-
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంచుకున్నాడు. బంగర్ తన ఎంపిక చేసిన తుది జట్టులో ఓపెనర్లగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్కు అవకాశమిచ్చాడు.రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా రాహుల్ సరైనోడని స్టార్ స్పోర్ట్స్ చర్చాకార్యక్రమంలో బంగర్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో ఆన్క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు రావాలని సంజయ్ సూచించాడు.ఇక ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్కు ఐదో స్ధానంలో ఈ భారత మాజీ క్రికెటర్ చోటు ఇచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిలకు స్ధానం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ను బంగర్ ఎంపిక చేశాడు.అయితే ఈ మాజీ బ్యాటింగ్ కోచ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడం గమనార్హం. జడేజాతో పాటు యువ సంచలనం సాయిసుదర్శన్ను కూడా అతడు పరిగణలోకి తీసుకోలేదు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బంగర్ ఎంచుకున్న భారత తుది జట్టుయశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్చదవండి: Wtc Final 2025: నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్ -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బాలీవుడ్ తారల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025 Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏— Akshay Kumar (@akshaykumar) June 12, 2025 -
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
Ahmedabad Plane Crash గుజరాత్లోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్లైనర్తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. #WATCH | Air India plane crash: "My sister was going to London. She had her flight around 1.10 pm, but the flight crashed," says Bhawna Patel as she arrived at the Civil Hospital in Ahmedabad, Gujarat pic.twitter.com/aDkixvDB9d— ANI (@ANI) June 12, 2025మేడే కాల్ విమానంనుంచి ‘ మేడే (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు" డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా స్థానిక అధికారులతో కలిసి చేస్తోంది. ఈ మేరకు ఒక ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్లు NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు.బోయింగ్ 787 డ్రీమ్లైనర్బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు, లార్డర్ డిమ్మబుల్ విండోస్, నిశ్శబ్ద క్యాబిన్ లాంటి ఫీచర్స్ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. 13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్లైనర్లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్లో జపాన్ ఎయిర్లైన్స్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్బ్లోయర్ సామ్ సలేహ్పూర్ డ్రీమ్లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.- మార్చి 2024లో, LATAM ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్లైనర్ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు. -
సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. -
సినిమాలతో కాదు.. ఆ ఒక్క డీల్తో కోట్ల రూపాయలు!
బాలీవుడ్ నటులు ఒక్కో సినిమాకు దాదాపు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్లోనూ కొందరు స్టార్స్ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి లిస్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ శివారులో మూడు అపార్ట్మెంట్లను ఆయన లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. వాటి ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.4.30 కోట్ల వరకు అర్జించనున్నారు. తాను లీజ్ తీసుకున్న మూడు అపార్ట్మెంట్లలో నెలవారీ అద్దె రూ. 6.30 లక్షలుగా ఉన్నట్లు టాక్. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4 కోట్లకు పైగా సంపాందించనున్నారు జాన్ అబ్రహం. ఈ డీల్ను గత నెలలోనే క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫ్లాట్లకు కలిపి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు.ప్రధానంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు.ఇక జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ది డిప్లొమాట్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నటించిన టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించింది. -
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025 -
Wtc Final 2025: నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్
నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్35 ఓవర్లకు సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. బెడింగ్హామ్(17 బ్యాటింగ్), బావుమా(36 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 66/427 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(17), బెడింగ్హమ్(17) ఉన్నారు.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆసీస్ బౌలింగ్ ఎటాక్ను మిచెల్ స్టార్క్ ప్రారంభించాడు. క్రీజులో ప్రస్తుతం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా(3), బెడింగ్హామ్(8) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బ్యాటింగ్కు చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. -
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్గా అఖిల్ అర్థాంగి
Akhil-Zainab Reception నూతన వధూవరులు అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ రిసెప్షన్ వేడుకలో అందంగా మెరిసారు. మూడు ముళ్ల వేడుక అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్ ఇచ్చింది. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడిగా కనిపించారు. ఆర్టిస్ట్, వ్యాపారవేత్త జైనబ్ రవద్జీ రిసెప్షన్ లుక్ వైరల్గా మారింది. మేకప్ ఆర్టిస్ట్ సూర్య సింగ్ జైనబ్ లుక్కు సంబంధించిన వీడియోన, ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సింపుల్గా నెట్టెడ్ ఫ్రాక్ ధరించిన జైనబ్ మినిమల్ మేకప్తో అందంగా మెరిసింది. అలాగే పెళ్లికి ధరించినట్టు గానే మొత్తం వజ్రాభరణాలను ఎంచుకుంది. డైమండ్ చౌకర్, లేయర్డ్ చెయిన్ ధరించింది. మ్యాచింగ్గా చెవులకు డైమండ్ ఝుంకీలు వేసుకుంది. అటు కొత్త పెళ్లి కొడుకు అఖిల్ కూడా సింపుల్ లుక్లో అదరగొట్టేశాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరో మరిది అఖిల్ రిసెప్షన్ లో రెడ్ సారీలో అక్కినేని వారి పెద్ద కోడలు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ లుక్ నెట్టింట సందడిగా మారింది. భర్త నాగ చైతన్యతో కలిసి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం తరువాత రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ అప్డేట్ విడుదల
గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారులకు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఇటీవల ఐఓఎస్ 26ను ప్రకటించిన నేపథ్యంలో గూగుల్ కూడా పోటీగా ఆండ్రాయిడ్ 16ను లాంచ్ చేసింది. అయితే ఈ అప్డేట్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన గూగుల్ పిక్సెల్ డివైజ్ల్లో మాత్రమే దీన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ద్వారా యూజర్లకు మరింత భద్రత, డిజైన్, పనితీరులో అనేక అప్గ్రేడ్లను తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది.ఆండ్రాయిడ్ 16ను సపోర్ట్ చేసే ఫోన్ల జాబితాగూగుల్ పిక్సెల్ ఫోన్లకు ముందుగా కొత్త సాఫ్ట్వేర్ కోసం యాక్సెస్ ఇస్తోంది. శామ్సంగ్, వన్ప్లస్, షియోమీ వంటి ఇతర బ్రాండ్లు తమ కస్టమ్ ఆప్షన్లకు అనుగుణంగా ఆండ్రాయిడ్ 16ను రాబోయే కొన్ని నెలల్లో అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్ 16 అప్డేట్ కింది మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది.పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఎపిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఎపిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8ఎపిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9ఎపిక్సెల్ ఫోల్డ్పిక్సెల్ టాబ్లెట్పైన తెలిపిన డివైజ్ల్లో దేనినైనా ఉపయోగిస్తుంటే ఆండ్రాయిడ్ 16 ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్గా కొత్త ఓఎస్ను అందిస్తారు.ఎలా ఇన్స్టాల్ చేయాలంటే..ముందుగా ఫోన్లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి.కిందకు స్క్రోల్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ను ట్యాప్ చేయాలి.అప్డేట్ల కోసం చెక్ ఆప్షన్ ఎంచుకోవాలి.ఒకవేళ ఆండ్రాయిడ్ 16 అందుబాటులో ఉంటే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆప్షన్ ట్యాప్ చేయాలి.పూర్తయిన తర్వాత కొత్త వెర్షన్ను ఉపయోగించేముందు ఒకసారి ఫోన్ను రిస్టార్ట్ అవుతుంది.ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!కొన్ని ప్రధాన ఫీచర్లు ఇవే..లాక్ స్క్రీన్పై లైవ్ అప్డేట్స్అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్మెరుగైన యాప్ కంపాటబిలిటీఅడాప్టివ్ యాప్స్ ఫీచర్తో ఆండ్రాయిడ్ 16 యాప్స్ ఆటోమేటిక్గా స్క్రీన్ సైజులకు అడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది ఫోల్డబుల్ ఫోన్లు, టాబ్లెట్లకు అనుకూలంగా ఉంటుంది.సెట్టింగ్స్లో కొత్త కలర్ హైలైట్స్, అప్డేటెడ్ ఫాంట్స్, స్లీకర్ మీడియా కంట్రోల్స్ అందిస్తుంది.బ్యాటరీ హెల్త్ ఇండికేటర్ సూచిస్తుంది. -
వింత కేసు: కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటలా ఉంటున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరి వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియా క్రేజ్ వంటి రకరకాల కారణాలతో వైవాహిక బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరకట్నం దంపతుల పాలిట శాపంగా మారి బాంధవ్యాన్ని ముక్కలు చేస్తోంది. ఎన్నో వరకట్నం కేసుల్లో నగదు లేదా బంగారం వంటి అత్తింటి డిమాండ్లు గురించి విని ఉంటాం. కానీ ఇలాంటి డిమాండ్లతో కూడిన వరకట్నం కేసు మాత్రం ఇదే మొదటిది. వివరాల్లోకెళ్తే..బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన దీప్తి అనే మహిళకు 2021లో అదే గ్రామానకి చెందిన యువకుడితో వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లైనా రెండు నెలల వరకు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ..బైక్, మరికొంత నగదు ఇవ్వాల్సిందే అంటూ దీప్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు అత్తింటివారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడూ మా అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడి కోసం కిడ్నీ కూడా దానం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీప్తి భర్త పెళ్లికి ముందు నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నడు. కానీ దీప్తికి ఆ విషయం పెళ్లైన తర్వాతే తెలిసింది. మొదట్లో అత్తంటి వారి డిమాండ్లు ప్రతీఇంట్లో ఉండేవే కదా అని తేలిగ్గా తీసుకుంది. అది రాను రాను మితిమీరి..ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేంత వరకు దారితీశాయి. ఆమె కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే కుటుంబంలో మరింత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో పోలీసులు సంప్రదించింది దీప్తి. ఆ నేపథ్యంలో అధికారులు ఇరువురి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా..అది కూడా విఫలమైంది. అదీగాక అత్తింటి వేధింపులతో విసుగుపోయిన దీప్తి భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించి, విడాకులు కావలంటూ కోర్టుని ఆశ్రయించింది. అందుకు భర్త మాత్రం ససేమిరా అంటున్నాడు. అలాగే పోలీసులు దీప్తి ఫిర్యాదు మేరకు ఆమె భర్త తోపాటు మరో ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఎక్కడైనా వరకట్నం కేసులో..అధిక డబ్బు లేదా బంగారం కోసం డిమాండ్ చేయడం వంటివి ఉంటాయి ఏకంగా ఓ వ్యక్తి అవయవాన్ని సైతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన వింత కేసు ఇదేనని చెబుతున్నారు అధికారులు.(చదవండి: చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! తనిఖీల్లో షాకింగ్ విషయాలు..) -
కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ?
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో 110మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారా? లేదా? అనేది అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు.
సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎమ్ (Niharika NM) టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మ్యాడ్ ఫేమ్ విష్ణు, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం (జూన్ 12న) మిత్రమండలి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వించేలా ఉంది.నేను వయసులో చిన్నవాడినే..అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్గా సెలక్ట్ చేసిన అల్లు అరవింద్ (Allu Aravind)కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్ స్టేజీ ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్ జెనరేషన్తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలక్ట్ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది.కథ తెలీకుండా సినిమా చూడబోతున్నాఈ సినిమా డైరెక్టర్ విజయేందర్ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట.. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్గా నావల్ల కావడం లేదు సర్, నేనెళ్లిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే.. మీ రేంజ్ వేరు, నా వల్ల కావట్లేదు.. మళ్లీ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వస్తాను సర్ అని చెప్పి వెళ్లిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను.ఫేక్ ఐడీతో ఫాలో కొట్టా..అయితే వాసు.. ఈ సినిమా కోసం ఐదారుగురు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు? చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో తెగ చూశాం అని చెప్పాను. ఇన్స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది. మా ఒరిజినల్ ఐడీతో సోషల్ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా.. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక.. పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా -
UNEP అంబాసిడర్, నటి లగ్జరీ కారు చూశారా? ధర ఏంత?
బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) తన ఖరీదైన కార్ల లిస్ట్లో మరో లగ్జరీ కారును జోడించింది. లగ్జరీ కంపెనీ బీఎండబ్లయూకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 635 కి.మీ. దూసుకుపోతుందట. మరీ దీని ఖరీదెంత? ఆమె గ్యారేజీలో ఇంతకుముందున్న కార్ల లిస్ట్ ఏంటి?బాలీవుడ్ ప్రముఖులు నెమ్మదిగా లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో ఇపుడు దియామీర్జా చేసింది. భారత మార్కెట్లో విలాసవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా పేరొందిన, రూ.1.39 కోట్ల (ప్రారంభధర) విలువైన BMW iX ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్) అంబాసిడర్ దియా గ్యారేజీకి సరిగ్గా సరిపోయేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.BMW బ్రాండ్పై దియాకు చాలా ప్రేమ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె లగ్జరీ కార్ కలెక్షన్లో BMW X3,BMW X5 కూడా ఉన్నాయి. భారతదేశంలో BMW X3, ధర సుమారు రూ.45 లక్షలు. 2013లో గుర్గావ్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో BMW X1ని లాంచింగ్ ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ వెహికల్ ప్రౌడ్ ఓనర్గా ప్రకటించుకుంది. ఇంకా గ్యారేజీలో లెక్సస్ LX 570 , ఆడి Q7 వంటి ఇతర హై-ఎండ్ SUVలు కూడా ఉన్నాయి. చదవండి: ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?దియా మీర్జా కొత్త EVలో 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్,14.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ను,కర్వ్డ్ డిస్ప్లే లాంటి స్పెషల్ ఫీచర్స్తోపాటు, ఎలక్ట్రోక్రోమిక్ పనోరమిక్ గ్లాస్ రూఫ్ , మెమరీ ,మసాజ్ సామర్థ్యాలను అందించే మల్టీ-ఫంక్షనల్ సీట్లు ఉన్నాయి. 195 kW DC ఛార్జర్ని ఉపయోగించి దాదాపు 35 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు, 50 kW DC ఛార్జర్ని ఉపయోగించి 97 నిమిషాల్లో, 22 kW AC ఛార్జర్ని ఉపయోగించి దాదాపు 5.5 గంటల్లో, 11 kW AC ఛార్జర్ని ఉపయోగిస్తున్నప్పుడు దాదాపు 11 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒకే ఛార్జ్పై 425 కి.మీ ప్రయాణించగలదట.బ్లాక్ సఫైర్ మెటాలిక్ కలర్లో ఈ కారులో లోపలి భాగం కాస్టానియా చెస్ట్న,నలుపు రంగుల క్లాసిక్ డ్యూయల్-టోన్ షేడ్స్లో ఉంది ఈ కారు. రితేష్ దేశ్ముఖ్,నుష్రత్ భరుచ్చా ,ఇబ్రహీం అలీ ఖాన్ వంటి నటులతోపాటుగా , కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ లగ్జరీ కారు సొంత చేసుకున్నారు. ఇదీ చదవండి: To day recipes : మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి! -
బాస్ కూతురితోనే ప్రేమలో.. 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న నటుడు!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. నటీనటుల మధ్య స్నేహం ఏర్పడడం.. అదికాస్త ప్రేమగా మారి చివరకు మూడు మూళ్ల బంధంలో ఒక్కటైపోతుంటారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్-నటి స్వరూప్ సంపత్ జంట ఒకటి. బాలీవుడ్లో ఒక ఐకానిక్ జంటగా గుర్తింపు పొందిన పరేష్-స్వరూప్ సంపత్ ప్రేమ కథ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఒకరికోసం ఒకరు దాదాపు 12 ఏళ్లు ఎదురుచూసి పెళ్లి చేసుకున్నారట.అలా ప్రేమలో.. హిందీలోనే కాదు తెలుగులోనూ పరిచయం అక్కర్లేని పేరు పరేష్ రావల్ . 'హేరా ఫేరీ', 'ఓఎమ్జీ', 'సర్దార్', ‘హంగామా’తదితర చిత్రాలతో బాలీవుడ్ని ఆకట్టుకున్న పరేష్.. మనీ, క్షణ క్షణం, శంకర్ దాదా ఎంబిబిఎస్( లింగం మామ పాత్ర), రిక్షావోడు, గోవిందా గోవిందా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసునూ దోచుకున్నాడు. ఈ విలక్షణ నటుడు నాటక రంగం నుంచే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడనే సంగతి అందరికి తెలిసిందే. నాటకాలు వేస్తున్న సమయంలోనే స్వరూప్ సంపత్తో ప్రేమలో పడ్డాడట. 1970లలో ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో నాటకం ప్రదర్శించేందుకు పరేష్ తన కాలేజీ స్నేహితులతో కలిసి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి స్వరూప్ వచ్చింది. అప్పుడే స్కూలింగ్ అయిపోయిన స్వరూప్.. చేతిలో ఈవెంట్కి సంబంధించిన పత్రాలను పట్టుకొని బయట నిలబడి ఉందట. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు పరేష్. ఆమె అందానికి ముగ్థుడైపోయి.. స్నేహితుడి మహేద్రతో .. ‘నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను’ అని స్వరూప్ని చూపించాడట. ఆమె గురించి ఆరా తీస్తే.. వారి బాస్ కూతురే అని తెలిసింది. ‘చీఫ్ ప్రొడ్యూసర్ కూతురినే ప్రేమిస్తావా?’ అని మహేద్ర నన్ను బెదిరించాడు. ‘ఎవరి కూతురు అయినా సరే.. నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటా’ అని అప్పేడే వాడికి చెప్పేశా’అని పరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.12 ఏళ్లు ఎదురుచూసి..పరేష్ నటనకు ఫిదా అయిన స్వరూప్.. అతనితో స్నేహం చేసింది. పరేష్ మాత్రం ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. కొన్ని నెలల తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘స్వరూప్కి సింపుల్గా ప్రపోజ్ చేశా. ఆమెతో 3-4 నెలలు స్నేహం చేసిన తర్వాత ఒక రోజు నా ప్రేమ విషయాన్ని చెప్పేశాను. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరినొకరం తెలుసుకుందాం అని చెప్పకు. ఇద్దరం కలిసి జీవిస్తూ తెలుసుకుందాం’ అని చెప్పాను’ అని ఓ ఇంటర్వ్యూలో పరేష్ తన ప్రేమ విషయాన్ని పంచుకున్నాడు.అయితే వీరిద్దరు ప్రపోజ్ చేసుకున్న 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారట. అప్పుడప్పడే పరేష్ ఇండస్ట్రీలోకి వెళ్లడం.. కెరీర్ పరంగా సెట్ అయ్యాకనే పెళ్లి చేసుకోవాలకున్నాడట. ఈ విషయం స్వరూప్తో చెబితే.. ఆమె కూడా అర్థం చేసుకొని 12 ఏళ్ల పాటు ఎదురు చూసి 1987లో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వరూప్ విషయానికొస్తే.. 1979లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది. బాలీవుడ్లో 'నరం గరం' (1981), 'సాగర్' (1985) వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. -
కొత్త వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, జీఎస్కే భాగస్వామ్యం
వ్యాక్సిన్ ఆవిష్కరణలో గ్లోబల్ లీడర్గా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జీఎస్కే పీఎల్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా అయిన షిగెల్లోసిస్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.డయేరియా వ్యాధికి కారణం అవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్-మందులను తట్టుకునే స్వభావం)పై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే షిగెల్లాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ అనుమతుల ద్వారా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా ‘ఆల్ట్సాన్ఫ్లెక్స్ 1-2-3’ను అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్), జీఎస్కే పీఎల్సీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.వ్యాక్సిన్ అభివృద్ధికి జీఎంఎంఏ టెక్నాలజీజనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటిజెన్స్ (జీఎంఎంఏ) టెక్నాలజీని ఈ వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్యాక్టీరియా బాహ్య పొరలను ఉపయోగించే వినూత్న విధానం. ఈ చౌకైన తయారీ ప్రక్రియ ద్వారా టీకాను మరింత తక్కువ ధరల్లో అందించవచ్చని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్..యూరప్లో మొదటి దశ ట్రయల్స్ అనుకూలంగా వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఆఫ్రికాలో రెండో దశ ట్రయల్స్లో 9 నెలల చిన్నారులపై ఎలాంటి భద్రతా సమస్యలు కనిపించలేదని పేర్కొంది. వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి లక్ష్యాలను చేరుకున్నట్లు 2024 నుంచి మధ్యంతర ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నట్లు చెప్పింది. త్వరలో ఈ వ్యాక్సిన్ను వినియోగదారులకు అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్రోటావైరస్, టైఫాయిడ్, పోలియో, కలరా, సాల్మొనెల్లా వంటి డయేరియా వ్యాధి వ్యాక్సిన్లలో కంపెనీ నాయకత్వాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పేద జనాభాకు సరసమైన ధరలకు వ్యాక్సిన్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీకి జీఎస్కేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ఆరోగ్యంపట్ల సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుందని చెప్పారు. -
ఏ క్షణంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. ‘ట్రంప్ చెప్పినా వెనక్కి తగ్గబోం’
జెరుసలేం: పశ్చిమాశియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏ సమయంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ దాడి ఆపాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. నెతన్యాహు మాత్రం ఇరాన్పై దాడి విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ త్వరలోనే ఇరాన్పై దాడి చేయనుందని.. ఈ దాడి అమెరికా అనుమతి లేకుండానే జరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఇరాన్- అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయనున్నట్లు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న అమెరికన్లు తిరిగి సొంత దేశం వచ్చేయాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచి అమెరికన్ సిబ్బందిని తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రముఖ మీడియా హౌస్ ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్తో అమెరికా అణుఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొంత కాలంగా చర్చలు జరుపుతూ వస్తోంది. తాజాగా జరిపే చర్చలు విఫలమైతే.. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్ అనుమతి కోరననున్నారు.ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ సైతం అదే రీతిలో బదిలిస్తోందని ఆదేశ ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదె హెచ్చరించారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ బేసులపై నేరుగా దాడులు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇరాన్ హెచ్చరికలతో అమెరికా విదేశాంగ శాఖ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో అత్యవసర చర్యల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యప్రాచ్యం, తూర్పు యూరోప్, ఉత్తర ఆఫ్రికాలోని యుఎస్ దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు పంపించాయి. అంతేకాక, బహ్రెయిన్, కువైట్ వంటి ప్రాంతాల నుంచి అవసరం లేని సిబ్బందిని స్వచ్ఛందంగా వెనక్కు పంపేందుకు అనుమతి ఇచ్చింది.అమెరికా మిలిటరీ బేసులు ప్రస్తుతం ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నిర్ణయంతో పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలతో భయాందోలన నెలకొంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి?
👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 20 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. -
జగన్ పర్యటనల్లో TDP మార్క్ పోలీసింగ్!
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనల సందర్భంగా పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం హోదాలో ఆయనకు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ కింద భధ్రత కల్పించడం లేదు. ఎక్కడికి వెళ్లినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పొదిలి పర్యటనలో ఓ అడుగు ముందుకు వేసి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు.జగన్ పొదిలి పర్యటన సందర్భంగా అధికార పార్టీ టీడీపీ మార్క్ పోలీసింగ్ కనిపించింది. నిరసన పేరిట ఉద్రిక్తతలకు కారణమైన టీడీపీవాళ్లను వదిలేసి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. గొడవ చేశారంటూ ఇప్పటికే 15 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసులు(హత్యాయత్నం) కేసు పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.అయితే గొడవలు చేసిన వారిని వదిలి పెట్టి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించేందుకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ వెళ్లారు. అయితే ఆ పర్యటనలో జగన్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. నల్ల బెలూన్లు, ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో మహిళలను ముందుంచి టీడీపీ కార్యకర్తలు కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తిరిగి వైఎస్సార్సీపీ వాళ్లే ఈ దాడికి పాల్పడారంటూ ఇప్పుడు కేసులు పెడుతున్నారు. -
కామెడీ ఎంటర్టైనర్గా 'మిత్ర మండలి' టీజర్
ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) జోడీగా నటిస్తున్న కొత్త చిత్రం 'మిత్ర మండలి'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ఈ మూవీని విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పిస్తుండగా కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందర్నీ నవ్వించేలా టీజర్ ఉంది.సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక ఎన్ఎమ్ .. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..!
ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు హోటల్కు వెళ్లి భోజనం చేయడం చాలా మందికి అలవాటు. హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. కమ్మటి భోజనం తింటున్నామని అనుకుంటున్నారే తప్ప ఫుడ్ తయారీ విషయంలో హోటళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. తిన్నపుడు బాగుందనే భావనతో ఇంటికి చేరుకుంటారు. కాసేపటి తరువాత కడుపులో ఏదో అలజడి మొదలవుతుంది. గొంతులో మంట, కడుపులో పేగులు మెలేసినంతగా నొప్పి వస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్ అనుకుంటారే గానీ.. తిన్న ఫుడ్ గురించి పట్టించుకోరు. అయితే ఈనెల 10న కామారెడ్డిలోని పలు హోటళ్లపై ఫుడ్సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. తనిఖీల్లో జీర్ణించుకోలేని వాస్తవాలు వెలుగు చూశాయి. పేరున్న హోటళ్లలోనూ కిచెన్లు అధ్వానంగా, కంపుకొడుతూ కనిపించాయి. ఈగల మోతతోపాటు కుళ్లిపోయిన మాంసం, రొయ్యలు, ఇతర ఆహార పదార్థాలను చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. నిత్యావసరాలు చాలా వరకు కాలం చెల్లినవి గుర్తించారు.వాడిన నూనెలనే వాడుతూ...హోటళ్లలో బ్రాండెడ్వి కాకుండా సాధారణ నూనెలు వాడుతున్నారు. దానికి తోడు ఫ్రై ఐటంలు నూనెలలో వేయించిన తరువాత నూనెను ఇతర ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో చాలా మంది పామాయిల్ వాడుతున్నారు. మరికొన్ని హోటళ్లలో లోకల్గా తయారయ్యే రిఫైన్డ్ అయిల్ను వినియోగిస్తున్నారు. కొనిచోట్ల మాత్రమే బ్రాండెడ్ ఆయిల్స్ వాడుతున్నారని తెలుస్తోంది.నిల్వ ఉంచిన మాంసం..హోటళ్లలో ఎక్కువ మంది మాంసాహారం తినడానికే ఇష్టపడతారు. ప్రధానంగా చికెన్, ప్రాన్స్, ఫిష్ ఐటంలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. హోటళ్ల నిర్వాహకులు చేపలు, రొయ్యలను ఇతర ప్రాంతాల నుంచి హోల్సెల్గా తెప్పించి ఫ్రిజ్లలో నిల్వ ఉంచుతారు. రోజుల తరబడి నిల్వ ఉంచడం మూలంగా అవి పాడవుతాయి. వాటినే శుభ్రం చేసి ఉడికించి వండి వడ్డిస్తున్నారు. అలాగే చికెన్, మటన్ కూడా నిల్వ చేసి, వేడి చేసి వడ్డిస్తున్నారు.అధ్వానంగా కిచెన్లు..చాలా హోటళ్లలో కిచెన్ గదులు అధ్వానంగా ఉంటున్నాయి. కనీస పరిశుభ్రత పాటించడం లేదు. ఈగలు మోతమోగిస్తున్నా పట్టించుకోరు. కొన్ని హోటళ్లలో ఎలుకలు కూడా సంచరిస్తుంటాయి. తినడానికి కూర్చునే గదులు, హాళ్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి.రెగ్యులర్ తనిఖీలు లేకే...సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు హోటళ్లు, స్వీట్ హోంలు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేయాల్సి ఉండగా.. నెలల తరబడి కూడా తనిఖీలు చేపట్టడం లేదు. అప్పుడప్పుడు మొక్కుబడిగా.. అదీ చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల మీద దాడులు చేయడం తప్ప పెద్ద హోటళ్లలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించేదాకా ఇక్కడి హోటళ్లలో అధ్వాన పరిస్థితులు ఉన్నట్టు ఎవరూ గుర్తించలేదు. ఇప్పటికై నా అధికారులు రెగ్యులర్గా తనిఖీలు చేపట్టి, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
శుభ్మన్ గిల్ ఓవరాక్షన్.. సచిన్, కోహ్లి కూడా ఎప్పుడూ అలా చేయలేదు..!
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్పై విమర్శలు వస్తున్నాయి. గిల్ ఓ ఫోటో షూట్లో తనను స్పాన్సర్ చేస్తున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్ చేస్తూ వస్తుంది. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ప్రస్తుతం శుభ్మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను వినియోగిస్తారు.తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్ఎఫ్ ఛాంపియన్, జీనియస్, మాస్టర్ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్తో పాటు ముద్రిస్తుంది. జీనియస్ అన్న పదాన్ని ఎంఆర్ఎఫ్ చాలాకాలం పాటు వాడింది. సచిన్, లారా, డివిలియర్స్, విరాట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లు అధికంగా వాడారు.ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు ముందు గిల్తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్ఎఫ్.. అతనికి కూడా జీనియస్ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగుంది.గిల్ ఇటీవల టీమిండియా కొత్త కిట్ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్తో ఫోటో షూట్కు అటెండ్ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్ బ్యాట్పై ఎంఆర్ఎఫ్ జీనియస్ స్టిక్కర్తో పాటు ప్రిన్స్ అని ముద్రించడాన్ని గమనించారు.ఇదే గిల్పై విమర్శలకు దారి తీసింది. క్రికెట్లో ఎంతో సాధించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి కూడా తమ బ్యాట్లపై తమ బిరుదులైన గాడ్, కింగ్ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. గిల్ ఏవరో కొందరు ప్రిన్స్ అనగానే, ఆ పదాన్ని తన బ్యాట్పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. 🚨The Overhyped "Prince" of Indian Cricket🚨Shubman Gill is so self-obsessed. Who even called you the Prince? A so-called 'Prince of ICT with a poor SENA record, a below 35 Test average, and zero overseas centuries across all formats after 5 years in his international career. pic.twitter.com/SKxiUKT0pa— Niik (@Niiki099) June 11, 2025వాస్తవానికి ప్రిన్స్ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90 దశకంలోని అభిమానలు గుర్తు చేస్తున్నారు. గిల్ ప్రిన్స్ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఏం సాధించాడని అతనికి ప్రిన్స్ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. గిల్కు టెస్ట్ల్లో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తుకు చేస్తున్నారు. SENA దేశాల్లో అతనికి చెత్త రికార్డు ఉందని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు, దిగ్గజాలు ఇస్తారు. సోషల్మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. Sachin Tendulkar never played with a bat that had "God" written over it and Virat Kohli never played with a bat that had "King" written over it. You get tags with your performances and the tags are given by the greats of the game and not from the social media.— Cricket🏏 Lover // ICT Fan Account (@CricCrazyV) June 11, 2025గిల్ తన సొంతంగా బ్యాట్పై ప్రిన్స్ అన్న పదం ముద్రించుకున్నాడో లేక ఎంఆర్ఎఫ్ కంపెనీనే ఆ పదాన్ని ముద్రించిందో తెలియలేదు. కాగా, గిల్ ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్తో గిల్కు ఈ అదృష్టం వరించింది. -
వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు..
