-
పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..!
టాలీవుడ్ జంట విజయ్- రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్లాండ్ ట్రిప్లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లి తర్వాత మేమిద్దరంం రెండు రోజుల పాటు వేకేషన్కు వెళ్లామని తెలిపింది. ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్లోని ప్రాంతం మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది. ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నా నవ్వు బాగుందని ఆ పాత్ర చేయమన్నారు.. కానీ
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగులోనూ అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రతిసారి.. వీళ్లు తప్పితే మరెవరు నటించినా అస్సలు సూట్ కాదు కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ ఒకటి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రకాశ్ రాజ్, రేలంగి మామయ్యగా జీవించేశాడు. ఇప్పటికే ఎవరైనా నవ్వుతూ ఉంటే సరదాగా రేలంగి మామయ్య అని ఆటపట్టిస్తుంటారు. అంతలా జనాల్లో వెళ్లిపోయింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్ని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. నా నవ్వు బాగుంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ చేయలేకపోయాను' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చేయనుందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. ఒకవేళ రాజశేఖర్.. రేలంగి మామయ్య పాత్ర చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి!శర్వానంద్ హీరోగా చేసిన 'బైకర్' మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఇది వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ల సందర్భంగానే చాలా విషయాలని రాజశేఖర్ పంచుకుంటున్నారు. అప్పట్లో ఈయన్ని వెతుక్కుంటూ చాలానే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చాయి. కానీ పలు కారణాలతో వాటిని వదులుకున్నారు. ఇప్పుడేమో ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అని ఈయనే టాలీవుడ్ దర్శకనిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు.రాజశేఖర్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని దర్శకులు పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 'బైకర్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోకి తండ్రి, బైక్ రేసింగ్ కోచ్గా కనిపించనున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది) -
ఆస్ట్రేలియా ఆజానుబాహుడికి బంపరాఫర్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్లో (CSK) కీలక మార్పు చోటు చేసుకుంది. నాథన్ ఇల్లిస్ గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడంతో, అతని స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ జట్టులో చేరాడు. ఎడమ చేతి వాటం పేసర్ అయిన జాన్సన్ను సీఎస్కే రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది.జాన్సన్కు ఇదివరకే ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. 2024లో గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ. 10 కోట్ల భారీ బిడ్తో దక్కించుకుంది. ఆ తర్వాత 2025లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన జాన్సన్.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ (10.39) చాలా దారుణంగా ఉంది. అయినా, సీఎస్కే అతన్ని తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.జాన్సన్కు ఐపీఎల్లో మంచి రికార్డు లేకపోయినా, ఆస్ట్రేలియా తరఫున ఓ మోస్తరు రికార్డు ఉంది. ఆసీస్ తరఫున అతను 8 టీ20ల్లో 14 వికెట్లు, 5 వన్డేల్లో 4 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ ఆఫర్కు ముందు జాన్సన్కు పాకిస్తాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. గ్లాడియేటర్స్ ఇతన్ని నేరుగా సంతకం చేసుకున్నా, వ్యక్తిగత కారణాలతో అతను ఆ లీగ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో అన్నీ పక్కకు పెట్టి ఓకే చెప్పేశాడు. ఆజానుబాహుడైన జాన్సన్ బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగలడు.కాగా, ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రయాణం మార్చి 30 నుంచి మొదలవుతుంది. గౌహతిలొ జరిగే మ్యాచ్లో సీఎస్కే రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 28న ఆర్సీబీ-సన్రైజర్స్ మ్యాచ్తో మొదలవుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఐపీఎల్-2026లో సీఎస్కే జట్టుఎంఎస్ ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, స్పెన్సర్ జాన్సన్ , శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ. -
పర్యాటక అద్భుతం..'రివర్కేఫ్'గా వంతెన!
మనసు పెట్టాలే గానీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అందుకు నిదర్శనం చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఆ వంతెన. మన సాయుధ బలగాలు ఆ వంతెనకు ప్రాణంపోసి కొత్తరూపం ఇచ్చారు. చెప్పాలంటే..అద్భుతమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చేశారు. అదంతా ఎక్కడ అంటే..సాధారణంగా మంచి కేఫ్కి వెళ్లి ఓ కప్పు కాఫీ లేదా టీ సిప్ చేసి ఎంజాయ్ చేస్తాం. అలా కాకుండా ప్రకృతి మధ్య కొలువుదీరి..కింద జలజల జారే జలపాతం నడుమ తాగుతుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. అలాంటి అనుభూతి కోసం అరుణాచల్ ప్రదేశ్లోని రివర్ కేఫ్కి రావాల్సిందే. న్గ్యామ్జాంగ్ చూ నదిపై కొలువుదీరిన కేఫ్ ఇది. ఎన్నాళ్లుగానో వాడుకలో లేని వంతెనని భారత సైన్యం కేవలం 31 రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వంతెనను కేఫ్గా మార్చి అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. వచ్చే పర్యాటకులు గల గల పారే నది పాదాల కింద నుంచి చూస్తూ..చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ..భోజనం చెయ్యొచ్చు. ఆ కేఫ్ని గాజు భవంతిలా తీర్చిదిద్దడం విశేషం. సందర్శకులు వంతెనపైనే లేదా నదీ తీరంలోని కేఫ్ విభాగంలో కూర్చోవడానికి ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కటి విభిన్నమైన అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఆపరేషన్ సద్భావనలో భాగంగా, భారత సైన్యం కేవలం 31 రోజుల్లో ఈ కేఫ్ను నిర్మించింది. ఉపయోగంలో లేని సైనిక నిర్మాణాన్ని ప్రయాణికులు, బాటసారులు స్వాగతించే ప్రదేశంగా మార్చారు. ఈ కేఫ్ స్థానిక మోన్పా మహిళలచే నిర్వహించబడుతోంది. పర్యాటక ప్రదేశంగా మారుతున్న ఈ మారుమూల ప్రాంతానికి కొత్త జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది ఈ రివర్కేఫ్. సందర్శకులకు ఈ కేఫ్ పర్వతాలు, నదులు, మేఘావృత లోయల మధ్య మరుపురాని అనుభూతుల్ని అందిస్తుంది. Under #OpSadbhavna, the Indian Army has established Border Brew Café at Jemithang, a first-of-its-kind initiative in Northeast India.Constructed on a decommissioned Bailey Bridge over Ngyamjang Chu, the cafe will support local communities and strengthen tourism in #Arunachal. pic.twitter.com/GJKCNLdJSb— MyGov Arunachal Pradesh (@MyGovArunachal) March 19, 2026 (చదవండి: రెంట్ ఏ ట్రీ..!) -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు.ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదంజాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుఐవీఎఫ్ఆర్టీ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతిఉడాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదంపదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వంఈ పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాల అభివృద్ధి200 హెలిపాడ్ ల ఆధునీకరణఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఎయిర్ లైన్స్ ఆపరేటర్స్ కు వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద 10,043 కోట్ల రూపాయల సహాయం ఈ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు పెరుగనున్న ఎయిర్ కనెక్టివిటీపర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52 శాతం విద్యుత్ ఉత్పత్తి -
ఆ స్టుపిడ్ వీడియోలు వద్దు: కోచ్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పి మరోసారి పాకిస్తాన్ క్రికెట్లో భాగమయ్యాడు. గతేడాది పాక్ టెస్టు జట్టు హెడ్కోచ్ పదవి నుంచి ఈ మాజీ పేసర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు. తనకు చెప్పకుండానే సీనియర్ అసిస్టెంట్ కోచ్పై వేటు వేశారని.. అవమానాన్ని భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.హైదరాబాద్ కింగ్స్మెన్ కోచ్గాఅయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో గిల్లెస్పి భాగం కావడం విశేషం. మార్చి 26న తాజా ఎడిషన్ ఆరంభం కానున్న తరుణంలో కొత్త ఫ్రాంఛైజీ హైదరాబాద్ కింగ్స్మెన్ కోచ్గా అతడు బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో జట్టుతో చేరిన అతడు హోటల్లో కెమెరామెన్తో సంభాషించిన తీరు వైరల్గా మారింది.ఫ్రాంఛైజీ క్రికెట్లో స్వాగత వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లు, కోచ్ల ఆగమనం నేపథ్యంలో వీడియోలు తీసి వాటికి ఎలివేషన్లు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫ్రాంఛైజీ వెల్కమ్ వీడియో తీస్తున్న క్రమంలో గిల్లెస్పి కీలక వ్యాఖ్యలు చేశాడు.స్టుపిడ్ వెల్కమ్ వీడియోలు వద్దు‘‘నేనేమీ కిందకు రావడం లేదు. నాకు చాలా పని ఉంది. ఇలాంటి స్టుపిడ్ వెల్కమ్ వీడియోలు నేను చేయను’’ అంటూ పై అంతస్తులో ఉన్న గిల్లెస్పి వ్యాఖ్యానించాడు. తనకు పని ఎక్కువగా ఉందని.. కాబట్టి ఇలాంటి వాటిలో తాను భాగం కాలేనని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🚨 ANOTHER EMBARRASSMENT FOR PSLJason Gillespie refuses to shoot CRINGE 'WELCOME VIDEOS'"I am not coming down. I have a lot of work to do. I'm not gonna shoot those stupid welcome videos."Man chose actual work over scripted cringe. Priorities. 🤣🤡 pic.twitter.com/iYmDhcFRKN— Brutal Truth (@sarkarstix) March 24, 2026ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గిల్లెస్పి పేర్కొన్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఏమాత్రం సమయం వృథా చేయకుండా శిక్షణపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇవాళ వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్లో వడగళ్ల వాన పడింది. ఘట్కేసర్, పోచారం, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురిసింది.రంగారెడ్డి జిల్లా, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. -
కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్, డీజిల్పై ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన వెసులు బాటు భారత్ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.(ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.2022 ప్రారంభంలో ఉక్రెయిన్పై దాడి జరిగిన తర్వాత, భారత్కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలంరష్యాకు భారీ లాభాలుభారత్ , ఇతర దేశాలనుంచి వస్తున్న భారీ డిమాండ్ , అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. -
రెంట్ ఏ ట్రీ..!
కేరళకు చెందిన ఒక స్టార్టప్ అందరి మనసుల్నీ గెలుచుకుంటోంది. రెంట్ ఏ ట్రీ అనే పేరుతో ఉన్న ఈ సంస్థ.. ఆసక్తిగలవారు ఎవరైనా ఒక మామిడి చెట్టును అద్దెకు తీసుకుని, సాగుతో సంబంధం లేకుండానే ఆ చెట్టుకు కాసే దిగుబడిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కొచ్చికి చెందిన ఉమేష్ దామోదరన్ ఈ వినూత్న బిజినెస్ని ప్రారంభించారు. బెంగళూరులో ఒక ఎడ్టెక్ స్టార్టప్ను నడిపే దామోదరన్ ఒకసారి కొచ్చి–బెంగళూరు మధ్య ప్రయాణిస్తున్నపుడు అల్ఫోన్సో మామిడి పండ్లను చూశారు. కొన్నింటిని తన స్నేహితుల కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా వారికి ఆ పండ్ల రుచి బాగా నచ్చి, మరోసారి కావాలని కోరారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి ఒక పూర్తి చెట్టు పండ్లన్నీ తమకే కావాలని అడిగారు. అపుడే దామోదరన్లో ఈ ‘రెంట్ ఏ ట్రీ’ ఆలోచనకు పునాది పడింది. ఈ కంపెనీ వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చెట్టును, మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి లీజుకు తీసుకోవచ్చు. చెట్టు సంరక్షణ, సాగు బాధ్యతలన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ సంస్థ ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరి, తమిళనాడులోని దిండిగల్, కేరళలోని పాలక్కాడ్ ప్రాంతాల్లో సుమారు 250 ఎకరాల అల్ఫోన్సో మామిడి తోటలను నిర్వహిస్తోంది. ఈ స్టార్టప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘బ్రిలియంట్ ఐడియా’ అని కొంతమంది కొనియాడగా, మరికొంతమంది దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాపు సరిగా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి అనుకోని వర్షాలు పంటను దెబ్బతీస్తాయని.. నష్టం రావొచ్చు అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Karostartup (@karo_startup_) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. 2029 ఎన్నికల నుంచి ఈ చట్టాన్ని అమలు చేయటాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అమలు మంచి నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహిళల సాధికారతకు మా పార్టీ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాం. నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. అసెంబ్లీ, లోక్సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగాలనేది మా పార్టీ ఆకాంక్ష’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2026 -
సౌతాఫ్రికాకు మరో క్లాసెస్ దొరికాడు..!
న్యూజిలాండ్కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను పర్యాటక సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 25) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో సఫారీ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నాలుగో నంబర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హ్యూజన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.మిగతా ఆటగాళ్లలో వియాన్ ముల్దర్ (31), రూబిన్ హెర్మన్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో డియాన్ ఫార్రెస్టర్ (21 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టోని డి జోర్జి (12) నిరాశపర్చగా.. జేసన్ స్మిత్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 2, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్ తలో వికెట్ తీశారు.అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. సఫారీ బౌలర్ల ధాటికి తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి పరాజయంపాలైంది. గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ ముల్దర్, ఓట్నీల్ బార్ట్మన్ తలో 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీసి న్యూజిలాండ్ను కట్టడి చేశారు. వికెట్లు తీయకపోయినా ప్రెనెలన్ సుబ్రాయెన్ (4-0-22-0) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 36 పరుగులతో బెవాన్ జాకబ్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. టిమ్ రాబిన్సన్ 25, డేన్ క్లీవర్ 22, నిక్ కెల్లీ 14, కేటీన్ క్లార్క్ 2, కెప్టెన్ జిమ్మీ నీషమ్ 24, జోష్ క్లార్క్సన్ 13, కోల్ మెక్కోంచి 1, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్ తలో 4 పరుగులతో అజేయంగా నిలిచారు.మరో క్లాసెస్ దొరికాడు..!ఈ సిరీస్తో సౌతాఫ్రికాకు మరో క్లాసెన్ దొరికాడు. క్లాసెన్ లాగే వికెట్కీపర్ బ్యాటర్ అయిన కానర్ ఎస్టర్హ్యూజన్ విధ్వంసకర బ్యాటింగ్ శైలితో క్లాసెన్కు తలపించాడు. కానర్ వికెట్ల వెనకాల కూడా పర్వాలేదనిపించాడు. నేటి మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించిన కానర్.. దీనికి ముందు మ్యాచ్లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. ఆ మ్యాచ్లో 36 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఇదే సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కానర్.. 5 మ్యాచ్ల్లో 145కు పైగా స్ట్రయిక్ రేట్తో 200 పరుగులు చేశాడు. తద్వారా ఐదో టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. క్లాసెన్ రిటైరయ్యాక సౌతాఫ్రికాకు ఆ స్థాయి బ్యాటర్గా కానర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. -
ఏ ఎన్నికల్లో ఎవరు ఎలా గెలిచారు?
కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు పేరు వినగానే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత గుర్తుకువచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో వీరిని చూసే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. ఈ ఇద్దరు ఉద్ధండులు లేకుండానే 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపించే దశ నుంచి ఫలితాలు వెలువడే వరకూ రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఎన్నికల విషయంలో అనేక అంశాలు విజయం, ఓటమిలో పాత్ర పోషిస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. 1952 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో పలు అంశాలు గెలుపు, ఓటములను నిర్ణయిచాయి.1952 నుంచి 2021 వరకు తమిళనాడులో 1952 నుంచి 2021 వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తే సాధారణంగా విజయం వేటిపై ఆధారపడి వరిస్తుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి.తమిళనాడులో ఏ ఎన్నికల వేళ ఏం జరిగింది?1952–19621952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర పోషించడంతో తమిళనాడు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.1957, 1962 ఎన్నికల్లో డీఎంకే ముఖ్య ప్రత్యర్థిగా ఎదిగి రాజకీయంగా కాంగ్రెస్కు పోటీగా మారింది.1967 కాంగ్రెస్పై వ్యతిరేక భావన, బియ్యం ధరలు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు డీఎంకేను ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. 1971లోనూ డీఎంకే గెలిచింది.1977 డీఎంకేలో విభజన, ఎంజీఆర్ ప్రజాకర్షణ వల్ల అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది.1980–1990 దశకం ఎంజీఆర్ ప్రజాదరణ, కూటమి వ్యూహాలు ఫలితాల్లో కీలక భూమిక పోషించాయి. 1980, 1984లో అన్నాడీఎంకే విజయం సాధించింది. 1989లో మాత్రం డీఎంకేను విజయం వరించింది.1991లో రాజీవ్ గాంధీ హత్య ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే విజయం సాధించింది.1996లో అన్నాడీఎంకేపై భారీగా ప్రజా వ్యతిరేకత, రాజకీయ కూటములు డీఎంకేకు స్పష్టమైన విజయం ఇచ్చాయి.2001–2011 మధ్యకూటమి రీతులు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలు ఎన్నికల తీర్పులను ప్రభావితం చేశాయి. 2016–2021 2016 ఎన్నికల్లో చిన్న పార్టీల ఓట్ల షేర్, తేడా తక్కువగా ఉండటం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది.2021లో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ పరిస్థితి మారి డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది.ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన ప్రధాన అంశాలు1. ప్రజా వ్యతిరేకత: అధికార పక్షంపై అసంతృప్తి ఫలితాలను మార్చేస్తుంది.2. నాయకుల ప్రజాకర్షణ: ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.3. కూటమి బలం: ఎవరు ఎవరితో కలుస్తారన్నది తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది.4. చిన్న పార్టీలు: చిన్న పార్టీల ఓట్లు ప్రధాన పార్టీలకు నష్టం లేదా లాభం కలిగిస్తాయి.5. చారిత్రక సంఘటనలు: ఆర్థిక పరిస్థితులు, పెద్ద సంఘటనలు ఓటర్ల అభిప్రాయాన్ని మార్చుతాయి. -
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లు మాత్రం డీలా
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
దురంధర్, బోర్డర్-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్వన్..!
