breaking news
-
చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లి ఆల్టైమ్ రికార్డు బద్దలు
టీమిండియా నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టెస్టు సారథిగా అరంగేట్రంలోనే సెంచరీఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి భారీ శతకం (147) సాధించాడు.తద్వారా టెస్టు జట్టు సారథిగా తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేసి అనేక రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అయితే, ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో మాత్రం గిల్ తన విశ్వరూపం చూపించాడు.డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగితొలి ఇన్నింగ్స్లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269)తో దుమ్ములేపిన ప్రిన్స్.. రెండో ఇన్నింగ్స్లో అద్భుత శతకం (161) సాధించాడు. తద్వారా ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడు, కెప్టెన్గా గిల్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.ఇక తాజాగా లార్డ్స్లో జరుగుతున్న మూడో టెస్టులో గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 44 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సాబ్.. రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులే రాబట్టాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు.ఆసియా తొలి కెప్టెన్గా..అయితే, మూడో టెస్టులో గిల్ విఫలమైనప్పటికీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్లో ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన గిల్ ఏకంగా 601 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా తొలి కెప్టెన్గా గిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు కోహ్లి పేరిట ఈ రికార్డు ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్లు వీరే🏏శుబ్మన్ గిల్ (ఇండియా)- 601* రన్స్- 2025లో..🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593 రన్స్- 2018లో..🏏మహ్మద్ అజారుద్దీన్ (ఇండియా)- 426 రన్స్- 1990లో..🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్)- 364 రన్స్- 1992లో..🏏సౌరవ్ గంగూలీ (ఇండియా)- 351 రన్స్- 2002లో...👉ఇక ఓవరాల్గా ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో... గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ (597)ను గిల్ అధిగమించాడు. ఇక ఈ లిస్టులో గ్యారీ సోబర్స్ (722), గ్రేమ్ స్మిత్ (714) గిల్ కంటే ముందు వరుసలో ఉన్నారు. చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా -
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్ను స్టార్టప్లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
'తన్వి ది గ్రేట్' సినిమా వీక్షించిన రాష్ట్రపతి
తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్తో కలిసి రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది. -
పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిరసనలు తెలియజేడం, సమావేశాలు నిర్వహించుకోవడం.. బలమైన పునాదులు. అలాంటిది పునాదులను ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేసే ప్రయత్నంలో ఉందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రాశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ శనివారం తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు.పోలీసులు, మీడియా యంత్రాంగాలను ఉపయోగించి ప్రశ్నించే గొంతులను చంద్రబాబు ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తోంది. ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి, సమావేశం కావడానికి ఉన్న హక్కులు ప్రజాస్వామ్యానికి పునాదులు. ఇవి ప్రజలకు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, ప్రభుత్వాలకు తమ బాధ్యతను గుర్తు చేయడానికి ఉన్నాయి. అయితే ఏపీలో అలాంటి వాటిని చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలిఅయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాధమిక హక్కులు భంగం కలుగుతోందిచంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోందిపోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారుపోలీసు రాజ్యంమా? నియంతృత్వ రాజ్యమా? అన్నట్టుగా మారిందిచట్టానికి లోబడి నిరసనలు తెలిపినా.. అణచివేతలు, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందిఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిప్రతిపక్షం, ప్రజలు, నిరసనకారుల గొంతును రాష్ట్రంలో నులుమేస్తున్నారుపోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని నియంతృత్వ పాలనతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షం చట్టబద్ధమైన సమస్యలను లేవనెత్తిన ప్రతిసారీ.. నిర్బంధం, వేధింపులు, తప్పుడు కేసులు కనిపిస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన నుంచి బంగారుపాళ్యం పర్యటన.. దాకా ప్రతీసారి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారాయన. గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు నమోదు చేశారురామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారుపొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారుపల్నాడులో పోలీసు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్తే ఐదు కేసులు నమోదు చేశారు131 మందికి నోటీసులు జారీ చేశారు, సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారుతప్పుడు కేసులు, అరెస్టులు, మీడియా అసత్య కథనాలతో చంద్రబాబు ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ, వేధింపులు ఎదురైనా సరే రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.CM @ncbn suppressing dissent with state machineryThe right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025 -
పుత్తడి ప్రియుల నడ్డి విరిసేలా ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి ధరలు పెరిగాయి. వెండి ఏకంగా కేజీపై రూ.4000 పెరిగి ఆల్టైమ్హై చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పులస @ రూ.15వేలు
‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి గోదావరి జిల్లాలో బాగా విపిస్తుంటుంది. ‘పులస’ చేప దొరకడం చాలా అరుదు కాబట్టే.. జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలో అమ్ముడుపోయాయి. యానాం: గోదావరికి వరద ఉధృతి పెరుగుతుండటంతో మత్స్యకారుల వలలకు పులసలు చిక్కుతున్నాయి. శుక్రవారం యానాం గౌతమీగోదావరి పాయలో తొలిసారిగా పులస చేప వలకు చిక్కింది. దీంతో స్థానిక పుష్కరఘాట్ వద్ద పులస చేపను వేలం వేయగా స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం రూ.15 వేలకు చేపను దక్కించుకుంది. ఆపై మార్కెట్ లో రూ.18 వేలకు అమ్మంది.గోదావరికి ఎర్రనీరు రావడంతో అరుదైన గోదావరి పులస పడటంతో మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు పులసలు పడతాయని మత్స్యకారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే: బొత్స
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా ఆరాచకం, అల్లకల్లోలమే మిగిలిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్నీ దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ మండిపడ్డారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం ఆవిరి అయిపోతుంది. రైతులకు ప్రభుత్వం సాయం అందడం లేదు. రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే. మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి. వైఎస్ జగన్ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ల బాధలు తెలుస్తాయి. ప్రభుత్వం స్పందించే నాటికి పుణ్యకాలం గడిచిపోతోంది. ఎక్కడికక్కడ దోపిడీ నడుస్తోంది.మంత్రుల దోపిడీ..వైఎస్ జగన్ చిత్తూరు వెళ్ళాక కూటమి నేతలకు ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన వచ్చింది. సీజన్ అయ్యాక పర్యటన ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. అంతా అయిపోతే ఇప్పుడు మీరెందుకు ఢిల్లీ వెళ్లారు. పొగాకు రైతులకు కూడా ఇదే అన్యాయం జరిగింది. మిర్చి రైతుల సమస్య అంశంలో కూడా ఇదే జరిగింది. ఈ ప్రభుత్వంలో అంతా దోపిడీనే.. మంత్రుల అవినీతి ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. వారి అనుకూల పత్రికలు కూడా అవే వార్తలు రాశాయి. రాజు ఎలాంటి వాడు అయితే మంత్రులు కూడా అలాగే ఉంటారు. ప్రభుత్వంలో మంత్రుల తీరు, పాలనను ఆక్షేపిస్తున్నాను. చంద్రబాబు సరిగ్గా ఉంటే అందరూ బాగుంటారు..డ్రగ్స్ సిటీగా విశాఖ..గంజాయిని అరికడతాం అని ప్రగల్భాలు పలికారు. గంజాయి పోయి ఇప్పుడు విశాఖలోకి డ్రగ్స్ వచ్చాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు. అభివృద్ధిలో విశాఖను ఏమీ చేయలేకపోయారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. యోగాంధ్ర వలన విశాఖకు ఉపయోగం ఏమిటి?. విశాఖలో జరుగుతున్న భూ బాగోతంపై సీఎం, గవర్నర్కు లేఖ రాస్తాను. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది. ఇష్టారీతిన అప్పులు చేశారు. మీరు జగన్ ఇచ్చినట్టు ప్రజలకు ఏమైనా ఇచ్చారా?. ఏపీలో ప్రభుత్వ తీరు మాటలు గొప్ప ఊరు దిబ్బలా ఉంది. రాష్ట్రానికి పన్నుల రాబడి ఎందుకు తగ్గింది?. ప్రజల్లో కొనుగోలు శక్తి లేక ఆదాయం తగ్గుతోంది.సింగయ్య మృతి ఘటనలో కూడా పోలీసులపై ఒత్తిడి చేసి మరి స్టేట్మెంట్ ఇప్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై అకృత్యాలు పెరిగాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవం పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏపీఎండీసీ నుంచి తెచ్చిన రుణాల అవకతవకలపై మాట్లాడుతాను. తప్పులను ఎత్తి చూపుతాం. విశాఖలో పార్కులు కబ్జా చేస్తున్నారు. ఇష్టానుసారంగా టీడీఆర్ కుంభకోణాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ హయాంలో తప్పులు జరిగాయని మాటలు చెప్పారు. ఆ మాటలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.కూటమి నేతల దోపిడీ, ఆరాచకం..సంవత్సర కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో ప్రజలకు వివరిస్తా. నాడు-నేడు స్కీం ఆపడం మంచిది కాదు. అనకాపల్లిలో లిక్కర్ మాఫియా బయట పడింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో లిక్కర్ మాఫియా నడుస్తోంది. ఎవరి పని వారిని చేసుకోనిస్తే ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో అధికారులకు స్వతంత్రం లేదు. సామాన్యుడికి ఐదు వెళ్ళు నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. కూటమి నేతల దోపిడీ, ఆరాచకాలను ఎందుకు అరికట్టడం లేదు. సంవత్సరంలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు. కూటమి హామీలు విని ప్రజలు మోసపోయారు. కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోండి. మాట ఇచ్చాం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
అమెరికా, ఇండియా ఏదైనా సరే ఈ సమస్య 'వింటారా సరదాగా' (టీజర్)
అశోక్ గల్లా హీరోగా నటించిన మూడో సినిమా 'వింటారా సరదాగా' (Vintara Saradaga) నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఇప్పటికే ఆయన దేవకీనందన వాసుదేవ, హీరో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు కడుపుబ్బా నవ్వించేందుకు మళ్లీ వస్తున్నాడు. అశోక్ గల్లా హీరోగా, రాహుల్ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా నటించిన 'వింటారా సరదాగా' చిత్రం రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరించనుంది.విదేశాల్లోని విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా వినోదాత్మకంగా, సరికొత్తగా సినిమా టీజర్ ఉంది. ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా' అని చెప్పవచ్చు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందంగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది. -
ICC T20 WC 2026: ఇరవైలో అర్హత సాధించిన 15 జట్లు ఇవే
ఇటలీ క్రికెట్ జట్టు (Italy Cricket Team) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. యూరప్ జోన్ నుంచి నెదర్లాండ్స్తో పాటు ఇటలీ మెగా ఈవెంట్లో తమ బెర్తును ఖరారు చేసుకుంది. యూరప్ క్వాలిఫయర్స్లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఇటలీ నెదర్లాండ్స్తో తలపడింది.భారత్- శ్రీలంక వేదికగా..అయితే, ఈ మ్యాచ్లో ఇటలీ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ.. పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా నెదర్లాండ్స్తో పాటు టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది. కాగా భారత్- శ్రీలంక (India- Sri Lanka) వచ్చే ఏడాది సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.ఆ ఏడు జట్లు కూడా..ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్ల హోదాలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, శ్రీలంక నేరుగా ప్రపంచకప్-2026కు అర్హత సాధించాయి. ఇక వీటితో పాటు టీ20 ప్రపంచకప్-2024లో టాప్-7లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్ కూడా క్వాలిఫై అయ్యాయి.మరోవైపు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో పోటీపడేందుకు బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇక అమెరికా క్వాలిఫయర్స్ నుంచి కెనడా.. తాజాగా యూరప్ క్వాలిఫయర్ నుంచి నెదర్లాండ్, ఇటలీ కూడా వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాయి.20 జట్లలో 15 ఖరారుకాగా ఈ మెగా టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొననుండగా.. ఇప్పటికి పదిహేను జట్లు ఈ మేర అర్హత సాధించగా.. ఇంకో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల కోసం సౌతాఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా నమీబియా, ఉగాండా, టాంజానియా, కెన్యా, జింబాబ్వే, బోత్స్వానా, నైజీరియా పోటీపడుతున్నాయి.ఇక మిగిలిన మరో మూడు స్థానాల కోసం ఆసియా- ఈఏపీ క్వాలిఫయర్స్ (అక్టోబరు 1-17) నుంచి నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, సమోవా, కువైట్, మలేషియా, జపాన్, కతార్, యూఏఈ అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఇదిలా ఉంటే.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. లీగ్ దశలో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా రెండోసారి పొట్టి ప్రపంచకప్ భారత్ సొంతమైంది. కాగా 2007లో తొలిసారి టీ20 వరల్డ్కప్ పోటీ ప్రవేశపెట్టగా ధోని సారథ్యంలో నాడు భారత్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026లో ఇప్పటికి అర్హత సాధించిన జట్లు ఇవే..టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
ఫ్యాన్సీ నంబర్ 9999 @ రూ.11లక్షలు..
ఖిలా వరంగల్: వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి అధిక మొత్తంలో చెల్లించి ఫ్యాన్సీ నంబర్ను దక్కించుకున్నట్లు వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు శుక్రవారం తెలిపారు. కారు నంబర్ ప్లేట్పై తనకు నచ్చిన లక్కీ నంబర్ ఉండాలనే ఆశతో 9999 ఫ్యాన్సీ నంబర్ను ఆన్లైన్ ద్వారా రూ.11,09,999 చెల్లించి హర్ష కన్స్ట్రక్షన్స్ పేరు మీద దక్కించుకున్నట్లు వివరించారు. ఇంత మొత్తం ఖర్చు చేసి నంబర్ దక్కించుకోవడంపై ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఫ్యాన్సీ నంబర్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఈసారి అధిక మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు చెప్పారు. -
‘టైమ్ 100 క్రియేటర్స్’ లిస్ట్లో ఏకైక భారతీయురాలు
‘టైమ్ 100 క్రియేటర్స్’ జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయురాలిగా ప్రత్యేకత నిలుపుకుంది యూట్యూబర్ ప్రజక్త కోలి( Prajakta Koli ). డిజిటల్ మీడియాలో 2015 నుంచి కోలి విజయపరంపర కొనసాగుతోంది.‘టైమ్ 100 క్రియేటర్స్’లో చోటు సాధించిన నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది కోలి. ‘నాలో ఎన్నో భావాలు పొంగి పొర్లుతున్నాయి. నేను మీతో చె΄్పాలి అనుకుంటున్న వాటి కంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చెప్పడానికి రెండు మాటలే ఉన్నాయి... థ్యాంక్స్’ అని రాసింది. తల్లిదండ్రులు, స్నేహితులు, అభిమానులకే కాదు తన పేరుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ‘థ్యాంక్ యూ ప్రజక్త. వ్యూహం, ప్లాన్, రోడ్ మ్యాప్... ఇలాంటివేమీ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తనను తాను నమ్ముకుంది. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేసింది’ అని రాసింది. View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) 2015లో యూట్యూబ్ చానల్ లాంచ్ చేసింది కోలి. మొదట్లో కామెడీ స్కిట్లు షేర్ చేసేది. తక్కువ కాలంలోనే తన చానల్కు ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఏర్పడ్డారు. ‘మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ యూట్యూబర్’గా పేరు తెచ్చుకున్న ప్రజక్త నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ సిరీస్ ‘మిస్ మ్యాచ్డ్’లో నటించింది. ‘టు గుడ్ టు బి ట్రూ’ అనే నవల రాసింది. ఓన్లీ ఇండియన్ -
పదికాలాలపాటు పచ్చగా అనంత్-రాధికల వివాహం
పెళ్లిచేస్తే పదికాలాలపాటు అందరూ మాట్లాడుకునేలా ఉండాలని బహుశా రిలయన్ అధినేత ముఖేశ్-నీతా అంబానీ అనుకున్నారేమో.. వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం జరిగి ఏడాది అవుతున్నా ప్రపంచంలో ఎక్కడోమూల దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ వివాహంలోని ఏర్పాట్లు, అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, పంచభక్ష పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు..ఇలా కొన్నేమిటి ఎన్నో విషయాల గురించి ముచ్చటిస్తున్నారు. ఈ రోజు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా..ముఖేష్ అంబానీ– నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని విరెన్ మర్చంట్–శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్తో జులై 12, 2024న అంగరంగ వైభవంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిపించారు. ఈ వేడుకలకు దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి. తర్వాతి రోజు ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో వేడుక. ఆ మరుసటి రోజు ‘మంగళ్ ఉత్సవ్’ పేరున భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.పెళ్లికి ముందు రెండుసార్లు ఈ జంట అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండోసారి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతకుముందు ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్!వివాహానికి హాజరైన ప్రముఖుల్లో కొందరు..వైదిక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రికెటర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు.. ఇలా ఎన్నో విభాగాలకు చెందిన అగ్రజులు హాజరయ్యారు.ఆధ్యాత్మిక గురువులు..స్వామి సదానంద సరస్వతి, శంకరాచార్య, ద్వారకాస్వామి అవిముక్తేశ్వర, సరస్వతి, శంకరాచార్య, జోషిమఠ్గౌరంగ్ దాస్ ప్రభు, డివిజనల్ డైరెక్టర్, ఇస్కాన్గుర్ గోపాల్ దాస్, మాంక్, ఇస్కాన్రాధానాథ్ స్వామి, ఇస్కాన్ పాలకమండలి సభ్యుడురమేష్ భాయ్ ఓజాగౌతమ్ భాయ్ ఓజాదేవప్రసాద్ మహరాజ్విజుబెన్ రజని, శ్రీ ఆనందబావ సేవా సంస్థశ్రీ బాలక్ యోగేశ్వర్ దాస్ జీ మహరాజ్, బద్రీనాథ్ ధామ్చిదానంద్ సరస్వతి, పర్మార్త్ నికేతన్ ఆశ్రమంశ్రీ నమ్రముని మహరాజ్, జైన్ ముని, ప్రసాదం వ్యవస్థాపకులుధీరేంద్ర కుమార్ గార్గ్, గురు, బాగేశ్వర్ ధామ్బాబా రాందేవ్, యోగా గురువు తదితరులు.వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులుజాన్ కెర్రీ (అమెరికా పొలిటీషియన్)టోనీ బ్లెయిర్ (మాజీ ప్రధాని, యూకే)బోరిస్ జాన్సన్ (బ్రిటన్ మాజీ ప్రధాని)మాటియో రెంజీ (ఇటలీ మాజీ ప్రధాని)సెబాస్టియన్ కుర్జ్ (ఆస్ట్రియా మాజీ ప్రధాని)స్టీఫెన్ హార్పర్, కెనడా మాజీ ప్రధానికార్ల్ బిల్డ్ (స్వీడన్ మాజీ ప్రధాని)మహ్మద్ నషీద్ (మాల్దీవుల మాజీ అధ్యక్షుడు)సామియా సులుహు హసన్ (అధ్యక్షుడు, టాంజానియా) తదితరులు.గ్లోబల్ బిజినెస్ లీడర్లుఅమీన్ నాజర్ (ప్రెసిడెంట్ & సీఈఓ, ఆరామ్కో)హెచ్.ఇ. ఖల్దూన్ అల్ ముబారక్, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్, ముబదాలాముర్రే ఆచింక్లోస్ (సీఈఓ, బీపీ)రాబర్ట్ డడ్లీ (మాజీ సీఈఓ - బీపీ, బోర్డు మెంబర్ - ఆరామ్కో)మార్క్ టక్కర్ (హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ)బెర్నార్డ్ లూనీ (మాజీ సీఈఓ, బీపీ)శంతను నారాయణ్ (సీఈఓ, అడోబ్)మైఖేల్ గ్రిమ్స్ (మేనేజింగ్ డైరెక్టర్, మోర్గాన్ స్టాన్లీ)ఇగోర్ సెచిన్, సీఈఓ, రోస్ నెఫ్ట్జే లీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్దిల్హాన్ పిళ్లై (టెమాసెక్ హోల్డింగ్స్ సీఈఓ) తదితరులు. -
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్ కామెడీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’.. కథేంటంటే?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఏదైనా సినిమా చూసే ప్రేక్షకులకు తాము చూసే ఆ సినిమా పై కొంత అవగాహన, కొంత ఊహ ఉంటాయి. ఆ ప్రేక్షకుల అవగాహనను, ఊహను పటాపంచలు చేస్తూ ఉత్కంఠభరితంగా సినిమాని తీసుకువెళ్లగలిగితే అప్పుడు ప్రతిభగల దర్శకుడు అనిపించుకుంటారు. ఆ విషయంలో ఈ సినిమా దర్శకుడు ఓ అయిదాకులు ఎక్కువే తిన్నారని చెప్పవచ్చు. నాయిషుల్లర్ దర్శకత్వంలో వచ్చిన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఓ ఊహకందని యాక్షన్ కామెడీ మూవీ అనొచ్చు. ప్రైమ్ వీడియో వేదికగా ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కామెడీ స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ప్రేక్షకుడి ఊహకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. కథ సింపుల్ అయినా ఆ స్టోరీ లైన్ విచిత్రంగా ఉంటుంది. అంతలా ఈ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా కథ ప్రకారం యూఎస్, యూకె ప్రెసిడెంట్లు బద్ధ శత్రువులు. కానీ ఓ అనుకోని మీటింగ్లో ఇద్దరూ కలవాల్సి వస్తుంది. అయితే అదే మీటింగ్ నుండి ఈ ఇద్దరినీ ఓ ప్లాన్ ప్రకారం ఒకే ఫ్లైట్లో ఓ ఐల్యాండ్కు పంపుతాడు విలన్. ఎడమొహం అంటే పెడమొహం అనుకునే అత్తాకోడళ్ళలా కొట్టుకునే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే నడుస్తుంది. ఇంతలో ఆ ఫ్లైట్ను విలన్ అనుచరులు దాడి చేసి, కూల్చేస్తారు. యూఎస్, యూకె ప్రెసిడెంట్లు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ఎక్కడో మారుమూల చిట్టడివిలో కూలిపోతే ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. దాదాపుగా అందరూ వీళ్ళిద్దరూ చనిపోయారనుకుంటారు. కానీ అక్కడి నుండి బయటపడి వీరిద్దరూ విలన్ని ఎలా కట్టడి చేస్తారనేది సినిమాలోనే చూడాలి. ప్రముఖ నటులు జాన్ సేనా, ఇడ్రిస్ ఎల్బా ప్రధాన పాత్రలలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. వీళ్ళకి తోడుగా ఏజెంట్ పాత్రలో మన భారతీయ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటించడం విశేషం. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా లైన్తో పాటు ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహతో సంబంధం లేకుండా నడుస్తుంది. అంతేకాదు... సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ప్రభుత్వమే కామందుగా మారితే ఎలా?
‘రైతన్నలారా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూ సేకరణకు దిగుతోంది. మీకు నష్టం ఖాయం. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములివ్వొద్దు’ పెదపరిమి గ్రామంలో ఒక వ్యక్తి సైకిల్పై తిరుగుతూ మైక్ పెట్టుకుని మరీ చేస్తున్న ప్రకటన. రెడ్బుక్ పాలన కాబట్టి ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగి ఉండాల్సింది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. పైగా అందరూ ఆసక్తిగా వింటున్నారు. తొలివిడత భూసేకరణలో భాగమైన రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడం వారి మెదళ్లల్లో కదులుతోందేమో!.రాజధాని అమరావతి పేరుతో ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఇంకో 36 వేల ఎకరాలు కావాలంటూ రంగంలోకి దిగింది. ఇది కాస్తా చాలా గ్రామాల్లో తీవ్ర అలజడికి కారణమైంది. తొలి విడతలో సేకరించిన భూమిలో 20 వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకపోవడం మళ్లీ భూమి కావాలని అనడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలు, అనుమానాలను తీర్చే ప్రయత్నమేదీ చేయడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు కూడా భూములిస్తే రైతులకు నష్టమేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నలభై వేల ఎకరాలు తీసుకున్నా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలేనని, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల వంటి వాటికి సరిపోగా కొంత భూమిని మాత్రమే అమ్ముకోగలమని చెబుతోంది. విజయవాడ సమీపంలో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉండగా కొత్తగా ఇంకోదాని అవసరమేంటి? కొత్తగా సేకరించే భూముల్లో 2500 ఎకరాలు అదానీ సంస్థకు కట్టబెట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.నాడా దొరికిందని గుర్రాన్ని కొంటారా?ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూములివ్వమని రైతులు సైకిళ్లపై ప్రచారం చేస్తూంటే ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. అందరూ ఒప్పుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కామాంధులకు భూదాహం ఎక్కువంటారు. కానీ, ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే, కామాంధులాగా మారితే ఏం చేయాలి!. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూమి తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఆ అవసరాలు ఎంత అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతల ఇష్టాలకు తగ్గట్టుగా భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితేనే ప్రమాదం. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన భూములను మంచి ధరకు రైతుల నుంచి ఖరీదు చేసి భవనాలు నిర్మించుకున్నా లక్షల కోట్ల వ్యయం కాదు.హైదరాబాద్ ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎంత భూమి సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం భూదాహం ఎంతన్నది స్పష్టమవుతుంది. వేల ఎకరాల భూమి సేకరించి ఏకమొత్తంగా లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమీ ఉండదు. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో ప్రైవేటు సంస్థలే ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఎనెన్నో గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లేదు? అలా కాకుండా అన్నీ తామే చేస్తామంటే ఎలా? ఎప్పటికి కావాలి?.ప్రపంచ బ్యాంక్ షరతు..అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఎప్పుడిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. వేల కోట్ల వ్యయమయ్యే మౌలిక సదుపాయాల వృద్ధి ఎప్పటికయ్యేనో తెలియదు. గిరాకీ వస్తే మంచిదేకానీ.. ప్రభుత్వమిచ్చే ప్లాట్లతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగకపోతే? అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలచుకుంటేనే బాధ కలుగుతుంది!. ఈ నేపధ్యంలోనే ఒక సాధారణ రైతు.. మైక్ పట్టుకుని భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. రెడ్బుక్ అరాచకం ఈ రైతుపైనా జరుగుతుందేమో తెలియదు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి పెట్టిన షరతులలో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. దాని ప్రకారం భూములు ఎప్పటి నుంచి అమ్ముతారని ఆ బ్యాంకు అడుగుతోందని కథనాలు వచ్చాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల లెక్కన అమ్ముకోవచ్చునని అధికారులు ప్రపంచబ్యాంకుకు తెలిపారట. ఇదసలు సాధ్యమయ్యేదేనా?. ఈ ధరకు కొనగలిగే సంస్థలెన్ని? ఇదే వాస్తవమైతే ఈపాటికి వందల ఎకరాలు అమ్మి ఉండాలి కదా!. ప్రజలను మభ్య పెట్టినట్లు ప్రపంచ బ్యాంకును కూడా మాయ చేయాలని అనుకుంటున్నారా?.మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు రూ.30వేలు మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రూ.20 వేలు చెల్లిస్తే, ప్రధానమంత్రి కిసన్ యోజన కింద ఇంకో రూ.ఆరు వేలు వస్తాయని వీరంటున్నారు. అంటే.. భూములు తమ వద్దే ఉన్నా రూ.26 వేలు వస్తూండగా.. ప్రభుత్వానికి ఇస్తే వచ్చేది రూ.30 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు. కేవలం రూ.4 వేల అదనపు ప్రయోజనం కోసం భూమిపై తమ హక్కులను ఎందుకు కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు, కొనుగోలుదారులు.. బాగా నష్టపోయారు. అందువల్లే ఆయా గ్రామసభలలో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ను, అధికారులను నిలదీస్తున్నారట. కొన్ని చోట్ల వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అయినా రైతుల ఆమోదం దొరికినట్లు అధికారులు రాసేసుకుంటున్నారట. భూములు లాక్కుని తమకు బిచ్చగాళ్లగా చేయవద్దని కొందరు మొర పెట్టుకుంటున్నారు.గతంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం అదానీకి భూములు కేటాయిస్తే.. ఏపీని రాసిచ్చేస్తున్నారని నోరు పారేసుకున్న టీడీపీ మీడియా ఇప్పుడు అదానీ స్పోర్ట్స్ సిటీ గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ఆయా సంస్థలకు ఎంత మొత్తానికి భూములు కేటాయిస్తున్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ఎకరాకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించడానికి సిద్దపడకపోతే ఏం చేస్తారో తెలియదు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నాలుగింటికి రెండున్నర ఎకరాల చొప్పున ఇస్తారట.అంతర్జాతీయ స్థాయిలో నిజంగా ఆ సెంటర్లు ఏర్పాటైతే ఈ స్థలం సరిపోతుందా? ప్రస్తుతం భూదాహంతో తహతహలాడిపోతున్న ప్రభుత్వ పెద్దలు లేచింది లేడికి ప్రయాణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతమంటే తమ సొంత జాగీరన్నట్లుగా భావిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేల కోట్ల అప్పులు సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలం! కొసమెరుపు ఏమిటంటే ఈ అదనపు భూమి సమీకరణపై మంత్రివర్గంలో తర్జనభర్జనపడి నిర్ణయం వాయిదా వేయడం!.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి!
బొమ్మలు చిన్నపిల్లల కోసమే అనుకుంటారు చాలా మంది. బొమ్మలు పెద్దల్లో ఉన్న పిల్లల కోసం కూడా! బొమ్మలను చూడటం, వాటిని తాకడం, షెల్ఫ్లలో పెట్టుకుని దాచుకోవడంఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అంటారు నిపుణులు. ‘నా చిన్నప్పటి సంతోషాలను ఇప్పటికీ పొందుతున్నాను’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్ (Saylee Padwal). ముంబైలో ఉన్న శైలీ ఇంటికి వెళితే ఇంటి నిండా బొమ్మలే. వీటి సేకరణ కూడా ఒక ఇన్వెస్ట్మెంటే అంటున్న శైలీ పరిచయం. ‘కొత్త బొమ్మ కొన్నప్పుడల్లా నాకు ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్. ఆమె ఇంటికి వెళితే గదులు, అరలు, అల్మారాలు, గోడలు... అన్నీ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే అవేవీ దేశీయమైన బొమ్మలు కాదు. ఈ కాలపు పిల్లలు కూడా తక్కువగా చూసే ఆధునిక బొమ్మలు. చాలా మటుకు చైనా బొమ్మల తయారీ దిగ్గజం పాప్ మార్ట్ తయారు చేసి వదిలేవే. హాట్సునే మికు, స్మిస్కిస్, క్రై బేబీస్... ‘వీటన్నింటి కంటే నాకు లబుడు బొమ్మలు ఇష్టం’ అంటుంది శైలీ పాడ్వాల్.ఫ్యాషన్ డిజైనర్గా దేశ విదేశాలు తిరిగే శైలీ తనకు స్నేహితులెవరైనా ఉన్నారంటే బొమ్మలనే అంటుంది. ‘కొత్త కొత్త బొమ్మలను చూడటం, తాకడం వాటిని ఇంట్లో అలంకరించుకోవడం థెరపీ అనే అనిపిస్తుంది నాకు. బొమ్మలు కేవలం పిల్లలవి కాదు. బొమ్మలకు ఆకారాలుంటాయి. ప్రాణం లేకపోయినా అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో అనుబంధం ఏర్పడుతుంది. బొమ్మలు తోడుంటే ఒంటరితనం బాధ ఉండదు’ అంటుంది శైలీ.ఈ బొమ్మల మీద ఆసక్తి ఆమెకు బార్బీ బొమ్మల నుంచి వచ్చింది. ‘నా చిన్నప్పుడు అమ్మ ప్యాకెట్ మనీ ఇచ్చేది. వాటిని దాచి దాచి మొదటిసారి బార్బీ రెయిన్, బార్బీ సన్డాల్ అనే రెండు బొమ్మలు కొన్నాను. నా చిన్నప్పుడు అవే పెద్ద ఫ్రెండ్స్గా ఉన్నాయి. బొమ్మలను నేను చూసే పద్ధతి, వాటిని అలంకరించే పద్దతి, ఆకర్షణీయమైన బొమ్మలను చూసే పద్ధతి గమనించిన మా అమ్మ నేను ఫ్యాషన్ రంగంలో రాణిస్తానని ఊహించింది. ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం వల్ల బొమ్మల్లోని అంద చందాలు నాకు మరింత బాగా అర్థమయ్యాయి’ అంది శైలీ.అయితే ఇంటి నిండా బొమ్మల్ని చూసి ‘ఇన్ని ఎందుకు’ అని తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. ‘ఈ బొమ్మలు కొని పెట్టడం కూడా ఒక పెట్టుబడే. బొమ్మలు ఎప్పటికప్పుడు మారు తుంటాయి. ఒకసారి వచ్చిన బొమ్మలు మళ్లీ రావు. ఇలా కలెక్ట్ చేసి పెడితే కొన్నాళ్లకు అవి అరుదైనవిగా మారుతాయి. వాటిని భారీ రేటు ఇచ్చి కొనేవారూ ఉంటారు’ అంటుంది శైలీ.చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!పసిపిల్లలు బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోవడం అందరికీ తెలిసిందే. బొమ్మలు మానసిక ఓదార్పుని ఇస్తాయి. దేశీయ బొమ్మలు ఒకప్పుడు పిల్లలందరి దగ్గరా ఉండేవి. ఇప్పుడు ఏ బొమ్మలు లేకపోతే కనీసం టెడ్డీ బేర్ను అయినా పెట్టుకుంటున్నారు. ‘అది మంచిదే’ అంటుంది శైలీ.‘పిల్లలున్న ఇంట్లో బొమ్మలు లేవంటే వారు సరిగా పెరగడం లేదని అర్థం. మరొకటి పిల్లలకు బొమ్మలు ఇచ్చాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పద్దు. వాటితో ఎలా వ్యవహరించాలో పిల్లలకు తెలుసు. వాటిపై ప్రయోగాలు జరిపినా...విరగ్గొట్టినా అదంతా ఎదుగుదలలో భాగంగా చూడాలి’ అంటుంది శైలీ. అయితే మితిమీరిన బొమ్మలను కొనడం ఒక వ్యసనంగా చూసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే శైలిది సేకరణా... లేకుంటే వ్యసనమా... అనిపిస్తుంది. ఒకవేళ వ్యసనమైనా హాని లేని వ్యసనమే అనుకుని సరిపెట్టుకోవచ్చు. ‘మీరేమైనా అనుకుంటే నా బొమ్మల ప్రపంచం నాది’ అంటోంది శైలీ.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
'పెద్ది'లో చరణ్ కోచ్గా స్టార్ హీరో.. ఫస్ట్లుక్ విడుదల
రామ్ చరణ్- బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'.. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్తో చరణ్ మెప్పించాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సంతకం ఎలా ఉండబోతుందో చూపించాడు. అయితే, తాజాగా మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కన్నడ నటుడు శివరాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో మేకర్స్ రివీల్ చేశారు. ఇదే సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన పాత్ర పేరు 'గౌర్నాయుడు' అని రివీల్ చేశారు.పెద్ది సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 2 రోజులు షూట్ కూడా పూర్తి చేసినట్లు శివరాజ్కుమార్ గతంలో ఇలా చెప్పారు. 'ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. నా షాట్ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది.' అని ఆయన అన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్కు కోచ్గా శివరాజ్కుమార్ నటిస్తున్నట్లు సమాచారం.వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్ కుమార్తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను: బుమ్రా
ఇంగ్లండ్తో మూడో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టోక్స్ బృందానికి తన పేస్ పదును రుచిచూపించి.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ ఘనత సాధించి ఆనర్స్ బోర్డు (Lord's Hounours Board)పై తన పేరును లిఖించుకున్నాడు.స్పందించిన బుమ్రాఈ నేపథ్యంలో మూడో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా డ్యూక్స్ బాల్ (Dukes Ball) నాణ్యత, బంతి మార్పుపై చెలరేగుతున్న వివాదంపై ఈ పేస్ గుర్రం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘మ్యాచ్లో బంతిని మార్చడం సహజమే.ఆ విషయంలో నేనేమీ చేయలేను. అంతేకాదు.. ఈ వివాదంపై స్పందించి నా డబ్బును పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎందుకంటే.. నేను మ్యాచ్లో చాలా ఓవర్లపాటు బౌలింగ్ చేసేందుకు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాను.చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడనుకాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో నా మ్యాచ్ ఫీజును తగ్గించుకోవాలని అనుకోవడం లేదు. ఏదేమైనా.. మాకు ఇచ్చిన బంతితోనే మేము బౌలింగ్ చేస్తాము. బంతి మార్పు అంశంలో ఆటగాళ్లుగా మేము చేయగలిగింది ఏమీ లేదు. అందుకోసం మేము పోరాడలేము కూడా!ఒక్కోసారి మనకు అనుకూలంగా ఫలితం రావచ్చు. మరోసారి చెత్త బంతినే మన చేతికి ఇవ్వవచ్చు’’ అని బుమ్రా విలేకరుల ప్రశ్నకు బదులిచ్చాడు. 2018లో తాను ఇంగ్లండ్లో ఆడినపుడు డ్యూక్స్ బాల్ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. బంతి అప్పట్లో బాగా స్వింగ్ అయ్యేదని.. తాను అప్పుడు అవుట్స్వింగర్లనే ఎక్కువగా సంధించేవాడినని బుమ్రా గుర్తు చేసుకున్నాడు.1-1తో సమంగా సిరీస్కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్లో తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. ఎడ్జ్బాస్టన్లో గెలిచి ప్రస్తుతం 1-1తో సిరీస్ సమం చేసింది. బుమ్రాకు ఐదు వికెట్లు.. ఇంగ్లండ్ 387 ఆలౌట్ఇక లార్డ్స్లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు దక్కించుకోగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు కూల్చారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.టీమిండియా @145ఇదిలా ఉంటే... తొలి టెస్టు నుంచి డ్యూక్స్ బాల్ నాణ్యత విషయంలో టీమిండియా అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎర్ర బంతి త్వరగా రూపు మారడంతో పదే పదే బాల్ను మార్చాల్సి వస్తుండగా.. ఇప్పటికే కెప్టెన్ శుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్లతో వాదనకు దిగారు. ఈ క్రమంలో తమకు అనుకూల ఫలితం రాకపోవడంతో బంతిని నేలకేసి కొట్టిన పంత్ను ఐసీసీ మందలించింది. అతడి ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ జమచేసింది.ఇక లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా గిల్, సిరాజ్ బంతి మార్పు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బంతిని మార్చినప్పటికీ పాత బంతితో దానికి ఏమాత్రం పోలిక లేదంటూ ఇద్దరూ అసహనానికి గురయ్యారు. ఇదే విషయమై బుమ్రాను ప్రశ్నించగా పైవిధంగా స్పందించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డ్యూక్స్ బాల్ అంటే..మొదట్లో డ్యూక్స్ కుటుంబం ఎర్ర బంతులను తయారు చేసేది. చేతితో ఆరు వరుసల దారంతో వీటిని కుడతారు. సీమ్కు అనుకూలంగా ఉండే ఈ బంతి దీర్ఘకాల మన్నికకు పెట్టిందిపేరు. ఇంగ్లిష్ కండిషన్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే, తాజా సిరీస్లో త్వరత్వరగా బంతి రూపు మారడం వివాదానికి, బంతి నాణ్యతపై చర్చకు దారి తీసింది. ప్రస్తుతం డ్యూక్స్ బాల్ తయారీ కంపెనీ దిలీప్ జగ్జోడియా చేతిలో ఉంది.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!DAY 1 ➡ 1 Wicket𝐃𝐚𝐲 𝟐 ➡ 𝐍𝐚𝐦𝐞 𝐨𝐧 𝐋𝐨𝐫𝐝'𝐬 𝐇𝐨𝐧𝐨𝐮𝐫𝐬 𝐁𝐨𝐚𝐫𝐝 🎖@Jaspritbumrah93, yet again, stole the show with a fiery 5/74 on Day 2 & etched his name into Lord’s rich legacy 💪#ENGvIND 👉 3rd TEST, DAY 3 | SAT, 12th JULY, 2:30 PM | Streaming on… pic.twitter.com/X3jqiobSko— Star Sports (@StarSportsIndia) July 11, 2025 -
విచిత్ర ఘటన.. ఈ మృతదేహం నా భర్తది కాదు..!
హన్మకొండ: ‘రోడ్డు ప్రమాదంలో నీ భర్త మృతిచెందాడ’ని పోలీసులు సమాచారం అందించడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతదేహం తమవారిది కాదని గుర్తించి.. తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి( 55), రమకు ముప్పయి ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు. ఇరవై ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా అప్పటినుంచి రమ వేరుగా ఉంటున్నారు. అతను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలో యాచిస్తూ జీవిస్తున్నాడు. తొర్రూరులో ఈనెల 09వ తేదీన రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు, పోలీసుల సాయంతో అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు గురువారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఎంజీఎంనుంచి పోలీసులు ‘నీ భర్త చనిపోయాడని’ మైలారానికి చెందిన గోక రమకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు మార్చురీనుంచి చాపతో చుట్టిన మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నేరుగా మైలారంలోని దహనసంస్కారాలు చేసే స్థలానికి తీసుకొచ్చారు. కిందికి దించి చాప విప్పిచూడగా కుమార్తె స్వప్న ఆ మృతదేహాన్ని చూడగా తన తండ్రి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉంటుందని, ఈ మృతదేహానికి పచ్చబొట్టు లేదని, తమ నాన్న కాదని తేల్చిచెప్పింది. భార్య, బంధువులు సైతం చూసి తమవారిది కాదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని అదే అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. రమ తన భర్తను చాలా ఏళ్లుగా చూడకపోవడం.. చాపలో చుట్టి ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినట్లు కొందరు అంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అన్నది గుర్తించాల్సి ఉంది. పోలీసుల వినతి మేరకే..ఎంజీఎం : ఈ నెల 9వ తేదీన అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎంకు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ తెలిపారు. కాగా, సద రు వ్యక్తి మృతదేహం రాయపర్తి మండలం మైలా రం గ్రామానికి చెందిన కుమారస్వామిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టుమార్టం లేకుండా అప్పగించాలనే పోలీసుల వినతి మేరకు ఆ మృతదేహాన్ని భార్య, బంధువుల అంగీకారం మేరకు అప్పగించినట్లు ఆర్ఎంఓ తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీ సుకెళ్లిన కుటుంబ సభ్యులు తమది కాదని పేర్కొని తిరిగి ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వెల్లడించారు. -
జనసేన నేత వినూత కోటా అరెస్ట్
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి వినూత కోటా (Vinutha Kotaa) అరెస్ట్ అయ్యారు. మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa), మరో ముగ్గురినీ చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల కిందటే రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించడం గమనార్హం. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినుత పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు పోలీసులు విచారించారు. ఆపై అది ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) కొంతకాలంగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగ..విచారణలో.. ఈ నెల 8వ తేదీన రాయడిని హత్య చేసి నదిలో పడేసినట్లు తెలుస్తోంది. దీంతో వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మిగతా నిందితులను కాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ.. -
ఐదేళ్ల తర్వాత చైనాకు జైశంకర్.. ఎందుకెళుతున్నారంటే..
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వచ్చే వారం చైనాను సందర్శించనున్నారు. ఐదేళ్ల తర్వాత ఆయన చైనా పర్యటనకు వెళుతున్నారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత చైనాలో జైశంకర్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)వెంబడి 2020 నాటి సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ పర్యటనలో జైశంకర్ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి ముందు ఆయన బీజింగ్లో చైనా ప్రతినిధి వాంగ్ యితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. కాగా సరిహద్దు వివాదంపై భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని వార్తా సంస్థ పీటీఐ గతంలో తెలిపింది. ఇరు దేశాలు తమ మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.భారత్- చైనా సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని జైశంకర్ ఇటీవల అన్నారు. ఈ పర్యటనలో జైశంకర్.. సరిహద్దు వివాదాలు, దలైలామా వారసత్వం, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. 2020 మే నెలలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. దాదాపు ఐదేళ విరామం తర్వాత గత నెలలో ఇరు దేశాలు కైలాస మానసరోవర యాత్రను తిరిగి ప్రారంభించాయి. -
మూడో రౌండ్లో వంతిక
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్లో రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్తో వైశాలి తలపడతారు. -
ప్రేమ, పట్టుదల, బాధ్యతల నడుమసాగే ప్రేమకథ ‘జయం’ జీ తెలుగులో!