భోపాల్: మనం ఎన్నో రైల్వే వంతెనలను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే రైల్వే వంతెనను ఎక్కడా చూసి ఉండం. ఆ వంతెన మన ఊహకు అందని రీతిలో నిర్మితమయ్యింది. ఈ వింత రైల్వే వంతెన గురించి తెలుసుకున్న వారంతా దానిని చూసేందుకు పరుగులు తీస్తున్నారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఈ రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్ఓబీ)అధికారికంగా ప్రారంభించకముందే, చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెన అత్యంత విచిత్రంగా 90 డిగ్రీల మలుపును కలిగి ఉండటాన్ని అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు స్థానికులు వంతెన ఇలావుంటే ప్రమాదాలు జరుగుతాయేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వంతెన నిర్మాణానికి భూమి కొరత ఎదురుకావడం సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటంతో వంతెను ఈ విధంగా నిర్మించక తప్పలేదని వంతెను నిర్మించిన అధికారులు చెబుతున్నారు. ఈ వంతెన మహామై కా బాగ్, పుష్పా నగర్,స్టేషన్ ప్రాంతం నుండి న్యూ భోపాల్కు ప్రజల రాకపోకలను సులభతరం చేయనుంది. 2023, మార్చిలో దీని నిర్మాణానికి ముందు.. ఇది పూర్తయ్యాక ఐష్బాగ్ ప్రాంత ప్రజలు రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండాల్సిన పని లేదని అధికారులు చెప్పారు. మూడు లక్షల మంది ఈ వంతెన కారణంగా ప్రయోజనం పొందుతారని కూడా తెలిపారు.రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఓవర్బ్రిడ్జి 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు కలిగివుంది. అయితే ఈ వంతెనలో ఉన్న 90 డిగ్రీల మలుపు కారణంగా పలువురు ప్రమాద భయం ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియా యూజర్స్, స్థానికులు ఈ వంతెన డిజైన్పై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ రకమైన మలుపు ప్రమాదాలకు దారితీయవచ్చని, వాహనాలకు ఈ మలుపును గమనించడం కష్టంగా మారవచ్చని అంటున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (బ్రిడ్జి డిపార్ట్మెంట్) చీఫ్ ఇంజనీర్ వి డి వర్మ మీడియాతో మాట్లాడుతూ మెట్రో స్టేషన్ కారణంగా, ఈ ప్రాంతంలో పరిమితమైన భూమి లభ్యత ఉంది. అందుకే వంతెనను ఇలా నిర్మించడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఓవర్బ్రిడ్జిపై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయని, భారీ వాహనాలను అనుమతించబోమని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: కారులో ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం.. రంగంలోకి పోలీసులు -
Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్బాబు, రామ్చరణ్, సూర్య, యశ్, నిఖిల్, అల్లరి నరేశ్, సుకుమార్, బుచ్చిబాబు, తమన్.. ఇలా ఎంతోమంది వచ్చారు.రిసెప్షన్లో హైలైట్..ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో రిలీజ్ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్గా బంగారు వర్ణం బ్లౌజ్ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్ -
అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!
అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్బీసీ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్ బఫెట్ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్ బఫెట్ ఆలోచనలు బ్రూటల్.. కానీ బ్రిలియంట్. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు. -
‘తన్మయి కేసు.. సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?.. మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిది ప్రభుత్వ హత్యే. ఈనెల మూడో తేదీన ఫిర్యాదు అందితే.. ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదు?. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?. నలుగురు అనుమానితులు ఉంటే.. ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా?. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?. మహిళలపై అఘాయిత్యాలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.మరోవైపు.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య జరిగింది. గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
కారులో ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం.. రంగంలోకి పోలీసులు
భఠిండా: పంజాబ్లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పార్క్ చేసిన కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రర్ అయిన కారు అని సమాచారం. కౌర్కు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే రీల్స్ ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలున్నాయి.ప్రాథమికంగా దీనిని హత్యకేసుగా పరిగణిస్తున్నామని బఠిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితులు కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే.. -
కేటీఆర్పై ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. .హైదరాబాద్ సీసీఎస్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్.. ముఖ్యమంత్రి కూర్చిని గౌరవించాలని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైంది?.కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ సీఎం. ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నియంత్రణ చేయకుంటే.. మేం కూడా మీరు చేసిన స్కాంలు, అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్
సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది సింగర్ సునీత (Sunitha Upadrashta). మృదువైన స్వరంతో ఆమె పాట పాడితే అమృతం కురిసినట్లే ఉంటుంది. ఈమె మాట్లాడితే కూడా తీయని పాట పాడుతున్నట్లే అనిపిస్తుంది. ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే పాటలెన్నో పాడిన సునీత మనసు నేడు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. అందుకు కారణమేంటో చూసేద్దాం..సునీత భావోద్వేగంఏ తల్లికైనా తను సాధించిన విజయాల కంటే పిల్లలు సాధించిన విజయాలే గొప్పగా కనిపిస్తాయి. చేతుల్లో ఆడించిన చంటిపిల్లలు కళ్లముందు ఎదుగుతుంటే ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. సునీత కూతురు శ్రేయ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.ఎంత గర్వంగా ఉందో..మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్బుక్లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా కూతురు ఇప్పుడు ప్రాట్ ఇన్స్టిట్యూట్లో ఇల్లుస్ట్రేటర్గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఫోటో.. ఎన్నాళ్లకెన్నాళ్లకునీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. శ్రేయ గ్రాడ్యుయేషన్ డేకు సునీత భర్త రామ్, కుమారుడు ఆకాశ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.మొదటి భర్త సంతానమే శ్రేయకాగా సునీత 19 ఏళ్ల వయసులోనే కిరణ్ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి కూతురు శ్రేయ, కుమారుడు ఆకాశ్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సునీత- కిరణ్ విడిపోయారు. 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి: దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా? -
ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్ సినిమాలపై ప్రకటన
రెండురోజుల నుంచి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన చేయబోయే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్తో అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేశ్తో చేస్తారని చెప్పుకొచ్చారు. మరొకటి ఎన్టీఆర్తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చేతిలో ఈ రెండు తప్పా ఎలాంటి ప్రాజెక్ట్లు లేవన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్చేస్తున్నారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. త్రివిక్రమ్కు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ ఫైనల్ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని నాగవంశీ తెలిపారు.(ఇదీ చదవండి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్.. బన్నీ కథలో మార్పులు!)నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో త్రివిక్రమ్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ లేనట్టేనని తేలిపోయింది. ఆపై అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా పూర్తిగా ప్రచారం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లు మాత్రమే త్రివిక్రమ్ ప్రస్తుతానికి లాక్ చేశారంటూ నాగవంశీ చెప్పారు. అయితే, మొదట వెంకటేశ్తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్తో భారీ ప్రాజెక్ట్ మొదలౌతుందని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. పురాణాలతో ముడిపడిన కథలో ఎన్టీఆర్ నటించనున్నారు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో తారక్ అన్న నటిస్తున్నారంటూ ఇప్పటికే నాగవంశీ ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తారక్ నటిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో వార్2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, దేవర్2 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్లకు నాగవంశీ ట్విస్ట్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.— Naga Vamsi (@vamsi84) June 12, 2025 -
Solar Plexus: మణి పుర చక్రం అంటే ఏంటి?
గతవారం మొదటి రెండుపొరల గురించి చెప్పుకున్నాం కదా.. ఈ వారం మూడవ చక్రం నాభి లేదా మణిపుర చక్రం గురించి... మీరు మంచి ఆహారాన్ని తిన్నపుడు మీకు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆకలితో ఉన్నట్లైతే మీరు ధ్యానంలో కూడా సరిగా కూర్చోలేరు, ఆనందించలేరు. భగవంతుడు మీ ఎదురుగా ఉన్నా కూడా ‘‘ఓ దేవుడా! మొదటగా నా కడుపు నింపు. నేను నీతో తర్వాత మాట్లాడతాను’’ అని అంటారు. ఆకలితో ఉన్నప్పుడు మనం ఆహారాన్ని తింటున్నప్పుడు కలిగే ఆనందాన్ని వర్ణించలేం. నాభి ఈ ఆనందం కూడా చాలా తాత్కాలికం. అలా సంపూర్ణంగా ఆనందించగలిగితే మీరు మరల మరల కావాలని కోరుకోరు. దానిని అధిగమించడానికి సంతృప్తి ఒక్కటే మార్గం. రెండు ముద్దలు తిన్నా సరే మీరు సంతృప్తి చెందాలి. సంతృప్తితో ఉండటమే మీరు నాభి చక్రాన్ని సరిచేసుకునే మార్గం. మీ వస్తుసంబంధమైన కోరికలకు అంతులేదు. ఎన్ని వస్తువులు ఉన్నా కానీ ఇంకా కావాలనుకుంటారు. కానీ దేనినీ ఆనందించలేరు.. దాని వల్ల నాభి చక్రం అలజడికి లోనవుతుంది. దీనిని అరికట్టే మార్గం నాభి చక్రం సంతృప్తి. ప్రతి విషయంలోనూ మీరు సంతృప్తిని కలిగి ఉండాలి. కాబట్టి ఆనందించడానికి సంతృప్తి ఒకటే మార్గం. ఇది నిత్య ధ్యానసాధన ద్వారా మనలో శ్రీ లక్ష్మీనారాయణ శక్తిని జాగృతి చేసుకో గలగడం ద్వారా సాధ్యపడుతుంది. సంతృప్తి అనేది ఆత్మ సాక్షాత్కారం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం ΄÷ందకుండా మీరు సంతృప్తిని కలిగి ఉండాలని చెపితే అది ఏదో ఒక ఉపదేశంలాగానే ఉంటుంది. కానీ ఆత్మ సాక్షాత్కారం ΄÷ందిన తరువాత మీ ఆత్మని ఏది సంతృప్తి పరుస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి మీ ప్రాముఖ్యతలు మారతాయి. ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా? -డా. పి. రాకేష్(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) -
బ్రెస్ట్ కేన్సర్: గుర్తించండి.. పోరాడండి..
ఈ మధ్య సర్వ సాధారణంగా మారిన రొమ్ము కేన్సర్ను ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ ఫ్యూజీఫిల్మ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక ప్రచార కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రారంభించారు. అపోలో ఫౌండేషన్ అమలు చేస్తున్న ఈ ప్రచారాన్ని హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కోహినూర్ వేదికగా బుధవారం దీనిని ప్రారంభించారు. ఉపాసన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యుత్తమ సేవలను అందించడమే కాకుండా.. బ్రెస్ట్ కేన్సర్ వంటి రోగాలను ముందుగా గుర్తించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సరైన అవగాహన, తగిన సమాచారం, సత్వరగా చికిత్సకు వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఫ్యూజీఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ వారి జాతీయ కేన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం రోగాల్లో 14 శాతం ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫ్యూజీఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా ఈ ప్రచార వివరాలు వెల్లడించారు. దేశంలోని 24 నగరాల్లో, శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఈ ప్రచారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట') -
WTC Final 2025: చరిత్ర సృష్టించిన స్టార్క్.. షమీ రికార్డును చెరిపేశాడు
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పేరిట ఉన్న ఓ ఆల్టైమ్ రికార్డును చెరిపేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న 2023-2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో 2 వికెట్లు తీయడంతో ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. స్టార్క్ ఇప్పటివరకు 5 ఐసీసీ ఫైనల్స్ ఇన్నింగ్స్ల్లో 11 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో రెండు వికెట్లు తీసిన స్టార్క్.. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మూడు, ప్రస్తుతం జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు వికెట్లు తీశాడు.గతంలో ఈ రికార్డు షమీ పేరిట ఉండేది. షమీ ఐసీసీ ఫైనల్స్లో 6 ఇన్నింగ్స్ల్లో 10 వికెట్లు తీశాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్, షమీ తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్ (5 ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు), రవీంద్ర జడేజా (10 ఇన్నింగ్స్ల్లో 8), కైల్ జేమీసన్ (3 ఇన్నింగ్స్ల్లో 8) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ జరుగుతుంది. నిన్న (జూన్ 11) మొదలైన ఈ టైటిల్ పోరులో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) చెలరేగడంతో ఆసీస్ రెండు సెషన్లలోపే 212 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.ఆసీస్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసిన ఆనందం సౌతాఫ్రికాకు ఎంతో సేపు నిలబడలేదు. తొలి ఓవర్నే వికెట్ (మార్క్రమ్) కోల్పోయిన ఆ జట్టు మరో 20 ఓవర్ల వ్యవధిలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి మొత్తం నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్ (2/10), హాజిల్వుడ్ (1/10), కమిన్స్ (1/14) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఒక్కో పరుగు చేసేందుకు సౌతాఫ్రికా బ్యాటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న బవుమా అయితే ఖాతా తెరిచేందుకు ఏకంగా 31 బంతులు తీసుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ డకౌట్ కాగా.. రికెల్టన్ 16, ముల్దర్ 6, స్టబ్స్ 2 పరుగులకు ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్ 43/4గా ఉంది. బవుమాతో (3) పాటు బెడింగ్హమ్ (8) క్రీజ్లో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే..
న్యూఢిల్లీ: మేఘాలయ ‘హనీమూన్’ కేసులో భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిదని వెల్లడయ్యింది. సోనమ్తో పాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఇండోర్ నుంచి మేఘాలయకు తీసుకువచ్చారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వారిని షిల్లాంగ్లో విచారించనుంది.సోనమ్ (25),రాజా (29)లకు మే 11న ఇండోర్లో వివాహం జరిగింది. వారు హనీమూన్ కోసం మే 20న అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. మే 23న సోహ్రాలోని నోంగ్రియాట్ గ్రామంలో అదృశ్యమయ్యారు. జూన్ 2న వీసావ్డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జూన్ 9న తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లో సోనమ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయింది. తరువాత ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు రాజాను హత్య చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వివాహానికి ముందే రాజాను చంపడానికి సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో సోనమ్ తాను, తన ప్రియుడు రాజ్తో కలిసి ఉండేందుకు భర్తను హత్య చేసినట్లు సోనమ్ అంగీకరించింది. భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సోనమ్ను విచారించేందుకు ‘సిట్’ 20 ప్రశ్నల జాబితాను సిద్ధం చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రశ్నలివే..1. మేఘాలయలో మీరు, రాజా హనీమూన్ను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు?2. రిటర్న్ టిక్కెట్లు ఎందుకు బుక్ చేసుకోలేదు? అది కూడా ప్రణాళికలో భాగమేనా?3. వివాహానికి ముందు మీకు రాజ్ కుష్వాహా తెలుసా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.4. యాప్ చాట్లో హనీమూన్ సమయంలో మీరు రాజ్ కుష్వాహాతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. మీరిద్దరూ దేని గురించి చర్చించుకున్నారు?5. నిందితునికి మీ లైవ్ లొకేషన్ను ఎందుకు పంపించారు?6. మే 23న మీరు ముగ్గురు వ్యక్తులతో మావ్లింగ్ఖైట్లో కనిపించారు. వారి గురించి మాకు ఏమి చెబుతారు?7. మే 22న స్థానిక గైడ్ ఆల్బర్ట్ సర్వీస్ను ఎందుకుతిరస్కరించారు? 8. రాజా హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను గైడ్ ఆల్బర్ట్ గుర్తించాడు. వారిని మీరు, రాజ్ కుష్వాహా నియమించుకున్నారా?9. రాజా రఘువంశీని హత్య చేయడానికి హంతకులను ఎవరు సంప్రదించారు?10. రాజా రఘువంశీ హత్య కోసం హంతకులకు ఎంత డబ్బు చెల్లించారు? దానిని ఎవరు చెల్లించారు? అది నగదు రూపంలో లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా చెల్లించారా?11. రాజా హత్యకు మేఘాలయను మీరు, రాజ్ కుష్వాహా ఎందుకు ఎంచుకున్నారు? మరెక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ మీకు ఉందా? 12. హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగితే, రాజ్ కుష్వాహా మీతో మేఘాలయకు ఎందుకు రాలేదు?13. హత్య తర్వాత మీరు 17 రోజులు ఎక్కడికి వెళ్లారు? పోలీసుల నుంచి దాక్కునేందుకు మీకు ఎవరు సహాయం చేసారు?14. రాజా రఘువంశీ హత్య తర్వాత పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఏమి ప్లాన్ చేశారు?15. రాజాకు చెందిన స్మార్ట్ వాచ్, ఫోనును పోలీసులు కనుగొన్నారు. అయితే రాజాకు చెందిన దాదాపు రూ. 10 లక్షల విలువైన బంగారం కనిపించకుండా పోయింది. దీని గురించి మీరేమి చెబుతారు?16 రాజాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని మీరు ఎక్కడ కొన్నారు? ఎంతకు కొన్నారు?17 రాజా తల్లి మీరు మేఘాలయకు వెళ్లడానికి ఇష్టపడలేదని, మీ పట్టుదల కారణంగానే అంగీకరించారని చెబుతున్నారు. మీరు రాజాను బలవంతంగా తీసుకువెళ్లారా?18. వివాహ వేడుకల సమయంలో సంతోషంగా లేనట్లు వీడియోలలో కనిపిస్తోంది. కారణమేమిటి?19 మీరు రాజా రఘువంశీని వివాహం చేసుకోకూడదనుకుంటే, ముందుగా మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?20. రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు మీరు ప్లాన్ చేశారా?ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్) -
To day recipes :మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి!
మన పెద్దల నాటి వంటకం ఇది. ఇపుడంటే చాలామంది మర్చిపోయారు కానీ, మన అమ్మమ్మలు తాతల కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించుకున్నదే. అదే నల్లేరు పచ్చడి. నల్లేరును సాధారణంగా కూరగాయల పాదులపై వాడేవారు. ఉడతలు, తొండలు పూత , పిందెలను కొరికి పాడు చేయకుండా దీన్ని పాదులపై ఉంచేవారు. అయితే నల్లేరు పచ్చడిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు ప్రధానంగా పచ్చడి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయనీ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. మరి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ రోజు నల్లేరు కాడల పచ్చడి, పోషకాలు అందించే వామ్ము ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా.నల్లేరు పచ్చడి కావలసిన పదార్థాలు:నల్లేరు కాడలు (మరీ ఫ్రెష్గా కాకుండా, కాస్త వడిలితే దురదలు రావు) మిర్చి, ఉల్లిపాయలు, టమోటా, పసుపు, కారం, నూనె, చింతపండు, ఉప్పు, తాలింపు కోసం ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు. తయారీ: ముందుగా నల్లేరు కాడలనును శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కడిగేటపుడు చేతులకు గ్లౌజులు వాడటం మంచిది. లేదంటే చేతులు దురదలొస్తాయి. ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమోటా(ఇవి ఆప్షనల్) కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి, మిర్చి, ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత, నల్లేరు ముక్కలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. చిటికెడు పసుపు, కారం, రవ్వంత చింతపండు ఉప్పు వేసి మరికొద్దిసేపు మగ్గించాలి. చల్లారిన తరువాత మెత్తగా రోటిలో (మిక్సీ అయినా పరవాలేదు) దంచుకోవాలి. రుచిచూసుకొని, చివరగా ఇంగువ, ఎండుమిర్చితో పోపు వేసుకుంటే కమ్మని నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో గానీ, రాగి సంగటిలో గానీ కాస్తంత నెయ్యివేసుకుని తింటే ఆహా అనాల్సిందే. రొట్టె, లేదా చపాతీతో గానీ తినవచ్చు. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే.. వామ్ము ఆకు ఇడ్లీ పచ్చడికావలసిన పదార్థాలు: వామ్ము ఆకులు, పచ్చి మిరపకాయలు,పుట్నాల పప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా, ఉప్పు, చింతపండు, కొత్తిమీర పోపుదినుసులు,తయారీ: ముందుగా ప్యాన్ పెట్టుకుని, చింతపండు, పోపు దినుసులు వేసి వేగిన తరువాత పుట్నాల పప్పువేసి , ఆతరువాత శుభ్రవంగా కడిగిపెట్టుకున్న వామ్ము ఆకులువేయాలి. దీంతోపాటు శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేయాలి. నిమిషంలో వామ్ము ఆకులు మగ్గిపోతాయి. దీన్ని చల్లారిన తరువాత పచ్చి వెల్లుల్లి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పోపు గింజలువేసి, కొంచెం చిటపటలాడనిచ్చి వాము ఆకుల పచ్చడిని వేసుకోవాలి. ఆపైన శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తమీర జల్లుకుంటే...నోరూరించే వామ్మాకు పచ్చడి రెడీ! ఇది జీర్ణ శక్తికి చాలామంచిది. -
‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్
ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్ కాస్ట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్గా మారుతున్నాయి.ఇదీ చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’సౌరవ్ దత్తా అనే టెకీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్పీఏ రూ.25 ఎల్పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు. -
వసివాడుతున్న బాల్యం..
అభంశుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా లెక్కల్లోకి రాని వారెందరో..మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు బడి ముఖం చూడని వారున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పిల్ల లను పనిలో పెట్టేలా ప్రోత్సహిస్తుండడంతో..వ్యాపార వర్గాల వారు కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పనిని బాలలతో చేయిస్తున్నారు. కొందరు బాలలైతే ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనులు చేస్తూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నేడు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం సందర్భంగా.. బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల వెతలపై ప్రత్యేక కథనం.. విజయనగరం గంటస్తంభం: చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకారి్మక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.బాలలను పనిలో పెడితే...కఠిన చర్యలుబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకారి్మకుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. ఎస్డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ (చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..) -
WTC Final 2025: 145 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..!
ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 ఫైనల్ ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు (ఓపెనర్లు) డకౌటయ్యారు. తొలుత ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి రబాడ బౌలింగ్లో డకౌట్ కాగా.. ఆతర్వాత సౌతాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఆడి ఖాతా తెరవకుండా స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఇలా ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్తో కలుపుకొని ఇంగ్లండ్లో ఇప్పటివరకు 561 టెస్ట్ మ్యాచ్లు జరగగా.. ఇలాంటి ఘటన ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్కసారి కూడా జరగలేదు. 1880లో తొట్ట తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్లోనే జరిగిన విషయం తెలిసిందే.ఓవరాల్గా (ప్రపంచంలో ఎక్కడైనా) చూసినా ఓ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇది 10వ సారి మాత్రమే. ఈ తరహా తొలి ఘటన 1977లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో జరిగింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు నంబర్ వన్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, జాన్ డైసన్ డకౌట్లయ్యారు. ఆతర్వాత తాజా ఘటనతో కలుపుకొని ఇలాంటివి తొమ్మిది సార్లు జరిగాయి. ఇందులో చివరి నాలుగు సందర్భాలు కలుపుకొని ఆస్ట్రేలియా మొత్తంగా ఆరు సార్లు భాగమైంది. ఆసీస్ భాగమైన చివరి నాలుగు సందర్భాల్లో స్టార్క్ మూడింట భాగం కావడం (ప్రత్యర్ది వికెట్లు తీయడం) మరో విశేషం.డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 విషయానికొస్తే.. ఈ మ్యాచ్ తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.ఆసీస్ ఇన్నింగ్స్ను రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) దెబ్బకొట్టగా.. సౌతాఫ్రికాను స్టార్క్ (2/10), హాజిల్వుడ్ (1/10), కమిన్స్ (1/14) ఇబ్బందుల్లోకి నెట్టారు.ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) టాప్ స్కోరర్లు కాగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత బవుమా (3 నాటౌట్), బెడింగ్హమ్ (8 నాటౌట్) భుజస్కందాలపై ఉంది. -
ప్రమాదంపై స్పందించిన నిఖిల్
హీరో నిఖిల్ (Nikhil) సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన ఒక పోస్ట్ చేశారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ‘ది ఇండియా హౌస్’ (The India House) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, సినిమాలో అత్యంత కీలకమైన సీన్ చిత్రీకరణ కోసం శంషాబాద్ సమీపంలో ఒక భారీ సెట్ వేశారు. సముద్రం సీన్స్ తీసేందుకు అతిపెద్ద వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయగా ప్రమాదవశాత్తు అది పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా సెట్లోకి నీళ్లు ముంచెత్తాయి. ఈ ఘటన వల్ల చాలామంది గాయపడ్డారని తెలిసింది. అయితే, తాజాగా ఈ చిత్ర హీరో నిఖిల్ వివరణ ఇచ్చారు.ప్రమాదంపై నిఖిల్ ఇలా స్పందించారు. 'మేము అందరం చాలా క్షేమంగానే ఉన్నాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నాలు చేసే క్రమంలో కొన్నిసార్లు ఇలాంటి రిస్క్లు తీసుకోవాల్సిందే. అలాంటి సమయంలో ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరగొచ్చు. కానీ, మా చిత్ర యూనిట్ ముందుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల మేము పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాం. అయితే, మేము అత్యంత ఖరీదైన సినిమా పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.' అని ఆయన తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్నారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.We r all Safe 🙏🏽 Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken. We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025 -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): కడుపునొప్పి, చెవి నొప్పి భరించలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ ఎంపీపటేల్గూడకు చెందిన గడుసు మైత్రి (20) ఇబ్రహీంపట్నంలోని గురునా నక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, చెవినొప్పితో బాధపడుతోంది. సరైన చికిత్స అందడం లేదని మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మానసికంగా ఆరోజే చచ్చిపోయా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్సార్సీపీ కేడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ్గా.. భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయయారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏవిధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కూటమి మాయమాటలతో.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి గద్దె నెక్కింది. జూన్ 4వ తేదీన గెలిచి 12వ తేదీ (2024 అసెంబ్లీ ఫలితాలను ఉద్దేశించి) దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం.. ఈ మధ్య రోజుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే!. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి. జగన్ జెండా మోసిన ప్రతీ కార్యకర్త ఇంట్లోకి జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. నాటి మొదలు.. అక్రమ కేసులు పెడుతున్నారు. 2019 నుండి 24 మద్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని కాకాణి గోవర్దన్పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు పెట్టారు. నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు. నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది. గోదాములో బియ్యం షార్టేజ్ ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే.. కోటి రూపాయలు అదే రోజు కట్టేశాం. మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పాం. కానీ అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతిలో వార్త వొచ్చిందనే కేసు పెట్టారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని ‘సీజ్ ద గోడౌన్’ అన్నారు. కోర్టుకు వెళ్తే ఫైన్ కట్టి వదిలేయని చెప్పింది. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు(అదీ క్రిమినల్ కేసులు) లేవు.. ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా. నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా. నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడడంలేదు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో బిజినెస్లు పెట్టొద్దు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా. ఈ మధ్య.. ‘నకిలీ ఇళ్ల పట్టాల కధ కంచికేనా?’ అని ఈనాడు లో వార్త రాశారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పబ్లిక్ మీటింగ్లో మచిలీపట్నంకు సంబంధించిన ఒకటి పోర్ట్.. రెండోది ఇళ్ల పట్టాలు సమస్య చెప్పాం. అధికారంలోకి రాగానే రైతుల నుండి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించాం. గిలకలదిండిలో స్థలాలు ఇవ్వాలంటే కోర్టు కేసు వేశారు. అయినా కూడా 15వేల 400 మందికి పట్టాలు ఇచ్చాం. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లలో 819 మందికి ఇచ్చాం.అది బందరులో అచ్చు అయిన పట్టా. 19,410 మందికి పట్టాలు లబ్ది దారులకు ఆన్లైన్ అయి.. సచివాలయం నుండి మున్సిపల్, అక్కడ నుండి ఆర్డీవో, జాయిట్ కలెక్టర్ , సీసీఎల్ లో అప్రూవ్ అయ్యింది. అప్లికేషను నంబర్ల నుంచి వాటి నరిహద్దులతో సహా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంచినప్పుడు.. నకిలీ పట్టాలు ముద్రించాలిన అవసరం ఏముంది?. 500 ఎకరాలు అమ్మిన ప్రతి రైతు దగ్గరకి పోలీసులు వెళ్తున్నారట. ఎంతకు అమ్మారు.. పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా? అని అడుగుతున్నారట. ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు?. ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా? అని పేర్ని నాని ప్రశ్నించారు. -
దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా?
ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్(Allu Arjun)తో చేయాల్సిన సినిమా కథలో స్వల్ప మార్పులు చేసి ఎన్టీఆర్తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే మొన్నటివరకు ఇది రూమర్గానే ఉండే..కానీ తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్తో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. మైథలాజికల్ బ్యాగ్రౌండ్తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ‘‘మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’’ అని నాగవంశీ ట్వీట్ చేశాడు.దాంతో ఎన్టీఆర్ను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. తొలిసారి ఆయన పూర్తిస్థాయిలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూశాం. అందులో కాసేపు యముడి పాత్రలో కనిపించి తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక త్రివిక్రమ్ సినిమాలో దేవుడు పాత్ర చేయబోతున్నాడు. అది కూడా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. కచ్చితంగా ఎన్టీఆర్ అదరగొడతాడు. అందులో నో డౌట్. తన అభిమాన హీరోని దేవుడి పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా డబ్బింగ్ వర్క్లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్లు హీరోలుగా నటించగా, కియారా అద్వానీ కీలక పాత్ర పోషించింది. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
‘స్కార్పియో’ బీభత్సం.. మహిళా కానిస్టేబుల్ మృతి.. ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు
పట్నా: బీహార్లోని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ పురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్పై బుధవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం గస్తీలో ఉన్న పోలీసులను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోని ఒక మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.శ్రీకృష్ణ పురి పోలీస్ స్టేషన్ సిబ్బంది అటల్ పాత్ వెంట వెళుతున్న సాధారణ వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా, వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఫలితంగా ముగ్గురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.పట్నా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అవకాష్ కుమార్ తెలిపిన ప్రకారం గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతిచెందగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
పసిడి మళ్లీ పైపైకి.. తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,000 (22 క్యారెట్స్), రూ.99,280 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.800, రూ.880 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.880 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,280 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.91,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.880 పెరిగి రూ.99,430 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా గురువారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే రూ.100 క్షీణించింది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,18,900గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నా చావుకు.. నా భార్యే కారణం..
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుని, దుర్గను పూజించిన మంచి ఫలం కలుగుతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువును సాయంత్రం మూడుగంటలకు పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ. రాత్రి ఆరు నుంచి తొమ్మిదివరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.చదవండి: Murudeshwar Temple Facts: కోరిక కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రంబౌద్ధవాణి : ఆ గౌరవం అనుభవానికే..! ఒక అడవిలో ఏనుగు, కోతి, తిత్తిరి పిట్ట స్నేహంగా జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మూడూ ఒకచోట చేరి సాధక బాధలు చెప్పుకునేవి. తాము గడించిన అనుభవాలు పంచుకునేవి. ఒకరోజున వాటికి ఒక ఆలోచన వచ్చింది. మన ముగ్గురిలో జ్ఞానులు ఎవరు? పెద్ద ఎవరు? పెద్దవారు ఎవరైతే వారికి మిగిలిన ఇద్దరూ నమస్కరించాలి. గౌరవించాలి’’ అని అనుకున్నాయి. అప్పుడు ఏనుగు– ‘‘మీ ఇద్దరికంటే నేనే పెద్దను. గౌరవనీయుడను. ఎందుకంటే ఇదిగో ఈ మర్రిచెట్టు ఇప్పుడు మహావృక్షంగా ఉంది. కానీ ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను ఆ మొక్క మీదినుండి నడిచి΄ోయేవాణ్ణి. అప్పుడు దాని చివరి కొమ్మలు నా పొట్టకు తాకుతూ ఉండేవి’’ అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతి– ‘‘ఓ! మిత్రమా! అలాగా! ఐతే విను. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పటినుంచే నాకు తెలుసు. నేను కూర్చొని దీని చిగుర్లు తినేదాన్ని. కాబట్టి నేనే పెద్దను. నన్నే గౌరవించాలి’’ అంది. ఆ రెండింటి మాటలు విన్న తిత్తిరి పిట్ట నవ్వుతూ– ‘‘మిత్రులారా! ఈ చెట్టుకు తల్లి వృక్షం నదీతీరం ఆవల గట్టున ఉంది. దాని కాయలు తిని, ఇటుగా వచ్చి ఇక్కడ రెట్ట వేశాను. అందులోని విత్తనమే ఈ చెట్టుగా మొలిచింది’’అంది. మిగిలిన రెండూ ఆశ్చర్యపడి– ‘‘మిత్రమా! మా ఇద్దరికీ ఈ ఒక్క చెట్టే తెలుసు. నీకు ఈ చెట్టు, దాని ముందరి తరం చెట్టూ తెలుసు. తరతరాల అనుభవం నీది. కాబట్టి నీవే గౌరవనీయుడవు’’అని తిత్తిరికి నమస్కరించాయి. బుద్ధుడీ కథ చెప్పి– ‘‘భిక్షువులారా! పెద్దల్ని మనం అందుకే గౌరవించాలి. మనం వారికి ఇచ్చే గౌరవం వారి వయస్సుకే కాదు, అనుభవానికి’’ అని చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ -
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
భారత ఆర్థిక వృద్ధిని బహిరంగంగా విమర్శించినందుకు హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇటీవల తాను పోస్ట్ చేసిన వివరాలు వైరల్గా మారాయి. దాంతో భారత్ వృద్ధికి కట్టుబడి ఉన్నవారు ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.భాటియా తన ఎక్స్లో ఖాతాలో ‘భారత్లో 41.5 కోట్ల మంది ప్రజలు రోజుకు 3.10 డాలర్ల(రూ.250)తో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అందుకు సిగ్గు పడాల్సిందిపోయి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుగా వుంది’ అంటూ పోస్ట్ చేశారు. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకుతున్నట్లు వచ్చిన వార్తలకు స్పందించిన భాటియా ఈమేరకు ఎక్స్లో వ్యాఖ్యలు చేశారు.భాటియా వ్యాఖ్యలను రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యాలకు అతీతంగా భారతీయ వినియోగదారులు విస్తృతంగా ఖండించారు. భాటియా పోస్ట్లోని వివరాలు అవుట్డేటెడ్గా కొందరు కామెంట్ చేశారు. ఆయన తన మాటలను భారత రాజకీయ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారా లేక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. మరొకరు ‘మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు. భారత్ ప్రస్తుతం ఇంటున్న స్థానం నుంచి ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిపోయి ప్రతిసారి ఇదే పాట పడుతున్నారు. సిగ్గుగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Instead of hanging your head in shame that 415 million people in India survive on $3.10/day, you brag about being the world’s 4th largest economy. Shame on you.— Sabeer Bhatia (@sabeer) June 10, 2025ఇదీ చదవండి: మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం‘1997 డిసెంబర్లో హాట్మెయిల్ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అప్పటి నుంచి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? జీరో.. మీ ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మీరు ఎక్స్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘నా ఆలోచనా విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మీలాంటి వారు దూషణలకు దిగుతారు. బలహీన మనస్తత్వం, అభద్రతా భావం’ అంటూ భాటియా స్పందించారు. మరో యూజర్ ‘నువ్వొక అసమర్థుడివి. 36-37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎందుకు గొప్పలు చెప్పుకుంటుంది’ అని ప్రశ్నించారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని స్పష్టం చేశారు. -
ఓటీటీలో 'నవీన్ చంద్ర' క్రైమ్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్గానే ఉన్నప్పటికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.కథ ఏంటి..?హైదరాబాద్కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. -
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్ షూటింగ్లో దీపికా పదుకోన్ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
-
ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లాల్లో 15 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది.నేడు, రేపు.. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతిభారీ వర్షాలు.. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.మరోవైపు.. బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?