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు.ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్ ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్ఫ్లిక్స్లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.వరుసగా రెండవ వారం కూడా మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026 -
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
‘పచ్చ పత్రికల కథనాలే బదిలీలకు ప్రామాణికమా?’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకథలే అన్నట్టు వ్యవహరిస్తూ... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు.రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...బాబు హయాంలో ప్రతి గడపకీ కక్ష రాజకీయమే..వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది. 151 పైగా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా.. కుమారుడు లోకేష్, భాగస్వామి పవన్ కళ్యాణ్, లేదా అధికారులు వెన్నుపోటు పొడుస్తారని భయపడున్నట్టున్నారు. మీ పాలన దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు సాగుతోంది.జరగని మీటింగ్పై బాబు ఉలికిపాటు..రాష్ట్రంలో నేను నిప్పులాంటి నాయకుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు... ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా తడబాటు పడుతూ తప్పుడు అడుగులు వేస్తున్నారు. నెల్లూరులో ఓ మాజీ అధికారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడికి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వస్తే... ఆయన్ను నీలకంఠారెడ్డి కలిసారని, కొంతమంది ఐఏఎస్ లతో జవహర్ రెడ్డి మీటింగ్ పెట్టారని ఓ ఎల్లో మీడియా పత్రికలో కట్టుకథను వండి వార్చితే.. దాన్ని ఆధారంగా చేసుకుని నీలకంఠా రెడ్డి ని ఎలా బదిలీ చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు?అసలు జవహర్ రెడ్డి నెల్లూరే వెళ్లనప్పుడు ఐఏఎస్ లతో ఎలా సమావేశం నిర్వహిస్తారు? ప్రభుత్వం ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు విలువ లేకుండా ఇంటి చాడీలకు ఎందుకు విలువనిస్తున్నారు? పీఎస్ ఆర్ ఆంజనేయలు, పీవీ సునీల్ కుమార్, జాషువా, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా, సంజయ్, నాయక్ వంటి అధికారులు చేసిన పాపం ఏంటి?గత ప్రభుత్వంలో పనిచేస్తే వారి మీద ఈ విధంగా దాడి చేస్తారా? మీ ఇంటి దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదు కదా? వాళ్ల తల్లిదండ్రుల రక్తం కష్టంతో ఉన్నత చదువులు చదువుకుని దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లను మీ రాజకీయ వేధింపులకి బలి చేయడం ఎంత వరకు సమంజసం? వైఎస్ జగన్ హయాంలో హుందాతనం..వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హయాంలో పనిచేసిన వ్యక్తులను పదవుల్లో కొనసాగించామే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు. ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్, కృష్ణబాబు, ప్రద్యుమ్న, సతీష్ చంద్ర వంటి మీ దగ్గరపనిచేసిన అధికార్లకు కూడా మా ప్రభుత్వ హయాంలో అత్యున్నత మైన బాధ్యతలు అప్పజెప్పి కంటిన్యూ చేశాం. మంచి శాఖల్లో పోస్టింగులిచ్చి.. వారి సేవలను దేశానికి ఉపయోగపడేలా మేం చర్యలు తీసుకుంటే.. మీరు ఒట్టి మాటలు, టిష్యూ పేపర్లలాంటి మీ కరపత్రికల్లో వండి వార్చిన కథనాలను ఆధారాలుగా చేసుకుని జీవోలు మార్చుతున్న వైనం చూస్తుంటే చంద్రబాబు చేస్తున్నది పాలనే కాదన్న విషయం సుష్పష్టంగా అర్థం అవుతోంది.గతంలో తన పాలనలో అవినీతి చక్రవర్తి అని ముద్రవేసుకున్న చంద్రబాబు ఈ దఫా పాలనలో అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఎస్బీ నుంచి డీఐజీ వరకూ అదే విధంగా ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రతివారినీ కేసులతో వేధిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇవన్నీ చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతున్నాయి.అనుభవం ఉన్న అధికారులను అణగద్రొక్కుతూ, అడుగులుకు మడుగులు ఒత్తుతున్న అధికారులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. అవినీతి అధికారులకా గత చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు మరలా ఇవాళ పెత్తనం చలాయిస్తున్నారు. గతంలో బాబు పాలనలో జరిగిన స్కాముల్లో ఆ అవినీతి అధికారులంతా పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నవాళ్లే.బాబు పాలనలో కక్ష సాధింపులు..ఇవాళ చంద్రబాబు తనమీదున్న కేసులను ఎలాగూ కొట్టేయించుకుంటున్నాడు. తాను చేస్తున్న అవినీతి అంతా అధికారులతో చేయిస్తున్నాడు. పాలన పూర్తిగా గాలికొదిలేశాడు. బ్యూరోక్రసీని బలిపశువును చేసి... అందులో అధికారులను సమిధిలుగా మార్చుతున్నాడు. చివరకు పక్కరాష్ట్రానికి వెళ్లి పనిచేస్తున్న అధికారుల మీద కూడా కక్షకా ద్వేషాలు చూపిస్తున్నాడు. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజ్యంలా.. అధికార ప్రభుత్వంలో తమ కులంలో ఉన్న కొంతమంది అధికారులే పెత్తందారులగా చలామణీ అవుతున్నారు. నీలకంఠారెడ్డిని బదిలీ చేయడానికి ప్రభుత్వం చూపిస్తున్న కారణం, జరిగిన సంఘటన రెండూ సంబంధం లేని ఘటనలే.పుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తాను చేసిన అతి ప్రవర్తనను నీలకంఠారెడ్డి ఖండించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. పూర్ణచంద్ర రావు వెనుకున్న లోకేష్, తన సామాజికవర్గం చెందిన వాడు కావడంతోనే... నీలకంఠా రెడ్డిపై జులుం ప్రదర్శించారని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, సీఎం చంద్రబాబులు సకల విఫల శాఖా మంత్రులగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ.. అధోగతి పాల్జేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సంజయ్ దత్ క్రేజీ రికార్డ్.. ఆ విషయంలో తొలి నటుడిగా ఘనత..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ రికార్డుల వేట కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల్లోనే పార్ట్-2 రిలీజ్ చేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి చర్చ మొదలైంది. విలన్ పాత్రలతో అందరినీ దృష్టిస్తోన్న ఏకైక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా మెప్పించిన మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రూ. 1,000 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక బాలీవుడ్ స్టార్గా సంజయ్ దత్ ఘనతను సొంతం చేసుకున్నారు.కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 చిత్రంలో విలన్ అధీర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 66 ఏళ్ల వయసులోనూ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. కేజీఎఎఫ్ తర్వాత షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,160 కోట్ల మార్కును అధిగమించింది.తాజాగా గతేడాది రిలీజైన దురంధర్ మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సంజయ్ దత్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన దురంధర్-2 సైతం రూ.1000 కోట్ల మార్క్ దగ్గరలో ఉంది. ఈ చిత్రం కూడా వెయ్యి కోట్లు దాటితే సంజయ్ దత్కు రికార్డ్ మరింత పెరగనుంది. కాగా.. సంజయ్ దత్ 'ధురందర్: ది రివెంజ్'లో ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ. 919 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డ్స్ పరిశీలిస్తే.. ఇకపై సంజయ్ దత్ ఉంటే చాలు వెయ్యి కోట్లు పక్కా అనాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. -
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియాలో ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.వైరల్ వార్తల్లో ఏముంది?గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్కు అయితే 35 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.కేంద్రం, ఐవోసీఎల్ వివరణఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్లతో సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Reports claiming changes in LPG refill booking timelines are incorrect. There is no change in the existing timelines (25 days in urban areas / 45 days in rural areas), and LPG supplies remain adequate across the country. Please rely only on official sources and avoid panic…— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 25, 2026 -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
హాలీవుడ్ మూవీ ప్రమోషన్స్లో హృతిక్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా స్టార్డమ్ని ఓ హాలీవుడ్ సినిమా ప్రచారానికి వాడుకుంటుంది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ టీమ్.. ఇండియాలో తమ సినిమా ప్రమోషన్స్ కోసం హృతిక్ని సంప్రదించింది. ప్రమోసన్స్లో భాగంగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్, హృతిక్తో ఒక ఎక్స్క్లూజివ్ వర్చువల్ ఇంటర్వ్యూని నిర్వహించారు.స్పేస్, సైన్స్, సినిమాలపై తమకున్న ఆసక్తిని పంచుకుంటూ ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ చేసిన ఈ ముఖాముఖి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సంభాషణ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ చుట్టూ తిరిగింది. హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి... మిల్ గయా’తో ఈ కొత్త చిత్రానికి ఉన్న పోలీకలను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడంతోపాటు, భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశాలపై కూడా చర్చించారు.ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' చిత్రంలో ర్యాన్ గాస్లింగ్ మెమరీ లాస్ కి గురైన రైలాండ్ గ్రేస్ పాత్రను పోషించారు. శాండ్రా హుల్లెర్, లియోనెల్ బాయిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అమెజాన్ ఎంజీఎం(MGM) స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది. ఈ సినిమా మార్చి 26న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. -
‘అదే జరిగితే.. టీమిండియా సెలక్టర్లు పట్టించుకోరు’
గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్. మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.కెప్టెన్గానూ ఫెయిల్అయితే, ఐపీఎల్-2025లో పంత్ (Rishabh Pant) దారుణంగా విఫలమయ్యాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గానూ పంత్ ఫెయిలయ్యాడు. అతడి సారథ్యంలో లక్నో గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.టీమిండియా రీఎంట్రీ కష్టమేముఖ్యంగా ఫామ్లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పంత్ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో అతడు తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.‘‘రిషభ్ పంత్ విషయంలో విమర్శలు రావడం సరైందే. సంప్రదాయ విరుద్ధ, రిస్కీ షాట్లు ఆడటం అనే చట్రంలో అతడు ఇరుక్కుపోయాడు. ఫామ్ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లతో విమర్శలు మూటగట్టుకున్నాడు.సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదుటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్గా సేవలు అందించే పంత్ గురించి ఇప్పుడు సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు.ఓపెనర్-వికెట్ కీపర్గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజూ), ఓపెనర్- వికెట్ కీపర్ లేదంటే వన్డౌన్లో ఆడే వికెట్ కీపర్గా మరొకరు (ఇషాన్) దుమ్ములేపుతున్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం అయినా పంత్కు దక్కుతుంది. ఏదేమైనా జాతీయ జట్టుకు ఆడటమే ప్లేయర్ అంతిమ లక్ష్యం కదా! యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో పంత్ ప్రాక్టీస్ చేయడం శుభసూచకం. ఈసారైనా పంత్ ఉత్తమంగా రాణించాలి. లేదంటే భవిష్యత్ కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా జియోహాట్స్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 షురూ కానుంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
ఇలా పెట్రోల్ నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు: ఉత్తమ్
హైదరాబాద్: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనపడుతుండడంతో దీనిపై తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదని అన్నారు.‘మీరు ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం. అవసరం మేరకు సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకేసారి డ్రమ్లు, కంటైనర్లు నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు. ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటరింగ్ చేస్తుంది. రూమర్స్, ఫేక్ న్యూస్ను నమ్మొద్దు’ అని సూచించారు.కాగా, తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... ‘డిమాండ్ 25 శాతం పెరిగింది. 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాయి. పెట్రోల్ బంక్ లు క్లోజ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. అహ్మదాబాద్, సూరత్, నాగపూర్, చెన్నైలో ఇలాంటి పరిస్థితి ఉంది. బంక్ లకు క్రెడిట్ సమస్య లేదు. గ్యాస్ అక్రమ రవాణా పై 175 కేసులు నమోదు చేస్తాం. 2,954 వాణిజ్య సిలిండర్ లు సీజ్ చేశాం.గృహ అవసరాలకు గ్యాస్ ఇబ్బంది లేదు. ఎల్పీజీ బుకింగ్ 15 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది’ అని అన్నారు. కాగా, పెట్రోల్ , డీజల్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఇతర అధికారులు కూడా సూచిస్తు న్నారు. పెట్రోల్ బంక్లలో కావాల్సినంత సప్లై జరుగుతుందని అంటున్నారు. -
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో ఇవాళ (బుధవారం) టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి.. కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు.ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని.. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
శ్రీశైలం: తేనెటీగల దాడి.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం డ్యామ్ దగ్గర తీవ్ర విషాదం జరిగింది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి(52) డ్యామ్పై కిందపడి మృతి చెందారు. శ్రీశైలం డ్యామ్పై లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరస్వామి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. తేనెటీగల దాడిలో మరో ఇద్దరు ఉద్యోగస్తులు కూడా గాయపడ్డారు. వారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ వీరాస్వామి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
ఒక రోజు ఆలస్యంగా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’. ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. పెయిడ్ ప్రీమియర్స్ పై ప్రకటన చేస్తామని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్.ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఆడియెన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఇరాన్పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
లలిత్ మోదీ మాస్టర్ ప్లాన్!.. 1997-98లోనే బీసీసీఐకి ప్రపోజల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. పొట్టి క్రికెట్ గతినే మార్చి వేసిన లీగ్.. భారత్లో 2008లో మొదలైన ఈ టీ20 టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నది. గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ క్యాష్ రిచ్ లీగ్గా పేరొందింది.ఐపీఎల్లో ఒక్కసారి ఆడితే చాలు తమ దశ తిరిగిపోతుందని ఆటగాళ్ల నమ్మకం. ఈ టీ20 లీగ్లో సత్తా చాటి జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కోకొల్లలు. ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు.ఐపీఎల్ వ్యవస్థాపకుడు, లీగ్ తొలి చైర్మన్ఐపీఎల్ ఈ స్థాయికి చేరడంలో లలిత్ మోదీకి కీలక పాత్ర. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, లీగ్ తొలి చైర్మన్ అతడే. 2010 వరకు లీగ్ కమిషనర్గానూ లలిత్ మోదీ కొనసాగాడు. ఆ తర్వాత మనీ లాండరింగ్ ఆరోపణలతో అభాసుపాలై.. దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుగా ముద్రపడ్డాడు. ఏదేమైనా ఐపీఎల్కు అంకురార్పణ చేసింది అతడే. అందుకే అతడి పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడం ఖాయం.1997-98 మధ్యకాలంలోనే ఆ ఐడియాతో..కాగా 2008 కంటే దశాబ్దకాలం ముందే లలిత్ మోదీ ఐపీఎల్ గురించి బీసీసీఐ (BCCI)కి చెప్పాడట. టీమిండియా మాజీ సెలక్టర్, భారత మాజీ క్రికెటర్ సబా కరీం (Saba Karim) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దూరదర్శన్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘1997-98 మధ్యకాలంలోనే లలిత్ మోదీ టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ ఆలోచనతో బీసీసీఐ దగ్గరికి వచ్చాడని చాలా మందికి తెలియదు.ఐపీఎల్ ఆరంభానికి దాదాపు పదేళ్ల ముందు నుంచే ఇలాంటి లీగ్ గురించి లలిత్ మోదీ బీసీసీఐ వద్ద ప్రతిపాదన తెచ్చాడు. అప్పట్లో అసలు టీ20 క్రికెట్ గురించి ఆలోచనే లేదు. అంతా వన్డేల మయం. అయితే, అప్పట్లోనే టీ20 క్రికెట్ కోసం బెంగాల్ నుంచి ఓ జట్టు తయారు చేయాలని మేము అనుకున్నాము.కాంట్రాక్టు కూడా..వాళ్లతో కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నాము. అయితే, వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ లీగ్ గురించిన ఆలోచన మాత్రం మా మెదళ్లలో ఉండిపోయింది’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2008లో మొదలైన ఐపీఎల్ విలువ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ఆరంభ సీజన్ విజేత రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ తాజాగా రూ. 15 వేల కోట్లకు పైగా.. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ రూ. 16 వేల కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు చిన్నపాటి నిదర్శనాలు. ఇక ఈ ఏడాది మార్చి 28న ఐపీఎల్కు తెరలేవనుంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
పాకిస్థాన్కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
’తొమ్మిదేళ్లు భరించినందుకు ధన్యవాదాలు’
ఫుట్బాల్లో ఈతరం మేటి ఆటగాళ్లుగా ముద్రపడ్డవారు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరిలా అంత పాపులారిటీ సంపాదించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈజిప్ట్ ఫుట్బాల్ స్టార్ ఆటగాడు మహ్మద్ సాలా. ఫార్వర్డ్ ప్లేయర్గా స్టార్ హోదా పొందిన సాలా తొమ్మిదేళ్లుగా లివర్పూల్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే లివర్పూల్తో ఉన్న తొమ్మిదేళ్ల బంధానికి ముగింపు పడనున్నట్లు సాలా ప్రకటించాడు. త్వరలోనే లివర్పూల్ క్లబ్తో ఒప్పందం ముగియనున్న వేళ దానితో ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీడియో రూపంలో భావోద్వేగంతో పంచుకున్నాడు. ‘అందరికీ నమస్కారం. ఈ సీజన్తో లివర్పూల్తో బంధం ముగియనుంది. ఏదో ఒకరోజు లివర్పూల్ క్లబ్ నుంచి వైదొలగాల్సిందే. కానీ ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. ఇది నా వీడ్కోలులో మొదటి భాగం. లివర్పూల్ క్లబ్తో తొమ్మిదేళ్లుగా సాగిన బంధంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లివర్పూల్ అనేది కేవలం నాకు ఫుట్బాల్ క్లబ్ మాత్రమే కాదు అంతకుమించి. ఇంతకాలం నన్ను భరించడంతో పాటు నాకు సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 2017లో లివర్పూల్ క్లబ్లో చేరిన 33 ఏళ్ల మహ్మద్ సాలా ఆ క్లబ్ తరఫున 435 మ్యాచ్లాడి 255 గోల్స్ సాధించాడు. తద్వారా లివర్పూల్ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన జాబితాలో ఇయాన్ రష్, రోజర్ హంట్ల తర్వాత సాలా మూడో స్థానంలో ఉన్నాడు. 2019, 2024 సీజన్లలో టైటిల్ గెలిచిన లివర్పూల్లో సాలా సభ్యుడిగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా 115 మ్యాచ్ల్లో 67 గోల్స్ సాధించాడు.pic.twitter.com/mSP9S4pfpu— Mohamed Salah (@MoSalah) March 24, 2026చదవండి: డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన! -
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా
'అవతార్' సినిమాల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా.. మరో రెండు పార్ట్ థియేటర్లలోక రావాల్సి ఉంది. అయితే 2009లో వచ్చిన తొలి పార్ట్ అద్భుతమైన హిట్ కాగా.. 2022లో వచ్చిన సీక్వెల్ పర్లేదు బాగానే ఉందనే రెస్పాన్స్ అందుకుంది. గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్ చాలా మందికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.12 వేల కోట్లకు పైనే వచ్చాయి. అందరూ ఈ మూవీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా)జేమ్స్ కామెరూన్ తీసిన మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్'.. గతేడాది డిసెంబరు 19న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్లే పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్లీ అదే టైపు స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కొందరు మాత్రం చూశారు. అలా కొన్నాళ్ల పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మన దగ్గర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న హాట్స్టార్లో ఏప్రిల్ లేదా మే నెలలో ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. మరి మన దగ్గర థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్) -
ఘనంగా శంకర నేత్రాలయ 'మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్'