హైదరాబాద్, 11 జులై 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం, జులై 14న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, మీ జీ తెలుగులో!జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్ (శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే. ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ప్రముఖ నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, "జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం," అన్నారు.జయం సీరియల్ జులై 14 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభంతో ఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి, చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి. ఈ విషయాన్ని జీ తెలుగు ప్రేక్షకులు గమనించాలని జీ తెలుగు విజ్ఞప్తి చేసింది. -
ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్!
గ్రీన్ మొబిలిటీ, సుస్థిర రవాణా దిశగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ (ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం కింద మార్గదర్శకాలను విడుదల చేసింది. కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలతో నడుస్తున్న వాహనాల స్థానే స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. భారీ వాహనదారులు ఎలక్ట్రిక్ ట్రక్కు (ఈ-ట్రక్)ను కొనుగోలు చేస్తే రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించబోతున్నట్లు ఈ మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.పీఎం ఈ-డ్రైవ్ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుఈ-ట్రక్కుపై రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు.మొత్తం దేశవ్యాప్తంగా 5,600 ఈ-ట్రక్కులకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తారు.సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం ఎన్ 2, ఎన్ 3 కేటగిరీ ఈ-ట్రక్కులు 3.5 టన్నుల నుంచి 55 టన్నుల బరువు ఉంటే ఇది వర్తిస్తుంది.ట్రక్కులతోపాటు ఎన్ 3 కేటగిరీలోని పుల్లర్ ట్రాక్టర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తారు.నిబంధనలివే..పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) ట్రక్కుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)స్క్రాపేజ్ రుజువును ఈ ప్రోత్సాహకాల కోసం సమర్పించాల్సి ఉంటుంది.పాత ఐసీఈ ట్రక్కు బరువు కొత్త ఈ-ట్రక్కు కంటే సమానమైన లేదా ఎక్కువ బరువు ఉండాలి.ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేయాలి.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్(సీడీ) లేని కొనుగోలుదారులు డిజిఈఎల్డీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సీడీలను ఆన్లైన్లో విక్రయిస్తుంది.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వెరిఫికేషన్ పీఎం ఈ-డ్రైవ్ పోర్టల్, రిజిస్టర్డ్ డీలర్ ద్వారా నిర్వహిస్తారు.అన్ని వివరాలు ధ్రువీకరించిన తరువాత డీలర్ కొనుగోలుదారు ఐడీని జనరేట్ చేస్తాడు. ప్రోత్సాహకాన్ని నేరుగా ఈ-ట్రక్ అమ్మకానికి వర్తించేలా ఏర్పాటు చేస్తాడు.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీసుస్థిర రవాణా దిశగా అడుగులుభారతదేశాన్ని గ్రీన్ రవాణా ఎకోసిస్టమ్వైపు నడిపించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి నొక్కి చెప్పారు. 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించే భారత్ లక్ష్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ విజన్కు ఈ ప్రయత్నం కూడా తోడవుతుందన్నారు. -
పొలార్డ్ విధ్వంసం.. దంచికొట్టిన పూరన్.. ఫైనల్లో ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్ చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్ను ఓడించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్ మ్యాచ్లో భాగంగా శనివారం ఎంఐ న్యూయార్క్- టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సూపర్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ స్మిత్ పాటిల్ (9) వికెట్ కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన సాయితేజ ముక్కామల్ల (1).. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన శుభమ్ రంజానే (1), మార్కస్ స్టొయినిస్ (6) పెవిలియన్కు వరుస కట్టారు.రాణించిన డుప్లెసిస్..బ్యాట్ ఝులిపించిన అకీల్ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plesis) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా స్పిన్నర్ అకీల్ హుసేన్ బ్యాట్ ఝులిపించాడు.కేవలం 32 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అకీల్ నాటౌట్గా నిలవగా.. డొనొవాన్ ఫెరీరా (20 బంతుల్లో 32 నాటౌట్) దంచికొట్టాడు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టస్ లస్ మూడు వికెట్లు కూల్చగా.. రుషిల్ ఉగార్కర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ ఆరంభంలోనే క్వింటన్ డి కాక్ (6) రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్డౌన్ బ్యాటర్ మైకేల్ బ్రేస్వెల్ (8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.పూరన్ ధనాధన్ఈ క్రమంలో మరో ఓపెనర్ మోనాంక్ పటేల్ (49) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. నికోలస్ పూరన్ (Nicholas Pooran) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 36 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. Pooran goes down the ground. Pooran goes out of the ground. 🙌#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/MWrsE5HOyC— MI New York (@MINYCricket) July 12, 2025పొలార్డ్ విధ్వంసంమరోవైపు.. సీనియర్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి తన బ్యాట్కు పనిచెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సూపర్ కింగ్స్ బౌలింగ్ను చితక్కొట్టాడు. సునామీ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు- 47 పరుగులు)తో విరుచుకుపడి.. పూరన్తో కలిసి ఎంఐ న్యూయార్క్ను విజయతీరాలకు చేర్చాడు. పూరన్, పొలార్డ్ ధనాధన్ దంచికొట్టడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఎంఐ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్లో రెండోసారి ఫైనల్ల్లో అడుగుపెట్టింది.DeathTaxesPollard smashing it 🆚 the Super Kings 💥#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/qdvYfEWnnm— MI New York (@MINYCricket) July 12, 2025 కాగా టెక్సాస్ సూపర్ కింగ్స్- వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో టెక్సాస్ జట్టు (14)తో పోలిస్తే పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న వాషింగ్టన్ (16) నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలో చాలెంజర్ రూపంలో సూపర్ కింగ్స్కు మరో అవకాశం లభించగా.. ఎంఐ జట్టు చేతిలో భంగపాటే ఎదురైంది.మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోతో ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతగా నిలిచిన ఎంఐ న్యూయార్క్ జట్టు.. తాజాగా సూపర్ కింగ్స్పై కూడా గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డల్లాస్లో ఆదివారం (జూలై 13) టైటిల్ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
‘మా భర్తలకు ఏం జరిగినా ఎస్పీ, పోలీసులదే బాధ్యత’
సాక్షి, చిత్తూరు: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెడ్ యార్డ్ పర్యటనపై కూటమి నేతలు అక్కసు వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చి.. ఫొటోగ్రాఫర్పై దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా ఫొటోగ్రాఫర్ శివపై దాడి కేసులో అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చక్రి, జీడి నెల్లూరుకు చెందిన మోహన్లను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, చిత్తూరు డీటీసీకి తరలించారు. అయితే, వారిని మాత్రం పోలీసులు చూపించడం లేదు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ సందర్భంగా మోహన్ భార్య రాసాత్తి మాట్లాడుతూ..‘నా భర్త ఆరోగ్యం సరిగా లేదు.. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. రోజుకు మూడు సార్లు మందులు వేసుకోవాలి.. మూడు రోజులుగా పోలీసులు నిర్బంధంలో ఉన్నాడు.. నా భర్త మోహన్కు ఏం జరిగినా పోలీసులు, జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాలి. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం.. నా భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు’ అని అన్నారు.చక్రి భార్య కవిత మాట్లాడుతూ..‘ఫొటోగ్రాఫర్పై దాడి చేయక పోయినా నా భర్తను అరెస్ట్ చేశారు. బాధితుడు ఫొటోగ్రాఫర్ శివ కూడా చక్రి నా కెమెరా కాపాడాడు.. నన్ను రక్షించాడు అని చెప్తున్నా నా భర్తపై తప్పుడు కేసు పెడుతున్నారు’ అని తెలిపారు. -
ఛి…ఛీ.. అంటూ 'పవన్'పై ప్రకాష్ రాజ్ ఫైర్.. లక్షల్లో ట్వీట్లు
'మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ' అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చిన పవన్ ఇప్పుడు 'ఏ మేరా జహా' అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు. హిందీ అందరినీ ఏకం చేస్తుందంటూ పాఠాలు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ వర్గాల నుంచి మాత్రమే కాకుండా అందరి నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పీకేను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను సమర్ధించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కిందా మీదా అవుతోంది. #POLITICALJOKERPK అనే హ్యాష్ట్యాగ్ సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్కు కౌంటర్గా పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. తాజాగా ప్రముఖ సినీ నటులు ప్రకాశ్రాజ్ కూడా స్పందించారు.గచ్చిబౌలి స్టేడియంలో ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్రాజ్ మండిపడ్డారు. తన ఎక్స్ పేజీలో పవన్ చేసిన కామెంట్స్ను చేర్చి 'ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking' అంటూ ఆయన ఫైర్ అయ్యారు. దీంతో ప్రకాశ్రాజ్కు కూడా చాలామంది సపోర్ట్గా ఆయన చేసిన పోస్ట్ను షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో హిందీ బాషపై గతంలో పవన్ వేసిన ట్వీట్లు, మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. అప్పడేమో హిందీ గో బ్యాక్ అని పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే ఇప్పుడు జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది. అందుకే హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ విశ్లేషకులు కోరుతున్నారు.ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj— Prakash Raj (@prakashraaj) July 11, 2025 -
కమెడియన్ భార్యకు అశ్లీల మెసేజ్లు
కర్ణాటక: కమెడియన్ సంజు బసయ్య భార్యకు గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల మెసేజ్లు పంపించాడు. దీంతో కమెడియన్ సంజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని పిలిపించి వారి్నంగ్ ఇచ్చి పంపించేశారు. వ్యక్తి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని క్షమించినట్టు సంజు బసయ్య తెలిపాడు. -
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం సందర్బంగా నివాసం ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. నలుగురు క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శీలంపూర్ ప్రాంతంలో ఉన్న జనతా మజ్దూర్ కాలనీలో ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అసలు బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు.. ప్రాణనష్టంపై తెలియరాలేదు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. #WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb— ANI (@ANI) July 12, 2025 -
Myanmar: బౌద్ధ ఆరామంపై వైమానిక దాడి.. 23 మంది మృతి
నేపిడా: మయన్మార్లోని లిన్ టా లు గ్రామంలోని ఒక బౌద్ధ ఆరామంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా 23 మంది పౌరులు మరణించారు. లిన్ టా లు గ్రామం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడి తెల్లవారుజామున జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)వెల్లడించింది.ఈ ఘటనలో మొత్తం 23 మంది మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారని ఏపీ తెలిపింది. గాయపడినవారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. కాగా స్వతంత్ర వార్తా సంస్థ డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా ఈ ఘటనలో 30 వరకు మరణించి ఉండవచ్చని పేర్కొంది. మయన్మార్ సైన్యం ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. జుంటా వ్యతిరేక ఘటనలకు కీలకంగా నిలిచిన సాగింగ్ ప్రాంతంలో సైనిక చర్యలు ముమ్మరమవుతున్నాయి. సైన్యం ఇటీవల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది.స్థానిక తిరుగుబాటు గ్రూపుల నుండి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ట్యాంకులు, యుద్ధ విమానాలను సైన్యం ఈ ప్రాంతంలో మోహరించింది. రాబోయే ఎన్నికలకు ముందు తన బలాన్ని ప్రదర్శించడానికే జుంటా ఇదంతా చేస్తోందనే ఆరోపణలున్నాయి. మయన్మార్లో సైనిక పాలనను జుంటా అని పిలుస్తారు. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా మయన్మార్ సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య మద్దతుదారులు, సైన్యం మధ్య వివాదం తీవ్రమైంది. ముఖ్యంగా సాగింగ్లో సైనిక నియంత్రణకు వ్యతిరేకంగా పౌరులు, స్థానిక మిలీషియా గ్రూపులు పోరాటాలు సాగిస్తున్నాయి. -
బుల్లితెర నటిపై చాకుతో భర్త దాడి
బనశంకరి: అనుమానంతో బుల్లితెరనటిపై భర్త చాకుతో దాడికి పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిదిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మంజుల అలియాస్ శృతి 20 ఏళ్ల క్రితం ఆటోడ్రైవర్ అమరేశ్(49) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనగర మునేశ్వరబ్లాక్లో నివాసం ఉంటున్నారు. శృతి రాత్రిసమయంలో ఆలస్యంగా ఇంటికి వచ్చేది. మద్యం సేవిస్తుండటంతో దంపతుల మధ్య గొడవ జరిగేది. కొద్దినెలలుగా శృతిపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల కుటుంబ పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. కానీ శృతిలో మార్పురాలేదు. కోపోద్రిక్తుడైన అమరేశ్ ఈనెల 4వ తేదీ పిల్లలు కాలేజీకి వెళ్లిన అనంతరం చాకుతో శృతిపై ఇష్టానుసారం దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శృతి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హనుమంతనగర పోలీసులు అమరేశ్ను అరెస్ట్చేసి విచారణ చేపట్టారు. -
షిప్రాకెట్ నుంచి ‘శూన్య.ఏఐ’
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీతొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్ఫిల్మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాలను అద్దెకిచ్చే అగ్కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 94 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.ఇదీ చదవండి: వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 168 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 84 కోట్లు పరికరాల కొనుగోళ్లకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2003లో ఏర్పాటైన హర్యానా కంపెనీ ప్రధానంగా మౌలిక రంగ కంపెనీలకు పరిశ్రమ సంబంధిత పరికరాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చుతుంది. గతేడాది(2024–25) ఆదాయం 20 శాతం ఎగసి రూ. 164 కోట్లను తాకగా.. నికర లాభం 36 శాతం జంప్చేసి రూ. 31 కోట్లకు చేరింది. -
వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్
వాణిజ్య బీమా విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ప్రైవేట్ రంగ జ్యూరిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ అలోక్ అగర్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీన్ని సరికొత్తగా ఆవిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు సంబంధించి మొత్తం బీమా వ్యాపారంలో సుమారు 3 శాతంగా ఉన్న ఈ విభాగం వాటాను వచ్చే 2–3 సంవత్సరాల్లో 15–20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి బడా కార్పొరేట్లు, స్పెషలైజ్డ్ పరిశ్రమల వరకు వివిధ రంగాలకు అనువైన పథకాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో ఇప్పటికే ఓ కార్యాలయం ఉండగా త్వరలో వైజాగ్లో కూడా ఒకటి ప్రారంభిస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీమాను విస్తరించేలా స్వల్ప ప్రీమియం, ఒక మోస్తరు సమ్ ఇన్సూర్డ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వాహన బీమా పాలసీల విక్రయాలు రెండు దశాబ్దాల పాటు సుమారు 13–17 శాతం వరకు వృద్ధి చెందినప్పటికీ, వాహన విక్రయాలు కొంత నెమ్మదించడం వంటి అంశాల కారణంగా గతేడాది ఆరు శాతానికి పరిమితం అయ్యాయని చెప్పారు. ఇవి క్రమంగా మళ్లీ పుంజుకోగలవని చెప్పారు. -
రాధికా యాదవ్ హత్యకు కారణం అదేనా?
గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన మాజీ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ (25)ను తండ్రి దీపక్ యాదవ్ (49) హత్య చేసిన కేసు మిస్టరీగా మారింది. రాధిక హత్య కేసులో తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ వర్గానికి చెందని వ్యక్తిని రాధిక ప్రేమిస్తోందని.. అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్టు దీపక్ యాదవ్ సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు. ఇక, ఆమె ప్రియుడు.. రాధిక క్లాస్మేట్ అని తెలుస్తోంది.అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. రాధిక సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి. అనంతరం, రీల్స్ చేయడం కారణంగా హత్య చేసి ఉంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం ఆ కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక హత్యకు ఆమె ప్రేమ వ్యవహారమే ముఖ్య కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తండ్రి, కూతురు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, రాధిక హత్య కేసులో దీపక్ యాదవ్ను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీసు కస్టడీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న రాధిక తల్లి ఏం చేస్తున్నారన్నది కూడా విచారిస్తున్నట్లు గురుగ్రామ్ పోలీసు అధికారి సందీప్సింగ్ తెలిపారు. రాధికా యాదవ్ గురుగ్రామ్లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి దీపక్ యాదవ్ వెనుక నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయింది. దీపక్ యాదవ్కు గురుగ్రామ్లో చాలా ఆస్తులు ఉన్నాయి. అద్దెలు కూడా వస్తాయి. ఈ కారణంగానే టెన్నిస్ అకాడమీ నడపాల్సిన అవసరం ఏముందని ఆయన కుమార్తెతో తరచూ వాదన పడుతుండేవారని తెలిసింది. #RadhikaYadav | Tennis Player Radhika Yadav Shot Dead By Father In GurugramInam Ul Haque, co-actor in Radhika Yadav’s music video, opens up about their time filming together amid the shocking murder investigation@akankshaswarups | #RadhikaYadav pic.twitter.com/HdWJhmNJ7Q— News18 (@CNNnews18) July 11, 2025అలాగే, రాధిక గతేడాది ఓ కళాకారుడితో కలిసి మ్యూజిక్ రీల్స్ చేసింది. ఈ ఉదంతం వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లుగా తెలుస్తోంది. ఓ పాటలో రాధిక నటించింది. ఈ వీడియోతో రాధికతో పాటు ఇనాముల్ అనే వ్యక్తి నటించాడు. ఇక, ఈ పాటలో వారిద్దరూ ఎంతో సన్నిహితంగా కూడా ఉన్నారు. అయితే, ఈ పాటకు వీడియో అయిపోయిన తర్వాత ఆమెతో తాను ఎలాంటి కాంటాక్ట్లో తాను లేనని ఇనాముల్ చెప్పుకొచ్చాడు. What will people say? This thinking took his daughter’s lifeTennis player Radhika Yadav was shot dead by her own father over her independence, tennis academy, and appearance in a music video. pic.twitter.com/U4jQTB1h4z— Why Crime (@WhyNeews) July 12, 2025 -
Bihar: ‘లేపేస్తామంటూ..’ చిరాగ్ పాశ్వాన్కు హెచ్చరిక?
పట్నా: బీహారీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ సన్నాహాల్లో మునిగితేలుతూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇంతలో బీహార్కు చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ను హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)వెల్లడించింది.రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సంచలనంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ పట్నా సైబర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు ప్రకారం ‘టైగర్ మెరాజ్ ఈడీసీ’ అనే యూజర్నేమ్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఎల్జేపీకి నాయకత్వం వహిస్తున్న పాశ్వాన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయనకు ఈ బెదిరింపు వచ్చింది. పాశ్వాన్కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ నేపధ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.‘ఈ హెచ్చరిక తీవ్రతను వెంటనే గ్రహించి, సత్వర చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతనికి కఠినమైన శిక్ష విధించండి’ అని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు వచ్చిందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా మీడియాకు తెలిపారు. పట్నా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. చట్టపరమైన చర్యలు చేపట్టామని ధరియా పేర్కొన్నారు. బీహార్లోని హాజీపూర్కు చెందిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి, లోక్సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. -
నాగలికి ప్రేమికులను కట్టి..
ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లకసరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. Odisha: Tribal couple yoked like cattle, beaten & exiled for marrying secretly.In 2025. In India. A young couple tied to a bamboo yoke, forced to plough fields, paraded & humiliated — just for falling in love against “custom.”And then Haryana: Radhika Yadav. 25. National… pic.twitter.com/99Jgd5Zx45— Deepti Sachdeva (@DeeptiSachdeva_) July 11, 2025 -
‘రికార్డులు ఉన్నది తిరగరాయడానికే’
జొహన్నెస్బర్గ్: క్రీడల్లో ఏ రికార్డూ శాశ్వతం కాదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్డర్ అజేయంగా 367 పరుగులు చేశాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి చూస్తే సఫారీ జట్టుకు చాలా సమయం ఉండగా... సారథ్య బాధ్యతలు కూడా అతడి వద్దే ఉండటంతో ముల్డర్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లారా (400) రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు.అయితే అందుకు భిన్నంగా ముల్డర్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... విండీస్ దిగ్గజం లారాపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ అంశంపై లారా తనతో ముచ్చటించినట్లు ముల్డర్ పేర్కొన్నాడు. ‘లారాతో ఇటీవలే దీని గురించి మాట్లాడా. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకే అని చెప్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కోసం ప్రయతి్నంచి ఉండాల్సిందన్నాడు. నీకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేదని ప్రోత్సహించాడు. మరోసారి అలాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సూచించాడు. అది అతడి గొప్పతనం. నా వరకైతే నేను చేసింది సరైందే. ఆ రికార్డు అతడి లాంటి లెజండ్ పేరిట ఉండటమే సబబు’ అని ముల్డర్ అన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో ముల్డర్ ఐదో స్థానానికి చేరాడు. -
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రెండు చిత్రాలు భారీ డిజాస్టర్లుగా ముగిశాయి. దీంతో ఈ చిత్రాలకు సంబంధం ఉన్న వారందరికీ భారీ నష్టాలు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు శంకర్ ఈ రెండు చిత్రాల ఫలితం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా మంది నెటిజన్లు కూడా ఈ వైఫల్యాలకు శంకర్ బాధ్యత వహించాలని భావించారు. కానీ, ఆయన ఎక్కడా కూడా ఇంతవరకు నోరెత్తలేదు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు వంటి ఇతర సినీ ప్రముఖులు పరోక్షంగా దర్శకుడు శంకర్ను తప్పుబట్టారు. పేలవమైన అవుట్పుట్తో పాటు శంకర్లో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ నష్టపోయినట్లు చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు వైరల్ కావడంతో అతనిపై మరింత ట్రోలింగ్ పెరిగింది. అయితే, ఆయన తాజాగా మరో సినిమా గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.శంకర్ తన తదుపరి చిత్రం తమిళ ఎపిక్ నవల ‘వెల్పరి’ ఆధారంగా తెరకెక్కిస్తానని చెప్పారు. అయితే, వరుసగా రెండు భారీ చిత్రాలతో ఆర్థిక నష్టాలను మిగిల్చిన ఆయనతో మరో సినిమా చేసేందుకు ఎవరు ముందుకొస్తారని అందరూ ఆలోచించారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో 'వెల్పరి' సినిమా గురించి శంకర్ మాట్లాడారు. కొద్దిసేపటికే అవి ట్రోల్ కావడం జరిగింది. శంకర్ మాట్లాడుతూ.. ' రోబో సినిమా నా మునుపటి కలల ప్రాజెక్ట్. ఇప్పుడు, 'వెల్పరి' కూడా నా కలల చిత్రం. హాలీవుడ్ చిత్రాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి కొత్త టెక్నాలజీలను భారతీయ సినిమాలకు పరిచయం చేసే అవకాశం దీనికి ఉంది. 'వెల్పరి' ప్రాజెక్ట్ తమిళ సినిమాతో పాటు భారతీయ సినిమాకు గర్వకారణంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రపంచ గుర్తింపును పొందగలదు. నా కల నిజమవుతుందని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: ఛి…ఛీ.. అంటూ 'పవన్'పై ప్రకాష్ రాజ్ ఫైర్.. లక్షల్లో ట్వీట్లు)అయితే, శంకర్ మాటలపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు దూరదృష్టి గల దర్శకుడిగా ఉన్నప్పటికీ, శంకర్ ఇప్పుడు వాస్తవికతకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడని చెబుతున్నారు. ఇండియన్2, గేమ్ ఛేంజర్ సినిమాలను చూస్తే గతంలో అనేక ఐకానిక్ చిత్రాలను అందించిన దర్శకుడు ఇతనేనా అనే సందేహం వస్తుంది. కోట్ల నష్టాలను మిగిల్చిన ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తారా..? హీరోలు శంకర్కు ఛాన్స్లు ఇస్తారా..? అనే కామెంట్లు చేస్తున్నారు. శంకర్ ఇకనుంచైనా పాటల కోసం అధికంగా ఖర్చు చేయడం మానేసి.. కథ, స్క్రీన్ప్లేపై ఎక్కువ దృష్టి పెట్టాలని చాలామంది సూచిస్తున్నారు. గేమ్ ఛేంజర్ , ఇండియన్ 2 సినిమాల వల్ల కమల్ హాసన్తో పాటు రామ్ చరణ్ వంటి స్టార్ల ఖ్యాతి కూడా తీవ్రంగా దెబ్బతింది. అలాంటప్పుడు భారీ ఖర్చుతో కూడిన వల్పరి వంటి ప్రాజెక్ట్కు ఖచ్చితంగా ఒక స్టార్ హీరో అవసరం. కానీ శంకర్ ప్రస్తుత ఫామ్ను చూస్తే, ఏ అగ్ర నటుడు అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడో లేదో చూడాలి.హీరో, నిర్మాతలు 'వెల్పరి' సినిమా కోసం కన్నడ స్టార్ యశ్ను శంకర్ సంప్రదించారని తెలుస్తోంది. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం ఉంటుందని టాక్ వైరల్ అవుతుంది. అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, నెట్ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా సంస్థలు కలిసి నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సు.వెంకటేశన్ రాసిన 'వెల్పరి' నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా గుర్తింపు పొందింది. అందుకే శంకర్ ఈ చిత్రంపై ప్లాన్ చేస్తున్నారు. -
‘నో కామెంట్’.. ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా మౌనం
న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేమని స్పష్టం చేసింది.ఎయిర్లైన్కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్’ పోస్టులో తెలిపింది.ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. -
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం. అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్ప్తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్తో పాటు ఇన్స్టా, ఫేస్బుక్లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. వైరల్గా మారిన ఈ ఫోక్ సాంగ్స్లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరల్ అయినవి.. కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్లో, ఫేస్బుక్, యూట్యూబ్లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి. ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్స్టా రీల్స్లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి. కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్షాప్లలో హైలైట్గా నిలిచింది. రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్గా మారింది. లైఫ్స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్.. ఈ పాటలు గతంలో టిక్టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్కట్, ఇన్స్టాల్లో వైరల్గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్స్టైల్ ఈవెంట్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. -
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
రూకల్లోతు కష్టాల్లో మెట్రో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. ఆదినుంచీ నష్టాల బాటలోనే పరుగులు తీస్తోంది. ఇప్పటివరకు మొత్తం రూ.6,605.51 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.625.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం ఆదాయం రూ.1,108.54 కోట్లు కాగా, మొత్తం నిర్వహణ ఖర్చు రూ.1,734.45 కోట్ల వరకు నమోదైంది. పన్ను చెల్లింపుల అనంతరం వార్షిక నష్టం రూ.625.88 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నగరంలో నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, ఎంజీబీఎస్–జేబీఎస్ల మధ్య ప్రస్తుతం 57 రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. గతేడాది వరకు సుమారు 4.85 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఈ ఏడాది మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్– రాయదుర్గం, ఎల్బీ నగర్– మియాపూర్ రూట్లలోనే ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. -
రాజాసింగ్కు బీజేపీ రాంరాం
సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శకం ముగిసింది. ఆయన రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది. అధిష్టానంపై తనదైన శైలిలో విమర్శనా్రస్తాలను సంధించడంతో కొంత కాలంగా కంటిలో నలుసులా తయారయ్యారని సొంత పార్టీ నేతలు భావించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని వ్యతిరేకిస్తూ వచి్చన ఎమ్మెల్యే తాజాగా నూతన అధ్యక్షుడి ఎన్నికనూ విడిచిపెట్టలేదు. రాంచందర్రావుపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం దిగి వస్తుంది, బుజ్జగిస్తుందని భావించిన రాజాసింగ్కు నేతలు షాకిచ్చారు. ఆయన రాజీనామాను అధిష్టానం ఆమోదించారు. దీంతో జీహెచ్ఎంసీలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ దూరమవడంతో ఆ పారీ్టకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. హిందుత్వంతో దూకుడు.. రాజాసింగ్ హిందుత్వ వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన పెట్టింది పేరు. దూకుడుగా ప్రవర్తించి కొన్ని సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకోవడం అలవాటుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ను ఏడాదికిపైగా బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎన్నికల ముందు పారీ్టలోకి తీసుకుని, టికెట్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని వ్యతిరేకించిన రాజాసింగ్.. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా కనిపించింది లేదు. రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసినా కొంత వరకు ఓపికపడుతూ వచ్చారు. ఆ మధ్య ఎంపీ బండి సంజయ్ వచ్చి సముదాయించిన తర్వాత కాస్త తగ్గిన రాజాసింగ్.. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్రావును ప్రకటించడంతో మరోసారి నోటికి పని చెప్పారు. ఈ సమయంలో పార్టీ అగ్రనాయకులను సైతం విడిచిపెట్టలేదు. దీంతో రాజాసింగ్ వ్యవహారాన్ని పార్టీ సీనియర్గా తీసుకుంది. ఆయన రాజీనామా చేసినా గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లలో ఏ ఒక్కరూ ఆయన వెంటరాలేదు.భవిష్యత్ ప్రయాణం ఎటు? పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో తదుపరి రాజాసింగ్ దారి ఎటు అని చర్చ సాగుతోంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ వరుసగా మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు బీజేపీకి దూరం కావడంతో ఆయన మద్దతుదారులు, కొంతమంది అనుచరులు మాత్రం ఆయన శివసేన పారీ్టలో చేరుతారని చెబుతున్నారు. మరో వైపు హిందూ ఎజెండాపై కొత్త పార్టీ పెడతారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
న్యూడ్కాల్స్ స్క్రీన్ షాట్లు పంపి..
హైదరాబాద్: న్యూడ్ కాల్స్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపి మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తితో పాటు మరో మహిళపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట రసూల్పురాకు చెందిన మహిళ (39)కు సయ్యద్ జావేద్ (44)తో 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జావేద్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో బాధితురాలు అతనితో విడాకులు తీసుకుని వేరుగా నివాసం ఉంటుంది. అతడిపై ఆమె పెట్టిన కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా గత నెల 26న సయ్యద్ జావేద్ బాధితురాలికి ఫోన్ చేసి ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. తరచూ ఆమెతో మాట్లాడేవాడు. బాధితురాలు కూడా జావేద్ను నమ్మి అతనితో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆమెతో బలవంతంగా న్యూడ్కాల్స్ మాట్లాడించిన అతను కాల్స్కు సంబంధించి స్క్రీన్షాట్లను సేవ్ చేసి బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ యువకుడికి పంపాడు. అతను ఈ విషయం బాధితురాలి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న షాబానా అనే మహిళను నిలదీసింది. దీంతో జావేద్పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో స్క్రీన్షాట్లను అందరికీ పంపతామని బెదిరించారు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సయ్యద్ జావేద్తో పాటు షబానాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్పిట్ వాయిస్లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. దీంతో, హస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025 -
Bike Taxi: కొనసాగింపు సరే... పర్యవేక్షణ ఎలా..?
సాక్షి,హైదరాబాద్: క్యాబ్ల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీలను కొసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ని విడుదల చేసింది. బైక్ ట్యాక్సీలు వైట్ నెంబర్ ప్లేట్పై పని చేసేందుకు అనుమతి ఇచి్చంది. అయితే ఈ సేవలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అనుమతుల విధానం, నియంత్రణ లేదు. కేవలం ఆయా సంస్థల యాప్ల ఆధారంగా ఇవి పని చేస్తున్నాయి. బైక్ ట్యాక్సీలను అవసరమైన స్థాయిలో నిర్వాహకులు పర్యవేక్షించలేకపోతున్నారు. ఈ విధానంలో లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులో ప్రయాణికుల భద్రతకు పెను సవాల్ ఎదురుకానుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి ‘ప్రత్యేకతలు’ అవసరం లేదు... రాజధానిలో ఆటోలు , ట్యాక్సీలు నడపాలంటే ఆ డ్రైవర్లకు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బ్యాడ్జ్ తప్పనిసరి. సదరు వాహనాలకు సైతం కచ్చితంగా ఎల్లో నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. బైక్ ట్యాక్సీల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవీ ప్రస్తుతం అమలులో లేవు. వైట్ నెంబర్ ప్లేట్లతోనే, సాధారణ డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వారే ఆయా సంస్థల వద్ద యాప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకుని బైక్ ట్యాక్సీలు నడిపేస్తున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సైతం క్యాబ్ల మాదిరిగా... ఏది బైక్ ట్యాక్సీనో, ఏది సొంత బైకో గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం వైట్ ప్లేట్కు ఓకే చెప్పేయడం గమనార్హం. ప్రయాణికుడి భద్రత ఎవరి బాధ్యత? బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. మోటారు వాహనాల చట్టం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో దీనిని కచి్చతంగా అమలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైబరాబాద్లోనూ తప్పనిసరి చేశారు. వాణిజ్య సేవలు అందించేటప్పుడు పిలియన్ రైడర్ బాధ్యత బైక్ రైడర్దే అవుతుంది. దీని ప్రకారం చూస్తే బైక్ ట్యాక్సీ డ్రైవర్ వద్ద కచి్చతంగా రెండు హెల్మెట్లు ఉండాలి. ఒకటి తాను ధరించి రెండోది రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడికి అందించాలి. అయితే ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్లలో ఒక హెల్మెట్ మాత్రమే కనిపిస్తుంటుంది. రెండు హెల్మెట్లు కలిగి ఉండాలంటూ ఈ డ్రైవర్లకు రిజి్రస్టేషన్ చేసే సంస్థలు చెబుతున్నా అమలు కావడం లేదు. కొన్ని సంస్థలు అందించినవి సైతం డ్రైవర్లు తమ వెంట తీసుకురావట్లేదు. పత్తాలేని పని గంటల విధానం... కిరాయికి ప్రయాణికుల్ని చేరవేస్తూ సంచరించే బైక్ ట్యాక్సీలు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచి్చతంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే బైక్ ట్యాక్సీ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ టార్గెట్లను తట్టకోలేక కొందరు డ్రైవర్లు ఈ పని మానుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడో నెంబరు... ఇక్కడో నెంబరు... బైక్ ట్యాక్సీల నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజి్రస్టేషన్ను (ఎటాచ్మెంట్) పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్ను వినియోగించి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, నెంబర్తో పాటు అతడి రేటింగ్ సైతం కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో బైక్ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉంటే... వాటిని డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. -
50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్లో 'నయనతార' రెమ్యునరేషన్
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వెలిగపోతున్నారు. ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం. నయనతార సాధారణంగా యాడ్స్ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి ఆ చిత్రం సిద్ధం అవుతోంది. -
టైమ్ టాప్–100 డిజిటల్ క్రియేటర్ల జాబితాలో ప్రజక్తా కోలికి చోటు
లండన్: ప్రతిష్టాత్మక టైమ్ 100 క్రియేటర్స్ జాబితాలో ఒక భారతీయురాలితోపాటు భారత సంతతికి చెందిన నలుగురు కంటెంట్ రైటర్లు చోటు దక్కించుకున్నారు. యూ ట్యూబర్, నటి అయిన ప్రజక్తా కోలి(32)కి భారత్ నుంచి చోటు దక్కడం విశేషం. భారతీయ అమెరికన్లు ధర్ మాన్, మిచెల్ ఖరె, సమీర్ చౌదరి, జే షెట్టి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, చర్చలు, సంఘాలను ప్రభావితం చేసే అత్యంత ప్రభావశీలురైన డిజిటల్ సృష్టికర్తలను టైమ్ ఎంపిక చేసింది. మొట్టమొదటి సారిగా రూపొందించిన ఈ జాబితాలో టైటాన్స్, ఎంటర్టెయినర్స్, లీడర్స్, ఫెనొమ్స్, కేటలిస్ట్స్ అనే ఐదు కేటగిరీల్లో 15 దేశాలకు చెందిన వారున్నారు. టైటాన్స్ విభాగంలో భారత సంతతికి చెందిన ధర్ మాన్(41) సామాజిక, మానవీయ విలువలను కథల మాదిరిగా బోధిస్తూ యూట్యూబ్ షార్ట్ వీడియోలను రూపొందించడంలో పేరు తెచ్చుకున్నారు. ఈయన చానెల్కు 2.50కోట్ల మంది సబ్ స్క్రైబర్లున్నారు. నికెలోడియన్ కిడ్స్ చాయిస్ అవార్డులకు రెండుసార్లు నామినేట్ అయ్యారని టైమ్ మేగజీన్ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ల్లో డిగ్రీలు సంపాదించారు. లీడర్స్ కేటగిరీలో భారతీయ అమెరికన్ యూట్యూబర్ మిచెల్ ఖరె స్థానం సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్లో ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’సిరీస్తో బాగా పేరు తెచ్చుకున్నారు. ఈ చానెల్కు 50 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. 1992లో లూసియానాలో జన్మించిన ఖరె..డార్ట్మౌత్ కాలేజీ నుంచి డిజిటల్ ఆర్ట్స్ అండ్ మీడియా టెక్నాలజీలో డిగ్రీ చేశారు. టైమ్ మేగజీన్ జాబితాలో లీడర్స్ కేటగిరీలో ఎంపికైన జె షెట్టి(37) బ్రిటన్కు చెందిన భారత సంతతి రచయిత, పాడ్కాస్టర్. కొంతకాలం హిందూ సన్యాసిగా గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. టిక్టాక్, ఇన్స్టాలో 2.2 కోట్ల ఫాలోయర్లు, యూట్యూబ్ చానెల్కు 90 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఇతడి తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి లండన్లో స్థిరపడ్డారు. టాప్ 100 జాబితాలో మరో భారతీయ అమెరికన్ సమీర్ చౌదరి పేరూ ఉంది. ఇతని యూట్యూబ్ చానెల్ ‘కొలిన్ అండ్ సమీర్’కు 16 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానెల్ సహనిర్వాహకుడు కొలిన్ రొజెన్ బ్లమ్కూ ఈ జాబితాలో చోటు దక్కింది. కాలిఫోర్నియాలోని శాంటామోనికాలో 1989లో జన్మించిన సమీర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ అండ్ డిజిటల్ మీడియాలో విద్యనభ్యసించారు.ప్రజక్తా కోలి ఎవరంటే..?మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా కోలి నటి, యూట్యూబర్. మోస్ట్లీసేన్ అనే యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. రోజువారీ జీవితంపై హాస్యం పుట్టించేలా ఉండే ఈమె చానెల్కు 70 లక్షల మంది, ఇన్స్టాలో 80 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెట్ఫ్లిక్స్లో మిస్మ్యాచ్డ్ అనే సిరీస్తోపాటు, జుగ్జుగ్ జీయే అనే సినిమాలోనూ నటించారు. పలు పుస్తకాలు రాశారు. -
1.6 లక్షల మంది నిరాశ్రయులు
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తులు పంజా విసురుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, భీకరమైన వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం నష్టపోతున్నారు. శాశ్వత లేదా తాత్కాలిక ఇళ్లు, ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. 2024లో దేశంలో 400కుపైగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే ఇదే అత్యధిక కావడం గమనార్హం. గత ఏడాది విపత్తుల వల్ల 1.18 లక్షల మందికిపైగా జనం నిరాశ్రయులయ్యారని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. 2023 కంటే 2024లో నిరాశ్రయుల సంఖ్య 30 శాతం అధికం అని తెలియజేసింది. 2021లో 22,000 మంది, 2022లో 32,000 మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొంది. ప్రకృతి విపత్తులు ప్రతిఏటా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2019 నుంచి 2023 మధ్య 281 విపత్తుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024లో మాత్రం ఏకంగా 400కు పైగా విపత్తులు సంభవించాయి. గత ఆరేళ్లలో జనం నిరాశ్రయులు కావడానికి వరదలు 55 శాతం, తుఫాన్లు 44 శాతం కారణమని తేలింది. కొండ చరియలు విరిగిపడడం, భూకంపాలు, కరువుల వల్ల కూడా జనం ఆశ్రయం కోల్పోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం 2024లో 1.18 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 2025లో మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది బాధితులుగా మారిపోయినట్లు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పశ్చిమ బెంగాల్తోపాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలే అధికంగా ప్రకృతి విపత్తుల బారినపడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80,000 మంది నిరాశ్రయులయ్యారు. -
జార్ఖండ్ కాంగ్రెస్లో విభేదాలు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములా టలు, పరస్పర ఆరోపణల పర్వం మరోసారి తెరపైకి వచ్చాయి.కాంగ్రెస్ నేతల విభేదాలు ఢిల్లీ దాకా చేరడంతో, అధిష్టానం సీరియస్గా తీసుకుంది. వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొప్పుల రాజుకు అప్పగించింది. రాష్ట్ర నేతలందరినీ ఆయన ఢిల్లీకి పిలిపించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా, కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు తిర్కీ, ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ, ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్లతో ఆయన భేటీ అయ్యారు. జాగ్రత్తగా మసలు కోవాలని, విభేదాలపై రచ్చకెక్కరాదని, సమన్వయంతో కూటమి బలోపేతానికి కృషి చేయాలని వారికి గట్టిగా చెప్పారు. మూల కారణమిదే..!రాంచీలోని రిమ్స్ (రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ తొలగింపు అంశం వివాదానికి తెరతీసింది. రిమ్స్ డైరెక్టర్ తొలగింపునకు సంబంధించిన లేఖపై తాను సంతకం చేయనని కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా బహిరంగంగా ప్రకటించారు. ఈ అంశం పార్టీలో ఉద్రిక్తతను సృష్టించింది. పార్టీని, కూటమి ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగ వేదికపై అలాంటివి వెల్లడించరాదని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఆయనకు సూచించారు. అయితే, బైతా వెనక్కి తగ్గలేదు. మరోవైపు, రిమ్స్–2 ప్రతిపాదనపై జార్ఖండ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్–2 కోసం తన ప్రాంతంలోని రైతుల భూమిని సేకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న రిమ్స్పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికే రిమ్స్–2ను తెరపైకి తెచ్చినట్లు సీఎం హేమంత్ సోరెన్ అంటున్నారు. ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంకీర్ణంలో ఉద్రిక్తతలకు దారితీసింది. -
మనపై చైనా వాటర్ బాంబ్
బ్రహ్మపుత్రా నది పై చైనా తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ‘మెడోగ్’భారత్ పాలిట ‘నీటి బాంబు’గా మారనుందని అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆందోళన వెలిబుచ్చారు. ఈశాన్యంలోని సరిహద్దు రాష్ట్ర ప్రజలకు, వారి జీవనోపాధికి ఈ ప్రాజెక్టు పెను ముప్పు అవుతుందన్నారు. ‘‘ఏ అంతర్జాతీయ జల ఒప్పందాలపైనా సంతకం చేయని చైనా ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ డ్యామ్ను మనపైకి నీటి బాంబుగా కూడా ఉపయోగించొచ్చు’’అని హెచ్చరించారు. దాంతో మెడోగ్ డ్యామ్ మరోసారి చర్చల్లో నిలిచింది. గోప్యతపై అనుమానాలు... టిబెట్లోని యార్లుంగ్ సాంగ్సో (బ్రహ్మ పుత్ర) నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్లో సియాంగ్గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి, బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. మెడోగ్ డ్యామ్ ద్వారా ఏకంగా 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే దీన్ని ‘టిక్టిక్ అంటున్న వాటర్ బాంబ్’గా ఖండు అభివరి్ణంచారు. మెడోగ్ కేవలం నదీప్రవాహ ప్రాజెక్టు అని చైనా అంటున్నా ఆ ముసుగులో అతి భారీ జలాశయాన్ని నిర్మిస్తోందని చెబుతున్నారు. ఇది భారీగా నీటిని నిల్వ చేస్తుందని, దిగువ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం లభించినట్లు 2024లో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టుపై చైనా ఆద్యంతం గోప్యత పాటిస్తుడటం, అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయడానికి నిరాకరించడం పర్యావరణంగా, భౌగోళికంగా, రాజకీయపరంగా భారత్కు పెను ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక ప్రాంతీయ ఉద్రిక్తతలను కూడా రాజేస్తోంది. ఈ ఆనకట్టను అరుణాచల్ అస్తిత్వానికే ముప్పుగా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.‘గ్రేట్ బెండ్’ వద్దే నిర్మాణం అరుణాచల్కు సమీపంలో సాంగ్సో నది ఉన్నట్టుండి వలయాకారంగా వంపు తిరుగుతుంది. సరిగ్గా ఈ ‘గ్రేట్ బెండ్’వద్దే చైనా ఆనకట్ట కడుతోంది. అక్కడి నుంచి నేరుగా అరుణాచల్కు చేరుతుంది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహంలో ఎలాంటి అసాధారణ మార్పులు జరిగినా భారీ వరదలు తప్పవు. అదే జరిగితే సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుంది. అక్కడి ఆదిమ తెగలు, ఇతర వర్గాలతో పాటు విస్తారమైన అటవీ ప్రాంత అస్తిత్వం కూడా ముప్పులో పడుతుంది. ఎగువ దేశంగా నదీ ప్రవాహంపై చైనాకు అతి కీలకమైన వ్యూహాత్మక నియంత్రణ ఉండటమే ఇందుకు కారణం. నీటిని అది ఏకపక్షంగా మళ్లిస్తే భారత్తోపాటు బంగ్లాదేశ్కు కూడా తీవ్ర నష్టం తప్పదు. నీటి ప్రవాహాన్ని తగ్గితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాలో సాగు, మత్స్యకార కార్యకలాపాలు, జీవనోపాధికి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చైనాలోని భారత మాజీ రాయబారి అశోక్ కాంత సూచించారు. ‘మెడోగ్ కేవలం ప్రాజెక్టు కాదు. చాలా క్లిష్టమైన ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న అతి భారీ జలాశయం. ఇది చాలా ప్రమాదకర పరిణామం. అత్యంత బాధ్యతారహితమైన ప్రాజెక్టు’’అని హెచ్చరించారు. మరికొందరు నిపుణులు మాత్రం భయాందోళనలు అవసరం లేదంటున్నారు. ఈ ఆనకట్ట ద్వారా బ్రహ్మపుత్రా జలాలను మనపైకి ఆయుధంగా వాడటం చైనా ఉద్దేశం కాబోదని చెబుతున్నారు. నదిలోని భారీ ప్రవాహాన్ని చైనా ఆపజాలదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీకి సాటి రావు ఏవీ!