నాకు గత ఏడాది పెళ్లయింది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. పెళ్ళి అయిన మొదటి రోజు నుంచి నేను గమనించిందేమిటంటే... ఆయన తన గురించి తాను విపరీతంగా గొప్పలు చెప్పకుంటారు. మిగిలిన వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. నాఒక్క దానితోనే ఇలా ఉంటాడనుకున్నాను. కానీ బయట అందరితో ఇలాగే ఉంటాడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని స్పెషల్గా చూడాలనుకుంటాడు. ఆయన చుట్టాల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఆయన్ని ‘డబ్బారాయుడు’ అంటారట. ఆఫీస్లో కూడా అందరితో ఇలా మాట్లాడు తున్నాడని తెలిసి ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఆయన ప్రవర్తన మార లేదు. కిందపడ్డా తనదే పై చేయి అంటాడు. ఈ మధ్య నా కజిన్ పెళ్ళికి వెళ్తే అక్కడ తనకంటే ఆపెళ్ళి కొడుకుకి ఎక్కువ మర్యాదలు చేస్తున్నారని అలిగి వచ్చేశాడు. ఎవరైనా చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో తెలీట్లేదు. ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఉండగలనా అనిపిస్తోంది! – అలేఖ్య, చిత్తూరుమీరు చెప్పిన విషయాలు చదివిన తరువాత మీ భర్తకి ఉన్న పర్సనాలిటీ సమస్య వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యానికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన సహజమే. మీ భర్త తనని గొప్పగా ప్రదర్శించుకోవడం, ఇతరుల్ని చిన్నచూపు చూడడం, విమర్శలను ఒప్పుకోకపోవడం, అందరిపై తానే మెరుగ్గా ఉండాలని కోరుకోవడం, తాను చాల గొప్పవాడిననే భావన, ఇతరుల భావాల పట్ల ఎంపతీ లేకపోవడం) ఇవన్నీ ‘నార్సిసిస్టిక్‘ వ్యక్తిత్వ లక్షణాలుగా పేర్కొనవచ్చు. తమ తప్పులకి అవతలి వాళ్ళని బాధ్యులుగా చేసి గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే ‘గ్యాస్ లైటింగ్’ అనే పద్ధతిని వీళ్ళు ఎక్కువగా వాడతారు. ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ ఈ పర్సనాలిటీ సమస్య జన్యుపరమైన కారణాలు, పెంపక లోపాలు, బాల్యంలో వారు పెరిగిన పరిస్థితుల వలన రావచ్చు. స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ సమస్యను చూస్తాము. వాళ్ళకు తాము ఏదైనా సమస్యతో ఉన్నామనే ఎరుక ఉండదు. అందువల్ల వీరికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం. వారిలో మారాలనే ఆలోచన ఎంతో కొంత ఉంటే సైకోథెరపీ ద్వారా కొంతమార్పు తీసుకురావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరసీ’ ద్వారా తన ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చుకోవచ్చు. కానీ ఇది కాస్త సమయంతో కూడుకున్న వ్యవహారం. మీరు ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటే సహజంగానే మీ బంధాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కానీ దానికి కూడా అతను సహకరించాల్సిన అవసరం ఉంది.‘నార్సిజం’కు ప్రత్యేకంగా మందులు లేవు. కానీ వీరిలో డిప్రెషన్, ఆందోళన లేదా కోపం లాంటి సమస్యలు ఉంటే వాటికి మానసిక వైద్యులు మందులు సూచిస్తారు. అయితే వీరితో జీవితాంతం కలిసి ఉండవచ్చా అనే ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. కొంత కష్టమే అయినా మీరు అతన్ని అతనిలా అంగీకరించగలిగితే కలిసి ఉండొచ్చు. కానీ కొన్నిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే మీరు అతనికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. చివరిగా మీకు నాదొక సలహా. పొగడ్తకి లొంగని మనిషి లోకంలో లేరు. అలాంటిది మీ భర్తకు పొగడ్తే ఆహారం, నీరు అన్నీ! అప్పుడప్పుడూ మీరే అతన్ని పొగిడితే అతనూ సంతోషంగా ఉంటాడు. మీరూ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. మీ లాంటి ‘సైలెంట్ సఫరర్స్’ లోకంలో చాలామందే ఉన్నారు. విడిపోవడం చాలా సులభం, కానీ కలిసి ఉండాలంటే మీవైపునుండి కొంత సర్దుబాటు, ఓర్పు, త్యాగం అవసరం. గట్టి ప్రయత్నంతో చాలా సమస్యలు సర్దుకుంటాయి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. ఆల్ ది బెస్ట్!-డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీకsakshifamily3@gmail.com -
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
ఐపీఎల్ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్ రాయల్స్ తరఫున), 14 ఏళ్ల వయసులోనే క్యాష్ రిచ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో (ఎన్సీఏ) జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో కేవలం 90 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. వైభవ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. వైభవ్ విధ్వంసం చూసి క్రికెట్ అభిమానులు అబ్బురపడుతున్నారు. VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥Vaibhav Suryavanshi smashed 190 off just 90 balls in a practice match during the India U-19 team's camp at the BCCI Centre of Excellence in Bengaluru. [Gaurav Gupta]pic.twitter.com/QFsVSWyZeQ— Sports Culture (@SportsCulture24) June 10, 202514 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఇంత భారీ షాట్లు ఆడుతూ, ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఎలా ఆడగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. పొట్టి క్రికెట్ భవిష్యత్తు ఇతడే అంటూ కీర్తిస్తున్నారు. భారత క్రికెట్లో వైభవ్ పెను సంచలనమని కొనియాడుతున్నారు. వైభవ్ టాలెంట్కు నీరాజనాలు పలుకుతున్నారు.కాగా, వైభవ్ త్వరలో ఇంగ్లండ్లో పర్యటించబోయే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు (టెస్ట్లు) ఆడుతుంది. ఈ సిరీస్లకు భారత కెప్టెన్గా మరో ఐపీఎల్ హీరో ఆయుశ్ మాత్రే (సీఎస్కే) కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లలో వైభవ్.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్లు ప్రారంభిస్తాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఎన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలోనే వైభవ్ 90 బంతుల్లో 190 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుద్దజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్స్టాండ్బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్కీపర్)ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్..జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ (లోగ్బరో యూనివర్శిటీ)జూన్ 27- తొలి వన్డే (హోవ్)జూన్ 30- రెండో వన్డే (నార్తంప్టన్)జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్)జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్)జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్)జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్ (బెకెన్హమ్)జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్ (చెమ్స్ఫోర్డ్) -
కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం.. రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.కాగా, ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ప్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేలింది.రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
అదో ప్రమాదకరమైన ప్రాంతం.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్య ప్రాచ్యం(Middle East) నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అత్యవసరేతర దౌత్య సిబ్బందితో పాటు ఆయా దేశాల్లో మోహరించిన భద్రతాల బలగాలనూ వెనక్కి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారాయాన. ‘‘అదో ప్రమాదకరమైన ప్రాంతం(Middle East Most Dangerous). అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే వచ్చేయాలంటూ ఆదేశాలు పంపించాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలోనే బలగాలను ట్రంప్ వెనక్కి రప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ‘ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు.. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు(Iran Nuclear Weapons) కలిగి ఉండటానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదు’’ అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాక్ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిలో కొంత మందిని అత్యవసరంగా వెనక్కి రావాలని అమెరికా ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే బాగ్దాద్లో మోహరించిన బలగాలనూ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. పెరిగిన ఆయిల్ ధరలు(4 శాతం పెరుగుదల) కారణమై ఉండొచ్చన్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. బహ్రయిన్, కువైట్ నుంచి బలగాలను స్వచ్ఛందంగానే వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా భద్రతా విభాగం(State Deparment) ప్రకటించింది. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చమురు ఉత్పత్తి దేశాలైన ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రయిన్, యూఏఈలలో అమెరికా బలగాలు ఇంతకాలం మోహరించి ఉన్నాయి. -
నటి కల్పికపై కేసు నమోదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్పై 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే.గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన చెందింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్లు ఆమె పేర్కొంది. గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. -
హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..
న్యూఢిల్లీ: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ, సోనమ్లు బస చేసిన హోమ్స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనమ్ స్టేహోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళ సూత్రాన్ని అక్కడే వదిలివెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డీఎన్ఆర్ మారక్ మీడియాకు తెలిపారు.అనుమానాలు రేకెత్తించిన మంగళసూత్రంరఘువంశీ, సోనమ్లు బసచేసిన హోమ్స్టే గదిలో లభ్యమైన ఒక సూట్కేసులో సోనమ్ మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళుతుందనే ప్రశ్న తమలో మెదిలిందని మారక్ అన్నారు. సోనమ్ భర్త రాజా రఘువంశీని ఆమెతో పాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనమ్ ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు.ఫోటోలు తీసుకునే నెపంతో..మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్స్టేలో కాపుగాచారు. అదే సమయంలో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుండి బయటకు తీసుకెళ్లింది. అక్కడ వారు స్కూటీని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివేశారు. ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ, కొంచెం ముందుకు నడిచింది. ఇంతలో కాంట్రాక్ట్ హంతకులు వెనుక నుండి వచ్చి రాజాను అంతమొందించారని పోలీసు అధికారి మారక్ మీడియాకు తెలిపారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించారని కూడా చెప్పారు. ఘటన తరువాత సోనమ్ ఒక నిందితుని స్కూటీపై కూర్చుని వెళ్లిందని, మిగిలిన ఇద్దరు నిందితులు మరో స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసు అధికారి పేర్కొన్నారు. మృతదేహాన్ని విసిరేయడంతో సోనియా సహాయంతరువాత వారంతా రాజా మృతదేహాన్ని మౌలాఖియాత్ అనే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్పారు. రాజా మృతదేహాన్ని లోయలోకి విసిరివేయడంలో సోనమ్ కూడా తమకు సహాయం చేసిందని నిందితులు చెప్పారని పోలీసు అధికారి మారక్ తెలిపారు. హత్య వెనుక గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని అన్నారు. మే 11న ఇండోర్లో రాజా, సోనమ్లకు వివాహం జరిగింది. తరువాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
గోపిచంద్ బర్త్డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ హీరో గోపిచంద్- దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది. నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. #Gopichand33 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను ఇంకా ప్రకటించలేదు. చిట్టూరి శ్రీనివాస ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. భారతీయ చరిత్రలో అనేక కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. చాలాగ్యాప్ తర్వాత ఆయన నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. -
Murudeshwar కోరిన కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రం
పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్ (Murudeshwar temple). ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో. రావణాసురుడు తన అనన్యసామాన్యమైన భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టేముందు దానిని మార్గమధ్యంలో భూమిమీద ఎక్కడా ఉంచకూడదని శివుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడా బాలుడు. ఇంకేముంది, శివలింగం భూమిలో దిగబడిపోతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరి పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులపాదధూళి పడి పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్. చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో పారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహిమాన్విత ప్రదేశాలుగా మారిపోయాయి. అవే, గోకర్ణక్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరమయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వరక్షేత్రమయిందని అంటారు. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని దేవశిల్పి విశ్వకర్మను రప్పించి, శివుడే స్వయంగా దగ్గరుండి తయారు చేయించాడని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాత, ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని, బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు, పత్రాలతో పూజించి, పండ్లను నివేదించి వెళుతుంటాడని, బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలంతో చిలకరించిన నీటితో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు ఏర్పడిందనీ స్థలపురాణం చెబుతోంది. .అనితర సాధ్యమైన శిల్పసౌందర్యం... మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్పసౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవర ణంలో కనిపించే శివుని ఎత్తైన పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి రెండేళ్ల పట్టిందట. 20 అంతస్థులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాలిగోపురానికి ఇరుపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి.తీర్థేశ్వరం కూడా... మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అనే ముఖ్యమైన తీర్థాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల దీర్ఘవ్యాధులు నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరతాయనీ అంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. ఆలయం ఆవరణలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతుంటారు. ఎలా వెళ్లాలంటే..? గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బెంగళూరు, మంగుళూరు, హుబ్లీ, ధర్మస్థల నగరాలనుంచి బస్సులున్నాయి. నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది. భోజన, వసతి: ఇక్కడ యాత్రీకులు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.36 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం లాభపడింది. నాస్డాక్ 0.5 శాతం పుంజుకుంది.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వారాహి ఆలయాన్నీ వదలని టీడీపీ నేతలు
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖిలో పడేశారు. ఇన్నాళ్లూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు వారాహి మాత ఆలయ స్థలంపై కన్నేశారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడి మంగళవారం అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ దీక్ష చేసిన వారాహి అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడేయడం కలకలం రేపింది. మారణాయుధాలతో దాడిచేసి.. ఆలయ నిర్వాహకులు, హిందూ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీవారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆలయం ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచి్చన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపించారు.అర్ధరాత్రి ఆలయం నేలమట్టం పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూలవిరాట్ శ్రీవారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాల చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై భజరంగ్దళ్ కార్యకర్తలు బుధవారం ఘటన స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు, అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి.హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీసు స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆలయాన్ని కూలి్చవేసి.. ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం. ఈ దురాగతం టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. కిశోర్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కావడం గమనార్హం.టీడీపీ నేత అండతోనే కూల్చివేతశ్రీవారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత, విగ్రహాల ధ్వంసం ఘటనలు తిరుచానూరుకు చెందిన టీడీపీ నాయకుడు కిషోర్రెడ్డి అండతోనే జరిగిందని జై భజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు కిరీఠి ఆరోపించారు. టీడీపీ నేతలు ఆలయాలపై దాడికి పాల్పడడం సహించబోమని, జిల్లావ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూటమి కనుసన్నల్లోకి వెళ్లిపోయిందని, సీఐ సునీల్కుమార్ కూటమి నేతల దౌర్జన్యాలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. -
WTC Final 2025: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన ట్రివిస్ హెడ్
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ ఓ మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్లో విఫలమైనా హెడ్ (13 బంతుల్లో 11) ఓ ఘనత సాధించాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి, ఆ స్థానానికి చేరాడు.ఐసీసీ ఫైనల్స్లో రోహిత్ 11 ఇన్నింగ్స్ల్లో 322 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్లో పరుగులతో కలుపుకొని హెడ్ 4 ఇన్నింగ్స్ల్లోనే 329 పరుగులు చేశాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రికార్డుల రిరాజు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 11 ఇన్నింగ్స్ల్లో 411 పరుగులు చేశాడు.వాస్తవానికి ఈ మ్యాచ్కు ముందు హెడ్ విరాట్ రికార్డుపైనే కన్నేశాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన రెండో ఇన్నింగ్స్లో అయినా హెడ్కు విరాట్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో హెడ్ 83 పరుగులు చేస్తే విరాట్ పేరిట ఉన్న ఈ అల్టైమ్ రికార్డు బద్దలవుతుంది.ఘనమైన రికార్డుట్రవిస్ హెడ్కు ఐసీసీ ఫైనల్స్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 163, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగులు చేశారు. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో 137 పరుగులు చేశాడు. తాజాగా జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో 11 పరుగులు చేశాడు. హెడ్ ఐసీసీ ఫైనల్స్లో చేసిన రెండు సెంచరీలు భారత్నే చేయడం విశేషం. ఈ సైకిల్ డబ్ల్యూటీసీలో భారత్ ఫైనల్స్కు చేరలేదు. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు.ఆసీస్ ఇన్నింగ్స్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీతో పాటు లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది. ఈ మ్యాచ్తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు.ఖ్వాజాను రబాడ, లబూషేన్ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ను (2) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు.డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు.2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జని్మంచారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు.ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది.-సాక్షి, నేషనల్ డెస్క్. -
మస్క్ క్షమాపణలపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్లు మళ్లీ దగ్గరకానున్నరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ ఇద్దరు స్నేహితులు సోషల్ మీడియాలో పరిస్పరం విమర్శలు చేసుకున్నారు. వీరి వివాదం ఎటువైపునకు దారితీస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే ఇంతలో ఎలాన్ మస్క్ ట్రంప్ను క్షమాపణలు కోరుతూ, ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. ‘న్యూయార్క్ పోస్ట్’తో జరిగిన ఫోన్ ఇంటర్వ్యూలో మస్క్ క్షమాపణలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. తన భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, తనకు కఠినమైన భావాలు లేవని ట్రంప్ అన్నారు. మస్క్ తనను క్షమాపణలు కోరడం చాలా బాగుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బడ్జెట్ బిల్లుపై మస్క్ పలు విమర్శలు చేశారని, అందుకు అతనిని నిందించనని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని కూడా అన్నారు.ట్రంప్కు మాజీ సహాయకుడు ఎలోన్ మస్క్ గత వారంలో ట్రంప్పై విమర్శలు గుప్పిస్తూ, సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో వీరి మధ్య వైరం పెరిగింది. ఆ తరువాత ట్రంప్ తన రాజకీయ విజయంలో మస్క్ పాత్రను తక్కువ చేస్తూ స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా 2024 ఎన్నికల్లో ట్రంప్ తన మద్దతు కారణంగానే విజయం సాధించారని మస్క్ పేర్కొన్నారు. తాజాగా మస్క్ తాను గతంలో ట్రంప్పై ఆరోపణలు చేస్తూ, చేసిన పోస్టులలో కొన్నింటిని తొలగించి క్షమాపణలు కోరారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్తో ప్రైవేట్గా మాట్లాడిన తర్వాత మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను క్షమాపణలు కోరారు. సోమవారం మస్క్ వ్యక్తిగతంగా ట్రంప్ను కలిసినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ట్రంప్.. ఎలాన్ మస్క్ క్షమాపణలను అంగీకరించారని సమాచారం. అయితే వారి మునుపటి సంబంధాలను పునరుద్ధరించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయలేదని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం -
మేయర్ను దూషించిన నిందితుడి అరెస్టు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఆమె తండ్రి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును వ్యక్తిగతంగా దూషించిన కేసులో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐడీఏ బొల్లారం శ్రీరామ్నగర్ బస్తీలో నివసించే మజ్జిగ రమేష్ (36) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. బుకింగ్లో భాగంగా ఈ నెల 1వ తేదీన క్యాబ్లో ప్రయాణికులను తీసుకుని రాజమండ్రి వెళ్లాడు. ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ చూస్తుండగా బోరబండలో బీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులను తట్టుకోలేకనే మృతి చెందినట్లుగా చూశాడు. దీంతో అదే రోజు రాత్రి గూగుల్లో సెర్చ్చేసి బాబా ఫసీయుద్దీన్ నెంబర్ సేకరించి ఆయనను తిడదామని ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచి్చంది. వెంటనే గూగుల్లో మరోసారి సెర్చ్ చేసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నెంబర్ను సేకరించాడు. అదే రోజు రాత్రి మేయర్కు ఫోన్ చేసి బోరబండ బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ మృతి ఘటనలో దోషులను మీరంతా రక్షిస్తున్నారని,కాంగ్రెస్లో చేరిన తర్వాత మీరంతా ఒక్కటయ్యారని అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ తెల్లవారి రాత్రి కూడా మరోసారి మేయర్కు ఫోన్ చేసి ఆమెను, ఆమె తండ్రిని వ్యక్తిగత దూషణలతో వేధించాడు.మరోమారు ఈ నెల 5వ తేదీన కూడా అర్ధరాత్రి ఫోన్ చేసి ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇలా మూడు సార్లు ఫోన్ చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. దీంతో మేయర్ పీఆర్ఓ అఖిల్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుడి ఫోన్ నెంబర్తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గత మూడు రోజులుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టి శ్రీరామ్నగర్లోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుడు క్యాబ్ నడిపిస్తుంటాడని, సొంతంగా కారు ఉందని, బీఆర్ఎస్ అభిమానిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉండగా మేయర్కు ఫోన్ చేసిన రోజు రాత్రి నిందితుడు పీకల దాకా మద్యం తాగి ఉన్నట్లు, మద్యం మత్తులోనే ఫోన్లు చేసినట్లుగా నిర్థారణ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం
దేశంలోనే అగ్రగామి బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్కు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి సారించింది. ఇందుకు వీలుగా బ్యాంక్ శాఖల స్థాయిలో 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టినట్టు తెలిపింది. పరిశ్రమలోనే దీన్నొక పెద్ద నియామక ప్రక్రియగా పేర్కొంది.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతిఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాథమిక స్థాయి పరీక్షల అనంతరం ఏప్రిల్ నెలలో ప్రధాన పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. పారదర్శక విధానంలో చివరికి 13,455 అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మందిని బ్యాంక్ నియమించుకోనుండగా.. ఇందులో 13,500 మంది క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు కాగా, మిగిలిన వారు స్థానిక అధికారులుగా పేర్కొన్నారు. -
సింగర్గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ
నటి దేవయాని (50) చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్ ఇండియాలో పాపులర్ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్, టీ రాజేందర్, కార్తీక్ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్లో మంచి సింగర్గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.టాలీవుడ్లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్లో ఆమె నటించనున్నారు. View this post on Instagram A post shared by zeetamil (@zeetamizh) -
హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు. -
బంజారాహిల్స్లో వ్యభిచార గృహంపై దాడి
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసులతో కలిసి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ బృందం వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్ కీపింగ్ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళలను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వాహకుడు అనంతపురం జిల్లా కేశవరాయనిపేటకు చెందిన కుమ్మెత నరేందర్రెడ్డి, హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తించే బీహార్లోని ముజఫర్పూర్ ప్రాంతానికి చెందిన ఆనంద్కుమార్, రాహుల్కుమార్లతో పాటు ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నలుగురు మహిళలను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. వీరి నుంచి రూ.26,500 నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతి
జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (పెట్టుబడి సలహా) సేవలు అందించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ నుంచి అనుమతి లభించినట్టు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అమెరికాకు చెందిన బ్లాక్రాక్ 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.ఇదీ చదవండి: జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధిమార్క్ పిల్గ్రెమ్ను ఎండీ, సీఈవోగా నియమించినట్టు జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాలు కోరుకుంటున్న నేపథ్యంలో తమ జాయింట్ వెంచర్ సంస్థ ప్రపంచస్థాయి సలహా సేవలు అందించనుందని జేఎఫ్ఎస్ఎల్ ఎండీ, సీఈవో హితేష్ సేతియా తెలిపారు. మరోవైపు జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించేందుకు గత నెల 27న సెబీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. -
సాగర్ హైవేపై ఘోర ప్రమాదం
యాచారం(హైదరాబాద్): నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కియా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస సాయితేజ(24), వాస రాఘవేంద్ర(22), వాస పవన్కుమార్(26), వాస శివకుమార్, వాస సాయికుమార్(ఇద్దరు అన్నదమ్ములు), ఇదే జిల్లా మూసాపేట మండల కేంద్రానికి చెందిన మేకల సందీప్ సమీప బంధువులు. వీరంతా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంగళవారం వాస శివకుమార్ పుట్టిన రోజు కావడంతో బీఎన్రెడ్డి నగర్కు చెందిన స్నేహితుడు శివకుమార్ గౌడ్తో కలిసి..ఉదయం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సంబ రాలు ముగించుకుని మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మాల్ సమీపంలోకి రాగానే నగరం నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సాయితేజ, రాఘవేంద్ర, పవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్, సాయికుమార్, శివకుమార్ గౌడ్, సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాల్, మన్నె గూడలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పారీ్టకి వెళ్లిన వారిలో పవన్కుమార్ ఒక్కడికే వివాహం జరిగింది. ఇతనికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. సాగర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ సాగర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచి్చందని గ్రామస్తులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. -
జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధి
జీవిత బీమా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మెరుగైన వృద్ధిని చూశాయి. న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల ద్వారా) 10.8 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.30,463 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది మే నెలలో ఇది రూ.27,034 కోట్లుగా ఉంది.ఇక ఏప్రిల్, మే నెలల్లో కలిపి న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.52,427 కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.47,293 కోట్లుగా ఉంది. మొదటిసారి బీమా పాలసీల విక్రయంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడం ఈ వృద్ధికి దారితీసింది. ఇదీ చదవండి: యువతకు సత్య నాదెళ్ల సూచనఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల రూపంలో ఆదాయం 5.21 శాతం పెరిగి మే నెలలో రూ.3,525 కోట్లుగా ఉంది. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం మే నెలలో 10.27 శాతం పెరిగి రూ.18,405 కోట్లకు చేరుకుంది. మే నెలలో ఎల్ఐసీ గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.79 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.66 శాతం పెరిగింది. -
టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె. మహేంద్ర (75) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి గుంటూరులో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో గుంటూరులో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.మొదట దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న మహేంద్ర తర్వాత నిర్మాతగా మారి 50కు పైగా సినిమాలు తెరకెక్కించారు. చెన్నై నుంచి హైదరబాద్కు సినీ పరిశ్రమ వచ్చాక ఆయన ఏఏ ఆర్ట్స్ బ్యానర్ను నిర్మించారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కూడా మహేంద్రనే కావడం విశేషం. ఆపై దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా ఆయనే ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ప్రేమించి పెళ్ళి చేసుకో, ఆరని మంటలు, ఎదురులేని మొనగాడు, ప్రచండ భైరవి, ఢాకూరాణి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. -
ఆ రోజు ఏం జరిగింది?
బనశంకరి(కర్ణాటక): ఈ నెలారంభంలో ఆర్సీబీ జట్టు సంబరాల సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనలో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. బుధవారం 14 మంది క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడడం తెలిసిందే. కలెక్టర్ పిలుపుతో కేజీ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలువురు బాధితులు గాయాలతోనే వచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అని ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేడియం అంటే భయం మోనీశ్ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. కలెక్టర్ నోటీస్ ఇవ్వడంతో వచ్చానని, ఘటన గురించి ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇచ్చానని తెలిపారు. దుర్ఘటనకు ఆర్సీబీ మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని, ఒకేసారి రెండుచోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందన్నారు. రెండురోజులు తరువాత వేడుకలు జరపాల్సిందన్నారు. విధానసౌధ వద్ద ఎక్కువమంది పోలీసులు ఉండగా, స్టేడియం వద్ద తక్కువ సంఖ్యలో నియమించారు. ఇకపై స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే భయం వేస్తుందని వాపోయాడు. ముందుగా టికెట్లు ఇచ్చినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. మరోవైపు నూతన పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలు జరిగిన గేట్ల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. -
భారత్కు కొత్త టెన్షన్!.. పాక్కు అండగా అమెరికా భారీ ప్లాన్?
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్, ఖొరాసన్కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్తోపాటు పాకిస్తాన్తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి."Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది."Ties with India cannot cost ties with Pakistan" General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS— BRADDY (@braddy_Codie05) June 11, 2025అమెరికా భారీ స్కెచ్..ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
మార్వ్లెస్. మాన్సూన్ వెడ్డింగ్స్..