కొలంబస్, ఓహియోలోని హయాట్స్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో శంకర నేత్రాలయ USA “మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది తొలి కార్యక్రమంగా నిర్వహించిన ఈ ఈవెంట్కు దాదాపు 400 మంది కమ్యూనిటీ సభ్యులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని పేద ప్రజలకు కంటి శస్త్రచికిత్సలు అందించే “అడాప్ట్-ఎ-విలేజ్” ప్రోగ్రామ్కు మద్దతు లభించింది.మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సేవ, కళ, సామాజిక బాధ్యతల సమ్మేళనం స్పష్టంగా కనిపించింది. ప్రారంభ ప్రసంగంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు అమర్ ఏమిరెడ్డి మాట్లాడుతూ, “కొలంబస్ నగరం సేవా భావంలో ముందుంటుంది. ఈ రోజు మనం కలిసి అనేక మందికి కంటి వెలుగు అందించే లక్ష్యంతో ఒకటయ్యాం” అని అన్నారు. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి మాట్లాడుతూ, “సంస్థ వాలంటీర్లకు శక్తినిస్తుంది. కొలంబస్ చాప్టర్ అందిస్తున్న మద్దతు మా సేవా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తోంది” అని తెలిపారు.నృత్య ప్రదర్శనల కళా వేదిక ప్రారంభ ప్రసంగాల అనంతరం ట్రినయనీ ఆర్ట్స్, సాయి నృత్య సంగం, మయాజ్ మస్తి డ్యాన్స్ అకాడమీ, శ్రీ వెంకటేశ్వర డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, నాట్యాలయం డ్యాన్స్ స్కూల్, సాయి ఆర్ట్ గ్రూప్, స్టైల్ ఎన్ గ్రేస్ వంటి సంస్థల నుంచివచ్చిన కళాకారులు అద్భుత నృత్య ప్రదర్శనలు అందించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, సినీ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమం చివరలో కంటి చూపు ప్రాముఖ్యతను తెలియజేసే నాటిక, రజనీకాంత్ అనంతోజి నేతృత్వంలో జరిగిన గ్రాండ్ ఫినాలే అందరినీ ఆకట్టుకుంది. చెన్నైకు చెందిన ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ గాయకుడు రాము, గాయని అంజనా సౌమ్య తమ మధుర గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. భక్తి గీతాలు, ప్రముఖ సినిమాల ఫ్యూజన్ పాటలను సమన్వయంతో ఆలపిస్తూ, నలుపు-తెలుపు యుగం నుంచి రంగుల యుగం వరకు విస్తరించిన సంగీతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.శంకర నేత్రాలయ USA బ్రాండ్ అంబాసిడర్, బోర్డ్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, “కంటి చూపును తిరిగి ఇవ్వడం అనేది గౌరవం, ఆశను పునరుద్ధరించే మహత్తర సేవ” అని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కళాకారులు, వాలంటీర్లు, నిర్వాహకులు అందరూ నెలల తరబడి కృషి చేశారు. వేదిక వెనుక పనిచేసిన SNUSA కొలంబస్ టీమ్ ప్రతీ అంశాన్ని సమగ్రంగా ప్రణాళిక చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. ముఖ్యంగా అమర్ ఏమిరెడ్డి, ఆర్కే రెడ్డి, రాజా బొమ్మన నాయకత్వంలోని కొలంబస్ కోర్ టీమ్తో పాటు సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల, రామకృష్ణ కసర్ల, గంగరాజు బేతిన, విజయ్ సుంకాడ్, యెల్లా రెడ్డి చిట్టి, శ్రీని పడాల, వెంకట్ దురిపాల, భూపేష్ మద్దు, శంకర్ రావుల, రంగనాథ్, స్వాతి మద్దు, మహిత మద్దు, నికిత పడాల, శ్రికా దురిపాల, మహేష్ వెలిడండి, రాజ్ ముద్దాన, వినయ్, శరందీప్, వంశీ నిమ్మ, విష్ణు తూముల, శ్యామ్ దుద్దెల, లోహిత్ సాయి బురుగుపల్లి, రిషిత్ బేతిన, కీర్తన్ ముద్దాన తదితర వాలంటీర్లు విశేషంగా సేవలందించారు.స్థానిక కమ్యూనిటీ నాయకులు, సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు అందించారు. అలాగే ట్రెజరర్ మూర్తి రేకపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డా. రెడ్డి ఉరిమిండి, ఆది మొర్రెడ్డి, మహిళా కమిటీ చైర్ రేఖా రెడ్డి ప్రత్యేక సహకారం అందించారు. అలాగేఎస్వీ ఆచార్య, డా. సురేంద్రన్, డా. గిరీష్ రావు, సురేష్ కుమార్, త్యాగరాజన్, దీన్ దయాళన్ మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇవిపి శ్యామ్ అప్పాలి, సెక్రటరీ వంశీ కృష్ణ ఎరువారం, పబ్లిసిటీ కమిటీ చైర్ రత్నకుమార్ కవుటూరు, గిరి కోటగిరి, నీలిమ గడ్డమనుగు కలిసి సంయుక్తంగా ఆడియో, వీడియో, మీడియా ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించారు. చివరగా ఈ కార్యక్రమం శంకర నేత్రాలయ యూఎస్ఏ సేవా లక్ష్యాన్ని మరింత బలపరచింది.చదవండి: న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం -
కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం మరువకముందేమరో బ్యాంకులో జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. హర్యానాలో కొటక్ మహీంద్రా బ్యాంక్లో రూ. 160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయిహర్యానాలోని పంచకుల మునిసిపల్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ దాదాపు రూ. 160 కోట్లు. అయితే, ఎఫ్డీల్లో జమ చేసిన నధులు అసలు డిపాజిట్టే కాలేదు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ సొమ్మును ఇతర మోసపూరిత ఖాతాలకు మళ్లించారు. ఇందుకోసం హర్యానాకు చెందిన పంచకుల మున్సిపల్ కార్పొరేషన్కు నకిలీ పత్రాలను జారీ చేశారని అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలుగులోకి ఎలా వచ్చింది?రూ. 58 కోట్ల విలువైన ఒక FD గడువు ముగిసిన తర్వాత, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని కార్పొరేషన్ బ్యాంకును కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు స్టేట్మెంట్ ప్రకారం బదిలీ పూర్తయినట్లు చూపించినప్పటికీ, ఆ నిధులు కార్పొరేషన్ ఖాతాకు చేరలేదు. ఆరా తీస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నకిలీదేనని నిర్ధారణ అయ్యింది.డబ్బు మాయమైపోయిందని తేలింది. ఈ వ్యవహారంలో బ్యాంకు జారీ చేసిన FDలన్నీ నకిలీవని, ఖాతాలో అసలు నిధులే లేవని గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి బ్యాంకు ఉద్యోగులు చాలాకాలం పాటు ఈ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.తమ ఎఫ్డీ నిధులను బదిలీ చేయమని బ్యాంకును కోరినప్పుడే ఈ వ్యవహారం బైటపడిందని, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని స్టేట్ విజిలెన్స్కు నివేదించారు. బ్యాంక్పై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడంతో పాటు, ఆ బ్యాంక్ను ప్రభుత్వ పనుల నుండి తొలగించాలని (de-empanel) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. అటు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.కాగా గత నెలలోనే చండీగఢ్లోని ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) శాఖలో హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 590 కోట్ల నిధులు ఇలాగే మాయమయ్యాయి. ఆ కేసులో బ్యాంక్ ఇప్పటికే పూర్తి సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా ఇలాంటిదే జరగడం కలకలం రేపుతోంది -
ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఏప్రిల్ 10న భూత్ బంగ్లా విడుదల కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
కాంగ్రెస్కు గుడ్బై.. రేవంత్పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బెన్ డకెట్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్ను రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే టెస్టు కెరీర్పై దృష్టి సారించడంతో పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు డకెట్ పేర్కొన్నాడు. తాజాగా డకెట్ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బుధవారం తొలిసారి స్పందించింది. ‘బెడ్ డకెట్ తాను ఈ సీజన్కు అందుబాటులో ఉండడం లేదని మాకు ముందే చెప్పాడు. బెన్ డకెట్ స్థానంలో మరొకరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాం. డకెట్ స్థానంలో ఎవరిని తీసుకుంటామనేది త్వరలోనే పేర్కొంటాం.’ అని చెప్పుకొచ్చింది. అయితే డకెట్ తాను వైదొలిగే విషయమై ఢిల్లీ క్యాపిటల్స్కు ముందే చెప్పినప్పటికీ ఐపీఎల్ నియమావళి ప్రకారం అతడిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే లీగ్ నిబంధనల ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న తర్వాత సరైన కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్నెస్ సమస్యలు, పితృత్వ సెలవులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ డకెట్ విషయంలో ఫిట్నెస్, గాయం లాంటి అంశాలు లేవు. టెస్టు కెరీర్పై ఫోకస్ పెట్టడంతో పాటు ఫ్యామిలీతో సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నప్పటికీ డకెట్ బెంచ్కే పరిమితమయ్యాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని డకెట్ అది ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు వెళ్లాడు. అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్లో దారుణ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు కలిపి కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టెస్టు క్రికెట్పై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్న బెన్ డకెట్ తాజాగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో టెస్టులపై దృష్టి సారించేందుకు డకెట్ కౌంటీల్లో నాటింగ్హమ్షైర్ తరఫున మ్యాచ్లు ఆడనున్నాడు.చదవండి: కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా -
అందరికీ విమాన ప్రయాణం ఫ్రీ అంటే పోలా.. గెలిచిన తర్వాత హామీల సంగతి దేవుడెరుగు!!
-
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్
రాజమౌళి ఏ సినిమా తీసినా కాస్త రహస్యంగానే ఉంచుతాడు. బాహుబలి కావొచ్చు, ఆర్ఆర్ఆర్ కావొచ్చు.. జక్కన్న అనుకున్నప్పుడే ఏ చిన్న విషయమైనా బయటకొచ్చేది. అలాంటిది మహేశ్ బాబుతో తీస్తున్న 'వారణాసి' కోసం ఇంతకు ముందులా కాదు చాలా మారిపోయినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మూవీ రిలీజ్కి ఏడాదిన్నర ముందే టీజర్ లాంటిది రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇప్పుడు మూవీ సెట్స్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్)సాధారణంగా చిత్రీకరణ ఫొటోలు, సెట్ ఫొటోలు గానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండే రాజమౌళి.. గతేడాది నవంబరులో మూవీ టీజర్/గ్లింప్స్ రిలీజ్ కోసం ఏకంగా హాలీవుడ్ మీడియాలోని కొందరిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఆ సమయంలో తానే స్వయంగా వాళ్లని 'వారణాసి' షూటింగ్ లొకేషన్స్కి తీసుకుని వెళ్లాడు. అప్పుడు వాళ్లు సెట్స్కి సంబంధించిన వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.వారణాసి వీధులు, ఘాట్స్ తదితర సెట్స్ ఇందులో చూపించారు. మినీయేచర్ సెట్ వీడియో కూడా ఇందులో చూడొచ్చు. ఇకపోతే రెండు నెలల క్రితం హాలీవుడ్కి చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్స్కి మూవీ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు రిలీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటివి.. సినిమా రిలీజ్ టైంలో ప్లాన్ చేస్తుంటారు. కానీ రాజమౌళి ఏడాదిన్నర ముందు నుంచి ఇలాంటివి ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. చూస్తుంటే ఈసారి హాలీవుడ్లోనూ గట్టిగా పాగా వేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి?గ్లోబ్ట్రాటర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న 'వారణాసి'లో రుద్ర అనే పాత్రలో మహేశ్ కనిపించబోతున్నాడు. మందాకిని అనే పాత్ర ప్రియాంక చోప్రా చేస్తుండగా, కుంభ అనే ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి) View this post on Instagram A post shared by DiscussingFilm (@discussingfilm) -
కూటమికి ఝలక్.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూటమి సర్కార్ టార్గెట్గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో, కొలికపూడి పోస్టు చర్చనీయాంశంగా మారింది.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తాజాగా బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందించారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్గా ఏర్పడి బెల్టు షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎమ్మార్పీపై 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 వసూలు చేస్తున్నారంటూ పోస్టులో తెలిపారు. లిక్కర్ సిండికేట్తో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు పాటించడం లేదు. గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ బెల్ట్ షాపుల దందా కొనసాగుతోందన్నారు. దీంతో, కొలికపూడి పోస్ట్ మరోమారు చర్చనీయాంశంగా మారింది. -
బొలిశెట్టి సత్యనారాయణకు షాకిచ్చిన జనసేన
సాక్షి, విజయవాడ: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేని తాజాగా జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.అయితే, బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల విశాఖలో పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. కొల్లేరులో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అయితే, కొద్దికాలంగా కూటమిలో టీడీపీ చేస్తున్న అన్యాయాన్ని బొలిశెట్టి ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూటమి పార్టీ అయిన జనసేన దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో, బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి సంబంధం లేదని జనసేన ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పార్టీకి సంబంధంలేదని తేల్చి చెప్పింది.శ్రీ బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలియచేస్తున్నాము. pic.twitter.com/Xo1aBaiqAH— JanaSena Party (@JanaSenaParty) March 25, 2026పార్టీ నిర్ణయంపై బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన..‘పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.మనల్ని కలిపిన, మనం కలిసి పనిచేద్దాం అనుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ, పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు. ముఖ్యంగా కొల్లేరు సరస్సు రక్షణ విషయంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మరియు భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నందున మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను.అలాగే, పర్యావరణ ప్రభావ అంచనాలు (Environmental Impact Assessment) లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి (Land Use Conversion) వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో మీ వంతు బాధ్యతను మీరు చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత సిద్ధాంతాలకు మరియు సామాజిక బాధ్యతకు విలువనిస్తూ నా నిర్ణయాన్ని ఆమోదించిన మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు’ అని వ్యాఖ్యలు చేశారు. గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక… pic.twitter.com/whOs56u2SU— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 25, 2026అయితే, అంతకుముందే బొలిశెట్టి సత్యనారాయణ కొల్లేరు విషయమై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా..‘కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా?. కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం!. సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది..ఆక్రమణలను తొలగించకుండా, కనీస శాస్త్రీయ హైడ్రాలజీ అధ్యయనం లేకుండా ₹2,952 కోట్లతో 'శాలినిటీ మిటిగేషన్' పేరుతో అశాస్త్రీయ కట్టడాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఈ పనులపై స్టే ఇచ్చింది. ప్రకృతిని కాంక్రీట్ గోడలతో బంధించలేము; కొల్లేరుకు కావాల్సింది 'శాస్త్రీయ పునరుద్ధరణ'. ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల ఉపాధి హామీ పథకంగా మార్చవద్దు. కొల్లేరును దాని సహజ స్థితికి ఎలా తీసుకురావచ్చో, శాస్త్రీయ ఆధారాలు మరియు మ్యాప్స్తో సహా ఈరోజు ఇంటర్వ్యూలో వివరించాను.. మన పర్యావరణాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది’ అంటూ పోస్టు చేశారు.కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా ?కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం! సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది..… pic.twitter.com/fxdzIAbXAf— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 24, 2026 -
‘నల్లోడు.. నల్లకేకు.. అంతలో గావస్కర్ వచ్చి’
వర్ణ వివక్ష కారణంగా మానసికంగా తానెంతో కుంగిపోయానన్నాడు భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్. తన శరీరం నలుపు రంగులో ఉన్నందున ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయాడు. తన ప్రతిభను గుర్తించకుండా కేవలం మేని ఛాయను చూసి హేళన చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రతిభ ఉన్నా కాగా తమిళనాడుకు చెందిన శివరామకృష్ణన్ 1980వ దశకంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన పడగొట్టిన అతడు.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశాడు. ఇక 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్ గావస్కర్ సారథ్యంలో భారత జట్టు బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్షిప్ గెలవడంలోనూ అతడిది కీలక పాత్ర.అయితే, ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైపోయిన శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఐసీసీ క్రికెట్ కమిటీలో ప్లేయర్ రిప్రజెంటేటివ్గానూ పనిచేసిన అతడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నల్లగా ఉన్నాననే కారణంతోనే 23 ఏళ్లుగా బీసీసీఐ తనను విస్మరించిందని.. టాస్లు వేయడానికి అనుమతించలేదని సంచలన ఆరోపణలు చేశాడు.షూ శుభ్రం చేయమని చెప్పాడుతాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన శివరామకృష్ణన్ చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి గుర్తుచేసుకున్నాడు. ‘‘పద్నాలుగేళ్ల వయసులో చెపాక్లో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను నెట్బౌలర్గా చేరాను.అప్పటికి స్కూల్ నుంచి యూనిఫామ్లోనే ఉన్నాను. వెంటనే వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాను. ఇంతలో భారత జట్టుకు చెందిన ఓ సీనియర్ బ్యాటర్ నన్ను పిలిచి.. తన షూ శుభ్రం చేయమని చెప్పాడు.అందుకు నేను గట్టిగానే బదులిచ్చాను. అది నా పని కాదని చెప్పేశాను. నిజానికి ఆయన నన్ను గ్రౌండ్ సిబ్బంది అనుకుని పొరబడ్డారట. జాతి, వర్ణ వివక్ష అంటే ఏమిటో అప్పటిదాకా నాకు తెలియదు. ఆ మనిషి అన్న మాటలకు ఆరోజు ఎలా స్పందించాలో నాకు తెలియలేదు.నల్లోడు అంటూ హేళనఇక తమిళనాడు జట్టులోనూ నన్ను కరుపా (నల్లోడు) అని పిలిచేవారు. ముంబై, చండీగఢ్, జలంధర్ వంటి చోట్ల బౌండరీల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. ‘నల్లోడా.. నీకేమైంది?’ అంటూ హేళన చేసేవారు.నా 17వ పుట్టినరోజున అనుకుంటా. సునిల్ గావస్కర్ నా కోసం కేక్ తెప్పించాడు. ఇంతలో ఓ సీనియర్ ఆటగాడు వచ్చి.. ‘హేయ్ సన్నీ.. నువ్వు సరైన రంగున్న కేక్నే ఆర్డర్ చేశావు. నల్లబ్బాయికి నల్లటి (డార్క్ చాకొలెట్ కేక్) కేకే కరెక్ట్’ అని అన్నాడు. దీంతో నేను ఎంతో బాధపడ్డాను. కన్నీళ్లు కారుస్తూ..అంతలో సన్నీ వచ్చి నన్ను ఓదార్చి, బుజ్జగించి కేక్ కట్ చేయించాడు. అప్పటికి నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి’’ అని చేదు అనుభవాలను లక్ష్మణ్ శివరామకృష్ణన్ గుర్తుచేసుకున్నాడు.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి డా.అశోక్ కుమార్తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ‘యుద్ధం పేరు చెప్పి వంటనూనె ధరలు లీటర్కు రూ.4౦ వరకు పెంచేశారు. పప్పుల ధర కిలోకి రూ.15లకు పైగా పెంచేశారు. బ్లాక్లో సిలిండర్లను రూ.2 వేలకు, రూ.3వేలకు అమ్ముతున్నారు. ఇప్పుడు కిరోసిన్ ఇస్తామంటున్నాడు. ఇప్పుడు కొత్తగా కిరోసిన్ స్టౌవ్లు కొనుక్కోవాలా?. మొక్కజొన్న, కోకో, శెనగ, అరటి, టమోటా పంటలకు ధర లేదు.చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి. క్రెడిట్ దోపిడీ చేస్తున్నాడు.ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చంద్రబాబుది క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు. 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ నాతో సమావేశమయ్యారు. రూ.4,800 కోట్లు గ్రీన్కోలో పెట్టుబడులు పెట్టారు. ఎస్ఆర్ స్టీల్ను కొనుగోలు చేసి మన హయాంలో వేయికోట్లు పెట్టుబడులు మన హయాంలో పెట్టారు. కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటే మనమే ఆహ్వానించాం. మా హయాంలోనే కాకినాడ, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపించాం. ఎన్నికలకు ముందు వచ్చి నక్కపల్లిని ఎంపిక చేసుకున్నారు. తనని చూసి స్టీల్ప్లాంట్ వచ్చినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారు. గూగుల్ విషయంలోనూ ఇలాగే క్రెడిట్ దోపిడి చేస్తున్నారు.2023లో బల్క్ డ్రగ్ పార్క్ తీసుకు వచ్చాం. ఎక్కవ ల్యాండ్ కావాలని సంక్షోభం సృష్టించారు. దీనివల్ల బల్క్ డ్రగ్ పార్క్ తిరోగమనంలో ఉంది. మన హయాంలో 3 పోర్టులు ప్రభుత్వ రంగ పోర్టులు తీసుకు వచ్చాం. రెండేళ్లు గడిచినా పోర్టుల్లో పనులు ముందుకు సాగడం లేదు. పోర్టులకు చుట్టుపక్కల మళ్లీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.కష్టపడే కార్యకర్తలకు పెద్దపీటనియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త. మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. మన పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం. పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో మనం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాం.ఇప్పుడు మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయి. సీట్లు పెరగడం వల్ల మన కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారు. పార్టీలో పటిమ చూపించే వారికి, కష్టపడే వారికి పెద్దపీట వేస్తాం. జగన్ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట’ ఉంటుందని స్పష్టం చేశారు. -
West Bengal: కబీర్కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- 2026 సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నడవాలని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒవైసీని తన ‘పెద్దన్న’ (బడా భాయ్)గా అభివర్ణించిన హుమాయున్ కబీర్.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.ఒవైసీ అడుగుజాడల్లోనే..తమ కూటమి వివరాలను వెల్లడిస్తూ 182 నుండి 192 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు కబీర్ తెలిపారు. ‘నా పెద్దన్న అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ గడ్డపైకి వచ్చారు. ఏజేయూపీ, ఏఐఎంఐఎం కలిసి ఈ ఎన్నికల యుద్ధంలో తలపడతాయి. ఆయనను నా సొంత అన్నలా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనీసం 20 భారీ ర్యాలీల్లో నాతో కలిసి పాల్గొంటారు’ అని అన్నారు. ఏప్రిల్ 1న బెహ్రంపూర్లో లక్షలాది మందితో నిర్వహించే తొలి సభకు ఒవైసీ స్వయంగా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. Kolkata | Founder of Janata Unnayan Party, Humayun Kabir and AIMIM President Asaduddin Owaisi hold a joint press conference after they announced an alliance between their parties for the West Bengal electionsHumayun Kabir says," We will hold 20 rallies all over the state. The… pic.twitter.com/GOrROLs1cZ— ANI (@ANI) March 25, 2026ఎప్పటికీ విడిపోని బంధంఈ పొత్తు కేవలం 2026 ఎన్నికల కోసమే కాదని, రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం ఒవైసీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని కబీర్ ఉద్ఘాటించారు. ‘నా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దిశగా నడిపించినా తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ కూటమి ఎప్పటికీ విడిపోదు’ అంటూ తన నిబద్ధతను చాటుకున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర బెంగాల్, కోల్కతా తదితర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ప్రతిపక్షాల ఫైర్మరోవైపు ఈ పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒవైసీ, హుమాయున్ కబీర్ కలవడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలిపోయి, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుతుందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓటర్లు ఏకాకి అవుతారని, అయితే జనం వీరిని నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ముస్లిం ఉప ముఖ్యమంత్రి వస్తారని కబీర్ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ!