సాక్షి, అమరావతి: వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం వల్ల ఉద్యోగాలు, ముఖ్యమైన సేవలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. కానీ.. దానికి మించి ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లు కూడా పెరిగిపోతాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్లో వాహనాలకు హైడ్రోజన్ ఇంధనం తోడు కానుంది. అది కాలుష్యాన్ని నియంత్రించి, స్వచ్ఛ భారత్ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహనరంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవీలకు పెరిగిన డిమాండ్ మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతం అని లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది. ఇందులో ముంబైలో ఏటా 5,100 మరణాలు, కోల్కతాలో 4,678 మరణాలు, చెన్నైలో 2,870 మరణాలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించే ప్రజా రవాణా వ్యవస్థలపై నగరాలు దృష్టి సారించాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ పెరిగింది. 2023లో మొత్తం వాహన అమ్మకాలలో ఈవీల వాటా దాదాపు 5 శాతంగా ఉంది. మొత్తం కార్ల అమ్మకాలలో కేవలం 10 శాతం వృద్ధితో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల రిజి్రస్టేషన్లు ఏటా 70 శాతం పెరిగి 80 వేల యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, అత్యంత వేగవంతమైన వృద్ధి త్రీ వీలర్ విభాగంలో ఉంది. ప్రపంచ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అమ్మకాలలో దాదాపు 60 శాతం వాటా భారత్కు ఉంది. వాస్తవానికి 2023లో మనదేశం చైనాను అధిగమించి 5.80 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల అమ్మకాలతో అతిపెద్ద ఈవీ మార్కెట్గా నిలిచింది. 8.80 లక్షల వాహనాలను విక్రయించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్గా మనదేశం అవతరించింది. దూసుకొస్తున్న హైడ్రోజన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ.. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్సీఈవీ) ఈవీలకు ప్రత్యామ్నాయంగా దూసుకొస్తున్నాయి. ఇవి అధిక శక్తి సాంద్రత కారణంగా తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు. బ్యాటరీతో నడిచే వాహనాల కంటే తేలికగా ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలుగుతాయి. అయితే, ఎఫ్సీఈవీలు ప్రస్తుతం చాలా తక్కువ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 93 వేల వాహనాలే ఉన్నాయి. దీనికి కారణం అధిక ధర, నిర్వహణ ఖర్చులుగా చెప్పుకోవచ్చు. ఇంధన సెల్ బస్సులు, ట్రక్కులు వాటి బ్యాటరీ, ఎలక్ట్రిక్ కౌంటర్ పార్ట్ల కంటే 20–30 శాతం ఎక్కువ హైడ్రోజన్ వాహనాలకు ఖర్చవుతాయి. అయినప్పటికీ, సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. దిగిరానున్న ఖర్చులు డీజిల్ బస్సులకు కిలోమీటర్కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సులకు రూ.14.52 మాత్రమే ఖర్చవుతుంది. విద్యుత్ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్ కిలోమీటర్కి రూ.71.73 ఖర్చవుతుంది. అదే గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక వనరుల నుండి తీసుకుంటే కిలోమీటర్కు రూ.77.69 ఖర్చవుతుంది. హైడ్రోజన్ వాహనాల ప్రారంభ ధర రానున్న ఐదేళ్లలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ధరతో సమానంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వాటి నిర్వహణ ఖర్చులు 2030 తర్వాత కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. భారీ లక్ష్యానికి తోడ్పాటు కాలుష్యం లేని భారత్ కోసం ‘నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్’కి మన దేశం రూపకల్పన చేసింది. నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీని, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచటం, వాహన కాలుష్యాన్ని తగ్గించటం వంటి లక్ష్యాలతో ఈ ప్రణాళికను తీసుకొచ్చారు. దేశంలో ఎక్కువ మంది ఫ్యూయెల్ బేస్డ్ వాహనాలే ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. భవిష్యత్లో మన దేశంలో విద్యుత్ వాహనాలను మాత్రమే నడపాలని కేంద్రం భావిస్తోంది. పొల్యూషన్ ఫ్రీ ఇండియాను, ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితులను చూడాలన్నదే తన ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. హైడ్రోజన్ వాహనాల వినియోగం ఇందుకు తోడ్పాటు అందించనుంది. -
అడవి నుంచి ఐరాస వరకు...
‘సంస్కృతం పలకడానికి నీకు నోరు తిరగదు. నేర్చుకోవడం నీ వల్ల కాదు’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి మొద్దు బుర్రలకు లెక్కలు అర్థం కావు’ అన్నారు మ్యాథ్స్ టీచర్. బాగా చదువుకోవాలనే ఆశతో స్కూల్లోకి అడుగు పెట్టిన ఆదివాసీ అమ్మాయికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ఆ అవమానాలకు తన ప్రతిభతో జవాబు చెప్పింది. యూనివర్శిటీ వైస్–చాన్స్లర్ స్థాయికి ఎదిగింది జార్ఖండ్కు చెందిన సోనాజ్ హరియ మింజ్. తాజాగా యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో–చైర్పర్సన్గా నియామకం అయిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించింది...సోనాజ్ మింజ్కు బాగా చదువుకోవాలని కోరిక. అడవిలో ఉండేవాళ్లకు చదువు ఎందుకు! అనే వాళ్లు చాలామంది. ‘సంస్కృతం అనేది ఆర్యుల భాష. నీలాంటి వాళ్లకు ఎలా వస్తుంది!’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి వాళ్లకు లెక్కలు ఎలా వస్తాయి!’ అన్నారు మ్యాథ్స్ టీచర్.స్కూల్లో చేరిన కొత్తలో భాషాపరమైన సమస్యలను మింజ్ ఎదుర్కొంది. ఇంట్లో మాట్లాడే ఆదివాసీ భాష తప్ప మరే భాషా తనకు రాదు. అయితే మ్యాథ్స్ బాగా చేసేది.ఆదివాసీ అమ్మాయి అనే కారణంగా మింజ్ను చేర్చుకోవడానికి రాంచీలోని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిరాకరించింది.‘నన్నే ఎందుకు అవమానిస్తున్నారో మొదట్లో అర్థం కాలేదు. చాలా కాలానికి అర్థమైంది. నేను ఆదివాసీ అమ్మాయిని అనే కారణంగానే అవమానిస్తున్నారు అని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మింజ్. అయితే అవమానాలు ఆమె చదువుకు అడ్డుగోడలు కాలేకపోయాయి. బాగా చదువుకోవాలి అనే కసిని పెంచాయి.మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ తరువాత దిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలో ఎంఫిల్ చేసింది మింజ్. భోపాల్లోని బర్కతుల్లా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో పనిచేసింది. కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేసిన మింజ్ జేఎన్యూలో ప్రొఫెసర్గా పనిచేసింది.జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన వ్యాసాలు సమర్పించింది. జేఎన్యూలో ‘స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్’ డీన్గా, జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్స్ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఎంత స్థాయికి ఎదిగినా తాను నడిచి వచ్చిన దారి మరవలేదు మింజ్. దళిత, ఆదివాసీ హక్కుల కోసం పనిచేసింది. జేఎన్యూలో ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫీస్ (ఈవోవో) ప్రధాన సలహాదారుగా పనిచేసింది.జార్ఖండ్లోని ఎస్కేఎం యూనివర్శిటీ వైస్ చాన్స్లర్గా ఆమె ప్రస్థానం మరోస్థాయికి చేరింది. వైస్ చాన్సలర్ హోదాలో ఆదివాసీ కళలు, భాష కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. తాజాగా... యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రిసెర్చ్. గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో– చైర్పర్సన్గా నియామకం అయింది. ‘నేను భవిష్యత్లో మ్యాథ్స్ టీచర్ అవుతాను’ అని స్కూల్ రోజుల్లో బలంగా అనుకునేది మింజ్. అయితే మింజ్ పడిన కష్టం, ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని పట్టుదల ఆమెను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడమే కాదు ఎంతోమంది ఆదివాసీ అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.ఆ మాటను సవాలుగా తీసుకొని...స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు సింగిల్ మిస్టేక్ లేకుండా చేసేదాన్ని. ‘ఇది చాలదు. నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి’ అన్నారు ఒక టీచర్. ఆమె మాటలను సవాలుగా తీసుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ నాతోనే ఉండిపోయింది. మొదట్లో వెటకారాలు, అవమానాల సంగతి ఎలా ఉన్నా స్కూల్ ఫస్ట్ రావడంతో ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చదువుతో పాటు ఆటలు అన్నా ఇష్టం. యూనివర్శిటీ లెవెల్లో హాకీ ఆడాను. అయితే చదువు మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆటలకు దూరం అయ్యాను.– సోనాజ్ హరియ మింజ్ -
మీ లైఫ్స్టైలే కొంప ముంచుతుంది!
మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడిపోయారనే! మీ బ్యాంక్ బ్యాలెన్స్ను ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్స్టెయిల్ ఇన్ఫ్లేషన్’ అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’! – సాక్షి, స్పెషల్ డెస్క్జీవనశైలి ద్రవ్యోల్బణంతో సామాన్యుల తిప్పలు జీతం పెరిగితే ఖర్చులూ పెంచేసుకుంటున్నారు అప్పులతో సతమతమవుతున్న సగటు ఉద్యోగి పొదుపు, ఆర్థిక క్రమశిక్షణలే అసలైన మందు..సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్ బ్రాండ్లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.‘పెరగటం’నిజం కాదు! మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవన శైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుండి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని. ఏఐ భయం పొంచి ఉంది! జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏ.ఐ. (కృత్రిమ మేధస్సు). ఏ.ఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోల్చుకోవటం జీతానికి చేటు.. తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్గ్రేడ్’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.ముందస్తు హెచ్చరిక సంకేతాలు..మొదటి హెచ్చరిక మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. రెండో హెచ్చరిక జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్ వేసుకోవటం మానేయటం. మూడో హెచ్చరిక జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్ను పెంచేయటం.నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి–తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం. అయిదో హెచ్చరిక ఇంటర్నెట్, ఓటీటీల సబ్్రస్కిప్షన్లు పెరగటం.చిక్కుకోకుండా ఉండాలిజీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయట పడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్ కార్టులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుండీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీవితం పెరిగీ ప్రయోజనం ఉండదు.బయట పడే మార్గం ఉంది..జీవన శైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కల్పించండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ. -
సర్కారు తీరుపై డీజీల గుస్సా
సాక్షి, అమరావతి: క్రమశిక్షణకు మారుపేరుగా భావించే పోలీసు శాఖలో ముసలం పుట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారులే చంద్రబాబు ప్రభుత్వ ఒంటెత్తు పోకడలపై తిరుగుబాటు బావుటా ఎగుర వేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా డైరెక్టర్ జనరల్ (డీజీ) స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారులు దీనికి నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా హరీశ్ కుమార్ గుప్తాను రెగ్యులర్ డీజీపీగా నియమించడంతో పోలీసు శాఖలో అసంతృప్తి భగ్గుమంది. దాంతో ప్రస్తుతం డీజీ స్థాయి అధికారులు నలుగురుతో పాటు తర్వాత బ్యాచ్లకు చెందిన మరో నలుగురు అధికారులకు డీజీపీ పోస్టు దక్కకుండా పోయింది. ఇక పోలీసు శాఖలో కీలక విభాగాలకు ఇన్చార్్జగా ఐజీ స్థాయి అధికారులను నియమించి, వాటని్నంటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న డీజీపీ గుప్తా ఎత్తుగడ సీనియర్ ఐపీఎస్ అధికారుల అసంతృప్తికి ఆజ్యం పోసింది. రెడ్బుక్ కుట్రను అమలు చేస్తున్నందుకే డీజీపీ గుప్తా నియంతృత్వ పోకడలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వత్తాసు పలుకుతున్నారని యావత్ పోలీసు శాఖ ఆగ్రహంతో రగిలి పోతోంది. ఈ పరిణామాలతో డీజీ స్థాయి అధికారులు ఇటీవల రహస్య సమావేశాలు నిర్వహిస్తుండటం బట్టబయలైంది. లెవల్ 17 పే స్కేల్ కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించడం పోలీసు శాఖలో ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రెడ్బుక్ కుట్ర కోసం గుప్తాకు వత్తాసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించడంతో సీనియర్ ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైరవ్వాల్సిన హరీశ్ కుమార్ గుప్తా (1992 బ్యాచ్)ను అంతకు రెండు నెలల ముందు రెగ్యులర్ డీజీపీగా నియమించడమే అందుకు కారణం. దాంతో గుప్తా మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగేందుకు అవకాశం లభించింది. ఆయన కంటే సీనియర్లు అయిన అంజనీ కుమార్ (1990 బ్యాచ్), మాదిరెడ్డి ప్రతాప్ (1991) డీజీపీ అయ్యే అవకాశం కోల్పోయారు. పైగా 1993 బ్యాచ్కు చెందిన మహేశ్ దీక్షిత్, అమిత్ గార్్గలకు కూడా డీజీపీగా అవకాశం లేదని స్పష్టమైపోయింది. 1994 బ్యాచ్కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, రవి శంకర్ అయ్యన్నార్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజేలాకు అవకాశాలు సన్నగిల్లిపోయాయి. 1995 బ్యాచ్కు చెందిన అతుల్సింగ్, 1996 బ్యాచ్కు చెందిన రాజీవ్ కుమార్ మీనా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేవలం తాము చెప్పినట్టుగా రెడ్బుక్ కుట్రలను అమలు చేస్తారనే ఉద్దేశంతోనే చివరి నిమిషంలో నిబంధనలకు విరుద్ధంగా హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించడంతో ఇంత మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు అవకాశాలను కోల్పోయారు.డీజీలను డమ్మీలు చేస్తున్న డీజీపీ డీజీపీ పోస్టు దక్కకపోయినా పోలీసు శాఖలో గౌరవం అయినా ఉందా అంటే అదీ లేకపోవడంతో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ (డీజీ) హోదాతో ఉన్న వారిలో నళినీ ప్రభాత్, మహేశ్ దీక్షిత్, అమిత్ గార్గ్ కేంద్ర సర్వీసులో ఉన్నారు. కానీ రాష్ట్ర సర్వీసులో ఉన్న డీజీ స్థాయి అధికారులు అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, బాలసుబ్రహ్మణ్యం, రవి శంకర్ అయ్యన్నార్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజేలా, అతుల్సింగ్, రాజీవ్ కుమార్ మీనా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.వారికి పోలీసు శాఖలో కనీస గౌరవం లభించడం లేదు. ఇప్పటికే డీజీపీ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న ఆర్టీసీ ఎండీ పదవిలో రిటైర్డ్ డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావును నియమించారు. దాంతో రాష్ట్ర సర్వీసులో ఉన్న డీజీ స్థాయి అధికారులు ఓ అవకాశాన్ని కోల్పోయారు. మరోవైపు హరీశ్ కుమార్ గుప్తా కీలక పోలీసు విభాగాలను తన గుప్పిట్లోనే పెట్టుకోవాలని భావిస్తుండటం వారికి తీవ్ర అవమానకరంగా మారింది. కీలకమైన విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న గుప్తా.. తర్వాత రెగ్యులర్ డీజీపీగా నియమితులయ్యారు. దాంతో మరో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారిని ఆ విభాగం డీజీగా నియమించాలి. కానీ ఇప్పటి వరకు గుప్తానే ఆ విభాగం చీఫ్గా కొనసాగుతున్నారు. ఒక ఐజీ స్థాయి అధికారిని విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం చీఫ్గా నియమించి, ఆ విభాగాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలన్నది గుప్తా ఆలోచన అని తెలుస్తోంది. ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్గా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా పేరును ఇందుకోసం పరిశీలిస్తున్నారు. తద్వారా డీజీ స్థాయి అధికారికి దక్కాల్సిన కీలక పోస్టు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో ఏ డీజీపీ ఇలా చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు.అగ్నిమాపక శాఖపై కూడా డీజీపీ కన్నుప్రస్తుతం కేంద్ర నిధులు ఎక్కువగా ఉన్న అగ్నిమాపక శాఖపై కూడా డీజీపీ గుప్తా కన్ను పడింది. ఆ విభాగం డీజీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ను మరో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసి, ఐజీ శ్రీకాంత్ను నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకు హోమ్ మంత్రి అనిత ద్వారా సిఫార్సు చేయిస్తున్నారని పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. తద్వారా అగ్ని మాపక, పోలీసు టెక్నికల్ సర్వీసెస్ విభాగాలు కూడా డీజీపీ గుప్తా గుప్పిట్లోనే ఉంటాయి. నిబంధనల ప్రకారం సీఐడీ చీఫ్ ఆ విభాగాన్ని స్వతంత్రంగా నిర్వహించాలి. రోజువారీ వ్యవహారాల్లో డీజీపీ జోక్యం చేసుకోకూడదు. కానీ అందుకు విరుద్ధంగా సీఐడీ విభాగాన్ని డీజీపీ గుప్తానే స్వయంగా సమీక్షిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వీర విధేయ అధికారి, విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్బాబును సిట్ చీఫ్గా నియమించి సీఐడీ విభాగాన్ని గుప్తా గుప్పిట్లో పెట్టుకున్నారు. విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్, అగ్ని మాపక, సీఐడీ, ఏసీబీ విభాగాల చీఫ్లుగా జూనియర్ ఐపీఎస్ అధికారులను నియమించేలా బదిలీల ప్రతిపాదనలను ప్రభుత్వానికి డీజీపీ గుప్తా సమర్పించినట్టు తెలుస్తోంది. తద్వారా కీలకమైన ఆ విభాగాలన్నీ పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుని డీజీ స్థాయి అధికారులను డమ్మీలను చేయాలన్నది డీజీపీ గుప్తా ఎత్తుగడ అని ఇట్టే అర్థమవుతోంది.రెండు డిమాండ్లను లేవనెత్తుతున్న డీజీలు» పోలీసు శాఖలో తమకు జరుగుతున్న అవమానాలపై డీజీ స్థాయి అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పలువురు డీజీ స్థాయి అధికారులు ఇటీవల తరచూ డిన్నర్ సమావేశాల్లో తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారు ప్రధానంగా రెండు డిమాండ్లను లేవనెత్తుతున్నారు.» ‘విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, అగ్నిమాపక, సీఐడీ విభాగాల చీఫ్లుగా డీజీ స్థాయి అధికారులనే నియమించాలి. ఆ విభాగాలను తాము స్వతంత్రంగా నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించాలి. ఐజీ స్థాయి అధికారులను నియమించి, మమ్మల్ని అవమానించడం ఏమాత్రం సరికాదు’ అన్నది తొలి డిమాండ్. అందుకు విరుద్ధంగా ఐజీ స్థాయి అధికారులను నియమిస్తే రాజీనామా చేస్తానని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి స్పష్టం చేసినట్టు సమాచారం.» తమకు రెగ్యులర్ డీజీపీగా అవకాశం లేకుండా పోయింది కాబట్టి కనీసం రెగ్యులర్ డీజీ పే స్కేల్ అయిన లెవల్ 17 పే స్కేల్ను అమలు చేయాలని రెండో డిమాండ్ లేవనెత్తారు. ఈ మేరకు ఓ డీజీ ఇప్పటికే లిఖిత పూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతోపాటు నలుగురు డీజీలు తమకు లెవల్ 17 పే స్కేల్ వర్తింప జేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధపడినట్టే.» సీఐడీ మినహా మిగిలిన డీజీ స్థాయి అధికారులు డీజీపీ కార్యాలయం ఉన్న రాష్ట పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు విముఖత చూపుతున్నారు. గతంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు అప్పటి డీజీ స్థాయి అధికారిగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా విముఖత చూపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయన పట్టుబట్టి హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.» ప్రస్తుతం తమకు కూడా అదే రీతిలో పోలీసు ప్రధాన కారాలయంలో కాకుండా, ఇతర చోట్ల నుంచి డీజీ హోదాలో విధులు నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరూ డీజీపీ గుప్తా ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు సుముఖతగా లేరన్నది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. డీజీ స్థాయి అధికారుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ఈసీకి అన్ని అధికారాలెందుకు?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జేఎస్ ఖెహార్, డీవై చంద్రచూడ్లు శుక్రవారం జమిలి ఎన్నికల బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని వారు పేర్కొన్నారు. అదే సమయంలో, ప్రతిపాదిత చట్టంలో ఎన్నికల సంఘానికి మరిన్ని విస్తృత అధికారాలను కల్పించడాన్ని వారు ప్రశ్నించారు. దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయాణంలో పలు పరిణామాలను గుర్తు చేస్తూ పలు సూచనలను వారు అందజేశారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లుపై పలువురు న్యాయ నిపుణులు, న్యాయ నిర్ణేతల అభిప్రాయాలను తీసుకుంటోంది. కాగా, ఈ కమిటీతో మాజీ సీజేఐలు యూయూ లలిత్, రంజన్ గొగోయ్లు ఇప్పటికే సమావేశమయ్యారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం..
ఎటపాక: కూటమి ప్రభుత్వంలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నానాటికీ నాసిరకంగా మారుతోంది. ఇటీవల మధ్యాహ్న భోజనంలో బొద్దింకలు, పురుగులు రాగా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భోజనం వికటించి 21మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరిగా ఉడకని భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 139 మంది చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం శుక్రవారం మధ్యాహ్న భోజనంలో 122 మందికి పులిహోర, టమాట చట్నీ, కోడిగుడ్డు, చిక్కీ అందించారు. పులిహోర సరిగా ఉడకకపోవడంతో చాలమంది విద్యార్థులు తినకుండానే బయట పారబోశారు. కొద్ది సమయం తరువాత పులిహోర తిన్న విద్యార్థుల్లో కొందరికి కడుపులో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన 21 మంది విద్యార్థులను పాఠశాల పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. బాధితుల్లో మూడు, నాలుగు తరగతులకు చెందిన రామలక్ష్మి, ప్రేమిక, లోకేశ్కు వాంతులు కూడా అవుతుండటంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. కాసేపటికి వీరంతా కోలుకున్నారు. వంట కారి్మకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓ సరియం రాజులు పాఠశాలకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఎంఈఓను చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్ ఆదేశించారు. మరోవైపు.. అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వంటòÙడ్డు లేకపోవడంతో వంట చేసే సమయంలో పురుగులు పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని.. రాజకీయాలకు తావులేకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు. ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ వారే చంపారు...ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు -
హల్వాదే హవా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో రెండు వారాలుగా ఎటు చూసినా భారతీయతే ఉట్టిపడుతోంది. తన కుశాగ్రబుద్ధి, మానసిక స్థైర్యం, పైలట్ నైపుణ్యాలతో ఇప్పటికే యాగ్జియం–4 మిషన్లోని సహచరులను అబ్బురపరిచిన భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాంశు శుక్లా తాజాగా భారతీయ రుచులతో వారితో పాటు ఐఎస్ఎస్లోని మిగతా సహచరుల మనసు కూడా దోచుకున్నారు! తనతో పాటు ఐఎస్ఎస్లోకి వెంట తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను వారితో పంచుకున్నారు. రెండు వారాలుగా ఊపిరి సలపని పనులతో తలమునకలుగా ఉన్న వ్యోమగాములంతా శుక్రవారం ఆటవిడుపుగా, సరదా సరదాగా గడిపారు. చివరగా భోజనంలోకి నచ్చిన రుచులను తనివితీరా ఆస్వాదించారు. రొయ్యల వేపు డు స్టార్టర్తో మొ దలుపెట్టి చవులూరించే చికెన్ వంటకాల దాకా పలురకాలను ఆరగించా రు. చివర్లో శుభాంశు వడ్డించిన క్యారె ట్ హల్వా, పెసరప ప్పు హల్వా విందుకే హైలైట్గా నిలిచా యి. ఇంతటి రుచి ఇంతకు ముందెన్న డూ ఎరగమంటూ సహచరులంతా ఆయన్ను మెచ్చుకున్నారు. హల్వాను జీవితంలో మర్చిపోలేనని వ్యోమగామి జానీ కిమ్ చెప్పుకొచ్చారు. రుచిలో తేడా రాకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా ఆ మిఠాయిలను ఇస్రో, డీఆర్డీవో శుభాంశు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి. శుభాంశును అలా కాపాడుకున్నాం: ఇస్రో చీఫ్ రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయునిగా శుభాంశు పేరు కొద్ది వారాలుగా దేశమంతటా మార్మోగిపోతోంది. యువతతో పాటు దేశంలోని బాల బాలికలంతా ఆయనను ఓ హీరోగా, తమ స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నారు. ఇస్రో అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఇన్ని ఘనతలకు కారణమైన యాగ్జియం అంతరిక్ష యాత్ర ఆరంభమైన కాసేపటికే విషాదాంతమయ్యేదే! ఒళ్లు గగుర్పొడిచే ఈ వాస్తవాన్ని స్వయానా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బయట పెట్టారు. జూన్ ప్రథమార్ధంలో యాత్ర పలుమార్లు వాయిదా పడటం తెలిసిందే. ఆ క్రమంలో జూన్ 11 నాటి ప్రయోగాన్ని ఒక్క రోజు ముందు ఇస్రో పట్టుబట్టి ఆపించింది. ‘‘ఫాల్కన్–9 రాకెట్ తాలూకు బూస్టర్లో లీకేజీలను, పలు పగుళ్లను ఇస్రో బృందం జూన్ 10 సాయంత్రం గమనించింది. అప్పటికప్పుడు చర్చించి ప్రయోగాన్ని ఆపాలని నా సారథ్యంలోని ఇస్రో బృందం నిర్ణయం తీసుకుంది. లేదంటే యాగ్జియం–4 ప్రయోగం విషాదాంతం అయ్యేదేమో! అలాకాకుండా చూడటం ద్వారా మన శుభాంశును, యాగ్జి యం మిషన్ను కాపాడుకున్నాం’’అని తాజా గా ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వివరించారు. ‘‘మేం మరీ అతిగా స్పందిస్తున్నామని స్పేస్ ఎక్స్ బృందం తొలుత నిందించింది. అయినా మేం పట్టుబట్టి ప్రయోగాన్ని నిలిపేయించాం. ఫాల్కన్ రాకెట్లో పగుళ్లను మర్నాడు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు ధ్రువీకరించారు’’అని తెలిపారు. నాసా, ఇస్రో సంయుక్త ప్రాజె క్టైన యాగ్జియం–4 జూన్ 26న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడం తెలిసిందే.కుటుంబంతో శుభాంశు మాటామంతి శుభాంశు శుక్రవారం లఖ్నవూలోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తను ప్రయోగాలన్నీ దిగి్వజయంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు ఆశా, శంభూదళాళ్ శుక్లా ఆకాంక్షించారు. ‘‘ఐఎస్ఎస్లో తను ఎక్కడ పని చేసే దీ, రోజంతా ఎలా గడిపేదీ శుభాంశు మాకు పూసగుచ్చినట్టు చూపించాడు. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు రెండు కళ్లూ చాలవట! తన విధులను పూర్తిగా ఆస్వాది స్తుండటం మాకెంతో సంతోషాన్నిస్తోంది’’అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తోతాపురి.. కాస్త ఊపిరి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇన్నాళ్లూ మామిడి రైతులు అష్టకష్టాలు పడ్డారు. తోతాపురి అమ్మకానికి పడరానిపాట్లు పడ్డారు. నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీల వద్ద మామిడి పంటను వాహనాల్లో ఉంచుకుని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. కనీస గిట్టుబాటు ధర రాక ఉసూరుమన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ను సందర్శించి రైతుల ఆవేదన విన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని కడిగిపారేశారు. దీంతో వ్యాపారుల్లో కాస్త చలనం వచ్చింది. ఫలితంగా తోతాపురి మామిడికి ర్యాంపుల్లో కిలో రూ.4 నుంచి రూ.6.50 వరకు పలుకుతోంది. క్రిష్టగిరి, నాసిక్కు ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలోని మ్యాంగో ఫ్యాక్టరీలు కనీసం రెండు మూడు రూపాయలకు కూడా కొనుగోలు చేయక పోవడంతో చాలా మంది రైతులు కోతలు కోయకుండా చెట్లపైనే కాయలను వదిలేశారు. వీటిలో చాలా వరకు కుళ్లిపోయి, నేల రాలాయి. ఇంకా 30–40 శాతం పంట అలానే ఉంది. అయితే వైఎస్ జగన్ పర్యటన అనంతరం ర్యాంపుల్లో ధర పెరగడంతో మిగిలిన పంటను అమ్ముకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.4 నుంచి రూ.6.50 వరకు వ్యాపారులు కొంటున్నారు. ఆపై వారు తమిళనాడులోని క్రిష్ణగిరి వద్ద ఉండే ఫ్యాక్టరీల్లో కిలో రూ.8 నుంచి రూ.8.50 వరకు అమ్ముకుంటున్నారు. అలాగే నాసిక్కు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతులు గత రెండు రోజుల నుంచి పుంజుకున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 24 ర్యాంపులు ఉండగా, వీటి ద్వారా సుమారు 1200 టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు వెళుతున్నాయి. మరో 1500 టన్నులకు పైగా నాసిక్కు ఎగుమతి అవుతోంది. స్థానిక ఫ్యాక్టరీల్లో పాత ధరలేతమిళనాడులోని క్రిష్ణగిరి, హోసూర్ తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో తోతాపురికి కొంచెం మంచి ధర ఉంది. అయితే చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలు మాత్రం ప్రభుత్వ అండ చూసుకుని పాత ధరలతోనే కొనుగోళ్లు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఏ రేటుకు కొనుగోలు చేస్తున్నారో కూడా రైతులకు చెప్పడం లేదు. పక్క రాష్ట్రంలో తోతాపురి ధరలు పెరిగినా, ఇక్కడ ఎందుకు పెరగడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు 47 కేంద్రాల్లో రోజ్గార్ మేళా
సాక్షి, న్యూఢిల్లీ: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా కేంద్రం నేడు 16వ రోజ్గార్ మేళాను నిర్వహించనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 51 వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 15 రోజ్గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి పైగా నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. రైల్వే, హోం, తపాలా, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర ముఖ్యమైన శాఖల్లో ఈ నియామకాలను చేపట్టింది. శనివారం నియామక పత్రాల పంపిణీ అనంతరం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. -
కాయలు పారబోశారని.. అక్రమ కేసులు
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ కూటమి సర్కారు మోసాలను ఎండగడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనంలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంతటితో ఆగడం లేదు! వైఎస్ జగన్ పర్యటనల్లో పాల్గొన్న వారిని, పార్టీ కార్యక్రమాలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోంది. ప్రధానంగా రైతులు, యువత, వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ అక్కడకు వెళ్లగా తాజాగా కూటమి ప్రభుత్వం పలువురు రైతులపై అక్రమ కేసులు మోపింది. మామిడికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై కాయలు పారబోసినందుకు బంగారుపాళ్యంలో రైతులపై పోలీసులు శుక్రవారం అక్రమ కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తుంబపాళ్యానికి చెందిన రైతు దేవేంద్ర, తిమ్మోజుపల్లెకు చెందిన రైతులు ప్రకాష్రెడ్డి, భగత్రెడ్డి, తుంబపాళ్యానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు అక్బర్, ఉదయ్పై కేసులు బనాయించారు. మామిడికి గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ బంగారుపాళెం మార్కెట్యార్డును సందర్శించిన విషయం తెలిసిందే. గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న మామిడి రైతన్నలు తమ గోడు చెప్పుకునేందుకు పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు లభించిన స్పందన చూసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రయోగించి సరికొత్త నాటకానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది.పిలవని పేరంటానికి హాజరై...!ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడకు వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరాగా, ఆహ్వానం లేకున్నా ఎల్లో మీడియా కూడా దూరిపోయింది! అసలు ఈ కార్యక్రమానికి తాము ఎల్లో మీడియాను పిలవలేదని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యం చేరుకున్న పచ్చ మీడియాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మామిడికి గిట్టుబాటు ధర దక్కడం లేదని కాయలను కింద పోసి నిరసన వ్యక్తంచేస్తున్న రైతులను ఉద్దేశించి.. ‘మీకు బుద్ధుందా..? ఏం చేస్తున్నారు..? అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా...?’ అంటూ దుర్భాషలాడి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో మాటామాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ ఫోటోగ్రాఫర్ బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. తమ అనుకూల మీడియాకు చెందిన ప్రతినిధి కావడంతో సీఎం చంద్రబాబు నుంచి ఆయన తనయుడు, మంత్రులు వరుస ట్వీట్లు పెడుతూ ఆగమేఘాలపై స్పందించారు. నిందితులను వదిలేది లేదని, చట్టరీత్యా చర్యలు తప్పవంటూ మామిడి రైతుల సమస్యను డైవర్ట్ చేశారు. చిత్తూరుకు చెందిన చక్రి తనపై దాడి చేయలేదని, తన కెమెరాను అతడే కాపాడాడని ఫోటోగ్రాఫర్ చెబుతున్నా ఖాకీలు పరిగణలోకి తీసుకోలేదు. ‘కేసు ఇప్పుడు మా పరిధిలో లేదు...! సీఎం వరకు వెళ్లిపోయింది.. నువ్వు ఏదిపడితే అది మాట్లాడొద్దు.. మేమేం చెబితే అది చెయ్.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టు.. ఏం జరిగిందో కూడా మేమే చెబుతాం.. అందరికీ అలాగే చెప్పు..’’ అంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా..ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోటోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకుండా ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు అనుమానితుల పేరిట వైఎస్సార్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే పలువురు కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. గంగాధర నెల్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ మండల ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కె.మోహన్, మండల సోషల్ మీడియా కో–కన్వీనర్ వినోద్, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి అనుచరుడు చక్రవర్తి (చక్రి), పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ఆచార్య, పూతలపట్టుకు చెందిన మరికొంత మందిని అక్రమంగా నిర్భందించి అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో నిర్భందించి శుక్రవారం చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించారు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను లోపలకు అనుమతించలేదు. ఫొటోగ్రాఫర్ను కులం పేరు చెప్పాలంటూ బెదిరించి ఆయుధాలతో దాడి చేశారంటూ అట్రాసిటీ, హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు బనాయించి కేసు నమోదు చేశారు. దాదాపు 20 మందికి పైగా వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అక్రమంగా నిర్భందించగా మరి కొందరి కోసం ఓ బృందం బెంగళూరుకు వెళ్లినట్లు చెబుతున్నారు..హెబియస్ కార్పస్ పిటిషన్.హెబియస్ కార్పస్ పిటిషన్.!తమ శ్రేణుల అక్రమ నిర్భందంపై వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టు తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వారి పేర్లను సేకరించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.ఎల్లో మీడియాపై రైతన్న కన్నెర్ర..బంగారుపాళ్యంలో మామిడి రైతుల ఆవేదనను ‘సాక్షి’ ప్రచురించిన నేపథ్యంలో ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ‘సాక్షి’ మీడియాకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనా..? మీతో బలవంతంగా చెప్పించారా..? అంటూ రైతులను ఆరా తీస్తోంది. అయితే మామిడి రైతులను రౌడీలు, గొంతులు కోసే ఉన్మాదులతో ఎల్లో మీడియా పోల్చడం, దండుపాళ్యం బ్యాచ్గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలు వారిపై మండిపడుతున్నారు.తప్పుడు ఫిర్యాదుతో అక్రమ నిర్భందం..సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు బంగారుపాళ్యం ఘటన మరో నిదర్శనం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు తరలి వచ్చిన జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేని కూటమి నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. కుప్పంలో ఓ వార్త రాసినందుకు అక్కడి సాక్షి విలేకరిపై తప్పుడు కేసు పెట్టారు. వాట్సాప్ గ్రూపులో ఎవరో ఏదో పెడితే మరో టీవీ ఛానల్ రిపోర్టర్పై కేసు పెట్టారు. వారిని సీఎం స్థాయిలో చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? మీడియాలో మీకు అనుకూలంగా ఉన్నవారికి ఒక న్యాయం, నిజాలు నిర్భయంగా ఎలుగెత్తే వారికి మరో న్యాయమా..? పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తున్న పోలీసులను చట్టం ముందు నిలబెడతాం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడుఅక్రమ కేసులు బనాయించారు..మా కార్యక్రమానికి రావాలని మేమేమైనా పచ్చ మీడియాను ఆహ్వానించామా..? గొడవ చేసి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టారు. ఆ ఫోటోగ్రాఫర్ను ఎవరు కొట్టారు..? నాపేరు ఎలా చెబుతారు..? కుప్పంలో పని చేస్తున్న సాక్షి రిపోర్టర్, మరి కొంతమందిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు ఇస్తే.. ఎస్పీ అక్రమ కేసులు బనాయించారు. జిల్లావ్యాప్తంగా మావారిని 25 మందికిపైగా రెండు రోజులుగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నా ఎస్పీ నోరు మెదపడంలేదు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలని కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీసులకు చెబుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ యువకులను అక్రమంగా నిర్బంధించారు. దీనికంతటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కె.నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి. కాపాడినందుకు కేసా..? ఆ ఫోటోగ్రాఫర్ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయనే కాపాడారని చెప్పారు. కెమెరా ఎక్కడ విరిగిపోతుందోనని కెమెరాను పట్టుకున్నారు. కాపాడిన పాపానికి మా ఆయన్ను ఇరికించాలని చూస్తున్నారు. చక్రి నన్ను కాపాడాడు అని ఆసుపత్రిలో ఆ ఫోటోగ్రాఫరే చెప్పారు. ఇప్పుడు ఓ డీఎస్పీ స్ట్రిప్టు రాసిచ్చి, దీని ప్రకారం ఇవ్వాలని ఫోటోగ్రాఫర్తో అబద్ధపు ఫిర్యాదు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం యూనిఫామ్ వేసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంట్లో అన్నం తింటా ఉన్న నా భర్తను ఇప్పుడే పంపిస్తామని తీసుకెళ్లారు. ఇప్పటివరకు నా భర్త ఆచూకీ చెప్పలేదు. చిత్తూరు డీటీసీ వద్ద ఉన్నారని తెలిసి అక్కడకు వెళితే లోపలకు కూడా పంపలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా..? – కవిత, చక్రవర్తి (చక్రి) భార్య, చిత్తూరు.నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యతజగన్పై అభిమానంతో చూడడానికి మా ఇంటాయన అక్కడికి పోయినాడు. ఫోటోగ్రాఫర్ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. అంతే.. ఇంట్లో ఉన్నోడిని ఇప్పుడే పంపిస్తామని పోలీసులు తీసుకుపోయినారు. ఇంతవరకు పంపలేదు. నా భర్తకు ఒక కన్ను కనిపించదు. షుగర్ కూడా ఉంది. రోజూ మూడుసార్లు మాత్రలు వేసుకోవాలి.చిత్తూరు డీటీసీలో ఉండానని చెబితే అక్కడి పోయినాము. ఆ అడవిలో నా భర్తను చూపీకుండా పోలీసులు తరిమేసినారు. ఇపుడు కేసులు పెడతామంటా ఉండారు. మేమే ఎస్సీలైతే మాపైనే ఎట్లా అట్రాసిటీ కేసు పెడతారు..? నా భర్తకు జరగరానికి ఏదైనా జరిగితే ఎస్పీనే బాధ్యత వహించాలి. – రాసాత్తి, మోహన్ భార్య, గంగాధరనెల్లూరు. -
బాబూ.. జవాబియ్యండి..!