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టు నీడకై పరుగిడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..’ అంటూ సాగే పాత తెలుగు సినిమా పాటను గుర్తు చేసేలా నేటి వెడ్డింగ్ ప్లానర్లు ప్లాన్ చేస్తున్నారు.. సాధారణంగా వర్షాకాలంలో పెళ్లిళ్లు అంటే కాస్త ఇబ్బంది.. చిరాకే.. కానీ, పక్కాగా ప్లాన్ చేస్తే వానాకాలంలో పెళ్లి వేడుకలను మధురమైన అనుభూతిగా మిగుల్చుకోవచ్చు.పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైంది. మరోవైపు వేసవి ముగియకముందే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అంగరంగ వైభవంగా అలంకరించుకొని, బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా వర్షం పడితే ముందస్తు ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు చిరాకు పడటంతో పాటు రావాల్సిన బంధువులు రాలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే వానాకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కాసింత కష్టమే. కానీ, ఇవన్నీ పాత రోజులు. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పెళ్లి వధూవరులకు మంచి అనుభూతిని మిగులుస్తుందని అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు.హైబ్రిడ్ వేదికలు.. ఈమధ్య కాలంలో వర్షాకాలంలో వివాహాలు ట్రెండీగా మారాయి. పెళ్లి శుభలేఖల నుంచి మొదలుపెడితే వేదిక, మండపం అలంకరణ, అతిథుల ఆహ్వానం, ఫొటోగ్రఫీ, బరాత్ వరకూ అన్నీ ప్రత్యేకమైనవిగా ఉంటాయి. సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే వధూవరులకు, అతిథులకు గొప్ప అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాటిక్ పెళ్లి వేడుకలను వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. వాన ఇబ్బందుల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.అన్ని రకాలుగా వేడుకలకు సిద్ధం చేయడమే ఈ సంస్థల ప్రత్యేకత. పెళ్లి మండపమే కాదు టెర్రస్, లాన్, ఓపెన్ ఏరియా అన్నింటినీ గ్లాస్ కనోపీలతో కవర్ చేస్తారు. జర్మన్ హ్యాంగర్ టెంట్లు, వాటర్ ప్రూఫ్ డోమ్లు, ముడుచుకునే పైకప్పులతో వివాహ వేదిక, మండపాలు నిర్మిస్తారు. అకస్మాత్తుగా వర్షం కురిస్తే వాననీరు వెళ్లేందుకు సరైన మార్గాలను ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్పరెంట్ పెళ్లి వేదిక, మండపాలతో వధూవరులకే కాదు అతిథులు కూడా వర్షం పడినా తడిసిపోకుండా వర్షపు జల్లులు, శబ్దాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతిని పొందుతారు.భద్రత కీలకమే.. నాన్స్లిప్ టైల్స్, మ్యాట్లు, తగినంత లైటింగ్తో పాటు వృద్ధులకు డ్రై జోన్లను ఏర్పాటు చేస్తారు. వర్షాకాలంలో బరాత్లకు బదులుగా సన్నాయి మేళం, డోల్ చప్పుళ్లు, మ్యూజిక్ బ్లాస్టింగ్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో అతిథులు గొడుగుల కింద నృత్యం చేసే వీలుంటుంది. విద్యుత్ అంతరాయం కలగకుండా బ్యాకప్ బ్యాటరీలు, జనరేటర్లను క్యారీ చేస్తారు. డీహ్యుమిడిఫయ్యర్లు, ప్లాస్టిక్ టార్ప్లిన్ ఏర్పాటు చేస్తారు. లాంతర్లు, షాండీలియర్ల వెలుగులో వధూవరులు గొడుగుల కింద లేదా వర్షంలో తడుస్తూనే రొమాంటిక్ ఫొటోలకు ఫోజులు ఇస్తారు.వర్షాన్ని ఆస్వాదించేలా.. శుభలేఖ కూడా మేఘాలు, వర్షం చినుకులను ప్రతిబింబించేలా ముద్రిస్తారు. అతిథులు పెళ్లి వేదికలో అక్కడక్కడ శుభ్రమైన చిన్న టవల్స్ను అందుబాటులో ఉంచుతారు. బగ్ స్ప్రే ప్యాచ్లు, త్వరగా ఆరిపోయే న్యాప్కిన్లు, వర్షంలో, బురదలో జారిపడిపోకుండా ఫ్లిప్ఫ్లాప్ పాదరక్షలు అందుబాటులో ఉంచుతారు. అతిథులు వర్షం మూడ్ ఆస్వాదించేందుకు వేడి టీ, కాఫీలు, మసాలా మాక్టెయిల్స్, ముల్లడ్ వైన్ కాక్టెయిల్స్తో బార్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వెల్వెట్, సిల్క్ వంటి బరువైన దుస్తులుహుందాగా కనిపిస్తాయి. అయితే వీటి వల్ల వర్షాకంలో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ వర్షంలో తడిస్తే అవి మరింత బరువుగా మారతాయి. పైగా వర్షం పడిన సమయంలో ఉక్కపోతకు ఇబ్బంది కలిగిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటికి బదులు తేలికపాటి నేత వ్రస్తాలు, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మృధువైన నైలాన్తో తయారైన వ్రస్తాలు, సిల్్క, సింథటిక్ ఫైబర్తో తయారైన జార్టెట్తో లెహంగాలను డిజైన్ చేస్తున్నారు. ఇవి నీటిని పీల్చుకోకపోవడంతో పాటు తేలికగా ఉండటమే వీటి ప్రత్యేకత. వాటర్ ప్రూఫ్ లైనింగ్, క్విక్ డ్రై దుపట్టాలను వధూవరులు ఎంచుకుంటున్నారు. -
కూకట్పల్లిలో గజం భూమి ధర రూ.2.98 లక్షలు
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలకు బుధవారం ఏర్పాటు చేసిన వేలం పాటలో భారీ స్పందన లభించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7వ ఫేజ్లోని 18 ప్లాట్లను వేలం వేయగా అన్ని ప్లాట్లు హాట్కేక్ల్లా అమ్ముడుపోయాయి. 7వ ఫేజ్లోని ప్లాట్ నంబర్ 22ను అత్యధికంగా గజానికి రూ.2.98 లక్షల చొప్పున దక్కించుకున్నారు. 151 గజాలున్న ఈ ప్లాట్ 4 కోట్ల 52 లక్షల 72 వేల 160 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అదే విధంగా 292 గజాలు ఉన్న 19వ నంబర్ ప్లాట్ గజానికి రూ.2.88 లక్షల చొప్పున వేలకు వేలం పాడారు. ఈ ప్లాట్ నుంచి 8 కోట్ల 40 లక్షల 96 వేల రూపాయలు వచ్చాయి. ఇక్కడ ఉన్న మొత్తం 18 ప్లాట్లలోని 6,236.33 గజాలకు కలిపి 141 కోట్ల 36 లక్షల 89 వేల 100 రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
WTC Final 2025: చరిత్ర సృష్టించిన రబాడ
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (జూన్ 11) మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన అతను.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. రబాడ ఈ రికార్డు సాధించే క్రమంలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ను (72 టెస్ట్ల్లో 330 వికెట్లు) అధిగమించాడు. తాజా ప్రదర్శన అనంతరం రబాడ ఖాతాలో 332 వికెట్లు (70 టెస్ట్ల్లో) ఉన్నాయి.టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డేల్ స్టెయిన్ పేరిట ఉంది. స్టెయిన్ 93 టెస్ట్ల్లో 439 వికెట్లు తీశాడు. స్టెయిన్ తర్వాత షాన్ పొలాక్ (108 టెస్ట్ల్లో 421 వికెట్లు), మఖాయా ఎన్తిని (101 టెస్ట్ల్లో 390 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్ల్లో 800 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ (145 టెస్ట్ల్లో 708), జేమ్స్ ఆండర్సన్ (188 టెస్ట్ల్లో 704) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.కాగా, ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రబాడ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఉస్మాన్ ఖ్వాజా, గ్రీన్, వెబ్స్టర్, కమిన్స్, స్టార్క్ వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు.రబాడకు (5/51) జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) తోడవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే కుప్పకూలింది (56.4 ఓవర్లలో). తొలి రోజు టీ విరామం కాగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది.ఈ మ్యాచ్తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. స్టీవ్ స్మిత్ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్ను (0) జన్సెన్ ఔట్ చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ను (2) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం
ఢాకా : బంగ్లాదేశ్లో మరో విధ్వంసం చోటుచేసుకుంది. సిరాజ్గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఒక సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.సందర్శకుడిని బంధించి..స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కచ్చరిబారికి ఒక సందర్శకుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు. మోటారుసైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఆ సందర్శకుడికి, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సందర్శకుడిని కార్యాలయ గదిలో బంధించి, మ్యూజియం సిబ్బంది అతనిపై దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దర్యాప్తుకు ప్రత్యేక కమిటీఇది స్థానికులలో ఆగ్రహానికి కారణమయ్యింది. వారంతా దీనిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. తర్వాత వారు కచ్చరిబారి ఆడిటోరియంలోకి చొరబడి ధ్వంసం చేశారు. సంస్థ డైరెక్టర్పై దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటన నేపధ్యంలో ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఐదు రోజులలోగా కమిటీ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. కచ్చరిబారి అధికారి హబీబుర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల కారణంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశామన్నారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహి డివిజన్లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలాకాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. దీనిని మ్యూజియంగా మలచారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
బర్త్డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ.. డీసీపీ కామెంట్స్
గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి ఇచ్చిన పార్టీలో డ్రగ్స్, గంజాయి ఉపయోగించారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని సోషల్మీడియాలో ఆ వార్తలు వైరల్ అయ్యాయి. తను ఏర్పాటు చేసిన విందులో తన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని అక్కడ ఎలాంటి డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా చేయలేదని ఆమె ఒక వీడియోతో వివరణ ఇచ్చారు. పోలీసులు కూడా దానిని ధ్రువీకరించారు.మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదని చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఇలా చెప్పారు. 'మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దీంతో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు 10 మంది మహిళలతో పాటు 12మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాము. అయితే, జిల్లెలగూడకు చెందిన వ్యాపారి కొసనం దామోదర్రెడ్డికి గంజాయి పాజిటివ్గా వచ్చింది. మిగిలిన వారిలో ఎవరికీ రిపోర్ట్లో పాజిటివ్ రాలేదు. కానీ, అతను కూడా మంగ్లీ ఇచ్చిన పార్టీలో గంజాయ్ తీసుకోలేదని, అంతకుముందే మరోచోట తీసుకున్నట్లు తెలిసింది.' అని డీసీపీ తెలిపారు. పోలీసులు చేసిన సోదాల్లో విదేశీ మద్యం కానీ, ఇతర మత్తు పదార్థాలు కానీ లభించలేదని చేవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ కూడా పేర్కొన్నారు.వివరణ ఇచ్చిన మంగ్లీతన పుట్టినరోజు నాడు జరిగిన అంశంపై సింగర్ మంగ్లీ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ' పుట్టినరోజు వేడుకలు నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి చేసుకున్నాను. అయితే, మద్యం బాటిల్స్, డిజే సౌండ్స్కి అనుమతి తీసుకోవాలి అనే అవగాహన నాకు లేదు. తెలియక తప్పు జరిగింది. అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు.' అని ఆమె చెప్పారు. -
అనకాపల్లి: ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్.. కార్మికులు మృతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ విష వాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విష వాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను చంద్రశేఖర్, కుమార్గా గుర్తించారు. విష వాయువు కారణంగా పలువురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో, కంపెనీ యాజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు.. పరవాడ ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కేజీహెచ్లో పరామర్శించారు వైఎస్సార్సీపీ నాయకులు బొడ్డేడ ప్రసాద్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పరవాడ ఫార్మా కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా కంపెనీలపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కార్మికులంటే ప్రభుత్వానికి లెక్కలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అన్నావదిన... దీవించండి
మంచిర్యాల: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ తన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి వివేక్ హైదరాబాద్లో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అన్నా వదినల కాళ్లకు సమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎల్లప్పుడు ఇలాగే తనపై ప్రేమానురాగాలు ఉంచాలని వివేక్ తన సోదరుడిని కోరారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, మునిమంద రమేశ్, కేవీ ప్రతాప్, హరీష్ గౌడ్, ఎం.మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన మహర్షి కర్ణాటక వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి (కేఎం వీఎస్టీడీసీ)లో కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఉమ్మడి బళ్లారి జిల్లాలో, బెంగళూరులో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. బళ్లారి జిల్లా ఎంపీ తుకారాం, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ శ్రీనివాస్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పీఏ గోవర్ధన్ ఇళ్లు, బెంగళూరులోని ఆఫీసుల్లో సోదాలు చేశారు. వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం కింద చేపట్టిన ఈ తనిఖీలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపాయి. వాల్మీకి అభివృద్ధి మండలి స్కాం గతేడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడాలని ఒత్తిళ్లు వస్తున్నాయని లేఖ రాసి మండలి ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలి ఖాతాల నుంచి ఓ మంత్రి రూ.94 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేసి తెలంగాణ శాసన సభ ఎన్నికలు, బళ్లారి లోక్సభ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు. తరువాత ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ను, కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. మళ్లించిన నిధుల నుంచి కంప్లి ఎమ్మెల్యే గణేశ్కు రూ.3 కోట్లు, ఎంపీ తుకారాంకు రూ.10 కోట్లు, ఎన్టీ శ్రీనివాస్కు కూడా కొంత నగదు చేరినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. -
మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం..
గౌహతి: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి అదృశ్యం వెనుకనున్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు.త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్లో ఐస్క్రీమ్ ఫ్రీజర్లో దాచిన ట్రాలీ బ్యాగ్లో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మేఘాలయలో చోటుచేసుకున్న ‘హనీమూన్ హత్య’ దరిమిలా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ యువకుడు, దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్స్టోరీ ఈ హత్యకు దారితీసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో తొలుత ఆ మహిళకు, ఆమె బంధువు అయిన దిబాకర్ సాహా మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తేలింది. సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. జూన్ 8న సాయంత్రం డాక్టర్ దిబాకర్ సాహా.. సరిఫుల్ను సౌత్ ఇంద్రానగర్ కబర్ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోయ్దీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్ అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేశారని పోలీసులు తెలిపారు.మర్నాటి ఉదయం దిబాకర్తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’ -
ఢిల్లీలో బాబు డాబు
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 20 సార్లు ఢిల్లీకి వచ్చారు. ప్రతిసారీ అభివృద్ధే అజెండా అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. కొత్త అప్పులకు మద్దతు కోరడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దలను కలుస్తూ వచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ధ్వంసం చేసిందని విమర్శిస్తూ.. ఆ వంకతో కేంద్రం మద్దతుతో రూ.కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతి పేరుతో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు తీసుకోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు పొందారు. ఇవికాక బడ్జెటేతర అప్పులు రూ.19,410 కోట్లు. ఏడాదిలో భారీగా అప్పు చేయడంలోనే చంద్రబాబు తన మార్క్ చూపారు. ఇకప్రతిసారీ చంద్రబాబు ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వచ్చారు. దాదాపు 15–17 సార్లు రెండు రోజుల పాటు మకాం వేశారు.ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నా.. చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్డీఏ నేతలు ఎవరూ నోరు మెదపలేదు. పైగా దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ ఎంపీలపై కూటమి ఎంపీలు పార్లమెంట్లో వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొందని మీడియా ప్రశ్నించినా... కూటమి నేతల నుంచి సమాధానం రాలేదు.మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా స్పందించారు. క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా... రూ.10,025 కంటే రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదని కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) తేల్చి చెప్పింది. అయినా మిర్చికి మద్దతు ధర లభించిందని, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఏపీలో రేటు పెంచితే దేశం మొత్తం పెంచాల్సి వస్తుందని కేంద్రం చెప్పడంతో... చంద్రబాబు మళ్లీ ఈ విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ దోబూచులాటల కారణంగా మిర్చి రైతులకు రూ.8,827 కోట్లు నష్టం వాటిల్లింది.సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తల ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని, వారు పెట్టుబడులు పెడితే తద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించొచ్చు అని చెప్పుకొచ్చారు. -
WTC Final 2025: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా
2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లార్డ్స్ వేదికగా నిన్న (జూన్ 11) ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం పోరాడుతున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రొటీస్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఘోరంగా పతనమైంది. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి రోజు విరామం కాగానే ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్తో ఆసీస్ పతనాన్ని మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. ఖ్వాజాను రబాడ, లబూషేన్ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ను (2) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ (8) భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. చెత్త రికార్డుఇదిలా ఉంటే, తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ చరిత్రలో అత్యల్ప తొలి ఇన్నింగ్స్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. తొలి డబ్ల్యూటీసీ (2019-2021) ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్ పేరిట ఉండిన ఈ చెత్త రికార్డును ఆసీస్ తమ ఖాతాలోకి వేసుకుంది. -
కుటుంబ వ్యాపారం.. నా దారి నేను చూసుకుంటా..
సాక్షి, స్పెషల్ డెస్క్: తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట.హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు.హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ప్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్లో ఆన్లైన్లో నిర్వహించారు.మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్కాంగ్లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు.వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం.ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘హురున్’ గణాంకాల ప్రకారం 2024 నాటికి దేశంలో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. అంత క్రితం ఏడాదిలో ఈ సంఖ్య 259. పదేళ్ల క్రితం 109 మాత్రమే. వీరిలో 70% మంది రూ.1,28,25,000 కోట్ల సంపదను వారసత్వంగా అందుకోనున్నారు. -
రిస్క్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. పొరపాటు జరిగితే అంతే
పాన్ ఇండియన్ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు ఉమెన్స్ సెంట్రిక్ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్ అగ్వరాల్కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాగే ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె మళ్లీ ఫ్రైమ్ టైమ్లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయకుండా రిస్క్తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి. -
825 బిలియన్ డాలర్ల ఎగుమతులు
బెర్న్: ప్రపంచ వాణిజ్యం భౌగోళిక రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అయినా భారత్ 2025–26లో 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను (రూ.70.12 లక్షల కోట్లు) సాధిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ పోరు, రెడ్సీ సంక్షోభాలను ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సందర్భాల్లో భారత్ విజేతగా నిలిచినట్టు గుర్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2024–25లో భారత్ 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసినట్టు చెప్పారు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం క్షీణతను చవిచూడనుందని మంత్రి చెప్పారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) మాత్రం 2025–26లో ఎగుమతులు 21 శాతం పెరిగి ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు పెరిగిపోయిన తరుణంలో కొనుగోలుదారులు తమ సోర్సింగ్ (ముడి సరుకుల సమీకరణ)ను వైవిధ్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడం వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హన్ తెలిపారు. ఎఫ్ఐఈవో అంచనా మేరకు 2025–26లో వస్తు ఎగుమతులు 12 శాతం పెరిగి 525–535 బిలియన్ డాలర్లుగా ఉండనున్నాయి. 2024–25లో వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల గుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇవి 20 శాతం పెరిగి 465–475 బిలియన్ డాలర్లకు చేరుకోచ్చన్నది ఎఫ్ఐఈవో అంచనా. ఎఫ్టీఏలతో సానుకూలత యూఏఈ, ఆ్రస్టేలియా, ఐరోపా ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు) ఎగుమతుల వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో అంచనా వేస్తోంది. ఇందులో ఈఎఫ్టీఏతో ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్ పాలనలో కుదిరిన ఎఫ్టీఏలు దేశీ సంస్థలకు నష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి గోయల్ అన్నారు. పోటీ దేశాలైన ఆసియా దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, అవి కూడా సమతుల్యంగా లేనట్టు చెప్పారు. ఆయా దేశాలకు భారత్ మార్కెట్ అవకాశాలు కలి్పంచగా, బదులుగా మనకు మంచి అవకాశాలు దక్కలేదన్నారు. మోదీ సర్కారు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలైన ఆ్రస్టేలియా, యూకే, ఈఎఫ్టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. -
ఎలక్ట్రిసిటీ ఎఫ్అండ్వోకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఇకపై నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హెడ్జింగ్ టూల్స్గా వీటిని మార్కెట్ వర్గాలు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా విద్యుత్ రంగంలో తగిన ధరల సంకేతాలతోపాటు.. పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలు కలగనున్నట్లు తెలియజేసింది. విద్యుదుత్పత్తితోపాటు.. ప్రసారం, పంపిణీ, రిటైల్ తదితర విభాగాలలో పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు వివరించింది. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించేందుకు తాజా అనుమతి సహకరించగలదని, ఇందుకు ఇది తొలి అడుగు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగా త్రైమాసిక, వార్షిక తదితర దీర్ఘకాలిక కాంట్రాక్టులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు గత వారం ఎంసీఎక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త యూపీఐ విధానం ఇన్వెస్టర్ల పరిరక్షణ లక్ష్యంగా సెబీ కొత్త యూపీఐ మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే అన్ని రిజిస్టర్డ్ ఇంటరీ్మడియరీలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక లావాదేవీలకు వీలు, వీటి భద్రత లక్ష్యంగా తాజా యూపీఐ మెకనిజంకు తెరతీసినట్లు సెబీ తెలియజేసింది. వెరసి 2025 అక్టోబర్ 1నుంచి యూపీఐ చెల్లింపుల మెకనిజం అమల్లోకి రానున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. ఇటీవల కాలంలో అన్రిజిస్టర్డ్ సంస్థలు ఇన్వెస్టర్లను మోసగించడం ఎక్కువైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు చేపట్టింది. ధృవీకరించిన, భద్రతతోకూడిన చెల్లింపుల చానల్కు తెరతీయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నట్లు పాండే వివరించారు. -
గోల్డ్ ఈటీఎఫ్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మే నెలలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అవగాహన తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్ డినామినేషన్లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్ఫోలియో హెడ్జింగ్కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అయ్యే డిజిటల్ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. -
11 ఏళ్లలో 33 తప్పులు
కలబురిగి: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 33 తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేవలం అబద్ధాలు, మోసాలతో మోదీ కాలం గడిపే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా దగా చేశారని, ఓట్ల కోసం పేదలను వాడుకున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసాలపై పార్లమెంట్లోనూ తాను గళమెత్తానని తెలిపారు. తాను 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇందులో 55 ఏళ్లు పదవుల్లో ఉన్నానని, నరేంద్ర మోదీ లాంటి మోసకారి ప్రధానమంత్రిని ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. బుధవారం కర్ణా టకలోని కలబురిగిలో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. చెప్పింది మోదీ ఏనాడూ చేయలేదని, అదేమిటని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదని విమర్శించారు. ఆయనకు అబద్ధాలు తప్ప మరొకటి తెలి యదన్నారు. మోదీ తప్పుల జాబితాలో పెద్దనోట్ల రద్దు, ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, పంటలకు కనీస మద్దతు దక్కపోవడం వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తప్పులన్న విషయం ప్రధాని అంగీకరించడం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా మాటలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 11 ఏళ్లు గడిచిపోయానని, ఇప్పటిదాకా చేసిందేమీ లేదని ఆక్షేపించారు. డిప్యూటీ స్పీకర్ను నియమించాలి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా కొనసాగిస్తుండడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్ను నియమించాలని సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉన్న దాఖలాలు ఏనాడూ లేవని వెల్లడించారు. -
ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ఆవిర్భావం సహజమే
న్యూఢిల్లీ: కరోనా వైరస్లలో కొత్తగా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ పుట్టడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సార్స్–కోవ్–2 వేరియంట్లో సహజ ఉత్ప్రరివర్తనమని భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. భారత్లో వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో 200 కేసులు ఎక్స్ఎఫ్జీ వేరియంట్ కారణంగా సోకాయని నిర్దారణ కావడంతో ఈ అంశంపై భార్గవ స్పందించారు. ‘‘ సార్స్–కోవ్–2 తరచూ సహజంగా పరివర్తనం చెందుతోంది. దాని ఉత్పరివర్తనమే ఎక్స్ఎఫ్జీ. ఇది సహజ ఆవిర్భావమే’’ అని ఆయన అన్నారు. జూన్ 11వ తేదీనాటికి దేశవ్యాప్తంగా కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 7,000 మార్కును దాటింది. గత 24 గంటల్లోనే 300 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోవిడ్ కారణంగా కన్నుమూశారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సార్స్–కోవ్–2 జన్యువిశ్లేషణ కన్సార్షియం(ఇన్సాకాగ్) తాజా గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా 206 దాకా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ కేసులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎక్స్ఎఫ్జీ కేసులున్నాయి. వాటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 89, పశ్చిమబెంగాల్ నుంచి 49, కేరళలో 15, తమిళనాడులో 16, గుజరాత్లో 11, మధ్యప్రదేశ్లో 6, ఆంధ్రప్రదేశ్లో ఆరు, ఒడిశాలో మూడు, తెలంగాణ ఒక కేసు నమోదయ్యాయి. ‘‘మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ఏమార్చగలదని తొలుత వార్తలొచ్చాయి. వాటిల్లో నిజం లేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో వ్యాధి ముదురుతుందనే బలమైన ఆధారాలు లేవు’’ అని భార్గవ అన్నారు. -
యూఎస్లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దురహంకారంతో తప్పులు చేశాడు
వాషింగ్టన్: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్కు చెందిన యువ పాప్సింగర్ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. ‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్ అంటే బిష్ణోయ్కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్పై మమకారంతో మంచి పాప్సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్నైట్ మెసేజ్లు బిష్ణోయ్కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.కబడ్డీతో మొదలై...‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్ బద్ధశత్రువులైన బామ్బిహా గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్బిహా గ్యాంగ్కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్ గ్యాంగ్లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. విక్కీని చంపింది తామేనని బామ్బిహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్ శగన్ప్రీత్ సింగ్ పేరును విక్కీ హత్య కేసు చార్జ్షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్ప్రీత్ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్ చెప్పాడు. భారత్లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు. రెండు గ్యాంగ్ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. -
చైనాతో డీల్: ట్రంప్
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా నడుమ రెండు నెలల వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడ్డట్టే. ఇరుదేశాల మధ్య వర్తక ఒప్పదం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘లండన్లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేను, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తుది ఆమోదముద్ర వేయడమే తరువాయి’’ అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇకపై చైనా దిగుమతులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 10 శాతం టారిఫ్లు వసూలు చేస్తుంది’’ అని వివరించారు. విభేదాలు ముదిరిన నేపథ్యంలో అమెరికాకు మ్యాగ్నెట్లు మొదలుకుని 17 రకాల అరుదైన ఖనిజాలు తదితరాల ఎగుమతులపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తేయనుందని తెలిపారు. ‘‘బదులుగా చైనాకు కూడా గత ఒప్పందాల మేరకు అన్ని విషయాల్లోనూ తలుపులు తెరుస్తాం. చైనా విద్యార్థులను అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లోకి ఎప్పట్లాగే సాదరంగా ఆహ్వానిస్తాం’’ అని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుదేశాలకూ లాభదాయక రీతిలో ఒప్పందం కుదిరింది’’ అంటూ హర్షం వెలిబు చ్చారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మొత్తం అరుదైన ఖనిజ నిల్వల్లో 61 శాతం, ఉత్పత్తిలో ఏకంగా 91 శాతం వాటా చైనాదే. -
జననాల తగ్గుదల వరమా.. శాపమా?
ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండుకు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల (టీఎఫ్ఆర్–టోటల్ ఫెర్టిలిటీ) రేటు కనీసం 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కనీసం ఇద్దరిని కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఎఫ్ఆర్ ఏకంగా 1.9కి పడిపోయిందని ‘సంతాన సంక్షోభం’ పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్ఎఫ్పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది.ఇదీ పరిస్థితి!1.9 టీఎఫ్ఆర్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికీ తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఎఫ్ఆర్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గతేడాది లాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసింది. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్లకంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది. 1950ల్లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా ఆరుగురిని కనేది! 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడినుంచి ఇద్దరు పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువమందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడటం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే.ఆందోళన అక్కర్లేదు!జననాల రేటు (టీఎఫ్ఆర్) తగ్గితే జనాభాపరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటా యి. ముఖ్యంగా యువ శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ‘‘2050 నాటికి భారత జనాభాలో వృద్ధుల సంఖ్య ఐదో వంతుకు చేరుతుంది. చైనాది ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఒకే సంతానం నిబంధనను దశాబ్దాలుగా కఠినంగా అమలు చేయడమే అందుకు కారణం’’ అని జనాభా నిపుణులు చెబుతున్నారు. ‘‘జనాభా పెరుగుదలను బాగా తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలన్నీ దాని పర్యవసానాలను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే 2.1 కంటే చాలా తక్కువకు పడిపోయింది. బిహార్ (3), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7) వంటివి మాత్రమే ఇందుకు మినహాయింపు’’ అని ఇంటర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డెమోగ్రఫీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి వివరించారు. ‘‘అంతమాత్రాన టీఎఫ్ఆర్ తగ్గుదలను చూసి ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మిక శక్తి భారీగా తగ్గుతుందన్నది అపోహ మాత్రమే. నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాంతాల మధ్య వలసలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుదల ఒక్కటే మున్ముందు భారత్కు సమస్యగా మారే ఆస్కారముందని ఆయన అంచనా వేశారు. ‘‘వయోపరమైన అంతరం నానాటికీ పెరిగిపోయి చివరికి పెద్దవాళ్ల ఆలనాపాలనా చూసే వారసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరమైన సౌకర్యాలు మన దగ్గర బాగా తక్కువే’’ అని గుర్తు చేశారు. 60–75 ఏళ్ల వయసు వారికి ఇప్పటిమాదిరిగా తగిన ఉపాధి అవకాశాలు కూడా మున్ముందు సవాలుగానే మారవచ్చని అహ్మదాబాద్లోని ఎల్జే వర్సిటీ ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్ఏంజెలెస్ డౌన్టౌన్లో లూటీలకు తెరలేపారు. యాపిల్ ఐఫోన్ స్టోర్సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు. ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ చెప్పారు. నగరంలో తాత్కాలిక కర్ఫ్యూస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ కరెన్ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్టౌన్ జిల్లాలోని ఆర్ట్స్ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్ రో, ఫ్యాషన్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్చేశారని మేయర్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్ చీఫ్ జిమ్ మెక్డోనెల్ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్ ‘నేషనల్ గార్డ్’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్ ఏంజెలెస్లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్ హెచ్చరించారు.కోర్టులో గవర్నర్కు చుక్కెదురున్యూయార్క్ గవర్నర్ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్ ఏంజెలెస్లోకి నేషనల్ గార్డ్, మెరైన్లను పంపుతూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇప్పటికే నేషనల్గార్డ్, మెరైన్లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్ విధుల్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్ గార్డ్లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్చేయట్లేదు. అరెస్ట్చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.ఇతర నగరాల్లో ఆందోళనలుకర్ఫ్యూతో లాస్ ఏంజెలెస్లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్బుల్లెట్లు బీన్–బ్యాంగ్ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.టిక్టాక్ స్టార్పై బహిష్కరణ వేటు16.24 కోట్ల మంది టిక్టాక్ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ఖబీ లేబ్ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్– ఇటాలియన్ మూలాలున్న ఇతను చేసే టిక్టాక్ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతను యూనిసెఫ్ గుడ్విల్ అంబాసి డర్గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోనూ నేషనల్ గార్డ్లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు. -
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర చార్జీలు మినహాయింపు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ (ఐఎస్టీఎస్) ఛార్జీల మినహాయింపును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మరో మూడేళ్లు పొడిగించింది. 2028 జూన్ 30 లోపు ప్రారంభించే హైడ్రో పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) తదితర ప్రాజెక్టులకు ఈ ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. ఈ వెసులుబాటు వల్ల ప్రాజెక్టు ఖర్చు తగ్గుతుందని వెల్లడించింది. పవర్ గ్రిడ్ స్థిరత్వం, సమర్థవంత నిర్వహణకు ఆర్ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయని తెలిపింది. తమ ఆదేశాలకు అనుగుణంగా లీగల్ టీమ్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లను రూపొందించుకోవాలని కేంద్రం సూచించింది.‘ఐఎస్టీఎస్’ వెలుసుబాటుతో గతంలోనే ఒప్పందాలువ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందించే లక్ష్యంతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే సమయంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం 2021 జనవరిలో కేంద్రం ఐఎస్టీఎస్ చార్జీలను పూర్తిగా మాఫీ చేసింది. అనంతరం ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో యూనిట్ కేవలం రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను అందిస్తామంటూ 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) రాష్ట్రానికి లేఖ రాసింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాత 2021 డిసెంబర్ 1న సెకీతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పటి వరకూ కూటమి ప్రభుత్వం సెకీ విద్యుత్ను తీసుకోలేదు. పైగా ఐఎస్టీఎస్ చార్జీలు వర్తిస్తాయంటూ టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా 44.79 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ (పీఎస్పీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. వివిధ జిల్లాల్లో ఉండే నీటి వనరులను ఉపయోగించుకొని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఫీజిబులిటీ అధ్యయనం చేసి, 20,900 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన ప్రాజెక్టులకు డీపీఆర్లు కూడా పూర్తి చేసింది. ఇందులో 16,180 మెగావాట్ల ఉత్పత్తికి వివిధ కంపెనీలకు అనుమతులు కూడా ఇచ్చింది. వీటిని కూడా కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ఈ మూడేళ్లలోనైనా ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తే అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు పొంది, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది. -
క్విక్ రెస్టారెంట్లకు ధరల సెగ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్ఆర్ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్ఆర్ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్ కిచెన్ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది. సామర్థ్యాలు పెంచుకోవాలి.. జూబిలెంట్ ఫుడ్స్లాంటి క్యూఎస్ఆర్ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్ఆర్ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్ క్యూఎస్ఆర్ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. అదే ఫుడ్ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్ఆర్ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్ఆర్ సంస్థలు ఆశిస్తున్నాయి. -
ఆకలి తీర్చే అక్షయపాత్ర
భక్తుల కోరిక తీర్చడమే కాదు.. తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి..తిరుమల వేంకటేశ్వరుడు.. ఆ దేవదేవుడే ఆదేశించినట్లుగా ప్రతిరోజు తిరుమలలో అన్నప్రసాదవితరణ మహాయజ్ఞంలా సాగుతోంది....తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టీటీడీ ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజుల్లో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.భక్తుల నుంచి విశేష ఆదరణదాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ– 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతి రోజూ టీటీడీలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుంచి టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.దాతలు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించే అవకాశంరూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. -
దంచికొట్టిన వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
‘సాక్షి’ కార్యాలయాలకు భద్రత కల్పించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక, టీవీ కార్యాలయాలు, ఆ సంస్థ పాత్రికేయులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, గూండాల దాడులను వెంటనే అరికట్టాలని ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధుల బృందం డీజీపీ హరీశ్ కుమార్గుప్తాను కోరింది. పన్నాగం ప్రకారం దాడులకు దిగుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీని ఉద్దేశించిన వినతిపత్రాన్ని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మధుసూదన్రెడ్డికి సమర్పించింది. ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులు బుధవారం మధుసూదన్రెడ్డిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో తమ సంస్థ కార్యాలయాలపై కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని వివరించారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంతో పాటు శ్రీకాకుళం, రాజానగరం, మంగళగిరి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు తదితర నగరాల్లో ‘సాక్షి’ పత్రిక యూనిట్, ప్రాంతీయ కార్యాలయాలపై జరిగిన దాడుల తీవ్రతను తెలియజేశారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా... మహిళలు, పిల్లలు, ఇతర వర్గాల గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించలేదని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుట్రపూరితంగా కొందరు పత్రిక కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారని అదనపు డీజీ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులకు పాల్పడినవారిపై ఇప్పటికే ఆధారాలతో సహా సమర్పించిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరారు. ‘సాక్షి’ ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై అదనపు డీజీ మధుసూదన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ‘సాక్షి’ కార్యాలయాలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. -
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.పాడ్యమి ప.1.33 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: మూల రా.9.39 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: రా.7.57 నుండి 9.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.43 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు, అమృతఘడియలు: ప.2.41 నుండి 4.22 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. మేషం... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వృషభం.... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.మిథునం... పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కర్కాటకం... పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.సింహం....దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య...కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.తుల....శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు.వృశ్చికం...పనులలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగుల మందగిస్తాయి.ధనుస్సు..బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలతమకరం.....వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.కుంభం..ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.మీనం...నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. -
మద్యం విధానంతో నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి: మద్యం విధానం పూర్తిగా రాష్ట్ర మంత్రి మండలి పరిధిలోని వ్యవహారమని, అందులో పార్లమెంటు సభ్యుడికి ఎలాంటి పాత్ర ఉండదని రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తుందన్నారు. ఈ విషయం దర్యాప్తు సంస్థ సీఐడీకి బాగా తెలిసినా ఉద్దేశపూర్వకంగా మాస్టర్ మైండ్ అంటూ తనపై పదేపదే ఆరోపణలు చేస్తోందని, తన పాత్ర ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా చూపడం లేదని తెలిపారు. కోర్టు ముందు కూడా ప్రాథమిక ఆధారాలను ఉంచలేదని వివరించారు. మద్యం విధానానికి సంబంధించి లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. విధానం మార్పునకు తనను బాధ్యుడిగా చేయడం తగదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి తీరాలన్న వ్యూహంలో భాగంగా కోర్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మిథున్రెడ్డి నివేదించారు. మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఆ కౌంటర్కు సమాధానం ఇవ్వాలని మిథున్రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ముందస్తు బెయిల్పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. మిథున్రెడ్డి దాఖలు చేసిన కౌంటర్లోని ముఖ్యాంశాలు... ‘‘2014–19 మధ్య ప్రభుత్వ పెద్దలు లిక్కర్ మాఫియాను సృష్టించారు. వారికి దగ్గరగా ఉన్న సిండికేట్లో భాగమైన నాలుగైదు కంపెనీలకే 68 శాతం మద్యం తయారీ బాధ్యతలు అప్పగించి లబ్ధి పొందారు. రాయితీలు, పన్ను మినహాయింపులు, ఆయాచిత లబ్ధి, లైసెన్స్ల జారీలో అనుచిత ప్రయోజనాలు కల్పించారు. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. లిక్కర్ షాప్ల లైసెన్సుల జారీ లాటరీలో రిగ్గింగ్కు పాల్పడి కావాల్సిన వారికే దుకాణాలు దక్కేలా చూశారు. మొత్తం 4,380 షాప్లలో 80 శాతం షాప్లపై గుత్తాధిపత్యం సాధించారు. ప్రైవేటు షాప్లు, ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో వేలాది బెల్టు దుకాణాలు పుట్టుకొచ్చాయి. మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మేందుకు 4,380 పర్మిట్ రూమ్లకు అనుమతులిచ్చారు. ఇలా వచ్చిన డబ్బును దారిమళ్లించారు. అమ్మకాలు గణనీయంగా పెరిగినా, ప్రభుత్వ ఆదాయం పెరగలేదు’’ అని వివరించారు.గత ప్రభుత్వంలో పారదర్శక విధానం..గత ప్రభుత్వం (2019–24)లో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా ఉందని మిథున్రెడ్డి తెలిపారు. సంస్కరణలతో మద్యం వినియోగం తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించిందన్నారు. ‘‘లిక్కర్ మాఫియాను రూపుమాపడంతో పాటు బెల్ట్ షాప్లు, పర్మిట్ రూమ్లను రద్దు చేసి మద్యం వినియోగం తగ్గించే చర్యలు చేపట్టింది. మద్యం షాపులను 4,380 నుంచి 2934కి కుదించింది. 2014–19 మధ్య రూ.16,091 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2023–24 నాటికి రూ.24,760 కోట్లకు చేరింది. దీన్ని కాగ్ నివేదికల్లో స్పష్టం చేసింది. ఖజానాకు నష్టం జరగలేదు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలతో నష్టం వాటిల్లిందన్న దర్యాప్తు సంస్థ వాదన పూర్తి నిరాధారం’’ అని స్పష్టం చేశారు. భయపెట్టి, బెదిరించి వాంగ్మూలాల నమోదుమద్యం విధానం కేసులో కొందరు సాక్షులు తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని దర్యాప్తు సంస్థ చెబుతోందని, నిజానికి అవి బెదిరించి, భయపెట్టి తీసుకున్నవని మిథున్రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ తీరుపై కొందరు సాక్షులు, ఇతర నిందితుల కుటుంబసభ్యులూ హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు.అయినా కూడా దర్యాప్తు సంస్థ బలవంతంగా వాంగ్మూలాలు తీసుకుంటోందని, ఇలాంటివాటికి విలువ లేదని పేర్కొన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలన్నదే సీఐడీ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో తనతోపాటు పలువురిని లక్ష్యంగా చేసుకుని విచారణ మొదలుపెట్టారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై గతంలో నమోదు చేసిన కేసుకు కౌంటర్గా తమపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. సీఐడీ నమోదు చేస్తున్న వాంగ్మూలాలే దీనికి నిదర్శనం. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. అయినా పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లావాదేవీలను నాకు ముడిపెడుతూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
పాత్రికేయుడు కృష్ణంరాజు అరెస్టు
సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రే అదుపులోకి తీసుకున్న అయనను ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో పాటు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ‘సాక్షి’ టీవీ యాజమాన్యంపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కొమ్మినేనిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కృష్ణంరాజు అరెస్టును గురువారం అధికారికంగా వెల్లడించి అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై పోలీసు వర్గాలు అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి. -
పచ్చ మూకల పైశాచికత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రజలు నీరాజనం పలకడంతో సీఎం చంద్రబాబు అండ్ గ్యాంగ్కు వణుకు పుట్టింది. అనూహ్యంగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తుండటం చూసి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే జగన్ పర్యటనను అభాసుపాలు చేయాలని కుట్రకు తెర లేపారు. ఇందుకు పోలీసులూ సహకరించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి 2.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొగాకు వేలం కేంద్రానికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ నాయకుడు గుణిపూడి భాస్కర్ ఇంటి వద్ద 200 మంది పచ్చ మూకలు కాపు కాశారు. ర్యాలీ పట్టణంలోకి ప్రవేశించగానే ఖాళీ కుండలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అక్కడ నుంచి ర్యాలీ నవాబ్ పేటకు చేరుకోగాని మరో పచ్చ గుంపు రోడ్డుపైకి చొచ్చుకొచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లతోపాటు జగన్ కాన్వాయ్ మీదకు చెప్పులు విసిరారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల పైకి రాళ్లు, చెప్పులు విసరడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో ముందుగానే తిష్ట వేసిన పచ్చ మూకలు.. డాబాల మీద నుంచి, ఇళ్లలోని కిటీకీల నుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్, కొందరు రైతులు, కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రాళ్ల దాడి చేసిన పచ్చ మూకలను వదిలిపెట్టి.. రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసుల మద్దతుతోనే రాళ్ల దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. నిరసనలకు పోలీసుల అనుమతి వైఎస్ జగన్ పోరుబాట ర్యాలీ జరుగుతున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలలుగా పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు రాక అల్లాడిపోతున్నారు. సరుకు కొనకుండా కంపెనీలు చేసిన కుట్రలకు మోసపోతున్నారు. కళ్లున్న కబోదిలా కూటమి ప్రభుత్వం పొగాకు రైతులు, ఇతర రైతులను పట్టించుకోకుండా కంపెనీలకు అండగా నిలబడింది.ఈ పరిస్థితిలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ర్యాలీగా వస్తున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లను సిద్ధం చేసుకున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై పోలీసులు మిన్నకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో మాజీ సీఎం కాన్వాయ్ మీద చెప్పులు విసరడం, ర్యాలీకి వ చ్చిన రైతులు, కార్యకర్తల మీద రాళ్లు రువి్వతే పోలీసులు ఏం చేశారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. డాబాల మీదకు రాళ్లు ఎలా వెళ్లాయి? పోరుబాట ర్యాలీకి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ర్యాలీ దృశ్యాలను టాప్ యాంగిల్లో ఫొటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫొటోగ్రాఫర్లను పోలీసులు అనుమతించ లేదు. కానీ ర్యాలీ పొడవునా డాబాల మీద టీడీపీ కార్యకర్తలు కాపుకాశారు. ఇళ్లపై నుంచి ర్యాలీకి తరలివచ్చిన రైతుల మీదకు రాళ్లు రువ్వారు. అసలు డాబాల మీదకు రాళ్లు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులే బదులివ్వాలి. స్పెషల్ బ్రాంచి పోలీసులు, ఇంటిలిజెన్స్ పోలీసులు ఏం చేసినట్లు? అంటే పోలీసుల మద్దతుతోనే పచ్చ మూకలు రాళ్ల దాడికి ప్లాన్ చేశాయని ఇట్టే స్పష్టమవుతోంది. పోరుబాటలో అడుగడుగునా పచ్చమూకలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించాయి. గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ మూకలు ఇంతగా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా సంయమనం పాటించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావడం ఇష్టం లేని టీడీపీ నేతలే కుట్ర పూరితంగా వ్యవహరించడం కనిపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఏరువాక సందడి ఏది?
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి.. మరోపేరు జ్యేష్ట పౌర్ణమి.. ఇది తెలుగు రైతుల పండుగ. తొలకరి పంట సాగుకు సన్నద్ధమయ్యే సందర్భంగా రైతులు సంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరుపుకునే వేడుక.. కాడెద్దులను సిద్ధంచేసి వ్యవసాయ పరికరాలను అలంకరించుకుని పూజలుచేసి సాగును ఆరంభిస్తారు. అలాంటి సంప్రదాయ పండుగ వాతావరణం ఈ ఏడాది రైతుల లోగిళ్లలో ఎక్కడా కన్పించడంలేదు. గడిచిన ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి రాష్ట్రంలోని రైతులందరి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంవల్ల సాగుభారంగా మారడంతో రైతులు తొలకరి సాగుకు ఉసూరుమంటూ బుధవారం ఏరువాకకు శ్రీకారం చుట్టారు.పెట్టుబడి సాయం లేకుండా ఏరువాక ఎలా?తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఎన్నికల్లో గెలిచాక 2024–25 సీజన్కు ఇవ్వాల్సిన రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. కనీసం ఈ ఏడాదైనా సీజన్కు ముందు ఇస్తుందేమోనని రైతులంతా ఆశగా ఎదురుచూసారు. కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేదు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకూ జారీచేయలేదు. మరోపక్క.. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో వరదలు, అకాల వర్షాలు, కరువు ప్రభావంతో పంటలు నష్టపోయిన దాదాపు ఏడు లక్షల మంది రైతులకు రూ.850 కోట్లకు పైగా పంట నష్టపరిహారం సీజన్ ముగిసినా చెల్లించలేదు. రూ.వెయ్యి కోట్లకు పైగా ధాన్యం బకాయిలుఇక 48 గంటల్లోనే.. కాదు కాదు 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తున్నామంటూ గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. గడిచిన రబీ సీజన్కు సంబం«ధించి పేరుకుపోయిన రూ.1,000 కోట్ల బకాయిల చెల్లింపు ఊసెత్తడం లేదు. అలాగే, 2023–24 సీజన్కు సంబంధించి ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. కనీసం ఖరీఫ్–2024 సీజన్కు సంబంధించిన పంటల బీమా ప్రీమియం మొత్తం రూ.838 కోట్లు చెల్లించి ఉంటే బీమా పరిహారమైనా ఈపాటికి చేతికొచ్చేది. ఇలా దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా రైతులకు అందాల్సిన సాయం జమకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం మోకాలడ్డింది. పైగా.. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేసింది. స్వచ్ఛంద బీమా నమోదు చేయాలని చెప్పడంతో ఆ భారం భరించలేక రైతులెవరూ రబీలో నమోదు చేసుకోలేదు. మరోపక్క.. ధాన్యం, పత్తి, మిరప, పొగాకు, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం అదునుకైనా విత్తనం అందించారా అంటే అదీ లేదు.విత్తనం అందక అగచాట్లుఇదిలా ఉంటే.. గత సీజన్ నుంచే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాకు మంగళం పాడేశారు. 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా.. నిధులలేమి సాకుతో 5.38 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. వేరుశనగ విత్తనం 30 శాతానికి కుదించారు. కనీసం ఆ విత్తనమైనా సీజన్కు ముందు అందుబాటులో ఉంచారా అంటే అదీలేదు. ఇప్పటివరకు కనీసం 30 శాతం విత్తనాన్ని కూడా పొజిషన్ చేసిన పాపాన పోలేదు. రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనమే కాదు.. ఎరువులూ కానరావడంలేదు. అయినాసరే, ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగను అంతా బాగుందంటూ వారిని ఏమార్చి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కూటమి కార్యకర్తలు హంగామా చేశారు. -
నేటి నుంచి బడిగంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉ.9 గంటలకు బడిగంటలు మోగనున్నాయి. ప్రాథమిక పాఠశాలలు మ.3.20 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు సా.5 గంటల వరకు కొనసాగుతాయి. హైసూ్కళ్లలో సా.4 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం గంట సమయం (ఐచ్ఛికం) ఆటలు లేదా స్టడీ అవర్కు కేటాయిస్తారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను గతనెలలో ప్రాథమిక స్కూళ్ల విద్యా కేలండర్ను విడుదల చేసిన విద్యాశాఖ.. బుధవారం హైస్కూల్ అకడమిక్ కేలండర్ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకు గాను 83 రోజులను వివిధ సెలవులుగా ప్రకటించింది. మిగిలిన 233 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఇక సాధారణ బడులకు సెపె్టంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. అలాగే, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు సెపె్టంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. డిసెంబరు 21 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ప్రతి శనివారం అన్ని పాఠశాలల్లోను ‘నో బ్యాగ్ డే’ కొనసాగుతుంది. ఆ రోజు విద్యేతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికి ఏడు పేరెంట్స్–టీచర్స్ సమావేశాలుఇక విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే (ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్) ముందు పేరెంట్స్–టీచర్స్ సమావేశం (పీటీఎం) నిర్వహిస్తారు. ఏడాదిలో మొత్తం ఏడు పీటీఎంలు ఉంటాయి. వీటిలో జూన్ 25న, నవంబరు 25న మెగా పీటీఎంలు ఉంటాయి. ఆగస్టులో తెలుగు భాషోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి విద్యార్థులకు 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల్లో రాజకీయ విజ్ఞానం పెంచేందుకు కొత్తగా అసెంబ్లీ పర్యటనను చేర్చారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 8–10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఎంపికైన వారికి అమరావతిలోని శాసనసభ సందర్శించే అవకాశం కల్పిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు కొత్తగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించే మార్చిలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. -
హోంమంత్రిగా మహిళ ఉన్నా అరాచకాలు దారుణం
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పాడేరు పాత బస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలు, రెడ్బుక్ రాజ్యాంగంపై ధ్వజమెత్తారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుజేయాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని కురుసా పార్వతమ్మ విమర్శించారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. అయినా, తోటి మహిళగా హోంమంత్రికి బాధితులను పరామర్శించే కనీస దయ కూడా లేకుండాపోయిందని దుయ్యబట్టారు. -
బాలికతో వైద్యుడి అసభ్య ప్రవర్తన?
ఉదయగిరి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ పన్నెండేళ్ల బాలికతో వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆమె తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఉదయగిరికి చెందిన ఓ మహిళ తన పన్నెండేళ్ల కుమార్తెకు చెవి నొప్పిగా ఉందని వైద్యం చేయించేందుకు స్థానిక సీహెచ్సీలోని వైద్యుడు ప్రశాంత్ దగ్గరకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో వైద్యుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. బాలిక తరఫు బంధువులు కూడా వైద్యశాల వద్దకు చేరుకుని వైద్యుడిపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పి వైద్యుడు ప్రశాంత్ను స్టేషన్కు తీసుకెళ్లారు.ఆరోపణలకు విరుద్ధంగా సీసీ కెమెరా దృశ్యాలు అయితే ఈ వ్యవహారంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొన్నేళ్ల నుంచి వైద్యులు, సిబ్బంది మధ్య విభేదాలు ఉన్నాయి. ఇదే వైద్యశాలలో పనిచేసే ఓ సీనియర్ వైద్యుడు అక్కడ ఉన్న కొంత మంది సిబ్బందితో చేతులు కలిపి డీడీఓ బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడు ప్రశాంత్ను ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినప్పుడు బాలిక బంధువులు చేసే ఆరోపణలకు, సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలకు పొంతన కనిపించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిని సంప్రదించగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. -
తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం
సాక్షి, అమరావతి: ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు.. నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.. అధికారంలోకి రాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తాం’ అని ఊరూరా.. ఇంటింటా ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు మాట తప్పింది. ఏకంగా దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టనుంది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా.. రెండో ఏడాది తూతూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.15 వేల స్థానంలో రూ.13 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. అయితే ఈ పథకం అమలు కోసం రూ.8,745 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ లెక్కన ఈ మొత్తం 58 లక్షల మంది విద్యార్థులకే సరిపోతుంది. అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ రూ.13 వేలను ఒకేసారి ఇస్తారా.. లేక వాయిదాల పద్దతిలో ఇస్తారా.. అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ సిక్స్ అమలు చేయక పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. ప్రజలు ఈ పథకం గురించి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో అరకొరగా అమలు చేయనుందని తెలుస్తోంది. అయితే అంతుబట్టని అంకెల గారడీతో తల్లుల కళ్లకు ప్రభుత్వం గంతలు కట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన తీసుకున్నా, తలో రూ.15 వేల చొప్పున రూ.10,090.74 కోట్లకు పైగా అవసరం. కానీ కేటాయింపులు మాత్రం ఆ మేరకు కూడా లేక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. తీరా నగదు జమ చేసే సమయానికి ఇంకెంత మందికి ఎగ్గొడతారోననే అనుమానం వ్యక్తమవుతోంది.గత ఏడాది ఎగ్గొట్టి.. ఈ ఏడాది కోతలు పెట్టి.. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’’ అంటూ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘సూపర్–6’లోనూ పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీ ప్రకారం.. ఇప్పుడు చెప్పిన విద్యార్థుల సంఖ్య, నిధుల లెక్క సరిపోవడం లేదు. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ లెక్కలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం.గతేడాది ఒక్క విద్యార్థికీ ఈ పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈసారి విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి గొప్పలు చెబుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలో అమ్మఒడి జమయ్యేది. గతేడాది ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం రావడంతో పథకం ఆగిపోయింది. కానీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. అలాగే, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. హామీ ప్రకారం రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్ చేస్తున్నారు.నేడు ‘తల్లికి వందనం’ నిధులు జమసమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయంసాక్షి, అమరావతి: తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఈ పథకం అమలు, విధివిధానాలపై మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం సమీక్షించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారమే తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమచేయాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలుచేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద గురువారం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. -
సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్ సుదర్శన్రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం. ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్రెడ్డే వంద శాతం అడ్డంకి. తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రల్హాద్ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్ఎస్ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్ మాట్లాడలేదు. అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది. -
మంగళూరు పోర్ట్ టు సికింద్రాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: మంగళూరు పోర్ట్ను సికింద్రాబాద్తో అనుసంధానించే ముఖ్యమైన బళ్లారి– చిక్జాజూర్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3,342 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు 185 కిలో మీటర్ల పొడవుతో ఉంటుంది. ప్రస్తుతం సికింద్రా బాద్ నుంచి కృష్ణపట్నం పోర్టుకు మాత్రమే రైలు మార్గం ఉండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో కొత్తగా మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానిస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) రెండు కీలక రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్లోని కొడర్మా– బర్కాకానా డబ్లింగ్ ప్రాజె క్టు, బళ్లారి–చిక్జాజూర్ డబ్లింగ్ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సౌలభ్యం, సామగ్రి రవాణా సామర్థ్యం, తక్కువ లాజిస్టిక్ ఖర్చుతో సహజంగా కార్బన్ ఉద్గారాల తగ్గింపుతో ఉన్న మౌలిక వ్యవస్థను బలపరచనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.6,405 కోట్లు. ఈ రెండు కీలక ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.బళ్లారి–చిక్జాజూర్ ప్రాజెక్టు ఇలా...బళ్లారి–చిక్జాజూర్ రైలు డబ్లింగ్ ప్రాజెక్టు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా సాగుతుంది. 185 కి.మీ. మార్గంలో 19 స్టేషన్లు, 29 మెయిన్ బ్రిడ్జీలు, 230 మైనర్ బ్రిడ్జీలు, 21 ఆర్వోబీలు, 85 ఆర్యూబీలు ఉంటాయి. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు ఇనుము ధాతువు, కోక్ కోల్, స్టీల్, ఎరువులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం పదార్థాల రవాణాకు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు వల్ల 470 గ్రామాలకు మెరుగైన రవాణా సేవలు, 13 లక్షల జనాభాకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఏటా 18.9 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణాకు వీలవడమే కాకుండా ఈ మార్గం వల్ల ప్రతి సంవత్సరం 101 కోట్ల కిలోల కార్బన్డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది. ఈ నూతన ప్రాజెక్టు వల్ల దాదాపు 20 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. -
దాటవేత ధోరణిలో సమాధానం
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈయన్ను సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో వెస్ట్జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్రావును ప్రశ్నించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్రావును సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఇద్దరినీ కలిపి కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం తొలిసారిగా విచారణకు హాజరైన ప్రభాకర్రావు ఫోన్ ట్యాపింగ్తో తనకు ఏం సంబంధం అని, దానికి అనుమతి ఇవ్వడానికి సాధికారిక కమిటీ ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆయా ఫోన్లు ట్యాప్ చేయడానికి సహకరించాల్సిందిగా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ నుంచి వెళ్లిన లేఖల్ని సిట్ బుధవారం తీసుకొచ్చింది.వీటిపై డిజిగ్నేటెడ్ అధికారిగా ప్రభాకర్రావు పేరు, ఆయన సంతకం ఉండటాన్ని సిట్ ప్రస్తావించింది. ట్యాపింగ్తో సంబంధం లేనప్పుడు ఆయా లేఖలపై ఎందుకు సంతకం చేశారంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు, వ్యాపారులతోపాటు నేతలు, వారి కుటుంబీకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని, వారి నంబర్లను ట్యాప్ చేస్తున్నారని తెలిసినప్పుడు లేఖలపై సంతకాలు ఎందుకు చేశారని అధికారులు ప్రశ్నించారు.కొందరు జడ్జిలకు సంబంధించిన కాల్ డిటేల్స్ సేకరించడం వెనుక ఉన్న కారణాలపై ఆరా తీశారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్న లకు ప్రభాకర్రావు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రణీత్రావుతో కలిపి ప్రభాకర్రావును విచారించిన సిట్ గతంలో సేకరించిన ఆధారాలు, తదితరాలను వీరి ముందు ఉంచారు.హార్డ్డిస్క్ శకలాల్ని మూసీలో ఎందుకు వేశారు ఇద్దరినీ వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు... కలిపి అవే అడిగి, వారు చెప్పిన సమాధానాలతో సరిచూశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసమే ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేశానని చెప్పిన ప్రభాకర్రావు సమర్థత ఆధారంగానే ఆ బాధ్యతలు ప్రణీత్కు అప్పగించినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిట్ అధికారులు అలాంటప్పుడు ఎస్ఓటీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మావోయిస్టుల కోసం తాము చేసే కొన్ని అత్యంత రహస్య ఆపరేషన్ల కోసమే అలా ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కితే జాతీయ భద్రతతోపాటు కొందరు అధికారులకు ముప్పు అని, ఆ కారణంగానే ఆయా ఆపరేషన్ల సమాచారం ఉన్న హార్డ్డిస్్కలు పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేస్తుంటామని ప్రభాకర్రావు సిట్ అధికారులకు తెలిపారు. అలా ధ్వంసం చేయడం సర్వసాధారణమే అయితే వాటి శకలాలను తీసుకెళ్లి నాగోలు వద్ద మూసీనదిలో పారేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రభాకర్రావు, ప్రణీత్రావులను సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభాకర్రావు నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్రావుకు నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్పై ఉన్న మరో నిందితుడితో కలిపి విచారించనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ప్రభాకర్రావు నుంచి సరైన సహకారం లభించట్లేదని, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానాలు చెప్పట్లేదని సిట్ చెబుతోంది. తనను ట్యాపింగ్, సీడీఆర్ల విశ్లేషణకు సంబంధించిన ఆదేశాలు ప్రభాకర్రావు నుంచి వచ్చాయని ప్రణీత్రావు చెబుతుండగా... ప్రభాకర్రావు మాత్రం వీటిని ఖండిస్తున్నారని వివరిస్తున్నారు. -
హింద్ జింక్ డివిడెండ్ ఎంతంటే..