పల్నాడు జిల్లా: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న మిట్టగుడిపాడు క్రాస్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల జ్యోతి(35) గుంటూరులో చదువుతున్న తన కుమారుడు శ్రీనివాసరెడ్డిని రెంటచింతలలో గుంటూరు బస్సు ఎక్కించి అనంతరం స్థానిక బ్యాంక్లో తన ఖాతాకు సంబంధించిన పనిని ముగించుకుని జెట్టిపాలెంకు స్కూటీపై బయలు దేరింది. మిట్టగుడిపాడు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు దాటుతుండగా గురజాల నుంచి మాచర్ల వైపు అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో స్కూటీ సుమారు 60 మీటర్లు దూరం ఎగిరి పడింది. ఈ ప్రమాదంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్రగాయాలు కాగా పల్లెర్ల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో డ్రైవర్ ఎం.మల్లిఖార్జునరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకట రమణ, ఎస్ఐ సీహెచ్ నాగార్జున వెంటనే చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో విచారించారు. మృతురాలి తల్లి చేర్రెడ్డి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామ నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ! మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పల్లెర్ల జ్యోతి నడిపిన స్కూటీ 5 సం. కిందట ఆమె భర్త పల్లెర్ల రామచంద్రారెడ్డి దివ్యాంగుడు కావడంతో మూడు చక్రాల స్కూటీ మీద పొలం వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డాడు. రామ చంద్రారెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ స్కూటీకి ఉన్న మూడవ చక్రం తీసివేసి జ్యోతి ద్విచక్ర వాహనంగా వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతిచెందింది. వేర్వేరు ప్రమాదాలలో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన రామచంద్రారెడ్డి, జ్యోతిల 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు అనాధలుగా మారారు. 2025 మార్చి 1 వ తేదిన జాతీయ అధికారులు, ట్రాన్స్పోర్టు అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కూడలిని బ్లాక్స్పాట్గా గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంలో ఇక్కడే పలు రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు వీధులపాలైనట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక కోరుతున్నారు. -
కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!
మన చుట్టూనే ఎందరో కష్టజీవులు ఉన్నారు. తమ కష్టంతో తలరాతలనే మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నావారెందరో ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ యువకుడు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో పాడ్కాస్టర్ కుశల్ షేర్ చేసిన ఆ యవకుడి కథ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు, స్ఫూర్తిదాయకమైన కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. చుట్టూ పరిమిత వనరులు..నిరంతర శ్రమతో కూడిన జీవితం నుంచి పైకొచ్చిన యువకడి స్టోరీ ఇది.!.ఆ అబ్బాయే ముంబైకి చెందిన అభిషేక్ ఆర్ వైశ్య. టీనేజ్ వయసు నుంచే వృత్తి జీవితం మొదలైంది. సుమారు 13 నుంచి 20 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని అత్యంత రద్దీప్రాంతమైన దాదర్లో కూరగాయలు అమ్ముతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేవాడు. ప్రతిరోజు అతడి దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది. ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కూరగాయల అమ్మకాలు చూసుకునేవాడు. ఆ తర్వాత ఏ మాత్రం విరామం లేకుండా సీఏ కోచింగ్ క్లాసులకు వెళ్లిపోయేవాడు. అలా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్లాసులతో సరిపోయేది. ఆ క్లాసులు ముగిశాక, అతను రోజంతా ఆర్టికల్ షిప్ శిక్షణకు కేటాయించుకునేవాడు. సీఏ కోర్సులో భాగంగా ప్రాక్టీకల్ అనుభవం కోసం చేసే సీనియర్ సీఏ వద్ద చేసే ట్రైనింగ్ ఈ ఆర్టికల్ షిప్. ఇక రాత్రి 11 గంటల టైంకి ఫ్రీ టైం దొరుకుతుంది. ఇక ఆ సమయంలో చదువుకోవడానికి సమయం కేటాయించుకునేవాడు. పైగా ఉండే గది కూడా కేవలం 150 చదరపు అడుగుల చిన్న గది. పరిమిత స్థలం, పరిమిత వనురులే అయినప్పటికీ..ఎదగాలన్న తాపత్రయం, కసి పుష్కలంగా ఉండేవి. అవి అతడిని..అంత కష్టాన్ని భరించే శక్తిని ఇచ్చేవి. అలా అతడు సీఏ ఉత్తీర్ణుడై..విదేశాలకు వెళ్లాడు. అలా ఒమన్కు వెళ్లి అక్కడ ఆరేళ్లు పనిచేసి, వృత్తిపరమైన అనుభవాన్ని పొందాడు. చివరికి వ్యవస్థాపకరంగంలోకి అడుగుపెట్టి.. సొంత వ్యాపారాలతో సంపదను పెంచుకున్నాడు. మంచి స్థాయిలోకి వచ్చాక చేసిన మొదటి పని తండ్రిని ఆ కూరగాయలు అమ్మే పని నుంచి మానిపించేయడం. ఆ తర్వాత భారత్, దుబాయ్, ఒమన్ వంటి చోట్ల మొత్త ఐదు ఫ్లాట్లు కొనుగులు చేశాడు. పైగా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్ల తోపాటు ఒమన్లో అతడికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లౌడ్కిచెన్ వ్యాపారాన్ని కూడా రన్ చేస్తుండటం విశేషం. పట్టుదలతో చక్కగా కెరీర్ని తీర్చిదిద్దుకున్న అతడి కథను వివరిస్తూ..పాడ్కాస్టర్ కుశల్ ఇలా అన్నారు. అభిషేక్ను వ్యక్తిగతంగా కలవడం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు. అతనిపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. మనం కోరుకున్న లక్ష్యంవైపుకి వెళ్లడం కోసం ఎంతలా కష్టపడాలి, ఎంతటి పట్టుదల ఉండాలో తెలిసి వచ్చిందని కుశాల్లోధా అన్నారు. అతడితో సంభాషణ స్ఫూర్తిదాయకంగానే కాదు పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి ఆశయాన్ని అయినా పాదాక్రాంతం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.He used to sell vegetables at Dadar with his father from age 13-20.He used to sell vegetables early in the morning from 4 to 6 AM, then go for his CA Final classes from 7-10 AM, then go for articleship from 10 AM – 9 PM, study for a bit, and then sleep by 11 PM.He used to… pic.twitter.com/ihRK4OG39g— Kushal Lodha (@kushallodha548) March 19, 2026 (చదవండి: ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..) -
Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్!
అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం అస్సాం గణ పరిషత్ (ఏజీపీ). ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ అనే స్థాయి నుండి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరుకుంది. ఆ పార్టీ ప్రస్థానం ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పాఠాలు నేర్పుతుంది. అస్సాం గణ పరిషత్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన పార్టీ. 1979 నుంచి 1985 వరకు అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమం దీనికి పునాది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా అస్సాం ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే విద్యార్థి నేతలు ప్రఫుల్ల కుమార్ మహంత నాయకత్వంలో ఏజీపీని స్థాపించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఉద్యమ ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ పుట్టిందో ఆ సమస్యను పరిష్కరించడంలో పాలకులు చొరవ చూపలేకపోయారు. దీనికి తోడు పార్టీ అంతర్గత కుమ్ములాటలు అవినీతి ఆరోపణలు పాలనా వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయి. నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.దెబ్బతీసిన స్నేహం..ఏజీపీ పతనానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలతో అది చేసిన స్నేహమనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది. అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది.ఏజీపీలో మొదటి నుండి సామూహిక నాయకత్వం కొరవడింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది. సమర్థులైన నాయకులు చాలా మంది బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. పార్టీ కేడర్ సైతం తమ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు. నేడు ఏజీపీ కేవలం ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది. ఏజీపీ పతనం ఒక హెచ్చరిక..ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగపూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ ఆ భావజాలాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది. అస్సాం ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కోసం సరికొత్త వేదికలను వెతుక్కుంటున్నారు. ఏజీపీ మాత్రం తన గత వైభవం వైపు దీనంగా చూస్తోంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో ఏజీపీ సంఖ్య నామమాత్రంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీజేపీ వేవ్ లో తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఆ పార్టీ దయనీయ స్థితిని సూచిస్తున్నాయి. మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ మూలాల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది. -
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి నుంచి వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళన, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించాయన్న వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.ఓఎంసీలు - డీలర్లు.. క్రెడిట్ విధానం అంటే ఏమిటి?ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ (అప్పు) సౌకర్యంపై జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించిన సొమ్ము చెల్లించడానికి కొంత సమయం (క్రెడిట్ పీరియడ్) ఇస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత వల్ల ఓఎంసీలు తమ రిస్క్ను తగ్గించుకోవడానికి డీలర్ల క్రెడిట్ పరిమితులను తగ్గించడం లేదా ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించి స్టాక్ తీసుకోవడం) విధానాన్ని అమలు చేస్తున్నాయి. చేతిలో నగదు లభ్యత తక్కువగా ఉన్న చిన్న డీలర్లు క్రెడిట్ దొరకకపోవడంతో స్టాక్ను తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప కంపెనీల వద్ద స్టాక్ లేక కాదని నిపుణులు చెబుతున్నారు.యుద్ధ ప్రభావం ఎంతవరకు?పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే, భారత ప్రభుత్వం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండటం వల్ల తక్షణమే ఇంధన సరఫరా నిలిచిపోయే అవకాశం లేదు. డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతర్గత చెల్లింపుల వ్యవహారాలను వాహనదారులు కొరతగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా సజావుగానే సాగుతోందని అధికారులు నిర్ధారించారు.కొరత లేదు.. ఆందోళన వద్దుతెలంగాణలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్) డిపోల వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా ఆగిపోతుందనేది కేవలం ఊహాగానమేనని, ప్రస్తుతానికి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళనతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కంపెనీల స్పందన..వదంతులను నమ్మొద్దు: బీపీసీఎల్భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా రిఫైనరీలు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి’ అని సంస్థ పేర్కొంది.చమురు కంపెనీల ఉమ్మడి ప్రకటనబీపీసీఎల్, హెచ్పీసీఎల్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ (ఎల్పీజీ) సరఫరా కూడా సుస్థిరంగా ఉందని వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా నెట్వర్క్ ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇరాన్ నుంచి రిలయన్స్ చమురు కొనుగోలుమరోవైపు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
పెద్దలకు అర్థం కాకుండా పోతున్న టీనేజర్ల ప్రపంచం
జెన్ ఆల్ఫాకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్ప్లే, యాడ్స్తో పెద్దల కంటెంట్ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచం చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్దలకు తమ పిల్లలపై ఉన్న అవగాహనను తుడిచిపెడుతోంది. వినోదానికీ, వాణిజ్యానికీ తేడా తెలియని జెన్ ఆల్ఫా తరం ఓ విష వలయంలో చిక్కుకుంటోంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్తో కలిసి, అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) అకాడమీ ‘వాట్ ది సిగ్మా?’ అనే ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన తేలి్చంది. ఈ పరిశోధన హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో జరిగింది. వ్లాగ్స్, షార్ట్స్, గేమ్ప్లేలోని స్పాన్సర్డ్ కంటెంట్లో జెన్ ఆల్ఫా తరం చిక్కుకుంటోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి రెండు వేర్వేరు ప్రపంచాలు కావు.. రెండూ ఒక్కటే అనే భావనకు విపరీతంగా గురవుతున్నారు. మరి వీరిపై వాణిజ్యపరమైన ప్రభావం ఏమిటి? 7నుంచి 15 ఏళ్ల వయసు (జనరేషన్ ఆల్ఫాకు చెందిన) పిల్లలు మీడియా, కంటెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? హైపర్–డిజిటల్ వాతావరణంలో వాణిజ్య సందేశాలను ఎలా గుర్తిస్తారు? ఎలా వర్గీకరిస్తారు? ఎలా అర్థం చేసుకుంటారు? వంటి విషయాలను అధ్యయనంలో పరిశీలించారు. పిల్లల అంతర్జాలం.. పెద్దల్లో గందరగోళం.. జెన్ ఆల్ఫా తరం ఇంటర్నెట్తో పాటు వృద్ధి చెందకుండా.. ఇంటర్నెట్లో ఇరుక్కుపోతున్నారు. వారి సాంస్కృతిక సంకేతాలు, సౌందర్య భావనలు, భాషా ప్రపంచం నెమ్మదిగా వేరవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సమకాలీనమైన ఈ తరానికి సంబంధించిన ప్రస్తావనలు అపరిచితంగా ఉంటాయి. హాస్యం అస్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, వారికి ఆట స్థలంలో ఆటలాగా తక్షణమే, అందరితో పంచుకోవాల్సిన అంశాలుగా మారుతున్నాయి. పిల్లల డిజిటల్ ప్రపంచం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కోల్పోతున్న పరిస్థితుల్లో.. వీక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఫీడ్తో బిజినెస్ అల్గారిథం రంగంలోకి దిగింది. ఈ పరిణామం ఎంత వేగంగా జరుగుతోందంటే, పెద్దలను వారి పిల్లల ప్రపంచంలో నిరక్షరాస్యులుగా మార్చేస్తోంది. తాము పూర్తిగా చూడలేని వారి ప్రపంచంలో హానికరమైన కంటెంట్ అంటే ఏమిటో తెలియక, స్క్రీన్ సమయం, డిజిటల్ వినియోగంపై నియమాలను నిర్దేశిస్తూ, అమలుపై స్పష్టత లేని స్థితిలో తల్లిదండ్రులు నిరంతరం నియమాలను సవరించుకుంటున్నారు.వినోదం రూపంలో ప్రమాదం.. చిన్న పిల్లలు (7–12 మధ్య వయసు్కలు) అత్యంత స్పష్టమైన ప్రకటనలను మాత్రమే గుర్తిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్లు, గేమింగ్ అనుసంధానాలు, వ్లాగ్ స్పాన్సర్íÙప్లు వీరికి కేవలం వినోదంగానే అనిపిస్తాయి. పెద్ద పిల్లలు (13–15 మధ్య వయస్కులు) ప్రకటనల అక్షరాస్యతను ఎక్కువగా పెంపొందించుకున్నా.. భావోద్వేగాలతో కూడిన, కథనంతో మిళితమైన బ్రాండ్ సందేశాలకు సులభంగా ప్రభావితమవుతుంటారు. నిరంతరాయంగా ప్రసారమయ్యే మీడియా ప్రవాహంలో మునిగిపోవడంతో వీరిలో విచక్షణా శక్తి తగ్గిపోతోంది.డిజిటల్ సొసైటీ దిశగా.. జెన్ ఆల్ఫాకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్ప్లే, యాడ్స్తో పెద్దల కంటెంట్ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.క్రమబదీ్ధకరణకు ఓ వ్యవస్థ అవసరం.. ఈ నేపథ్యంలో జెన్ ఆల్ఫాకు మార్కెటింగ్ విషయంలో బాధ్యతాయుతమైన విధానాన్ని నిర్ధారించడానికి, ప్లాట్ఫామ్లు, కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనదారులు, తల్లిదండ్రులు, పాఠశాలల సమన్వయంతో ఓ నిరీ్ణత వ్యవస్థ అవసరమని అధ్యయనకర్త అభిప్రాయం. పాఠశాలల్లో మీడియా, ప్రకటనల అక్షరాస్యత వాణిజ్య విద్య ద్వారా వాణిజ్య ఉద్దేశంపై అవగాహన పెంపొందించడం అవసరమని స్పష్టం చేసింది.అధ్యయనకర్తలు ఏమంటారంటే.. ‘ఏఎస్సీఐ అకాడమీ’ వాట్ ది సిగ్మా?’ అధ్యయనం, జనరేషన్ ఆల్ఫా కంటెంట్ జీవితంపై జరిపిన ఒక పరిశోధన. ఇది వారిని విమర్శించడానికి కాదు, వారిని అర్థం చేసుకోవడానికి. వారి సాంస్కృతిక దృక్పథాలు, మునుపటి తరాల వారి దృక్పథాల నుంచి భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వీరే అతి పిన్న వయసు్కలైన మీడియా వినియోగదారులు కాబట్టి, వారు ప్రకటనలను ఎలా తీసుకుంటారు? అనే దానిపై అవగాహన పొందడం.. బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడంలో మొదటి అడుగు.’ అని ఏఎస్సీఐ సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ అంటున్నారు. ‘గత తరానికి డిజిటల్ మీడియా పరిచయం కాగా, ఈ తరానికి అదే ప్రపంచం. వీరికి కంటెంట్తో సంబంధం ఉంది, దీనిని తల్లిదండ్రులు, విశ్లేషకులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నివేదిక వారు ఏమి చూస్తున్నారో మాత్రమే కాకుండా, అల్గారిథమ్, కంటెంట్, ప్రకటనల ద్వారా వారు ఎలా ప్రభావితమవుతున్నారో అన్వేíÙంచింది. ప్రకటనల వాతావరణంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? అనే ప్రయత్నాలకు ఆలంబనగా.. ఇది జెన్ ఆల్ఫా, వాస్తవ పరిస్థితులపై అవగాహన కలి్పంచడానికి ప్రయత్నించింది’ అని ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ సంతోష్ దేశాయ్ చెబుతున్నారు. -