‘‘విజయవాడ నగరంలో ఓ రేషన్ దుకాణంలో 600 కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా అధికారులు ఆ కార్డులకు సరిపడా బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న అసలు కార్డుదారులకు బియ్యం సరిపోవడం లేదు. వాస్తవానికి ప్రతి దుకాణానికి 10 శాతం కోటా అదనంగా ఇవ్వాలి. కానీ, కూటమి సర్కారు వచ్చాక ఇండెంట్ పెట్టినా పంపని దుస్థితి. ’’.సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నోటిదగ్గర కూడు లాగేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆహార భద్రత చట్టం లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. ఫలితంగా చౌక దుకాణాల్లో నిత్యావసరాలు దొరక్క.. పేదలు అవస్థలు పడుతున్నారు. చౌకదుకాణాల్లో ఏడాదిగా సబ్సిడీ కందిపప్పు, ఫోరి్టఫైడ్ గోధుమపిండి పంపిణీ ఆగిపోయింది. చిరుధాన్యాలు, పంచదార సరఫరా నామ మాత్రమే. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నే కూటమి ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేస్తోంది. ఎన్నికల ముందు చౌక దుకాణాల ద్వారా 18 రకాల సరుకులు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన సరుకుల పంపిణీకి కూడా మంగళం పాడడంతో పేదల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అదనంగా బియ్యం ఇవ్వం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ వాహనాలు)పై కక్షగట్టి రద్దు చేసింది. ఈ క్రమంలో ఆర్భాటంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా ప్రారంభించింది. ఒకటో తేదీ వచ్చిందంటే పేదలు రేషన్ కోసం క్యూలైన్లలో కుస్తీలు పట్టాల్సిన దుస్థితి దాపురించింది. చాలా మంది కూటమి నాయకుల సిఫారసులతో డీలర్షిప్ దక్కించుకున్న డీలర్లు పంపిణీలో అక్రమాలకు పాల్పడడంతో పీడీఎస్ వ్యవస్థ గాడి తప్పుతోంది. దుకాణాలు సరిగా తెరవడం లేదు. రోజుల తరబడి షాపుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. చాలా మంది దుకాణాల చుట్టూ తిరిగి విసిగివేసారి సరుకులు తీసుకోకుండా ఉండిపోతున్నారు. దీంతో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంత నిల్వలను సరఫరా చేయనట్టు చూపిస్తున్నారు. దీనిని సాకుగా చూపి ప్రభుత్వం అదనంగా సరఫరా చేయాల్సిన పదిశాతం బియ్యం ఇవ్వబోమని చెబుతోంది. కందిపప్పు ఎగ్గొట్టి.. కందిపప్పు సరఫరాకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. వాస్తవానికి చౌక దుకాణాల్లో సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కు ఇవ్వాల్సి ఉంది. కానీ మార్కెట్లో ధరలు తగ్గిపోయాయని, రేట్లు పెరిగినప్పుడు మాత్రమే సబ్సిడీపై కందిపప్పు ఇస్తామని చెబుతోంది. వాస్తవానికి ఇప్పుడు మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతోంది. దీనిని సబ్సిడీపై చౌకదుకాణాల్లో ఇస్తే లబ్దిదారులపై సగానికి సగం ఆర్థికభారం తగ్గుతోంది. ఈ దిశగా సర్కారు ఆలోచించడం లేదు. మొత్తం కార్డుదారులందరికీ కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, ఏడాదిగా అడపాదడపా కేవలం 38వేల టన్నుల కందిపప్పు మాత్రమే కూటమి సర్కారు సరఫరా చేసింది.బేరం కుదర్లేదని టాక్.. సుమారు రూ.500 కోట్ల బకాయిలు సర్కారు చెల్లించకపోవడంతో కందిపప్పు పంపిణీదారులు చౌకదుకాణాలకు సరుకు సరఫరాకు ముందుకు రావడం లేదు. వచ్చినవాళ్లు కాస్త బహిరంగ మార్కెట్లో హోల్సేల్ ధర కంటే ఎక్కువకు కోట్ చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ కచ్చితంగా అమాత్యులకు కప్పం కట్టాలనే నిబంధన పెట్టడంతోనే పంపిణీదారులు అధిక ధర కోట్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి విరుగుడుగా అమాత్యులే కొంత మంది వ్యాపారులను ప్రోత్సహించి టెండర్లు వేయించినట్టు సమాచారం. అయితే ఈసారి కప్పం రెట్టింపు ఇవ్వాలని తెగేసిచెప్పడంతో ఖంగుతిన్న సదరు కాంట్రాక్టర్లు మాకెందుకులే ఈ బాధ అని వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఫలితంగా పౌరసరఫరాల సంస్థలో కందిపప్పు కొనుగోళ్లు కేవలం మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్లకే పరిమితమైందని సమాచారం.ఎమ్మెల్యేను దుమ్ముదులిపిన మహిళ‘‘రేషన్ చూస్తే బియ్యం సరిగారావు. డీలరు బియ్యం లేవు.. కోటా లేదు..అయిపోయిందంటాడు. కందిపప్పు ఇయ్యడు. ఇంకెట్లా సార్..? మాకు బతుకు దెరువు ఎలా..? మాకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటే మేము ఎట్టా బతికేది? నేను రోజంతా కూలి చేస్తే రూ.200 ఇస్తారు. కందిపప్పే కిలో రూ.150 పలుకుతోంది. ఇదేంది సారూ!! జవాబియ్యండి’’ అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని గోవిందమ్మ అనే మహిళా కూలి దుమ్ముదులిపేసింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే ఎదుట ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
ఎన్నికల హైజాక్కు బీజేపీ కుట్ర
భువనేశ్వర్: గత ఏడాది మహారాష్ట్రలో చేసినట్లుగానే ఈసారి బిహార్లో అసెంబ్లీ ఎన్నికలను హైజాక్ చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్నికల విధులు పక్కనపెట్టి కేవలం బీజేపీ ప్రయోజనాల కోసం పని చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ బచావో సమావేశ్’లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బిహార్ శాసనసభ ఎన్నికలను కబ్జా చేయకుండా బీజేపీని అడ్డుకోవాలని విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్ణయించినట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిందని, బిహార్లో ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు కొత్తగా కోటి మంది ఓటర్లను ఎందుకు చేరి్పంచారో చెప్పాలని డిమాండ్ చేస్తే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. బడా బాబుల సేవలో మోదీ సర్కారు భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేవలం ఐదారుగురు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ దేశం కేవలం అదానీ, అంబానీ లేదా బిలియనీర్లకే చెందుతుందని రాజ్యాంగంలో ఎక్కడా రాసిపెట్టి లేదని స్పష్టంచేశారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే మోదీ సర్కారు విధానంగా మారిపోయిందని దుయ్యబట్టారు. ఒడిశాలోని పూరీలో అదానీ కుటుంబం కోసం జగన్నాథ రథయాత్ర మధ్యలో నిలిపేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలో వనరులను బడా కంపెనీలకు ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారని చెప్పారు. జల్, జంగిల్, జమీన్(నీరు, అడవులు, భూమి) గిరిజనులకే చెందాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల సర్వం కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని, వారి తరఫున పోరాటం సాగిస్తామని హామీ ఇచ్చారు. లౌకికవాదం, సామ్యవాదంతొలగించే కుట్ర: ఖర్గే రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలు తొలగించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంవిధాన్ బచావో సమావేశ్’లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో గిరిజనులు, దళితులు, మహిళలు, యువతకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.విదియ సా.6.23 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.7.25 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.11.29 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.9.14 నుండి 10.53 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35.మేషం: అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.వృషభం: రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.మిథునం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.సింహం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.కన్య: బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.తుల: కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.వృశ్చికం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మకరం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కుంభం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.మీనం: రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. -
జూలైలోనూ వేసవే.!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వెళ్లిపోయింది. వేసవి కాలం ముగిసింది. వర్షాలు దండిగా కురవాల్సిన సమయం.. కానీ భానుడి భగభగలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈ సారి నైరుతి ముందుగానే పలకరించినా జూలైలో ముఖం చాటెయ్యడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొడిగాలుల కారణంగా శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో అత్యధికంగా 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. జంగమహేశ్వరపురంలో 39.2, కావలి, మచిలీపట్నంలో 38.9, తిరుపతిలో 38.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 14 వరకూ ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని, 15వ తేదీ సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
గతి తప్పిన వాతావరణం
న్యూఢిల్లీ: దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెలలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిగా ఉండే మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని, ఈ అంశం నిగ్గుతేల్చారు. ‘వాటర్ టవర్ ఆఫ్ ఆసియా’గా భావించే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి. హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మంచు చరియలు విరిగిపడుతున్నాయి. మొత్తంగా వాతావరణమే గతి తప్పుతోంది. ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్ రాజధాని జైపూర్లో గత నెలలో 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే 78 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, 36 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. హిమాలయాల్లో భాగమైన సిమ్లాలో 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 186 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏకంగా 2.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 55 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి? వాతావరణం గతి తప్పడానికి కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హిమాలయాలు వేగంగా కరిగిపోతే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు తప్పదు. వరదలు ముంచెత్తుతాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, టిబెట్ పీఠభూమిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2015 నుంచి 2024 దాకా హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. 2016 నుంచి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2024లో 19.99 డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 0.77 డిగ్రీలు అధికం. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం చూస్తే.. 1901 నుంచి 2020 దాకా ఇండియాలో సగటు ఉష్ణోగ్రత 0.62 డిగ్రీలు పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రత 0.99 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0.24 డిగ్రీలు పెరిగాయి. అడవులను నరికివేయడం, పట్టణీకరణ, శిలాజ ఇంధనాల వాడకం ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతుందనడంలో సందేహం లేదు. -
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు మంగళం!?
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులపైనే కాదు.. వ్యవసాయ విద్యపై కూడా కక్ష కట్టింది. తిరుపతిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఏకైక సేంద్రీయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేసింది. ఇదే బాటలో నాన్ శాంక్షన్ వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలను దశల వారీగా మూసివేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాన్య, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేవలం పదో తరగతి అర్హతతో వ్యవసాయ విద్యను అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండేళ్ల కాలపరిమితి గల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సును 1999లో ప్రవేశపెట్టింది. తొలిసారిగా అనకాపల్లి, మార్టేరు (పశ్చిమ గోదావరి)లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటుచేశారు. వ్యవసాయ విద్యకు డిమాండ్ పెరగడంతో వీటి సంఖ్య పెంచాల్సి వచి్చంది. ప్రస్తుతం 20 ప్రభుత్వ, 30 అనుబంధ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో వ్యవసాయ, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులు అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 688, ప్రైవేటు కళాశాలల్లో 1,690 సీట్లున్నాయి. యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న 20 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరు కళాశాలలు స్థానికంగా ఉన్న డిమాండ్ మేరకు ఏర్పాటుచేశారు. వీటిని నాన్ శాంక్షన్ కళాశాలలు అని పిలుస్తుంటారు. ఒక్కో కళాశాలలో 35 నుంచి 40 సీట్ల వరకు ఉండగా, ఏటా 15–30 మంది విద్యార్థులు డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వ కళాశాలలను అడ్మిషన్లు తగ్గిపోతున్నాయనే సాకుతో దశల వారీగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి కళాశాల మూసివేత దారుణం.. తిరుపతిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు చింతపల్లిలోని ఆర్గానిక్ ఫారి్మంగ్ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు నిలిపివేస్తూ యూనివర్శిటీ రిజి్రస్టార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఈ కళాశాలలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అధికారికంగా మూతపడబోతున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న డిప్లొమా విద్యార్థులను సమీప కళాశాలలకు సర్దుబాటుచేసే యోచనలో ఉన్నారు. ఇక 2011లో ఏర్పాటైన చింతపల్లి పాలిటెక్నిక్ కళాశాలను 2014–15లో సేంద్రీయ వ్యవసాయ కళాశాలగా మార్చారు. సేంద్రీయ విభాగంలో ఉన్న ఏకైక ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఇదొక్కటే. ప్రారంభం నుంచి 30 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఏటా 15–20 మంది చేరుతున్నారు. గడిచిన ఐదేళ్లుగా ఈ కళాశాల విద్యార్థులు మొదటి ర్యాంకులను సాధిస్తున్నారు. రూ.40 లక్షలతో ఆధునీకరించిన తర్వాత.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చింతపల్లి కళాశాలలో రూ.40 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. విద్యార్థులకు అవసరమైన విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, ప్రయోగశాలలు, సోలార్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ కళాశాలను మూసివేయడంపట్ల విమర్శలు విన్పిస్తున్నాయి. ఓ వైపు సేంద్రియ సాగుకు పెద్దపీట వేస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సాగుగా మార్చబోతున్నామంటూ గొప్పలు చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్న ఒక్కగానొక్క సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన వ్యవసాయ విద్య అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఇలా ఉన్న కళాశాలను మూసివేయడం సరికాదంటున్నారు. ఇదే బాటలో రామగిరి, రంపచోడవరం, సోమశిల, నంద్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను కూడా మూసివేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ నిధులలేమి కారణంగా వీటిని మూసివేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి శాంక్షన్ తెచ్చుకోవడం.. అవసరమైన నిధులను మంజూరుచేయడం చేతకాక ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ కళాశాలలను మూసివేయడం ద్వారా నిరుపేద విద్యార్థులకు వ్యవసాయ విద్యను దూరం చేయడం ఎంతవరకు సమంజసమని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
గోదావరికి పెరుగుతున్న వరద
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద క్రమేపీ పెరుగుతోంది. వారం రోజులుగా సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో గోదావరి, శబరి నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి గురువారం 2,86,205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం వరద తీవ్రత ఎక్కువైంది. భద్రాచలంలో నీటి మట్టం 37.20 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శని, ఆదివారాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, శనివారం సాయంత్రానికి 7.50 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ముంపు మండలమైన వేలేరుపాడు, కోయిదా రహదారిపై ఉన్న ఎద్దుల వాగు వంతెన పైకి వరద నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రికి వంతెన పూర్తిగా మునిగే పరిస్థితి ఉంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. -
త్వరలో రోహిత్ వేముల చట్టం
సాక్షి, న్యూఢిల్లీ: పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్దపీట వేసి, ఉన్నత పదవులను కట్టబెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హెచ్సీయూ ఎదుట ఆందోళన చేశారని గుర్తు చేశారు. రాంచందర్రావు ఒత్తిడి కారణంగా ఆ సమయంలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్లో ఉన్న విద్యార్థులపై యూనివర్సిటీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంతటి ఘటనకు కారకుడైన రాంచందర్రావుపై చర్యలు తీసుకోకుండా అధ్యక్ష పదవి ఇచ్చి న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు భట్టి చెప్పారు. అతని మృతికి కారకులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్య వంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగా రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు. పదవులు కట్టబెడతారా? ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తోపాటు ఇంత విషం, ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అప్పట్లో ఈ సూసైడ్ నోట్ దేశ ప్రజల మనసులను కలచివేసింది. వర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై వీసీకి వినతి పత్రం ఇచ్చి ంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్.. రోహిత్తోపాటు మరో నలుగురు అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారు.ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రాంచందర్రావు ఒత్తిడి తేవడంతో పోలీసులు యూనియన్ సభ్యులపై కేసులు నమోదు చేశారు. నలుమూలల నుంచి వచ్చి న ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్తోపాటు మరో నలుగురిని సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేక రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు’అని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రాంచందర్రావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఇబ్బందుల్లేవు పవర్ షేరింగ్ అనేది లేదు.. అందరం కలిసి పనిచేస్తున్నాం బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరాయి: భట్టి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలు మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటనేది వారికే తెలియదన్నారు. వీటిపై తాము ప్రశి్నస్తే.. మితిమీరిన మాటలు మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో భట్టి మీడియాతో చిట్చాట్ చేశారు.‘మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పవర్ షేరింగ్ అనేది ఏమీ లేదు. అందరం కలిసి టీం వర్క్గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం బాగుంది. ఎన్నికల్లో ఇచ్చి న హామీలను ఒక్కోటి పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు క్లిక్ అయ్యింది.. ఎంచక్కా మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఫోర్త్సిటీ పనులు జరుగుతున్నాయి, మూసీ సుందరీకరణను కచ్చితంగా ఈ హయాంలోనే పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాదు. బీజేపీ వాళ్ల మాటలు వినడం ప్రజలు ఎప్పుడో మానేశారు’అని భట్టి అన్నారు. -
డెత్ ‘స్పిరిట్’.. కబళిస్తున్న కల్తీ మద్యం...!
అప్పటిదాకా అలవాటైన ‘సరుకే’..! కాస్త పడగానే ‘కిక్’ ఇచ్చేదే..! కానీ.. ఇప్పుడెందుకో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం.. ఏమైందో తెలుసుకునేలోపే మృత్యు కౌగిట్లోకి!!ఇదేదో కోవిడ్ మహమ్మారి కాదు... కొత్త వైరస్ అంతకంటే కాదు..!!టీడీపీ మద్యం సిండికేట్ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మందు ఎఫెక్ట్ ఇదీ!ప్రమాదకర స్పిరిట్లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు!రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం దందా గుప్పుమంటోంది..కల్తీ మద్యాన్ని తాగడంతో ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా ఇప్పటికే బహిర్గతమైంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్ను అక్రమంగా సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి వెళ్లేందుకు ఎక్సైజ్ శాఖ సాహసించడం లేదు. కల్తీ మద్యం రాకెట్ దందా వెనుక టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబాలే ఉండటంతో వెనకడుగు వేస్తోంది!(సాక్షి, అమరావతి): బాటిల్ మీద ఏసీ బ్లాక్ విస్కీ అని ఉంటుంది... లోపల సరుకు మాత్రం కల్తీ..! సీసా మీద ఓల్డ్ అడ్మిరల్ అని అందంగా కనిపిస్తుంది... మూత తీస్తే కల్తీ మద్యం గుప్పుమంటుంది..! ఏస్పీవై 999 అనే ఆకర్షణీయమైన బ్రాండ్... అది తాగితే కల్తీ నరనరాల్లోకి పాకుతుంది...! రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమే అన్నది నిఖార్సైన నిజం! దీనికి సూత్రధారులు టీడీపీ కీలక నేతలు అన్నది నగ్న సత్యం...!! మద్యం ప్రియుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల దోపిడీని సాగించింది!రాష్ట్రాన్ని కల్తీ మద్యం కబళిస్తోంది. అత్యంత హానికరమైన స్పిరిట్లో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయించేస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో కల్తీ మద్యం రాకెట్ వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పి మద్యం ప్రియుల ప్రాణాలను హరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలను వక్రీకరిస్తూ బరి తెగించి స్పిరిట్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న దుకాణాలు, బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రాణాలను బలిగొంటున్న వైనం ఇదిగో ఇలా ఉంది..! కేంద్రం ఆదేశాల వక్రీకరణ.. భారీగా స్పిరిట్ అక్రమ సరఫరా కల్తీ మద్యం రాకెట్ నిర్వహణకు టీడీపీ సిండికేట్ వేసిన పన్నాగం విస్మయపరుస్తోంది. కోవిడ్ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శానిటైజర్ల తయారీ కోసం అవసరమైన ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు) భారీగా కొనుగోలు చేసేందుకు అప్పట్లో డిస్టిలరీలను అనుమతించారు. సాధారణంగా స్పిరిట్ కొనుగోలుపై నియంత్రణ ఉంటుంది. పరిశ్రమలు కూడా ఓ పరిమితికి మించి కొనుగోలు చేయకూడదు. అయితే కోవిడ్ వ్యాప్తి సమయంలో శానిటైజర్ల తయారీ కోసం ఆ పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్ను భారీగా కొనుగోలుకు అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల కుటుంబాలకు చెందినవే కావడంతో కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు.. సిండికేట్ దుకణాలు, బెల్టు షాపులకు సరఫరా టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లను నెలకొల్పి దందా కొనసాగిస్తోంది. రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారిస్తోంది. యానాంతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేయడం గమనార్హం. కల్తీ సరుకును బ్రాండెడ్ మద్యంగా విక్రయించేందుకు టీడీపీ సిండికేట్కు అధికారిక నెట్వర్క్ఉండటం కలసి వస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇక వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను కూడా సిండికేట్ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాదిలో రూ.5,280 కోట్ల దందా 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్ల విక్రయం..! కల్తీ మద్యం దందాను టీడీపీ సిండికేట్ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. డిస్టిలరీలు, కల్తీ మద్యం తయారీ యూనిట్లు, దుకాణాలు, బెల్ట్ షాపులు.. అన్నింటినీ సిండికేటే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా బ్రాండెడ్ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని బరితెగించి విక్రయిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చిoది. 2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడోవంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్ బాటిల్ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. అత్యంత హానికరం... ఇటీవల పలువురు హఠాన్మరణం.. టీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ దందా మద్యం ప్రియులకు ప్రాణాంతకంగా మారింది. కల్తీ మద్యం తాగడం అత్యంత హానికరం, తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (స్పిరిట్)లో వంద శాతం ఆల్కహాల్ ఉంటుంది. అది మనుషులు వినియోగించకూడదు. పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల (ఆహార ఉత్పత్తులు కాదు) తయారీలో ఉ్రత్పేరకంగా మాత్రమే వాడతారు. స్పిరిట్ను బాగా డైల్యూట్ చేసి ఆల్కహాల్ను 42 శాతానికి తగ్గించాలి. అనంతరమే బ్రాండెడ్ మద్యం తయారీలో వాడాలి. అంతకంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉంటే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న కల్తీ మద్యం యూనిట్లలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ప్రమాదకర స్పిరిట్లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. అది తెలియని పేద, సామాన్య వర్గాలకు చెందినవారు ఆ కల్తీ మద్యాన్ని సేవించడంతో వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలువురు మద్యం ప్రియులు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలే దీనికి నిదర్శనం. టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ ఈ చావులకు కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. సిండికేట్కు స్పిరిట్ సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో బయటపడిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్, పోలీసు శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం, పశ్చిమ గోదావరి పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతోపాటు కడప, అనంతపురంలో కల్తీ మద్యం తయారీ యూనిట్లపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్శాఖ దాడులు జరిపింది. కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రిని జప్తు చేసి కొందరిని అరెస్టు చేశారు. ఆ వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు అటకెక్కింది. కల్తీ మద్యం సిండికేట్కు అక్రమంగా స్పిరిట్ను ఎవరు సరఫరా చేస్తున్నారన్నది ఈ కేసులో అత్యంత కీలకం. దీన్ని ఛేదిస్తే మొత్తం సిండికేట్ దందా బయటపడుతుంది. టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీల గుట్టు రట్టు అవుతుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు దర్యాప్తునకు బ్రేకులు వేశారు. టీడీపీ నేతల డిస్టిలరీల జోలికి వెళ్లకుండా ఈ కేసును పక్కదారి పట్టించాలని హకుం జారీ చేశారు. కల్తీ మద్యం తయారీ ఇలా... భారీగా స్పిరిట్ తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం తయారీ చేపడుతోంది. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా వ్యవస్థను నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది. కల్తీ మద్యంతో తీవ్ర దుష్ప్రభావాలు ఇలా... » కల్తీ మద్యంలో ఉండే మెటబాలిజ్డ్ యాసిడ్ మిథనాల్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. న్యూరోసిస్ లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడటంతోపాటు కంటి నరాలు దెబ్బతిని అంధత్వం సోకుతుంది. » ఉదర సంబంధిత జబ్బుల పాలవుతారు. » శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. » హృద్రోగ సమస్యల బారిన పడతారు. » కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. » తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కల్తీ మద్యం దందా సూత్రధారుల పాత్రపై ష్...గప్చుప్» ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్ శాఖ వెనకడుగు » గుడ్లూరు కేంద్రంగా మూడు జిల్లాల్లో రాకెట్.. » ఎక్సైజ్శాఖ దాడుల్లో ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు లభ్యం.. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ బట్టబయలైంది. టీడీపీ సిండికేట్ సభ్యుడైన వీరాంజనేయులు గుడ్లూరులోని మిట్టపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మిషన్, ఇతర సామగ్రితో పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేశాడు. చీరాలలో స్వాదీనం చేసుకున్న కల్తీ మద్యం కేసులో కూపీ లాగితే గుడ్లూరు కేంద్రంగా సాగుతున్న దందా డొంక కదిలింది. ఎక్సైజ్శాఖ అధికారుల దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్ బాటిల్స్తో పాటు 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ లేబుళ్లు బయటపడ్డాయి. కల్తీ మద్యం క్వార్టర్ బాటిల్ను రూ.120 చొప్పున విక్రయిస్తూ ఏడాదిగా ఈ రాకెట్ భారీగా కొల్లగొట్టింది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్లు వెల్లడైంది. అందుకోసం 400 లీటర్ల స్పిరిట్ను తెప్పించడం గమనార్హం. వీరాంజనేయులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ మద్యం రాకెట్ అసలు సూత్రధారుల గురించి దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం. టీడీపీ సీనియర్ నేత కుటుంబమే రింగ్ లీడర్అనకాపల్లి కేంద్రంగా టీడీపీ సిండికేట్ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న టీడీపీ సీనియర్ నేత కుటుంబం దీనికి రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తోంది. ఆ కుటుంబానికి డిస్టిలరీల వ్యాపారంతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. డిస్టిలరీల నుంచి అక్రమంగా స్పిరిట్ను సరఫరా చేస్తూ కల్తీ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరవాడలో ఇటీవల కల్తీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్శాఖ దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్ గుట్టు రట్టైంది. టీడీపీ నాయకుడు రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావు నుంచి 72 లీటర్ల స్పిరిట్, 180 మిల్లీ లీటర్ల 455 ఖాళీ బాటిళ్లు, 1,389 మూతలు, బాటిళ్లపై అతికించేందుకు ముద్రించిన ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, కారామిల్ రసాయనం, యంత్ర సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని టీడీపీ సిండికేట్కు చెందిన బెల్ట్ దుకాణాల ద్వారా క్వార్టర్ బాటిల్ రూ.130 చొప్పున విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. కల్తీ మద్యం దందాకు రింగ్ లీడర్గా ఉన్న టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులను విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సాహసించకపోవడం గమనార్హం. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా సాగుతున్న దందాపై దృష్టి పెట్టలేదు. గోదావరి జిల్లాల్లో పాలకొల్లు స్థావరంగా... నాలుగు జిల్లాల్లో యథేచ్ఛగా సరఫరా.. గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం రాకెట్ పాలకొల్లును స్థావరంగా చేసుకుంది. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పారిస్తోంది. ఇటీవల పాలకొల్లులో కల్తీ మద్యం తయారీ యూనిట్పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నాలుగు జిల్లాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాల ద్వారా ఏకంగా 25 శాతం వరకు కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నట్టు సమాచారం. దీని వెనుక పశ్చిమ గోదావరి జిల్లాలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతతోపాటు ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజా ప్రతినిధి ఉన్నట్లు తెలియడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. కేవలం పాలకొల్లులో అదుపులోకి తీసుకున్న పులి శీతల్ అరెస్టుతో సరిపెట్టారు. -
అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ను సైన్స్ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్సాల్వెడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్ స్క్రూవార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అ‘సమ్మె’తి గళం
సాక్షి, అమరావతి/ఏలూరు(టూటౌన్)/భీమ వరం: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు శనివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. జీవో ఎంఎస్ నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని, కేటగిరీల నిర్ణయంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, గతంలో జరిగిన సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, రిటైర్మెంట్ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైనట్టు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగభూషణ, కె.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటి నుంచి ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని విమర్శించారు. ఇప్పటివరకు శాంతియుతంగా నిరసన తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వివరించారు. వెంటనే సర్కారు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే వీరికి మద్దతుగా జూలై 16 నుంచి పారిశుద్ధ్య కార్మికులూ సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు కాగా, రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ధర్నాలు, మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించారు. దీంతో పట్టణాలు, నగరాలు హోరెత్తాయి. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ర్యాలీలో విశాఖ నగర యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి అధ్యక్ష, కార్యదర్శులు, టి.నూకరాజు, ఉరుకూటి రాజు పాల్గొన్నారు. మార్కాపురం, నంద్యాల, తాడిపత్రి, బాపట్ల, కడప, ప్రొద్దుటూరు, నందిగామ తదితర ప్రాంతాల్లో కార్మికులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని కార్మికులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఏఐటీయూసీ, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎ.అప్పలరాజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద కూడా కార్మికులు ధర్నా చేశారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారి మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్మికులు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. -
కోటాకు కాపు కాద్దాం!
సాక్షి, హైదరాబాద్/హిమాయత్నగర్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేంతవరకు అందరం కలిసి కాపలా కాద్దామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ‘మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మా పక్షం నుంచి పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటాం. ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉంటాం. మీరు కూడా కాపలా కాయాలి. బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి’అని బీసీ సంఘాల నేతలతో సీఎం అన్నట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీచేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలు బీసీ సంఘాల నేతలు శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారితో సీఎం దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆర్డినెన్స్ అనంతరం అటు రాష్ట్ర ప్రభుత్వం పరంగా, ఇటు న్యాయపరంగా చిక్కులు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు బీసీ వర్గాలు సమన్వయంతో ఉండాలని, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. న్యాయస్థానాల్లో కేసులు పడకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా వాటి ప్రభావంతో నష్టం జరగకుండా ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ కేవియట్ పిటిషన్లు వేయాలని సీఎంను ఆర్.కృష్ణయ్య కోరినట్లు తెలిసింది. కోర్టుకెళ్లినా గెలిచేది బీసీలే: ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ను కలిసిన అనంతరం ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధమైన వాటా 75 ఏళ్ల తర్వాత బీసీలకు అందుతోందని.. దీనికి ఎవరూ అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘బీసీల జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాసైనందున చట్టబద్ధత వచ్చింది. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా గెలిచేది బీసీలే. కానీ ఎవరినీ కేసులు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా కోర్టుల్లో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచి న్యాయవాదులను పెట్టాలి.బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేసేందుకు పార్టీల పరంగా ఎవరైనా ప్రోత్సహించినట్టు తెలిస్తే వారిని బయటకు లాగుతాం. బీసీ ప్రజల కోర్టులో నిలబెట్టి ఆ పార్టీల భరతం పడతాం’అని హెచ్చరించారు. సీఎం రేవంత్ను కలిసిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులున్నారు. అంతకుముందు బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయం బీసీల పోరాట విజయమని పేర్కొన్నారు. -
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా?
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా? -
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు సవాల్ చేశారు. తాము పూర్తి సమాచారంతో వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో ఆరుసార్లు నిర్ణయాలు జరిగాయని, శాసనసభలో మూడుమార్లు ఆమోదం పొందాయని తెలిపారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాల తేదీలు, అందులో జరిగిన చర్చ, ఇతర అంశాల వివరాలను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ‘పీసీ ఘోష్ కమిషన్’కు అందజేసినట్లు చెప్పారు. కేబినెట్ నిర్ణయాల కంటే శాసనసభ ఆమోదం మరింత ఉత్తమం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు సి.లక్ష్మారెడ్డి, సు«దీర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని హరీశ్రావు అందజేశారు. అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘కమిషన్కు మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందజేశాం. ఈ అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నందున గతంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు, కేబినెట్ నోట్ తదితర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖలు రాసినా స్పందన లేదు. దీంతో మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్ అందజేశాం. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్నా కమిషన్కు అందజేసిన సమాచారం మాకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలు ఇస్తోందని మాకు అనుమానాలు ఉన్నాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ‘సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్ వేదికగా 50 ఏండ్ల ద్రోహ చరిత్రపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు. అది ‘కవర్ పాయింట్ ప్రజెంటేషన్’. కృష్ణా నదీ జలాల్లో గత ప్రభుత్వం 299ః512 నిష్పత్తిలో వినియోగానికి శాశ్వత ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టిందని రేవంత్ పదేపదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి చేతగాని నాయకుల వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని సాధించి 763 టీఎంసీల వాటా కోసం పోరాటానికి బాటలు వేశారు.కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 299 టీఎంసీలు చాలు అంటూ రేవంత్, ఉత్తమ్ సంతకాలు చేసి వచ్చారు. నదుల బేసిన్స్ గురించి బేసిక్స్ తెలియని సీఎం రేవంత్.. అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే రీతిలో నడుచుకోవాలి. కాకతీయులు, నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులను కూడా రేవంత్ కాంగ్రెస్ ఖాతాలో వేసి 54 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే అంతకు మునుపు పదేళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలకు మాత్రమే’అని హరీశ్రావు వివరించారు. తమ్మిడిహెట్టిపైనా అబద్ధాలే.. ‘తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే మేడిగడ్డకు బరాజ్ మారిందని చెప్తున్నా సీఎం రేవంత్ పదేపదే అబద్ధాలు చెప్తున్నారు. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరగడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. గత ఏడాది తెలంగాణ వాటాలో కేవలం 28 శాతం కృష్ణా జలాలను వాడుకుని, చంద్రబాబుకు గురుదక్షిణగా 65 టీఎంసీలు ఆంధ్రాకు మళ్లించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో వస్తాం. దమ్ముంటే సీఎం రేవంత్కు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కానీ ఒక్కటే షరతు.. మైక్ కట్ చేసి అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు’అని హరీశ్రావు సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా హరీశ్రావు నివాళి అర్పించారు. -
జోరు సాగనీ...
బర్మింగ్హామ్: ఇంగ్లండ్పై తొలి టి20 సిరీస్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు... నామమాత్రమైన చివరి మ్యాచ్లోనూ అదే జోరు కనబర్చాలని ఆశిస్తోంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే 3–1తో దక్కించుకున్న హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... శనివారం ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడుతుంది. గతంలో ఇంగ్లండ్పై టెస్టు, వన్డే సిరీస్లు గెలిచిన భారత జట్టు... తాజాగా తొలి టి20 సిరీస్ ఖాతాలో వేసుకుంది. టాపార్డర్ చక్కటి ఫామ్లో ఉండగా... స్పిన్నర్లు సత్తా చాటుతుండటంతో టీమిండియా ఈ సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేయగలిగింది. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే... మనవాళ్ల ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది. నాలుగో టి20ని పరిశీలిస్తే... బౌండరీకి సమీపంలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి చూడచక్కని క్యాచ్లు అందుకోగా... 30 గజాల సర్కిల్లో రాధా యాదవ్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో కట్టిపడేసింది. ఫలితంగానే ఇంగ్లండ్ జట్టు 126 పరుగులకు పరిమితమైంది. అనంతరం టాపార్డర్ రాణించడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. అదే జోరు చివరి మ్యాచ్లోనూ కొనసాగించి ఇంగ్లండ్పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని హర్మన్ప్రీత్ బృందం భావిస్తోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల భారత పురుషుల జట్టు రెండో టెస్టులో ఇంగ్లండ్పై గెలిచిన మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, అమన్జ్యోత్ కౌర్ నిలకడ కనబరుస్తున్నారు. కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫర్వాలేదనిపిస్తున్నా... ఆమె స్థాయికి అది తక్కువే. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు హర్మన్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఈ సిరీస్లో భారత జట్టు జైత్రయాత్ర వెనక స్పిన్నర్ల కృషి ఎంతో ఉంది. నాలుగు మ్యాచ్ల్లో కలిపి స్పిన్నర్లే 22 వికెట్లు తీశారు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీ చరణి ప్రత్యర్థిని తన మాయాజాలంతో ముప్పుతిప్పలు పెడుతోంది. రాధా యాదవ్, దీప్తి శర్మ కూడా మంచి లయలో ఉన్నారు. మరోవైపు సొంతగడ్డపై గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో నెగ్గి వన్డే సిరీస్కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భావిస్తోంది. -
హైదరాబాద్లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్ఈ, అసోచామ్ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్ కుమార్ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్ బూమ్కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు. -
స్వింగ్ 'స్టార్క్' సెంచరీ
అతడు లయలో ఉన్నాడంటే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే! అతడు కొత్త బంతి అందుకున్నాడంటే జట్టుకు శుభారంభం దక్కాల్సిందే! యార్కర్ను ఇంత కచ్చితంగా కూడా వేయొచ్చా... అని క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన నైపుణ్యం అతడిది. ఇన్స్వింగర్ ఇంత అందంగా కూడా విసరొచ్చా అనే పనితనం అతడి సొంతం. 30 అడుగుల రనప్ నుంచి బంతి వేసేందుకు అతడు సిద్ధమవుతున్నాడంటేనే... క్రీజులో ఉన్న బ్యాటర్ మదిలో ఎన్నో సవాళ్లు! ఒకే బంతిని వేర్వేరుగా ఎలా వేయొచ్చో ఆధునిక క్రికెట్లో అతడికంటే బాగా మరెవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఇన్స్వింగర్, అవుట్ స్వింగర్, యార్కర్ ఇలా అతడి అమ్ములపొదిలోని అ్రస్తాలకు కొదవేలేదు. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఆ్రస్టేలియా పేస్ స్టార్ మిచెల్ ఆరోన్ స్టార్క్ గురించే! ఆటను కేవలం ఇష్టపడితే సరిపోదు... దాన్ని గౌరవించాలి అని బలంగా నమ్మే ఈ ఆ్రస్టేలియా పేసర్ 100వ టెస్టు మ్యాచ్కు సిద్ధమవుతున్నాడు. నేడు కింగ్స్టన్లో వెస్టిండీస్తో మొదలయ్యే మూడో టెస్టు (డే–నైట్) స్టార్క్ కెరీర్లో 100వ టెస్టు కానుంది. ఈ నేపథ్యంలో స్వింగ్ స్టార్ స్టార్క్ గురించి తెలుసుకుందామా! - సాక్షి క్రీడా విభాగం2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్... తొలి ఓవర్ వేసిన స్టార్క్ ఐదో బంతికి న్యూజిలాండ్ కెప్టెన్ మెకల్లమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కివీస్ సారథి రెప్పవేసేలోపు... లోపలికి దూసుకొచ్చిన రిప్పర్ అతడి వికెట్లను చెల్లాచెదురు చేసింది. ‘ఆదిలోనే హంసపాదు’ అన్నట్లు ఆరంభంలోనే దెబ్బతిన్న న్యూజిలాండ్ ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ టోర్నీ ఆసాంతం యార్కర్ల పండగ చేసుకున్న స్టార్క్ వరల్డ్కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఖాతాలో వేసుకున్న ఈ ఆసీస్ పేసర్... 2024 ఐపీఎల్ ఫైనల్లోనూ దాదాపు ఇదే తరహా బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్... ఫైనల్ తొలి ఓవర్ ఐదో బంతికి సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆఫ్వికెట్ను గిరాటేశాడు. ఇక ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన రైజర్స్ రన్నరప్గానే సీజన్ను ముగించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టిన ఘనత స్టార్క్దే. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలాంటి ఎన్ని అద్భుతాలు చేసినా... టెస్టు క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ఒక పేస్ బౌలర్ 100వ టెస్టు మ్యాచ్ ఆడటం అంటే ఆషామాషీ కాదు. ఆస్ట్రేలియా తరఫున మెక్గ్రాత్ తర్వాత 100వ టెస్టు ఆడుతున్న రెండో పేస్ బౌలర్గా స్టార్క్ నిలువనున్నాడు. మెక్గ్రాత్ బాటలో... ఆ్రస్టేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ ఆటకు వీడ్కోలు పలికిన నాలుగేళ్ల తర్వాత 2011లో స్టార్క్ టెస్టు అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మెకల్లమ్ను అవుట్ చేసి తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న స్టార్క్... రోజు రోజుకూ మరింత మెరుగవుతూ ముందుకు సాగాడు. క్రమశిక్షణకు కష్టపడేతత్వం తోడైతే ఫలితాలు సాధించొచ్చు అని నిరూపించిన స్టార్క్ అనతి కాలంలోనే ఆస్ట్రేలియా ప్రధాన పేసర్గా గుర్తింపు పొందాడు. 14 ఏళ్ల వయసు వరకు వికెట్ కీపర్గా కొనసాగి... ఆ తర్వాతే బౌలర్గా మారిన స్టార్క్ బరిలోకి దిగిన ప్రతీసారి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సాగుతున్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తు... అందులోనూ ఎడంచేతి వాటం... ఇంకేముంది వాయువేగంతో అతడు విసిరే బంతికి బదులు చెప్పాలంటే ప్రత్యర్థి బ్యాటర్ ఎంతగానో శ్రమించాల్సిందే. ముఖ్యంగా స్టార్క్ గురిచూసి వేసే యార్కర్కు ప్రత్యేక ‘ఫ్యాన్ బేస్’ ఉందనడంలో అతిశయోక్తి లేదు. కళ్లు మూసి తెరిచేలోపు లోపలికి దూసుకొచ్చే బంతి వికెట్లను ఎగరేసే విధానం చూసి తీరాల్సిందే. స్టార్క్ మనసు పెట్టి ఇన్స్వింగర్ సంధిస్తే అది వికెట్లను గిరాటేయాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యంత ప్రమాదకర బౌలర్గా ఎదిగిన స్టార్క్... కెరీర్లో పలుమార్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో ప్రభావం చూపలేడని పక్కన పెట్టడం... భారత్తో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటికి ఎదురొడ్డి నిలిచిన స్టార్క్... తన బౌలింగ్తోనే విమర్శకులకు సమాధానాలు ఇచ్చాడు. స్టార్క్ భార్య అలీసా హీలీ కూడా మేటి క్రికెటర్ కావడంతో క్లిష్ట సమయాల్లో అతనికి కుటుంబం నుంచి కూడా అండదండలు లభిస్తున్నాయి. ఐపీఎల్ను కాదని...ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనాలని పోటీపడుతుంటే... స్టార్క్ మాత్రం జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేసేందుకు కొన్ని సీజన్ల పాటు ఐపీఎల్కు దూరంగా ఉండటం అతడి నిబద్ధతను చాటుతోంది. ‘అతడు చాలా ప్రత్యేకం. ఆస్ట్రేలియా వంటి పేస్ పిచ్లపై ఎక్కువ బాధ్యతలు మోస్తూ 100 మ్యాచ్లు ఆడటం చాలా గొప్ప. అతడి సన్నద్ధత, వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి.పనిభారం దృష్ట్యా పలు సీజన్ల పాటు ఐపీఎల్కు సైతం అతడు దూరమయ్యాడు. అలాంటి ‘మ్యాచ్ విన్నర్’ జట్టులో ఉండటం ఆ్రస్టేలియా అదృష్టం. సుదీర్ఘ కాలంగా అతడు చూపిన పట్టుదలకు 100వ టెస్టు రూపంలో ఫలితం దక్కుతోంది’ అని ఆ్రస్టేలియా హెడ్ కోచ్ మెక్డొనాల్డ్ అన్నాడు. 2021 నుంచి గణాంకాలను పరిశీలిస్తే... అత్యధిక (1066) ఓవర్లు వేసిన పేసర్గా రికార్డుల్లోకి ఎక్కిన స్టార్క్... వికెట్ల వేటలోనూ ముందు వరుసలో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటి వరకు 395 వికెట్లు పడగొట్టిన స్టార్క్... 100వ మ్యాచ్లోనే 400 వికెట్ల మైలురాయిని దాటాలని భావిస్తున్నాడు. ఫిట్నెస్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ కంగారూ పేసర్... గాయాలతో సతమతమవుతున్న సమయంలోనూ బాధ్యతలను పక్కన పెట్టలేదు. 2022లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో విరిగిన వేలుతోనే బౌలింగ్ చేసిన స్టార్క్... 2023 యాషెస్ సిరీస్ సందర్భంగా గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్న జాతీయ విధులను విస్మరించలేదు. 35 ఏళ్ల వయసులో ఓ పేస్ బౌలర్ తన అత్యుత్తమ ప్రదర్శన సాగించడం విస్మయానికి గురిచేస్తోందని సహచర పేసర్, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కితాబిచ్చాడు. ‘145 కిలోమీటర్లకు పైగా వేగంతో ఒక పేసర్ 100 మ్యాచ్ల్లో బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. అతడో యోధుడు. ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉండటం అతడికే సాధ్యం’ అని కమిన్స్ అన్నాడు. మరెంత కాలం కెరీర్ కొనసాగిస్తాడో ఇప్పుడే చెప్పలేకపోయినా... ప్రస్తుతానికి మాత్రం అతడే ఆ్రస్టేలియా ప్రధాన అస్త్రం. బ్యాటింగ్లోనూ భళా... ప్రపంచ క్రికెట్కు ఆ్రస్టేలియా అందించిన మరో ఆణిముత్యమైన స్టార్క్... కేవలం బౌలింగ్లోనే కాకుండా ఉపయుక్తకర బ్యాటింగ్తోనూ ఆకట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. మామూలుగా సుదీర్ఘంగా బౌలింగ్ చేసే పేసర్లు నెట్స్లోనూ పెద్దగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయరు. కానీ స్టార్క్ తీరు అందుకు భిన్నం. కిందివరస బ్యాటర్లు జతచేసే పరుగులు జట్టుకు ఎంతో విలువ చేకూరుస్తాయి అని నమ్మే స్టార్క్... అవసరమైనప్పుడల్లా తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటాడు. అంతెందుకు ఇటీవల ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ స్టార్క్ తన బ్యాటింగ్ నైపుణ్యం చూపెట్టాడు. స్టార్ ఆట గాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు చేరుతున్న సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి ఎదురునిలిచి అతడు చేసిన అర్ధశతకమే మ్యాచ్లో ఆసీస్ను పోరాడే స్థితికి చేర్చింది. సుదీర్ఘ ఫార్మాట్లో స్టార్క్ బ్యాట్తో 2311 పరుగులు చేశాడు. ఓ ప్రధాన పేసర్ ఇన్ని పరుగులు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇక ‘డే అండ్ నైట్’ టెస్టుల్లో అయితే స్టార్క్కు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. గులాబీ బంతితో అత్యంత ప్రమాదకారి అయిన స్టార్క్... ఫ్లడ్ లైట్ల వెలుతురులో కరీబియన్ బ్యాటర్లతో ఓ ఆటాడుకోవడం ఖాయమే.16 టెస్టు ఫార్మాట్లో 100 టెస్టులు పూర్తి చేసుకోనున్న 16వ ఆ్రస్టేలియా క్రికెటర్గా స్టార్క్గుర్తింపు పొందనున్నాడు. పాంటింగ్ (168), స్టీవ్ వా (168), అలెన్ బోర్డర్ (156), షేన్ వార్న్ (145), లయన్ (139), మార్క్ వా (128), మెక్గ్రాత్ (124), ఇయాన్ హీలీ (119), స్టీవ్ స్మిత్ (118), మైకేల్ క్లార్క్ (115), డేవిడ్ వార్నర్ (112), బూన్ (107), లాంగర్ (105), మార్క్ టేలర్ (104), మాథ్యూ హేడెన్ (103) ఈ జాబితాలో ఉన్నారు.83 టెస్టు క్రికెట్ చరిత్రలో 100 టెస్టులు పూర్తి చేసుకోనున్న 83వ క్రికెటర్గా స్టార్క్ ఘనత సాధించనున్నాడు.11 ఇప్పటి వరకు 82 మంది క్రికెటర్లు 100 టెస్టుల మైలురాయి దాటారు. ఇందులో 10 మంది మాత్రమే స్పెషలిస్ట్ పేస్ బౌలర్లు (అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, కొట్నీ వాల్‡్ష, మెక్గ్రాత్, చమిందా వాస్, షాన్ పొలాక్, టిమ్ సౌతీ, ఇషాంత్ శర్మ, వసీం అక్రమ్, మఖాయ ఎన్తిని) ఉన్నారు. స్టార్క్ 11వ పేస్ బౌలర్గా గుర్తింపు పొందుతాడు. -
వర్షం లోటు..సాగు తడబాటు!