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 ముఖవిలువగల షేరుకి 500 శాతం డివిడెండ్ను ఆమోదించినట్లు హిందుస్తాన్ జింక్ పేర్కొంది. దీంతో ప్రతీ షేరుకి రూ. 10 చొప్పున వాటాదారులకు చెల్లించనుంది. ఇందుకు వేదాంతా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 4,225 కోట్లు వెచి్చంచనుంది. గతేడాది(2024–25) సైతం డివిడెండ్ల రూపేణా వాటాదారులకు మొత్తం రూ. 12,250 కోట్లు చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది షేరుకి రూ. 19, రూ. 10 చొప్పున రెండుసార్లు డివిడెండ్ ప్రకటించింది. అత్యధిక డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్న మెటల్ రంగ దిగ్గజాలలో కంపెనీ ఒకటికాగా.. తాజా డివిడెండ్ ప్రకటనతో ప్రభుత్వానికి రూ. 1,180 కోట్లు చెల్లించనుంది. కాగా.. వెండి ఉత్పత్తిని రెట్టింపునకు(రూ. 1,500–2,000 మెట్రిక్ టన్నులు) పెంచుకోవడంతోపాటు.. రాజస్తాన్లో ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇటీవల రాజస్తాన్, యూపీ, ఆంధ్రప్రదేశ్లలో కీలకమైన మినరల్ బ్లాకులను సాధించిన విషయం విదితమే. హిందుస్తాన్ జింక్ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ. 520 వద్ద ముగిసింది. -
మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు. -
సాగుకు శాపం.. 'బాబుదే ఈ పాపం': వైఎస్ జగన్
గత ఏడాది పొగాకు కేజీ ధర రూ.366. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఖర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడి పోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా రూ.11,781తో కొంటామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. ఎన్ని కేజీలు కొన్నారు? ఎంత మంది రైతుల నుంచి మిర్చి కొన్నారు? లెక్కలు చెప్పండి. నిజం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మిర్చి ఒక్క క్వింటా కూడా కొనలేదు. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం రైతులకు శాపంగా పరిణమించిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగి పోయాయని, ఇటీవల ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరులో ఒకరు, కొండపిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్ఫెడ్ను వెంటనే రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడ అధికారులు, రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, రైతులకు కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ చెల్లించిందని చెప్పారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అదే ఏడాది క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే అది పూర్తిగా దిగజారిందని చెప్పడానికి జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రైతు భరోసా లేదుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోదీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టారు. అంత దుర్భర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది.ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేశారు. రైతులు ఎలా నష్టపోయినా, ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట వేసిన తర్వాత, పంట నష్టపోతామన్న భయం రైతులకు లేకుండా, ప్రతి పంటకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. వ్యవసాయంలో అన్నీ నీరుగార్చారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా అమలు చేసిన పంటల ఈ–క్రాప్ వ్యవస్థను, దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి, వాటి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారా దళారీలకు తావు లేకుండా చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించాం. జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా చార్జీలు) కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేశారు. రైతు దళారీలకు అమ్ముకున్నాడు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం.కేంద్రం ప్రకటించని వాటికీ ఎమ్మెస్పీ కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటా వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించాం. ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను కూర్చోబెట్టి.. ప్రతి పంట ఈ–క్రాప్ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా వెంటనే ఆ పంటకు సంబంధించిన రేట్లు అప్డేట్ చేయించాం. ఆ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించేది. ఆ మేరకు మార్కెటింగ్ శాఖ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెస్పీకి పంటలు కొనుగోలు చేసేది. ఈ రోజు అవన్నీ గాలికెగిరిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయం నడుస్తోంది.పొగాకుకు మద్దతు ధర పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరం (2023–24)లో కూడా కేజీ రూ.360 చొప్పున క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ పొగాకు కూడా క్వింటా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయింది. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటనేది మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. ఏం మాట్లాడుతాడోనని.. అల్లరవుతామేమేనని వీరంతా సిండికేట్ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. కేవలం 40 మిలియన్ టన్నులు మామూలుగా ఈ ప్రొక్యూర్మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. అలాగే ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం కిలో రూ.220 నుంచి రూ.260 మధ్య అమ్ముడుపోతోంది. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రావడం లేదు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి రూ.280కి కొంటున్నారు. ఇంక లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. ఆ ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాక్ వెనక్కు తీసుకెళ్తున్నారు. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు పైగా కొన్నారు. ఇప్పుడు జూన్ నెల మధ్యకొచ్చాం. సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే, కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్ణాటకలో కేజీ రూ.360కి కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే, వారు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బర్లీ పొగాకు గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు ఆ ధర రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది.నాడు పొగాకు రైతుకు స్వర్ణయుగం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో పొగాకు వేలం (ఆక్షన్) ప్రక్రియలోకి మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం. అదే ఈ రోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. రూ.4 లక్షల పరిహారం ఘనత మాదేపొగాకు, ఇతర పంటలకే కాకుండా, మిర్చి రైతుకు కూడా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా.. వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది. పంట వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్గా ఈ–క్రాప్ జరిగేది. ఉచిత పంటల బీమా కింద 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబడింది. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాం. అలా ఐదు ఎకరాలున్న మిర్చి రైతుకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం ఇచ్చాం.రైతులను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ‘ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువగా పండించండి.. మేము కొనుగోలు చేస్తాం’ అని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. గతేడాది బ్యారన్కి 35 క్వింటాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పంటను కొంటామని హామీ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం 30 శాతం పెరిగింది. ఒకవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపు వాతావరణం సహకరించక దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు రేటు పెంచాలి. కానీ రైతు ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ దెబ్బకు రేటు దారుణంగా పడి పోయింది. గత ఏడాది కేజీ ధర రూ.366 కాగా, అది పెరగాల్సింది పోయి, కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఇతర పంటలదీ అదే దుస్థితి నిన్న (మంగళవారం)నే మా ఆఫీస్కు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వచ్చి కోకో పంట గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర రూ.1,050 ఉండేది. ఇప్పుడు రూ.370, రూ.360 మాత్రమే అని రైతులు చెప్పారు. అలాగే పామాయిల్ ధర గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.23,360, కెర్నిల్ నట్స్కు రూ.29,360 ధర ఉంటే.. ఇప్పుడు రూ.18,606కి పడిపోయింది. ఈ ప్రభుత్వం ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించాలి. వెంటనే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి. ఆ దిశలో మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి, పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం.ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాంపొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసాఅన్నదాతలు, అధికారులతో ముఖాముఖిపొదిలి/కొనకనమిట్ల: పొగాకు రైతులు అధైర్య పడొద్దని, ధరలు పెంచి కొనుగోలు చేసే వరకు పోరుబాటలో ఉంటామని.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పంట ఉత్పత్తి, ధరలు, రైతుల పరిస్థితిపై తొలుత వేలం అధికారులతో మాట్లాడారు. వేలం అధికారి గిరిరాజ్కుమార్ పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలను వైఎస్ జగన్కు వివరించారు. ‘4,390 మంది రైతులు 2,601 బ్యారన్ల కింద పొగాకు సాగు చేస్తున్నారు. 8,534 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టాల్సి ఉండగా, 11,031 హెక్టార్లలో సాగు చేశారు. 11.10 మిలియన్ కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతి ఇవ్వగా, 18 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని అంచనా వేస్తున్నాం. బ్రైట్ రకం కిలో రూ.265, మీడియం రూ.225, లో గ్రేడ్ రూ.180 సగటు ధరగా కొనుగోలు చేస్తున్నాం. బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లోనూ 25% ఉత్పత్తి పెరిగింది. బయ్యర్లు లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవటంతో రిజక్షన్ బేళ్ల సంఖ్య అధికంగా ఉంది’ అని తెలిపారు. ‘లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల వద్ద పొగాకు అధికంగా నిల్వ ఉంది. సగటు ధర పూర్తిగా తగ్గిపోయింది. రిజక్షన్ బేళ్ల సంఖ్య పెరిగింది. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ధైర్యం వీడొద్దని, రైతుల పట్ల వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు, రైతులకు మేలు జరిగేలా మార్క్ఫెడ్ను రంగంలోకి దించేంత వరకు పోరుబాటతో రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దలు, పొగాకు బోర్డు అధికారులు రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు లేకుండానే ఏకపక్షంగా ధర నిర్ణయించేశారు. జగన్ వస్తున్నారని బుధవారం తిరస్కరణ శాతాన్ని తగ్గించడం గమనార్హం. -
రుణ రేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ తన రుణ రేట్లను అరశాతం తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈఈఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. కొత్తగా రుణాలు తీసుకొనేవారితోపా టు, ప్రస్తుత రిటైల్ (గృహ, వాహన, వ్యక్తిగత), ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది. మరోవైపు కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ రేటును 8.75% నుంచి 8.25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఐవోబీ సైతం ఆర్ఎల్ఎల్ఆర్ రేటును 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
ఎస్ఎల్బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సీఈ అజయ్కుమార్లు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ వీరేంద్ర తివారీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డీజీగా పనిచేసిన హర్పాల్సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టన్నెల్ పనుల పూర్తికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా డిప్యుటేషన్పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. -
‘కరెంట్’కు మాన్సూన్ షాక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎండ, ఉక్కపోత ఉంటే అంతమేర కరెంటు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా డిస్కంకు బిల్లుల రూపంలో రావాల్సిన రాబడి కూడా అధికంగా ఉంటుంది. కానీ, డిస్కం ఇంజనీర్ల అంచనాలను మాన్సూన్ తారుమారు చేసింది. ఆదాయానికి గండికొట్టింది. గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వాడకం మే నెలలో ఐదువేల మెగావాట్లకు చేరుకుంటుందని డిస్కం అంచనా వేసింది. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే అధికారుల అంచనాలకు భిన్నంగా మే రెండో వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఎండలకు రోళ్లు, రోకళ్లు పగలాల్సిన రోహిణి కార్తెలోనూ ఏకధాటి వర్షాలు కురియడం, ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లను నిలిపివేయడం వల్ల నగరంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. 2024 మే నెలతో పోలిస్తే 2025 మే నెలలో నమోదైన విద్యుత్ డిమాండ్లో భారీ వ్యత్యాసం నమోదైంది. ఫలితంగా వేసవిలో విద్యుత్ అమ్మకాల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని సంస్థ కోల్పోవాల్సి వచ్చింది. గృహ విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న కోర్ సిటీ సర్కిళ్లతో పోలిస్తే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న శివారు సర్కిళ్లలో మాత్రం ఆదాయం అనూహ్యంగా పెరిగింది. అంతేకాదు 2023 మే నెలలో నమోదైన విద్యుత్ డిమాండ్తో పోలిస్తే 2024 మే నెలలో సగటు విద్యుత్ డిమాండ్ 13.9 శాతం పెరిగింది. అదేస్థాయిలో వినియోగం కూడా 12.6 శాతం పెరిగింది. 2024 మేలో రికార్డైన సగటు విద్యుత్ డిమాండ్తో పోలిస్తే 2025 మేలో 3.2 శాతం తగ్గింది. వినియోగం 2.5 శాతానికి పడిపోయి అధికారుల అంచనాలను తలకిందులు చేసింది. -
‘రేర్’ మ్యాగ్నెట్ల కోసం రేసు..
అరుదైన లోహ అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ – ఆర్ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ ఏటా 809 టన్నుల ఆర్ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది. ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. ఆసియా దేశాల్లో చూస్తే జపాన్లో కూడా ఆర్ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్వాచీలు, ఇయర్బడ్స్కూ ఎఫెక్ట్ .. ఆర్ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్వాచీలు, వైర్లెస్ ఇయర్బడ్స్ (టీడబ్ల్యూఎస్) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు వైబ్రేట్ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్ వాచీలు, ఇతర డివైజ్ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్పాయింట్ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్లో స్మార్ట్ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్ ఏర్పడితే స్మార్ట్ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం ఆర్ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
హైదరాబాద్ టు ముస్సోరీ
ముస్సోరీలో ల్యాండ్ అయ్యారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. వీటీవీ గణేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెంకటేశ్, కేథరిన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటరై్టన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరిగింది. మలి షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందని, పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందని బుధవారం మేకర్స్ అధికారికంగా తెలిపి, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్ పాల్గొనగా కొన్ని కీలక, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించడానికి ΄్లాన్ చేశారు. ‘‘1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ కామెడీ టైమింగ్ను ఈ సినిమాలో మళ్లీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బడి గంట మోగింది
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురువారం బడులు తెరుచుకోనున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా హడావుడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బడులను అలంకరిస్తున్నారు. స్టేషనరీ, యూనిఫామ్ షాపులు, షూస్ అమ్మే దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, బస్సులు విద్యార్థుల కోసం సిద్ధమవుతున్నాయి. అధికారుల్లోనూ హడావుడి మొదలైంది. వసతి గృహాలకు వెళ్లే విద్యార్థులు పెట్టేబేడాతో సన్నద్ధమవుతున్నారు. టీచర్లు తమ స్కూళ్లలో రిజిస్టర్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులు వాట్సాప్ మెసేజీలతో ప్రభుత్వ టీచర్లను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 41,354 స్కూళ్లలో సందడి వాతావరణం కనిపించబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు కలిపి మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరో పక్క వారం రోజుల్లో ప్రభుత్వ టీచర్ల సర్దుబాటు చేపడతామని అధికారులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఉండేలా చేస్తామంటున్నారు. తక్కువ విద్యార్థులున్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే, వారిని టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికిపైగా టీచర్లను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. సర్కారీ స్కూళ్ల సన్నాహాలుప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను నడిపించాలన్నది విద్యాశాఖ లక్ష్యం. ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యను కూడా అందించాలని నిర్ణయించారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు 60 వేల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సరికొత్త బోధన మెళకువలను రిసోర్స్ పర్సన్స్ ద్వారా అందించామని విద్యాశాఖ ధీమాగా ఉంది. విద్యార్థులను ఆకట్టుకునే బోధన ప్రణాళికనూ రూపొందించామని చెబుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం కేలండర్ను పాఠశాల విద్య డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రతీ రోజు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించింది. ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో చిన్న చిన్న రిపేర్లు వేసవిలోనే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మౌలిక వసతుల లోపం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెపుతున్నారు. స్కూళ్లు మొదలయ్యాక ఈ అంశంపై దృష్టి పెడతామని అంటున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పుస్తకాలు, యూనిఫామ్లు చేరాయని, మొదటి రోజే వాటిని విద్యార్థులకు అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొత్తగా చేరే విద్యార్థులకు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపారు. మరో పక్క ఈ నెలాఖరు వరకు బడిబాట నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ఆకర్షిస్తారు. ఏఐ పాఠాలు.. కంప్యూటర్ ల్యాబ్లుపాఠశాల విద్యాస్థాయి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం 3,412 స్కూళ్లను ఎంపిక చేశారు. పలు సంస్థలతో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. 604 మండలాల్లో కంప్యూటర్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ విద్య, ఏఐ పాఠాలపై ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వీటిపై గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం కల్పించాలని, విద్యార్థులను ఆకర్షించాలని ప్రభుత్వం డీఈవోలకు సూచించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలపై జాతీయ సర్వే సంస్థలు కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక లెర్నింగ్ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక విద్య స్థాయిలో తక్కువ ప్రమాణాలున్న వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
‘ఫిఫా’ ప్రపంచకప్కు బ్రెజిల్ క్వాలిఫై
సావో పాలో: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్నకు బ్రెజిల్, ఈక్వెడార్, ఆ్రస్టేలియా జట్లు అర్హత సాధించాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో భాగంగా బ్రెజిల్ జట్టు మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో 1–0 గోల్ తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. తద్వారా ‘ఫిఫా’ వరల్డ్కప్ బెర్తు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ 2022 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్లో ఓడింది. మరోవైపు పెరూతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ఈక్వెడార్ ముందంజ వేసింది. ఇప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించిన డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, కొలంబియాతో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2026లో మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో 48 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో అర్జెంటీనా 35 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... ఈక్వెడార్, బ్రెజిల్ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ అమెరికా నుంచి వరల్డ్కప్నకు ఆరు జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. బొలీవియాతో మ్యాచ్లో 0–2తో పరాజయం పాలైన చిలీ జట్టు... వరుసగా మూడోసారి విశ్వ సమరానికి దూరమైంది. మరోవైపు ఆ్రస్టేలియా వరుసగా ఆరో సారి ఫిఫా ప్రపంచకప్ బెర్తు దక్కించుకుంది. 2–1 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాపై గెలవడం ద్వారా ఆసీస్ ముందంజ వేసింది. -
వానలకు అనుకూలంగా వాతావరణం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లదనం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ లేకుండా పోయింది. అక్కడక్కడా అడపాదడపా తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ..వాతావరణంలో నెలకొన్న మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. రుతుపవనాల కదలికలు చురుగ్గా మారుతుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు tకురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మాటూర్లో 4.93 సెం.మీ. వర్షం బుధవారం రాష్ట్రంలో సగటున 7.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో 11 రోజుల్లో 3.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. బుధవారం సాయంత్రానికి 2.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాటూర్లో 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో 4.35, నల్లగొండ జిల్లా ముదిగొండలో 3.38, పడమటిపల్లెలో 3.10, తిమ్మాపూర్లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
దేశం కన్నా...లీగ్లే మిన్న?
భారీ షాట్లకు పెట్టింది పేరైన కరీబియన్ వీరుడు నికోలస్ పూరన్ ముప్పై ఏళ్లు రాకముందే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 33 ఏళ్లకే మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్లు మ్యాక్స్వెల్, స్టొయినిస్ వన్డే క్రికెట్కు దూరమయ్యారు. ఈ నలుగురిలో మ్యాక్స్వెల్ తప్ప మిగిలిన ముగ్గురికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. మరికొంత కాలంగా ధాటిగా ఆడగల సత్తా ఉన్నవాళ్లే అయినా... ఇలా అంతర్జాతీయ క్రికెట్కు అర్ధాంతరంగా వీడ్కోలు పలకడం వెనక అసలు మతలబు మాత్రం లీగ్ క్రికెట్కు పెద్దపీట వేసేందుకే అనేది జగమెరిగిన సత్యం!వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో వివాదాల కారణంగా కరీబియన్ ఆటగాళ్లు మొదటి నుంచి విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. జాతీయ జట్టు తరఫున అయితే ఆటతో పాటు బాధ్యత కూడా మోయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా దక్కే మొత్తం కూడా చాలా తక్కువ. మన దేశంలో రంజీ మ్యాచ్ ఆడే ఆటగాడికి దక్కే ఫీజు సైతం అందుకోని అంతర్జాతీయ క్రికెటర్లు బయట ఎందరో ఉన్నారు. దీంతో వారంతా ఫ్రాంచైజీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు నెలల పాటు కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లినట్లు వెళ్లి ఓ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడమో... లేక బ్యాటింగ్లో కొన్ని మెరుపులు మెరిపించడంతోనో పని కానిస్తున్నారు! – సాక్షి క్రీడావిభాగంఅంతర్జాతీయ క్రికెట్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఒక ఆటగాడు తన జీవిత కాలాన్ని వెచ్చించాల్సిందే. అహర్నిశలు కృషి చేస్తే తప్ప ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. కఠోర శ్రమకు కాలం కూడా కలిసొస్తేనే ఫలితాలు సానుకూలంగా వస్తాయి. అలాంటిది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్న తర్వాత ఆటగాళ్లు ఆ విధులకు దూరంగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. వెస్టిండీస్ బోర్డు విషయానికి వస్తే... వార్షిక కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు, ఆటగాళ్లకు సౌకర్యాలు, బకాయిలు ఇలా సవాలక్ష కారణాలతో ఆ దేశంలోని నాణ్యమైన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడేందుకు విముఖత చూపుతున్నారు. క్రిస్ గేల్ నుంచి మొదలుకొని కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డారెన్ స్యామీ, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, హెట్మైర్, నికోలస్ పూరన్ ఇలా వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లంతా లీగ్లతోనే విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఏమూల లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో ప్రముఖంగా కనిపించే ప్లేయర్లు కరీబియన్లే అనడంలో సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రమాదకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరన్ 2016లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడాడు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో వెస్టిండీస్ తరఫున 61 వన్డేలాడిన అతడు 1983 పరుగులు చేశాడు. 106 టి20 మ్యాచ్ల్లో 2275 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగల సామర్థ్యం... ఎలాంటి స్థితిలో అయినా భారీ షాట్లు కొట్టగల నైపుణ్యం అతడికి మంచి ‘ఫినిషర్’అనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే కెరీర్ ఆరంభం నుంచి కేవలం వన్డే, టి20లపైనే దృష్టి పెట్టిన పూరన్... సుదీర్ఘ ఫార్మాట్ జోలికి పోలేదు. 2023లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన అతడు... గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్పై ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. విండీస్ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించిన పూరన్... 29 ఏళ్లకే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం వెనక ఫ్రాంచైజీ క్రికెట్లో చేసుకున్న ఒప్పందాలు కీలకపాత్ర పోషించాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్... వివిధ లీగ్ల్లో ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ చార్జర్స్, ట్రిన్బాగో నైట్రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, డెక్కన్ గ్లాడియేటర్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, ఖుల్నా టైటాన్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఇలా లెక్కకు మిక్కిలి ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతేడాది పొట్టి ఫార్మాట్లో 170 సిక్స్లు బాది నయా రికార్డు సృష్టించిన పూరన్... ఐపీఎల్ 18వ సీజన్లో 40 సిక్స్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. క్లాసెన్ ఇదే దారిలో...ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లతో రికార్డులు తిరగరాయడంలో కీలకపాత్ర పోషించిన దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇటీవల మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 33 ఏళ్ల క్లాసెన్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టి20లు ఆడాడు. వన్డేల్లో 2141 పరుగులు చేసిన క్లాసెన్... పొట్టి ఫార్మాట్లో 1000 పరుగులు చేశాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల తెగువ... భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల లయ దెబ్బతీయగల నేర్పు అతడి సొంతం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్పై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లాసెన్ ప్రకటించినా... దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్నప్పుడే మరింత డబ్బు చేసుకోవాలనే అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడనేది సుస్పష్టం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ధాటిగా ఆడగల మేటి బ్యాటర్ అయిన క్లాసెన్కు విశ్వవ్యాప్తంగా లీగ్ల్లో మంచి గిరాకీ ఉంది. వీళ్లు కూడా... గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు కేవలం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కుర్రాళ్లకు అవకాశం కల్పించేందుకే అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన ఈ జోడీ... ఐపీఎల్లో మాత్రం అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన కోహ్లి... బెంగళూరు తొలిసారి చాంపియన్గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఇక ‘హిట్మ్యాన్’రోహిత్ ఇచ్చిన ఆరంభాలతోనే ముంబై జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరగలిగింది. ఈ ఇద్దరూ మరి కొన్నేళ్లు ఐపీఎల్లో కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. మార్టిన్ గప్టిల్, దిముత్ కరుణరత్నే, తమీమ్ ఇక్బాల్, మహ్ముదుల్లా ఇలా వివిధ దేశాలకు చెందిన పలువురు ప్లేయర్లు ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినా... వారు లీగ్ల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు.వన్డేలకు మ్యాక్సీ ‘టాటా’...ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ మధ్యే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని టి20లపై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్సీ ప్రకటించినా... దీని వెనుక కూడా లీగ్ల హస్తం ఉంది. ఐపీఎల్లో ఒకదశలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడైన ఈ ఆసీస్ ఆల్రౌండర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో కాస్త వెనుకబడి... పెట్టిన ధరకు న్యాయం చేయలేకపోయిన సందర్భాలే అధికం. ఆసీస్ తరఫున 7 టెస్టుల్లో 339, 149 వన్డేల్లో 3990, 116 టి20ల్లో 2664 పరుగులు చేసిన 36 ఏళ్ల మ్యాక్స్వెల్... ఇకపై కేవలం పొట్టి ఫార్మాట్లో మాత్రమే ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పేస్ ఆల్రౌండర్ స్టొయినిస్ కూడా ఈ ఏడాదే వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 18వ సీజన్లో తన మెరుపులతో అభిమానులను అలరించిన స్టొయినిస్... జాతీయ జట్టు తరఫున 71 వన్డేల్లో 1495, 74 టి20ల్లో 1245 పరుగులు చేశాడు. వన్డేల్లో 48, టి20ల్లో 45 వికెట్లు సైతం పడగొట్టాడు. అయితే జాతీయ విధుల కన్నా... లీగ్ క్రికెట్ ద్వారానే ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఈ ఆటగాళ్లంతా ఫ్రాంచైజీ క్రికెట్పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.‘కివీ’ల రూటే సపరేటు!ఇది ఇలా ఉంటే... న్యూజిలాండ్ ఆటగాళ్ల తీరు మరో రకం. జాతీయ జట్టు తరఫున వార్షిక కాంట్రాక్టు తీసుకోవడానికి ఇష్టపడని పలువురు క్రికెటర్లు... ఫ్రాంచైజీలతో జతకట్టేందుకు ‘సై’అంటున్నారు. సెంట్రల్ కాంట్రాక్టు తీసుకుంటే... జాతీయ జట్టుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సి రావడంతో... స్టార్ క్రికెటర్లు సైతం దీనికి దూరమయ్యారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, లూకీ ఫెర్గూసన్ ఉన్నారు. వీరంతా వేర్వేరు దేశాల్లో జరిగే లీగ్ల్లో పాల్గొనేందుకు జాతీయ జట్టుకు దూరమయ్యారు. గతంలో ఐపీఎల్లో కీలకపాత్ర పోషించిన విలియమ్సన్ను ఈసారి వేలంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడు పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో ఆడగా... కాన్వే చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. -
మొదటి రోజు పేసర్ల హవా
సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే అసలు సిసలు సమరం రసవత్తరంగా ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో పేసర్ల జోరు సాగుతోంది. పచ్చిక పిచ్పై పేసర్ రబాడ విజృంభించినా... ఆసీస్ బ్యాటర్లు కాస్త సంయమనం చూపడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత కంగారూ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాపార్డర్ తడబడింది. రెండో రోజు తొలి సెషన్లో కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ను సఫారీ జట్టు ఎదుర్కోవడంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. లండన్: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహకారం తోడవడంతో... ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను ఆ్రస్టేలియా మెరుగ్గా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తమ పదునైన పేస్తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పెద్దగా మెరిపించలేకపోయింది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ తెంబా బవుమా (3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్హామ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2... హాజల్వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. బౌలర్ల హవా సాగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలగా... అందులో సింహభాగం (12 వికెట్లు) పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. రబాడ పేస్ దాడి.. ఐసీసీ టెస్టు గదను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 20 బంతులాడినా ఖాతా తెరవలేకపోయిన ఉస్మాన్ ఖ్వాజా (0)ను రబాడ పెవిలియన్ బాట పట్టించాడు. అదే ఓవర్లో కామెరూన్ గ్రీన్ (4) కూడా అవుటయ్యాడు. మార్క్రమ్ స్లిప్స్లో చక్కటి క్యాచ్తో గ్రీన్ను సాగనంపగా... క్రీజులో నిలిచేందుకు మొండిగా ప్రయత్నించిన లబుషేన్ (56 బంతుల్లో 17)ను యాన్సెన్ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ (11) కీపర్ వెరీన్ పట్టిన ఒంటి చేతి క్యాచ్తో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆసీస్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ తన అనుభవాన్ని చూపించాడు. పేసర్లను కాచుకుంటూ... చెత్త బంతుల్లో పరుగులు రాబట్టాడు. దీంతో ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మార్క్రమ్ బౌలింగ్లో అనవసర షాట్కు అతడు అవుట్ కాగా... కేశవ్ మహరాజ్ బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అలెక్స్ కేరీ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో ధాటిగా ఆడిన వెబ్స్టర్ను కూడా రబాడ వెనక్కి పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ వేగంగా ముగిసింది. 20 పరుగులకే జట్టు తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. బెంబేలెత్తించిన పేస్ త్రయం... దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించిన పిచ్పై ఆసీస్ పేస్ త్రయం మరింత రెచ్చిపోతుందని ఊహించినట్లే జరిగింది. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్... సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. స్టార్క్ తొలి ఓవర్ చివరి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న మార్క్రమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కాసేపటికి రికెల్టన్ (16) కూడా అతడిని అనుసరించాడు. ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేసి అవకాశం ఇచ్చినా... దక్షిణాఫ్రికా బ్యాటర్లు వాటిని వినియోగించుకోలేకపోయారు. క్రీజులో అడుగు పెట్టిన తొలి బంతికే సింగిల్ తీసిన ముల్డర్ (44 బంతుల్లో 6) మరో పరుగు చేసేందుకు 39 బంతుల వరకు ఎదురు చూశాడంటే... కంగారూల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 31వ బంతికి ఖాతా తెరవగా... స్టబ్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 4 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ నాలుగో స్థానానికి (332 వికెట్లు) చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను అలెన్ డొనాల్డ్ (330)ను అధిగమించగా...టాప్–3లో వరుసగా డేల్ స్టెయిన్ (439, షాన్ పొలాక్ (421), మఖయా ఎన్తిని (390) ఉన్నారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 0; లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 17; గ్రీన్ (సి) మార్క్రమ్ (బి) రబాడ 4; స్మిత్ (సి) యాన్సెన్ (బి) మార్క్రమ్ 66; హెడ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 11; వెబ్స్టర్ (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 72; కేరీ (బి) కేశవ్ 23; కమిన్స్ (బి) రబాడ 1; స్టార్క్ (బి) రబాడ 1; లయన్ (బి) యాన్సెన్ 0; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (56.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–46, 4–67, 5–146, 6–192, 7–199, 8–210, 9–211, 10–212. బౌలింగ్: రబాడ 15.4–5–51–5; యాన్సెన్ 14–5–49–3; ఇన్గిడి 8–0–45–0; ముల్డర్ 11–3–36–0; కేశవ్ మహరాజ్ 6–0–19–1; మార్క్రమ్ 2–0–5–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి)కమిన్స్ 6; బవుమా (నాటౌట్) 3; స్టబ్స్ (బి) హాజల్వుడ్ 2; బెడింగ్హామ్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (22 ఓవర్లలో 4 వికెట్లకు) 43. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30. బౌలింగ్: స్టార్క్ 7–3–10–2; హాజల్వుడ్ 7–3–10–1; కమిన్స్ 7–3–14–1; లయన్ 1–0–1–0. -
భారత్కు మరో పరాజయం
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్ల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలమైన భారత్... ఈసారి పేలవ డిఫెన్స్తో మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అభిõÙక్ (42వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్ రే (3వ నిమిషంలో), లూకాస్ మార్టినేజ్ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్ మెండెజ్ (46వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్ మాటియాస్ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్ప్రీత్ గోల్తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. భారత్కు రెండో విజయంఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్లో 2–1 గోల్స్ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్ తరఫున లాల్థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున్ వాన్ హెల్మోంట్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్ జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది. -
డివోర్సీ క్యాంప్స్
విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్ లక్ష్యం. మొదటిది సక్సెస్ కావడంతో రాబోయే రెండు నెలల్లో మరో నాలుగు క్యాంప్స్ నిర్వహించనుంది రాఫియా.‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. మాకంటూ స్పేస్ కావాలి‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.బ్రేక్ ఫ్రీ స్టోరీస్రాఫియాకు ఇన్స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్ను బట్టి అర్థమైంది. కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్కు ఒక స పోర్ట్ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్ లో రెండురోజుల క్యాంప్ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.క్షణాల్లో ఆత్మబంధువులుడివోర్సీ క్యాంప్కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. ‘‘ఈ క్యాంప్లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్పర్ట్లతో కౌన్సిలింగ్స్ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్ అయిన వెంటనే రాఫియా ఫోన్ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్లను ΄్లాన్ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. -
మనూ భాకర్కు నిరాశ
మ్యూనిక్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో రెండో రోజు బుధవారం భారత్ ఒక్క పతకం కూడా గెలుచుకోలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనూ భాకర్, చైన్ సింగ్ తమ విభాగాల్లో ఫైనల్స్కు అర్హత సాధించినా మెడల్ మాత్రం దక్కలేదు. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ 588 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. అయితే అసలు పోరులో ఆమె తడబడింది. ఫైనల్లో 20 పాయింట్లు మాత్రమే సాధించి మూడో ఎలిమినేషన్ రౌండ్ను దాటలేకపోయింది. ఇదే ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్లో 585 పాయింట్లకే పరిమితమైన 11వ స్థానంలో నిలిచిన ఇషా ఫైనల్కు కూడా అర్హత సాధించలేదు. మరో భారత షూటర్ సిమ్రన్ప్రీత్ కౌర్ 32వ స్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో చైన్ సింగ్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ప్రపంచ కప్లో కాంస్యం గెలిచిన చైన్ సింగ్ క్వాలిఫయింగ్లో ఐదో స్థానంలో ఫైనల్కు చేరినా పతకం మాత్రం దక్కలేదు. నేడు జరిగే పోటీల్లో భారత షూటర్లు అర్జున్ బబూటా, సందీప్ సింగ్, సిఫ్ట్ కౌర్, శ్రియాంక, ఆషి చౌక్సీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తొలిదశ కింద 210 స్కూళ్లలో దీనికి సంబంధించిన తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లా అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఒకటవ తరగతిలో చేరే ముందు, అందుకు సన్నద్ధతగా ఈ పూర్వ ప్రాథమిక విద్య దోహదపడుతుంది. ఆటలు, పాటలు, కథల రూపంలో విద్యాబోధన ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ పేరిట ప్రీ ప్రైమరీ విద్య రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాది పాటే ఇందుకు సంబంధించిన తరగతులు ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం!
