరి పోరుకే సిద్ధం కావడంతో ‘దళపతి’తో ఎన్నికల స్నేహానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు కొద్దిలో మెజారిటీ మార్క్ (మొత్తం 234 సీట్లకుగాను 118) దక్కకపోవడం, ‘సెక్యులరిజం’ అనే సిద్ధాంతం టీవీకేతో చేతులు కలిపే అవకాశం కాంగ్రెస్కు లభించింది. తమిళ ఓటర్లు టీవీకేను ఆదరించడం ద్వారా రెండు పాత ద్రవిడ పార్టీలు మాత్రమే పాలక పక్షాలుగా దిక్కయిన పరిస్థితి నుంచి బయట పడ్డారు.విజయ్ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం (తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ పుట్టుకతో క్రిస్టియన్, తల్లి హిందువు) టీవీకేకు అనుకూల లేదా ప్రతికూల అంశం కాలేదు. రాష్టంలో కులం ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తన కులం తమిళ్ అని ప్రకటించుకోవడం తమిళ జనానికి బాగా నచ్చినట్టుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం పుట్టిన విజయ్ పార్టీకి దాని కొత్తదనం, నాయకుడికి రాజకీయ నేపథ్యం లేకపోవడం సానుకూల అంశా లుగా మారాయి. దాదాపు 8 లక్షల మంది అభిమానులతో టీవీకే మొదటి రాజకీయ మహాసభ జరిగిందంటే జనంలో విజయ్పై ఉన్న తీవ్ర అభిమానం, మోజు మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు అర్థం కాలేదని అనుకోవాలి. నేటి తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు ఉన్న పరిమితులను చెబుతున్నాయి. ఏమైనా విజయ్కు తమిళనాడు ‘దళపతి’ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా తమిళ సోదరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి సామాజిక విప్లవాల వరకూ ఆధునిక భారతంలో ముందుండి నడిచిన బెంగాలీలు, తమిళులు ఎట్టకేలకు తమ పాలకపక్షాలను, పాలకులను మార్చేలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు.కమ్యూనిస్టులకు 34, తృణమూల్కు 15 ఏళ్లు అవకాశం!పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అధికారం వస్తుందని ఎక్కువ సర్వేలు సూచించలేదు. 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని బీజేపీ పశ్చిమ బెంగాల్లో మొదటిసారి గద్దెనెక్కే అవకాశం దక్కించుకోవడం కూడా అత్యధిక మీడియా, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని వాస్తవం. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెల్చుకున్న బీజేపీ 2021లో తన బలాన్ని వంగ శాసనసభలో 77 స్థానాలు పెంచుకోవడం కొత్త రికార్డు. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి మెజారిటీ సీట్లు (294 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 అవసరం) వస్తాయని కొందరు ఎన్నికల పండితులు వేసిన అంచనాలు నిజం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన పార్టీని విజయపథంలో నడిపించారు. బెంగాల్ బెబ్బులిగా పొగడ్తలు అందుకున్నారు. గత 15 ఏళ్లుగా అవాంఛనీయ పోకడలనే తృణమూల్ అప్రకటిత పాలనా విధానంగా ఎంచుకోవడం ‘దీదీ’ పతనానికి దారితీసింది. సీపీఎం, సీపీఐ నాయకత్వంలోని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన (లెఫ్ట్ ఫ్రంట్) సర్కారు 34 సంవత్సరాల పాలనలో బెంగాల్ ప్రజల జీవితాలను పాలక కూటమికి విధే యులైన అసాంఘిక శక్తులే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం తెలిసిన విషయమే. ‘పార్టీ సొసైటీ’గా పిలిచే అవాంఛనీయ ధోర ణిని దశాబ్దపున్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అను సరించింది. అంతేగాక, బెంగాల్లో 30 శాతం వరకూ ఉన్న మైనారిటీలకు మమత పెద్ద పీట వేస్తున్నారనీ, మెజారిటీ మతస్తుల బాగోగులు ఆమెకు పట్ట వనే ప్రచారం బూటకం కాదు, నిజమనీ అత్యధిక బెంగాలీలు నమ్మారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని రేప్, హత్య వంటి కొన్ని ఘటనలు మహిళా సీఎం పాలనలో స్త్రీలకు అసలు రక్షణ లేదనే బీజేపీ ప్రచారానికి బలం ఇచ్చాయి. ‘మార్క్సిస్టుల అరాచక పాలనకు స్వస్తి పలికి సుపరిపాలన అందిస్తాన’ని సీఎం పీఠమెక్కిన మమత ఏలుబడిలో పాలన బాగా దిగజారడం, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవడానికి దోహదం చేశాయి. 2000 నవంబర్ నుంచి 2026 మే వరకూ పాతిక సంవ త్సరాలకు పైగా ఇద్దరే ఇద్దరు సీఎంలు మార్క్సిస్టు బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీలను చూసిన బెంగాలీ జనం పలు కారణాల వల్ల కొత్త ముఖం కావాలని కోరుకున్నారు. వారి ఈ ఆకాంక్ష సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని మెజారిటీ ఈ ఎన్నికల్లో సాధించడానికి ఒక ప్రధాన కారణమైంది. నాంచారయ్య మెరుగుమాలవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రోహిత్, రికెల్టన్ ఊచకోత.. లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్, రికెల్టన్ ఊచకోత229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు తొలి వికెట్కు 10.5 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు జోడించి గెలుపు ఖాయం చేశారు. అనంతరం తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ స్కోర్లకే ఔటైనా, నమన్ ధిర్ (23 నాటౌట్), విల్ జాక్స్ (10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్దార్థ్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, మొహిసిన్ ఖాన్ తలో వికెట్ తీశారు..పూరన్ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. మిగతా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 13, కెప్టెన్ పంత్ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. -
చారిత్రక సిరీస్లో పసికూనపై పాకిస్తాన్ ప్రతాపం
జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కరాచీ వేదికగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో పాక్ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సదాఫ్ షమాస్ (98) తృటిలో సెంచరీ మిస్ కాగా.. మరో ఓపెనర్ గుల్ ఫిరోజా (50), వన్డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ (67), మిడిలార్డర్ బ్యాటర్ నజిహా అల్వి (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్ 3, ఆలియా రియాజ్ 2, కెప్టెన్ ఫాతిమా సనా 11 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్ మరంగే 3 వికెట్లతో రాణించగా.. కుద్జాయ్ చిగోరా, కెప్టెన్ నోమ్వెలో సిబండ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పసికూన జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్ కెలిస్ (31) ఓ మోస్తరు స్కోర్ చేసింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్, సయ్యదా ఆరూబ్ షా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మొమినా రియాసత్, నష్రా సంధు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న జరుగనుంది. కాగా, వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. -
దళపతి విజయ్కు రజనీ, కమల్ అభినందనలు
సాక్షి,చెన్నై: విజయ్ను అభినందిస్తూ తమిళ సూపర్స్టార్ రజనీకాంత్,నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్కి,ఆయన పార్టీ సభ్యులకు నా అభినందనలు అంటూ రజనీకాంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.நடந்து முடிந்த தமிழக சட்டமன்றத் தேர்தலில் பெரும் வெற்றி பெற்ற தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு விஜய் அவர்களுக்கும், அவர் கட்சியினருக்கும் என்னுடைய வாழ்த்துகள். @TVKVijayHQ— Rajinikanth (@rajinikanth) May 4, 2026తమ మొట్టమొదటి ఎన్నికలోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ కి, వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజా సేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి 118 సీట్లు అవసరం. విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదుర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. -