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లాసాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ వానాకాలం సీజన్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. లోటు వర్షపాతంతో కష్టకాలం గత సీజన్లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్ ఎక్సెస్) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్లోనే 95% మించి సాగు ఈ వానాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు... వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్ మిల్లెట్స్ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్లు సాగు చేశారు. నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు.. మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్ జిల్లా వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో) – ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305 – ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243 – పత్తి సాగు అంచనాః 4893016 – సాగైన పత్తి విస్తీర్ణంః 3630988 – వరిసాగు అంచనాః 6247868 – సాగైన వరి విస్తీర్ణంః 501129 – మొక్కజొన్న సాగు అంచనాః 521206 – సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318 -
స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 10 వరకు 1.34 శాతం తగ్గి రూ.5.63 లక్షల కోట్ల మేర ఉన్నాయి. రిఫండ్లు పెరిగిపోవడమే ఇందుకు కారణం. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్లు కాగా, నాన్ కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. రూ.17,874 కోట్లు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో వసూలైంది. ఈ మొత్తం కలిపి రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. నికర రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు చెల్లించింది) 38 శాతం పెరిగి రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లు చెల్లించకముందు చూస్తే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన రూ.6.44 లక్షల కోట్ల కంటే 3.17 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కేవలం రిఫండ్లు పెరిగిపోవడం నికర ఆదాయం తగ్గడానికి దారితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.25.20 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో కేంద్రం అంచనాలు ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 12.7 శాతం అధికం. ముఖ్యంగా రూ.78,000 కోట్లు సెక్యూరిటీస్ లావాదేవీల రూపంలోనే సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. -
ఎల్ఐసీలో మరింత వాటా అమ్మకం
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో ప్రభుత్వం మరికొంత వాటా విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు డిజిన్వెస్ట్మెంట్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. 2022 మే నెలలో పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించిన సంగతి తెలిసిందే. తద్వారా షేరుకీ రూ. 949 ధరలో రూ. 21,000 కోట్లు సమీకరించింది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం 2027 మే 16కల్లా ఎల్ఐసీలో పబ్లిక్కు కనీసం 10 శాతం వాటాను కలి్పంచవలసి ఉంది. దీంతో ఎల్ఐసీలో ప్రభుత్వం కనీసం 6.5 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం వాటా విక్రయానికి తెరతీయవచ్చని పేర్కొన్నాయి. అయితే ఎంత వాటా.. ఎప్పుడు ఎలా విక్రయించాలనే అంశాలపై డిజిన్వెస్ట్మెంట్ శాఖ ప్రణాళికలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలియజేశాయి. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే వీలున్నట్లు వివరించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 5.85 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 927 వద్ద ముగిసింది. -
సెమీస్లో జొకోవిచ్కు షాక్
లండన్: కెరీర్లో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రస్థానం ముగిసింది. పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్, ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) అద్భుతంగా ఆడి 6–3, 6–3, 6–4తో వరుస సెట్లలో జొకోవిచ్ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2017 తర్వాత వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరుకోకపోవడం ఇదే తొలిసారి. గత రెండేళ్లు ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిన జొకోవిచ్ 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. జొకోవిచ్తో 1 గంట 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ 12 ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదు సార్లు బ్రేక్ చేశాడు. జొకోవిచ్ 12 ఏస్లు సంధించడంతోపాటు 28 అనవసర తప్పిదాలు చేశాడు. ‘హ్యాట్రిక్’ టైటిల్పై అల్కరాజ్ గురి తొలి సెమీఫైనల్లో 2023, 2024 చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 2 గంటల 49 నిమిషాల్లో 6–4, 5–7, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్తో అల్కరాజ్ తలపడతాడు. అల్కరాజ్ గెలిస్తే... జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ తర్వాత వింబుల్డన్లో ‘హ్యాట్రిక్’ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్గా నిలుస్తాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X అనిసిమోవా (అమెరికా) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
టి20 ప్రపంచకప్ టోర్నీకి ఇటలీ అర్హత
ద హేగ్ (నెదర్లాండ్స్): మీరు చదువుతున్నది నిజమే... క్రికెట్ క్రీడలో ఇటలీ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీకి యూరోప్ జోన్ నుంచి ఇటలీతోపాటు నెదర్లాండ్స్ జట్లు అర్హత పొందాయి. ఫుట్బాల్లో ఇటలీకి ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు ప్రపంచకప్ను సాధించడంతోపాటు రెండుసార్లు రన్నరప్గా నిలిచింది. ఏ స్థాయి క్రికెట్లో అయినా ఇటలీ జట్టు వరల్డ్కప్ బెర్తు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా ఓవరాల్గా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్న 25వ జట్టుగా ఇటలీ నిలిచింది. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఇటలీ 9 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. అయినప్పటికీ... గ్రూప్లో 4 మ్యాచ్లాడిన ఇటలీ 2 విజయాలు, 1 పరాజయం, ఒక ఫలితం తేలని మ్యాచ్తో 5 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ముందంజ వేసింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ ఇటలీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక చివరి లీగ్ మ్యాచ్లో ఇటలీపై గెలిచిన నెదర్లాండ్స్ 6 పాయింట్లతో దర్జాగా వరల్డ్కప్కు అర్హత సాధించింది. తద్వారా గత నాలుగు టి20 ప్రపంచకప్లలో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు ఈసారి మెగా టోర్నీ ఆడే అవకాశం కోల్పోయింది. చివరి లీగ్ మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు జెర్సీ జట్టు చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడింది. దీంతో పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమై వరల్డ్కప్నకు దూరమైంది. -
జీ ప్రమోటర్లకు వాటాదారుల చెక్
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)లో ప్రమోటర్ల వాటా పెంపు ప్రతిపాదనను తాజాగా వాటాదారులు తిరస్కరించారు. పూర్తిస్థాయిలో మార్పిడి చేసుకునే వారంట్ల జారీ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు జీల్లో రూ. 2,237 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించాయి. దీంతో ప్రిఫరెన్షియల్ పద్ధతిలో కంపెనీలో వాటాను 18.4 శాతానికి పెంచుకునేందుకు ప్రతిపాదించాయి. అయితే ఇందుకు వాటాదారులు అనుమతించనట్లు కంపెనీ తెలియజేసింది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా చేపట్టిన ప్రతిపాదనకు 59.51 శాతం వాటాదారులు అనుకూలత వ్యక్తం చేసినప్పటికీ 40.48 శాతం వ్యతిరేకించినట్లు వెల్లడించింది. ప్రత్యేక రిజల్యూషన్ చేపడితే కనీసం 75 శాతంమంది వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని వివరించింది. గత నెలలో ప్రతిపాదన గత నెలలో జీల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్ల జారీ ద్వారా రూ. 2,237.44 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. తద్వారా ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడే వీలుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ బోర్డు పూర్తిగా మార్పిడికి వీలయ్యే 16.95 కోట్ల వారంట్ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆలి్టలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ తదితర ప్రమోటర్ సంస్థలకు వారంట్లను జారీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీలో అతిపెద్ద వాటాదారు సంస్థ నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ జీల్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్సీ అడ్వయిజరీ సంస్థ గ్లాస్ లెవిస్ సైతం సానుకూలంగా ఓటు చేయమని వాటాదారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ప్రమోటర్ల వాటా పెంపునకు వాటాదారుల తిరస్కరణ వార్తలతో జీల్ షేరు బీఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 137 వద్ద ముగిసింది. -
సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–వెర్బీక్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/3)తో లూసియా స్టెఫానీ (బ్రెజిల్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సినియకోవా–వెర్బీక్ జంటకు 6,80,000 పౌండ్లు (రూ. 7 కోట్ల 88 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 11వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్కాగా... ‘మిక్స్డ్’లో మాత్రం తొలి టైటిల్. మహిళల డబుల్స్లో సినియకోవా మూడుసార్లు చొప్పున ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో... ఒకసారి యూఎస్ ఓపెన్లో టైటిల్స్ సాధించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్లో మహిళల డబుల్స్లో... పారిస్ ఒలింపిక్స్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు వెర్బీక్ తొలి గాండ్స్లామ్ టైటిల్ నెగ్గాడు. -
క్విక్ కామర్స్లో పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశీ క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆధిపత్యం నడుస్తుండగా తాజాగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నౌ కూడా రంగంలోకి దిగింది. అమెజాన్ నౌ పేరిట బెంగళూరు తర్వాత ఢిల్లీలో కూడా నిర్దిష్ట పిన్కోడ్లలో 10 మినిట్స్ డెలివరీ సర్వీసులు ప్రారంభించింది. ఆయా పిన్–కోడ్లలోని యూజర్లకు యాప్లో ఇప్పుడు అమెజాన్ నౌ అనే ట్యాబ్ను అందుబాటులోకి తెచి్చంది. నిత్యావసరాలు, పండ్లు..కూరగాయలు, పర్సనల్ కేర్, సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, వైర్లెస్ యాక్సెసరీలు, చిన్న గృహోపకరణాలు మొదలైన వాటిని ఈ సర్వీస్ కింద అమెజాన్ అందిస్తోంది. డెలివరీ ఉచితంగా పొందాలంటే ప్రైమ్ యూజర్లకు కనీస కొనుగోలు విలువ రూ. 99గా, నాన్–ప్రైమ్ యూజర్లకు రూ. 199గా ఉంటుంది. స్మార్ట్ఫోన్ల దన్ను..: డేటా చార్జీలు తక్కువగా ఉండటం, స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగడం, యువ జనాభా ఎక్కువగా ఉండటం వంటి అంశాలు దేశీయంగా క్విక్ కామర్స్కి దన్నుగా ఉంటున్నాయి. ఫ్లిప్కార్ట్, బెయిన్ అండ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ఈ–గాస్రరీ ఆర్డర్లలో మూడింట రెండొంతుల వాటా, ఈ–రిటైల్ వ్యయాల్లో పదో వంతు వాటా క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలదే ఉంది. దేశీయంగా కొనుగోళ్ల విధానాల్లో క్యూకామ్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న తీరును ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. కొనుగోళ్లకు సంబంధించి ఇది దాదాపు ప్రధాన మాధ్యమంగా మారిపోతుండటంతో ఫ్లిప్కార్ట్, అమెజాన్లాంటి సంస్థలు కూడా తప్పనిసరిగా రంగంలోకి దిగుతున్నాయి. రూ. 64,000 కోట్ల ఆర్డర్లు.. 2024–25లో భారతీయులు బ్లింకిట్, ఇన్స్టామార్ట్లాంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫాంల ద్వారా రూ. 64,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులకు ఆర్డరిచి్చనట్లు అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 30,000 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) రూ. 2 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ కెర్ఎడ్జ్ రేటింగ్స్ విభాగం ఒక నివేదికలో అంచనా వేసింది. మరోవైపు 2024లో 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి ఏకంగా 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ మరో రిపోర్టులో అంచనా వేసింది. -
నా ప్రాణాలకు ముప్పు -ట్రంప్
నా ప్రాణాలకు ముప్పు -ట్రంప్ -
ఘోరం... ఇది దారుణం!
‘గర్భ’ గుడిలో జీవం పోసుకోవటంతో మొదలై కడదాకా అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్న ఆడపిల్లకు మృత్యువు తరచు తారసపడుతుంటుంది. అది పుట్టినిల్లా, మెట్టినిల్లా, నడివీధా, జనసమ్మర్ధం లేని ప్రాంతమా అనే తారతమ్యం లేదు. హంతకులు ఏ రూపంలో వుంటారో, ఎక్కడ కాపుగాస్తారో తెలియదు. తండ్రా, సోదరుడా, కట్టుకున్నవాడా, అపరిచితుడా అనే తేడా కూడా లేదు. ఉసురు తీసేవాడు ఎవడైనా కావొచ్చు. కారణం ఏదైనా ఉండొచ్చు. హరియాణాలోని గురుగ్రామ్లో కన్నతండ్రే కాలయముడై నిష్కారణంగా తన కంటిపాపను చిదిమేసిన ఈ ఉదంతం దిగ్భ్రాంతికరమైనది. తండ్రి దీపక్ యాదవ్ తుపాకి గుళ్లకు బలైపోయిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ చేసిన ‘నేరం’ ఏమీ లేదు. చిన్న వయసులోనే ఆ క్రీడలో రాణించి, ప్రతిభా పాటవాలు సొంతం చేసుకుని, అంచెలంచెలుగా ఎదగటమే ఆమె నేరం. కేవలం ఇరవై అయిదేళ్లకే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సర్క్యూట్లో ఆమె ర్యాంకు 113. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కూడా నిరూపించుకుంది. సొంతంగా టెన్నిస్ అకాడెమీ నెలకొల్పింది. తన వంటి బాలికలకు శిక్షణనిస్తున్నది. వారు ఎదగటానికి ఆసరాగా నిలు స్తున్నది. అటువంటి రాధిక, కన్నతండ్రికి కంట్లో నలుసుగా మారిందంటే నమ్మగలమా? ఆమెను కాల్చిచంపటం తప్ప మరో దారిలేదని విశ్వసించాడంటే ఊహించగలమా? యువతరంలో చాలా మందికి ఆ వయసుకల్లా ఏం ఎంచుకోవాలో, ఎటుపోవాలో తెలియని అయోమయం ఆవరిస్తుంది. సంకోచం వెనక్కు లాగుతుంది. కింకర్తవ్య విమూఢత కాటేస్తుంది. ఆశించిన ఉద్యోగం అందక, ఇష్టంలేని కొలువుతో సరిపడక నిస్పృహలో కూరుకుపోతారు. కానీ రాధిక అలా కాదు. టెన్నిస్ రంగంలో ఎదిగి ఒక సానియా మీర్జాలా, ఒక సెరెనా విలియమ్స్లా మెరిసిపోవాలనుకుంది. ఇప్ప టికే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సాధించింది. జాతీయ స్థాయి టెన్ని స్లో సైతం స్థానం సంపాదించుకోవాలని తపన పడుతోంది. కన్నవారికే కాదు... దేశానికే పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలదన్న భరోసానిచ్చింది. ఇవన్నీ ఆమె తండ్రి దృష్టిలో నేరాలయ్యాయి. రాధికా యాదవ్ ఉదంతం మనందరం నమ్ముతున్న విలువల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. చిన్ననాటి నుంచీ టెన్నిస్లో ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించినవాడే హఠాత్తుగా ఎలా హంతకుడయ్యాడు? మెచ్చిన నోటితోనే దుర్భాషలాడే స్థితికి అతగాడు చేరటం వెనకున్న పరిణామాలెలాంటివి? పోలీ సులకిచ్చిన వాంగ్మూలంలో అతను ప్రస్తావించిన అంశాలు వింటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న మన సమాజం నిజస్వరూపం బట్టబయలవుతుంది. అంతా సవ్యంగా వుందని ఆత్మవంచనతో బతికేవారిని నిలదీస్తుంది. అందరూ దీపక్లాగే స్పందించక పోవచ్చుగానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చాలామందికి కన్నకూతురు గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడటం, ఆమెను చిన్నచూపు చూడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కనబడుతూనే వుంటుంది. ఇలాంటి దుర్మార్గ ధోరణులను ప్రతిఘటించాల్సిన దీపక్ యాదవ్ తానూ ఆ తానులో ముక్కయ్యాడు. వారు ప్రవచిస్తున్న విలువల పరిధిలో, పరిమితిలో వుండకుండా కుటుంబాన్ని రాధిక వీధిన పడేస్తున్నదని అపోహపడ్డాడు. టెన్నిస్ క్రీడ గురించీ, తానిస్తున్న శిక్షణలో పాటించే ప్రమాణాల గురించీ ఆమె చేసిన వీడియోపై వచ్చిన కామెంట్లు తట్టుకోలేక సోషల్ మీడియా ఖాతాను అప్పటికే తీయించేశాడు. అకాడెమీని సైతం మూసేయాలన్న సలహా కూడా పాటించాలని కోరుకున్నాడు. దాన్ని తిర స్కరించిందన్న ఉన్మాదంతో మానవత్వాన్ని మరిచాడు. కూతురి సంపాదనపై బతుకుతున్నావని ఛీత్కరించిన మృగాల్లో కనీసం ఒక్కరికి తన లైసెన్స్ రివాల్వర్ను గురిపెట్టివుంటే ఆ బాపతు నోళ్లు మూతబడేవి. స్వయంశక్తితో ఎదుగుతున్న కన్నకూతురి కోసం దృఢంగా నిలబడిన ఒక మంచి నాన్నగా నిలిచేవాడు. ఏమైంది ఇవాళ? యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి హంతకుడిగా మిగిలాడు! ఆడపిల్లను పెంచటం, ఆమె అభీష్టానికి అనుగుణంగా ఎదగనివ్వటం, ఇష్టపడిన చదువు చది వించటం, కోరుకున్న వాడికిచ్చి పెళ్లిచేయటం వర్తమానంలో పెను సవాలుగా మారిందన్నది వాస్తవం. తల్లిదండ్రులు విద్యావంతులైనా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా, సమాజం పెట్టిన ప్రమాణా లను ఆడపిల్ల మీరితే ఎలా అన్న విచికిత్సలో పడుతున్నవారు చాలామందే తారసపడతారు. వారిలో అనేకులు చుట్టూవున్నవారి ఒత్తిళ్లకు లొంగి ఇంటి ఆడపిల్లను అదుపు చేయటానికి ప్రయ త్నించేవారే. ఆ క్రమంలో అనేకమంది పిల్లలు తమ ఇష్టాలను వదులుకుని బతుకులు వెళ్లదీస్తు న్నారు. అసలు బయటికెళ్లిన ఆడపిల్ల సురక్షితంగా ఇంటికొస్తుందో లేదో తెలియని ఆందోళనతో నిత్యం భయంభయంగా బతుకుతున్న తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసానిచ్చే వ్యవస్థలు న్నాయా? సామాజిక కట్టుబాట్ల పేరుతో రూపొందుతున్న తప్పుడు విలువలు ఇళ్లల్లోకి చొరబడకుండా, వాటి దుష్ప్రభావాలు కుటుంబాలపై పడకుండా నివారించే సంస్కృతి ఆచూకీ ఏది? మన ప్రభుత్వాలు తీసుకుంటున్న కనీస చర్యలేమిటి?ఆడవాళ్లను కించపరిచే సినిమాలనూ, ఇతరేతర మాధ్యమాలనూ ఏ మేరకు కట్టడి చేయగలుగుతున్నాం? ఎటువంటి వివక్షకూ తావు లేకుండా దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు లభించాలన్న మన రాజ్యాంగం సక్రమంగా అమలవు తున్నదా? ఇవన్నీ సరిగా లేనప్పుడు దీపక్లాంటివారు రూపొందుతారు. వారికి నారూ నీరూ పోస్తున్నవారు ఎప్పటికీ పదిలంగా వుంటారు. రాధికా యాదవ్ వంటి మణిపూసలు నిస్సహాయంగా నేల రాలుతారు. -
రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కనీసం 4 వేల మెగావాట్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించింది. అణు ఇంధన ఉత్పత్తికి గల అవకాశాలపై అధికారుల నుంచి నివేదిక కోరింది. ఇతర రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు, అయిన ఖర్చు, పనితీరు, విద్యుత్ ఉత్పత్తి ధరలను పరిశీలించాలని వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో విద్యుత్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ త్వరలో నిపుణులతో సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే నిపుణులతో కూడిన కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.2047 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మెగావాట్ల అణు ఇంధన ఉత్పత్తి జరగాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది బడ్జెట్లో నిధులు పెంచింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అణు ఇంధన ఉత్పత్తికి వనరులున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద భారజల ఉత్పత్తి కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉంది. ఇక్కడి నుంచి భారజలం దేశంలోని అన్ని అణు విద్యుత్ కేంద్రాలకూ అందుతోంది. సహజ యురేనియంను ఉపయోగించే అణు రియాక్టర్లలో శీతలీకరణకు (కూలెంట్గా) దీనిని ఉపయోగిస్తారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే వనరులను ఇక్కడే వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అణు విద్యుత్ ప్లాంట్ల మంజూరు, స్థాపన, ఉత్పత్తి వినియోగం మొత్తం కేంద్ర ప్రభుత్వ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉండటం గమనార్హం.కర్బన ఉద్గారాలకు చెక్! ప్రస్తుతం 14 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. థర్మల్, జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. అయితే థర్మల్కు అవసరమైన బొగ్గుకు ఇబ్బందులున్నాయి. యాదాద్రి థర్మల్ ప్లాంటుకు వచ్చే ఫిబ్రవరికి 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఇంత మొత్తం సింగరేణి అందించే పరిస్థితి కని్పంచడం లేదు. మరోవైపు బొగ్గు మండించడం వల్ల వచ్చే కర్బన ఉద్గారాలు సమస్యగా మారుతున్నాయి. దీంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. థర్మల్ విద్యుత్ యూనిట్ సగటున రూ.4 వరకు ఉండగా, సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2.15కు లభిస్తోంది.కానీ సాయంత్రం, రాత్రి వేళల్లో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటే యూనిట్ రూ.9 వెచి్చంచి కొనాల్సి వస్తోంది. జలవిద్యుత్ చవక అయినా అది పరిమితంగానే ఉంది. కాగా వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్ మరో 9 వేల మెగావాట్లకు పెరిగే వీలుంది. దీంతో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అణు విద్యుత్ ప్లాంట్లు 90 శాతం ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) ఇస్తున్నాయి.అంటే ప్రతి వంద మెగావాట్లు 24 గంటలు పనిచేశాయనుకుంటే 2.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దేశంలో 8 అణు విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటిలో 25 రియాక్టర్లు పనిచేస్తున్నాయి, వీటి మొత్తం సామర్థ్యం 8,880 మెగావాట్లు. ప్రస్తుతం ఈ విద్యుత్ యూనిట్ రూ. 3.15కు లభిస్తోంది. మరో పది కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. గుజరాత్, రాజస్తాన్లో ఒక్కో యూనిట్ 700 మెగావాట్లతో నిర్మిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో ఉత్పత్తి ఇలా.. అణు ఇంధన రంగంలో ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తు న్నారు. దీనివల్ల ప్లాంట్ నిర్మాణ వ్యయం తగ్గుతోంది. అణు రియాక్టర్లోని భారజలంలో యురేనియం, థోరియం పరమాణువులను విచి్ఛన్నం చేస్తారు. దీంతో వెలువడే వేడిమితో నీటి ఆవిరి తయారవుతుంది. దాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం నిల్వలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉన్నట్టు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ప్రయోజనాలెన్నో.. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు చాలా తేడా ఉంది. వి ద్యుత్ ప్లాంట్కు అవసరమైన యురేనియం, థోరియం సూట్కేస్ పరిణామంలోనే తీసుకెళ్ళొచ్చు. థర్మల్ కేంద్రాలకు వాడే బొగ్గును రైల్వే వ్యాగన్ల ద్వారా పంపాలి. అణు విద్యుత్తు కేంద్రాల స్థాపనకు, థర్మల్తో పోలిస్తే నాలుగో వంతు భూమి సరిపోతుంది. ఇటీవల కాలంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఇంకా తక్కువ స్థలం వాడొచ్చు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కాల పరిమితి 20 ఏళ్ళు. అణు కేంద్రాల కాల పరిమితి 40 ఏళ్ళ పైనే. అణు విద్యుత్ కేంద్రాల్లో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ద్వారా అదనపు ప్రయోజనం పొందవచ్చు.దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు⇒ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం - మహారాష్ట్ర ⇒ రాజస్తాన్ అణు విద్యుత్ కేంద్రం - రాజస్తాన్ ⇒ మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం - తమిళనాడు ⇒ నరోరా అణు విద్యుత్ కేంద్రం - ఉత్తరప్రదేశ్ ⇒ కైగా అణు విద్యుత్ కేంద్రం - కర్ణాటక ⇒ కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం - తమిళనాడు ⇒ కాక్రపార అణు విద్యుత్ కేంద్రం - గుజరాత్ అణువిద్యుత్ ఉత్పత్తి పెరుగుతోందిఅణు ఇంధన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై అన్ని రాష్ట్రాలూ దృష్టి పెట్టాయి. కేంద్రం కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి అవసరాలు తీర్చేందుకు అణు ఇంధన ప్లాంట్ల ఏర్పాటు అవసరం. వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో అణు ఇంధనం ప్రయోజనకరం. – జి.వీర మహేందర్ (టీజీ జెన్కో ఫైనాన్స్ డైరెక్టర్) -
మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!
మోదీ ప్రభుత్వం చెప్పుకొనే గొప్పల్లో తరచూ వినిపించేవి... విదేశీ మారక ద్రవ్య నిల్వలు! ఆయన వచ్చిన తర్వాత ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 700 బిలి యన్ డాలర్లకు పెరిగాయి (2025 జూన్ నాటికి). ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా వద్ద 3 ట్రిలియన్ (3,000 బిలియన్లు లేదా 3 లక్షల కోట్లు) డాలర్లు ఉన్నాయి. గతంలో చైనా ఫారెక్స్ నిల్వలు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి. చైనా తర్వాత జపాన్ (1.25 ట్రిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్ (800 బిలియన్ డాలర్లు) ఆగ్రస్థానంలో నిలుస్తాయి. మారక ద్రవ్య నిల్వలు ఇంత అధికంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేదు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక చక్ర వ్యూహంలో చిక్కుకుంది. ఎలా బయట పడాలో తెలియడం లేదు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్తేజపరచడానికి కొత్త పెట్టుబడులు ఇబ్బడి ముబ్భడిగా రావాలి. కానీ ప్రభుత్వం వాటిని ఆకర్షించలేక పోతోంది. 2004–14 మధ్య మన ఎకానమీ అసాధారణ వృద్ధి సాధించింది. తర్వాత ఆ ఊపు కనబడటం లేదు. యూపీఏ పాలన సాగిన పదేళ్లలో సాధించిన ప్రగతికి 7.7 శాతం సగటు వృద్ధి రేటే నిదర్శనం. గడచిన పదేళ్లలో ఈ సగటు అంతకంటే తక్కువగా 6.2 గానే నమోదైంది.ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు!అయితే, యూపీఏ హయాం చివరి రెండేళ్లలో ఎకానమీ మంద గించింది. పెట్టుబడుల వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్ – క్యాపెక్స్) భారీగా క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొ నాలి. దురదృష్టవశాత్తూ అదే ట్రెండ్ ఎన్డీయే హయాంలోనూ కొన సాగుతోంది. భారత ఆర్థిక వృద్ధి నేటికీ చాలావరకు ప్రభుత్వ పెట్టు బడి మీదే ఆ«ధారపడుతోంది. పెట్టుబడులు ఎందుకు పడిపోతు న్నాయి? ప్రభుత్వం దగ్గర కాసులు లేవు. యూపీఏ పాలన నాటి అధిక సబ్సిడీలను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. దీనికి తోడు, ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు వల్ల వేతనాలు 23 శాతం (రూ. లక్ష కోట్లు) పెరిగాయి. తనకు ముందు సంవత్సరాల మందగమనాన్నుంచి ఎకానమీని గట్టెక్కించి పరుగులు తీయిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచుతానన్నారు. 100 కొత్త సిటీలు, హైస్పీడ్ రైళ్ల నేషనల్ నెట్వర్క్, దేశ వ్యాప్త నదుల అనుసంధానం, ఇంకా ఇలాంటి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వాగ్దానం చేశారు. 100 కొత్త నగరాల నిర్మాణం కాస్తా 100 స్మార్ట్ సిటీలకు పరిమితమైంది.స్మార్ట్ సిటీలంటే ఉచిత వైఫై నెట్వర్కులు ఏర్పాటు చేయడమే. ఇక దేశవ్యాప్త హైస్పీడ్ రైళ్ల నెట్వర్క్ కాస్తా అహ్మదాబాద్ – ముంబాయి బుల్లెట్ ట్రెయిన్గా రూపాంతరం చెందింది. అది కూడా ఆర్థికంగా ఓ గుదిబండ అయ్యేట్లుంది. ఇతర వాగ్దానాలు సైతం ‘ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయల జమ’ లాంటి జుమ్లాల జాబితాలో చేరాయి. దెబ్బ మీద దెబ్బఆ తర్వాత రెండు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటైన పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్) చర్య అసంఘటిత రంగపు దినసరి వేతన జీవులను చావుదెబ్బ తీసింది. దేశ జీడీపీలో 40 శాతం ఈ రంగం నుంచే సమకూరుతుంది. ఉపాధి పరంగా చూసినా, మొత్తం 45 కోట్ల మందిలో 90 శాతం మంది ఈ రంగం నుంచే ఉపాధి పొందుతున్నారు. రెండో చర్య జీఎస్టీ తొందరపాటు అమలు. ఈ రెండు చర్యల వల్ల కచ్చితంగా ఎంత మంది ఉపాధి కోల్పోయారో ఇప్పటికీ గణాంకాలు లభ్యం కావడం లేదు. అంచ నాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం, ఫుడ్, రిటెయిల్ రంగాల్లో ఉపాధి నష్టం భారీగా జరిగింది. ఈ నిర్ణ యాలు 2–3 కోట్ల మంది పొట్ట గొట్టి ఉంటాయని అంచనా. సరైన ఆలోచన లేకుండా జీఎస్టీని తొందరపడి అమలు చేయడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడింది. తుది గడువు తక్కువగా ఉండటంతో డీలర్లు స్టాక్స్ తగ్గించుకున్నారు. దాంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. జీఎస్టీ ఇన్పుట్, ఔట్పుట్ రేట్లు పొంతన లేకుండాఉండటం వల్ల గందరగోళం మరింత పెరిగింది. మొదటి నెల రూ. 95 వేల కోట్ల వసూళ్లు ఉన్నా, అందులో రూ. 65 వేల కోట్లు తర్వాత రీఫండ్ చేయాల్సి వచ్చింది. కానీ అన్ని నిధులు ప్రభుత్వం వద్ద లేవు. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయానికి నిధులు సమకూర్చు కునేందుకు వీలుగా జీడీపీలో 3.2 శాతం మించకూడదన్న ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవలసి వచ్చింది. ఈ స్వయంకృత అపరా ధాలకు కోవిడ్ వైపరీత్యం తోడైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వినియోగం తగ్గింది. దాంతో ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా వినియోగం మరింత తగ్గింది. ఈ విషవలయం నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి ఒడ్డున పడేయాలంటే, ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరగాలి. తద్వారా ప్రజల చేతికి డబ్బు వస్తుంది. తిరిగి వినియోగం, ఉత్పత్తి పెరుగుతాయి. ప్రభుత్వం సబ్సిడీలను అర్థవంతంగా తగ్గిస్తే తప్ప పెట్టుబడి వ్యయం పెంచలేదు. రాజకీయంగా ఇది సాధ్యం కానిది. కానీ ఎలాగైనా పెట్టుబడులు పెంచాలి. వాస్తవికతను విస్మరించకుండానే సృజనాత్మక ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబ డులు పెంచాలి. తద్వారా వినియోగం పెరగాలి. ఈ పెట్టుబడుల ప్రణాళిక కోసం నిధులు అవసరం. ఈ డబ్బు సమ కూర్చుకోడానికి మోదీ అటూ ఇటూ పరుగులు తీయాల్సిన పని లేదు. డబ్బే డబ్బు!ప్రభుత్వం డబ్బు పాతర మీద కూర్చుని ఉంది. దశాబ్దాలుగా పోగుపడిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఇందులో అమెరికాబ్యాంకుల్లో మూలుగుతున్నవి 135 బిలియన్ డాలర్లు) కొండంతఅండగా కలిసి వస్తాయి. ఈ రిజర్వులు మన విదేశీ రుణాల్లో(736 బిలియన్ డాలర్లు) సుమారు 95 శాతానికి సమానం. ఫారెక్స్ రిజర్వుల్లో నాలుగో వంతు హాట్ మనీ (అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థల స్వల్ప కాలిక పెట్టుబడులు) ఉపసంహ రణల కోసం పక్కన పెట్టినా, మన దగ్గర ఇంకా చాలా డబ్బు చేతిలోఉంటుంది. ఇందులో ఎంత వాడుకోగలమన్నది ఇప్పుడు ఆలోచించాలి. కౌశిక్ బసు (ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త) ప్రకారం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సిఏడీ)కి సరిపడా ఉంటే చాలు. (ప్రస్తుత కరెంట్ ఖాతా లోటు 11 బిలియన్ డాలర్లు – వస్తుసేవల ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం కంటే దిగుమతులకు చేసే చెల్లింపులు, విదేశీ పెట్టుబడుల మీద వెనక్కు పోయే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు). సింపుల్గా చెప్పాలంటే, కనీసం 6 నెలల దిగుమతులకు సరి పడా మారక ద్రవ్యం నిల్వ పెట్టుకుంటే చాలని ‘వాషింగ్టన్ కన్సెన్సస్’ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా దేశీయ వినియోగదారుల కోసం తాము ఎందుకు చౌకగా నిధులు సమకూర్చాలన్న భావనతో చైనా తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఒక ట్రిలియన్ డాలర్లు తగ్గించుకుంది. మనం కూడా దాన్ని 100 బిలియన్ డాలర్లకు తగ్గించుకునే యోచన చేయాలి. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నెలకొల్పి, దానిలోకి అదనపు ఫారెక్స్ రిజర్వులను కొంచెంకొంచెంగా తరలిస్తూ పోవాలి. ఇది ఇండియాలో పెట్టుబడి పెట్టేఇండియా సావరిన్ ఫండ్ అవుతుంది. దీని ద్వారా పెట్టుబడులు సమ కూర్చుకునే సంస్థలు తమకు అవసరమైన వాటిని దేశీయంగా సమ కూర్చుకోవాలన్న నిబంధన పెట్టాలి. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆచరణలోకి వస్తుంది. పెట్టుబడులు ఊపందుకుని ఆర్థిక వ్యవస్థ ఒడ్డున పడేందుకు ఇదొక అత్యుత్తమ మార్గం.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com-మోహన్గురుస్వామి -
ఇక దేశీయంగా రేర్ మాగ్నెట్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,345 కోట్ల స్కీముపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మాగ్నెట్స్ తయారీ కోసం ఎంపికయ్యే రెండు సంస్థలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఈ విషయాలు వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్కు పంపే అవకాశం ఉంది. రేర్ ఎర్త్ ఆక్సైడ్లను మాగ్నెట్ల కింద మార్చే ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సబ్సిడీలు ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మాగ్నెట్స్ ఎగుమతులపై ప్రధాన సరఫరాదారు అయిన చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్న సంగతి తెలిసిందే. టెలికం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తదితర రంగాల్లో ఉత్పత్తికి ఇవి కీలకంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులకు స్కీము.. పీఎం ఈ–డ్రైవ్ కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలు చేసే వారికి రూ. 9.6 లక్షల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పథకాన్ని కుమారస్వామి ఆవిష్కరించారు. సుమారు 5,600 ట్రక్కులకు వర్తించే ఈ పథకంతో పోర్ట్లు, లాజిస్టిక్స్, సిమెంట్, స్టీల్ తదితర పరిశ్రమలు లబ్ధి పొందనున్నాయి. మొత్తం వాహనాల్లో డీజిల్ ట్రక్కుల వాటా 3 శాతమే అయినప్పటికీ రవాణా సంబంధిత గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 42 శాతం వాటా వాటిదే ఉంటోందని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్గారాలను తగ్గించే, పర్యావరణహితమైన సరకు రవాణా విధానాలను అమలు చేసేందుకు ఈ స్కీము దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ పరిమాణం రూ. 10,900 కోట్లు కాగా, ఇందులో ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు. -
టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వచ్చే వారం భారత మార్కెట్లో లాంఛనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జూలై 15న దేశీయంగా తొలి స్టోర్ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎంపిక చేసిన ప్రముఖులకు టెస్లా పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి కార్ల సెట్ను తమ చైనా ప్లాంటు నుంచి కంపెనీ ఎగుమతి చేసినట్లు వివరించాయి. ఇవి మోడల్ వై రియర్–వీల్ డ్రైవ్ ఎస్యూవీలై ఉంటాయని తెలిపాయి. టెస్లా ఇండియా గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చ.అ. వేర్హౌస్ స్థలాన్ని అయిదేళ్లకు లీజుకు తీసుకుంది. యూరప్, చైనా మార్కెట్లలో తమ కార్ల విక్రయాలు నెమ్మదిస్తున్న తరుణంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఏఐ ఆధారిత వైద్య సేవలు
ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ – ఆసియా పసిఫిక్ (ఎస్ఎంఐఎస్ఎస్–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్కేర్ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు. ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంపస్లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.నచ్చిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్ ఎంబీబీఎస్. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
గదాధారి...
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు. -
సార్... మేడమ్ వస్తున్నారు
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’.పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు.పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో సాగుతుంది. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్లో కనిపించారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్, నిత్యల నటన హైలెట్గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి
మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్తోనే సత్తా చాటుకున్నాయి. లండన్: భారత ప్రీమియర్ బౌలర్ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్ మొదలైన కొద్దిసేపటికే అవుట్ చేశాడు. భారత్ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జో రూట్ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్ కీపర్ జేమీ స్మిత్ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్ బ్రైడన్ కార్స్ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్స్టర్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు), కరుణ్ నాయర్ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్... స్టోక్స్, రూట్ క్లీన్బౌల్డ్ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్ స్టార్ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్నైట్ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (44) వికెట్ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్ వికెట్ పడింది. ఈ ఇద్దరూ క్లీన్ బౌల్డయ్యారు. రూట్ అవుటైన మరుసటి బంతికే క్రిస్ వోక్స్ (0) డకౌట్ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్ చేశాడు. బుమ్రా పేస్కు విలవిలలాడిన ఇంగ్లండ్కు స్మిత్ క్యాచ్ నేలపాలవడం వరమైంది. సిరాజ్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్లైన్తో కార్స్తో కలిసి ఇంగ్లండ్ పోటీ స్కోరుకు స్మిత్ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్కే అతని వికెట్ దక్కింది. బుమ్రా... ఆర్చర్ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్ అతన్ని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.యశస్వి, గిల్ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్కు కరుణ్ నాయర్ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్ వికెట్ తీసిన స్టోక్స్ రెండో వికెట్కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్లో భీకరమైన ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్ చేయలేకపోయినా రిషభ్ పంత్ (19 బ్యాటింగ్; 3 ఫోర్లు) బ్యాటింగ్లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ 23; పోప్ (సి) సబ్–జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బి) బుమ్రా 104; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బి) బుమ్రా 44; స్మిత్ (సి) సబ్–జురేల్ (బి) సిరాజ్ 51; వోక్స్ (సి) సబ్–జురేల్ (బి) బుమ్రా 0; కార్స్ (బి) సిరాజ్ 56; ఆర్చర్ (బి) బుమ్రా 4; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్: బుమ్రా 27–5–74–5, ఆకాశ్దీప్ 23–3–92–0, సిరాజ్ 23.3–6–85–2; నితీశ్ కుమార్ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్ 10–1–21–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (బ్యాటింగ్) 53; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; గిల్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్: వోక్స్ 13–1–56–1, ఆర్చర్ 10–3–22–1, కార్స్ 8–1–27–0, స్టోక్స్ 6–2–16–1, బషీర్ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న ఫీల్డర్గా జో రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ (భారత్) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు.⇒ 11 భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా స్టీవ్ స్మిత్ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్ వాన్, జాక్ హాబ్స్, దిలీప్ వెంగ్సర్కార్ ఈ ఘనత సాధించారు. -
వింబుల్డన్ మ్యాచ్లో దేవర భామ.. బాయ్ఫ్రెండ్తో కలిసి!