Tamil Nadu: ఏఐఏడీఎంకే తొలి జాబితా.. ‘ఎడ్పాడి’ పళనిస్వామిదే!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎన్డీఏ కూటమి సారథిగా ఉన్న ఏఐఏడీఎంకే తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బుధవారం 23 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసి, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో పైచేయి సాధించే వ్యూహాన్ని పళనిస్వామి అమలు చేస్తున్నారు.సొంత గడ్డపైనే పోటీపార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్) తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ‘ఎడ్పాడి’ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. తన కంచుకోటను కాపాడుకుంటూనే, రాష్ట్రవ్యాప్తంగా కూటమిని విజయపథంలో నడిపించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.సీనియర్లకే పెద్దపీటతొలి జాబితాలో పార్టీలోని హేమాహేమీలకు ఏఐఏడీఎంకే పెద్దపీట వేసింది. సీనియర్ నాయకులు కేపీ మునుసామి, దిండిగల్ సి. శ్రీనివాసన్, నథమ్ ఆర్. విశ్వనాథన్ వంటి కీలక నేతలు తమ పాత స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బలమైన నేతలుగా పేరున్న ఎస్పీ వేలుమణి (తోండముత్తూరు), పి. తంగమణి (కుమారపాళయం) నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నారు.రేసులో ముందంజరాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన తొలి పార్టీగా ఏఐఏడీఎంకే నిలిచింది. ఇప్పటికే సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' (ఎన్టీకే) అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ప్రధాన కూటముల్లో మాత్రం ఏఐఏడీఎంకేనే అందరికంటే ముందుగా అడుగు వేసింది. కేవలం 23 స్థానాలకే ప్రస్తుతం జాబితా పరిమితమైనా, కీలక నేతలందరినీ ముందే రంగంలోకి దించడం ద్వారా కేడర్లో ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏఐఏడీఎంకే, ఈ తొలి జాబితా ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்றக் கழக முதற்கட்ட வேட்பாளர்கள் பட்டியல்.- மாண்புமிகு கழகப் பொதுச்செயலாளர் புரட்சித் தமிழர் @EPSTamilNadu அவர்கள் அறிவிப்பு. #EPSfor2026#Vote4AIADMK pic.twitter.com/HVvrcUtDpt— AIADMK - SayYesToWomenSafety&AIADMK (@AIADMKOfficial) March 25, 2026 -
లాటరీ కింగ్ కొడుకు.. పుదుచ్చేరిలో కోట్లకు పడగలెత్తాడు
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న లక్ష్య జన నాయగ కట్చి పార్టీ అధ్యక్షుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన ఆస్తి రూ.537 కోట్లుగా ప్రకటించారు. కామరాజర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల సంఘానికి అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జోస్ చార్లెస్ మార్టిన్ వద్ద రూ.25.67 కోట్ల విలువైన 17.5 కిలోల బంగారం, రూ.44 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆయన పేరిట రూ.328 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రూ.1.29 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయి. రూ.1.77 కోట్ల విలువైన వాచ్, రూ.38.53 కోట్ల విలువైన ముత్యాల హారాలు కూడా ఉన్నాయి. లండన్లో రూ. 5.64 కోట్లు, దుబాయ్లో రూ.1.50 కోట్లు విలువైన నివాసాలున్నాయని పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, నాగాలాండ్, పంజాబ్లో లాటరీ అమ్మకాలలో 4.53 శాతం వాటా, బెంగాల్లో 3 లాటరీ కేసులు, ఎర్నాకుళంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 3 కేసులున్నాయని తన అఫిడవిట్లో వివరించారు. షేర్లలో రూ.14.28 కోట్లు, వివిధ బ్యాంకుల్లో రూ.200 కోట్లు డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. అలాగే, రూ. 210 కోట్లు అప్పులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం తన ఆస్తి రూ.537 కోట్లుగా లెక్క చూపించారు. చార్లెస్ లాటరీ అధినేత మార్టిన్ కుమారుడు కావడం గమనార్హం. -
’ముందు షారుఖ్ ఖాన్.. ఆ తర్వాత అతడే’
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే సహచర ఆటగాడు రింకూ సింగ్పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే రింకూ కేకేఆర్ ముఖచిత్రంగా మారిపోయాడని కొనియాడాడు. కాగా టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ను కేకేఆర్ వైస్ కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మూడుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ప్రస్తుతం అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.అభిషేక్ నాయర్ సూచనతోనేఅయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతడి డిప్యూటీగా రింకూ సింగ్ను నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. ‘మైదానంలో వైస్ కెప్టెన్గా రింకూ సింగ్ (Rinku Singh)... రహానేకు చేదోడు వాదోడుగా నిలవనున్నాడు’ అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ తెలిపాడు. ఫ్రాంచైజీ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.‘చాన్నాళ్లుగా రింకూను గమనిస్తున్నా. జట్టు కోసం ఏదైనా చేయాలని తాపత్రయ పడుతుంటాడు. అందుకే అతడికి కాస్త అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నాం. దానికి ఇదే సరైన సమయం అని భావించాం’ అని నాయర్ అన్నాడు.రూ. 80 లక్షల నుంచి రూ. 13 కోట్లకుకాగా 2018లో రూ. 80 లక్షలు పెట్టి రింకూను తీసుకున్న కోల్కతా ఫ్రాంచైజీ... గతేడాది అతడికి రూ. 13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. ఇక 2023 ఐపీఎల్లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో ఆఖరి ఐదు బంతులకు సిక్స్లు బాది జట్టును గెలిపించిన రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్గా ఎదిగాడు. ఫినిషర్ పాత్రఆ తర్వాత కూడా నిలకడ కొనసాగిస్తూ జట్టుకు అవసరమైన సమయంలో ఫినిషర్ పాత్ర పోషించాడు. దీంతో ఫ్రాంచైజీ అతడిపై నమ్మకముంచింది. ఈ నేపథ్యంలో ‘టీమ్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. వైస్ కెప్టెన్గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. జట్టు విజయం కోసం నావంతు కృషి చేస్తా’ అని రింకూ పేర్కొన్నాడు. ఇక రహానే మాట్లాడుతూ.. ‘‘రింకూ ఎదిగిన తీరు అద్బుతం.కేకేఆర్ గురించి చర్చ వస్తే మొదటగా గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్. తర్వాత రింకూ సింగే అందరికీ గుర్తుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా కేకేఆర్ సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే.చదవండి: రూ. 15 వేల కోట్లకు RR అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్
రాజస్థాన్కు చెందిన యువ నటి, ప్రముఖ మోడల్ హర్షిల్ కాలియా (30) రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ డీకొట్టడంతో పల్టీలు కొట్టింది. షిప్రా పాత్ రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే కారు వద్దకు చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్తో హర్షిల్ కాలియా పాపులర్ అయ్యారు. రాజస్థానీ ప్రాంతీయ సాంగ్స్లో ఆమె డ్యాన్సర్గా పనిచేశారు. ఆపై యాంకర్గా కూడా గుర్తింపు పొందారు.“Shiprapath Road पर दर्दनाक हादसा: 30 वर्षीय मॉडल युवती की मौ*त#Jaipur #CarAccident #HarshilKalia #ShiprapathRoad #TragicNews #RoadAccident #BreakingNews #CCTVFootage #updateindia pic.twitter.com/7FGuqG1Rs8— Update India (@UpdateIndia_TV) March 24, 2026 -
కొండచరియల బీభత్సం.. వందల మంది పర్యాటకులు విలవిల
గ్యాంగ్టక్: సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర సిక్కింలోని చుంగ్థాంగ్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో సుమారు 200 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. కీలక చుంగ్థాంగ్-లాచెన్ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో లాచెన్కు వెళుతున్న పర్యాటకులు మార్గం మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. చిక్కుకుపోయిన పర్యాటకులకు చుంగ్థాంగ్లోని ఐటిబిపి (ఐటీబీపీ) క్యాంప్, స్థానిక గురుద్వారాలో ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)రంగంలోకి దిగి, రహదారిని క్లియర్ చేసే పనులను వేగవంతం చేసింది. అయితే వాతావరణం ఇంకా అనుకూలించకపోవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రహదారులు ప్రయాణానికి సురక్షితమని నిర్ధారించిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల్లో కొంతమంది పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుని వెనుదిరుగుతున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి మూసుకుపోయిన లాచుంగ్ మార్గాన్ని అధికారులు బుధవారం ఉదయం పునరుద్ధరించారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా గాంగ్టక్కు తరలించారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లాచెన్ మార్గం, మరమ్మతుల తర్వాత ఈ ఏడాది మార్చి 9నే తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మళ్లీ ప్రకృతి విపత్తు సంభవించడం పర్యాటక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.అటు తూర్పు సిక్కింలో కూడా భారీగా మంచు కురుస్తుండటంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలైన చోమ్గో సరస్సు, నాథులా పాస్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. సమీపంలోని డార్జిలింగ్లో కూడా వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పర్యాటకులు వాతావరణ హెచ్చరికలను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్ -
కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
సొంతగడ్డపై సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో న్యూజిలాండ్ జట్టు దుమ్మురేపింది. ఇప్పటికే టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న కివీస్ మహిళలు తాజాగా చివరి టీ20లోనూ విజయం సాధించి 4-1తో సిరీస్ చేజేక్కించుకొని స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. క్రైస్ట్చర్చి వేదికగా బుధవారం జరిగిన ఐదో టీ20లో సౌతాఫ్రికా మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ అమేలియా కెర్ (55 బంతుల్లో 105; 19 ఫోర్లు, 1 సిక్సర్) అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి సెంచరీతో ఆకట్టుకోగా.. బ్రూక్ హాలిడే (26), జార్జియా పిల్మర్ (27) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సఫారీ బౌలర్లలో కాకా, తుమి సెకుహునేలు చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వుమెన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసింది. అన్నిరే డెర్క్సెన్ (23) టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. నూజిలాండ్ బౌలర్లలో లియా తాహుహు 3 వికెట్లు తీయగా, సోఫీ డివైన్, అమేలియా కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అమేలియా కెర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది.రికార్డులకు పాతర..ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా అమేలియా కెర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఐదో టీ20లో సెంచరీ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి టీ20 సెంచరీ మార్క్ను అందుకుంది. అంతేకాదు టీ20 క్రికెట్లో వరుసగా 11సార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన తొలి బ్యాటర్గా అమేలియా కెర్ చరిత్రకెక్కింది. సఫారీలతో జరిగిన నాలుగో టీ20లోనే ఈ రికార్డు అందుకున్నప్పటికీ తాజాగా సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. అమేలియా కెర్ కంటే ముందు చమేరీ ఆటపట్టు, రెబెక్కా బ్లేక్లు చెరో 9సార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. పురుషుల క్రికెట్లో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, అభిషేక్ శర్మలు చెరో ఏడుసార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. గత 11 ఇన్నింగ్స్ల్లో 669 పరుగులు చేసిన అమేలియా బౌలింగ్లోనూ 12 వికెట్లు పడగొట్టింది. ఇటీవలే మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా అమేలియా కెర్ నిలిచింది.చదవండి: క్రికెటర్ నుంచి చైర్మన్ దాకా.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా? -
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్హువాంగ్ సోలార్ ప్లాంట్ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
బోట్ల చోరీలో టీడీపీ నేతల హస్తం: కాకాణి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసుల ఆధీనంలో ఉన్న బోట్లు దొంగలించుకుపోతే ఇంత వరకు చర్యలు ఎందుకు లేవని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోట్ల చోరీ వెనుక ఉన్న టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారని అడిగారు. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై బిట్రగుంట, కావలి రూరల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోలీసుల ఆధీనంలో ఉన్న బోట్లు ఎలా మాయం అయ్యాయి.. ఇంతవరకు ఎందుకు చర్యలు లేవు?. సంబంధిత అధికారుల మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. బోట్ల చోరీ వెనుక ఉన్న టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారు?.మంత్రులు ఎందుకొచ్చారో.. అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉంది. తమిళనాడులో ఉండే బోట్లను వెనక్కి తీసుకొచ్చి.. జువ్వలదిన్నెలో పెట్టాలి. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణతో పాటు బోట్ల చోరీ మీద వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మత్స్యకారులకు మేము అండగా ఉంటాం. అవసరమైతే వైఎస్ జగన్ కూడా మత్సకారులతో మాట్లాడేందుకు నెల్లూరుకు రావచ్చు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘మామిడి’ వివాదం
సాక్షి, చైన్నె: పార్టీ పేరు, జెండా, మామిడి పండు గుర్తుపై హక్కుల కోసం పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుచైన్నె సివిల్ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీలో చీలిక వచ్చినప్పుడు గుర్తును కేటాయించే విష యంలో ఎన్నికల సంఘం తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే చైన్నె సివిల్ కోర్టును ఆశ్రయించాలని రాందాసును ఆదేశించింది. సివిల్ కోర్టు పిటిషన్ను స్వీకరించిన మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.నేడు విచారణ..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాందాసు తరపు న్యాయవాదులు చైన్నె సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం. ధర్మప్రభు ముందు అప్పీల్ చేశారు. రాందాసు తరపున దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం విచారించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అలాగే ఈ పిటిషన్ కాపిని అన్బుమణి వర్గానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. కాగా తమ విషయంలో ఎన్నికల సంఘం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని రాందాసు మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.వివాద నేపథ్యంపీఎంకే పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ’మామిడి పండు’ గుర్తును అన్బుమణి వర్గానికి కేటాయించింది. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు గుర్తును స్తంభింపజేయాలి లేదా లాటరీ పద్ధతిలో కేటాయించాలే గానీ, ఏక పక్షంగా అన్బుమణికి ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ రాందాసు కోర్టు తలుపు తట్టారు. -
Rapido: వామ్మో.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా!
హైదరాబాద్: ర్యాపిడో డ్రైవర్కు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరించి వారి ఫోన్లు దోచుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్కర్నూల్ జిల్లా టూడుకుర్తి గ్రామానికి చెందిన రేణుక(32) నగరంలో కొండాపూర్లో నివసిస్తోంది. ఈ నెల 22న షేక్పేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ సమయంలో తనను మహ్మద్ ఖాలిద్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి తాను ర్యాపిడో డ్రైవర్నని చెప్పి ఆమెను బైక్పై తీసుకువెళ్లేందుకు ముందుకువచ్చాడు. నమ్మకంతో రేణుక అతని బైక్పై ఎక్కింది. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత చార్జీల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రేణుక, ఖాలిద్ల ఫోన్లు తీసుకుని పికప్, డ్రాప్ వివరాలు చెక్ చేస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో వారిద్దరి దృష్టి మరల్చి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తమ ఫోన్లు దొంగిలించినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా పడిన పసిడి, వెండి ధరలు ఈరోజు మార్కెట్లో తిరిగి పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కాకుండా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు, అమ్మకాల ర్యాలీలో పాల్గొంటేనే ధరలు అధికంగా ప్రభావితం అవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
105 ఏళ్ల పురాతన మట్టి ఇంటిలో విశ్రాంత ఉద్యోగి..!