పశ్చిమ బెంగాల్ సీఎంగా మహిళ..?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ప్రచారంలో పదేపదే, బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమిస్తామని చమత్కారంగా చెప్పారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మరింత ముందుకు వెళ్లి, తదుపరి ముఖ్యమంత్రి “నాన్-వెజిటేరియన్” అవుతారని చెప్పారు. దీన్ని, బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం నిషేధిస్తుందని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలవడంతో మమత స్థానంలో ఎవరు వస్తారన్నది ప్రధాన చర్చగా మారింది.అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీకి చాన్స్? ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధాన మంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని, మమతా కోటను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు.గత నెలలో మోదీ బెంగాల్ సంస్కృతితో మమేకమయ్యారు.. జాల్మురి తిన్నారు, కాళీ ఆలయం సందర్శించారు (ఇక్కడ మాంసాహారం ప్రసాదంగా ఇస్తారు). ఫుట్బాల్ ఆడారు, బెంగాలీలో ఆడియో సందేశం విడుదల చేశారు. బెంగాల్ ప్రజలు “బ్రాండ్ మోదీ”పై నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది.కానీ, ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ (రేఖా గుప్తా). మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తరువాత, మహిళా అనుకూలతను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీ ఉన్నారు. రూపా గాంగూలీ బి.ఆర్. చోప్రా “మహాభారత్” సీరీస్లో ద్రౌపది పాత్రతో ప్రసిద్ధి చెందారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు, మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య, నిసిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. -
భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి
కోల్కతా: భవానీ పూర్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. మమతాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ సందర్భంగా తన ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు. సర్పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏంజెట్లను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. పార్టీ ఏజెంట్లను అనుమతి ఇస్తామని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వచ్చిన తర్వాత డీవో ఇక్కడ లేరు అని వాపోయారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండవ సీఎంగా మమతా బెనర్జీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. -
బాలనటుడి నుంచి సీఎం వరకు.. విజయ్ ప్రస్థానం
తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ప్రభంజనం సృష్టించారు. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం..విజయ్ 1974 జూన్ 22న మద్రాస్లో జన్మించారు. చెన్నైలోని లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత సినిమాల్లో రాణించి దక్షిణ భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు యువతలో బాగా పాపులారిటీ ఉంది.అభిమానులు ఆయనను దళపతి (నాయకుడు) అని పిలుస్తారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ దర్శకుడు. విజయ్ తల్లి గాయని శోభా చంద్రశేఖర్. బాలనటుడిగా విజయ్ వెట్రి (1984) సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో “నాళైయ థీర్పు” (1992) ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్గా విఫలమైనా, విజయ్ ప్రతిభను అందరూ గుర్తించారు. ఆ తర్వాత రసిగన్ (1994), దేవా (1995) వంటి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల వేళ పూజలు, ప్రత్యేక ప్రదర్శనలు, డ్యాన్సులు వంటి వాటితో అభిమానులు హోరెత్తిస్తారు. ఎంజీఆర్ను గుర్తు చేసిన విజయ్ గతంలో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయ్కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఆయన సినిమాల ద్వారా కూడా బయటపడింది. అటువంటి సంకేతాలు సర్కార్ (2018) వంటి చిత్రాల్లో కనిపించాయి. 2024, ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం (టీవీకే) రాజకీయ పార్టీ స్థాపించారు. విజయ్ రాజకీయ సభలో చోటుచేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. 2025లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తొక్కిసలాటతో విజయ్ ఇక రాజకీయాల్లో రాణించలేరని చాలా మంది అన్నారు. అయినప్పటికీ పడి లేచిన కెరటంలా ముందుకు సాగారు విజయ్. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.603 – రూ.625 కోట్లు.విజయ్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. అది విజయ్ మక్కల్ ఇయక్కం (వీఎంఐ) అనే అభిమానుల సామాజిక సేవా సంస్థపై నిర్మితమైంది. తరువాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో మూడో శక్తిగా వేగంగా ఎదిగింది. 2025 చివర్లో ఈ పార్టీ 15 మిలియన్ సభ్యుల సంఖ్యను దాటింది. యువ ఓటర్లలో మార్పు వచ్చిందన్న సంకేతం కనిపించింది. పార్టీ ప్రాధాన్య సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించాయి. తమిళనాడులో త్రిముఖ పోరు జరిగి, డీఎంకే, అన్నాడీఎంకేను టీవీకే ఓడించింది. ఇన్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకేకే అధికారాన్ని కట్టబెడుతూ వచ్చిన తమిళ ప్రజలు ఇప్పుడు భారీ మార్పుకు నాందిపలికారు. టీవీకే విజయ్ ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించుకున్నారు. -
'ఆ దారుణాన్ని మర్చిపోలేదు.. ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారు..' హీరో నిఖిల్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ దారుణాలను ప్రజలు ఇంకా మరిచిలేదు.. క్షమించనూ లేదన్నారు. అందుకే మమతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి ఇలాంటి గతే పడుతుందన్నారు. ఆర్జీ కర్ వైద్య కళాశాల బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఈ దారుణంపై తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.కాగా.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆమె ప్రభుత్వంలోనే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. The People of West Bengal did not forget or forgive . They Taught a lesson to the Govt which did not care for the Common Person . Justice for RG KAR Medical college Horror . #RGKAR #Kolkata https://t.co/ydOioIZBdH— Nikhil Siddhartha (@actor_Nikhil) May 4, 2026 -
ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సిక్సర్ల చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2026 ఎడషన్లో భాగంగా ఇవాళ (మే 4) ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 22 ఏళ్ల అక్షత్ రఘువంశీ అనే మెరుపు వీరుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. అక్షత్ వచ్చీ రాగానే ఓ భారీ సిక్సర్ల రికార్డు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు.అక్షత్ ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. అక్షత్కు ముందు రాబ్ క్వీని (రాజస్థాన్), కెవాన్ కూపర్ (రాజస్థాన్), ఆండ్రీ రసెల్ (కేకేఆర్), కార్లోస్ బ్రాత్వైట్ (ఢిల్లీ), అనికేత్ చౌదరి (ఆర్సీబీ), జేవన్ సీల్స్ (కేకేఆర్), సిద్దేశ్ లాడ్ (ముంబై), మహీశ్ తీక్షణ (సీఎస్కే), సమీర్ రిజ్వి (సీఎస్కే), వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్) ఈ ఘనత సాధించారు.ఈ సీజన్ వేలంలో అక్షత్కు లక్నో రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. అక్షత్ తన డెబ్యూ క్యాప్ను తన ఆరాధ్య ఆటగాడు రోహిత్ శర్మ నుంచి తీసుకున్నాడు. అక్షత్ 2025 మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో ఓ మ్యాచ్లో 56 బంతుల్లో 115 పరుగులు చేసిన అక్షత్పై లక్నో సూపర్ జెయింట్స్ అప్పుడే కన్నేసింది.అక్షత్కు దేశవాలీ క్రికెట్లోనూ ఓ అదిరిపోయే రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి బంతికే సిక్సర్ బాదిన అక్షత్ ఆతర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 7 బంతుల్లో సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో 19 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (44), పూరన్ (63) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. మార్క్రమ్ (29), హిమ్మత్ సింగ్ (37) క్రీజ్లో ఉన్నారు. -
చిన్న ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ ఊరట
డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్బీఎఫ్సీలకు (బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్ ఫండ్ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్బీఎఫ్సీలు ఈ జాబితాలో ఉంటాయి.ప్రస్తుతం టైప్ 1 ఎన్బీఎఫ్సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45ఐఏ ప్రకారం ఎన్బీఎఫ్సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్ ఫండ్ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది. -