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసింది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మ్యాచ్కు హాజరైంది. లండన్లో జరుగుతున్న టోర్నీలో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్- శిఖర్ చాలాసార్లు ఇలా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించారు.ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో కనిపించనుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హోమ్బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది. పరం సుందరి జూలై 24, 2025న విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.Spotting Janhvi Kapoor with Shikhar Pahariya at Wimbledon was not on my list today😭— Preet (@preekaaaa) July 11, 2025Janhvi and Shiku at #Wimbledon pic.twitter.com/a5ejBasqmx— Radha (@JanhviSupremacy) July 11, 2025 -
లవర్తో దిగిన ఫోటోలు భర్త ఫోన్లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్కు ఏ రూట్లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్లో లవర్తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది. -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. తిరిగి బ్యాటింగ్కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చేందుకు పంత్ ప్యాడ్స్ కట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా తొలి రోజు ఆట సందర్భంగా బుమ్రా బౌలింగ్లో పంత్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అతడి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు.నెట్స్లో ప్రాక్టీస్ చేసిన పంత్..అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిషబ్ పంత్.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ పర్యవేక్షణలో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్బంగా అతడు కాస్త ఆసౌక్యర్యంగా కన్పించాడు.ఇంకా అతడికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి తగ్గనట్లు తెలుస్తోంది. అయినప్పటికి జట్టు అవసరం దృష్ట్యా అతడు బ్యాటింగ్కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ పార్టీలోకి? ఆయనేమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరుతున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేసిన రాజాసింగ్.. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.కాగా, రాజీనామాపై మరోసారి స్పందించిన రాజాసింగ్.. పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదన్నారు. హిందుత్వ భావజాలంతో ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలోకి చేరానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. -
హనుమాన్ లాంటి మరో సినిమా.. టీజర్ రిలీజ్
రవి కిరణ్ హీరోగా నటించిన మైథలాజికల్ చిత్రం 'గదాధారి హనుమాన్’. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర ముఖ్య అతిథులుగా టీజర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ .. 'హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించా. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హనుమాన్ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు. టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ టైటిల్ చాలా బాగుంది. ఈ టైటిల్ను పెట్టుకుని సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా? పెద్దదా? అన్న తేడాని ఆడియెన్స్ చూడటం లేదు. రవి కిరణ్ ఈ మూవీతో సూపర్ స్టార్ అవుతారనిపిస్తోంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశా. బసవ సర్తో ఈ జర్నీ ప్రారంభమైంది. అప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్తో మూవీ అనుకున్నాం. కానీ రవి జాయిన్ కావడంతో స్పాన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారని' తెలిపారుహీరో రవి కిరణ్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన రాజ్ కందుకూరికి థాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్, రేణుకా ప్రసాద్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నా. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. -
జో రూట్ ప్రపంచ రికార్డు..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు అందుకున్న ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.భారత తొలి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ క్యాచ్ను తీసుకున్న తర్వాత ఈ ఫీట్ను రూట్ సాధించాడు. సెకెండ్ స్లిప్లో రూట్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. రూట్ ఇప్పటివరకు ఔట్ ఫీల్డ్లో 211 క్యాచ్లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(210) పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో ద్రవిడ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అటు బ్యాటింగ్లోనూ రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీతో రూట్(104) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు అందుకున్న ప్లేయర్లు వీరే..211*జో రూట్210 రాహుల్ ద్రావిడ్205 మహేల జయవర్ధనే200 స్టీవెన్ స్మిత్200 జాక్వెస్ కాలిస్196 రికీ పాంటింగ్ -
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం.. హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు అని పేర్కొంది.అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది.. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకట్రావువు నియామకం తగదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదని.. ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది. -
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపంతో వణికింది. ఎన్సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.7గా నమోదైంది. కాగా, నిన్న(గురువారం) కూడా భూకంపంతో వణికిన హస్తిన.. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రత నమోదయ్యింది. హరియాణాలోని ఝాజ్జర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైందని జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం ప్రకటించింది.ఢిల్లీ–ఎన్సీఆర్, హరియాణాతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోనూ భూమి కంపించింది. భూప్రకంపనలతో హస్తినవాసులు వణికిపోయారు. గురువారం ఉదయం 9 గంటల నాలుగు నిమిషాలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ఢిల్లీలో కొందరు స్థానికులు ప్రాణభయంతో భవనాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. -
నాలుగేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే భారత్కు షాకిచ్చాడు
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్.. తన వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తాచాటాడు. లార్డ్స్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్కు ఆదిరిపోయే ఆరంభాన్ని ఆర్చర్ అందించాడు.తొలి ఇన్నింగ్స్లో తన వేసిన మొదటి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(13)ను ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఆర్చర్.. మూడో బంతిని జైశ్వాల్కు 145 కి.మీ వేగంతో సీమ్ ఆప్ డెలివరీగా సంధించాడు.ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని జైశ్వాల్ బ్యాక్ ఫుట్ నుంచి లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్లో ఉన్న హ్యారీ బ్రూక్ చేతికి వెళ్లింది. దీంతో 1596 రోజుల తర్వాత అతడి ఖాతాలో తొలి టెస్టు వికెట్ చేరింది.ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఏడాది క్రితం వైట్బాల్ జట్టులోకి వచ్చినప్పటికి.. టెస్టుల్లో మాత్రం ఆడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి.ఇంగ్లండ్ స్కోరంతంటే?తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.Pace is pace man, Jaiswal had no reply to Jofra Archer.He is making a comeback after long 4 years & bowled as if he never gone anywhere. True cricket fans missed 4 years of peak Archer, god please bless him now for next few years❤️🧿pic.twitter.com/aSrOEdqe2B— Rajiv (@Rajiv1841) July 11, 2025 -
ఆ తెలుగు సినిమా నా జీవితాన్ని మార్చేసింది: శృతిహాసన్
కోలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మోనికా అంటూ సాంగే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ పూజా హేగ్డే తన డ్యాన్స్త అదరగొట్టేసింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న కూలీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటించారు.అయితే ఇటీవల సోషల్ మీడియాకు గుడ్బై చెప్పిన శృతిహాసన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తనకు లైఫ్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీనే అని తెలిపింది.తెలుగులో గబ్బర్ సింగ్ సినిమా తన జీవితాన్నే మార్చిందని చెప్పుకొచ్చింది. కోలీవుడ్ తర్వాత నాకు సక్సెస్ ఇచ్చిందంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమేనని వెల్లడించింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ సార్ పట్టుబట్టి మరి ఆ రోల్ ఇచ్చారని గుర్తు చేసుకుంది. మా నాన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చానని శృతిహాసన్ తెలిపింది. -
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
నెలకు రెంట్ల రూపంలో రూ. 15 నుంచి 17 లక్షల వరకూ ఆదాయం. ఒక లగ్జరీ ఫామ్ హౌస్. ఇంకా పలు రకాలైన ఆస్తులు. విలాసవంతమైన జీవితం. ఆ ఊరిలో శ్రీమంతుడు అనే హోదా. పెద్ద మనిషి అని ఊరి వాళ్లు తగిలించిన బిరుదు. చేతికి ఒక లైసెన్స్డ్ రివాల్వర్. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనిషి అంటే కాసింతైనా ఇలా బ్రతకాలనిపిస్తుంది కదూ. ఇక్కడ ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి.. సిరి సంపదలతో విలాసవంతమైన జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. దాంతో పాటు కాస్త అహంకారం, మూర్ఖత్వం కూడా ఉన్నట్లు ఉంది. అదే ఇప్పుడు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అహంకారానికి పోయి కూతురి ప్రాణాల్ని తీసి జైలు పాలయ్యాడు. కారణాలు ఏమైనా మూర్ఖత్వానికి పోయి ఎంతో గారాబంగా చూసుకున్న కూతుర్ని చంపడం ఒకటైతే, ప్యాలెస్ లాంటి భవనంలో బ్రతికిన ఆ వ్యక్తి ఇప్పుడు కఠిన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. 49 ఏళ్ల దీపక్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు కన్న కూతురి హత్య కేసులో ఒక్కసారిగా ‘విలన్’ అయిపోయాడు. ఇన్ స్టా రీల్స్ చేసిందని కూతుర్ని చంపేశాడు..!హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సుశాంక్లో ఫేజ్-2లో నివాసముంటున్న దీపక్ యాదవ్.. టెన్నిస్ ప్లేయర్ అయిన కూతురు రాధికా యాదవ్ను హత్య చేశాడు. తన లైసెన్స్డ్ రివాల్సర్తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కూతురి ప్రాణాలు తీశాడు. కూతురు భవిష్యత్ మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూతురు తనకు నచ్చని సోషల్ మీడియా వీడియో ఒకటి చేసిందని, అందుకే చంపేశానని దీపక్ యాదవ్ అంటున్నాడు. తనకు వద్దని చెప్పినా వినలేదని, ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగి హత్య చేసే వరకూ వెళ్లిందని దీపక్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు జరుగుతుండగా, అసలు ఏం జరిగిందనే దానిపై మీడియా ఆరా తీసింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా అసలు హత్యకు ఈ కారణాలు కాకపోవచ్చనేది ఆ కుటుంబంతో పరిచయమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.కూతురంటే అత్యంత గారం..ఈ ఘటనపై దీపక్ సొంత గ్రామం వాజిరాబాద్లో అతనితో పరిచయమున్న ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. అసలు కూతుర్ని చంపాల్సిన అవసరం దీపక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అతనికి ఆస్తు-పాస్తులు అన్నీ ఉన్నాయి. విలాసవంతమైన జీవితం అతనిది. కూతురంటే అత్యంత గారం. కూతురు టెన్నిస్ ప్లేయర్ అవ్వడం కోసం రూ. 2 లక్షల పెట్టి రాకెట్ తీసుకొచ్చాడు. కూతురు ఈ హోదాకు రావడానికి దీపకే కారణం. కూతురు రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీ పెట్టినందుకో, ఇన్ స్టా రీల్స్ చేసినందుకో ఆమెను దీపక్ హత్య చేశాడనేది నమ్మశక్యంగా లేదు. ఇంకేదో కారణం ఉండి ఉండొచ్చు’ అని సదురు గ్రామస్తుడు తెలిపాడు.25 ఏళ్లకే టెన్నిస్ అకాడమీ..టెన్నిస్లో అంచెలంచెలుగా ఎదిగిన రాధికా యాదవ్.. ప్రస్తుతం అంతర్జాతీయ డబుల్స్ ర్యాంకింగ్స్లో 113వ స్థానంలో ఉంది. ఎన్నో పోటీలు ట్రోఫీలు గెలిచి తనకంటూ ఏర్పరుచుకున్న రాధిక.. 25 ఏళ్ల వయసులోనే టెన్నిస్ అకాడమీ కూడా ప్రారంభించింది. ఇందులో ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తుంది రాధికా. గురుగ్రామ్ సెక్టార్ 57లో ఒక టెన్నిస్ ఇన్స్టిట్యూట్ను రాధికా యాదవ్ రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. టెన్నిస్ ప్లేయర్ను.. హత్య చేసిన తండ్రి! -
అతడి పని పట్టాలంటే బుమ్రా తర్వాతే ఎవరైనా!.. మైండ్ బ్లాంక్ అయ్యేలా!
ఇంగ్లండ్తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన పేస్ పదునుతో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ (Lord's)మైదానంలో తన తొలి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. కాగా లార్డ్స్ టెస్టులో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (11)ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ఆది నుంచే తన ప్రతాపం చూపించాడు.తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (44)ను పెవిలియన్కు పంపిన బుమ్రా.. సెంచరీ వీరుడు జో రూట్ (104)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. అనంతరం ఈ రైటార్మ్ పేసర్.. క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పదిహేనోసారికాగా టెస్టుల్లో జో రూట్ను బుమ్రా అవుట్ చేయడం ఇది పదకొండోసారి కావడం విశేషం. అదే విధంగా.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో రూట్ను ఈ పేస్ గుర్రం వెనక్కిపంపడం పదిహేనోసారి. వన్డేల్లో మూడు, టీ20లలో రెండుసార్లు బుమ్రా ఈ పని చేశాడు. తద్వారా.. యాక్టివ్ ‘ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, స్మిత్, రూట్, విలియమ్సన్)’లో ఒకడైన రూట్ను అత్యధికసార్లు పెవిలియన్కు పంపిన తొలి బౌలర్గా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.ఈ మేరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ బౌలర్కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జో రూట్ను ఇప్పటికి 14సార్లు అవుట్ చేశాడు. టెస్టుల్లో బుమ్రాతో కలిపి 11సార్లు రూట్ను వెనక్కిపంపిన కమిన్స్.. వన్డేల్లో మూడుసార్లు అతడిని అవుట్ చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో జో రూట్ను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్లు వీరే🏏జస్ప్రీత్ బుమ్రా (ఇండియా)- 15 సార్లు🏏ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 14 సార్లు🏏జోష్ హాజిల్వుడ్ (ఆస్ట్రేలియా)- 13 సార్లు🏏రవీంద్ర జడేజా (ఇండియా)- 13 సార్లు🏏ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 12 సార్లు.ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ (104) సెంచరీ చేయగా.. జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ధ శతకాలతో రాణించారు.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!#JaspritBumrah gets the better of England's centurion, #JoeRoot! 🤩The momentum is well and truly in #TeamIndia's favour! 🇮🇳#ENGvIND 👉 3rd TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/mg732Jcoq5 pic.twitter.com/rrINEm6bBK— Star Sports (@StarSportsIndia) July 11, 2025 -
ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకేచోట.. సాంగ్తో రచ్చలేపారు!
రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహేశ్బాబు (Mahesh Babu) బర్త్డేను పురస్కరించుకుని అతడు మూవీ ఆగస్టు 9న మరోసారి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో ఎప్పుడెప్పుడు చూస్తామా? అని మహేశ్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కౌంట్డౌన్ కూడా మొదలుపెట్టేశారు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2005 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్త్రిష కథానాయికగా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపిన ఈ మూవీకి మూడు నంది అవార్డులు వరించాయి. ఈ సూపర్ హిట్ చిత్రం 20 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు కోటి, తమన్, మణిశర్మ ఒకే పాటకు సంగీతం వాయించారు. అతడు సినిమాలోని అవును నిజం.. నువ్వంటే నాకిష్టం సాంగ్ మ్యూజిక్ ట్రాక్ వాయించారు. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకేచోటనిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు, మూడేళ్ల కిందటిది. నా గురువులు మణిశర్మ, కోటి గార్లతో ఓ అద్భుతమైన రోజు అని గతంలో తమన్ స్వయంగా ఈ వీడియో షేర్ చేశాడు. అతడు రీరిలీజ్ నేపథ్యంలో అది మరోసారి వైరల్ అవుతోంది. మణిశర్మ దగ్గర తమన్ దాదాపు ఎనిమిదేళ్లపాటు అసిస్టెంట్గా పని చేశాడు. తనదైన స్టైల్లో ట్యూన్స్ ఇస్తూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.What a blast 💥 Last Night with My dear guru’s #ManiSharma gaaru & #Koti gaaru We performed this super brilliant track !! Good to be on drums 🥁What a high Seriously 💪🏼💨 #Avnunijam From #Athadu pic.twitter.com/LFEtoxXs1v— thaman S (@MusicThaman) July 12, 2022చదవండి: ఆ రెండు సాంగ్స్ లేకుంటే కన్నప్ప మళ్లీ చూసేవాళ్లం.. అది మా బుద్ధి -
చాలా ఏళ్లు బతకాలని ఉంది.. అప్పుడే నన్ను చంపేయొద్దు: నెటిజన్లకు కరణ్ జోహార్ కౌంటర్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలే ట్రైటర్స్ పేరుతో ఓ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో బిగ్బాస్ నటి ఉర్ఫీ జావెద్తో నికితా లూథర్ విజేతగా నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం కరణ్ లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి బక్కచిక్కపోయి కనిపించడంతో అసలు ఏమైందని తెగ ఆరా తీశారు. ఇంత త్వరగా బరువు తగ్గడం ఎలా సాధ్యమంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. కేవలం ఇంజక్షన్స్ ద్వారానే ఇలాంటివి సాధ్యమని కొందరు ఆరోపించారు.ఈ నేపథ్యంలో తన వెయిట్ లాస్కు సంబంధించి వచ్చిన రూమర్స్పై మరోసారి స్పందించాడు. ధడక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన కరణ్ జోహార్ తాను బరువు తగ్గడంపై మాట్లాడారు. నెటిజన్స్ తనను ఏకంగా చంపేశారని అన్నారు. నేను చాలా ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.కరణ్ మాట్లాడుతూ..'నేను బరువు తగ్గడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను జీవితంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సవాళ్లను స్వీకరించా. నెటిజన్స్కు నేను చెప్పేది ఏంటంటే.. నా పిల్లల కోసం చాలా ఏళ్ల పాటు బతకాలనుకుంటున్నా. నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మీ అందరికీ పరిచయం చేస్తా' అని అన్నారు.నెటిజన్స్ ట్రోల్స్కాగా.. గతంలో కరణ్ జోహార్ ఓజెంపిక్ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజాగా తనపై హెల్త్పై వచ్చిన రూమర్స్పై రిప్లై ఇచ్చారు కరణ్ జోహార్. -
బాబోరు మళ్లీ ఏసేశారు..!
చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి. . పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణం.. నగరంలో ఇతరత్రా ప్రాజెక్టుల తో పాటు ఫార్మా ఇండస్ట్రీ వంటివన్నీ తానే తీసుకొచ్చానని ఎన్నో మార్లు చంద్రబాబు చెప్పారు. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి కూడా తానే స్ఫూర్తి అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు.దేశంలో నేషనల్ హైవేస్ నిర్మించాలని నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చింది కూడా తానేనని బాబు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పీవీ సింధు. పుల్లెల గోపీచంద్ వంటివారికి ప్రోత్సాహం కూడా తానే ఇచ్చానన్నారు.. దేశంలో వెయ్యి.. రెండు వేల నోట్లను రద్దు చేయాలని మోదీకి చెప్పింది కూడా తానేనన్నారు. బాబు ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నారు.. అది వేరే విషయం.ఇలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తను ఏం చెప్పినా తానా తందానా అనడానికి సొంతంగా మీడియా కూడా ఉందాయే. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతున్నాయి మాటలు అలా ముందుకు వెళుతున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలను తెచ్చిందే తెలుగుదేశం అని కూడా చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.కానీ అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఐటీ పార్క్కు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది అంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను సైతం చంద్రబాబు ఎత్తుకొచ్చారు.ప్రపంచ జనాభా తగ్గుతోందంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అంటే భారం కాదు.. జనమే ఆస్తి అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో జనాభా రేటు తగ్గుతోంది. కానీ, జనాభానే దేశాభివృద్ధికి కీలకం. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో యువత ఎక్కువ ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో బహుమతులు కూడా ఇస్తున్నారు. హంగేరిలో పెద్దకుటుంబాలకు కార్లు ఇస్తున్నారు. చైనాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు.సమైక్య రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం పని చేశాం. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని నేనే చట్టం తీసుకొచ్చా. (కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా 1994 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించింది.. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కోట్ల విజయభాస్కర్రెడ్డి సీఎంగా ఉన్నారు).ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాభా భారం కాదు.. జనమే ఆస్తి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడికు ఒక్కడే తనయుడు నారా లోకేష్. నారా లోకేష్కు ఒక్కడే కొడుకు.. దేవాన్ష్!!. మరి జనాభా పెంచండి..అని బోడి సలహాలు ఇచ్చే చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఎందుకు ఎక్కువమంది పిల్లల్ని కనమని చెప్పలేదు. ఒకే ఒక్కడిని ఎందుకు కన్నాడు..బాబు రూల్స్ పెడతారు.. పాటించరు.. ఆయన నీతులు వల్లిస్తారు.. పాటించరు.-సిమ్మాదిరప్పన్న -
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్: రోడ్ల పక్కన స్థలం ఖాళీగా ఉంది కదా అని.. జీహెచ్ఎంసీ పార్కుల ముందు పార్కింగ్ సదుపాయం ఉంది కదా..! అని ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తే జీహెచ్ఎంసీ ఇంటికే చలాన్లు పంపిస్తుంది. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, ఫట్పాత్లపై, పార్కు ల పక్కన అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తూ జారుకుంటే జీహెచ్ఎంసీ (GHMC) ఇక నుంచి చూస్తూ ఊరుకోదు. ఇందుకోసం స్మార్ట్ పార్కింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకు వస్తుంది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ పరిధి కిందికి వచ్చే ఖైరతాబాద్ సర్కిల్–17, జూబ్లీహిల్స్ సర్కిల్–18, గోషామహల్, కార్వాన్, మెహిదీపట్నం తదితర ఐదు సర్కిళ్ల పరిధిలో స్మార్ట్ పార్కింగ్లను అందుబాటులోకి తీసుకురానుంది.30 చోట్ల ఏర్పాటు ఒక్కో సర్కిల్ పరిధిలో 30 చోట్ల స్మార్ట్ పార్కింగ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సింగపూర్ సిటీ తరహా ఇక్కడ కూడా స్మార్ట్ పార్కింగ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఇందుకోసం అనుభవం ఉన్న రెండ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఈ రెండు ఏజెన్సీలు ఖైరతాబాద్లోని జోనల్ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్మార్ట్ పార్కింగ్లు ఎలా ఉండబోతున్నాయో, ఛార్జీలు ఎలా వసూలు చేస్తారో, చలానాలు ఎలా పంపిస్తారో అధికారులకు వివరించాయి.ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎస్ఈ రత్నాకర్, ఐటీ జాయింట్ కమిషనర్, ఆయా సర్కిళ్ల ఇంజినీర్లతో సమావేశమై స్మార్ట్ పార్కింగ్ వల్ల ప్రయోజనాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేట, ఎస్సార్నగర్ (SR Nagar) ప్రధాన రోడ్డులో గంటల తరబడి అక్రమ పార్కింగ్ల చేయడం వల్ల ఏర్పడుతున్న నష్టాలను చర్చించారు. ఈ జాతీయ రహదారిలో ఫుట్పాత్లతో పాటు రోడ్ల పక్కన, జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాల్లో అక్రమ పార్కింగ్లు చేయడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నట్ల గుర్తించారు.సమయాన్ని బట్టి చార్జీలు.. జీహెచ్ఎంసీ గుర్తించిన 30 స్మార్ట్ పార్కింగ్లలో వాహనాలు పార్కింగ్ చేసే వారి నుంచి గంటకు రూ.25 చొప్పున వసూలు చేస్తారు. వాహనం నెంబర్ ఆధారంగా ఇంటికే చలానా వెళ్తుంది. సదరు వాహనదారుడు ఆన్లైన్లో ఛార్జీలు చెల్లించుకోవడానికి అవకాశం కల్పించారు. సంబంధిత ఏజెన్సీలు తమకు అనుసంధానమై ఉన్న స్మార్ట్ పార్కింగ్ యాప్ ద్వారా ఏ వాహనం ఎక్కడ పార్కింగ్ చేసి ఉందో గుర్తించి సమయాన్ని బట్టి ఛార్జీలు పంపిస్తారు. స్మార్ట్ పార్కింగ్స్లో సోలార్ ప్యానెళ్ల ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జీంగ్ పాయింట్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. సీసీ కెమెరాలు (CC Cameras) కూడా ఏర్పాటు చేస్తారు.చదవండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా? అక్రమంగా పార్కింగ్ చేసిన వారికి ఆన్లైన్లో చలానాలు పంపించనున్నారు. కొన్నిచోట్ల రోడ్ల పక్కన ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాల్లో కూడా జీహెచ్ఎంసీ అద్దెకు తీసుకుని స్మార్ట్ పార్కింగ్ను ఏర్పాటు చేయనుంది. వసూలు చేసిన ఛార్జీల్లోనే ప్రైవేటు వ్యక్తులకు అద్దెలు చెల్లిస్తారు. ఒక వాహనం ఏ సమయం నుంచి ఏ సమయం దాకా పార్కింగ్ చేశారో ఏఐ ద్వారా తెలుసుకోనున్నారు. సదరు ఏజెన్సీలే ఈ పార్కింగ్ను నిర్వహించనున్నాయి. -
జీన్ ప్యాంటు బుల్లెమ్మ మీనాక్షి.. పచ్చబొట్టుతో నిహారిక
జీన్ డ్రస్సుతో రచ్చ లేపుతున్న మీనాక్షి చౌదరివీపుపై పచ్చబొట్టుతో మరింత అందంగా నిహారికబీచ్లో తల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుప్రీతసన్ కిస్ ఫొటోలు పోస్ట్ చేసిన వైష్ణవి చైతన్యఇంటికి పెయింట్ వేసుకున్న 'పుష్ప' ఫేమ్ పావనియూకేలో అందాల జాతర చేస్తున్న పూజిత పొన్నాడవింటేజ్ లుక్స్తో ఆకాంక్ష క్లాస్ ఫొటోషూట్ View this post on Instagram Shared post on Timeporn stars free porn.boxes3{height:175px;width:153px;} #n img{max-height:none!important;max-width:none!important;background:none!important} #inst i{max-height:none!important;max-width:none!important;background:none!important} View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) -
5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు.నిప్పులు చెరిగిన బుమ్రా..రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పులు చెరిగాడు. బుమ్రా ఆరంభంలోనే బెన్ స్టోక్స్, రూట్, వోక్స్ను ఔట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను కార్స్, స్మిత్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని సిరాజ్ బ్రేక్ చేశాడు. అనంతరం ఆర్చర్ను ఔట్ చేసిన బుమ్రా.. లార్డ్స్లో తొలి ఫైవ్ వికెట్ల హాల్ను నమోదు చేశాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజాకు ఒక్క వికెట్ దక్కింది.చదవండి: IND vs ENG: బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్ -
నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు నెక్స్ట్ ఏం మూవీ చేస్తాడా అని ఇప్పటినుంచే కొన్నిపేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో తమిళ దర్శకుడు మిత్రన్ పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్లపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్-నాగచైతన్య కాంబినేషన్లో ఓ స్పై డ్రామా సినిమా తీసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్ నుంచి సమాచారం వచ్చింది. అయితే చైతూ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం అలాంటివే లేవని తెలుస్తోంది. తమిళంలో 'ఇరంబుదురై' (తెలుగులో 'అభిమన్యుడు'), 'సర్దార్' లాంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్ మిత్రన్. ఒకవేళ ఈయనతో చైతూ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. మరి భవిష్యత్తులో కాంబో సెట్ అవుతుందేమో చూడాలి. -
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.మంగళవారం జరిగిన ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. -
అంపైర్పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మరోసారి అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పదే పదే ఇలా చేయడం సరికాదంటూ ఫీల్డ్ అంపైర్ వ్యవహారశైలిని విమర్శించాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య లార్డ్స్ వేదికగా గురువారం (జూలై 10) మూడో టెస్టు మొదలైంది.ఆదిలోనే షాకులుటాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగి.. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ క్రమంలో 251/1 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్కు ఆదిలోనే షాకులు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లు కూల్చి బ్రేక్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 91వ ఓవర్ మధ్యలో కొత్త బంతి కావాలని టీమిండియా అడిగింది. 10.4 ఓవర్ల తర్వాత బంతిని మార్చాలని కోరగా.. అంపైర్ నుంచి వెంటనే సానుకూల స్పందన రాలేదు. అయితే, హూప్ టెస్టులో బంతి ఫెయిల్ కాగా.. అంపైర్ కొత్త బంతి ఇచ్చాడు. అయితే, అది చూసిన గిల్.. పాత బంతితో దీనికి ఏమాత్రం పోలిక లేదంటూ అంపైర్పై అసహనం వ్యక్తం చేశాడు.పాతబడిన బంతిలా ఉందా? నిజమా?ఇంతలో బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా వచ్చి.. ‘‘ఇది పది ఓవర్ల తర్వాత పాతబడిన బంతిలా ఉందా? నిజమా?’’ అంటూ సెటైర్ వేశాడు. అతడి మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఏదేమైనా అంపైర్ ఇచ్చిన కొత్త బంతితో గిల్, సిరాజ్ అసంతృప్తి చెందినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు ఈ నేపథ్యంలో అంపైర్ తీరును విమర్శిస్తూ టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘ఇక్కడ కూర్చుని చూసినా.. అది పది ఓవర్లు పాత బడిన బంతిలా కాదు.. 20 ఓవర్లకు పైనే వాడిన బంతిలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే ఇండియాలో జరిగి ఉంటేనా.. బ్రిటిష్ మీడియా ఎంతలా గంతులు వేసేదో’’ అంటూ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా లీడ్స్లో జరిగిన తొలి టెస్టులోనూ గిల్, పంత్ బంతిని మార్చే విషయంలో అంపైర్లతో గొడవపడిన విషయం తెలిసిందే. ఇక లార్డ్స్ మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం ఆటలో భాగంగా 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.చదవండి: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్Shubman Gill got angry on the field looking like Ricky Ponting is back 🥶⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/lsmX5AYZU7— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025 -
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రాహుల్ విడిచిపెట్టాడు.87 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. మూడో బంతిని స్మిత్కు బ్యాక్ ఆఫ్ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఆ స్దానంలో రాహుల్ తన భుజం ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చూసిన సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.రాహుల్ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 5 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. ఏకంగా 51 పరుగులు చేసి జట్టు స్కోర్ 350 రన్స్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.బ్రాడైన్ కార్స్తో కలిసి ఎనిమిదో వికెట్కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ ఆ క్యాచ్ను పట్టి ఉంటే ఈపాటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసి ఉండేది. అయితే యాదృచ్ఛికంగా స్మిత్ తిరిగి సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(104) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs ENG: జో రూట్ ప్రపంచ రికార్డు.. -
'కూలీ' నుంచి మోనికా.. స్పెషల్ సాంగ్ రిలీజ్
సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్ఫుల్గానే ఉంది.(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం.. నన్ను వేస్ట్ చేశాడు: సంజయ్ దత్)ఈ పాటని వైజాగ్ పోర్ట్లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న 'కూలీ'లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ) -
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రకటించినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. టీజర్ విడుదలైనప్పుడు వచ్చిన విమర్శలకైతే లెక్కే లేదు. కానీ ఆ వెంటనే రిలీజ్ చేసిన పాటతో ట్రోలింగ్ అంతా మట్టికొట్టుకుపోయింది. ట్రైలర్ కూడా బాగుండటంతో నెగెటివిటీ కాస్తా పాజిటివిటీగా మారిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధువులతో సినిమా చూసిన మోహన్బాబుకన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ కన్నప్ప సినిమాను జూలై 8న విజయవాడలో ప్రదర్శించారు. అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్బాబు సినిమా చూశారు.కొంచెం మసాలా పెట్టినప్పటికీ..అనంతరం స్వామీ సదానందగిరి మాట్లాడుతూ.. ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడో లవకుశ, శంకరాభరణం చూశాం. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశాం. భక్త కన్నప్ప, అర్జునుడి గురించి మాకు తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కన్నప్ప సినిమా తీశారు. ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ.. నిజమైన భక్తిని దర్శకుడు, రచయిత అద్భుతంగా చూపించారు.ఆ పాటల వల్లే..సన్యాసులమైన మాకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించింది. ఆ రెండు పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లం. అది మా సన్యాసి బుద్ధి. అయితే ఆ పాటల్లోనూ ఎటువంటి అసభ్యత లేదు. ఆ కాలపు నాగరికత ఆధారంగానే తీశారు అని పేర్కొన్నారు. ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి.చదవండి: ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి -
నన్ను వేస్ట్ చేశాడు.. లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజినీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేశ్పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేశ్ కనగరాజ్.. 'మా నగరం' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ఖైదీ'తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్తో 'లియో' సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో సంజయ్ దత్ మాట్లాడాడు.'కేడీ ద డెవిల్' అనే సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్.. 'రజినీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజినీ సర్తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్తోనూ 'లియో' చేశా. అయితే లోకేశ్పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు(నవ్వుతూ)' అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)"I worked with #VijayThalapthy & I loved it. I'm angry with #LokeshKanagaraj, because he didn't give me a big role in #LEO. He wasted me.- #SanjayDutt pic.twitter.com/zzPaeqfEub— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2025 -
TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసిన సర్కార్.. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. -
‘మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ ఏమయ్యారు?
విశాఖ: కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యంత అమానుష ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇది ఏపీలో జరిగిన కీచక పర్వమని మండిపడ్డారు. ల్యాబ్ అసిస్టెంట్ కల్యాణ్ చక్రవర్తి.. మహిళల శరీర ఫోటోలు తీసి పంపడం అత్యంత దారుణమన్నారు. దీన్ని అడ్డం పెట్టకని నెలరోజులక పైగావారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు సైత పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం(జూలై 11) ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తేవకపోతే కనుమరుగు అయ్యేది. మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?, 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 50 మంది మహిళలను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గాలు హోమ్ మంత్రి అనిత కంటికి కనిపించవా?, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలక ప్రభుత్వం వాడుకుంటుంది’ అని విమర్శించారు.నలుగురు సస్పెన్షన్ కాకినాడ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ఘటనలో నలుగుర్ని సస్పెండ్ చేశారు. వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను సస్పెండ్ చేశారు. ఈ నలుగురిపై కేసు నమోద చేసి దర్యాప్త చేపట్టారు పోలీసులు. -
‘వర్జిన్ బాయ్స్’ రివ్యూ
బిగ్బాస్ ఫేం మిత్ర శర్మ శ్రీహాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం వర్జిన్ బాయ్స్. గేమ్ ఆన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గీత్ ఆనంద్, జెనీఫర్ ఇమాన్యుయల్, వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాని గేమ్ ఆన్ డైరెక్టర్ దయానంద్ డైరెక్ట్ చేశాడు. రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫైనల్లీ నేడు(జులై 11) ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..డూండీ (శ్రీహాన్), ఆర్య (గీత ఆనంద్), రోని(రోనిత్ రెడ్డి) ఒక యూనివర్సిటీలో కలిసి చదువుకుంటూ ఉంటారు. ఎలా అయినా వర్జినిటీ కోల్పోవాలని తహతహలాడుతున్న వీరికి వీరి ఫ్రెండ్ (కౌశల్) ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తాను మళ్ళీ అమెరికా వెళ్లి వచ్చేటప్పటికి మీరంతా వర్జినిటీ కోల్పోవాలని ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా వర్జినిటీ కోల్పోవాలని ఉద్దేశంతో శ్రీహాన్ జెనీఫర్ ను, గీత్ ఆనంద్ మిత్ర శర్మను, రోనిత్ రెడ్డి అన్షులా ధావన్ను ప్రేమిస్తారు. వర్జినిటీ కోల్పోవడానికి వీరితో ప్రేమలో పడిన ముగ్గురు వర్జినిటీ కోల్పోయారా? ఛాలెంజ్లో గెలిచారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందేఎలా ఉందంటేఓ ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు వర్జినిటీ కోల్పోవడానికి చేసే పోరాటమే ఈ కథ. కథలో కొత్తదనం లేదు కానీ తనదైన శైలిలో నవ్విస్తూ ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సెక్స్ ముఖ్యమని భావించి దాని వెనుకబడి తర్వాత ప్రేమ మాధుర్యాన్ని చవిచూసి, ప్రేమే గొప్పదని ఒప్పుకునే లైన్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వర్జిన్ బాయ్స్ కథ కూడాఅదే లైన్ లో రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే నేటి యూత్ ను టార్గెట్ చేసుకొని వారిని ఎంగేజ్ చేసేలా చాలా సీన్స్ రాసుకోవడంతో కొంతవరకు యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా ఓపెనింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులకు ఎక్కడా కొత్తదనం కనిపించకపోయినా కొన్నిచోట బోల్డ్ జోక్స్, అమ్మాయిల అందాలతో కనివిందు చేస్తూ చాలావరకు సినిమా నడిపించే ప్రయత్నం చేశారుఒక ముగ్గురు యువకులు నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది.ఆ తర్వాత ఈ ముగ్గురి క్యారెక్టర్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనం సాగుతుంది. అమ్మాయిల చేతిని తాకితేనే ఎంతో అదృష్టం అని భావించే ముగ్గురు యువకులు న్యూ ఇయర్ రోజుకి వర్జినిటీ కోల్పోవాలని లక్ష్యంతో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడటం, వారితో ప్రేమ కయ్యాలు ఇలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్లో ఏదో ట్విస్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఇస్తారు కానీ అదేమీ ఉండదు, సెకండాఫ్ మొదలయ్యాక వీరి ప్రేమ మీద అనుమానాలు తర్వాత మళ్లీ కలిసేందుకు ప్రయత్నాలు అంటూ రొటీన్ గానే సాగుతుంది చివరలో ఒక మంచి మెసేజ్ తో సినిమాని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు.ఎవరు ఎలా చేశారంటే.. ఈ సినిమాలో శ్రీహాన్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే మన కాలేజీలలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులను మనం చూసే ఉంటాం. ఈ పాత్రలో శ్రీహాన్ ఒదిగిపోయాడు.తర్వాత కొంతవరకు గీత్ ఆనంద్ పాత్ర కన్వెన్సింగ్ గా ఉంటుంది. మిత్ర శర్మ పద్ధతి అయిన అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. జెనీఫర్ అన్షుల ఒకపక్క అందాలు ఆరబోస్తూనే అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్ర పరిధి మేరకు పరవాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది సంగీతం పర్వాలేదు నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఎడిటింగ్ సినిమాకి సరిపోయేలా కట్ చేశారు.రేటింగ్: 2.75/5 -
అమెజాన్లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.అమెజాన్ లానే 1000 సైట్లుమెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ల లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.కొన్ని జాగ్రత్తలుసురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్ చేయండిమీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి. -
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
పవర్ షేరింగ్ ఏమీ లేదు: మల్లు భట్టి విక్రమార్క
ఢిల్లీ : బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అదే సమయంలో జనాల్లోకి కూడా వెళ్లడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజ(శక్రవారం, జూలై 11వ తేదీ) ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న మల్లు.. తమ ప్రభుత్వంలో అంతా కలిసికట్టగా పనిచేస్తన్నారని, ఇక్కడ పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని మల్లు తెలిపారు. అందరం కలిసి టీమ్ వర్క్గా పనిచేస్తన్నామన్నారు.‘రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది విధాన నిర్ణయం. రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణ మాఫీ. సన్నం బియ్యం సక్సెస్ అయ్యింది. మహిళలకు ఉచిత బస్సుకు మంచి స్పందన ఉంది. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయి. మూసి సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుంది.రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు. సిగాచి ప్రమాదం పై విచారణ కు ఆదేశించాము. ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే,కేసి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉంది’ అని మల్లు తెలిపారు. -
బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్లో అత్యత్తుమ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ప్రత్యర్ధి గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అతడు మరోసారి తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు.లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను బుమ్రా ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. స్టోక్స్ను అద్బుతమైన బంతితో జస్ప్రీత్ క్లీన్ బౌల్డ్ చేశాడు.స్టోక్స్ మైండ్ బ్లాంక్..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 86 ఓవర్ వేసిన బుమ్రా.. రెండో బంతిని రౌండ్ది వికెట్ నుంచి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్స్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఔట్ సైడ్ ఆఫ్ దిశగా పడిన బంతి కొంచెం స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్ను గిరాటేసింది.దీంతో ఒక్కసారిగా స్టోక్స్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి రోజు ఆటలో కూడా ఇదే తరహాలో హ్యారీ బ్రూక్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టోక్స్ను ఔట్ చేసిన అనంతరం జో రూట్(104), క్రిస్ వోక్స్ను పెవిలియన్కు పంపాడు. మొత్తంగా ఇప్పటివరకు బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు.లంచ్ బ్రేక్కు భారత స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. క్రీజులో జేమీ స్మిత్(51), బ్రాడైన్ కార్స్(33) ఉన్నారు.Jasprit Bumrah takes three big wickets Root, Stokes & Woakes in just 7 balls.He flipped the match in a single spell.⁰Game-changer. Match-winner. Jasprit Bumrah 🐐⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/Wq19z1glb5— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025 -
భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ మలేషియాలోని ఒక భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. ఆశీర్వాదం నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, అనుచితంగా తాకాడని ఆరోపించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన గత నెలలో మలేషియాలోని సెపాంగ్లోని మరియమ్మన్ ఆలయంలో జరిగింది. దీంతో నెట్టింట ఎవరీమె అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ లిషల్లిని కనారన్ తెలుసుకుందామాం.లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేతగా నిలిచింది. ఆమె టీవీ నటి, మోడల్. మలేషియాలోని సెలంగోర్కు చెందిన లిషల్లిని యూనివర్సిటీ తుంకు అబ్దుల్ రెహమాన్ (UTAR)లో ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాలేజీ విద్యార్థినిగా ఉన్నపుడే మిస్ గ్రాండ్ సెలంగోర్ 2020 టైటిల్ గెలుచుకుందిట. ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత, లిషా పేదరికం , పిల్లల విద్య కోసం పనిచేయాలని భావించింది. అలాగే 2023లో విడుదలైన మలేషియా టీవీ సిరీస్ జీయుమ్ నీయుమ్లో కనిపించింది. స్థానిక ప్లాట్ఫామ్ ఆస్ట్రో విన్మీన్లో ప్రసారం అవుతున్న థిగిల్ అనే వెబ్ షోలో కనిపించింది. లిషల్లినికి ఇన్స్టాగ్రామ్లో దాదాపు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారుపూజారిపై ఆమె ఆరోపణలు తన తల్లి ఇండియాలో ఉండటంతో జూన్ 21న సెపాంగ్లోని మరియమ్మన్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని లిషల్లిని చెప్పింది. ఆలయ ఆచారాలు తనకు తెలియకపోవడంతో, తాను పూర్తిగా పూజారిని నమ్మినట్టు పేర్కొంది. "నేను వీటన్నింటికీ కొత్త. ఆచారాల గురించి పెద్దగా తెలియదు తన వేధింపుల పర్వాన్ని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. "ఆ రోజు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆశీర్వాదం కోసం తన ప్రైవేట్ రూంకు పిలిచిన పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం, రక్షణ దారం అంటూ నీటిని తనపై పోశాడని వెల్లడించింది. తనను బట్టలు విప్పమని చెప్పాడని, పైగా తన మంచి కోసమే ఇదంతా చేస్తున్నాఅన్నాడని ఆమె చెప్పింది. అంతేకాదు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించినందుకు పూజారి తనను దూషించాడని కూడా వెల్లడించింది. దీంతో తాను స్తంభించి పోయాననీ, ఏం జరుగుతుందో అర్థం కాలేదని వాపోయింది. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వెల్లడించింది. మరోవైపు నిందితుడు పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) చిన్నవయసులోనే అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- పంకజ్ కపూర్ విడిపోయారు. తర్వాత పంకజ్.. నటి సుప్రియ పాఠక్ను 1988లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు రుహాన్, కూతురు సనా సంతానం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది సుప్రియ పాఠక్ (Supriya Pathak). ఆమె మాట్లాడుతూ.. అతడు నా కొడుకు. తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో మా మధ్య కూడా అదే ఆత్మీయత ఉంటుంది.నటి సుప్రియ పాఠక్ ఫ్యామిలీతో షాహిద్షాహిద్ నా కొడుకే..షాహిద్కు ఆరేళ్లున్నప్పుడు అతడిని కలిశాను. కన్నతల్లిని కాకపోయినా అతడు నా కొడుకే అనిపిస్తుంది. రుహాన్, సనాతో పాటు షాహిద్ కూడా నా పిల్లలే అని భావిస్తాను. ఈ ముగ్గురితోనూ ప్రేమగా ఉంటాను, పోట్లాడతాను, ఫ్రెండ్లా ఉంటాను అని చెప్పుకొచ్చింది. షాహిద్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇష్క్ విష్క్ చిత్రంతో హీరోగా మారాడు. సినిమా36 చైనా టౌన్, చుప్చుప్కే, జబ్ వి మెట్, ఆర్.. రాజ్కుమార్, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి చిత్రాలతో అలరించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్లో యాక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఫర్జి వెబ్ సిరీస్లోనూ మెప్పించాడు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా చిత్రంతో మరోసారి హిట్టందుకున్నాడు. చివరగా షాహిద్ నటించిన దేవా మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.చదవండి: మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా -
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఫరీద్ పేట సమీపంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపీని కర్రలు, రాళ్లతో కొట్టి దుండగులు హత్య చేశారు.పట్టపగలు నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ గుండాలే హత్య చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తారు గోపీ వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దండగులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. -
IND vs ENG 3rd Test: జేమీ స్మిత్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ (Jamie Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో మూడో టెస్టు సందర్భంగా లార్డ్స్ (Lord's Test)లో జేమీ స్మిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు.సర్రేకు చెందిన జేమీ స్మిత్.. గతేడాది వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియాతో సిరీస్లో మాత్రం 24 ఏళ్ల జేమీ స్మిత్ దుమ్ములేపుతున్నాడు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో 40, 44* పరుగులు చేసిన జేమీ స్మిత్.. రెండో టెస్టులో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.భారీ అజేయ శతకంతొలి ఇన్నింగ్స్లో భారీ అజేయ శతకం (184)తో మెరిసి ఇంగ్లండ్ ఓటమి వాయిదా పడేలా చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అద్భుత అర్ధ శతకం (88) బాదినా.. పరాజయం నుంచి జట్టును తప్పించలేకపోయాడు.ఇక తాజాగా లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కుకు చేరుకున్నాడు జేమీ స్మిత్. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఫోర్ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం స్మిత్ ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ జారవిడిచాడు. ఫలితంగా లైఫ్ పొందిన జేమీ స్మిత్.. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.వరల్డ్ రికార్డుకాగా తక్కువ ఇన్నింగ్స్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జేమీ స్మిత్ ఈ సందర్భంగా సమం చేశాడు. అదే విధంగా.. అతి తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్గా వరల్డ్ రికార్డు సాధించాడు.తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు🏏క్వింటన్ డి కాక్, జేమీ స్మిత్- 21 ఇన్నింగ్స్లో🏏దినేశ్ చండిమాల్, జానీ బెయిర్స్టో- 22 ఇన్నింగ్స్లో🏏కుమార్ సంగక్కర, ఏబీ డివిలియర్స్- 23 ఇన్నింగ్స్లో🏏జెఫ్ డుజోన్- 24 ఇన్నింగ్స్లోతక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్లు🏏జేమీ స్మిత్ (ఇంగ్లండ్)- 1303 బంతుల్లోనే🏏సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్)- 1311 బంతుల్లో🏏ఆడం గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 1330 బంతుల్లో🏏నిరోషన్ డిక్విల్లా (శ్రీలంక)- 1367 బంతుల్లో🏏క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా)- 1375 బంతుల్లో.👉ఇదిలా ఉంటే.. టీమిండియా మూడో టెస్టులో భాగంగా శుక్రవారం నాటి రెండో ఆటలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 105 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్గానూ గిల్? -
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చదవండి!