నింగిలోని చుక్కలతో ఏనుగును చిత్రించుకోవడం... చందమామలో చెవుల పిల్లిని ఊహించుకోవడం... తొడుక్కున్న బట్టలను మాపుకోవడం.. చెట్లు, పుట్టలెక్కడం.. గెంతడం... ఒకరినొకరు గేలిచేసుకోవడం.. ఏడిపించుకోవడం.. యథేచ్ఛగా ఆడుకోవడం... పితూరీలు, అలకలు, ఉరకలు, పరుగులు... ‘బాల్యం’ అని మనసులో గూగుల్ చేస్తే మెదిలే ఇమేజెస్ అవి! నిజంగా పిల్లలందరూ అంత లగ్జరీ అనుభవిస్తున్నారా అని అనుకునేలోపే ముంబైలో ధారావీ, హైదరాబాద్లో జవహర్ నగర్ లాంటి ప్రాతాలు స్ఫురణకు వస్తాయి! ధారావీ ఎక్కడో దూరం కాబట్టి రెండు రాష్ట్రాలకు సుపరిచితమైన జవహర్ నగర్ను సందర్శిద్దాం... ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా!‘పిల్లల చేతుల్లో ఉండాల్సింది పలక.. బలపం లేదంటే పెన్ను.. పుస్తకం అంతేకానీ పనిముట్లు కాదు’ అంటారు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ఉద్యమనేత కైలాశ్ సత్యార్థి. కానీ జవహర్ నగర్లోని చాలామంది పిల్లల చేతుల్లో పుస్తకాలు కనిపించవు. పనిముట్లే కనిపిస్తాయి. అది నూరు బస్తీల ప్రాతం. దేశంలోని అన్ని ప్రాతాల నుంచి వచ్చిన వలసలతో మినీ ఇండియాను తలపిస్తుంది. వాళ్లలో చాలామందికి ఆధార్లాంటి గుర్తింపు పత్రాలేమీ ఉండవు. వాళ్లు ఏ లెక్కల్లోకీ రాక స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ సంక్షేమ, ప్రయోజనాల దాకా ఏవీ వారికి అందట్లేదు. దాంతో చాలామంది పిల్లలు బాలకార్మికులై కనిపిస్తారు.. ఈ జవహర్నగర్కి ఆనుకునే ఉన్న 350 ఎకరాల డంపింగ్ యార్డ్లో చెత్త ఏరుకుంటూ.. భవన నిర్మాణ కార్మికులుగా.. అమ్మాయిలైతే ఇళ్లల్లో పనిచేస్తూ! ఇంకా సీజనల్ లేబర్గా కూడా! వసివాడని ఈ పిల్లలు గంజాయికి బానిసలై కూడా కనిపిస్తారు.మూడు లక్షల జనాభా...ఈ వంద బస్తీల్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది. సర్కారు బడులు పది మాత్రమే. అందులో ఎనిమిది ప్రైమరీ స్కూళ్లు, రెండు హైస్కూళ్లు. ఇది కా్రపా మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి కనీసం ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేదు. అందుకే స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా టెన్త్ అవగానే అబ్బాయిలైతే కూలీలుగా మారుతున్నారు. అమ్మాయిలకైతే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లయి పోతున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోని పరిస్థితి! ఇలా మన దేశమంతటా సుమారు పద్దెనిమిది లక్షల నుంచి ముప్పైమూడు లక్షల వరకు బలకార్మికులు ఉన్నారని యూనిసెఫ్ డేటా వెల్లడిస్తోంది. వీళ్లంతా వ్యవసాయరంగంలో, కుటుంబ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని నివేదిక తెలుపుతోంది. అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలంతా ఏదో ఒక పనిచేస్తున్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. చట్టం ఏం చెబుతోంది?ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986 ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లల చేత ఎలాంటి పనైనా చేయించడం నేరం. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు పనివ్వొచ్చు. కానీ ప్రమాదకరమైన వృత్తులు.. పనులు.. పరిస్థితుల్లో ఆ పిల్లలను పెట్టకూడదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. కుటుంబ వ్యాపారాలు, నిర్దిష్ట పరిస్థితుల్లో టీవీ, సినిమాలు వంటి వినోద రంగాల్లో పిల్లల పనిచేయవచ్చు.అమ్మాయిలే ఎక్కువ..ప్రపంచవ్యాప్త బాలకార్మికుల్లో ప్రతి పదిమందిలో ఒకరు మన దేశం నుంచే కనిపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో బాలకార్మికుల(5–14 ఏళ్లలోపు) సంఖ్య కోటికి పైనే ఉంది. అంటే అప్పటి పిల్లల జనాభాలో ఇది 3.9 శాతం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా పనిబాట పడుతున్నారని యూనిసెఫ్ సర్వే చెబుతోంది. ఇళ్లల్లో పని దగ్గర్నుంచి ఇంట్లో పెద్దవాళ్ల (అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు)ను చూసుకోవడం, తోబుట్టువులను సంభాళించడం వంటివన్నీ చేస్తున్నారన్నది నివేదికల మాట. మన దేశంలో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాతాల్లో బాలకార్మికులు ఎక్కువ. ఇటుక బట్టీలు, తీవాచీ, వస్త్ర పరిశ్రమ, ఇళ్లు, హోటళ్లు.. టీ స్టాళ్లు లాంటి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తారు.బాలకార్మిక వ్యవస్థ వేళ్లూనడానికి కారణాలు అసమానత్వం, సరైన విద్యావకాశాలు, మంచి పని, సామాజిక భద్రత లేకపోవడం, సంప్రదాయ, సాంస్కృతిక చట్రాలు వంటివన్నీ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. ఏ రూపాల్లో ఉన్నా 2025 కల్లా బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలనే యునైటెడ్ నేషన్స్ లక్ష్యానికి మద్దతు తెలుపుతూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీఎస్) భారత ప్రభుత్వమూ సంతకం చేసింది. సంతకం చేయగానే సరిపోదు చిత్తశుద్ధితో ఆ బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరినీ బడి బాట పట్టించి బాలకార్మికులు లేకుండా చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటున్నారు బాలల హక్కుల కార్యకర్తలు. ∙రెస్క్యూ, రిహాబిలిటేషన్ వీక్గా ఉందిజవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్కి ఆనుకున్న బస్తీల్లో స్క్రాప్ షాప్స్ ఎక్కువ. అందుకే ఇక్కడ చెత్త సేకరణ ఎక్కువగా జరుగుతుంది. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ లేబర్, డొమెస్టిక్ హెల్ప్, సీజనల్ లేబర్కి కూడా వెళ్తుంటారు. ఈ ప్రాతంలో సరిపడా సర్కారు బడులు లేవు. ఉన్నవాటిల్లో చేరడానికి చాలామంది పిల్లలకు గుర్తింపు పత్రాలు లేవు. వాళ్లకు ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్స్ దొరికినా ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు. దాంతో పనిలోకి వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు దాటిన పిల్లలు గనుక ఒక్కసారి పనిలోకి వెళితే మళ్లీ వాళ్లను చదువు వైపు మళ్లించడం చాలా కష్టం. ఇక్కడ వార్డ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (డబ్ల్యూఎల్సీపీసీ) కూడా యాక్టివ్గా లేవు. దీనివల్ల బాలకార్మికుల రెస్క్యూ, రిహాబిలిటేషన్ చాలా వీక్గా ఉంది. – హిమబిందు, పిల్లల హక్కుల కార్యకర్త -
కేబినెట్ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నాం. సాంకేతికపరమైన అంశాలపై ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయం మేమే (ప్రభుత్వం) తీసుకున్నాం. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచించింది..’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాకపోవడం వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అని కమిషన్ ప్రశ్నించగా, కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని నాటి మహారాష్ట్ర సీఎం పృథీ్వరాజ్ చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ను నేను స్వయంగా కలిసి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సహకరించాలని కోరితే ససేమిరా అన్నారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సహకరిస్తామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల కింద 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా, తుమ్మిడిహట్టి వద్ద అంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడం వల్లే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేపట్టాం. ప్రత్యామ్నాయాలపై వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైడార్ సర్వే చేయించగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బరాజ్లు నిర్మించాలని సిఫారసు చేసింది. బొగ్గు గనులు ఉండడంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీళ్లను తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అందుకే మూడు బరాజ్లు నిర్మించి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే నిర్ణయం జరిగింది. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల జలాల లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నాం. బరాజ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఉంది. మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు జరిగాయి..’ అని కేసీఆర్ చెప్పారు. ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే... బరాజ్ల లొకేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇంజనీర్లు, సాంకేతిక బృందం తీసుకుందని కేసీఆర్ బదులిచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4 వేల మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. బరాజ్ల నుంచి పంప్హౌస్ల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన స్థాయిల్లో నిల్వలను కొనసాగించే అంశంపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక అంశాల్లో నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారు. మంత్రివర్గ ఆమోదంతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ఏర్పాటుకు అనుమతిచ్చాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత ఉండడంతో రుణాల సమీకరణ కోసం దీనిని ఏర్పాటు చేశాం. ప్రాజెక్టుకు ఆదాయం సమకూరే వరకు రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే..’ అని మాజీ సీఎం చెప్పారు. బరాజ్ల నిర్వహణకు రూ.280 కోట్ల నిధులిచ్చాం..కానీ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సీపేజీ ఏర్పడడం వెనక నిర్వహణ, పర్యక్షణ లోపాలు సైతం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. బరాజ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం రూ.280 కోట్లను కేటాయిస్తూ 2020లో తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 ప్రతిని కమిషన్కు అందజేశారు. నిధులు మంజూరు చేసినా ఇంజనీర్లు వాడుకోలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ క్వాలిటీ కంట్రోల్ డివిజన్నే ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ రూపొందించిన ఓ పుస్తకాన్ని కూడా కమిషన్కు కేసీఆర్ అందజేశారు. మాజీ మంత్రి హరీశ్రావు ఇటీవల విలేకరుల సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్నే పుస్తక రూపంలోకి మార్చి కమిషన్కు ఇచ్చారు. సిబ్బందిని, మీడియాను బయటకు పంపించి.. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇప్పటివరకు హాజరైన ఇతర సాక్షులందరినీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగంగానే ప్రశ్నించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా బహిరంగ విచారణలో పాల్గొనలేనని, తనను ప్రశ్నించేటప్పుడు ఎవరినీ అనుమతించరాదని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించి ‘ఇన్ కెమెరా’ విధానంలో (కేవలం కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మాత్రమే ఉన్నప్పుడు) క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. జస్టిస్ ఘోష్ అడిగే ప్రశ్నలు, కేసీఆర్ ఇచ్చే సమాధానాలను కంప్యూటర్పై టైప్ చేసేందుకు కమిషన్ కార్యదర్శిని అనుమతించారు. 18 ప్రశ్నలు...50 నిమిషాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 50 నిమిషాల పాటు సాగి 12.50 గంటలకు ముగిసింది. కేసీఆర్కు కమిషన్ 18 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. కేసీఆర్ను కమిషన్ కార్యాలయానికి తోడ్కొని వచ్చిన వారిలో మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచే అవకాశం ఉంది. -
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్! -
బాధ్యత నుంచి తప్పించుకోవడానికే...
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్) కార్యక్రమం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ‘పీ4’ ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ‘మార్గద ర్శులు’గానూ, వీరు దత్తత తీసుకునే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ గానూ పేర్కొన్నారు. ఈ మార్గదర్శులు తమ ఖర్చుతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించి నూరు శాతం పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ) సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనక దాగి ఉన్న నిజం వింటే ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి ఇట్టే తేటతెల్లమవుతుంది.ఆంధ్రప్రదేశ్లో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. పీ4 ప్రాజెక్టు కింద కేవలం 19.15 లక్షల కుటుంబాలను మాత్రమే ‘పేదలు’గా గుర్తించారు. అంటే 87 శాతం మంది అల్పాదాయ వర్గం (బీపీఎల్) పరిధిలోని కుటుంబాలు ఈ దీని పరిధిలోకి రాలేదన్నమాట. నమోదైన వారిలో సైతం మార్గదర్శకులు దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు కేవలం 62,970. అంటే మొత్తం పేదల్లో కేవలం ఒక శాతం కన్నా తక్కువే. వీరికి అండగా నిలిచేందుకు గుర్తించిన మార్గదర్శుల సంఖ్య కేవలం 5325 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే... ‘పీ4’ ద్వారా పేదల్లో ఎంత శాతం మందికి మేలు చేకూరు తుందో, వారి జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయో చెప్పొచ్చు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా కంపెనీలు, సంస్థలు ఏటా నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలను ఇక నుండి పీ4లో మార్గదర్శుల ఖాతాలో చూపించబోతున్నారు. వాస్తవానికి, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీల స్థాయిని బట్టి తమ లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పర్యావరణం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలి. ఇలా ఏటా వేల కోట్లు కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిని పీ4 కింద చేర్చి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా పేదల ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఇతర సంక్షేమ అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ బాధ్యత నుంచి తప్పించు కుంటూ పీ4 పేరిట కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు దీన్ని ప్రభుత్వం అప్పగించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పేదలకు ఆర్థిక చేయూత నిచ్చే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడే కుట్రలో భాగమే ఇదని చెప్పొచ్చు. ఈ పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం – పేదలకు ధనవంతులు సహాయం చేయటం! కానీ చంద్రబాబు నాయుడు అమలు చేసిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రయోజనం పొందిన పెట్టుబడి దారులను ‘మార్గదర్శులు’ అని పిలవడం సరికాదు. సూపర్–6 వాగ్దా నాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పెద్దలు పీ4ను తెరపైకి తెచ్చినట్లుంది. వైఎస్సార్ వంటి మహానేతలు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పాటు ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు’ ప్రజల అవసరాలను నేరుగా తీరుస్తూ సంక్షేమాన్ని వారి కళ్ల ముందు నిలిపాయి. కానీ నేటి ప్రభు త్వానికి సంక్షేమ స్పృహ కని పించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఏదైనా పథకాన్ని ప్రభుత్వ భాగ స్వామ్యంతో నడిపితే సత్ఫలితాలుంటాయి. అది జరగనప్పుడు రాష్ట్రాభివృద్ధి తిరోగమిస్తుంది. పీ4 అనేది ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం కానే కాదనేది గమనార్హం. ఇటువంటి కార్యక్రమాల అమలును స్వతంత్ర ట్రస్ట్ల ద్వారా, పార దర్శక ఆడిటింగ్తో, ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వస నీయత పెరుగు తుంది. లేదంటే, ఇది కూడా ఓ ‘సూపర్–6’ నినాదం లాగా మిగిలి పోతుంది. పేదల ఆత్మాభిమానాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం దీనిలో కనిపిస్తోంది. తాము సహాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల సమయంలో తాము చెప్పిన రాజకీయ పక్షాలకే ఓటువేయాలని కార్పొరేట్ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు. అదే జరిగితే ప్రజా స్వామ్యం మంట గలిసిపోతుంది. కార్పొరేట్లు ఎవరిని తలచుకుంటే వారినే అధికారంలో కూర్చోబెట్టగలుగుతారు. ఎటూ ఈ కార్యక్రమాన్ని తామే ప్రవేశపెట్టాం కనుక పేదప్రజలను తమ ఓటుబ్యాంకుగా కార్పొ రేట్లు మారుస్తారని ప్రస్తుత ప్రభుత్వాధినేత ఆలోచన. ఇదే పీ4 వెనుక ఉన్న అసలు రహస్యం!– తలకోల రాహుల్ రెడ్డి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనలిస్ట్ -
మస్క్ ‘కాల్పుల విరమణ’!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది. వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు. ట్రంప్–మస్క్ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు. ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ట్రంప్–మస్క్ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు. ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు. ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి. -
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది . శంషాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాక మరికొంత మంది ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం కలిగిందని తెలుస్తోంది. -
రాయచోటిలో దారుణం.. ప్రేమోన్మాది అకృత్యాలకు బాలిక ఆత్మహత్య
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది అకృత్యాలు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను వేధించిన యువకుడు తారకరత్న.. ఇంట్లో చెప్తే మీ నాన్నను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ బాలిక తండ్రికి చెప్పడంతో సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ వేధించాడు. భయాందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.తండ్రి.. ఆ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటుకున్నారు. పదో తరగతిలో 554 మార్కులు సాధించిన బాలిక.. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఇంటర్లో అడ్మిషన్ తీసుకుంది. ఎల్లుండి నుంచి క్లాస్లకు వెళ్లాల్సిన బాలిక ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడింది. తారకరత్న అనే యవకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడని విద్యార్థి తండ్రి చంద్రగిరి ఉత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండవారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతోంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.గత ఏడాది.. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చంద్రబాబు మీది కూటమి ప్రభుత్వం కాదు.. వంచన ప్రభుత్వం
సాక్షి,విజయవాడ: ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని.. వంచన ప్రభుత్వం అని మండిపడ్డారు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. తల్లికి వందనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కాదు.. వంచన. మొత్తం పిల్లలు 87,41,885, ఇస్తామంటున్నది 67,27,164 మందికి, కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే. అదికూడా పూర్తిగా ఇస్తారో లేదో?. దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా?. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు. గత ఏడాది పూర్తిగా ఎగనామం, రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు. ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇది వంచన కాదా?ఎన్నిలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలుఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఏడాదికాలంపాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాతకూడా, చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడంలేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనం అమలు చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీచేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో అర్థం అవుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం, ప్రతిఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపథకాన్ని రద్దుచేసి గత విద్యాసంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రాష్ట్రలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885, కాని ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా?యూడీఐఎస్ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతినుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. చంద్రబాబునాయుడుగారు తన మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది రూ.13,050 కోట్లు. గత ఏడాది ఒక్కపైసా ఇవ్వలేదు.గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది రూ.26,100 కోట్లు. కాని, ఈ ఏడాది రూ.8,745 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తే, ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా?మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో ప్రాంతం, మతం, కులం, పార్టీలు చూడకుండా అందరికీ పథకాన్ని వర్తింప చేస్తే, ఈ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపుచేస్తామని విద్యాశాఖమంత్రి చెప్తున్నారు. ఇది చాలా దారుణం. అలా చూసినాసరే ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాలి, కాని రూ.8,745 కోట్లు మాత్రమే ప్రకటించడం చూస్తే ఇది మోసమే అని తేలిపోయింది.ఈ అంకెలు చూస్తే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది’ అని దుయ్యబట్టారు. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను వెబ్స్టెర్తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన స్మిత్..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్లో 18 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బోర్డర్ ఆల్టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.ఇంగ్లండ్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్లు వీరే..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-18అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)- 17వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 17డాన్ బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా)- 14గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 14అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.లార్డ్స్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్లు..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 591వారెన్ బార్డ్స్లీ (ఆస్ట్రేలియా) - 575గ్యారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్) - 571డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా) - 551శివ్నారాయణ్ చందర్పాల్ (వెస్టిండీస్) - 512దిలీప్ వెంగ్సర్కార్ (భారత్) - 508అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 503చదవండి: WTC Final: ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
డ్రగ్స్ నివారణకు 'మా' సహకారం.. ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభం
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) మరో ముందడుగు వేసింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) కలిసి 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి, ఎస్పీ శ్రీ పి. సీతారామ, డిపార్ట్మెంట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శ్రీమతి శైలజ హాజరయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని అందరూ ఆకాంక్షించారు. -
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తమ్ముడు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. -
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీకి తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నువ్వు వైరలవుతున్నావని చాలామంది నాకు ఫోన్ చేశారని అన్నారు. నేను ప్రస్తుతం నా షూట్లతో బిజీగా ఉన్నానని తెలిపారు.బర్త్ డే పార్టీలో రచ్చరవి అని ఉన్నారని మీరంతా అనుకుంటున్నారు.. కానీ ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చరవి అని.. అక్కడున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి కూడా నాకు తెల్వదు.. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నా.. అందుకోసమే దయచేసి అర్థం చేసుకోండి.. అపార్థం చేసుకోవద్దని రచ్చరవి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను తాగను... తాగబోను... నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి.. అంటూ రాసుకొచ్చారు. కాగా.. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే రచ్చరవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. ఇవాళ ఉదయం టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడ ఐదు వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు.అతడి పేస్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఖవాజా, గ్రీన్, వెబ్స్టెర్, కమ్మిన్స్ వంటి కీలక వికెట్లను రబాడ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వెబ్స్టెర్(72) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి. -
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్లైన్లో పలు కథనాలు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading. Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.The Government remains fully committed…— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025 -
కమిషనరేట్లో భారీగా పెరిగిన మహిళా అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్లో డీసీపీ ఆపై స్థాయిలో పోస్టుల సంఖ్య 27 ఉండగా వీటిలో ఆరు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 21 పోస్టుల్లో పది మంది ఉమెన్ ఆఫీసర్లు ఉన్నారు. దీంతో ఉన్నతాధికారుల్లో మహిళల శాతం 50కు చేరుకుంది. సంయుక్త పోలీసు కమిషనర్ (పరిపాలన విభాగం) సహా ఇప్పటికే తొమ్మిది మంది మహిళా ఉన్నతాధికారులు ఉన్నారు. తాజాగా నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు అపూర్వ రావును నియమించడంతో బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించి పూర్తి స్థాయి ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుదీర్ఘ కాలం పాటు లేని అవకాశం... ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగర పోలీసులో సుదీర్ఘ కాలం వరకు మహిళా ఉన్నతాధికారులకు ఆస్కారం ఉండేది కాదు. పోలీసు విభాగంలో వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు ఉన్నత స్థాయిలో లేకపోవడం దీనికి ఒక కారణం. అయితే కాల క్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో ఉన్న సున్నిత పరిస్థితులు, ఇతర కారణాల నేపథ్యంలో మహిళా అధికారులకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చే వారు కాదు. ఇక్కడ హఠాత్తుగా తలెత్తే పరిణామాలతో పాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది.కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళా ఉన్నతాధికారి ఉండాలని డీజీపీ కార్యాలయంతో పాటు ప్రభుత్వం భావించింది. అయితే చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్జోన్కు మాత్రమే మహిళా అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసు వింగ్లో మహిళ ఉన్నతాధికారి పోస్టు ఇది ఒక్కటే అనే భావన కొనసాగింది.ఉమెన్ సేఫ్టీ వింగ్ రాకతో... ఈ కారణంగానే 2014కు పూర్వం నగరంలో పని చేసిన మహిళ ఉన్నతాధికారులు అంతా నార్త్జోన్ డీసీపీగా వ్యవహరించిన వారే. ఒక్క ఏఆర్ అనురాధ మాత్రం అదనపు సీపీగా వ్యవహరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ–టీమ్స్కు రూపం ఇచ్చింది. దీంతో ఇందులో కచ్చితంగా మహిళ ఉన్నతాధికారులనే నియమించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో నగరంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది.ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో డీసీపీ ఆపై స్థాయిలో పది మంది మహిళలు ఉన్నారు. మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే... తొలిసారిగా ‘లోకల్స్’కు ఎక్కువ సంఖ్యలో ఉన్నతాధికారులుగా పోస్టింగ్ దక్కింది. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సీసీఎస్ డీసీపీ శ్వేత, స్పెషల్ బ్రాంచ్ చీఫ్ అపూర్వ రావు, సౌత్ ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, టాస్క్ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వీరంతా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. సిటీ పోలీసులో మహిళా ఉన్నతాధికారులు వీరే.. పరిమళ నూతన్– పరిపాలన విభాగం సంయుక్త సీపీ రక్షిత మూర్తి– సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీ అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాధన – నార్త్జోన్ డీసీపీ శ్వేత– డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ స్నేహ మెహ్రా– సౌత్ జోన్ డీసీపీ శిల్పవల్లి– మధ్య మండల డీసీపీ కవిత– ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీ పుష్ప– ఐటీ సెల్ డీసీపీచదవండి: దక్షిణమధ్య రైల్వేలో భారీ కుదుపు! -
సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్.. తెల్లముఖం వేసిన హెడ్! వీడియో
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ అద్బుత క్యాచ్తో మెరిశాడు. ఆసీస్ డెంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను సంచలనాత్మక క్యాచ్తో వెర్రీన్ పెవిలియన్కు పంపాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ ఓ బౌండరీ బాది మంచి టచ్లో కన్పించాడు. మొదటి సెషన్ చివరి ఓవర్ వేసిన మార్కో జానెసన్ రెండో బంతిని హెడ్కు లెగ్ సైడ్ సంధించాడు. ఆబంతిని హెడ్ లైగ్ సైడ్ ఫ్లిక్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ వెర్రీన్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన హెడ్ బిత్తరపోయాడు.చేసేదేమిలేక నిరాశతో హెడ్(11) పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మొదట 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను స్మిత్(66), వెబ్స్టెర్(56 నాటౌట్) ఆదుకున్నారు. 52 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో కమ్మిన్స్, వెబ్స్టెర్ ఉన్నారు.#MarcoJansen dismisses TravisHead after a splendid catch by #KyleVerreynne behind the stumps! 🔥LIVE NOW 👉 https://t.co/9lZGHcdeVP #WTCFinal | #SAvAUS, Day 1, watch LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar pic.twitter.com/i4HNMMtsrW— Star Sports (@StarSportsIndia) June 11, 2025 -
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2025 ఫలితాలు విడుదల
సాక్షి,ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్స్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలు బుధవారం (జూన్11)న యూపీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు యూపీఎస్సీ ఫారెస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. -
నితిన్ సినిమా వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా: డైరెక్టర్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో నితిన్కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.ఈ ఈవెంట్లో డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హీరో నితిన్పై ప్రశంసలు కురిపించారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నితిన్ మాత్రమేనని అన్నారు. ఆర్టిస్టులు చాలామంది ఇన్సెక్యూర్గా ఉంటారని.. కానీ అతనిలో ఏమాత్రం అభద్రతాభావం ఉండదని తెలిపారు. నితిన్ సినిమాకు రైటర్గా వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని శ్రీరామ్ వేణు వెల్లడించారు. ఇంతకుముందే నితిన్తో నేను సినిమా చేయాల్సిందని..కానీ నా వల్లే కాస్తా ఆలస్యమైందని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.👉గడ్డం వివేక్- కార్మిక, మైనింగ్ శాఖలు👉వాకిటి శ్రీహరి- పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యూత్ శాఖలు👉అడ్లూరి లక్ష్మణ్- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖకాగా, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. అనంతరం నిర్ణయం తీసుకున్నారు. -
కళ్లు బైర్లు కమ్మేలా.. వామ్మో కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు ఇన్ని వందల కోట్లా
సాక్షి,హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం కేసులో నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో నూనె శ్రీధర్కు రూ.200కోట్లు ఆస్తుల్ని గుర్తించినట్లు సమాచారం.ఏసీబీ అధికారుల దాడుల్లో హైదరాబాద్తో పాటు 15 చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. హైదరాబాద్ , కరీంనగర్ వరంగల్లో 19 ప్లాట్లు, తెల్లాపూర్లో విల్లా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఇండివ్యూజువల్ హౌస్, నాంపల్లిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, పలు హోటల్స్ బినామీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు సోదాల్లో తేలినట్లు సమాచారం. నూనె శ్రీధర్ తన కుమారుడు డెస్టినేషన్ మ్యారేజీని థాయిలాండ్లో చేసినట్లు ఆధారాల్ని సేకరించారు. దీంతో పాటు భారీగా బంగారం, నగలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.కాగా, నూనె శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,7,8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. -
ఆ జట్టు నుంచి పిలుపు.. ఇంగ్లండ్కు వెళ్లనున్న తిలక్ వర్మ
టీమిండియా సూపర్ స్టార్, హైదరాబాదీ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. డివిజన్–1 కౌంటీ చాంపియన్షిప్లో హాంప్షైర్ క్రికెట్ క్లబ్కు తిలక్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బుధవారం తెలిపింది. "యూకే కౌంటీ ఛాంపియన్షిప్ లీగ్లో ఆడేందుకు హాంప్షైర్ కౌంటీ జట్టుతో హైదరాబాద్ ఆటగాడు ఎన్ ఠాకూర్ తిలక్ వర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని" హెచ్సీఎ ఓ ప్రకటనలో పేర్కొంది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. 22 ఏళ్ల తిలక్ వర్మ జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు హాంప్షైర్ క్రికెట్ క్లబ్కు అందుబాటులో ఉండనున్నాడు.ఆ సమయంలో ఎడమచేతి వాటం బ్యాటర్ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లు సదరు క్లబ్ తరపున ఆడనున్నాడు. అయితే తిలక్ వైట్బాల్ గేమ్స్లో ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీ జరుగుతోంది.ఇక ఇప్పటివరకు 18 ఫస్ట్ క్లాస్లు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ.. 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ఈ హైదరాబాదీ భారత జట్టుకు వైట్-బాల్ స్పెషలిస్టుగా ఉన్నాడు. నాలుగు వన్డేలు, 25 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా అతడికి టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. 24 ఇన్నింగ్స్లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ సైతం యార్క్షైర్ క్లబ్ తరపున కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. -
యూట్యూబ్లో డబ్బులు పెట్టి వ్యూస్ కొనొద్దని చెప్పా: దిల్ రాజు
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కెరీర్లోనే అధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (Thammudu Movie). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ లయ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్కు అక్కగా నటించింది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాష్, శిరీష్ నిర్మించారు. తమ్ముడు ట్రైలర్ను బుధవారం (జూన్ 11న) రిలీజ్ చేశారు.ఈరోజు చెప్పేస్తా..ఈ సందర్భంగా దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆ విషయం చెప్పి తీరతాను. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆ వీడియో కింద కనిపించే నెంబర్లన్నీ ఒరిజినల్. ప్రేక్షకులు చూసిన నెంబర్లే అక్కడ కనిపించాలని మా ఆఫీసులో నా పీఆర్ టీమ్తో సహా అందరికీ చెప్పాను. డబ్బులు ఖర్చు చేసి మరీ మిలియన్ల వ్యూస్ కొనొద్దని సూచించాను. ఎలా తెలుస్తుంది?ఎందుకంటే ఒరిజినల్గా మన పాట, ట్రైలర్.. ఏదైనా సరే, జనాల్లోకి ఎంతగా రీచ్ అవుతుందనేది మనకు అర్థం కావాలి. అప్పుడే మన మూవీ ప్రజలకు ఏమేరకు రీచ్ అవుతుందని ఓ అంచనాకు రాగలం. మనం కొనుక్కుంటే వ్యూస్ నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి. కానీ, అది ప్రేక్షకుడికి చేరిందా? లేదా? అనేది తెలియడం లేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జూలై 4న రిలీజ్ చేస్తున్నారు.చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్బస్టర్ వార్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.🎙️ Jr NTR begins dubbing for #WAR2.The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025 -
పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్
సాక్షి,విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ లభించింది. పీఎస్ఆర్కు జిల్లా అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హై బీపీ,గుండె సమస్యలతో బాధపడుతున్న పీఎస్ఆర్.. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన కోర్టు పీఎస్ఆర్ మెడికల్ రిపోర్ట్ను అందించాలని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పలు వైద్య చికిత్సలు చేశారు. అనంతరం రిపోర్టులను కోర్టుకు అందించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన కోర్టు అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు పీఎస్ఆర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.కాగా, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్న పీఎస్ఆర్ను మెరుగైన వైద్యం కోసం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు. -
జగన్ను జనంలో తిరగనివ్వకూడదనే బాబు సర్కార్ టార్గెట్: వైఎస్సార్సీపీ
సాక్షి, ఒంగోలు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు కిరాయి మనుషులతో రాక్షసంగా వైఎస్ జగన్ కాన్వాయిపై రాళ్ళు రువ్వి, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాలని ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు.జెడ్ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడి పర్యటన సందర్భంగా కాన్వాయికి అతి సమీపంలోకి అరాచకశక్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ప్రజల్లోకి తిరగనివ్వకూడదనే ఏకైక ఎజెండాతో కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకానికైనా తెగబడుతోందని అన్నారు. ఎంతగా కవ్వించినా వైఎస్ జగన్, పార్టీ శ్రేణులు ధైర్యంగా రైతుల పక్షాన నిలబడ్డారని, పొగాకు కొనుగోళ్ళపై సర్కార్ అలసత్వాన్ని నిలదీశారని అన్నారు. ఇంకా వారు ఎమన్నారంటే.పొగాకు రైతుకు భరోసా కల్పించారు: ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిమాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వంను నిలదీశారు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందనే భరోసా కల్పించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు వైఎస్ జగన్. అందుకే ఆయన సీఎం అయిన తరువాత రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటుధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం తరుఫున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు.పొగాకు రైతులకు అండగా ఉంటేందుకు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే, టీడీపీ మహిళలను అడ్డం పెట్టకుని ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. చెప్పులు, రాళ్ళు విసిరి అరాచకం సృష్టించేందుకు తెగబడ్డారు. రైతుల కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా టీడీపీ కుట్రకు పాల్పడింది. ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ తరువాత మహిళలకు అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్.రాష్ట్రంలో ఆయన పాలనలో మహిళలకే అధికశాతం పథకాలను అమలు చేశారు. ఈ రోజు తన ర్యాలీలో కూడా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ మహిళలకు నమస్కారం చెస్తూ వెళ్ళిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ వస్తున్నారనే విషయం, ఆయన పర్యటన గురించి ముందుగానే తెలిసి, ఆయన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా విఫలం చేయాలనే దుష్టతలంపుతోనే టీడీపీ ఈ రకంగా మహిళల ముసుగులో దిగజారుడు రాజకీయం చేసింది. పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి, రాళ్లు రువ్వడం ద్వారా భయాందోళనలకు గురి చేసిందని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు.మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో కుట్ర: మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపొగాకు కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు రేటు కల్పించాలని, ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయితే వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల నిరసనల పేరుతో రాళ్ళు రువ్వుతూ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ రాళ్ళ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఏదైనా నిరసనలు చేయాలంటే ప్రజాస్వామిక విధానాల్లో, శాంతియుత పద్దతుల్లో నిర్వహించాలే తప్ప ఈ రకంగా రైతుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత పర్యటనపై రాళ్ళ దాడి చేయడం దారుణం. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టి, ఇటువంటి అరాచకానికి ప్రోత్సహించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయన పొదిలిలో ఎందుకు తిరిగాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.టీడీపీ నేతలు సిగ్గుపడాలి: చుండూరి రవికిరాయి మనుషులతో తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ పర్యటనపై రాళ్ళు రువ్వించారు. ఒక మంచి సమస్యపై లక్షలాది మంది రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ జిల్లాకు వస్తే, దానిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్ముక్కు అవ్వడం వల్లే పొగాకు కు గిట్టుబాటు రేటు రావడం లేదు. ఇటువంటి దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తే సమాజంలో అరాచకం మరింత పెరుగుతుందని చుండూరి రవి అన్నారు. -
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఏజెంట్లకు షాక్..దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం -
బిగ్బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.ఆ నెలలో షురూ..ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. సంప్రదింపులు- చర్చ దశల్లోనే..కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు. పార్టిసిపెంట్లు వీళ్లేనా?అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్ -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మైదానంలో ఎంతో యాక్టివ్గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు వరకైనా కొనసాగాలని విరాట్ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం -
‘డైవర్షన్ పాలిటిక్స్కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్కి తెగబడ్డారు. వారి దిగజారుడు రాజకీయాలకు మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. మహిళల నిరసన పేరిట సాక్షి కార్యాలయాలను టార్గెట్ చేసుకుని గడిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు టీడీపీ కుట్ర చేసింది.మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం, రక్షణ కల్పించడం వంటివి చేయకపోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయడం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాలయం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మహిళా కార్యకర్తలను పంపించి, వారి వెనుక టీడీపీ కార్యకర్తలను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదుసాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. చంద్రబాబులా మహిళల గురించి ఏనాడైనా వైఎస్ జగన్ చులకనగా మాట్లాడటం జరిగిందా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల పుట్టుకనే అవమానించేలా మాట్లాడిందే చంద్రబాబు. దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మహిళలకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలతో అండగా నిలిస్తే, చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు మహిళలను వాడుకుంటున్నాడు.ఈ ప్రభుత్వంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఎంతోకాలం ప్రభుత్వాన్ని నడపలేరు. ఇలాంటి కుట్రలు, వక్రీకరణలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలి. కూటమి మోసపు హామీలు నమ్మి మోసపోయామని ఇప్పటికే మహిళలు ఆందోళనగా ఉన్నారు. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్లో యే హై మొహబ్బతేన్ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించింది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మే 21న బికనీర్ పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. చివరి నిమిషంలో గందరగోళాన్ని తగ్గించడానికి ముందుగానే చార్ట్ ను సిద్ధం చేయాలని స్థానిక రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి 2.3 గంటల నుండి 4 గంటల ముందు మాత్రమే తుది చార్ట్ తయారు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంది.👉ఇదీ చదవండి: తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరితుది చార్ట్ను 24 గంటల ముందే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు మంత్రి వెంటనే ఆమోదం తెలపడంతో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బికనీర్ డివిజన్లో జూన్ 6 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రయాణికులు మెరుగైన స్పష్టతను చూశారు. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. బికనీర్ ట్రయల్ విజయవంతమైన తరువాత, భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని ఇతర అధిక ట్రాఫిక్ మార్గాలకు విస్తరించాలని యోచిస్తోంది. -
సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ బోధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేలా తెలంగాణ విద్యాశాఖ అనుమతులిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రీప్రైమరి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా
ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.👉ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనంస్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by The Wedding Anchor Junaid Arif Currimbhoy (@theweddinganchor) -
ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో సెన్సేషన్ సృష్టించిన అవికా గోర్ (Avika Gor) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సంతోషంతో అరిచేశా..ఈ సందర్భంగా అవికా.. 'ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.కన్నీళ్లు..ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'బ్రో', 'షణ్ముఖ' ఇలా అనేక సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) చదవండి: మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి -
విజయ్ మాల్యా 4 గంటల ఇంటర్వ్యూ.. 'సోషల్' హల్చల్
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ లైమ్ లైటులోకి వచ్చారు. మాల్యాపై సోషల్ మీడియా మీడియాలో తాజాగా చర్చోప చర్చలు నడుస్తున్నాయి. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ రాజ్ షమానీ (Raj Shamani)కి ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ముఖాముఖిలో చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వరకు అన్ని విషయాలు మాట్లాడారు. పాలకులు తనను బలిపశువును చేశారన్నట్టుగా మాల్యా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నాయని పరోక్షంగా ఎత్తిచూపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను ఆసక్తి చూపించినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించానని, అయినా తనను ఎగవేతదారుడిగా ముద్ర వేశారని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో స్వదేశానికి దూరమయ్యానని చెప్పారు. తనపై మోపిన అభియోగాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతామని భారత ప్రభుత్వం హామీయిస్తే స్వదేశానికి తిరిగి వస్తానని అన్నారు. మరోవైపు మాల్యా మాటలకు బ్యాంకులు కూడా దీటుగానే స్పందించాయి. మాల్యా తీసుకున్న రుణాలు, వడ్డీల లెక్కలతో ఆయనకు బదులిచ్చాయి.కాగా, విజయ్ మాల్యా వీడియోకు 4 రోజుల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై ఎక్స్లో మాల్యా స్పందిస్తూ.. తన హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. 'ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పడం, నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. @rajshamani తో నా 4 గంటల పాడ్కాస్ట్ చూడటానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 4 రోజుల్లో ఒక్క YouTubeలోనే 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో ఆ దేవుడికే తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక' అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను మాత్రం కాదువిజయ్ మాల్యా ఇంటర్వ్యూపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాల్యాకు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన అబద్దాలు చెప్పారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోణాన్ని బయటపెట్టిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మంది మీమ్స్, వీడియోలతో సైటర్లు పేలుస్తూ హాస్యచతురత ప్రదర్శిస్తున్నారు.Indians after watching Vijay Mallya's podcast#VijayMallya विजय माल्या 🙂 pic.twitter.com/NVyDWLPC5N— Sourabh (@vellasrv) June 7, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025 -
'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025 -
ఆసీస్ స్టార్ ఓపెనర్ అత్యంత చెత్త రికార్డు.. బుమ్రా సరసన
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే ఖవాజా పెవిలియన్కు చేరాడు. మార్నస్ లబుషేన్తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఖవాజా.. ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా స్పీడ్స్టార్ కగిసో రబాడ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఖవాజా ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో డకౌటైన ఖవాజా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక డకౌటైన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా, తిలకరత్నే దిల్షాన్, మెకల్లమ్ సరసన నిలిచాడు.బుమ్రా, దిలాన్ష్, మెకల్లమ్ ఐసీసీ ఈవెంట్ల ఫైనల్లో రెండు సార్లు డకౌట్ కాగా.. ఖవాజా సైతం సరిగ్గా రెండు సార్లు ఎటువంటి పరుగులు చేయకుండా ఔటయ్యాడు. కాగా ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో కూడా ఖవాజా డకౌటయ్యాడు.ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్లు వీరే..జస్ప్రీత్ బుమ్రా - 2తిలకరత్నే దిల్షాన్ - 2ఉస్మాన్ ఖవాజా - 2బ్రెండన్ మెకల్లమ్ - 2మొయిన్ అలీ - 1కష్టాల్లో ఆసీస్..కాగా ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్లకు సఫారీ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి కంగారులు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఇప్పటివరకు రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనంKagiso Rabada delivers big time for South Africa with two wickets in an over 🔥Catch the action live on our official broadcasters here ➡ https://t.co/oas2Rsdptj#Cricket #CricketReels #WTC25 pic.twitter.com/I9vOR8nCup— ICC (@ICC) June 11, 2025 -
తెలంగాణ హైకోర్టులో గ్రూప్1పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో గ్రూప్1పై తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా పడింది. గ్రూప్1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటీషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్) చేయాలని లేదా మరోసారి మెయిన్స్ నిర్వహించాలన్న పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే, అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని... నిపుణులతో మెయిన్స్ పత్రాలు మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
సంధ్య థియేటర్లో పాముల కలకలం.. వీడియో వైరల్
సంధ్య థియేటర్.. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది. వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పాముల కలకలంఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 -
ప్రేమ లోతును చూపించింది.. వైరలవుతోంది.. సిద్ శ్రీరామ్ పాట
సాక్షి, సిటీబ్యూరో: తన స్వరంలో ఏదో మాయ ఉంటుంది, ఆ గళంలో ప్రతి నాదం మనసును మెలిపెట్టేస్తుంది. ఆ స్వర మాధూర్యం మరెవరో కాదు.. సిద్ శ్రీరామ్. ఆయన స్వర సందడిలో భాగంగా సరికొత్త గీతం ‘కన్నె’లో మాటలకందని భావాలను పలికించారు. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్ చేసి, పాడానని తెలిపారు. ఒక ప్రేమ గీతంగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం వైరల్గా మారింది. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటను వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్లో భక్తిగీతం ‘శివనార్’ విడుదల తనంతరం ఈ పాట కూడా భారతీయ భాషల్లో ఉన్న సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా అలరిస్తోంది. చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్ View this post on Instagram A post shared by Sid Sriram (@sidsriram)ప్రేమ లోతును చూపిస్తుంది.. ఈ పాట ప్రజల హృదయాలను తాకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్నర్ మ్యూజిక్ ఇండియాతో ఇది నా రెండో రెండో పాట. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న పాట. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కలిగే మార్పులను, భావోద్వేగాలను ఈ పాట గుర్తుకుతెస్తుంది. గతంలో ‘శ్రీవల్లి’ (పుష్ప : ది రైజ్), ‘కుంకుమాలా’ (బ్రహ్మాస్త్ర), ‘అదియే’ (కదల్), ‘కన్నానా కన్నే’ (విశ్వాసం) హిట్ సాంగ్స్ వరుసలో ఈ ఏడాది మరి కొన్ని రానున్నాయి. గతేడాది ప్రపంచ ప్రఖ్యాత కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణ భారతీయ కళాకారుడిగా నిలవడం సంతోషాన్నిచ్చింది. – సిద్ శ్రీరామ్. ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ -
Lalu: అట్లుంటది మరి లాలూతోని!