మాట తప్పిన రిషబ్ పంత్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చి వరుసగా తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరి లక్నో సూపర్జెయింట్స్ సంచలనం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం లక్నో దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన లక్నో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్జెయింట్స్ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో లక్నో కెప్టెన్ పంత్ ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పేరును ప్రస్తావించాడు. తాను పేలవ ఫామ్ను అధిగమించి ముంబైతో మ్యాచ్లో పరుగులు సాధిస్తానని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అయితే మ్యాచ్లో కేవలం 15 పరుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. నిజానికి ఈ సీజన్ను మేము మంచి ఈజ్తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 204 పరుగులు సాధించాడు.అయితే ముంబైతో మ్యాచ్లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు.చదవండి: లక్నోతో మ్యాచ్కు హార్దిక్ దూరం.. కారణమిదే! -
గ్రాండ్గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.కాగా.. వీఆర్కే రావు భారత వైమానిక దళంలో కమాండర్గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. -
పూరన్ మహోగ్రరూపం
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మే 4) జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతూ వచ్చిన అతను.. ఈ మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లక్నో తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఇతని పేరిటే ఉంది. 2023 ఎడిషన్లో కేవలం 15 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు.తాజా హాఫ్ సెంచరీలో 7 సిక్సర్లు, ఓ బౌండరీ బాదిన పూరన్.. ఓవరాల్గా 21 బంతులు ఎదుర్కొని ఫోర్, 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్తో పాటు మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో భారీ స్కోర్ దిశగా సాగుతోంది.ఒక్కసారి కుదుపుపూరన్ క్రీజ్లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్తో పాటు మిచెల్ మార్ష్ (44) కూడా ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్ పంత్ (15), అక్షత్ రఘువంశీ (11) కూడా పెవిలియన్ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 164-5గా ఉంది. మార్క్రమ్ (10), హిమ్మత్ సింగ్ (2) క్రీజ్లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2, ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీశారు.తుది జట్టు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్ఫర్, రఘు శర్మ -
లక్నోతో మ్యాచ్కు హార్దిక్ దూరం.. కారణమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఏడు ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు కెప్టెన్ హార్దిక్ దూరమవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ సమయంలో స్టాండ్ ఇన్ కెప్టెన్గా వచ్చిన సూర్యకుమార్.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక కెప్టెన్గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్ల్లో 146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమర్శలు వచ్చాయి. జట్టు ఆటగాళ్ల పట్ల దురుసు ప్రవర్తనతో చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. ఒక దశలో పాండ్యాను తప్పించి రోహిత్కు మళ్లీ పగ్గాలు అప్పగించాలని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @LucknowIPL. Surya Kumar Yadav is captaining #MI as Hardik Panyda is unwell. Updates ▶️https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/eQjzr2GXrm— IndianPremierLeague (@IPL) May 4, 2026చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్! -
'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..కియోసాకి హెచ్చరిక!ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు. ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.జీతంపై ఆధారపడటం వల్లమరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాంప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు -
అన్నాడీఎంకే మాజీ నేతకు.. టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!
కుల్లంపాళయం అర్థనారి సెంగొట్టయన్.. తమిళులకు సుపరిచితమైన పేరు. కేఏ సెంగొట్టయన్గా ప్రసిద్ధులు. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి వార్తల్లో నిలిచారు. గోబిచెట్టిపాలయం నియోజకవర్గం నుంచి 9వ సారి విజయం సాధించి చరిత్రకెక్కారు. 1977లో మొదటిసారిగా సత్యమంగళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇప్పటివరకు మొత్తం 10 పర్యాయాలు శాసనసభ్యుడిగా విజయాలు అందుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో కొనసాగిన ఆయన ఈసారి ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేయడం విశేషం.తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన సెంగొట్టయన్ గతేడాది నవంబర్లో హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీలో చేరారు. విజయ్కు మద్దతుగా నిలబడిన మొదటి సీనియర్ నేత ఆయనే కావడం గమనార్హం. టీవీకేలో చేరిన వెంటనే ఆయనకు కీలక పదవి దక్కింది. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత-స్థాయి పరిపాలనా కమిటీకి ముఖ్య సమన్వయకర్తగా నియమించారు. దీంతో పాటుగా పశ్చిమ జిల్లాలైన కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నీలగిరిలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా కూడా బాధ్యతలు అప్పగించారు.అన్నాడీఎంకేలో అవమానంటీవీకే పార్టీలో చేరడానికి కొద్ది రోజుల ముందు అన్నాడీఎంకేలో సెంగొట్టయన్ తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. అన్నాడీఎంకేని వీడిన మాజీ నాయకులను తిరిగి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామికి రుచించలేదు. పార్టీని వీడిన, బహిష్కరణకు గురైన నాయకులు తిరిగి సొంతగూటికి రావాలని పిలుపునివ్వడంతో సెంగొట్టయన్ను పళనిస్వామి టార్గెట్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించారు. సెంగొట్టయన్ మద్దతుదారుల పదవులు కూడా పీకేశారు. డీఎంకే కూటమిని ఓడించడానికే తాను మాజీ నేతలను తిరిగి రావాలని కోరినట్టు వివరించినా పళనిస్వామి పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. దీంతో విజయ్తో ఆయన చేతులు కలిపారు.సరికొత్త చరిత్రఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం తాలుకాలోని కుల్లంపాళయంలో జన్మించిన 78 ఏళ్ల సెంగొట్టయన్ తమిళ రాజకీయాల్లో అంచెలు అంచెలుగా ఎదిగారు. 10వ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. తమిళనాడు శాసనసభలో అత్యధిక కాలం పాటు సభ్యుడిగా కొనసాగిన దురై మురుగన్ సరసన చేరారు. మురుగన్ ఇప్పటికే 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో తన కటప్పాడి నుంచి టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1996 నుంచి ఇక్కడ గెలుస్తూ వస్తున్న ఆయనకు కొత్త పార్టీ చేతిలో చుక్కెదురైంది. 1984 నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సార్లు ఇక్కడి నుంచి పోటీ చేయగా మూడు సార్లు మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు.చదవండి: తమిళ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీసెంగొట్టయన్ తన నియోజకవర్గం గోబిచెట్టిపాళయంలో 10 పర్యాయాలు పోటీ చేయగా ఒకసారి మాత్రమే గెలవలేకపోయారు. ఒకే నియోజకవర్గం నుంచి ఏకంగా తొమ్మిదిసార్లు గెలిచి చరిత్రకెక్కారు. డీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం కరుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఏడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.కీలక పదవితమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే సిద్ధమవుతున్న నేపథ్యంలో సెంగొట్టయన్ కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి ఆయన అనుభవం అక్కరకు రావచ్చు. ఎందుకంటే అన్నాడీఎంకేతో ఆయనకు ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పలుమార్లు మంత్రి పదవులు కూడా నిర్వహించారు. సెంగొట్టయన్కు ఉన్న అపార అనుభవం కారణంగా టీవీకే ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..
ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయనున్నాయో తెలిసిపోయింది. తమిళనాడులో ఈ ఎన్నికలు పాత పార్టీలపై వ్యతిరేకత, కొత్త నాయకత్వం పుంజుకోవడాన్ని చూపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ప్రభావం, బెంగాల్లో బీజేపీ ఎదుగుదల, కేరళలో పాలనా మార్పు కనపడింది. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచింది.ఈ ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..విజయ్ (తమిళనాడు, టీవీకే అధినేత)తమిళనాడులో రాజకీయాల్లో మొదటి అడుగులోనే భారీ విజయం సాధించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. పెరంబూర్, తిరుచ్చిలో గెలిచారు. ఆయన పార్టీ టీవీకే సంచలనం సృష్టించింది.హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం, బీజేపీ నేత)అస్సాంలో తన నాయకత్వాన్ని మరోసారి బలంగా నిలబెట్టుకున్నాడు. జలుక్బరిలో గెలుపొందారు.సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్, బీజేపీ నేత)పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలం పెరగడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నందిగ్రామ్లో గెలుపొందారు.పినరయి విజయన్ (కేరళ సీఎం, సీపీఎం)ధర్మడం నియోజక వర్గం నుంచి పినరయి విజయన్ విజయం సాధించారు. అయితే, కేరళలో ఆయన అధికారాన్ని కోల్పోయారు.ఉదయనిధి స్టాలిన్ (తమిళనాడు, డీఎంకే నేత)తమిళనాడులోని చెపాక్ నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందారు. వీడీ సతీశన్ (కాంగ్రెస్-కేరళ)వీడీ సతీశన్ పరవూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. కేరళలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు తీసుకురావడంతో కృషి చేశారు. పళనిస్వామి (తమిళనాడు మాజీ సీఎం) పళనిస్వామి విజయం సాధించారు. ఎడప్పడి నియోజక వర్గం నుంచి ఆయన గెలుపొందారు.మమత, స్టాలిన్, గోగోయ్ ఓటమి మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి)పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయారు. ఎమ్మెల్యేగానూ గెలవలేదు. భవానీపూర్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి గెలిచారు.ఎంకే స్టాలిన్ (తమిళనాడు సీఎం)తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఎదురుదెబ్బ తిన్నారు. కొళత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కూడా వెనుకబడింది.గౌరవ్ గోగోయ్ (అస్సాం, కాంగ్రెస్)జోర్హాత్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గౌరవ్ గోగోయ్ ఓటమి పాలయ్యారు. -
కేరళం సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ..!
కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుపుతో సీఎం రేసు హాట్ టాపిక్గా మారింది. దశాబ్ద కాలం తర్వాత కేరళంను కాంగ్రెస్ దక్కించుకోవడంతో అక్కడ కాస్త జోష్ వచ్చింది. ఓవరాల్గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను చూస్తే కేరళంలో మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రమే ఆధిక్యాన్ని కనబర్చింది. కేరళంలో ఉన్న 140 అసెంబ్లీ సీట్లకు గాను 102 సీట్లను యూడీఎఫ్ దక్కించుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. మరి సీఎం ఎవరు?కాంగ్రెస్ ఎక్కడైనా అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు కేరళంలో అదే రిపీట్ అవుతుంది. ప్రస్తుతం కేరళంలో సీఎం పీఠం కోసం కాంగ్రెస్ ముఖ్యనేతల్లోనే పోరు తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేరళంలో సీఎం రేసులో ఉన్న వారిలో వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్తో పాటు శశిథరూర్ కూడా ఉన్నారు. మాకు చాలా మందే ఉన్నారు..ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారనుకుంటే ఇప్పుడు శశిథరూర్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు. వివాదాస్పద ఎంపీగా పేరున్న శశిథరూర్ తాజా వ్యాఖ్యలు తనను కూడా సీఎం అభ్యర్థికి అర్హుడుననే సంకేతాలిచ్చాయి. మరి ఆయనే స్వయంగా ఆ జాబితాలో చేరిపోయారా.. లేక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే ఇలా వ్యాఖ్యానించారా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉండగా, ఇంకా ఎవరైనా వచ్చి ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తుది నిర్ణయం హైకమాండ్దే అని శశిథరూర్ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ దగ్గర శశిథరూర్ మంచి మార్కులు ఉన్నాయా అంటే అది పూర్తిగా అవునని చెప్పలేం.సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి జై కొట్టే శశిథరూర్.. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ కోపానికి తరుచు గురవుతూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో శశిథరూర్ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. సతీశన్ది కీలక పాత్రకేరళంలో కాంగ్రెస్ విజయం సాధించడంలో వీడీ సతీశన్ది కీలక పాత్ర. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారాయన. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న సతీశన్కు సీఎం పీఠం దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ పోటీ గట్టిగా ఉండటంతో ఏమౌతుందో చివర వరకూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీఎం పీఠంపై సతీశన్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు అనుభవంలోకి వస్తాయా.. లేక అడియాశలుగా మిగిలిపోతాయనేది అధిష్టానమే నిర్ణయించాలి. రమేశ్ చెన్నితలది అనుభవం..కేరళం కాంగ్రెస్లో సీనియర్గా పేరున్న రమేశ్ చెన్నితలకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఆర్గనైజేషన్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభం; తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎదిగారు. 1982లో హరిపాడ్ నుండి మొదటిసారి గెలుపొందారు. 1989–1998లో కోట్టాయం, మావేలికర నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి సేవలందించారు. 1986-87లొ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. 2014 నుంచి 2016 వరకూ హోమ్ అండ్ విజిలెన్స్ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో సన్నిహితంగా..కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు మరియు 2026లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఈయనకి రాజకీయ అనుభవం విశేషంగానే ఉంది. 2019 నుండి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ అధినాయకత్వానికి అతి దగ్గరగా ఉండే వేణుగోపాల్ అంటే హైకమాండ్కు బాగా నమ్మకం ఎక్కువ. దాంతో కేసీ వేణుగోపాల్ కూడా సీఎం అభ్యర్థి కోసం చివరి వరకూ రేసులో ఉండటం ఖాయం.ఈ నలుగురితోనే సరా.. ఇంకా వస్తారా?ప్రస్తుతానికి ఈ నలుగురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారు. మరి ఇంకే ఎవరైనా పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో పలు బుజ్జగింపుల తర్వాతే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తూ రావడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎవరైనా తాను కూడా సీఎం అభ్యర్థినేని పోటీ కొస్తే మాత్రం అధిష్టానికి తలనొప్పులు తప్పవు. ఏది ఏమైనా కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు విజయోత్సవ మూడ్లో ఉంది. రేపట్నుంచి సీఎం కుర్చీ కోసం రేసు మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట. -
'యశ్తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్సెన్స్'
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్తో ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్!