దూర ప్రయాణాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. శుభకార్యాలు, పండగలు, పనుల నిమిత్తం ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు సాధారణంగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటాం. అయితే ట్రైన్ జర్నీ చేయాలంటే ముందుగా టికెట్ రిజర్వు చేసుకోవాలి. పండగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్లో రైలు టికెట్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో వెయిటింగ్ లిస్టులు చాంతాడంత పేరుకుపోయి ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే వెయిటింగ్ లిస్ట్లోని వారికి ప్రాధాన్యతా క్రమంలో టికెట్ దొరుకుతుంది. ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్లోని టికెట్ కన్ఫామ్ కాకపోయినా డబ్బులు తిరిగి చెల్లిస్తుంది రైల్వే శాఖ. నిబంధనల మేరకు కొంత మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మాత్రమే ప్రయాణికులకు రిఫండ్ చేస్తుంది. టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వేకు భారీగానే ఆదాయం వస్తోందని తాజాగా వెల్లడైంది.టికెట్ల రద్దు.. పెద్ద పద్దే!సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. టికెట్ క్యాన్సిలేషన్స్ (ticket cancellations) ద్వారా గత నాలుగున్నరేళ్లలో దాదాపు రూ. 700 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. దక్షిణమధ్య రైల్వే వార్షిక ఆదాయంలో ఇది 3.5 శాతం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ వివరాలు రాబట్టింది. ప్రయాణికుల ద్వారా 2024-25లో దక్షిణమధ్య రైల్వేకు వచ్చిన ఆదాయం రూ. 5,710 కోట్లు. 2024లో 1.4 కోట్ల టికెట్లు క్యాన్సిల్ కాగా, ఇందులో 65 లక్షలు వెయిటింగ్లిస్ట్లోనివే. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెయిటింగ్లిస్ట్ ప్రయాణికుల సంఖ్య గత 4 ఏళ్లలో నాలుగింతలు పెరగడం గమనార్హం. 2021లో 15.96 లక్షల టికెట్లు క్యాన్సిల్ కాగా, 2024లో ఈ సంఖ్య 65.62 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు 31.52 లక్షల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. రిఫండ్ ఎంత?రైల్వే నిబంధనల ప్రకారం.. కన్ఫామైన టిక్కెట్ను.. ప్రయాణానికి 12 నుంచి 48 గంటల ముందు రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగతా మొత్తం జమ అవుతుంది. ప్రయాణానికి 4 నుంచి 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే సగం మొత్తం మాత్రమే రిఫండ్ వస్తుంది. వెయిటింగ్లిస్ట్లోని టికెట్ కన్ఫామ్ కాకుంటే క్లరికల్ చార్జి కింద రూ. 60 తీసుకుని మిగతా మొత్తం తిరిగిచ్చేస్తారు.'రద్దు'డే రుద్దుడు!కాగా, రైల్వే శాఖ క్యాన్సిలేషన్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. కన్ఫార్మడ్ టికెట్ బుక్ చేసినప్పుడు నామినల్ చార్జీలు తీసుకుంటున్నారని, మరి వెయిటింగ్లిస్ట్లోని టికెట్ కన్ఫామ్ కాకపోయినా క్లరికల్ చార్జి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకేసారి ఎక్కువ టికెట్లు తీసుకోకుండా ఉండేందుకే క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. తమ జోన్ వార్షికాదాయంలో క్యాన్సిలేషన్ చార్జీల ద్వారా వచ్చే మొత్తం చాలా స్వల్పమని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.చదవండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా?2024-25లో దక్షిణమధ్య రైల్వే ఆదాయ గణాంకాలుమొత్తం ఆదాయం: రూ.20,569 కోట్లుసరకు రవాణా: రూ.13,864 కోట్లుప్రయాణికులు: రూ. 5,710 కోట్లుపార్శిల్, టికెట్ చెకింగ్: రూ.513.6 కోట్లుపార్కింగ్, కేటరింగ్, యాడ్స్: 402.7 కోట్లు -
ప్రేమ వివాహం చేసుకున్నారని..
ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నడం పేరిట చితకబాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట పట్ల ఊరి పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా ఆ జంటను కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నించారు. రాయగడ జిల్లాలోని కంజమజ్హిరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలె వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి ఊరి పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరూ వరుసకు బంధువులే అయినప్పటికీ.. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నడం పేరిట హింసించిన కొందరు.. ఆపై గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ଘୃଣ୍ୟ ମାନସିକତା...ପ୍ରେମ ପାଇଁ ବଳଦ ସାଜିଲେ ପ୍ରେମୀଯୁଗଳ...ଏଭଳି ଦୃଶ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲା କଲ୍ୟାଣସିଂହପୁର ଅଞ୍ଚଳରରେ #Rayagada #Kalyansinghapur #Badakhabar #badakhabaratv #Odisha pic.twitter.com/mVr79DFarv— Bada Khabar (@badakhabarnews) July 11, 2025 -
ఎన్టీఆర్ జిల్లా: పోస్టాఫీసులో రూ.50 లక్షల గోల్మాల్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50 లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. పోస్టాఫీసులో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండడంతో ఇవాళ లేదా రేపు (శుక్ర,శని) అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. నగదు గోల్మాల్పై డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. -
పాక్ యువ నటి మృతి.. పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
పాక్ నటి హుమైరా అస్గర్ మృతి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. కరాచీలోని తన నివాసంలో హుమైరా విగతజీవిగా కనిపించింది. ఈ నెల 9న ఆమె మృతదేహన్ని ఫ్లాట్లో గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే హుమైరా పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె మరణించి దాదాపు తొమ్మిది నెలలు అయిందని అక్కడి స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదని తెలుస్తోంది.కాగా.. నటి చివరిసారిగా ఫోన్ కాల్ అక్టోబర్ 2024లో చేసిందని పోలీసులు గుర్తించారు. అదే ఆపార్ట్మెంట్లో నివసించేవారు కూడా ఆమెను చివరిసారిగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో చూశామని పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా హుమైరా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు.. చివరిసారి సెప్టెంబర్ 2024లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఈ లెక్కన ఆమె గతేడాదిలోనే మరణించినట్లు తెలుస్తోంది.మరోవైపు నటి భౌతికకాయాన్ని తీసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ పోలీసులకు తెలిపారు. చాలా రోజుల క్రితమే తనతో సంబంధాలు తెంచుకున్నామని ఆయన అన్నారు. పోలీసులు మొదట హుమైరా సోదరుడిని ఆమె ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన తండ్రితోనే మాట్లాడాలని చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో సింధ్ సంస్కృతి విభాగం హుమైరా అంత్యక్రియల ఏర్పాట్లు చేసేందుకు ముందుకొచ్చింది.హుమైరా రియాలిటీ షో తమషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015 యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. ఆమె పాకిస్తానీ చిత్రంలో మోడల్గా కనిపించింది. హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు వంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. హుమైరా చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2021లో విడుదలైంది. -
నోట్ల కట్టల బ్యాగుతో శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన(షిండే) నేత, రాష్ట్ర మంత్రి సంజయ్ షిర్సత్ డబ్బు నిండిన బ్యాగుతో కనిపిస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఈ వీడియోను ప్రతిపక్ష శివసేన(యూబీటీ)కి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం పోస్ట్ చేశారు. సంజయ్ షిర్సత్ తన బెడ్రూంలో కూర్చుని సిగరెట్ తాగుతూండగా, పక్కనే నిండా నోట్ల కట్టలున్న బ్యాగు తెరిచి ఉంది. మరో సూట్ కేస్, ఆయన పెంపుడు కుక్క కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘ఆసక్తికరమైన ఈ వీడియోను గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం ఫడ్నవీస్ చూడాలి. దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. మహారాష్ట్ర మంత్రి గురించిన చాలా విషయాలు ఈ వీడియోతో తెలుస్తాయి’అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలను సామాజిక న్యాయ శాఖ మంత్రి షిర్సత్ ఖండించారు. ఆ బ్యాగులో కనిపించేవి కరెన్సీ నోట్లు కావు..తన దుస్తులని చెప్పారు. ఇదంతా కావాలని చేసిన కుట్రగా పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో ఆయన వెల్లడించిన ఆస్తుల విలువ రూ.3.3 కోట్లు కాగా, 2024 నాటికి రూ.35 కోట్లకు పెరిగాయంటూ షిర్సాత్ చూపడంపై ఐటీ వివరణ కోరింది. ఐటీ నోటీసుకు తగు విధంగా సమాధానమిస్తానని చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్నారు. Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025 -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(jasprit bumrah) నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. రెండో రోజు ఆటలో తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను అద్బతమైన బంతితో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత జో రూట్(104), క్రిస్ వోక్స్ను పెవిలియన్కు పంపాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్లో బుమ్రాకి ఇది నాలుగో వికెట్. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. స్టోక్స్ను ఔట్ చేసిన అనంతరం ఈ ఫీట్ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్లో 47 టెస్టు వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్దేవ్ తన కెరీర్లో ఇంగ్లండ్లో 13 మ్యాచ్లు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శనతో కపిల్దేవ్ ఆల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ(48) అగ్రస్దానంలో ఉన్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితో ఇషాంత్ను బుమ్రా అధిగమిస్తాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్గానూ గిల్? -
Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. అన్ని భాషల సినిమాలు థియేటర్లకు వెళ్లి చూడలేం కాబట్టి డిజిటల్గా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అందుకు తగ్గట్లు ఓటీటీ సంస్థలు కూడా హాలీవుడ్తోపాటు విదేశీ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్ని మన ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హాలీవుడ్లో తీసిన కరాటే మూవీ సడన్గా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)చైనీస్ నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. 2010లో 'కరాటే కిడ్' అనే మూవీ చేశాడు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు దాదాపు అలాంటి కాన్సెప్ట్తోనే తీసిన మూవీ 'కరాటే కిడ్: లెజెండ్స్'. మే 30న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా విషయానికొస్తే.. ఓ చైనీస్ కుర్రాడు తల్లితో కలిసి అమెరికా వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కంగ్ ఫూని కూడా పక్కనబెట్టేస్తాడు. అయితే కాలేజీలో ఓ ఆకతాయి కుర్రాడు.. ఇతడిని ఇబ్బంది పెడతాడు. దీంతో ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో మళ్లీ కంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడంతో పాటు కరాటే నేర్చుకుంటాడు. మరి చివరకు ఏమైంది? ఆకతాయికి చైనీస్ కుర్రాడు కరాటేతో సమాధానమిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేం. కొన్నిసార్లు దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తమిళ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) విషయంలో ఇదే జరిగింది. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయన ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమాను కన్నడిగులు అడ్డుకున్నారు. కోర్టు జోక్యం చేసుకుని విడుదలకు అనుమతిచ్చినప్పటికీ థగ్ లైఫ్ రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.చెన్నైలో కేడీ టీమ్దీంతో కన్నడ థియేటర్లలో థగ్ లైఫ్ బొమ్మ పడకుండానే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై కన్నడ హీరో ధ్రువ సర్జా (Dhruva Sarja)కు ప్రశ్న ఎదురైంది. ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేడీ: ద డెవిల్. త్వరలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా తమిళ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ జర్నలిస్ట్ నుంచి హీరోకు ఊహించని ప్రశ్న ఎదురైంది.నేను పుట్టకముందు నుంచే..కన్నడ సినిమాలు తమిళంలో సులువుగా రిలీజైపోతున్నాయి. కానీ, ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని (Thug Life Movie) మాత్రం కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు తమిళ ప్రజలు.. కన్నడ చిత్రాలు కూడా కోలీవుడ్లో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటున్నారు. మరి మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని అడిగారు. అందుకు ధ్రువ సర్జా.. నేను పుట్టకముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ చిత్రాలు రిలీజయ్యాయి. ఏ ఒక్క సినిమానూ ఎవరూ ఆపలేదు. కమల్ హాసన్ సర్ చేసిన కామెంట్స్ వల్ల ఆయన సినిమాపై వ్యతిరేకత వచ్చిందంతే! మా భాషను అగౌరవపరిస్తే..ఎవరికైనా మాతృభాష అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందరిలాగే మేమూ మా భాషను ప్రేమిస్తాం. మా భాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా! థగ్ లైఫ్ మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బందీ లేకుండా రిలీజయ్యాయి. వాటిని కన్నడిగులు ఆదరించారు కూడా! మాతృభాష జోలికొస్తే, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు అని ధృవ సర్జా ఘాటుగా ఆన్సరిచ్చాడు.చదవండి: మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం' -
‘ఓ భామ అయ్యో రామా’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ భామ అయ్యో రామనటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనిత హంసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి తదితరులునిర్మాణ సంస్థ: వీ ఆర్ట్స్నిర్మాతలు : హరీష్ నల్లరచన, దర్శకత్వం: రామ్ గోదలసంగీతం: రథన్సినిమాటోగ్రఫీ : ఎస్ మణికందన్ఎడిటర్: భవిన్ ఎం షావిడుదల తేది: జులై 11, 2025యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కాన్సెప్ట్ కథలతో అలరిస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలతోనూ నవ్విస్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో 'ఓ భామ అయ్యో రామ'పై హైప్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(జులై 11) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ్ (సుహాస్) చిన్నప్పుడే తల్లి(అనిత హంసానందిని)చనిపోతుంది. మేనమామ(అలీ)నే అన్ని తానై పెంచుతాడు. పెద్ద చదువుల కోసం పారెన్ వెళ్లాలనేది తన లక్ష్యం. స్నేహితులంతా సినిమాకు వెళ్తే..మనోడు మాత్రం థియేటర్ బయట నుంచే విని.. సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తాడు. మామ, స్నేహితులే ప్రపంచంగా బతుకుతున్న రామ్ జీవితంలోకి అనుకోకుండా సత్యభామ(మాళవిక మనోజ్) వచ్చేస్తుంది. బడా వ్యాపారవేత్త(పృథ్వీరాజ్) ఏకైక కూతురే ఈ సత్యభామ. ఆమెకు ఎవరైనా నచ్చితే.. వారికోసం ఏదైనా చేసేస్తుంది. రామ్ని ఇష్టపడమే కాకుండా అతన్ని సినిమా డైరెక్టర్ని చేయాలని ఫిక్సవుతుంది. అతనికి ఇష్టం లేకపోయినా.. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండీషన్ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ మూడేళ్లలో రామ్ జీవితం ఎలా మారింది? సత్యభామ.. రామ్కి దూరంగా ఎందుకు వెళ్లింది? రామ్ తండ్రి ఎవరు? సినిమాలు అంటేనే నచ్చని రామ్ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించింది. రామ్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడా లేదా? చివరకు రామ్, సత్యభామ కలిశారా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘తెలుగు సినిమా అంటే లవ్, ఎమోషన్, డ్రామా.. ఇవన్నీ ఉండాలి’ అని ఓ సీన్లో హీరో సుహాస్ అంటాడు. ఆ డైలాగ్కు తగ్గట్టే ఓ భామ అయ్యో రామ సినిమా కథ ఉంది. అయితే వాటిని సరిగా వాడుకోవడంలోనే దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఓ యూత్ఫుల్ లవ్స్టోరీకి మదర్ సెంటిమెంట్ని యాడ్ చేసి ఫన్వేలో కథనాన్ని నడించారు. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. లవ్స్టోరీ రొటీన్గానే ఉన్నా.. ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక ప్లాష్బ్యాక్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. హీరో తల్లి చనిపోయే ఎమోషనల్ సీన్తో కథని ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశం కాస్త కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు కలిసిన తర్వాత కథనం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. హీరో ఎక్కడ ఉంటే అక్కడికి హీరోయిన్ వెల్లడం.. బయటకు తీసుకెళ్లి.. కథ చెబుతూ విసిగించడం మొదట్లో బాగున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ కావడం కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. సెకండాఫ్లో వచ్చే హీరో మదర్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్ పెళ్లి ఎపిసోడ్ కామెడీగా ప్లాన్ చేసినా..అది వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్లో హీరోయిన్ చేసే అల్లరి పనులన్నింటికి.. సెకండాఫ్లో మంచి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అయితే కథను మరింత బలంగా రాసుకొని.. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రామ్ పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్ మాళవిక మనోజ్కి ఇది తొలి తెలుగు సినిమా. సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథనం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అనిత హంసానందిని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. హీరో తల్లిగా పాత్రలో నటించి అందర్ని సర్ప్రైజ్ చేసింది. మదర్ సెంటిమెంట్ సీన్ల ఈ సినిమాకు హైలెట్. ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రధాన బలం. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా చూపించాడు. రథన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. బ్రహ్మకడలి ఆర్ట్వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గలేదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. హీరో మార్కెట్, కథని మించి ఖర్చు చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్గానూ గిల్?
గతేడాది నుంచి టీమిండియాలో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికారు.హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూఈ క్రమంలో మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్తో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా సూర్యకు పగ్గాలు అప్పగించగా.. అతడు ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.ఇక టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డేల్లో మోదం, టెస్టుల్లో ఖేదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది.టెస్టు రిటైర్మెంట్ ప్రకటనఈ రెండు సిరీస్లలో బ్యాటర్గా, కెప్టెన్గా పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోనూ టెస్టులకు సారథిగా అతడే ఉంటాడని ముందుగా బీసీసీఐ లీకులిచ్చినా.. అనూహ్యంగా రోహిత్ నుంచి టెస్టు రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పగా.. బీసీసీఐ కూడా తమ వన్డే కెప్టెన్ అంటూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.టీమిండియా టెస్టు సారథిగా గిల్ఇక రోహిత్ శర్మ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్బై చెప్పాడు. వీరిద్దరి కంటే ముందే.. అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ప్రస్తుత టీమిండియాలో రవీంద్ర జడేజా సీనియర్గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు.అయితే, పనిభారాన్ని తగ్గించే నిమిత్తం బుమ్రా నిర్ణయానుసారమే అతడి పేరును బోర్డు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.చారిత్రాత్మక విజయంతో..ఇక కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీ బాది రికార్డులు సృష్టించిన గిల్.. తొలి ప్రయత్నంలో గెలుపును మాత్రం అందుకోలేకపోయాడు. అయితేనేం.. రెండో టెస్టులోనే చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్బాస్టన్లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఈ వేదికపై తొలిసారి భారత్కు గెలుపు అందించాడు.తదుపరి వన్డే సిరీస్లో కెప్టెన్గా గిల్! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రెవ్స్పోర్ట్స్ జర్నలిస్టు ఒకరు.. ‘‘తదుపరి వన్డే సిరీస్లో గిల్ కెప్టెన్గా ఉండబోతున్నాడు’’ అని ట్వీట్ చేశారు. దీంతో రోహిత్ శర్మను తప్పించి గిల్కు వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తారా? అనే చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్కప్-2027లో జరుగనున్న విషయం తెలిసిందే.అప్పటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి గనుక.. అతడు ఆడకపోవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్తో పాటు.. కోహ్లి కూడా వరల్డ్కప్ టోర్నీ కంటే ముందే వన్డేలకూ గుడ్బై చెబుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటికే టీమిండియాకు ఎనలేని సేవ చేశారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు.ఇకపై ఐపీఎల్లో మాత్రమే రో-కో కొనసాగితే చాలని అంటున్నారు. కాగా టెస్టు రిటైర్మెంట్ తర్వాత బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం సెప్టెంబరులో జరగాల్సిన ఈ సిరీస్ను వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబరులో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లి పునరాగమనం చేయనున్నారు. ఇంతలోనే రోహిత్ నుంచి పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది.చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే7th May ko kaha tha. Baar baar mat poocho bhai log. #RohitSharma #ShubmanGill https://t.co/PWcHEyJHbr— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025Whenever India's next odi series will be - Gill will lead— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025 -
విజయవాడలో దారుణం.. ఇంటి ఓనర్ను పని మనిషే..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆర్అండ్బి రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందారు. రామారావు ఇంట్లో కేర్ టేకర్గా పని చేస్తున్న మహిళే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషాతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా ఫుటేజ్ల్లో అనుషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. అనూషతో పాటు మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.నగరంలోని మాచవరం పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే.. అదే ఇంట్లో నివాసం ఉంటోంది.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి.. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచంపై కారం కూడా చల్లి ఉంది. కళ్లల్లో కారం కొట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు, బీరువా కూడా పగులగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి.. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది.వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తు మందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్థారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'దానికి మీరు అమ్మాయి అయితే చాలు'.. కింద పడేసి కొట్టాడన్న దంగల్ నటి!
దంగల్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించిన ఫాతిమా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ డినో చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో అలీ ఫజల్ సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న నటి.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇటీవల ఓ వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ సమయంలో అతన్ని తాను కొట్టానని ఫాతిమా వెల్లడించింది. అయితే తను కూడా తిరిగి తనను గట్టిగా కింద పడేంతలా కొట్టాడని వివరించింది. దీంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. ఆ సంఘటన తర్వాత తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో ఇప్పుడు తెలిసొచ్చిందని పేర్కొంది. మనలో ఏదో తప్పు జరుగుతోంది.. దానికి మనం ఎలా స్పందించాలో మాత్రమే ఆలోచించాలని చెబుతోంది ఫాతిమా.అంతేకాకుండా ముంబయిలో ఓ టెంపో డ్రైవర్ నన్ను ఫాలో అయ్యేవాడని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కొవిడ్ టైమ్లో ముసుగు ధరించి సైకిల్ తొక్కుతుంటే.. నన్ను చూసిన టెంపో డ్రైవర్ హారన్ మ్రోగించేవాడని.. నేను నా లైన్లో వెళ్తంటే నా వెంటే వచ్చేవాడని వివరించింది. సెలబ్రిటీ అయినా.. సామాన్యులైనా ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని తెలిపింది. దీనికి మీరు కేవలం అమ్మాయి అయి ఉంటే చాలని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా సనా షేక్ నటించిన ఆప్ జైసా కోయి ఈ రోజే నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇందులో ఆర్ మాధవన్ కూడా నటించారు. ఈ చిత్రం ఇద్దరు మధ్య వయస్కుల మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కించారు. ఒక స్త్రీ సంప్రదాయ కుటుంబంలో తన ప్రేమ కోసం ఎలా పోరాడుతుందో ఈ మూవీలో చూపించనున్నారు. -
కోర్టులో హాజరుపరచకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వేధింపులు!
చిత్తూరు జిల్లా: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి కేసుకు సంబంధించి బంగారుపాళ్యం పోలీసులు ఓవరాక్షన్ చేస్తన్నారు. ఈఈ కేసుకు సంబంధించి జీడినెల్లూరు నియోజకవర్గంకు చెందిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరచకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వేధిస్తన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో స్టేషన్లోనే వారిని ఉంచి వేధింపులకు గురిచేస్తన్నారు. మరొకవైపు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అరెస్ట్లు చేసిన 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాల్సి ఉన్నా, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు .పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ దాడి కేసులో మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన జో రూట్..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో సాధించాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో తొలి బంతికే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.రూట్కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట మొదటి సెషన్లోనే బ్యాటింగ్కు వచ్చిన జో రూట్.. తన అద్బుత ప్రదర్శనతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజోలో పాతుకుపోయిన ఈ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఓలీ పోప్, బెన్ స్టోక్స్తో కలిసి కీలక భాగస్వామ్యాలను రూట్ నెలకొల్పాడు. రూట్ ఓవరాల్గా 104 పరుగులు చేసి ఔటయ్యాడు.ద్రవిడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రూట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్గా రూట్(36) రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరిద్దరూ 35 టెస్టు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో వీరిద్దరిని రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్నే టాప్లో ఉన్నాడు.అదేవిధంగా టెస్టుల్లో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ రికార్డును సమం చేశాడు. స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. రూట్ కూడా సరిగ్గా 11 టెస్టు సెంచరీలు చేశాడు.బుమ్ బుమ్ బుమ్రా..రెండో రోజులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్(44), జో రూట్(104) అద్బుతమైన బంతులతో పెవిలియన్కు పంపాడు. 87 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.భారత్పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లుజో రూట్ (ఇంగ్లండ్)- 11స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 11గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 8వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 8రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 8అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లు..సచిన్ టెండూల్కర్ (భారత్) 51జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 45రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41కుమార్ సంగక్కర (శ్రీలంక) 38జో రూట్ (ఇంగ్లాండ్) 37చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే -
ఐటీ షేర్లు టపటప.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
టీసీఎస్ త్రైమాసిక (క్యూ1) రాబడులు ఆశించిన దానికంటే బలహీనంగా ఉండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ఐటీ షేర్లలో అమ్మకాలతో నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు కెనడాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వాణిజ్య సుంకాలు విధించిన తర్వాత పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 689.81 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 82,500.47 స్థాయిలలో ముగియగా, నిఫ్టీ 50 కూడా 205.4 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 స్థాయిలలో స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.88 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.02 శాతం చొప్పున నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో దాదాపు 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 రాబడులు ఊహించిన దానికంటే తక్కువగా ఉండటంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎనర్జీ, బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 23 షేర్లు రెడ్లోనే ముగిశాయి. టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.24 శాతం లాభపడి 11.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
మరో రీమేక్.. 'దఢక్ 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్) -
తెలంగాణ కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులు
హైదరాబాద్: తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) వెల్లడించింది. ఆప్టిగల్ ప్రైమ్, ఆప్టిగల్ పినకిల్ వీటిలో ఉన్నట్లు వివరించింది.తుప్పు నుంచి మూడు రెట్లు అధిక రక్షణ కల్పించేలా ఇవి ఆరు వేరియంట్స్లో ఉంటాయి. దేశీయంగా, ముఖ్యంగా దక్షిణాదిన కలర్ కోటెడ్ ఉక్కు ఉత్పత్తుల విభాగంలో గణనీయంగా మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్ రంజన్ ధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ మార్కెట్ 3.4 మిలియన్ టన్నులుగా ఉండగా, దక్షిణాది మార్కెట్ వాటా సుమారు 0.6 మిలియన్ టన్నులుగా ఉంటుందని పేర్కొన్నారు.హైదరాబాద్ కంపెనీకి ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీప్టెక్ ఆవిష్కరణలతో పంటల సంరక్షణ ఉత్పత్తులపై కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డ్ పురస్కారం లభించినట్లు ఏటీజీసీ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అగ్రికల్చర్ టుడే నిర్వహించిన 16వ అగ్రికల్చర్ లీడర్షిప్ సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ దీన్ని ప్రదానం చేసినట్లు వివరించింది.తమ సంస్థకు 26 పేటెంట్లు, 50కి పైగా ఉత్పత్తులు ఉన్నట్లు కంపెనీ చైర్మన్ మార్కండేయ గోరంట్ల, ఈడీ వీబీ రెడ్డి తెలిపారు. బియ్యం, పత్తి తదితర పంటల్లో ఫెరోమోన్ టెక్నాలజీని విస్తరించడంలో తమ కంపెనీని కేస్ స్టడీగా పరిగణించవచ్చని 2024లో ప్రపంచ ఆర్థిక ఫోరం సైతం సూచించినట్లు పేర్కొన్నారు.ఎన్ఎండీసీ గనులకు 5 స్టార్ రేటింగ్మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీకి చెందిన గనులకు ప్రతిష్టాత్మక 5 స్టార్ రేటింగ్ లభించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను చత్తీస్గఢ్లోని మూడు ఇనుప ఖనిజ గనులకు, కర్ణాటకలోని ఒక గనికి ఇది లభించినట్లు సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. పర్యావరణ అనుకూల విధంగా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ముఖర్జీ చెప్పారు. కేంద్ర గనుల శాఖ, ఐబీఎం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందించారు. -
లండన్లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు. -
మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్, పవన్
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. -
22 మంది మావోయిస్టుల లొంగుబాటు
చత్తీస్గఢ్: తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోఆయరు. ఈరోజు(శుక్రవారం,. జూలై 11) నారాయణపూర్ ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 22 మంది మాదోయిస్టుల్లో 8 మంది మహిళలున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 37 లక్షల రివార్డ్ ఉంది.కాగా, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. గత నెలలో కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఏడు నెలల్లో 310కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు.. వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతోపాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోలు వచ్చాక కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ ఏడాది అగ్రనేతలు చనిపోయిన ఎదురుకాల్పుల్లో ఈ తరహా వ్యూహాలనే ఎక్కువగా అమలు చేసినట్టు సమాచారం. ఇదే మాదిరి మడావి హిడ్మా, బార్సే దేవా విషయంలోనూ పది రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్టు తెలుస్తోంది. హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ -
పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పోలీసులకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. కేసుకు సంబంధం లేని సెక్షన్లను ఎలా పెడతారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఆవేదనతో 7వ తేదీ రాత్రి వేంపల్లి వాసులు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. తోపులాటలో పోలీసు స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టులు చేస్తున్నారు.హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. దీంతో బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల పోలీసుల తీరుపై మండిపడిన హైకోర్టు.. స్టేషన్ను చుట్టుముడితే హత్యాయత్నం ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది. వెంటనే ఆ సెక్షన్ తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దాడికి పాల్పడి ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి.. ఆ తర్వాత 41ఏ నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు తెలిపింది. నిన్నటి నుంచీ అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పటికీ దాదాపు 70 మందిని వరకూ అరెస్ట్ చేశారు. -
మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం'
నటి చైత్ర రాయ్ (Chaitra Rai) గుడ్న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. 'ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.సీరియల్స్ నుంచి సినిమాల్లోకి..మీ ప్రేమాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు కూతురు నిష్క శెట్టి సంతానం. ఇప్పుడా పాపతో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి రానుందన్నమాట! కాగా కన్నడ బ్యూటీ చైత్ర.. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను -
బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!
'బాహుబలి' రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ తదితర చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్లో పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోలు తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొందరు సౌత్ దర్శకులు.. హిందీ హీరోలతో తీసిన జవాన్, యానిమల్ లాంటివి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఈ క్రమంలోనే గత కొన్నాళ్లలో హిందీ నటీనటులు.. బాహాటంగానే సొంత ఇండస్ట్రీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. 'కేజీఎఫ్' చిత్రంలో విలన్గా అలరించిన ఇతడు.. ఇప్పుడు 'కేడీ ది డెవిల్' అనే మరో కన్నడ మూవీలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులోనే సంజయ్ దత్.. బాలీవుడ్ పరిస్థితి ఏంటో చెప్పేశాడు.(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన సంజయ్ దత్.. 'మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ని బాలీవుడ్కి తీసుకెళ్తా. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు.. కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్లో అలా కాదు. ముఖ్యంగా తెలుగులో మూవీస్పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఆ చిత్రంతో పాటు తెలుగు సినీ పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 'తెలుగులో చాలామంది నిర్మాతలు నాకు తెలుసు. వాళ్లతో కలిసి నేను పనిచేశాను. 1980ల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఫుడ్ బాగుంటాయి. తెలుగులో ప్రభాస్తో సినిమా చేస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ప్రభాస్ నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాడు' అని సంజూ చెప్పాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే బాలీవుడ్లో ఇప్పుడు ఎవరూ సరైన సినిమాలు తీయట్లేదని, ఈ విషయంలో టాలీవుడ్ చాలా బెటర్ అని అర్థం. ఓ రకంగా చూస్తే పరోక్షంగా సొంత ఇండస్ట్రీ పరువునే తీసేశాడు!(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
పప్పు పంచాయితీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. పాడైపోయిన పప్పు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓ జాతీయ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్ అయ్యింది.అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్షాలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్, శివసేన బాస్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత.. శుక్రవారం ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో స్పష్టత రావాల్సి ఉంది.గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు. దక్షిణాదివారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారు. అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారు? అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే
క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వియాన్ ముల్డర్ (Wiaan Mulder). ఈ సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 367 పరుగులతో దుమ్ములేపాడు.కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. అజేయ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రొటిస్ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (Brian Lara) పేరిట క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డుకు చేరవయ్యాడు. అయితే, అనూహ్యంగా తాను 367 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ముల్డర్ ఆశ్చర్యపరిచాడు.లారా వంటి లెజండరీ బ్యాటర్ పేరిటే ఈ రికార్డు ఉండాలని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ముల్డర్పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షమూ కురిసింది. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకేనని. అయినా అతడేమీ 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయదంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.లారా రియాక్షన్ ఇదేతాజాగా ఈ విషయం గురించి వియాన్ ముల్డర్ స్పందించాడు. తన అభిప్రాయంతో లారా ఏకీభవించలేదంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘నాకు కాస్త విరామం దొరికినపుడు.. బ్రియన్ లారాతో మాట్లాడాను. నీకంటూ సొంత లెగసీ సృష్టించుకోవాలని ఆయన నాతో అన్నాడు.నీకోసమే నువ్వు ఆడాలని చెప్పాడు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని... మరోసారి గనుక నేను ఇలా 400కు చేరువగా వస్తే మాత్రం.. అప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పాడు.నా నిర్ణయం సరైందేనిజానికి ఇప్పుడు నేను బ్యాటింగ్ కొనసాగించి.. తనకంటే ఎక్కువ స్కోరు చేస్తే సంతోషించేవాడినని నాతో అన్నాడు. ఆయనలో ఉన్న గొప్పదనం అదే. అయితే, ఇప్పటికీ నా నిర్ణయం సరైందేనని నేను భావిస్తున్నా. ఆటను, దిగ్గజాలను గౌరవించడం అన్నిటికంటే ముఖ్యం’’ అని వియాన్ ముల్డర్ సూపర్స్పోర్ట్తో వ్యాఖ్యానించాడు.మిస్ చేసుకున్నావుకాగా వియాన్ ముల్డర్ గురించి మరో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘అతడు తప్పు చేశాడు. 400 కొట్టేందుకు అతడు ప్రయత్నించి ఉండాల్సింది. అలా అయితేనే కదా.. క్వాడ్రపుల్ సెంచరీ చేసేవాడో లేదో తెలిసేది. కానీ 367 పరుగుల వద్ద ఉన్నపుడు డిక్లేర్ చేశాడు.తానేం చెప్పదలచుకున్నాడో అది చెప్పేశాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తాయి. టెస్టు ఇన్నింగ్స్లో 400 రన్స్ మామూలు విషయం కాదు. ఈసారి నువ్వు ఇది మిస్ చేసుకున్నావు’’ అంటూ విమర్శించాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ నయా చాంపియన్ సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. తొలి టెస్టులో కేశవ్ మహరాజ్ సారథ్యంలో.. రెండో టెస్టులో ముల్డర్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0తో క్లీన్స్వీప్ చేసింది.చదవండి: ప్యాట్ కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి -
కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు
ఉడుపి: ఆహారం కాదు అంతకు మించి... ‘ఉడుపి’ (Udupi) అనే పదం వినగానే, నోట్లో కరిగిపోయే ఇడ్లీ, కరకరలాడే మసాలా దోస, ఇంట్లో రుచికరమైన పరిమళలాలు వెదజల్లే సాంబార్ గిన్నె గుర్తొస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఉడుపి హోటల్స్ దానికి కారణం కావచ్చు. కానీ ఉడుపి అంటే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఆహారం వండే శైలి, పదార్ధాలు మాత్రమే కాదు. కర్ణాటకలోని ఈ మనోహరమైన తీరప్రాంత పట్టణం వైవిధ్య భరిత సంస్కృతి ఆధ్యాత్మికతతో నిండింది, దాని పురాతన దేవాలయాలు, నిశ్శబ్ద బీచ్లు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉత్సాహభరితమైన మార్కెట్లు అన్నింటికీ మించిన గొప్ప చరిత్రతో. ఇక్కడ భక్తి రోజువారీ జీవితాన్ని మేళవించుకుని ఉంటుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.అందుకే ఉడుపి అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మరెన్నో అందాలు, ప్రకృతి సౌందర్యాలకు చిరునామా కూడా. ఉడుపి పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాల్లో...కృష్ణ దేవాలయం..ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం తప్పక సందర్శించాల్సిన 13వ శతాబ్ధపు ప్రాచీన దేవాలయం, ఆధ్యాత్మిక వేత్త గురు మాధవాచార్య దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన వైవిధ్యం నవగ్రహ కిటికీ,9 రంధ్రాలు కలిగిన వెండి పూత పూసిన కిటికీ ద్వారా మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి వంటశాల ద్వారా వేల మందికి ఉచితంగా రోజూ అన్నదానం జరుగుతుంటుంది. అలాగే అనంతేశ్వర–చంద్రమౌలేశ్వర దేవాలయాలు కూడా ఈ మందిరం దగ్గరే ఉన్నాయి. అనంతేశ్వరేశ్వరాలయాన్ని 8వ శతాబ్దంలో ఆలుపా రాజవంశంలోనిర్మించారు. అంబల్పాడి మహాకాళి దేవాలయం జానార్దన స్వామి దేవాలయం ఎదురుగా, ఉండే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది.తీరప్రాంత ఆస్వాదన కోసం ఉడుపి పట్టణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్ బంగారు ఇసుక అంతులేని సముద్రపు మిశ్రమాన్ని అందిస్తుంది. చల్లని గాలులతో కూడిన ఉదయం నడక, సీఫుడ్ లేదా పారాసెయిలింగ్ జెట్ స్కీయింగ్ వంటివి ఆస్వాదించాలనుకుంటే, ఇది బెస్ట్ ప్లేస్. దీనికి కొద్ది దూరంలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం, అద్భుతమైన షడ్భుజాకార బసాల్ట్ రాతి నిర్మాణాలు మెరుపు జలాలతో కూడిన భౌగోళిక అద్భుతం. కాలికట్ చేరుకోవడానికి ముందు వాస్కోడగామా మొదట ఇక్కడ అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.సూర్యుడు సముద్రంలో కలిసిపోయే అద్భుతమైన దృశ్యాలు లైట్హౌజ్లో నుంచి చూడాలంటే ఇక్కడి కౌప్ బీచ్ కి వెళ్లాలి. 1901లో నిర్మితమైన ఈ లైట్హౌజ్ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ బీచ్కు ఉడుపి నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఇదే కాకుండా నదీ సముద్రాల అరుదైన సంగమాన్ని మనకు చూపించే డెల్టా బీచ్, దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కుడ్లు తీర్థ వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు కనువిందే. దాదాపు 120 ఏళ్ల క్రితం హజీ అబ్ధుల్లా సాహెబ్ నిర్మించిన కాయిన్ మ్యూజియం మన దేశపు ఆర్ధిక మూలాలను విశేషాలను మనకు దర్శింపజేస్తుంది. ఇవే కాక మరెన్నో పూరాతన -దేవాలయాలు, , 8వ శతాబ్దపు శిల్ప సంపద వంటివి ఉడుపిని కేవలం ఒక ఆహార నగరంగా చూడడం ఎంత తప్పో మనకు తెలియజేస్తాయి. -
ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్లో భారత్కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్బేస్లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్లోని సర్గోధా, రహీంయార్ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు. -
‘గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదు.. కోచ్గా ఉండటం కష్టం’
ఆటగాడిగా కంటే కోచ్గా ఉండటం అత్యంత కష్టమైన పని అని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) అన్నాడు. జట్టులోని ప్లేయర్గా కేవలం మన ఆటకు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అదే శిక్షకుడిగా ఉంటే జట్టులోని అందరి ఆటగాళ్ల ప్రదర్శనకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.అందువల్ల కోచ్పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని.. అందుకే తాను ఈ మధ్య తరచుగా తన గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మార్గదర్శనంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత.. అతడి స్థానంలో గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు.వన్డే, టీ20లలో రైట్ రైట్శ్రీలంకలో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం ద్వారా తన కోచింగ్ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిన గౌతీ.. పరిమిత ఓవర్ల సిరీస్లో వరుస విజయాలు చవిచూశాడు. ముఖ్యంగా అతడి నేతృత్వంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గడం చెప్పుకోదగినది.టెస్టులలో బ్రేకులుఅయితే, టెస్టు ఫార్మాట్లో మాత్రం గంభీర్కు కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా తొలిసారి 3-0తో వైట్వాష్ కావడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)ని పదేళ్ల తర్వాత చేజార్చుకోవడం.. గంభీర్పై విమర్శలకు దారితీశాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి ఇంగ్లండ్ టూర్కు వచ్చిన గంభీర్కు తొలి మ్యాచ్లో చేదు అనుభవమే మిగిలింది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. అయితే, గత చేదు జ్ఞాపకాలు చెరిపేసేలా తొలిసారి ఎడ్జ్బాస్టన్లో జయభేరి మోగించింది. దీంతో గంభీర్కు కాస్త ఊరట లభించింది.తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందిఈ నేపథ్యంలో సహచర మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గతంలో కంటే ఇప్పుడు తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోంది.ఆటగాడిగా ఉన్నపుడు మన ఆట గురించి మాత్రమే ఆలోచిస్తాం. అదే కోచ్గా మారితే.. జట్టు మొత్తానికి మనదే బాధ్యత. ప్రతి విషయానికి మనమే జవాబుదారీగా ఉండాలి. ఎలాంటి వ్యక్తిగత, ప్రత్యేక ఎజెండాలు లేకుండా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలి.అయితే, కోచ్గా ఉండటం వల్ల అభద్రతా భావం మాత్రం ఎప్పుడూ దరిచేరదు. జట్టుతో కలిసే మనం నేర్చుకుంటాం. వారితో కలిసే ఎదుగుతాము. ఏదేమైనా ప్రతిరోజూ ఓ కొత్త సవాలే.గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదుదేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. ఇక్కడ గౌతం గంభీర్ అనే వ్యక్తి ముఖ్యం కాదు. భారత క్రికెట్ అనేదే అన్నింటికంటే ముఖ్యమైనది. డ్రెసింగ్రూమ్లో తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. వారి అభిప్రాయాలు కోచ్గా నాకూ ముఖ్యమే. ఏదేమైనా ఆటగాడిగా ఉండటం కంటే కోచ్గా కష్టతరమైన పనే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్యాట్ కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి -
'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
బిగ్ బుల్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు.. మార్కెట్ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేనివారికి కూడా పరిచయం అక్కర్లేని పేరు. స్టాక్ బ్రోకర్గా కెరియర్ను ప్రారంభించి.. బ్యాంకుల్లో ఉన్న లొసుగులతో బ్యాంక్ రిసిప్ట్స్ (BRs) ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా దుర్వినియోగంతో భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసిన ఉదంతం. 1992లో జరిగిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మూడు దశాబ్దాల తర్వాత, పౌంజీ స్కాం రూపంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. రూ.49వేల కోట్ల స్కాంతో హర్షద్ మెహతా స్కాం తరువాత దేశంలో అత్యంత ఆర్థిక నేరాల్లో ఒకటిగా నిలిచింది. ఏంటి ఈ స్కామ్? ఎవరు చేశారు?నిర్మల్ సింగ్ భాంగూ. పంజాబ్లోని బర్నాలా నివాసి. 1970లలో ఓ వైపు ఇంటింటికి తిరిగి పాలమ్ముతూ పొలిటికల్ సైన్స్లో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగం కోసం కోల్కతాకు వెళ్లారు. అక్కడ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ పెర్ల్స్లో చేరాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థ ఈ సంస్థ పెట్టుబడిదారులను మోసం చేసింది. దివాళా తీయడంతో భాంగూ ఉద్యోగం కూడా పోయింది.అప్పుడే తనకున్న అనుభవంతో 1996లో నిర్మల్ సింగ్ భంగూ.. గుర్వాంత్ ఆగ్రో టెక్ లిమిటెడ్తో సంస్థను ప్రారంభించారు. అలా 30ఏళ్లుగా అంటే 1996లో గుర్వాంత్ ఆగ్రో టెక్ నుంచి పెర్ల్స్ అగ్రో టెక్ మారిన ఈ సంస్థ దాదాపు రూ.49,000 కోట్ల పౌంజీ కుంబకోణానికి తెరతీసింది. దేశం మొత్తం మీద 5 కోట్ల మంది అమాయకులను మోసం చేసి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసింది. చివరికి ఆసంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆ సంస్థ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని అరెస్ట చేసింది. తాజాగా ఆ సంస్థ డైరెక్టర్ గుర్నాసింగ్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో పెట్టుబడిదారులు గతంలో పోలీస్ కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత ఈ విషయం CBIకి చేరింది. ఈ కేసులో పేరున్న 10 మంది నిందితుల్లో నలుగురిని CBI ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపింది. గుర్నామ్ సింగ్ అరెస్టు తర్వాత పెట్టుబడిదారులు తమ డబ్బు తిరిగొస్తుందని ఆశతో ఉన్నారు. EOW సహా ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ ఫ్రాడ్ నెట్వర్క్ మూలాలను లోతుగా విచారిస్తున్నాయి. -
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్పై మండిపడ్డారు. -
రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
సాక్షి,న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్కు లేఖ రూపంలో తెలియజేశారు. మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ పని విధానం , సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. మీరు లేవనెత్తి అంశాలు అసందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం అని అరుణ్ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి జూన్ 30వ తేదీన రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్ కోరితే అందుకు తాను సిద్ధమని చెప్పారాయన. కానీ, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలపడం గమనార్హం. -
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేధింపు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి,నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులు తాళ లేక ఆ పార్టీ నేతలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. కోవూరు నియోజకవర్గంలోనీ విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమామ్ భాషా మీడియాతో మాట్లాడారు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను
పెళ్లంటేనే భయమేస్తోందంటోంది హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan). వివాహ సాంప్రదాయాన్ని గౌరవిస్తానని, కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానని చెప్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. పెళ్లి పేరు ఎత్తితేనే నాకు భయం వేస్తోంది. వివాహ పద్ధతిని నేను గౌరవిస్తాను. కానీ, నాకు మాత్రం అది అవసరం లేదనిపిస్తోంది. గతంలో ఒకసారి నేను రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేవరకు వెళ్లాను. కానీ పెళ్లి కాకుండానే ఆ ప్రేమ బంధం ముక్కలైంది. దత్తత తీసుకుంటాపెళ్లంటే ఇద్దరు మనుషులు ఏకమవడమే కాదు. భవిష్యత్తును పంచుకోవడం, జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం.. ఇలా చాలా ఉంటాయి. పెళ్లంటే ఇష్టం లేదని నేను ఒంటరిగానే మిగిలిపోను. ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటానేమో.. చెప్పలేం! అప్పుడు నేను సింగిల్ పేరెంట్గా మాత్రం వారిని పెంచను. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం.సింగిల్అలా అని సింగిల్ పేరెంట్స్ను నేను తక్కువ చేయడం లేదు. వారిపై నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ప్రస్తుతానికైతే నేను నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ శృతి హాసన్ తను సింగిల్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.. కాగా శృతి హాసన్ కొన్నేళ్లుగా ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయణం నడిపింది. గతేడాది వీరిద్దరూ విడిపోయారు. సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: 9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వడ్డే నవీన్.. ఇప్పుడేం చేస్తున్నాడు? -
అలాంటి రామచందర్ రావుకు అధ్యక్ష పదవా?.. బీజేపీపై భట్టి సీరియస్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణం. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలి. రోహిత్ వేముల ఆత్మహత్యకి కారణమైన సుశీల్ కుమార్కి ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు. ఇది వ్యవస్థాగత హత్య. ఏబీవీపీ నాయకులతో కలిసొచ్చి రామచందర్ రావు ధర్నా చేశారు.ఢిల్లీ నుంచి రామచందర్ రావు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి రోహిత్ వేములను డిస్మిస్ చేయించారు. దేశ ద్రోహం కేసులు పెట్టించారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. రోహిత్ వేముల కేసును రీ ఓపెన్ చేస్తున్నాం. కోర్టు అనుమతి కోసం అభ్యర్థన పెట్టాం. దోషులకు తగిన శిక్షలు పడాలి. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి ఉండాలి. వివక్ష ఉండకూడదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ..‘రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ రివార్డులు ఇస్తోంది. రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. బీజేపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను పక్షపాతంతో ఫెయిల్ చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. -
అరుదైన క్రికెటర్.. 34 ఏళ్లకే రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ ఆటగాడు పీటర్ మూర్ ఒకరు. మూర్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐర్లాండ్ తరఫున వరల్డ్కప్ ఆడాలన్న కలతో ఆ దేశానికి వలస వెళ్లిన మూర్.. ఆ కోరిక తీరకుండానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.ఐర్లాండ్కు ఆడకముందు మూర్ జింబాబ్వే జట్టులో సభ్యుడు. మూర్ 2014లో బంగ్లాదేశ్తో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేశాడు. నాటి నుంచి మూర్ జింబాబ్వే ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మారాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ వికెట్కీపర్ అయిన మూర్ జింబాబ్వే తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్ట్లు ఆడాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1700 పైచిలుకు పరుగులు సాధించాడు.అనంతరం మూర్ ఐరిష్ మూలాలు (నాన్నమ్మ) ఉండటంతో ఐర్లాండ్కు వలస వెళ్లాడు. 2023 మూర్ ఐర్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి ఆ దేశం తరఫున 7 టెస్ట్లు ఆడాడు. ఐర్లాండ్ తరఫున 2024 జులైలో అతని అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. నాడు మూర్ తన జన్మదేశమైన జింబాబ్వేపై మూర్ 79 పరుగులు చేశాడు. అతను చివరిగా అంతర్జాతయ మ్యాచ్ ఆడింది కూడా జింబాబ్వేపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూర్ జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 4, 30 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్లో మూర్ తన చివరి మ్యాచ్ను నిన్ననే (జులై 10) ఆడాడు. ఐరిష్ దేశవాలీ టోర్నీలో మన్స్టర్ రెడ్స్కు ప్రాతినిథ్యం వహించిన మూర్.. వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అతని జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్లో మూర్ సహచరుడు కర్టిస్ క్యాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మూర్ తన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికినా దేశవాలీ, టీ20 లీగ్ల్లో కొనసాగుతునాని చెప్పాడు. -
బెంచీల ఐడియా భలే!