ప్రస్తుతం అంతా ఆధునికతతో తీర్చిదిద్దిన ఇళ్లే దర్శనమిస్తాయి. మట్టి ఇళ్లు కనిపించే అవకాశాలే తక్కువ. పైగా దానికి చాలా చాకిరీ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఓ విశ్రాంతి ఉద్యోగి..మట్టి ఇల్లే బాగుందంటూ..ఏకంగా తన తండ్రి కట్టిన వందల ఏళ్ల నాటి మట్టి ఇంటిలో ఉంటున్నాడు. ఎవరతను..? ఎందుకిలా అంటే..అతడే బ్రెజిల్కి చెందిన 80 ఏళ్ల ఫ్రాన్సిస్కో మటియాస్. స్థానికులు అతడిని ముద్దుగా "స్యూ చిక్విన్హో"గా పిలుచుకుంటారు. అతడు ఉద్యోగ కెరీర్ అంతా బ్రెజిల్లోని రియో డి జనీరోలో గడిపినప్పటికీ..అక్కడి పట్టణ వాతావరణం అంతగా అతడికి నచ్చలేదు. ఎప్పటికైనా తన మూలాలను వెతుక్కుంటూ తను పుట్టి పెరిగిన బ్రెజిల్లోని లోతట్టు గ్రామీణ ప్రాంతానికి వెళ్లిపోవాలని భావించేవాడు. అనుకున్నట్లుగానే..ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వగానే..బ్రెజిల్లోని సియారా గ్రామీణ ప్రాంతంలోని హిడ్రోలాండియా ఈనే చిన్న పట్టణానికి వెళ్లిపోయాడు. అక్కడే మటియాస్ పెరిగాడు. అక్కడ తన తండ్రి కట్టిన 105 ఏళ్ల నాటి మట్టి ఇల్లు ఉంది. అదికాస్త పాడైనప్పటికీ..ఆ ఇంటిలోనే ఉంటున్నాడు మట్టియాస్. అక్కడ సమీపంలోని బావి నుంచి నీళ్లు తోడుకుని కుండల్లో నిల్వచేసుకుంటాడు. ఇక వంట కట్టెల పొయ్యిమీదే చేసుకుంటాడు. అది కాస్త శ్రమతో కూడుకున్నది అయినా..అలా వండుకుని తింటేనే రుచిగాఉందని అంటాడు మటియాస్. తన ఇల్లు ఎంత చల్గా ఉంటుందటే..ఏసీలో కూడా అలాంటి అద్భుత వాతావరణం పొందలేమని నవ్వుతూ చెబుతున్నాడు. తన ఇంటిని మరింత అందంగా పునరుద్ధరించాలని అనుకుంటున్నాడు గానీ, అదికూడా నాటి పురాతన పద్ధతుల్లోనే చేయాలనేది అతడి ఆలోచన. నిజానికి ప్రస్తుతం ఇలాంటి ఇళ్లు కనిపించే అవకాశం లేదు. కానీ ఇతడి జీవన విధానం, ఇంటిని చూస్తే..కాలం ఒక్కసారిగా కాలం ఆగిపోయి వెనుతిరిగిందేమో అనిపిస్తుంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో..ప్రతీదాంట్లో కొత్తదనం కనిపిస్తున్న ఈ తరుణంలో..పూర్వకాలం నాటి వేగానికి వెళ్లిపోయామా అనిపిస్తుంది మటియాస్ జీవన విధానం చూడగానే. ఆ మట్టి ఇల్లు మరో యుగంలోకి తీసుకుపోయినట్లు అనిపించినా..అది నాటి సాంప్రదాయ గ్రామీణ వాస్తు శిల్పానికి సజీవ ఉదాహరణగా చెప్పవచ్చు. అక్కడ అతను ఏకాకీగా లేడు..చుట్టుపక్కల వాళ్లు ఏదో ఒకటైంలో వచ్చి పలకరిస్తూ ఉంటారట కూడా. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో అంతా ఫోన్లోనే మాటలు, కలుసుకోవడం అయిపోయాక..ఇలాంటి పిచ్చపాటి కబుర్లుతో కూడిన మానవ స్పర్శ తనకు అత్యంత విలువైనదని చెబుతున్నాడు మటియాస్. నిజానికి ఈ 80 ఏళ్ల మటియాస్ తాత చెబుతున్న ప్రతి మాట అక్షర సత్యం..నాటి రోజులే నిజంగా గొప్పవి..కష్టపడి పనిచేసేవాళ్లం, హాయిగా కడుపు నిండా కబుర్లు చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు నోటికి తాళం చెప్పి.. బుర్ర, చేతులు..అనుక్షణం ఐఫోన్, స్మార్ట్ఫోన్లకు అంకితమై మూగ ప్రపంచంలో బతికేస్తున్నాం కదూ..!.(చదవండి: అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్..! ఆ క్రియేటివిటీకీ మాటల్లేవ్ అంతే..) -
ఎల్లమ్మ లగ్గం నుంచి సదర్ వరకు.. ‘దేత్తడి’లో గొప్పగా చూపించాం: దిల్ రాజు
‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాల హీరో ఆశిష్ నటిస్తున్న తాజా సినిమా ‘దేత్తడి’. ఆదిత్య రావు గంగసాని దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఘన్ను అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. హైదరాబాద్లో జరిగే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్... ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఆదిత్య ఈ సినిమా తీస్తున్నారు. ఏడాది పాటు ఆశిష్, ఆదిత్యలు బ్యాండ్ వాయించే వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ల గురించి తెలుసుకుంటూ, వాళ్ల జీవితాల్లోని ఇన్సిడెంట్స్ అన్నింటినీ పోగు చేసుకుని, ‘దేత్తడి’ కథను రాశారు. తమ గురించి సినిమా తీస్తున్నారనే ఆనందంతో దాదాపు ఆరు వందల మంది స్ట్రీట్ డ్రమ్మర్స్ ఉచితంగా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రతి బ్యాండు వాళ్ల దగ్గరకు వెళ్లి, బ్యాండ్ ఎలా కొట్టాలి? ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి.. ఇలా నేర్చుకుని, ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు ఆశిష్. హైదరాబాద్ కల్చర్ని ప్రపంచానికి గొప్పగా చూపించబోయే సినిమాతో వస్తున్నారు’’ అని అన్నారు. ‘‘ప్రతి బ్యాండ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. మీతో పాటు మా ఇజ్జత్ కోసం ఈ సినిమా తీస్తున్నాం’’ అని చెప్పారు ఆశిష్. ‘‘అందరికీ గుర్తుండిపోయేలా ఈ మూవీని తీస్తాం’’ అని చెప్పారు దర్శకుడు ఆదిత్య. ‘‘హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అసలైన హైదరాబాద్ కల్చర్ను చూపించే తొలి సినిమా ఇదే అవుతుంది’’ అని పేర్కొన్నారు రైటర్ ప్రసన్న. -
గ్రేటర్ పరిధిలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల నాటికి రాజధాని నగరం హైదరాబాద్, నగరాన్ని ఆనుకొని ఉన్న ఇరుగుపొరుగు జిల్లాల్లో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునరి్వభజన చేసేందుకు నిర్ణయించడంతోపాటు 50 శాతం స్థానాలను పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి. శాసనసభా నియోజకవర్గాలు, లోక్సభ స్థానాలు 50 శాతం పెరగనుండటంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 183కి పెరగనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2011 జనగణన మేరకు రాష్ట్రంలోని జనాభా దాదాపు 3.52 కోట్లు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ జనాభా సగటున దాదాపుగా 1.93 లక్షలు. దీనికి పది శాతం అటూఇటూ ఉండేలా పునర్విభజన జరగవచ్చు. హైదరాబాద్తో పాటు సరిహద్దు జిల్లాల్లోనూ అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగనున్నాయి. జిల్లాల వారీగా పెరిగేదిలా.. 2011 లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 39,43,323. ఒక్కో అసెంబ్లీకి సగటుజనాభా 1.93 లక్షలను పరిగణనలోకి తీసుకుంటే ఈ జిల్లాలో 20 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 15 శాసనసభా స్థానాలకు తోడు కొత్తగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయన్న మాట. అలాగే మేడ్చల్ జిల్లా జనాభా 24,60,095. ఈ లెక్కన ఈ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడు అదనంగా మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. రంగారెడ్డి జిల్లా జనాభా 24,46,265. ఈ లెక్కన ఈ జిల్లాలో కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ (కల్వకుర్తి పాక్షికం) నియోజకవర్గాలకు అదనంగా మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. ఇదే లెక్కన వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు ఆవిర్భవిస్తాయి.ఐదు జిల్లాల పరిధిలో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలతో పునరి్వభజన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు కానున్న 63 శాసనసభ నియోజకవర్గాల్లో 22 ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. అంటే మూడో వంతుకు పైగా ఇక్కడే ఏర్పడనున్నాయి. ఒక నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండటంతో పాటు జీహెచ్ఎంసీకి ఒక సర్కిల్ లేదా జోన్ సైతం ఒకే జిల్లాలో జీహెచ్ఎంసీ పునరి్వభజన సందర్భంగానూ అధికారులు జాగ్రత్త వహించారు. కొత్త నియోజకవర్గాల్లో కొన్ని? ప్రస్తుతం ఆయా ప్రాంతాలకున్న ప్రాధాన్యం, వాడుక దృష్ట్యా కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ సీట్లు బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, హిమాయత్నగర్, శంషాబాద్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర, బాలానగర్ (ఐడీపీఎల్) పేరిట ఏర్పాటు కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అవి ఏ నియోజకవర్గంలో ఉన్నాయో, ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, పక్కపక్కనే ఉండే రెండు ముఖ్య ప్రాంతాల పేర్లు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉండవని చెబుతున్న వారూ ఉన్నారు. -
కొత్త నిబంధనలు.. రేషన్ బియ్యం తరహాలో రేషన్ పెట్రోల్, డీజిల్
లుబ్లియానా: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా పడుతోంది. ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన కొరతను ఎదుర్కొనే ప్రయత్నంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశం స్లోవేనియా ఇంధన రేషన్ విధానాన్ని అమలు చేసింది. దీంతో వాహన దారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, ఇతర సహజ వనరులు రవాణా చేసే నౌకలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ అంతరాయాలను ఎదుర్కొనేందుకు స్లోవేనియా కొత్త చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా నిలిచింది. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయంతో ఆ దేశంలోని పెట్రోల్, డీజిల్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో వాహన దారులకు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇంధన రేషన్ రూల్స్లో భాగంగా వ్యక్తిగత వాహనదారులు రోజుకు గరిష్టంగా 50 లీటర్ల ఇంధనం వరకు కొనుగోలు చేసుకోవచ్చు. వ్యాపారాలు, రైతులకు మరింత సడలింపు ఇచ్చి రోజుకు 200 లీటర్ల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇంధనం కొరత లేదు‘స్లోవేనియాలో తగినంత ఇంధనం ఉంది. ఇంధనం గిడ్డంగులు నిండుగా ఉన్నాయి. ఇంధన కొరత ఉండదని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని ప్రధాన మంత్రి రాబర్ట్ గోలోబ్ అన్నారు. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయాలను అక్కడి పెట్రోల్ బంకులు నిర్వాహకులే అమలు చేయాలి. వినియోగదారులు అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేసుకోకుండా ఉద్యోగులు నిర్ధారించుకోవాలి. ఈ సందర్భంగా విదేశీ డ్రైవర్ల కోసం కఠినమైన పరిమితులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇంధన విక్రయ సంస్థలను కూడా ప్రోత్సహిస్తోంది.ఈ చర్యల ఫలితంగా స్లోవేనియాలో ‘ఫ్యూయల్ టూరిజం’ ఊపందుకుంది. స్లోవేనియాలో పెట్రోల్,డీజిల్ తక్కువ ధరకే లభ్యం కావడంతో దాని సరిహద్దు దేశాల ప్రజలు సైతం క్యూకట్టారు. స్లోవేనియాకు వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. -
బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) కలకలం సృష్టిస్తోంది. స్థానిక ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.బిలాస్పూర్లోని కోని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో మార్చి 19 నుండి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 5,037 కోళ్లు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్, పూణేలోని ప్రయోగశాలలకు పంపగా, భోపాల్ ల్యాబ్ నివేదికలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉన్నట్లు ధృవీకరించారు.రెడ్ జోన్గా ఒక కిలోమీటర్ పరిధివైరస్ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తక్షణమే నివారణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఫారం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని 'ఇన్ఫెక్టెడ్ జోన్' (వ్యాధి ప్రభావిత ప్రాంతం)గా, పది కిలోమీటర్ల పరిధిని 'సర్వైలెన్స్ జోన్' (పర్యవేక్షణ ప్రాంతం)గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం, ఇన్ఫెక్టెడ్ జోన్లోని కోళ్లు, గుడ్లు, మేతను పూర్తిగా నాశనం చేయనున్నారు. ఈ ప్రాంతంలో పక్షుల రవాణాను పూర్తిగా నిషేధించారు. నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు పశుసంవర్థక శాఖ ద్వారా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.మనుషులకు ముప్పు పొంచి ఉందా?పరిస్థితిని పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను రంగంలోకి దించారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు నిర్వహించి, యాంటీ వైరల్ మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటివరకు మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారులకు సహకరించాలని జిల్లా మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: కమల్ మరో సంచలనం.. స్టాలిన్కు మద్దతుగా.. -
రూ. 15 వేల కోట్లు.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందే రెండు ఫ్రాంఛైజీల అమ్మకం జరిగిపోయింది. ఆరంభ సీజన్ 2008 విజేత రాజస్తాన్ రాయల్స్ అనూహ్య రీతిలో 1.63 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15, 341 కోట్లు)కు అమ్ముడుపోగా.. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ సుమారు రూ. 16,753 కోట్ల ధర పలికినట్లు సమాచారం.రాజస్తాన్ రాయల్స్ జట్టులలో వంద శాతం వాటాను అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఇందులో రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం వాటాదారులు.షేన్ వార్న్ కుటుంబానికి భారీ లాభంఇక ఈ భారీ ఒప్పందం కారణంగా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ కుటుంబం కూడా భారీగా లాభపడినట్లు సమాచారం. రాజస్తాన్ రాయల్స్ తొలి కెప్టెన్గా.. అరంగేట్ర సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన ఘనత వార్న్కు ఉంది. కేవలం బంతితో మాయాజాలం చేయడమే కాకుండా.. పెట్టుబడుల విషయంలోనూ షేన్ వార్న్ ముందు చూపు వల్లే ఇప్పుడు అతడి ఫ్యామిలీకి వందల కోట్ల ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆ ఒప్పందం ప్రకారంఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్తాన్ జట్టుతో చేరిన సమయంలోనే వార్న్ ఓ కండిషన్ పెట్టినట్లు గతంలో వెల్లడించాడు. ‘‘మా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. వాళ్లు నన్ను కెప్టెన్గా, కోచ్గా సేవలు అందించమన్నారు. నాకు నచ్చినట్లుగా జట్టును నడిపించమన్నారు. అంతా నన్నే చూసుకోమన్నారు’’ అని వార్న్ గతంలో ది హెరాల్డ్ సన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇక ఆ ఒప్పందం ప్రకారం జట్టుతో కొనసాగిన కాలంలో ఏడాదికి 0.75 శాతం వాటా వార్న్కు దక్కినట్లు తెలుస్తోంది. వార్న్ రాజస్తాన్తో నాలుగేళ్లు కొనసాగినందున మొత్తంగా అతడి వాటా మూడు శాతానికి చేరినట్లు సమాచారం. రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటాఈ క్రమంలో తాజా ఒప్పందం ప్రకారం.. వార్న్ కుటుంబానికి రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటా లభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 తర్వాత వార్న్ కుటుంబం తమ వాటా అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.నాడు రూ. 320 కోట్లు మాత్రమేఅయితే, ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తప్పనిసరి. కాగా 2008లోఎమర్జింగ్ మీడియా యజమాని మనోజ్ బదాలే 65%, రెడ్బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ 15%, లక్లాన్ మర్డోక్ 13%, ఇతరులు 7% వాటాలతో రాజస్తాన్ రాయల్స్ను సొంతం చేసుకున్నారు. నాడు ఆ జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి రాయల్స్ హక్కులు లభిస్తాయి. కాగా 2022లో షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, పద్దెమినిదేళ్ల క్రితం ఈ స్పిన్ లెజెండ్ పెట్టిన పెట్టుబడి అతడి కుటుంబానికి ఈ మేర లాభం చేకూర్చడం విశేషం.చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్ పేరుతో తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. తన ఇంట్లో వారితో కన్నీళ్లు పెట్టుకున్నా సరే మొదటి సినిమా కావడంతో సర్దుకుపోవాలని సూచించారని మోనాలిసా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ సమయంలో తన వయసు 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదని గుర్తుచేసింది. అందుకే బయటి ప్రపంచానికి చెప్పలేకపోయానని తెలిపింది. ప్రస్తుతం తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలో నివసిస్తున్నానని చెప్పింది. తమకు ప్రాణహాని ఉండటంతో ఆందోళనతో ఉన్నామని తెలిపింది.యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి కూడా గతంలో సనోజ్ మిశ్రాపై లైంగిక ఆరోపణలు చేసింది. సినిమా ఛాన్స్ ఇస్తానని నమ్మించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. జూన్ 18, 2021న తనని ఓ రిసార్ట్లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. అయితే, ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలతో బెదిరించి చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలసిందే. తర్వాత బెయిల్ ద్వారా విడుదలయ్యారు. అయితే, మోనాలిసా పెళ్లి చేసుకున్న తర్వాత సనోజ్ మిశ్రా సంచలన కామెంట్ చేశాడు. మోనాలిసా సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఆమె సడెన్గా పెళ్లి చేసుకోవడంతో సినిమా ఫలితంపై భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
క్రికెటర్ నుంచి చైర్మన్ దాకా.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో(ఐపీఎల్) అత్యంత ఆకర్షణీయమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గతేడాది ఐపీఎల్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ యాజమాన్య హక్కులు తాజాగా చేతులు మారాయి. లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) సంస్థ 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,706 కోట్లు) ఆదిత్యా బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్డ్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలకు అమ్మేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న ఆర్యమాన్ విక్రమ్ బిర్లాపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. గతంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ ఆడని ఆర్యమాన్ బిర్లా ఇవాళ ఆర్సీబీ కొత్త చైర్మన్గా పగ్గాలు చేపట్టనున్నాడు. మరి ఎవరీ ఆర్యమాన్ బిర్లా? అతని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమాన్ బిర్లా. 28 ఏళ్ల ఆర్యమాన్ ఒకప్పుడు క్రికెటర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దేశవాళ్లీల్లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతడు.. 9 మ్యాచుల్లో 414 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ‘క్రికెట్లో మానసిక ఒత్తిడి’ని తట్టుకోలేనంటూ 2019లో ఆటకు గుడ్బై చెప్పాడు. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆర్యమాన్ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసింది. అయితే అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. తరువాత 2020 సీజన్కు ముందు ఆర్యమాన్ను రాజస్థాన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత దేశవాలీ క్రికెట్లో కానీ, ఐపీఎల్లో కానీ అవకాశాలు రాలేదు. దీంతో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన ఆర్యమాన్ బిర్లా ఆ తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్న ఆర్యమాన్ ఆ తర్వాత బేయర్స్ బిజినెస్ స్కూల్ నుంచి గ్లోబల్ ఫైనాన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆర్యమాన్ ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో డైరెక్టర్గా కొనసాగుతున్నాడు.ఇక ఆర్సీబీని కొనుగోలు చేయడంపై ఆర్యమాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘ఆర్సీబీ తదుపరి దశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అని ఆర్యమాన్ తెలిపాడు. ఈ సందర్భంగా తన పేరుతో ఉన్న ఆర్సీబీ జెర్సీ ఫోటోతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్న ఫోటోలను కూడా ఆర్యమాన్ షేర్ చేసుకున్నాడు. చదవండి: విదేశీ వద్దు.. స్వదేశీ కోచ్ ముద్దు! View this post on Instagram A post shared by Aryaman Vikram Birla (@aryamanvb) -
తెలంగాణలో పెట్రోల్ నిల్వలు.. డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో నిన్న అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. వదంతుల వ్యాప్తిచెందిన కారణంగా వాహనాల్లో డీజిల్, పెట్రోల్ నింపుకునేందుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయవద్దు అని హెచ్చరించింది.మరోవైపు.. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నట్టు సమాచారం. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 295 పాయింట్లు పెరిగి 23,207 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 888 పాయింట్లు పుంజుకొని 74,962 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.28బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 99.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.84 శాతం పడిపోయింది.Today Nifty position 25-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?