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్ను పంచుకున్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఏడు మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వరుస విజయాలతో అదరగొడుతుంది. లేట్గా ఫామ్లోకి వచ్చిన రింకూ సింగ్ తన ఫినిషింగ్ టచ్తో కేకేఆర్కు రెండు విజయాలు సాధించి పెట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరో 5 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. కేకేఆర్ తమ తర్వాతి మ్యాచ్ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్తో, ఆర్సీబీతో, గుజరాత్తో, ముంబైతో ఆడాల్సి ఉంది.ఇక వరుణ్ చక్రవర్తి దేశవాలీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. టీమిండియా తరఫున 4 వన్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 91 మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి 110 వికెట్లు తీశాడు.చదవండి: విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్! -
విరాట్ కోహ్లి కాదు.. కొత్త 'కింగ్' అతడే..!
ఐపీఎల్ 2026 మధ్య దశకు చేరుకున్న వేళ ‘కింగ్’ అనే బిరుదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఈ ట్యాగ్కు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లికి ఇప్పుడు గట్టి పోటీదారు వచ్చాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తమ జట్టు స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ను "కొత్త కింగ్"గా అభివర్ణిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. తాజాగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో నరైన్ 200 ఐపీఎల్ వికెట్ల మైలురాయిని అందుకోవడంతో ఈ చర్చ మొదలైంది.నరైన్ ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 200కు పైగా వికెట్లు, 1000కు పైగా పరుగులు, సెంచరీ, హ్యాట్రిక్, ఐదు వికెట్ల హాల్, మూడు సార్లు మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అవార్డులు.. ఇలాంటి ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ కారణంగానే మైసూర్ నరైన్ను గేమ్ చేంజర్గా కొనియాడుతూ 'కింగ్'గా అభివర్ణించాడు.మరోవైపు విరాట్ కోహ్లి కింగ్ అనే బిరుదుకు సార్దకత చేకూరుస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా స్థిరమైన ప్రదర్శన, జట్టు విజయాల్లో కీలక పాత్ర, భారీ అభిమాన వర్గం.. ఇవి కోహ్లీని 'కింగ్'గా నిలబెట్టాయి.నరైన్ కూడా విరాట్లాగే కెరీర్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో స్థిరంగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ కింగ్ బిరుదు కోసం పోటీపడుతున్నాడు. బ్యాటింగ్లో విరాట్.. ఆల్రౌండ్ ప్రదర్శనల్లో నరైన్ ఆధిపత్యం చాటుతుండటంతో కింగ్ ఎవరో డిసైడ్ చేయడం చాలా కష్టంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ తొలి 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేని కేకేఆర్.. అనూహ్యంగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఉనికి చాటుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు కలిగి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు అయినప్పటికీ.. అధికారికంగా రేసులోనే ఉంది. మరోవైపు విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పట్టికలో రెండో స్థానంలో ఉంది. -
బెంగాల్ ప్రజలకు విముక్తి.. విజయోత్సవ సభలో మోదీ
ఢిల్లీ: హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పేర్కొన్నారుఢిల్లీలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. భారత్ మదర్ ఆఫ్ డెమెక్రసీ అని ఈ ఎన్నికలు నిరూపించాయని ఐదురాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్ వరకూ కమలం వికసించిందని బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం ఎంతో గొప్ప విషయమన్నారు. దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు. ఈ రోజు భారత్కు, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని తెలిపారు. బెంగాల్లో కమలం విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు. బెంగాల్లో ప్రజాసామ్య విజయం సాధించామన్నారు. ఈ రోజు ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజని కొనియాడారు. ఐదు రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక పాత్ర పోషించారని మోదీ తెలిపారు. బెంగాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా అసంఖ్యాక కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని మోదీ ఉద్ఘాటించారు. వారందరికి మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నానని ప్రధాని అన్నారు.మరోవైపు మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అస్సాం ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏ విజయం, అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి మా కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనమని.. బీజేపీ నేతలు అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారన్నారు. ఐదురాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది. -
తమిళనాడులో నూతన ప్రభుత్వం.. విజయ్ ముందున్న దార్లు ఇవేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 106 స్థానాల్లో మెజారిటీని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం. మ్యాజిక్ ఫిగర్కు మరో 12 సీట్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో తమిళనాడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ముందు నాలుగు మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు గతంలో టీవీకే–ఏఐఏడీఎంకే మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏఐఏడీఎంకే తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి టీవీకేతో కలిసే అవకాశం ఉంది. అయితే, విజయ్ బీజేపీని ఆదర్శ శత్రువుగా పేర్కొన్నందున, ఏఐఏడీఎంకే బీజేపీని వదిలేయమని అడగవచ్చు. ఇది పెద్ద సవాలుగా మారవచ్చు.చిన్న పార్టీలతో పొత్తు డీఎంకే లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు లేకుండా, పీఎంకే, డీఎండీఎకే, వీసీకే, ఎంఎంఎంకే వంటి చిన్న పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇలా చేస్తే, విజయ్ తన స్వంత రాజకీయ వారసత్వాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది.కాంగ్రెస్ మద్దతు స్థానిక పార్టీలను పక్కన పెట్టి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.స్వతంత్రుల మద్దతు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందడం ద్వారా కూడా విజయ్ మెజారిటీ సాధించే అవకాశం ఉంది. -
లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు
లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (84) ఔట్13.6వ ఓవర్- 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన అనంతరం రోహిత్ శర్మ ఔటయ్యాడు. విధ్వంసం సృష్టించి ఔటైన రికెల్టన్10.5వ ఓవర్- రికెల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి మొహిసిన్ ఖాన్ బౌలింగ్లో ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దంచికొడుతున్న రోహిత్, రికెల్టన్229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. తొలి ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 71 పరుగులు చేశారు. రోహిత్ శర్మ (36), రికెల్టన్ (34) దంచికొడుతున్నారు. లక్నో భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో ఇంకా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి, ఊహించినంత కాకపోయినా ఓ మోస్తరు స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 13, కెప్టెన్ పంత్ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఒక్కసారి కుదుపుపూరన్ క్రీజ్లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్తో పాటు మిచెల్ మార్ష్ (44) కూడా ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్ పంత్ (15), అక్షత్ రఘువంశీ (11) కూడా పెవిలియన్ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 164-5గా ఉంది. మార్క్రమ్ (10), హిమ్మత్ సింగ్ (2) క్రీజ్లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2, ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీశారు.పంత్ ఔట్10.4వ ఓవర్- విల్ జాక్స్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (15) ఔటయ్యాడు.ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన లక్నో8.5వ ఓవర్- కార్బిన్ బాష్ బౌలింగ్ నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (44) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో8.1వ ఓవర్- కార్బిన్ బాష్ బౌలింగ్లో ర్యాన్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి పూరన్ (63) ఔటయ్యాడు.దంచికొడుతున్న లక్నో..ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ దంచికొడుతుంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. పూరన్ (47), మిచెల్ మార్ష్ (43) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన జోస్ ఇంగ్లిస్ గజన్ఫర్ బౌలింగ్లో సూర్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరుగుతున్న 47వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వల్ప అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్లో ఆడటం లేదని స్కై తెలిపాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగుతున్నాడు. హిట్మ్యాన్ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ముంబై మరో మార్పు కూడా చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్టు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్ఫర్, రఘు శర్మ -
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీహీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే పార్టీ తమిళనాట వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ కింగ్ మేకర్గా నిలిచారు. అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ తమిళనాట విజయ్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చక్కర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్’ (అప్పటి ట్విటర్) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్’ అని పోస్టు పెట్టాడు. నిజానికి ఆర్చర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్కి సంబంధించినవి మాత్రమే. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్ను తమ హీరో విజయ్ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే ఆర్చర్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్తో విభేదాల సమయంలో క్రికెటర్ దినేశ్ కార్తిక్ కూడా ఇలాంటి ట్వీట్ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.pic.twitter.com/hoSIATmltw— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2026 చదవండి: పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా! -
టీవీకే అద్భుత పెర్ఫార్మన్స్.. కంగ్రాట్స్: మోదీ
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల ఫలితాలతో పాటు మిగతా రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై ఆయన ట్వీట్లు చేశారు.“పశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజాశక్తి విజయం సాధించింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు, గౌరవం కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తాము. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం అనేక తరాలుగా కష్టపడి పనిచేసిన అనేక మంది కార్యకర్తల ప్రయత్నాలు, పోరాటాలు లేకుండా సాధ్యమయ్యేది కాదు. వారందరికీ నేను వందనం చేస్తున్నాను. ఏళ్ల తరబడి వారు కష్టపడి పని చేశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మా అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు మా పార్టీకి అసలైన బలం’’ అని తెలిపారు.టీవీకేకు అభినందనలు ‘‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు. ప్రజల సమస్యల పరిష్కారం, వారి జీవన పరిస్థితుల మెరుగుదలలో మేము ఎప్పుడూ ముందుండి పని చేస్తాము. టీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలు. కేంద్రం తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుతుంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.అస్సాంలో వారి కృషి వల్లే.. “అస్సాం మరోసారి బీజేపీ-ఎన్డీఏను ఆశీర్వదించింది. అస్సాం విధాన్ సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ విజయం సాధించడం, మా కూటమి అభివృద్ధిపై పెట్టిన దృష్టి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చినందుకు అస్సాంలోని నా సోదరులు, సోదరీమణులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.రాష్ట్రంలో మార్పు కోసం మేము నిరంతరం పనిచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. అస్సాం ప్రజల మధ్య నిరంతరం కృషి చేసిన బీజేపీ-ఎన్డీఏ కార్యకర్తలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గత దశాబ్దంలో మా పార్టీ కూటమి ఎంతగా ఎదిగిందో చూడటం ప్రశంసనీయమైన విషయం. వారి కృషి వల్లే మా సానుకూల అజెండా ప్రజల మనసులను తాకింది’’ అని అన్నారు. కేరళ గురించి..‘‘కేరళలో ఎన్డీయేకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేరళ పురోగతికి, వికసిత కేరళ లక్ష్యం సాధన కోసం కష్టపడతాము. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించినందుకు అభినందనలు’’ అని మోదీ చెప్పారు. ప్రభుత్వ పనితీరు ఆధారంగా తీర్పు ‘‘పుదుచ్చేరికి ధన్యవాదాలు. మంచి పాలనలో మా గత అనుభవం, ఎన్.రంగస్వామి నాయకత్వంలోని ప్రభుత్వ పని ఆధారంగా పుదుచ్చేరి ప్రజలు ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ ఆశీర్వాదం మా సుపరిపాలనను బలపరచే ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది’’ అని చెప్పారు. -
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
విజయ్ గెలుస్తాడని చెప్తే దేశమంతా నవ్వారు..!
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలన్నే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్కు అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క తమిళనాడు తప్ప అక్కడ మాత్రం ఎవరు ఉహించని విధంగా సినీ స్టార్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించి లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాగా ఈ ఫలితాల అంచనాను ముందే ఓ ఏజెన్సీ ఊహించింది. అయితే దాని అంచనా చూసి తొలుత అందరూ నవ్వుకున్నారని ఆ సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. బెంగాల్, అస్సాంలలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేస్తుండగా కేరళలో విజయకేతనం ఎగురవేస్తుండగా యూడీఎఫ్ విజయదుదుంబి మోగించింది. అయితే్ ఈ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఫలితాలు మాత్రం తమిళనాడువే.. డీఎంకే, ఏఐడీఎంకే లాంటి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలను వెనక్కి నెట్టి ఫిలిం స్టార్ విజయ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని తొలుతగా అంచనా వేసింది మాత్రం ఆక్సిస్ ఇండియా మాత్రమే అయితే ఆ సమయంలో ఆసర్వేలను చూసి దేశమంతా నవ్వుకుందని ఆ సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా అన్నారు.ప్రదీప్ గుప్తా వ్యాఖ్యలు డేటా సైన్స్ విజయం: "ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. మిగతా సంస్థలు గ్రౌండ్ లెవల్లో ప్రజల నాడిని ఎందుకు పట్టుకోలేకపోయాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసాం కానీ దీనిని ఎవరూ నమ్మలేదుఇదంతా ఒక గాలి వార్త అని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషకులు, ఇతర సంస్థలు మమ్మల్ని చూసి నవ్వుకున్నాయి అన్నారు.