పాట్నా: తాను చేసే ఏ పనిలోనైనా వైవిధ్యం వెతుక్కునే వ్యక్తి ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనకు తగ్గట్లే ఆయన అభిమాన గణం ఉంటుంది కూడా!. ఇవాళ 78వ పుట్టిరోజు. కార్యకర్తల కోలాహలం.. లాలూ యాదవ్ జిందాబాద్ నినాదాల నడుమ తన నివాసంలో 78 కేజీల లడ్డూను తల్వార్తో కోశారాయన.లాలూ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమది రాజకీయేతర సంబంధం కూడా అని పేర్కొన్నారు. Video | RJD chief Lalu Prasad Yadav celebrates 78th birthday at his residence in Patna by cutting a 78-kg laddu cake with a sword. Large number of party workers gathered to extend wishes. pic.twitter.com/1ZIhrQuv9g— NDTV (@ndtv) June 11, 2025VIDEO Source: NDTVమరోవైపు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వైవిధ్యంగా శుభాకాంక్షలు తెలియజేశారు. లాలూ చిత్రాన్ని కౌగిలించుకుని ‘‘రాత్రి చిమ్మచీకట్లు అలుముకున్నాయంటే.. కాసేపట్లో తెల్లవారబోతోందని అర్థం’’ అంటూ ఓ సందేశం ఉంచారు. “अंधेरा जितना गहरा होगा, सुबह उतनी ही नजदीक होगी।” #TejPratapYadav #Bihar #India pic.twitter.com/gAdlvZFtlb— Tej Pratap Yadav (@TejYadav14) June 9, 2025తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఓ యువతితో ఉన్న ఓ పోస్ట్ చేసి పెను దుమారం రేపారు. పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యల కింద ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. అయితే తన అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ఆయన ఇచ్చుకున్న వివరణలను లాలూ పరిగణనలోకి తీసుకోలేదు. -
రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన ఉపాసనా
హైదరాబాద్: హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై కొన్ని అపోహలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రచారం ముమ్మరంగా చేస్తారు.మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు చేరుకునే విధంగా దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు. నిర్మాణాత్మక సమాజ భాగస్వామ్యం, ఆరోగ్య ముప్పు అంచనాలతో శిక్షణ పొందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అపోలో ఫౌండేషన్ అమలు చేస్తోంది. ఆరోగ్యంపై అవగాహన కలిగిన సమాజాన్ని నిర్మించడంలో ఫ్యూజిఫిల్మ్ ఇండియా నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.భారతీయ మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. ఐసీఎంఆర్ వారి జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో 14% ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు, తగినంత అవగాహన లేకపోవడం, అపోహలు, సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకే ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.స్థానిక స్థాయిలో నమ్మదగిన, సాంస్కృతికంగా సున్నితమైన సమాచారాన్ని అందించేలా ఇది ఉంటుంది. గౌరవప్రదమైన బహిరంగ చర్చలు, వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహించి, మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేలా ఇది చూస్తుంది. తద్వారా వారు తమ లక్షణాలను త్వరగా గుర్తించి, స్వీయ పరీక్షల ద్వారా అర్థం చేసుకుని, సరైన సమయానికి చికిత్సలు పొందేలా చూస్తారు.ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కొణిదెల మాట్లాడుతూ, “వైద్యరంగంలో అగ్రగాములుగా ఉన్న మాకు.. కేవలం అనారోగ్యాలకు చికిత్స చేయడమే కాక.. ముందుగా గుర్తించాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తగిన సమాచారం లేకపోవడం, త్వరగా చికిత్స పొందడానికి వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. ఈ వాస్తవాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు ఫ్యూజిఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఆలస్యం కాకముందే మహిళలకు తగిన అవగాహన కల్పించడానికి, అవసరమైన చోట అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని చెప్పారు.ఫ్యూజిఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా మాట్లాడుతూ, “ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు ఇవ్వాలన్న మా గ్రూప్ లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎప్పుడూ వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తుంటుంది. విభిన్నమైన ఆలోచనలు, సామర్థ్యాలు, అసాధారణ వ్యక్తుల సాయాన్ని కలపడం ద్వారా ఈ ప్రపంచానికి సంతోషం, నవ్వులు అందించే పరిష్కారాలను సృష్టించడమే మా లక్ష్యం. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించే ఈ ప్రచారంతో మహిళలకు తగిన అవగాహన కల్పించి, ఈ వ్యాధిని త్వరగా గుర్తించి, వీలైనన్ని ప్రాణాలను కాపాడాలన్నదే మా లక్ష్యం” అని వివరించారు.తన సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా ఫ్యూజిఫిల్మ్ ఇండియా సంస్థ ఆరోగ్య సంరక్షణను అందరికీ మరింత అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ఇవి అందనివారికి అందించడం, త్వరగా గుర్తించడం, అవగాహన ద్వారా దాన్ని నివారించే చర్యలు చేపట్టడం కూడా ఇందులో భాగమే. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ప్రచారం.. ఫ్యూజిఫిల్మ్ గ్రూప్ సస్టెయినబుల్ వాల్యూ 2030 ప్రణాళికకు అనుగుణంగా ఉంది.వైద్యం అందరికీ సమానంగా అందాలని, ఇప్పటివరకు అందనివారికి అందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ప్రభావం బాగా అవసరమైన చోట సేవలు అందించడం ద్వారా ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు అందించడాలన్న కంపెనీ గ్రూప్ లక్ష్యాన్ని ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది. అది ఒక మారుమూల పట్టణమైనా, జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరమైనా.. ప్రతి మహిళకూ తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు, దాన్ని రక్షించుకోవడానికి తగిన అవకాశం ఉండాలని ఫ్యూజిఫిల్మ్ ఇండియా భావిస్తుంది. -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి
ఫోక్ సాంగ్స్తో ప్రజాదరణ పొందిన సింగర్ మంగ్లీ (Singer Mangli) పేరు తాజాగా వార్తల్లో మార్మోగుతోంది. జూన్ 10న తన బర్త్డేను పురస్కరించుకుని చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ విదేశీ మద్యంతోపాటు గంజాయి సరఫరా జరిగిందన్న పక్కా సమాచారంతో పోలీసులు రిసార్ట్పై దాడులు జరిపారు. పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు జరపగా 9 మందికి గంజాయి పాజిటివ్గా తేలింది.తప్పు చేసుంటే..ఈ బర్త్డే పార్టీకి బిగ్బాస్ బ్యూటీ, నటి దివి వైద్య (Divi Vadthya) హాజరైంది. దీంతో ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై దివి స్పందించింది. ఫ్రెండ్ బర్త్డే అని పిలిస్తే వెళ్లాను. కానీ, అక్కడ జరిగిన పొరపాట్లను నాపైన తోయడం సరికాదు. నేను నిజంగా తప్పు చేసుంటే, ఆ మేరకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నా ఫోటో వేయండి. కానీ ఏ సాక్ష్యం లేకుండా నా ఫోటో వాడి నన్ను నెగెటివ్ చేస్తుంటే కెరీర్కు ఎంత ఇబ్బంది అవుతుంది?ఫ్రెండ్ అని వెళ్లా..ఎంతో కష్టపడి ఇంతదూరం వచ్చాను. ఫ్రెండ్ బర్త్డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఫోటో వేస్తున్నారు. మీ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫోటోలు వాడకండి. నాకు ఇబ్బంది అవుతుంది అని ఓ ఆడియో రిలీజ్ చేసింది. అటు ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనూ హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది? అని ఆవేదన వ్యక్తం చేసింది. మంగ్లీ బర్త్డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని దివి స్పష్టం చేసింది.చదవండి: ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి -
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్రెడ్డి అన్నారు.మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు...కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. -
టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.భారత్తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఎడ్జీ జాక్స్కు ఇంగ్లండ్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జోష్ టాంగ్ గాయపడడంతో ప్రత్యామ్నయంగా జాక్స్ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్ల అనాధికారిక సిరీస్లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాలుగు ఇన్నింగ్స్లలో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ తన కెరీర్లో ఇప్పటివరకు కేవలం రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడినవే.వోక్స్పైనే భారం..కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా మార్క్వుడ్, ఓలీ స్టోన్ ఈ సిరీస్కు దూరం కాగా.. అటిన్కిసన్, ఆర్చర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేరడం ఇంగ్లీష్ జట్టు మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయనున్నాడు. వోక్స్, కార్స్, సామ్ కుక్ ఫ్రంట్లైన్ సీమర్లగా ఉన్నారు.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్చదవండి: WTC Final: కోహ్లి ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్ -
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు. -
అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ సారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. "అబ్బా, ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్" అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" అ " చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి పిల్లవాడికి అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం. -
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025 -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి. -
గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు.. ఆలయాన్ని కూల్చివేశారు. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని రాత్రి రాత్రే నేలమట్టం చేసిన టీడీపీ నేతలు.. ఆలయ ఆనవాళ్లు లేకుండా స్వర్ణముఖి నదిలో కలిపేశారు. అనంతరం.. టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆలయ భూమిని కబ్జా చేసేశారు. గుడి ఆనవాళ్లను హిందూ సంఘాలు.. స్వర్ణముఖి నది నుంచి బయటకు తీశాయి. హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు.. విగ్రహాన్ని తీసుకుపోయారు. టీడీపీ నేత కిశోర్రెడ్డి, పోలీసులు తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. -
ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్లో ప్రసారమవుతోంది.హాస్పిటల్లో చేదు అనుభవంతాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది. రచ్చ చేయాలనుకోలే..నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్రూమ్కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్ -
ఉద్యోగులు ఆఫీస్కు రాకపోతే.. గూగుల్ కొత్త ఎత్తుగడ
ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్గూగుల్ తాజా ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది. -
కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్.. ఆ స్టార్ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.అయితే ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్తో ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw— Naga Vamsi (@vamsi84) June 11, 2025 My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd— Naga Vamsi (@vamsi84) June 11, 2025 -
Latte లాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. ఏమిటీ ‘ చిత్రం’
పొగలు కక్కే కాఫీ కావాలని అడిగేవారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కళ కళ లాడే కాఫీ కావాలని అడిగేవారు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. శతాబ్దాలుగా పానీయాల ప్రియుల్ని అలరిస్తున్న కాఫీ ఇప్పుడు కళాభిమానులనూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కళ కూడా శతాబ్దాల నాటిదేనని ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాల్లో 17వ శతాబ్దం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. చల్లని సాయంత్రాల్లో చేతికి అందే ఒక కప్పు కాఫీ మనల్ని రీఛార్జ్ చేస్తుంది. అదే కాఫీ నగరంలోని కొందరి చేతుల్లో నుంచి అద్భుత కళలను ఆవిష్కరిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో Latte Coffe చిత్రకారులు కాఫీపొడి, డికాక్షన్ వగైరాలతో పోట్రెయిట్స్, వన్యప్రాణుల చిత్రాలు, ల్యాండ్ స్కేప్లు, ఆబ్స్ట్రాక్ట్స్.. సృష్టిస్తున్నారు. ఆర్గానిక్ కలర్ ఉపయోగించడం కాఫీ ఆర్ట్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ సేంద్రీయ లేత, ముదురు బ్రౌన్ కలర్ ఆధారిత షేడ్స్ నుంచి పుట్టే చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కాఫీని రంగులా మార్చుకుని బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి చిత్రాలు గీస్తారు. ఇవి వైవిధ్యంగా, అనేక సంవత్సరాల పాటు నిలిచిపోయేలా ఉంటాయి. సోషల్ మీడియా ప్రచారం.. మన దేశంలో ఈ కళ కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా బాగా విస్తరిస్తోంది. యువ కళాకారులు తమ ఇన్స్టా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కాఫీ ఆర్ట్ ప్రదర్శిస్తూ ప్రాచుర్యం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో.. కాఫీతో పోట్రెయిట్స్ ఆవిష్కరించడం ద్వారా తమిళనాడుకు చెందిన ధనంజయన్ కాఫీ ఆర్ట్ ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలను రూపుదిద్దుతూ కర్ణాటక వాసి కవిత దివాకర్, అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా పటేల్ తన వీడియోల ద్వారా కాఫీ ఆర్ట్కు చిరునామాగా మారారు. నేను ఆర్కిటెక్ట్ని. డిగ్రీ మొదటి రోజుల్లో కొన్ని ప్రాథమిక చిత్రకళల పాఠాలు మాత్రమే నేర్పించేవారు. కానీ చిత్రకళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఎప్పటి నుంచో కాఫీ ప్రియురాలిని. ఒక ఆర్కిటెక్ట్గా నన్ను నన్నుగా గుర్తు చేసే రంగు నలుపు. ఒకే ఒక్క రంగుతో అలసిపోకుండా ప్రయాణం కొనసాగించడం పెద్ద సవాలు అనిపించి ఇంకో కలర్గా కాఫీని ఎంచుకున్నా. ఇది వాటర్ బేస్డ్ కావడం, నాకు వాటర్ కలర్ పెయింటింగ్లో ఆసక్తి ఉండడం బెస్ట్ ఛాయిస్ అయ్యింది. పెయింటింగ్ వేస్తున్నప్పుడు గుబాళించే కాఫీ పరిమళం, అది అందించే ఆశక్తి, ఆ ఉల్లాసం..అద్భుతం. ప్రారంభంలో నేను సాధారణ కాఫీ పెయింటింగ్తో మొదలుపెట్టాను. చిన్న చిన్న హైలైట్ కోసం వాటర్ కలర్స్ కూడా కాఫీ పెయింటింగ్స్కి జోడించా. ఇటీవల పెయింటింగ్స్కి కాఫీతో బ్యాక్గ్రౌండ్ వేస్తూ, ఆపై వేరే రంగులతో పెయింట్ చేస్తున్నా. దీని వల్ల వింటేజ్ లుక్ వస్తుంది. ఈ ప్రయాణంలో హ్యారీ పోటర్ నేపథ్యంలో వేసిన పెయింటింగ్ చూసి హ్యారీ పోటర్ టీం నన్ను అభినందించింది. అంతేకాకుండా ఆ వీడియోను వారి అధికారిక ఇన్స్టా పేజ్లో షేర్ చేశారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. – జ్యోత్స్న మైథిలీ రెడ్డి, కాఫీ ఆర్టిస్ట్ నగరంలోనూ సందడి.. నగరంలోని జూబ్లీహిల్స్లో ఉన్న ఆర్ట్ హౌస్ ప్రత్యేకంగా కాఫీ ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తున్న ఆర్ట్ స్టూడియోగా పేరొందింది. అలాగే నల్లగండ్లలోని కవి ఆర్ట్ స్టూడియో, గచి్చ»ౌలిలోని థర్డ్ వేవ్ కేఫ్, జూబ్లీహిల్స్లోని మాక్రో బ్రూ వరల్డ్ కాఫీ బార్, బంజారాహిల్స్లోని లాట్టే ఆర్ట్ కెఫేలో కాఫీ ఆర్ట్ వర్క్షాప్ల నిర్వహించడంతో పాటు కాఫీతో తయారు చేసిన పెయింటింగ్లను కూడా ప్రదర్శిస్తున్నాయి. జూబ్లీహిల్స్లోని లైజురే ఆర్ట్ కేఫ్ కాన్వాస్, క్రేవింగ్స్, కెఫైన్ కాన్సెప్్టతో అతిథులను ఆకట్టుకుంటోంది. ఫిల్మ్ నగర్లోని బాగ్ బీన్స్ కాఫీ అండ్ ఆర్ట్లో కాఫీ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయంలాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. కాఫీని రంగుగా వినియోగించే ఆర్ట్ ఒకెత్తయితే, కాఫీ కప్పులో భిన్న రూపాలు చిత్రించే కళను లాట్టే ఆర్ట్గా పేర్కొంటారు. ఇది చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే దీన్ని గతంలో కాఫీ షాప్స్లో పనిచేసే సిబ్బంది, కాఫీ మేకర్స్ ఎక్కువగా సాధన చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో దీనిపై నగర యువత కూడా ఆసక్తి చూపుతోంది. దీంతో కాఫీ ఆర్ట్ అంత కాకపోయినా అడపాదడపా లాట్టే ఆర్ట్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి. నగరానికి చెందిన యువ చిత్రకారుడు సాయి అఖిల్ గౌడ్, రాధాకృష్ణ వంటివారు ఈ లాట్టే ఆర్ట్కు పేరొందారు. మరింత చేరువగా... దాదాపు నగరంలో పేరున్న కేఫ్స్ అన్నీ చిత్రకళకు పెద్ద పీట వేస్తున్న పరిస్థితులు, అలాగే తరచూ జరుగుతున్న కాఫీ ఫెస్టివల్స్ వంటి ఈవెంట్స్ వల్ల నగరవాసులకు కాఫీ ఆర్ట్ మరింత చేరువ అవుతోంది. విభిన్న రకాలుగా యువతలో క్రియేటివిటీకి వేదికవుతోన్న ఈ కాఫీ ఆర్ట్ ప్రపంచస్థాయి కాఫీ ఆర్టిస్టులను నగరానికి అందించినా ఆశ్చర్యం లేదు. (పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!) -
లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
Jasmit Singh Arora మామిడి మొక్కలు ఉచితం!
మామిడి సీజన్లో బోలెడన్ని మామిడి విత్తనాలు కనిపిస్తాయి. అయితే, వాటిని వృథాగా పోనీయకుండా రైతులకు ఉపయోగపడేలా సద్వినియోగం చేద్దామని కోల్కత్తా నగరానికి చెందిన డాక్టర్ జస్మిత్ సింగ్ అరోరా (Jasmit Singh Arora) నిర్ణయించుకొని ఆ దిశగా స్ఫూర్తిదాయక కృషి చేస్తున్నారు. నష్టదాయకంగా మారిన వరి వంటి పంటలను ఏటేటా రసాయనిక పద్ధతుల్లో పండించి నష్టపోతున్న రైతులు దీర్ఘకాలిక పండ్ల తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకుంటే జీవితం బాగుపడుతుందని ఆయన సూచిస్తున్నారు. చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయండా. అరోరా వైద్యవృత్తి నిపుణుడు అయినప్పటికీ వ్యాపారవేత్తగా మారారు. ఐటి, ఫార్మా రంగాల్లో మూడు దశాబ్దాలుగా కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. ‘గుట్లి మాన్ ఆఫ్ ఇండియా’ (Gutli Man of India) గా పేరుగాంచారు. ఎంత ఎదిగినా మనసులో ఏదో వెలితి. ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగపడే పనులు చేస్తే ఈ వెలితి తీరుతుందని భావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ వృద్ధ రైతులు దశాబ్దాలుగా వరి సాగు చేస్తూ నానా బాధలు పడుతుండటం గమనించారు. వరి సాగుతో చాలీ చాలని ఆదాయంతో యాతన పడేకన్నా పండ్ల సాగు చేపడితే రైతుల భవిష్యత్తు బాగుంటుందని భావించారు. ఇదీ చదవండి: పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!2019 నుంచి అనేక రకాల పండ్ల మొక్కలు పెంచి రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. ఆ క్రమంలో ఎక్కువ ఆదాయం వచ్చే మామిడి మొక్కలను పెంచి, రైతులకు పంచిపెట్టాలని గత ఏడాది తలపెట్టారు. మామిడి పండ్లు తింటున్నారా అయితే విత్తనాలు మాకివ్వండి అని కోరుతూ గత ఏడాది అతని కుమార్తె ఒక వీడియో చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆ వీడియో వైరల్ అయ్యింది. అనూహ్యమైన ఒక అద్భుతమే జరిగింది. దేశం నలుమూలల నుంచి ఏకంగా 11 లక్షల విత్తనాలు వచ్చిపడ్డాయి! ఆ దెబ్బకు ఆయనకు ‘గుట్లిస్ మాన్’ అని పేరు పడిపోయింది. గుట్లిస్ అంటే మామిడి విత్తనాలు అని అర్థం. ఈ విత్తనాలతో నాలుగైదు అడుగుల చెట్లు పెంచి, లంగ్డ లేదా గులాబ్ ఖాస్ వంటి రకాలతో గ్రాఫ్టింగ్ చేసి రైతులకు పంచుతాను అంటున్నారు డా. జస్మిత్ సింగ్ అరోరా. -
యువతకు సత్య నాదెళ్ల సూచన
కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బేసిక్స్పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్ డెవలప్మెంట్కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?సుందర్ పిచాయ్ కూడా అదే బాటలో..లెక్స్ ఫ్రిడ్మన్తో గతంలో జరిగిన పాడ్కాస్ట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్ కోడింగ్ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్ తెలిపారు. -
‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పారు’?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్పై ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ బృందం ప్రభాకర్ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం. -
India vs Aus 5th test: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికా
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికాసౌతాఫ్రికా బ్యాటర్లు సైతం తొలి ఇన్నింగ్స్లో తడబడుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(3) , బెడింగ్టన్(8) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా జోష్ హేజిల్వుడ్, పాట్ కమిన్స్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా స్పీడ్స్టార్ కగిసో రబాడ 5 వికెట్లతో చెలరేగాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో వెబ్స్టెర్(72) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో రబాడతో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు.ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన వెబ్స్టెర్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 55 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 210/8ఆసీస్ ఏడో వికెట్ డౌన్199 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రబాడ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అంతకుముందు అలెక్స్ క్యారీ(23).. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. స్మిత్ ఔట్స్టీవ్ స్మిత్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన స్మిత్.. మార్క్రమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 44 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో వెబ్స్టెర్(48), అలెక్స్ క్యారీ(1) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న స్మిత్, వెబ్స్టెర్31 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(45), వెబ్స్టెర్(8) ఆచితూచి ఆడుతున్నారు.పంజా విసురుతున్న ప్రోటీస్ పేసర్లు..ట్రావిస్ హెడ్ రూపంలో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన హెడ్.. మార్కో జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 23.2 ఓవర్లలో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(26) ఉన్నాడు. ప్రోటీస్ బౌలర్లలో రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావెస్ హెడ్ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్ఆచితూచి ఆడుతున్న స్మిత్, లబుషేన్..ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును సీనియర్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(17), లబుషేన్(17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.రబాడ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్స్టార్ కగిసో రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. 7వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్లో ఉస్మాన్ ఖావాజా(0), గ్రీన్(4) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(10), స్మిత్(0) ఉన్నారు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టులోకి కామెరూన్ గ్రీన్ తిరిగి రాగా.. సౌతాఫ్రికా టెస్టు టీమ్లోకి పేసర్ లుంగీ ఎంగిడీ పునరాగమనం చేశాడు.ప్రోటీస్ జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఆసీస్కు రెండో ఫైనల్. ఈ ఆఖరి పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని సఫారీలు భావిస్తుంటే, కంగూరులు మాత్రం మరో ఐసీసీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే చోకర్స్గా పేరొందిన దక్షిణాఫ్రికా, పటిష్టమైన ఆసీస్ను ఓడించడం అంతసులువు కాదు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.చదవండి: శ్రేయస్ అయ్యర్ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ -
ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణం.. రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారింది. నిన్న గుడివాడలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కైకలూరు, మచిలీపట్టణం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లె 5 సెంటీమీటర్ల, లేపాక్షి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.