చాలామందికి ఒక సందేహం ఉంటుంది—"నేను ఇంట్లో ఉన్నట్టే ఆఫీసులో ఉండాలా? లేక అక్కడ వేరే మనిషిలా నటించాలా?" అని. సైకాలజీ దీనిని 'The Professional Mask' (వృత్తిపరమైన ముసుగు) అంటుంది. ఇది అబద్ధం ఆడటం కాదు, ఇది ఒక రకమైన 'ఎమోషనల్ మేనేజ్మెంట్'. ఆఫీసు అనేది ఒక ప్రొఫెషనల్ వేదిక. అక్కడ మీరు మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను ప్రతిచోటా ప్రదర్శించకూడదు. ఒక 'ప్రొఫెషనల్ మాస్క్' ధరించడం అంటే మీ సహజత్వాన్ని చంపుకోవడం కాదు, మీ బాధ్యతకు తగ్గట్టుగా మీ ప్రవర్తనను మలచుకోవడం. ఇది మీ Career Growth కి ఒక రక్షణ కవచం లాంటిది.పర్సనల్ vs ప్రొఫెషనల్ (The Boundaries)చాలామంది ఆఫీసులో అందరినీ 'ఫ్రెండ్స్' అనుకుని తమ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి…ఆఫీసులో మీ రోల్: మీరు అక్కడ ఒక పనిని పూర్తి చేయడానికి ఉన్నారు.మీ ఐడెంటిటీ: అక్కడ మీరు ఒక మేనేజర్, ఒక ఇంజనీర్ లేదా ఒక లీడర్.మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేరు చేసే ఆ 'లైన్' ఎంత స్పష్టంగా ఉంటే, మీ పర్సనాలిటీకి అంత గౌరవం ఉంటుంది. అతిగా కలిసిపోవడం (Over-familiarity) ఒక్కోసారి మీ అథారిటీని తగ్గిస్తుంది.Emotional Laborమీకు ఇంట్లో గొడవ జరిగి ఉండవచ్చు, లేదా మీకు ఒంట్లో బాలేకపోవచ్చు. కానీ మీరు ఒక క్లయింట్ మీటింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా కనిపించాలి. దీన్నే 'Emotional Labor' అంటారు. మీ మూడ్ ఎలా ఉన్నా, మీ పనిపై అది ప్రభావం చూపకుండా చూసుకోవడమే అసలైన 'ప్రొఫెషనల్ పర్సనాలిటీ'.మోటివేషన్ మాయ vs ప్రొఫెషనల్ రియాలిటీమోటివేషన్ "Be yourself, అందరితో మనసు విప్పి మాట్లాడు" అని చెప్తుంది. ఇది కొన్నిసార్లు రిస్క్. సైకాలజీ "పరిస్థితిని బట్టి నీ ప్రవర్తనను మార్చుకో (High Self-Monitoring). ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో తెలియడమే అసలైన తెలివితేటలు" అని చెప్తుంది.ప్రొఫెషనల్ మాస్క్ ఎలా ధరించాలి?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ ఆఫీస్ పర్సనాలిటీ ఇలా ఉండాలి.Step 1: Break Over-sharingఆఫీసులో మీ పర్సనల్ కష్టాలను, ఇతరుల గాసిప్స్ని చర్చించే అలవాటుని 'Break' చేయండి. మీరు ఎంత తక్కువ వ్యక్తిగత విషయాలు చెబితే, మీ ప్రొఫెషనల్ ఇమేజ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పని మాత్రమే మాట్లాడాలి.Step 2: Build Consistencyమీ మూడ్ ఎలా ఉన్నా, ఆఫీసులో మీ ప్రవర్తన నిలకడగా (Consistent) ఉండాలి. ఒకరోజు చాలా యాక్టివ్గా, మరోరోజు చాలా డల్గా ఉండటం వల్ల మీపై నమ్మకం తగ్గుతుంది. ఒక ప్రొఫెషనల్ 'Standard' ని 'Build' చేయండి.Step 3: Authority & Approachability మీరు ఒక వైపు ప్రొఫెషనల్గా ఉంటూనే, మరోవైపు అందరికీ అందుబాటులో ఉండేలా (Approachable) ఉండాలి. గౌరవం అనేది భయం వల్ల రాకూడదు, మీ క్రమశిక్షణ వల్ల రావాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ ఆఫీస్ పర్సనాలిటీ ఎలా ఉంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ ఆఫీస్ ఫ్రెండ్స్ కి మీ పర్సనల్ లైఫ్ గురించి ఎంత తెలుసు? అది అవసరమా?ఆఫీసులో సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారా?మీరు మీ ప్రొఫెషనల్ రోల్ కి న్యాయం చేస్తున్నారా?మీ ముసుగే మీ బలం!బ్రో, ప్రొఫెషనల్ మాస్క్ అనేది మిమ్మల్ని మీరు దాచుకోవడం కాదు, మిమ్మల్ని మీరు 'ప్రెజెంట్' చేసుకోవడం. ఒక నటుడు స్టేజ్ మీద ఎలాగైతే తన పాత్రను పోషిస్తాడో, ఆఫీసులో మీరు మీ ప్రొఫెషనల్ పాత్రను అద్భుతంగా పోషించాలి. అప్పుడే మీ కెరీర్ లెగసీ నిర్మించబడుతుంది."Professionalism is not about what you do, but how you do it." -
వీలునామా రిజిస్టర్ చేయించడం అత్యుత్తమం
నేను గతంలో ఒక వీలునామా రాసి, ఆ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు – స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామా తిరగరాయాలనుకుంటున్నాను. వీలవుతుందా?– వి.ఆర్.ఎన్. శాస్త్రి, హైదరాబాద్మీరు సంపాదించిన లేదా మీకు సంక్రమించిన ఆస్తులను మీ తదనంతరం ఎవరికి పంచాలో నిర్ణయిస్తూ వీలునామా రాయడమనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలో చేసిన వీలునామా తాలూకు అంశాన్ని, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ వీలునామాలో మీరు ‘ఇదే చివరిది కాదు, నాకు మార్చుకోవాలనిపిస్తే మరోసారి కూడా వీలునామా మార్చుకునే అవకాశం ఉంది’ అని, అలా మార్చకపోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుందని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాయించి, ఆ విషయాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా పోందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచూ చూస్తుంటాము. అలాంటి వీలునామాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. వీలునామా లో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి సంరక్షకులను (గార్డియన్)ను నియమించటం, శానిటీ ఓత్(చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చు తప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా మెరుగైన వీలునామా మీ దగ్గరలోని లాయర్ గారితో రాయించుకుని, వీలునామాలో మీరు పోందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. వీలునామా రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే అన్ని విధాల మీ తదనంతరం కూడా అందరికీ మేలు చేస్తుంది. తక్షణ అమలుకూ నోచుకుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
యుద్ధం ముగింపునకు ట్రంప్ బిగ్ ప్లాన్.. ఇరాన్కు కష్టమే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరాన్ యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని సూచనలు చేశారు. దీంతో, ట్రంప్ ప్రణాళికను ఇరాన్ అంగీకరిస్తుందా? అనే చర్చ నడుస్తోంది.కాగా, ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో చర్చలకు సిద్దమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ సిద్దం చేసినట్టు ఇజ్రాయెల్ చానెల్ 12 పలు కథనాలను వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని, హార్మూజ్ సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచాలని, ఒక నెల కాలం కాల్పుల విరమణ జరగాలని సూచించారు. అయితే, ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, ఇరాన్కి ఉన్న మూడు ప్రధాన శక్తులను (అణు, క్షిపణి, ప్రాంతీయ ప్రభావం) వదులుకోవాలని ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో ఇది అమలు కష్టమని విశ్లేషకులు అంటున్నారు.ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికలో ముఖ్యాంశాలు..అణ్వాయుధాలు: ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదు, అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి.క్షిపణి కార్యక్రమాలు: బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ను తగ్గించాలి.హార్మూజ్ సముద్ర మార్గం: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తెరిచి ఉంచాలి.కాల్పుల విరమణ: ఒక నెలపాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి.ప్రాంతీయ ప్రభావం: ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలి.పాకిస్తాన్ మధ్యవర్తిత్వం: ఈ ప్రణాళికను ఇరాన్కి పాకిస్తాన్ ద్వారా పంపించారు.సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ: బుషెహర్ వద్ద ఇరాన్కి శాంతియుత అణు శక్తి అభివృద్ధికి సహాయం అందించవచ్చని సూచన.నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నిలిపివేసి ధ్వంసం చేయాలి.ఇరాన్ సరిహద్దులలోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుంది.ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్ను విడిచిపెట్టాలి.క్షిపణుల భవిష్యత్ వినియోగం: కేవలం ఆత్మరక్షణ ప్రయోజనాల కోసం మాత్రమేIsrael's Channel 12 (@yaronavraham) published the Trump Administration's 15-point plan (I counted 14) sent to Iran to end the war:1. All existing nuclear capabilities will be dismantled.2. A commitment that Iran will never strive to obtain nuclear weapons.3. No material will…— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) March 24, 2026మరోవైపు.. ఇరాన్పై ట్రంప్ మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ నౌకాదళం , వైమానిక దళం పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, సైన్యంపరంగా వాళ్లు చచ్చిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా.. ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. దాదాపుగా వారి వద్ద ఉన్న ప్రతీదీ పోయింది. టెహ్రాన్తో పాటు వారి దేశంలోని ఇతర ప్రాంతాలపై అమెరికా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి’ అని చెప్పారు. ఇదే సమయంలో అమెరికాకు ఇరాన్ హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ బహుమతి ఏమిటన్న వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. -
టొవినో థామస్ సినిమా.. రూ. 14 కోట్ల మోసం అంటూ..
మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ నటిస్తున్న కొత్త చిత్రం 'పల్లి చట్టంబి' వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు డీజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలలో సినిమాపై బజ్ కూడా క్రియేట్ అయింది. ఇందులో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. నౌఫల్, బ్రిజేశ్, సీసీసీ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.మాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈ చిత్ర నిర్మాతలైన నౌఫల్ అహ్మద్, బ్రిజేష్ మహమ్మద్లపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సుమారు రూ. 14 కోట్లకు మోసం చేశారని, ఆ నిధులతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు పిటిషన్లో భాగంగా మాత్రమే ఉన్నాయి. కానీ కోర్టులో ఇంకా నిరూపించబడలేదు. హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఆదేశాలు కూడా షెడ్యూల్ చేసింది. అయితే, ఇప్పటివరకు, చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ సినిమా 1950, 60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందుతోంది. -
విదేశీ వద్దు.. స్వదేశీ కోచ్ ముద్దు!
భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ను నియమించాలని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం జాతీయ జట్టు కోచ్గా పనిచేస్తున్న కోస్టారికాకు చెందిన అమేలియా వాల్వర్డె కాంట్రాక్టును పునరుద్ధరించబోవడం లేదని ప్రకటించింది. ఇటీవల ఆ్రస్టేలియా వేదికగా జరిగిన ఆసియా కప్లో అమేలియా కోచింగ్లో బరిలోకి దిగిన భారత జట్టు ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. కేవలం ఈ టోర్నీ కోసమే అమేలియాను జనవరిలో మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక చేశారు. అమ్మాయిల జట్టుకు స్వదేశీ కోచ్ ఉండటమే ఉత్తమమని ఐఎం విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో... ఏఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పురుషుల, మహిళల జాతీయ జట్ల భవిష్యత్తుపై చర్చించేందుకు మంగళవారం ఏఐఎఫ్ఎఫ్ సాంకేతిక కమిటీ ఆన్లైన్లో సమావేశమైంది. విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... హర్జిందర్ సింగ్, షబ్బీర్ అలీ, విక్టర్ అమల్రాజ్, లారెన్స్, సంతోష్ సింగ్ పాల్గొన్నారు. అమేలియా కోచింగ్లో జట్టు ప్రదర్శనపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు నెలల పాటు జట్టుకు కోచ్గా వ్యవహరించిన అమేలియాకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ... ఈ ఏడాది జూన్లో జరిగే దక్షిణాసియా చాంపియన్షిప్ ప్రారంభానికి ముందే స్వదేశీ కోచ్ను నియమించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ మహిళల జట్టుకు కోచ్గా పని చేయడానికి ఆంథోని ఆండ్రూస్, క్రిస్పిన్ ఛెత్రీలు ఆసక్తిగా ఉన్నట్లు ఏఐఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం! -
దిమ్మతిరిగేలా పెరిగిన నిమ్మకాయల ధరలు
సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో వీటి ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల తదితర ప్రాంతాల నుంచి నగరానికి నిమ్మకాయలు వస్తుంటాయని, మార్చి మధ్య నుంచి సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయిందని మరో వ్యాపారి నరేష్ కుమార్ పేర్కొన్నారు. 25 కిలోల బరువున్న 1,200 నుంచి 1,500 బస్తాల నిమ్మకాయలు గతంలో రాగా, ఇప్పుడు కేవలం 800–1,000 బస్తాలు మాత్రమే వస్తున్నాయని ఆయన తెలిపారు. మధ్యవర్తులు ప్రధాన డీలర్ల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత కూరగాయల వ్యాపారులకు సరఫరా చేయడంతో రిటైల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. నిమ్మకాయల కొరత కారణంగా హోటల్ యజమానులు బిర్యానీ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్తో పాటు సలాడ్లలో వడ్డించడం తగ్గించేశారు. -
ఇరాన్పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఒక ‘రహస్య బహుమతి’ అందిందని ఆయన ప్రకటించారు. వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘వారు మాకు ఒక బహుమతి ఇచ్చారు. అది చాలా పెద్దది. దాని విలువ అపారం. ఇది అణు సంబంధమైనది కాదు. చమురు, గ్యాస్కు సంబంధించినది. వారు చేసిన పని చాలా మంచిది’ అని పేర్కొన్నారు. అయితే, ఆ బహుమతి ఏమిటన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు దారితీసాయి. చమురు సరఫరా, సముద్ర మార్గ భద్రత లేదా ఇతర వ్యూహాత్మక అంశాలకు సంబంధించినదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.ట్రంప్ మరోసారి అమెరికాదే పైచేయి అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో యుద్ధం త్వరగా ముగియడం పట్ల రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ నిరాశ చెందారని తెలిపారు. అమెరికా అధికారులు టెహ్రాన్లోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇరాన్ నాయకులు యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇరాన్ తరచుగా ఈ మార్గాన్ని మూసివేస్తానని హెచ్చరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.గత కొన్ని వారాలుగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించింది. మిత్రదేశాలను కూడా యుద్ధ నౌకలు పంపమని కోరింది. అయితే, చాలా దేశాలు దీనికి నిరాకరించాయి.ట్రంప్ చెప్పిన ‘రహస్య బహుమతి’ అసలు ఏమిటన్నది స్పష్టత లేకపోయినా, ఇది అమెరికా–ఇరాన్ సంబంధాల్లో తాత్కాలిక సర్దుబాటు సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు, భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
కమల్ మరో సంచలనం.. స్టాలిన్కు మద్దతుగా..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు బేషరతు మద్దతు ప్రకటించాలని కమల్ నిర్ణయించుకున్నారు.అందుకే ఈ నిర్ణయండీఎంకేతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాకపోవడమే కమల్ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీఎంకేకు చెందిన ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న ప్రతిపాదనను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అస్తిత్వమైన ‘టార్చ్ లైట్’ గుర్తును కాపాడుకోవడం, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయాలనేవి ఒక నిరంతర ప్రయాణం. ఎన్నికల ఫలితాలు ఒక భాగం మాత్రమే, అవే అంతిమ లక్ష్యం కాదు’ అని కమల్ వ్యాఖ్యానించారు.స్టాలిన్ కృతజ్ఞతలు.. ప్రచారానికి ఆహ్వానంకమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాష్ట్ర సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, కమల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ‘ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. ఈ నిర్ణయం నన్ను ఎంతగానో కదిలించింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆయన కమల్ను కోరారు.ద్రవిడ మోడల్ 2.0 లక్ష్యంగా..తమ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడాన్ని త్యాగంగా భావించడం లేదని, అదొక బాధ్యతని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రగతికి ‘ద్రవిడ మోడల్ 2.0’ ప్రభుత్వం అవసరమని, అందుకే డీఎంకే కూటమికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించామని ఆయన గుర్తు చేశారు. కాగా ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా, డీఎంకే కూటమి విజయానికి కీలకంగా మారడం ద్వారా కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదో వేచి చూడాల్సిందే! இது தியாகம் அல்ல; கடமை. சுய நலம் அல்ல; பொறுமை.@mkstalin @Udhaystalin @maiamofficial pic.twitter.com/V19889YYlg— Kamal Haasan (@ikamalhaasan) March 24, 2026 -
‘పచ్చ’డైపోతున్నాం!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కబంధహస్తాల్లో జనసేన నలిగిపోతోందని.. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారని, తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, పనులూ కావడం లేదని పార్టీ అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ ఎదుట జనసేన ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్కళ్యాణ్ మంగళవారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడంతోపాటు నాయకుల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో జనసేన గెలిచిన నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతోందని పవన్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన నేతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు సీఎంఓలో తమ నియోజకవర్గం నుంచి వచ్చే వినతులు తొందరగా పరిష్కారానికి నోచుకోవడం లేదని, అదే సహచర టీడీపీ ఎమ్మెల్యేలకు వేగంగా పనులు జరుగుతున్నాయని వివరించినట్టు సమాచారం. జనసేనతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వాఫీసుల్లో స్థానిక టీడీపీ నేతలు చెప్పే పనులు వేగంగా జరుగుతాయని చెప్పినట్టు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ ఇకపై నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి తన కార్యాలయానికే నేరుగా వినతులు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. పునర్విభజనపై పార్టీ వ్యూహానికి కమిటీ.. నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్) అంశంలో పార్టీ ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పవన్ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది. యువతే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం కొనసాగాలని వివరించినట్టు సమాచారం. -
ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం!