ఇది ఇట్లాగే ఉండాలి.. అది అట్లాగే ఉండాలని అందరూ అనుకుంటే..మనిషి, సమాజపు ప్రగతి కూడా అక్కడికక్కడే స్తంభిస్తుంది!అయితే.. ఎవరో ఒకరు.. ఎప్పుడో అపుడు..యథాతథ స్థితిని ప్రశ్నిస్తారు.. ముందడుగు వేస్తూంటారు.చరిత్ర తెరచి చూస్తే ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు..వర్తమానంలో కనిపిస్తున్న తాజా ఉదాహరణ ఇది..మీ క్లాస్ రూమ్లో బెంచీలుండేవా? ఉంటే.. అవన్నీ వరుసల్లోనే ఉండి ఉంటాయి. ముందు వరుసలో కూర్చున్న విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా వినే అవకాశం దొరికేది. వెనుక వరుసల వారు తమదైన ఆకతాయి పనులు చేసేందుకు... అప్పుడప్పుడూ టీచర్ల ఆగ్రహానికి గురయ్యే ఇబ్బంది కూడా ఏర్పడేది. టీచర్లు చెప్పేది వినలేక.. అర్థం కాక వెనుక బెంచీల వాళ్లు ఆకతాయిలుగా మారిన సందర్భాలూ ఉండే ఉంటాయి. ఇది యథాతథ స్థితి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని దాదాపు ప్రతి పాఠశాలలోనూ బెంచీలు ఇలాగే వరుసల్లోనే ఉండి ఉంటాయి. అయితే మళయాళం సినిమా ఒకటి ఈ యథాతథ స్థితిని సవాలు చేసింది. ‘‘బెంచీలన్నీ ఇలా వరుసల్లోనే ఎందుకు ఉండాలి’’ అని ప్రశ్నించింది. బదులుగా చతురస్రపు గదిలో గోడల వెంట ‘సీ’ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి తన సినిమాలో చూపింది. విద్యార్థులందరి దృష్టి టీచర్లపై ఉండేందుకు అవకాశం ఏర్పడిందన్నమాట. ఉపాధ్యాయులు కూడా అందరి దృష్టి పాఠాలపైనే ఉండేలా చూసుకునేందుకూ వీలేర్పడింది.భలే ఉందే ఈ ఐడియా అనుకున్నారు కేరళలోని కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఒట్టిగా అనుకోవడం ఎందుకు మనమూ అలా వాడేస్తే పోలా అన్నారు ఇంకొందరు.. ఇది ఒక ట్రెండ్కు దారి తీసింది. ప్రస్తుతం కేరళలోని పలు పాఠశాలల్లో ఇప్పుడు కుర్చీల అమరిక ‘సీ’ ఆకారంలోకి మారిపోయాయి. కొసమెరుపు ఏమిటంటే... చాలా ఆడిటోరియమ్స్లో, యూనివర్శిటీల్లో.. మరీ ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో తరగతి గదుల కూర్పు ఇదే విధంగా ఉండటం!.No more frontbenchers vs backbenchers?In most classrooms, your seat says it all—frontbenchers shine, backbenchers get sidelined.But what if a film could help us unlearn the narrative? In Kerala, it just did.A Malayalam movie scene sparked a real-life shift, replacing rigid… pic.twitter.com/LU7YEogMWG— The Better India (@thebetterindia) July 11, 2025అందరినీ కలుపుకుపోతూ...‘‘ఆ.. ఏమంది.. వరుసగా ఉన్న బెంచీలను చుట్టూ పెట్టేశారు. అంతే కదా? దీంతో ఏమవుతుంది?’’ అని చాలామంది అనుకోవచ్చు కానీ.. ఈ డిజైన్ మార్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో మసిలే విధానం, వారి ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యాలపై ప్రభావం చూపుతాయి. పాఠం చెబుతున్న సమయంలో టీచర్ను నేరుగా చూడగలగడం వల్ల విద్యార్థులు వారితో మాట్లాడేందుకు అవకాశం ఎక్కువవుతుంది. ఇది ఏకాగ్రత ఎక్కువవుతుంది. బోధనలో విద్యార్థులూ భాగస్వాములవుతారు. వరుస బెంచీల్లో కూర్చొన్నప్పుడే వెనుక ఉన్న వారితో కలుపుగోలుగా ఉండొచ్చు. క్లాసులో ఏదైనా యాక్టివిటీ చేయాలంటే సులువుగా ఉంటుంది. విద్యార్థులందరినీ కలుపుకుని పాఠం చెప్పేందుకు టీచర్లకు వెసలుబాటు ఏర్పడుతుంది.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టాలీవుడ్ రూపురేఖల్ని మార్చిన సినిమా 'బాహుబలి'. సరిగ్గా పదేళ్ల క్రితం థియేటర్లలో తొలి భాగం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా ట్రెండ్కి శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి ఏ పెద్ద సినిమా రిలీజైనా సరే 'బాహుబలి' రికార్డ్స్ని సదరు చిత్రం దాటిందా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ఈ చిత్రానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీమ్ అంతా మరోసారి కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈ మొత్తం ఫొటోల్లో చాలామంది ప్రభాస్ లుక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్తో స్టైలిష్గా కనిపించాడు. డార్లింగ్ అభిమానులైతే తెగ సరదా పడిపోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ అనుష్క కనిపించకపోవడం మాత్రం కాస్త వెలితిగా అనిపించింది. ఇంతకీ ఆమె రాకపోవడానికి కారణం ఏంటా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన)అయితే 'బాహుబలి' చేస్తున్న టైంలో 'సైజ్ జీరో' అనే మూవీ చేసిన అనుష్క.. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా బరువు పెరిగింది. కానీ తగ్గే విషయంలో మాత్రం అప్పటినుంచి పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. అందుకే బాహుబలి తర్వాత పలు సినిమాలు చేసినా సరే బయట పెద్దగా కనిపించలేదు. కనీసం ప్రెస్ మీట్స్కి కూడా హాజరు కాలేదు. ఇప్పుడు కూడా అందుకే రీ యూనియన్ పార్టీకి హాజరు కాలేదని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే అనుష్క నటించిన 'ఘాటీ' సినిమా లెక్క ప్రకారం జూలై 11న అంటే ఈ రోజు(శుక్రవారం) థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడనేది టీమ్ చెప్పలేదు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. చాలా భాగం అడవి బ్యాక్ డ్రాప్లో తీశారు. మరి ఈ మూవీ రిలీజ్ ముందైనా సరే అనుష్క.. బయటకొస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం) View this post on Instagram A post shared by Baahubali (@baahubalimovie) -
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ టెక్నిక్లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!) -
9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వడ్డే నవీన్.. ఇప్పుడేం చేస్తున్నారంటే?
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదిస్తే సరిపోదు, దాన్ని అలాగే కాపాడుకోగలిగాలి. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వెండితెరపై కనిపించకుండా పోతారు. టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) విషయంలో ఇదే జరిగింది. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఇతడు చాలా కాలంగా తెలుగు తెరకు కనిపించకుండా పోయాడు.కెరీర్ అలా మొదలైందిప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కుమారుడిగా నవీన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కోరుకున్న ప్రియుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చివరగా 2016లో ఎటాక్ చిత్రంలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. రీఎంట్రీ ఇలా ప్లాన్ చేశాడా?9 ఏళ్ల తర్వాత ఇతడు విలన్గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. యాక్టింగ్ సంగతి పక్కనపెడితే నవీన్ నిర్మాతగా మారనున్నాడు. వడ్డే క్రియేషన్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నటుడిగా కమ్బ్యాక్ ఇస్తాడనుకుంటే ఇలా నిర్మాత అవతారం ఎత్తి ట్విస్ట్ ఇచ్చాడంటున్నారు అభిమానులు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో నవీన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. Vadde Naveen starts his new production house.@vaddecreations 💥 pic.twitter.com/nufRFthfBw— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 10, 2025 చదవండి: ఒక్క సినిమాకు 150 కట్స్.. విడుదలకు ముందే కోర్టు స్టే -
ప్యాట్ కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి
లార్డ్స్ టెస్టులో టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిరోజు సత్తా చాటాడు. ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే (18), బెన్ డకెట్ (23) వికెట్లు కూల్చి భారత్కు శుభారంభం అందించాడు. తద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కోసమంటూ నితీశ్ (Nitish Kumar Reddy)ను ఎంపిక చేయడం సరికాదన్న విమర్శకులకు ఆటతోనే బదులిచ్చాడు.కమిన్స్ని సలహా అడిగితే ఏమన్నాడంటేఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టు మొదటి రోజు పూర్తయిన అనంతరం నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడికి వచ్చే ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులలో ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయని ప్యాట్ (ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ Pat Cummins)ను అడిగాను.నాకిదే తొలి ఇంగ్లండ్ పర్యటన కాబట్టి సలహాలు ఇవ్వమన్నాను. అందుకు బదులుగా.. ‘పిచ్ స్వభావంలో పెద్దగా తేడా ఉండదు. అయితే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు బౌలింగ్ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు’’ అని నితీశ్ రెడ్డి తెలిపాడు.కాగా ఐపీఎల్లో నితీశ్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ గత రెండేళ్లుగా కెప్టెన్గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టీమిండియాలోనూ ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకుంటున్నాడు.మా కోచ్ వల్లే ఇదంతా..ఇక... టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మోర్నీతో కూడా నా ఆట గురించి చాలానే చర్చించాను. ముఖ్యంగా సరైన లైన్ అండ్ లెంగ్త్తో నిలకడగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాము. గతేడాది కాలంగా ఈ విషయమై కఠినంగా శ్రమించాను.అందుకు ప్రతిఫలంగా నా బౌలింగ్లో రోజురోజుకీ పరిణతి కనిపిస్తోంది. ఇలాంటి కోచ్తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి ప్రయాణం చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా’’ అని నితీశ్ రెడ్డి కోచ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.లార్డ్స్లో అమీతుమీకాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో గిల్ సేన ఈ ఓటమికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ వేదికపై తొలిసారి గెలుపు నమోదు చేసింది.ఇక ఇరుజట్ల మధ్య లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో గురువారం (జూలై 10) మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసేసరికి.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నస్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ 99, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి రెండు వికెట్లు కూల్చగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కాయి. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గావాట్ రా రెడ్డి, బాగుంది రా మామ👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/cH9KYukrVX— Sony Sports Network (@SonySportsNetwk) July 10, 2025 -
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం)విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్. ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు) -
Viral Videos: నాటీ జడేజా.. తెలుగు మాట్లాడిన గిల్.. బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్.. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని "బౌలింగ్ బాగుందిరా మావా" అంటూ తెలుగులో ప్రశంసించాడు. ఆట చివర్లో లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) మైదానాన్ని ఆవహించి ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెట్టాయి. రూట్ 99 పరుగుల వద్ద ఉండగా రవీంద్ర జడేజా తనదైన శైలిలో "నాటీ" పనులు చేశాడు. ఇవే కాకుండా నిదానంగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ను సిరాజ్ "బజ్బాల్ ఏది" అంటూ రెచ్చగొట్టాడు. మొత్తంగా తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది.బౌలింగ్ బాగుందిరా మావా..!టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. తమ ఇన్నింగ్స్ను 13 ఓవర్ల వరకు సజావుగా సాగించింది. అయితే అప్పటివరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్ను కష్టాల్లోకి నెట్టాడు.GILL SPEAKING TELUGU TO NITISH KUMAR REDDY. 😂🔥 pic.twitter.com/NG5buxINBG— Johns. (@CricCrazyJohns) July 10, 2025ఈ క్రమంలో నితీశ్ను భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ' అంటూ ప్రశంసించాడు. అతడి మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.బజ్బాల్ ఏది..?టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ను స్లెడ్జింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన సిరాజ్.. అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి రూట్ను ఇబ్బందిపెట్టాడు. Siraj - "Bazball, Comeon I want to see it". 🥶🔥- It's fun at Lord's....!!! pic.twitter.com/7Ma3OiRPc2— Johns. (@CricCrazyJohns) July 10, 2025ఆ ఓవర్లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఓవర్ పూర్తియ్యాక రూట్ వద్దకు సిరాజ్ వెళ్లి "దమ్ముంటే బాజ్బాల్ ఇప్పడు ఆడండి. నేను చూడాలనుకుంటున్నాను" అని సీరియస్గా అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్తొలి రోజు ఆట చివర్లో (81వ ఓవర్) మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేసే బుమ్రా లేడీబర్డ్స్ దెబ్బకు భయపడినట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్మీడియాలో వైరలవుతోంది.నాటీ జడేజా..!మైదానంలో సరాదాగా ఉండే రవీంద్ర జడేజా తొలి రోజు ఆట చివరి ఓవర్లో జో రూట్ను తనదైన శైలిలో ఆటపట్టించాడు. ఆకాశ్దీప్ బౌలింగ్లో రూట్ 98 పరుగుల వద్ద ఓ పరుగు తీసి సెంచరీ పరుగు కోసం చూస్తుండగా జడేజా అతన్ని ఆటపట్టించాడు. జడేజా తనదైన శైలిలో రూట్తో చతుర్లాడిన సన్నివేశాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. JADEJA HAVING FUN WITH ROOT IN THE FINAL OVER 😂🔥 pic.twitter.com/zLd6ul83X9— Johns. (@CricCrazyJohns) July 10, 2025మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. -
యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్ఫాస్ట్
యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్టెక్ నోట్లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. వివిధ పేమెంట్ ప్రొవైడర్స్ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
నీలమణిపై మక్కువ.. హైదరాబాదీ నవాబ్కు టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: కాశ్మీర్లోని కుస్తావ్ జిల్లాలోని పాడ్డర్ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల్లో దొరికే నీలమణికి ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కాశ్మీరీలు హైదరాబాద్కు చెందిన నవాబ్ మీర్ ఫిరాసత్ అలీ ఖాన్కు రూ.3 కోట్ల మేర టోకరా వేశారు. గత ఏడాది జరిగిన ఈ మోసంపై ఆయన జమ్మూలోని బహుఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని కోర్టు ద్వారా బుధవారం నవాబ్ మీర్ ఫిరాసత్కు అందించారు. అలీ ఖాన్కు విలువైన మణులు, రత్నాలు సేకరణ హాబీగా ఉంది. దీనికోసం ఆయన దేశ విదేశాలకు చెందిన వ్యాపారులను సంప్రదిస్తుంటారు. ఈ విషయం తెలిసిన జమ్మూలోని రాజౌరికి చెందిన మహ్మద్ రాయజ్, పూంచ్ వాసి మహ్మద్ తాజ్ ఖాన్ పథకం ప్రకారం ఫిరాసత్ను సంప్రదించారు. పలుమార్లు హైదరాబాద్ వచ్చిన వెళ్లిన వారు తమ వద్ద విలువైన నీలమణి, అలాంటి మణులతో చేసిన ఆభరణా లు ఉన్నాయంటూ నమ్మబలికారు. తొలుత ఓ మణి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన ఫిరాసత్ రూ.3 కోట్లు చెల్లించారు. అతడిని గత ఏడాది నవంబర్లో రాజౌరీకి పిలిపించిన వారు నకిలీ మణి అప్పగించారు. మరికొన్ని ఆభరణాల విక్రయం కోసం రూ.25 కోట్లకు బేరసారాలు చేశారు. ఆ ద్వయం అందించిన నీలమణిని పరీక్షించిన ఫిరాసత్ నకిలీదని గుర్తించారు. దీనిపై జమ్మూలోని బహు ఫోర్ట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ ద్వయం గత వారం చిక్కింది. వీరి నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో ఆ మొత్తాన్ని బాధితుడికి చేర్చారు. నిందితుల నుంచి పోలీసులు మరికొన్ని నకిలీ నీలమణులు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిరాసత్ నుంచి కాజేసిన మొత్తం వెచ్చించి వారు నిందితులు జమ్మూ, కాశ్మీర్లో ఆస్తులు ఖరీదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) 107 సెక్షన్ ప్రకారం ఇలాంటి ఆస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంది. దీంతో ఆ కోణంలో చర్యలు తీసుకుంటున్నారు. -
ఓటీటీలో టేస్టీ తేజ సినిమా.. చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. మే 9న విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహించారు.'6జర్నీ' సినిమా సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ మూవీలో పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. అయితే, ఈ సినిమాను చూడాలంటే రూ. 149 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడిలేని ఈ చిత్రానికి అదనంగా రెంట్ చెల్లించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. -
భారత్లో టెస్లా షోరూం ప్రారంభం ఈ వారంలోనే..
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి షోరూంను ఈ వారంలోనే ప్రారంభించనుంది. టెస్లా భారత్లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.భారత్లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది. -
TTD: అన్యమతస్తులను కొనసాగిస్తూనే ఉంటారా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. అసలు అలాంటి వాళ్లు విధుల్లో ఎందుకని.. వాళ్లను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని టీటీడీని నిలదీశారాయన. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంపై కరీంనగర్(తెలంగాణ) బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. అలాంటి వాళ్లను కొనసాగిస్తుండడం ఏంటి?. చర్చి, మసీదుల్లో హిందువులకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తున్నారా?.. .. అన్యమతస్తులైన ఉద్యోగుల వల్ల హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?. అలాంటి వాళ్లు ఉన్నారని బయటకు వస్తేనే సస్పెండ్ చేస్తారా?. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు… ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలి’’ అని బండి సంజయ్ టీటీడీని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. తెలుగు రాష్ట్రాల్లో దూపదీప నైవేద్య నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని స్పష్టం చేశారాయన. అనేక చారిత్రక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలి. కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్నా అని బండి సంజయ్ అన్నారు. -
‘అయ్యా రేవంత్.. 400 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్లు నీవేనా?’
సాక్షి, బీఆర్కే భవన్: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.చంద్రబాబుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారా..శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.నిజాం కట్టినవీ నీవేనా..సీఎం రేవంత్కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు. -
ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అదుర్స్
ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జూన్లో రూ.5,313 కోట్లు ప్రీమియం ఆదాయాన్ని సమకూర్చుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.60 శాతం పెరిగింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థలతో పోల్చి చూసినా 12 శాతం పెరిగినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. జూన్లో 25 ప్రైవేటు జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా వసూలు చేసిన ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం ఆదాయం రూ.8,408 కోట్లుగా ఉంది.ఈ ఏడాది జూన్లో ఎల్ఐసీ 12.49 లక్షల కొత్త పాలసీలను జారీ చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇలా జారీ చేసిన కొత్త పాలసీలు 14.65 లక్షలుగా ఉండడం గమనార్హం. ఇందులో వ్యక్తులకు సంబంధించిన పాలసీలు 12.48 లక్షలగా ఉంటే, గ్రూప్ పాలసీలు 1,290గా ఉన్నాయి. ఎల్ఐసీకి గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం జూన్ నెలలో రూ.22,087 కోట్లుగా ఉంది.గతేడాది జూన్ కంటే 7 శాతం తక్కువ. ప్రైవేటు జీవిత బీమా కంపెనీల గ్రూప్ ప్రీమియం ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి రూ.5,315 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ మొత్తం ప్రీమియం (ఇండివిడ్యువల్, గ్రూప్ కలసి) ఆదాయం జూన్ నెలలో 3.43 శాతం తక్కువగా రూ.27,395 కోట్లుగా నమోదైంది. ప్రైవేటు కంపెనీల మొత్తం ప్రీమియం ఆదాయం సైతం 2.45 శాతం తగ్గి రూ.13,722 కోట్లకు పరిమితమైంది. -
ENG VS IND 3rd Test: అదే జరిగితే టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్ చేయాలి..!
లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. బంతిని అందుకున్న తర్వాత పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు.ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినా అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్గా దృవ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. పంత్ గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే అందులో గాయం తీవ్రత, మ్యాచ్లో పంత్ కొనసాగింపుపై ఎలాంటి సమాచారం లేదు.రెండో రోజు ఆట ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పంత్ గాయంపై సందిగ్దత వీడలేదు. ఈ నేపథ్యంలో పంత్ మ్యాచ్లో కొనసాగుతాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్కు దూరమైతే టీమిండియాకు అది భారీ ఎదురుదెబ్బ అవుతుంది.ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ మొదలయ్యాక గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ లేదా వికెట్కీపింగ్కు మాత్రమే అనుమతి ఉంటుంది. సబ్స్టిట్యూట్గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి వీలు ఉండదు. ఈ లెక్కన పంత్ మైదానంలోని తిరిగి రాకపోతే భారత్ 10 మందితోనే బ్యాటింగ్ను కొనసాగించాల్సి ఉంటుంది. భీకర ఫామ్లో ఉన్న పంత్ బ్యాటింగ్కు అందుబాటులో ఉండకపోతే టీమిండియా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ సిరీస్లో పంత్ కెరీర్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సహా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్ల్లో 342 పరుగులు చేసి గిల్ తర్వాత ఈ సిరీస్లో సెకెండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఇలాంటి ఫామ్లో ఉన్న పంత్ బ్యాటింగ్కు దిగకపోతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. పంత్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన జురెల్ జడేజా బౌలింగ్లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.కాగా, ఈ సిరీస్లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది. -
అలాంటి ఇలాంటి ప్రేమకథ కాదు..!
ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. 70 ఏళ్లు పైబడ్డాక ప్రేమ అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ వృద్ధ జట ఆ వయసులో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. నెటిజన్లు కూడా ప్రేమకు వయసు అడ్డంకికాదు అంటే ఇదే అంటూ ఆ వృద్ధ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని త్రిశూర్లో చోటుచేసుకుంది. వారే విజయరాఘవన్(79), సులోచన(75). ఈ ఇద్దరి నడుమ ప్రేమ ప్రభుత్వం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిగురించింది. విజయ రాఘవన్ ఈ ఆశ్రమంలోకి 2019లో రాగా, సులోచన 2024లో వచ్చారు. ఇరువు వృద్ధాశ్రమ కారిడార్లో కలుసుకుని మాట్లాడుకునే వారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కేంత వకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆనందకర వేడుక కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు, నగర మేయర్ ఎం.కె. వర్గీస్ సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. ఆ దంపతులు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. నెటిజన్లు కూడా ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఫిదా అవుతూ..నిజమైన ప్రేమకు వయోభేదం ఉండదు..అది అవుధులు లేనిది అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..! ఏకంగా ప్రధాని మోదీ..) -
'కుబేర'ను మెప్పించిన సాంగ్ వీడియో వచ్చేసింది
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన చిత్రం 'కుబేర'... భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'పోయిరా పోయిరా మావా' సాంగ్ విడుదలైంది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విడదులకు ముందు ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ సాంగ్ను భాస్కరభట్ల రాయగా ధనుష్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. -
రేయ్ తమ్ముడూ.. ఎందుకురా ఏడుస్తున్నావ్?
సెల్ఫోన్ పోయిందని ఓ యువకుడు నీళ్లలో వెతకడం.. అది దొరక్క చివరకు ఏడుస్తూ కూర్చోవడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడం.. నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. రాజస్తాన్ జైపూర్లో స్థానిక సుభాష్ చౌక్లో నివాసం ఉంటున్నాడు హల్దార్ అనే యువకుడు. తన స్కూటీ మీద వెళ్తుంటే రామ్ నివాస్ బాఘ్ వద్ద రోడ్డు మీద వానకు నిలిచిపోయిన నీటిలో పడిపోయాడు. దెబ్బలేం తాకలేదు. అయితే ఆ పడడమే అతని జేబులోని సెల్ ఫోన్ ఎగిరి నీళ్లలో పడింది. ‘అయ్యో నా ఫోన్..’ అనుకుంటూ కంగారుగా నీళ్లలోకి దిగాడు. పాపం.. ఆ ఫోన్ కోసం ఆ బురద నీటిలో చాలాసేపు వెతికాడు.అటుగా వెళ్లేవాళ్లు.. ‘‘ఎవడ్రా.. వీడు’’ అన్నట్లుగా చూస్తూ పోతున్నారే తప్ప, ఆగి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఒక్కడు తప్ప!. చాలాసేపైనా దొరక్కపోవడంతో చివరకు ఆ నీళ్లోనే కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా ఆ ఒక్కడు తన ఫోన్లో బంధిస్తూనే ఉన్నాడు. ఈలోపు.. ఆ వీడియో తీసే వ్యక్తి ఏమైందని అడిగాడు.. రోడ్లు గుంతలు లేకుండా సరిగ్గా ఉంటే.. మున్సిపల్ వాళ్లు సరిగా పని చేసి ఉంటే.. ఈ నీరు ఇలా ఆగేదా?. నా ఫోన్ పోయేదా?.. ఇలాంటి వాళ్ల వల్లే వ్యవస్థలో నాలాంటి వాళ్లు విఫలం అవుతూనే ఉన్నారు అంటూ ఆ యువకుడు భారీ డైలాగులే కొట్టాడు.ఈలోపు ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. చాలామంది పోయింది ఫోనే కదా.. అంటూ తామూ ఫోన్లను పొగొట్టుకున్న సందర్భాలను ప్రస్తావించారు. మరికొందరు అధికారులను తిట్టిపోశారు. ఇంకొందరు అటుగా వెళ్లేవాళ్లు సాయం చేసి ఉండొచ్చు కదా అంటూ సలహా పడేశారు. ఇంకొందరు బహుశా అదే అతని జీవనాధారం అయి ఉండొచ్చని.. అతని వివరాలు ఇస్తే కొత్త ఫోన్ కొనిస్తామని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా..! ప్చ్.. ఎవరేమనుకున్నా ఆ కన్నీళ్లకు మాత్రం ఓ అర్థం ఉంది. రేయ్ హల్దార్.. ఎందుకురా ఏడుస్తున్నావ్?. ఫోన్ పోయిందనా?.. ఇంట్లో వాళ్లు తిడతారనా?. కష్టపడి సంపాదించుకున్నావనా?. లేకుంటే సాయం చేయకుండా జనాలు ఎవరిమానాాన వాళ్లు వెళ్లిపోయారనా?. రోడ్లు సవ్యంగా లేవనా? నీళ్లలో పడిపోయావనా? అధికారులు.. సిబ్బంది సవ్యంగా పని చేయలేదనా?.. రేయ్ తమ్ముడూ జీవితం అంటే ఇంతేనా?.. పైకి లేవు!!. సాయానికి జనం ముందుకొస్తున్నారుగా.. చూద్దాం! A viral video shows a young man breaking down in tears after his mobile phone reportedly slipped into rainwater in Jaipur.#JaipurRains #Rajasthan #Viral #ViralVideo #HeavyRainfall #Trending pic.twitter.com/KwDtwoYaAj— TIMES NOW (@TimesNow) July 10, 2025 -
రోడ్డు పరిశీలనలో అపశృతి.. ప్రాణ భయంతో అధికారుల పరుగో పరుగు..
అధికారుల అవినీతికి అద్ధం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంజినీర్లు, అధికారుల సమక్షంలోనే ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ డొల్లతనం బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల అవినీతకి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే..వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్వానీ తాలూకాలోని ఖడ్కి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో, ఈ మార్గంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి.. రోడ్డు వేయాలని స్థానికులు, విద్యార్థులు అధికారులను కోరారు. అంత వరకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇంతలో ఓ ఇంజినీరు మాత్రం అతికి పోయి.. అదే మార్గంలో పైపులు వేసి.. రోడ్డు నిర్మాణం చేపట్టాడు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద చిన్న బ్రిడ్జిలాగా పైపులైన్పై రోడ్డు నిర్మించారు. అనంతరం, రోడ్డు నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఇంజినీర్, అధికారుల బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం, వారు నిర్మించిన రోడ్డుపై లారీ వస్తున్న సమయంలో.. రోడ్డు కుంగిపోయి.. ఆ లారో బోల్తా కొట్టింది.ఈ క్రమంలో భయంతో వణికిపోయిన అధికారుల బృందం.. పరుగులు తీశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే విధంగా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఓ అధికారి అయితే.. పక్కనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి బురద నీటిలో దాక్కునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అధికారుల అవినీతికా ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Engineer and his entire team had arrived in Beed, Maharashtra to inspect the road.During the inspection, a truck got stuck on the road and overturnedThis is the live demo testing of Corruption 🤡pic.twitter.com/InEpS94e3z— 🚨Indian Gems (@IndianGems_) July 10, 2025 -
వాట్సప్కు పోటీగా త్వరలో బిట్చాట్
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్ను.. అందునా ఆఫ్లైన్లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్చాట్. ఇంటర్నెట్తో అవసరం లేకుండా మెసేజ్లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్చాట్ అంటే అనే బ్లూటూత్తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్లో ఉంటే సరిపోతుంది. బిట్చాట్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటూ బ్లూటూత్ ఆన్ చేసి మెసేజ్లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్?బిట్చాట్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్లైన్ మెసేజింగ్ యాప్లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టూ మెసేజ్ మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్ అంటున్నారు. సింపుల్గా.. డివైజ్ టూ డివైజ్ కనెక్షన్. ఫోన్లో బ్లూటూత్ ద్వారా బిట్చాట్ పనిచేస్తోంది నో సెంట్రల్ సర్వర్: వాట్సప్,టెలిగ్రాం తరహా ఒక యూజర్కు పంపిన మెసేజ్ సర్వర్లోకి వెళుతుంది. సర్వర్ నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. బిట్చాట్లో అలా ఉండదు.. నేరుగా సెండర్నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. మెష్ నెట్వర్కింగ్: బ్లూట్తో పనిచేసే ఈ బిట్చాట్ యాప్ ద్వారా రిసీవర్ సమీపంలో లేనప్పటికీ మెసేజ్ వెళుతుంది. ఈ టెక్నిక్ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్ అవసరం లేదు: ఈ యాప్లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్ నెంబర్,ఈమెయిల్తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ : బిట్చాట్ కొన్నిసార్లు పీట్ టూ పీర్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్వర్క్లోని యూజర్ టూ యూజర్ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్ను ‘రూమ్లు’ అని పిలుస్తారు. ఇవి పాస్వర్డ్తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్ఫేస్: యాప్ను ఇన్ స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్ రూమ్స్: హ్యాష్ట్యాగ్లతో పేర్లు పెట్టి, పాస్వర్డ్లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్చాట్ బీటా వెర్షన్లో టెస్ట్ఫ్లైట్ మోడ్లో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్ ఫ్లైట్ మోడ్ అనేది యాపిల్ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్ఫారమ్. యాప్లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్బ్యాక్తో సంబంధిత యాప్ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు. -
సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు
మిత్రాశర్మ, బిగ్బాస్ శ్రీహాన్, గీతానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వర్జిన్ బాయ్స్' ఈ మూవీ జూలై 11న థియేటర్లో విడుదలైంది. థియేటర్లలో టికెట్ కొన్న ఆడియెన్స్కు ఐఫోన్ను గిఫ్ట్గా ఇస్తామని ట్రైలర్ లాంఛ్ మేకర్స్ వెల్లడించారు. వారు చెప్పిన విధంగానే మొదటిరోజు మాట నిలబెట్టుకున్నారు. దర్శకుడు దయానంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ నుంచి రాజా దారపునేని నిర్మించారు.వర్జిన్ బాయ్స్ విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "మేం పెట్టిన స్కీమ్ టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్ జనాల్లోకి బాగా వెళ్లింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని, థియేటర్లకు ప్రేక్షకులను ఎక్కువ శాతం వచ్చేలా చేయాలని మేమీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అలాగే దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. కథ ఏదైతే చెప్పారో అదే నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. అలాగే సినిమా కోసం ఆర్టిస్ట్లు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేశారు. ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. మిత్ర శర్మ ప్రమోషన్ కోసం కూడా బాగా కష్టపడుతున్నారు. గతంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కూడా పలువురికి ఆమె సాయం అందించారు.' అని తెలిపారుతొలి ఫోన్ గెలుచుకున్న ప్రవీణ్హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఓ షాప్ ఓపెనింగ్లో పాల్గొన్న మిత్ర శర్మ, వర్జిన్ బాయ్స్ టీం అడ్వాన్స్ టికెట్ తీసుకున్న వారిని వివరాలతో లాటరీ తీయగా చందానగర్కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. ఇది మొదటి ఫోన్ మాత్రమేనని. ఇంకా దాదాపు పది లాటరీస్ ఉన్నాయని సినిమా టీం తెలిపింది. -
అమాంతం ఎగిసిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు అమాంతం ఎగిశాయి. క్రితం రోజున ఫ్లాట్గా ఉన్న పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..
హైదరాబాద్ నగరం మరోసారి నవ్వుల పండుగకు వేదిక కానుంది. డిజిటల్ హాస్య తార ‘అయ్యో శ్రద్ధా’గా గుర్తింపు పొందిన శ్రద్ధా జైన్ తన అద్భుత స్టాండప్ కామెడీ షో ‘సో మినీ థింగ్స్’ పేరుతో దేశంలో చివరి సారి ప్రదర్శించనుంది. ఈ హృద్యమైన వినోద యాత్ర ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రదర్శన కేవలం వినోదం మాత్రమే కాదు.. భారతీయ కుటుంబ జీవనాన్ని, మన ఊహల్ని, నిత్యజీవితంలో మినీ మినీ కహానీలను పరిపూర్ణంగా హాస్యంగా మలిచే ఓ అనుభూతిని ప్రదర్శించనుంది. శ్రద్ధా కామెడీ మాయాజాలం మానసిక అంతర్భావాల పరంగా అద్భుతంగా ఉంటుందని అభిమానుల మాట. ఓ చిన్న పిల్లవాడిలా జిజ్ఞాసతో, అమాయకంగా ఆలోచించే తత్వం ఆమె పండించే ప్రతి కథనంలో కనిపిస్తుంది. ‘సో మినీ థింగ్స్’ అనే పేరు కూడా ఆమె ప్రదర్శనలోని మినీ కథలు, మినీ ఎమోషన్స్, మినీ వెర్షన్లకు అద్దం పట్టినట్లే ఉండనుంది. భారతీయ కుటుంబాల్లోని సరదా సంభాషణలు, అపరిచిత సందర్భాల్లో తలెత్తే హాస్యాన్ని తన ప్రత్యేక శైలిలో మలచి ప్రేక్షకులకు అందించడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రదర్శనకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న లైవ్ట్రీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోను నిగమ్, హరిహరన్ వంటి సంగీత దిగ్గజాల లైవ్ షోల వేదికగా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా షోను ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రదర్శించి, ఇప్పుడు చివరగా భారత్లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో భారీ ప్రేక్షకాభిమానంతో ప్రారంభమైన ఈ చివరి టూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ షోతో ముగుస్తుంది. ఈ సందర్భంగా సీఈఓ శరత్ వత్సా మాట్లాడుతూ.‘దాదాపు 90 నిమిషాలు ప్రేక్షకులు నవ్వుల ప్రపంచంలో మునిగి తేలాక వారి మనసు తేలికపడి, హృదయాన్ని హత్తుకునే అనుభూతితో బయటికి రావడం.. ఇదే మాకు సంతృప్తి. 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ‘మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ – ఫిమేల్’ అవార్డును అందుకున్న ఈ ఇంజినీర్, ఆర్జే, కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం కామెడీ ప్రపంచానికి ఒక మైలు రాయిలా మారిపోయింది’ అని తెలిపారు. -
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే! -
ENG VS IND: లార్డ్స్ టెస్ట్లో ఆసక్తికర దృశ్యాలు.. బుమ్రాను భయపెట్టిన లేడీబర్డ్స్
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో వింత దృశ్యాలు కనిపించాయి. మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్ (ఆరుద్ర పరుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో చోటు చేసుకుంది. ఆకాశ్దీప్ నాలుగో బంతి పూర్తి చేశాక, లేడీబర్డ్స్ ఒక్కసారిగా మైదానాన్ని ఆవహించాయి. అప్పటికీ క్రీజ్లో ఉన్న స్టోక్స్, రూట్ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ పురుగులు స్టోక్స్ హెల్మెట్లోకి కూడా ప్రవేశించాయి. స్టోక్స్ కాసేపు అసహనానికి గురయ్యాడు. ఈ పురుగుల దండయాత్ర కారణంగా మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. తిరిగి అవి వెళ్లిపోయాక మ్యాచ్ యధాతథంగా కొనసాగింది. ఈ ఘటన తర్వాత రెండు ఓవర్లకే తొలి రోజు ఆట పూర్తియ్యింది. రూట్ 99, స్టోక్స్ 39 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లేడీబర్డ్స్ ఆటగాళ్లపై దాడి చేసిన దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మ్యాచ్లు జరుగుతుండగా తేనెటీగలు, పాములు, పక్షులు మ్యాచ్కు అంతరయాన్ని కలిగించడం చూశాం. కానీ లేడీబర్డ్స్ దాడి చేయడం ఇదే మొదటిసారి. లండన్లో ఈ సీజన్లో మైదాన ప్రాంతాల్లో లేడీబర్డ్స్ గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే జనావాసాల్లో రావడం చాలా అరుదని అక్కడి జనాలు అంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట హోరాహోరీగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు సెడ్జింగ్తో ఒకరినొకరు కవ్వించుకున్నారు. అయితే అంతిమంగా జో రూట్ పైచేయి సాధించాడు. తొలి రోజు ఇంగ్లండ్ తమ బజ్బాల్ కాన్సెప్ట్ను పక్కన పెట్టి క్రీజ్లో కుదురుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. రూట్, స్టోక్స్ చాలా సహనంగా బ్యాటింగ్ చేశారు.టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్కు నితీశ్ కుమార్ రెడ్డి ఆదిలోనే వరుస బ్రేక్లిచ్చాడు. నితీశ్ 14వ ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరీ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత పోప్, రూట్ కలిసి ఇన్నింగ్స్ను నిర్మించారు. ఈ దశలో రవీంద్ర జడేజా ఓ అద్భుతమైన బంతితో పోప్ ఆట కట్టించాడు. ఆతర్వాత కొద్ది సేపటికే బుమ్రా వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పని పట్టాడు. బుమ్రా బ్రూక్ను కళ్లు చెదిరే బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.తొలి రోజు రూట్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పలు రికార్డులు సాధించాడు. 33 పరుగుల వద్ద భారత్పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 45 పరుగుల వద్ద భారత్పై టెస్ట్ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల స్కోర్ వద్ద ఇంగ్లండ్లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. తొలి ఫోర్తో టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు.కాగా, ఈ సిరీస్లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది. -
రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..
నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్ జిమ్స్కు డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్ హోమ్స్లో, కో–లివింగ్ ఫ్లాట్స్లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్ జిమ్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది. నగరంలో హోమ్ జిమ్ ట్రెండ్ ఊపందుకోడానికి కోవిడ్ పుణ్యమాని వర్క్ కల్చర్లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్నెస్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం ఉంటేనే ఫలం.. ఒక మోస్తరు హోమ్ జిమ్ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్ హోమ్ జిమ్ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్రూమ్ కార్నర్ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్ సెటప్ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది. బడ్జెట్ ఇలా.. హోమ్ జిమ్ బడ్జెట్ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హోమ్ జిమ్కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్ రేంజ్లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్ ఎక్విప్మెంట్ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.ప్రాథమిక పరికరాలు.. ఇంట్లో జిమ్లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్ సెట్స్ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్ ప్రెస్ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్మిల్ లేదా ఎలిప్టికల్ మిషన్ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్ ఇన్ వన్ మల్టీ జిమ్ మిషన్ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్ మిషన్ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి. ప్రతికూలతలు.. సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది. ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్ దొరకదు. వర్కవుట్స్ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ. ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్మెంట్ భారంగా పరిణమించవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. నగర ట్రాఫిక్లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు. జిమ్లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక్క హోమ్ జిమ్తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్ మెంబర్షిప్ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు. -
జగన్ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.