విజయ్ టీవీకే పార్టీకి టీవీకేకు తాము చెప్పినట్టే 35 శాతం ఓట్లు లభిస్తున్నాయని డీఎంకేకు మాత్రం 35 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వేయగా, ప్రస్తుతం 32 శాతంగా ఉందన్నారు. ఏఐఏడీఎంకే (AIADMK) కి 23 శాతం వస్తాయని చెబితే, ప్రస్తుతం 27 శాతంగా ఉందని చెప్పారు. అదే స్థానాల ప్రకారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రెండో స్థానంలో, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.టీవీకే విజయానికి కారణాలుప్రదీప్ గుప్తా విశ్లేషణ ..తమిళనాట 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు గల అధికంగా 42 శాతం మంది ఉన్నారని వీరంతా విజయ్ వైపు మెుగ్గు చూపారని తెలిపారు. 40 ఏళ్ల పైబడిన వారిలో 25 నుండి 30 శాతం మంది విజయ్కు మద్దతు ఇచ్చారు. అదే విధంగా డీఎంకే తరువాత అధికంగా మహిళా ఓటర్లు టీవీకేకే ఓటు వేసినట్లు తాము గుర్తించామని తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడులో టీవీకే 40 స్థానాల్లో గెలువగా మరో 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మొదటి 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ పేరిట ఉండిన లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్ తన తొలి 50 ఐపీఎల్ ఇన్నింగ్స్ల్లో 2061 పరుగులు చేయగా.. సాయి తన మొదటి 50 ఐపీఎల్ ఇన్నింగ్స్ల్లో 2178 పరుగులు చేశాడు.ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్పై నిన్న (మే 3) ఆడిన ఇన్నింగ్స్ సాయికి ఐపీఎల్లో 50వది. ఈ ఇన్నింగ్స్లో అతను 41 బంతుల్లో 57 పరుగులు చేసి తన జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశాడు. వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి గుజరాత్ను గెలిపించాడు.పై రికార్డును సాధించే క్రమంలో సాయి మరో రికార్డు ఇదివరకే నెలకొల్పాడు. ఐపీఎల్లో 2000 పరుగుల మార్కును చేరడానికి అతి తక్కువ ఇన్నింగ్స్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలోనూ సాయి క్రిస్ గేల్ పేరిట ఉండిన రికార్డునే అధిగమించాడు. గేల్ ఈ మైలురాయిని 48 ఇన్నింగ్స్ల్లో చేరుకోగా.. సాయి 47వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు.ఈ సీజన్లో ఓ మోస్తరు ఫామ్లో ఉన్న సాయి.. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 385 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తాజాగా పంజాబ్పై గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఆరేసి విజయాలతో 12 పాయింట్లు కలిగి ఉంది.ప్రస్తుతం సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ కూడా 12 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ.. గుజరాత్ ఈ జట్ల కంటే తక్కువ రన్రేట్ కలిగి ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. 13 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్ టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. -
నోబెల్ రేసులో 'రియల్లైఫ్ ప్యాడ్మ్యాన్' అరుణాచలం
'ప్యాడ్మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన సామాజిక పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనంతం, 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అరుణాచలం స్వయంగా తెలిపారు. అసలు మొదట తాను దీన్ని నమ్మలేకపోయానని అన్నారు. నిజానికి నోబెల్ బహుమతికి, మనమే మన పేరును లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను గానీ పంపడం సాధ్యం కాదన్నారు. అది తప్పనిసరిగా థర్డ్ సోర్స్ ద్వారానే జరుగుతుందని చెప్పారు. పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్ బృందాలు నోబెల్ కోసం నా పేరును ప్రతిపాదించారు... 24 గంటల్లోపే అది ఆమోదించబడినట్లు తెలిపారు. అంతేగాదు ప్రతిష్టాత్మకమైన ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినీగా తాను ఎంపిక అయ్యినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని అరుణాచలం మురుగనంతం పేర్కొన్నారు.అరుణాచలం మురుగనంతం స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. ఆయన ఒక సామాజిక కార్యకర్త. దేశంలోని గ్రామీణ మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లను పరిచయం చేశారు. రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్కిన్లపై మహిళలకు అవగాహన పెంచేందుకు కృషి చేయడమే గాక దానిపై ఉన్న అపోహలను మహిళల్లో తొలగించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అందుకే అరుణాచలం 'ప్యాడ్మ్యాన్'గా పాపులర్ అయ్యారు. కాగా, అరుణాచలం మురుగనంతం చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ను 2016లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు ఆయన జీవితం ఆధారంగా 'ప్యాడ్మ్యాన్' పేరిట బాలీవుడ్ మూవీ కూడా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.కాగా, 2026 నోబెల్ శాంతి బహుమతికి 287 మంది అభ్యర్థులు నామినేట్ అయ్యారు. వీరిలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. కాగా 2026 నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది అక్టోబరు 9న ప్రకటించనున్నారు. డిసెంబరు 10న ఓస్లాలో ఈ పీజ్ ప్రైజ్ను ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ పీజ్ ప్రైజ్ నామినేషన్ల సమర్పణ గడువు ఈ ఏడాది జనవరి 31నే ముగిసింది.#WATCH | Coimbatore, Tamil Nadu | Social entrepreneur Arunachalam Muruganantham, who is famously known as the 'Padman,' has been listed as a nominee for the 2026 Nobel Peace Prize.He says, "I couldn't believe it at first... For the Nobel Prize, you can not submit your name, nor… pic.twitter.com/unHNj0tSrF— ANI (@ANI) May 3, 2026 (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
స్థిరమైన ఆదాయానికి.. సరికొత్త ప్లాన్!
అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు.బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యథావిధిగా కొనసాగుతుంది.ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.ఇదీ చదవండి: ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి? -
విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!
విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్లాగే సింగిల్గా బరిలోకి దిగాలన్న డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
తమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం
సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకే ఘనవిజయం సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ ఇప్పటికే 18 స్థానాల్లో గెలిచి, మరో 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం సమయంలో టీవీకే ఆధిక్యం తగ్గినా, కొద్ది సేపట్లోనే తిరిగి బలంగా ముందంజ వేసి డీఎంకే, ఏడీఎంకేలను దాటేసింది.టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెండింటిలోనూ విజయం సాధించారు. విజయ్ పార్టీ ఈసారి ఎలాంటి కూటములు లేకుండా, ఒంటరిగా అన్ని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికలు టీవీకే, డీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోటీగా మారాయి.విజయ్ రాజకీయ ప్రవేశం విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెటట్రి కజగంను ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఈ పార్టీని 2024 సెప్టెంబర్ 8న అధికారికంగా నమోదు చేసింది. ప్రారంభం నుంచే విజయ్ తన పార్టీని ఆధునిక ద్రావిడ సిద్ధాంతాలపై నిలబెట్టారు. దుష్ట శక్తి, అవినీతి శక్తికి ఎదురు నిలిచే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని ఆయన ప్రకటించారు.విజయ్ తన విజయాన్ని ఎంజీఆర్ తరహాలో రాయాలని, ఈ ఏడాదే అధికారంలోకి రావాలని సంకల్పించారు. ఆయన డీఎంకేను దుష్ట శక్తిగా, బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా అభివర్ణించారు.పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. సాయంత్రం 6.00 గంటల వరకు టీవీకే 111 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 71 స్థానాల్లో, ఏడీఎంకే 52 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118. -
పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా!
పాకిస్తాన్ సూపర్లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ విజేతగా బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జాల్మి నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ కింగ్స్మెన్ను ఓడించిన పెషావర్ జాల్మి టైటిల్ గెలిచింది. ఈ సీజన్లో బాబర్ టాప్ స్కోరర్గా నిలిచి ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుతో పాటు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అవార్డుతో పాటు ఆయన అందుకున్న బహుమతి విలువ కేవలం పీకేఆర్ 3,500 మాత్రమే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1200 మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ‘ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నందునే పీఎస్ఎల్ నిర్వాహకులు ఆటగాళ్లకు తక్కువ ప్రైజ్మనీ అందించింది’.. ‘పాపం పీసీబీ దగ్గర డబ్బులేవనుకుంటా.. అందుకే ఇంత తక్కువ ప్రైజ్మనీ ఇస్తున్నట్లున్నారు’ అని కామెంట్లు చేశారు. అయితే నిజానికి బాబర్ ఆజం అందుకున్న బహుమతి విలువలో అంకెల సంఖ్యను సోషల్ మీడియాలో తప్పుగా చూపించినట్లు పీఎస్ఎల్ నిర్వాహకులు తెలిపారు. ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కింద బాబర్ ఆజం పీకేఆర్ 3,500,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 11,90, 790 రూపాయలు. ఇక టీ20 ప్రపంచకప్లో విఫలమైన బాబర్ ఆజం పీఎస్ఎల్ 2026 సీజన్లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 11 ఇన్నింగ్స్లు కలిపి 588 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండడం విశేషం. అయితే కీలకమైన ఫైనల్లో బాబర్ ఆజం తొలి బంతికే ఔటైనప్పటికీ, ఓవరాల్గా ఒక పీఎస్ఎల్ సీజన్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పీఎస్ఎల్ ముగిసిన మరుక్షణమే బాబర్ ఆజం టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మీర్పూర్ వేదికగా మే 8 నుంచి 12 వరకు తొలి టెస్టు, మే 16 నుంచి 20 వరకు రెండో టెస్టు జరగనుంది. View this post on Instagram A post shared by 🚶🏻 (@talks.cric__) చదవండి: షాక్లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి! -
ఎక్కువ మైలేజ్ కోసం ఒక్క కిట్: రూ.83 వేలతో..
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) ఆల్ న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం.. ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్జీ రిట్రోఫిట్ కిట్ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 82,999. ఇది దేశంలోని 16 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది.ఈ సీఎన్జీ కిట్ను మోటోజెన్ తయారు చేసి.. నాణ్యతను కూడా నిర్ధారించింది. వినియోగదారులు ఈ కిట్ను నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కిట్పై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.సీఎన్జీ రిట్రోఫిట్ కిట్లో రెండు 25 లీటర్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి దీనిని కారులో ఫిక్స్ చేసినప్పుడు కూడా అదే స్పేస్ ఉంటుంది. మూడో వరుస సీటింగ్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఈ కిట్ ఏర్పాటు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు.. -
తమిళనాడులో ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల నడుమ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందా.. లేదా అనే దానిపై విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది. ప్రధానంగా టీవీకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వందకుపైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. ఉదయం నుంచి 100 నుంచి 107 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగుతోంది. అదే సమయంలో విజయ్ పార్టీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 చోట్ల 500 ఓట్ల మెజార్టీతో, 12 స్థానాల్లో రెండు వేల మెజార్టీతో విజయ్ పార్టీ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విజయ్ వంద సీట్ల మార్క్కు ఏమీ ఢోకా ఉండదు.. కానీ ప్రభుత్వాన్ని సింగిల్గా ఏర్పాటు చేయడం మాత్రం కష్టమవడం ఖాయం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చినా అది ఎంతవరకూ సరిపోతుంది అనే దానిపై చర్చ నడుస్తోంది. దాంతో మరొక పెద్ద పార్టీతో టీవీకేకు పొత్తు అనివార్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్ని బట్టి.. విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు. దాంతో విజయ్ పార్టీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. ఇక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా విజయ్ పార్టీకి చాలా దగ్గరగానే వచ్చింది. డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు, కాగా డీఎంకే ఒంటరిగా సాధించిన ఓట్లు 83 లక్షలు. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు, కాగా ఒంటరిగా ఆ పార్టీ 77 లక్షలు సాధించింది. పుంజుకున్న డీఎంకే..!కౌంటింగ్ ఆరంభమైనప్పటినుంచీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ మూడో స్థానంలో కొనసాగిన డీఎంకే.. అటు తర్వాత మెల్లగా పుంజుకుంది. తొలుత 50 సీట్లనైనా డీఎంకే గెలుస్తుందా అనే దిశ నుంచి 77 సీట్ల ఆధిక్యంలోకి డీఎంకే వచ్చింది. అంటే డీఎంకే బాగా పుంజుకుని విజయ్ పార్టీ ఊపుకు కాస్త అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం ఇంకా కొంటింగ్ జరుగుతున్న క్రమంలో డీఎంకే మరిన్ని సీట్లను గెలుచుకుని విజయ్ ఆధిక్యాన్ని తగ్గించవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారుగా డీఎంకే ఓట్ల షేర్ అంతా కూడా టీవీకే షిప్ట్ అవడమే విజయ్ అనూహ్య ఫలితాలకు కారణమైంది. విజయ్ టీవీకే పార్టీకి ఏకధాటి ఊపు ఇవ్వకుండా డీఎంకే ఎంతో కొంత మెరుగైన ఫలితాల దిశగానే ముందుకెళుతుందనే చెప్పాలి. విజయ్ పార్టీ ఒక సీటు ఆధిక్యం తగ్గుతుంటే అదే సమయంలో డీఎంకే ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇది కాస్త సస్పెన్స్ను కూడా క్రియేట్ చేస్తోంది. సీఎం స్టాలిన్ కొళత్తూర్ నుంచి ఓడి పోవడం ఆ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ మినహా పుంజుకున్న తీరు.. టీవీకే ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని క్లిష్టం చేస్తోంది. -
బాబర్ ఆజమ్ జట్టుదే పాకిస్తాన్ సూపర్ లీగ్ టైటిల్
స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న (మే 3) జరిగిన ఫైనల్లో కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కింగ్స్మెన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, విజేతగా అవతరించింది. 2017 తర్వాత పెషావర్ గెలిచిన తొలి పీఎస్ఎల్ టైటిల్ ఇది. అలాగే కెప్టెన్గా బాబర్ ఆజమ్కు ఇది తొలి పీఎస్ఎల్ టైటిల్. పీఎస్ఎల్ ట్రోఫీని బాబర్ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకున్నాడు.లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పెషావర్, కింగ్స్మెన్ను 18 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూల్చంది. సైమ్ అయూబ్ (54) ఒంటరిపోరాటం చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పెషావర్ మీడియం పేసర్ ఆరోన్ హార్డీ 4 వికెట్లు తీసి కింగ్స్మెన్ను దారుణంగా దెబ్బకొట్టాడు. నహిద్ రాణా (4-1-22-2) అతనికి సహకరించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పెషావర్ సైతం తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరోన్ హార్డీ బ్యాట్తోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. అజేయమైన అర్ద సెంచరీ (56) చేసి పెషావర్ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి అబ్దుల్ సమద్ (48) సహకరించాడు. కింగ్స్మెన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 3 వికెట్లు తీసి పెషావర్ను ఇబ్బంది పెట్టాడు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్తో సత్తా చాటిన హార్డీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, పెషావర్ టైటిల్ సాధించడంతో బాబర్ ఆజమ్ కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగానూ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్కు ముందు పేలవ ఫామ్లో ఉండిన అతను.. సీజన్ పూర్తయ్యే సరికి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి తన జట్టు ప్రతి విజయంలో కీలక పాత పోషించాడు. ఈ సీజన్లో బాబర్ 11 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 588 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ చరిత్రలో ఓ ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం ఇదే మొదటిసారి.