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్కు అరుదైన గౌరవం కల్పించింది. గత సీజన్లో రస్సెల్ ఐపీఎల్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ రసెల్ జెర్సీ నంబర్ 12కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కేకేఆర్ ‘నైట్స్ అన్ప్లగ్డ్’ పేరిట ప్రీ సీజన్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా రస్సెల్ జెర్సీ నంబర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ‘రస్సెల్.. నీకు కేకేఆర్ ఇస్తున్న బహుమానం ఇదే. నీ జెర్సీ నంబర్ 12కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం. ఇక మీదట 12 జెర్సీ నంబర్ నీకే సొంతం’ అని తెలిపారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఫ్రాంచైజీ ఆటగాడి జెర్సీ నంబర్కు అధికారిక రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన రస్సెల్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘దశాబ్దానికి పైగా ఈ జట్టుతో ఎన్నో విజయాలు సాధించాను. రెండు టైటిల్స్ గెలిచాం. ఆ జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలాయి. అది చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రతి మ్యాచ్ను నా చివరి మ్యాచ్లా ఆడాను’ అని వెల్లడించాడు.దశాబ్దానికి పైగా..కేకేఆర్ జట్టుతో దశాబ్దానికి పైగా అనుబంధం కలిగిన రస్సెల్.. 2014, 2024 టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ తరఫున రస్సెల్ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు.గతంలో సచిన్, ధోని..ఇది వరకు భారత క్రికెట్లో బీసీసీఐ మాత్రమే జెర్సీ నంబర్లను రిటైర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10, ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ 7లను రిటైర్ చేశారు. అయితే ఐపీఎల్లో ఇలాంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు. తాజా సీజన్కు ముందు రస్సెల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆసక్తికరంగా అతను వేలంలోకి వెళ్లకుండా కేకేఆర్ ఆఫర్ను అంగీకరించి ‘పవర్ కోచ్’గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఇకపై యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టనున్నాడు.ICYMI: Jersey no. 12 forever belongs to DRE RUSS 💜 pic.twitter.com/D1cFfhuYvI— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026 చదవండి: ‘ఐపీఎల్ మరో స్థాయికి వెళ్లిపోయింది’ -
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా.. ఒక్కటే.. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. అధి ష్టానం హామీ ఇచ్చింది. ఇస్తుందో లేదో తెలియదు. వారికి ఉండే సమీకరణాలు ఏమిటో?’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవి లేకున్నా తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రి పదవి ఇవ్వడం వల్ల తనకు వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు తాము ఇద్దరం సోదరులమని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్య మకారుల సేవలు అవసరమన్నారు. సీఎం రేవంత్రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేద ని, తాను సోమవారం సీఎంతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయని, ఆయన ఎదురుపడితే పలకరించుకున్నామే తప్ప ఎలాంటి భేటీ జరగలేదన్నారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్రెడ్డి అంటేనే తాను అభ్యంతరం చెప్పానని, అలా అనడం శాసనసభ్యులను అవమానించడమే అవుతుందని మాత్రమే తాను గతంలో వ్యాఖ్యానించానని చెప్పారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే వారి పతనం ప్రారంభమైందని తాను కేటీఆర్తో అన్నట్లు చెప్పారు. కాగా భోజన సమయంలో రెండుగంటలపాటు కేటీఆర్తో భేటీలో సాధారణ విషయాలే మాట్లాడుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రాధా న్యత లేదని, ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నా రని రాజగోపాల్రెడ్డి తెలిపారు. -
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమలు కానున్న నేపథ్యంలో వేతన జీవులు తమ పన్ను ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.కొత్త చట్టం వస్తోంది కదా అని ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాత, కొత్త చట్టాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసింది.2025-26 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మీరు సంపాదించిన ఆదాయంపై పాత చట్టం (1961) ప్రకారమే పన్ను విధిస్తారు. దీనికి సంబంధించిన రిటర్నులను 2026 జూలైలో సమర్పించాల్సి ఉంటుంది.2026-27 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2026 తర్వాత సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వర్తిస్తుంది.ఆటోమేటెడ్ రిటర్న్స్: తప్పులకు తావులేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.ఇకపై మీ జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలను మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కంపెనీలు, బ్యాంకుల నుంచి డేటా నేరుగా సిస్టమ్లోకి వస్తుంది.సిస్టమ్ ఆటోమేటిక్గా వివరాలను సేకరించినప్పటికీ ఆ సమాచారం సరైనదేనని ధ్రువీకరించే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే.ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, ఫారం-26AS స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్లు రానున్నాయి.హెచ్ఆర్ఏ, అలవెన్సులపై నిఘాపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే విషయంలో కొత్త నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) విషయంలో యజమాని వివరాలు, పాన్ కార్డు, సంబంధిత పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది.సీటీసీలో మార్పులుకొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం(బేసిక్ పే) అతని మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఫలితంగా చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడతాయి.కొత్త వ్యవస్థ పన్ను ఎగవేతను అరికట్టడమే కాకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, 2026 ఏప్రిల్ నుంచి ప్రతి పైసా ఖర్చుకు, ప్రతి మినహాయింపునకు సరైన రికార్డులు కలిగి ఉండటం ముఖ్యం.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్సైట్లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ లాంగ్థాసా నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్లో చేరి వెంటనే నామినేషన్ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద నరాహ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది. -
సోనియా గాంధీకి అస్వస్థత.. రాహుల్ పర్యటన రద్దు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.మరోసారి శ్వాసకోశ సమస్యలు?సోనియా గాంధీ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత జనవరిలో కూడా ఆమె ఇదే ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో ఢిల్లీలో పెరిగిన కాలుష్యం, తీవ్రమైన చలి కారణంగా ఆమెకు ‘బ్రోన్చియల్ ఆస్తమా’ సమస్య తీవ్రమైందని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో ఆమెకు యాంటీబయోటిక్స్తో కూడిన చికిత్స అందించగా, పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు.తాజాగా మరోసారి ఆమె ఆస్పత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇది కేవలం రెగ్యులర్ చెకప్ లేదా ముందుజాగ్రత్త చర్యగా భాగంగానే జరిగిందా? లేక సమస్య మళ్లీ తీవ్రమైందా? అనే విషయంపై ఆస్పత్రి వర్గాల నుండి పూర్తిస్థాయి మెడికల్ బులెటిన్ వెలువడాల్సి ఉంది.వైద్యుల పర్యవేక్షణలో..సర్ గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. 79 ఏళ్ల సోనియా గాంధీ గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, వయసు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.రాహుల్ కేరళ పర్యటన రద్దుకాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన తల్లి, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాహుల్ తన కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గే..కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కోజికోడ్లో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుల్ తన ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ 9న కేరళలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సభ అత్యంత కీలకంగా భావించారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోజికోడ్ పర్యటనకు బయలుదేరారు. రాహుల్కు బదులుగా ఖర్గే ఈ ఎన్నికల ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
ప్రభాస్తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి మరోసారి ప్రభాస్పై అభిమానాన్ని చూపించారు. టాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాశి.. బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కలిసి నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చాయి. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి పలు చిత్రాలతో పాటు సీరియల్స్లో కూడా కనిపిస్తుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నటి రాశి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పారు. ప్రభాస్తో కలిసి ఒక్కసినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏళ్లుగా ఉండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఛాన్స్ వచ్చినా తల్లిగా మాత్రం నటించనని క్లారిటీ ఇచ్చారు. ఆపై అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. హీరోయిన్గా నటించే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరని తెలిపారు. దీంతో తన కోరిక అలాగే ఉండిపోయిందన్నారు. అయితే, ప్రభాస్ను ఇంతవరకు కలవలేదని రాశి అన్నారు. మిర్చి, రాధేశ్యామ్ వంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 'ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని తన బ్రదర్తో చెప్పానని ఆమె అన్నారు. ప్రభాస్ సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్కి వెళ్తానని రాశి చెప్పడం విశేషం.అడవి రాముడు షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్లోనే తాను కూడా ఉన్నానని రాశి అన్నారు. 'ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే ప్రభాస్ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్కు కాల్ చేసి మాట్లాడా. అయితే ప్రభాస్ సీనియర్స్కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. Nen #Prabhas ki Matram Amma ga cheyanu. Eshwar Trailer chusi I just told my brother that he's going to be a Big Hero ani, Ayana Cinema ki Matrame Theatre ki velta nenu, Chatrapati, BB1&2!(Nenu Intha varaku Prabhas ni kalavale) Industry lo unavale kalavale ante manam, kastamey. pic.twitter.com/G9S1gTJjld— . (@charanvicky_) March 24, 2026 -
తెల్లారుతూనే భీతావహం.. ‘డబుల్ డెక్కర్’ బోల్తా పడి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లారుతూనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్లోని జైపూర్ నుండి 25 మంది ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సు.. ఢిల్లీలోని జెండే వాలన్ ఆలయానికి సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రెస్క్యూ బృందాలు అతికష్టం మీద బయటకు తీసుకువచ్చాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సర్ గంగా రామ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్)ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితమే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ వద్ద యమునా ఎక్స్ప్రెస్వేపై డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.ఇది కూడా చదవండి: తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్ ? షాకిస్తున్న సీక్రెట్ సర్వే? -
టైరు పేలి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
సాక్షి,నంద్యాల: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నంద్యాల సమీపంలోని హైవేపై ప్రయాణిస్తున్న బస్సు టైరు పేలడంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఈ దెబ్బతో మరో స్థాయికి ఐపీఎల్’
ఐపీఎల్లో ఫ్రాంచైజీలుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2008లో ఆరంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్లుగా పేరు పొందిన ఎన్బీఏ, ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ స్థాయికి సమానంగా నిలిచిందని వ్యాఖ్యానించాడు.ఇది ఐపీఎల్కు దక్కిన అరుదైన గౌరవమని చెప్పుకొచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘ఇది ఐపీఎల్కు నిజంగా శుభవార్త. 2008లో తొలిసారి నేను ఐపీఎల్ మ్యాచ్ ఆడేటప్పుడే రానున్న కాలంలో ఈ లీగ్ అత్యంత ఖరీదైనగా మారుతుందని చెప్పాను. ఇప్పుడు నా మాటలు అక్షరాల నిజమయ్యాయి. 18 సీజన్లు ముగించుకొని 19వ సీజన్కు విజయవంతంగా అడుగుపెట్టిన ఐపీఎల్ ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. నా దృష్టిలో ఐపీఎల్ కూడా ఎన్బీఏతో సమానం. ఐపీఎల్ ప్రసార హక్కులు ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) కూడా దాటేశాయి. సంవత్సరానికి కేవలం రెండున్నర నుంచి మూడు నెలలు మాత్రమే ఆడే ఒక స్పోర్ట్స్ ఫ్రాంచైజీని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి.’ అని గంగూలీ పేర్కొన్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్ టీమ్లో 100 శాతం వాటాను దక్కించుకుంది. మరోవైపు లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) సంస్థ నుంచి రూ. 16,706 కోట్ల ధరకు ఆదిత్యా బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్డ్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు దక్కించుకున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. చదవండి: పోల్వాల్ట్లో జాతీయ రికార్డు -
నటుడు సుదీప్కు గుడి కట్టిన వీరాభిమాని
తమ అభిమాన నటీనటులకు ఆలయాలు కట్టి పూజలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులకు తమిళ సినీ అభిమానులు గుడి కట్టించడమే విశేషం. అలా ఇంతకుముందు ఉత్తరాదికి చెందిన తమిళనాడులో ఆమె వీరాభిమాని గుడి కట్టించి ఆరాధించిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు సుదీప్కు తమిళనాడులో ఒక వీరాభిమాని గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. కన్నడం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకుడిగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన నటుడు సుదీప్. తెలుగులో ఈయన నటించిన “ఈ “చిత్రం “ నాన్ ఈ “గా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.అదేవిధంగా విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. మరికొన్ని చిత్రాల్లో నటించిన సుదీప్కు తమిళనాడు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలా ఈరోడ్ జిల్లా, తొట్టాగాజనూర్ ప్రాంతానికి చెందిన సుందరరాజ్ నటుడు సుదీప్కు వీరాభిమాని. ఇతను ద్విచక్రవాహంలో ఐస్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా తన అభిమాన నటుడు సుదీప్ కోసం తన ఇంటి ముందు గుడిని కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గుడిలో సుదీప్ చిత్ర పటంతో పాటు మహర్షి వాల్మీకి, వీర మాతంగరి ఫొటోలు పొందుపరిచి పూజలు చేస్తున్నారు. -
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?
ద్రవిడ గడ్డపై సంచలన రాజకీయాలకు తెరలేచింది. 2026 ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల, నేతల వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కాయి. కుల సమీకరణలు, సంక్షేమ పథకాల హామీలు, పొత్తుల లెక్కలతో చెన్నైలోని వార్ రూమ్లు హోరెత్తిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తమిళనాట గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చతుర్ముఖ పోటీ’ నెలకొంది. అధికార డీఎంకే (డీఎంకే) కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) కూటమిలతో పాటు, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), సీమాన్ సారథ్యంలోని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే)లు ఎన్నికల బరిలోకి దిగాయి. 2026 తమిళనాడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది అంచనా వేయాలంటే, 2021 నాటి ఓటర్ల నాడిని విశ్లేషించడం అవసరం. ఈ నేపధ్యంలోనే ‘లోకనీతి-సిఎస్డీఎస్’ నిర్వహించిన సర్వే గణాంకాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.2021 తీర్పు: గణాంకాలు ఏం చెబుతున్నాయి?పదేళ్ల ఏఐఏడీఎంకే పాలనకు స్వస్తి పలికి.. ఎంకే స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసిన 2021 ఎన్నికల్లో ప్రధానంగా ద్విముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 39.1 శాతం ఓట్లను సాధించగా, ఏఐఏడీఎంకే 34.1 శాతంతో సరిపెట్టుకుంది. కూటముల పరంగా చూస్తే డీఎంకే కూటమికి 45.4 శాతం, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఖ్య 6.6 శాతం. ఇది సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే (ఎన్టీకే) సాధించిన ఓట్ల శాతం. ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం)2.6 శాతం, టీటీవీ దినకరన్ ‘ఏఎంఎంకే’ 2.5 శాతంతో తమ ఉనికి చాటుకున్నాయి.వారసత్వ పోరులో ‘స్టాలిన్’ టాప్నాడు జయలలిత, కరుణానిధి లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వారసత్వంపై ఓటర్లు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 78.2 శాతం మంది ఓటర్లు కరుణానిధి అసలైన వారసుడు స్టాలినే అని తేల్చిచెప్పారు. అటు ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి 47.4 శాతం మంది మద్దతు లభించగా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) కేవలం 8.9 శాతానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఓపీఎస్ తన కుమారుడితో పాటు డీఎంకేలో చేరడం ఆసక్తికరంగా మారింది.డబుల్ ఇంజిన్ సర్కార్పై వ్యతిరేకత?హిందీ బెల్ట్ రాజకీయాలకు భిన్నంగా తమిళనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూవస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళ ఓటర్లు 2021లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 51.9 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 47.5 శాతం మంది కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి అనే (డబుల్ ఇంజిన్) వాదనను తిరస్కరించారు. బీజేపీ ఎదుగుదల రాష్ట్ర సామాజిక ఐక్యతకు కీడు అని 40.3 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.సంక్షేమం వెర్సస్ అవినీతిగత ఏఐఏడీఎంకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర రంగాల్లో మంచి మార్కులే సాధించినప్పటికీ (53.5 శాతం సంతృప్తి), అవినీతి ఆ పార్టీ కొంపముంచింది. 67.3 శాతం మంది ప్రజలు ఏఐఏడీఎంకే పాలనలో అవినీతి పెరిగిందని భావించారు. మరోవైపు తమిళనాడు సంక్షేమ పథకాలు (ఉచిత పాలు, సైకిళ్లు, అమ్మ క్యాంటీన్లు) ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిలో 70 నుంచి 85 శాతం మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఇచ్చారు.2026 పొత్తుల చదరంగంప్రస్తుతం డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్ (28 సీట్లు), సీపీఐ (5), ఎండీఎంకే (4) వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏఐఏడీఎంకే, బీజేపీలు తిరిగి ఒక్కటయ్యాయి. కానీ పార్టీల చీలికలు ఈ కూటమిని వేధిస్తున్నాయి. ఈ గ్యాప్లో నటుడు విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా 234 స్థానాల్లో పోటీకి దిగారు.నిర్ణయాత్మక శక్తి ఎవరు?తమిళ ఓటరు చాలా తెలివైనవాడు. 23 శాతం మంది ఓటర్లు పోలింగ్ రోజే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారనే మాట వినిపిస్తుంది. కులం, మతం కంటే పార్టీ గుర్తుకే (53.3%) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారి ఎన్నికల్లో ‘జెన్ జెడ్’ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఈ నేపధ్యంలో స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? ఎడప్పాడి తిరిగి పుంజుకుంటారా? లేక విజయ్ ‘తమిళగ వెట్రి’ గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలకు మే నెలలో వెలువడే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. ఇది కూడా చదవండి: పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం -
పాకిస్తాన్కు బంపరాఫర్.. ట్రంప్ ప్లానేంటి?
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల విషయమై ఉత్కంఠ నెలకొంది. అసలు చర్యలు జరుగుతాయా? యుద్ధం ముగుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ నేతలు బయటకు వచ్చి ట్రంప్తో చర్చల్లో పాల్గొంటారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధమని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అనంతరం, షరీఫ్ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడం ఆసక్తిని పెంచింది. అంటే, చర్చలకు పాకిస్తాన్ వేదిక కానుందనే సంగతి దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా చర్చలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో..‘పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం పాకిస్తాన్కు లభిస్తే మేము.. దానిని ఒక గౌరవంగా భావిస్తాం. అమెరికా, ఇరాన్ల వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను పాకిస్తాన్ స్వాగతిస్తుందని అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన పోస్టును ట్రంప్ షేర్ చేయడం విశేషం. అంటే, పాకిస్తాన్ వేదికగా చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ను ట్రంప్ ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ట్రంప్ ప్లానేంటి అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇదిలా ఉండగా.. రహస్యంగా జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన ప్రకటన, ఆ కథనాలకు బలం చేకూర్చేలా ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. అయితే, అంతకుముందే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్ను ఎంపిక చేస్తారంటూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. కాగా, ఈ ఊహాగానాలను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు వెలువడే వరకు వేచి చూడాలని మీడియాకు పాక్ విదేశాంగ శాఖ సూచించింది.Pakistan welcomes and fully supports ongoing efforts to pursue dialogue to end the WAR in Middle East, in the interest of peace and stability in region and beyond. Subject to concurrence by the US and Iran, Pakistan stands ready and honoured to be the host to facilitate…— Shehbaz Sharif (@CMShehbaz) March 24, 2026 -
‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్? నీ మొగుడు చూసుకుంటాడులే’’
సాక్షి,హైదరాబాద్: మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగంలోని ఓ మహిళా ఇన్స్పెక్టర్ సహచర సిబ్బందితో అమానవీయంగా, అసభ్యకర రీతిలో ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతోనే కాదు ఇన్స్పెక్టర్ ర్యాంక్ వారితోనూ ఆమె తీరు ఇలాగే ఉంటుందని పలువురు సిబ్బంది ‘సాక్షి’తో వాపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెను చూసుకునేందుకు సెలవు అడగ్గా... కుదరదని చెప్పడంతో పాటు ‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్? నీ మొగుడు చూసుకుంటాడులే’’ అని మాట్లాడిందని ఓ మహిళా పోలీసు ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏమాత్రం సానుభూతి లేకుండా ప్రతి విషయంలోనూ మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోలీస్ యూనిఫాంలో ఠాణాకు రాకపోవడం వంటి విమర్శలకు తోడు, ఇటీవల పోక్సో కేసులో స్టేట్మెంట్ రికార్డ్కు వచ్చిన స్థానిక పోలీసు సిబ్బందితో విపరీతంగా ప్రవర్తించడంతో.. వారు తీవ్రంగా కుంగిపోయారు. విషయాన్ని ఉన్నతాధికారులు, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమేనని కమిషనర్కు నివేదిక అందజేశారు. దీంతో మహిళా ఇన్స్పెక్టర్ను మల్టీ జోన్–2కు సరెండర్ చేశారు. సైబర్ క్రైమ్ ఠాణాలో హోదాతో సంబంధం లేకుండా అందరూ విధిగా యూనిఫామ్లో డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు. -
పోల్వాల్ట్లో జాతీయ రికార్డు
భువనేశ్వర్: తమిళనాడు మహిళా అథ్లెట్ బరానిక ఎలంగోవన్ పోల్వాల్ట్లో కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. భారత్లో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన పోల్వాల్ట్లో ఆమె 4.22 మీటర్లతో ఓవరాల్గా (ఇండోర్ అవుట్ డోర్ కలిపి) జాతీయ రికార్డు లిఖించింది. గతంలో పోల్వాల్ట్లో రోజీ మీనా పాల్రాజ్ 2022లో నెలల్పిన 4.21 మీటర్ల రికార్డును 29 ఏళ్ల బరానిక అధిగమించింది. ఇది రెగ్యులర్ అవుట్డోర్ ఈవెంట్ కాగా, భారత్లో ఇంతకుముందెన్నడూ ఇండోర్ పోటీలే జరగలేదు. ఈ నేపథ్యంలో తొలి ఇండోర్ ఈవెంట్లోనే ఆమె ఓవరాల్ రికార్డును నెలకొల్పినట్లయింది. ఈ పోటీల్లో కేరళకు చెందిన బ్లెస్సీ కుంజుమోన్ (3.95 మీ.), మరియా జైసన్ (3.38 మీ.) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ‘ముఖ్యంగా పోల్వాల్ట్ను గాలి వేగం శాసిస్తుంది. అవుట్డోర్లో వీచే గాలి వేగంతో పోల్వాల్ట్ ప్రదర్శన మారుతుంది. అయితే ఇండోర్ ఈవెంట్లో అలాంటి సమస్యలే లేవు’ అని బరానిక తెలిపింది. మిగతా పోటీల్లో పురుషుల లాంగ్జంప్లో సారున్ పాయసింగ్ (7.80 మీ.; ఒరిస్సా) వ్యక్తిగత మెరుగైన్ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. దీంతో ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ (7.78మీ.; తమిళనాడు) రజతం లభించింది. ప్రవీణ్ సాధారణంగా ట్రిపుల్ జంప్లో పోటీపడతాడు. అయితే ఇండోర్లో ఆ ఈవెంట్ లేకపోవడంతో లాంగ్జంప్లోకి మారాడు. డేవిడ్ (7.69 మీ.; రైల్వేస్)కు కాంస్యం దక్కింది. పరీక్షలు సిద్ధమైన ‘నాడా’ ఓ వైపు తొలిరోజు భారత అథ్లెట్లు తొలిసారి ఇండోర్ పోటీల్లో పాల్గొంటుండగా... మరోవైపు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షలు మొదలుపెట్టింది. ‘నాడా’కు చెందిన బృందం ఈవెంట్కు వేదికైన కళింగ స్టేడియంలోకి దిగింది. మైదానంలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ గదిలో అథ్లెట్ల నుంచి రక్త మూత్ర నమూనాల్ని తీసుకుంది. ఇతర పోటీల ఫలితాలు పురుషుల ఈవెంట్స్: 800 మీ పరుగు: 1. మొహమ్మద్ అఫ్సల్ (ఎయిర్ఫోర్స్), 2. కళ్యాణ్ (కర్ణాటక), 3. సాయన్ కర్మాకర్ (బెంగాల్); 3000 మీ. పరుగు: 1. శివాజీ (రిలయన్స్), 2. వినోద్ (మధ్యప్రదేశ్), 3.రాహుల్ కుమార్ (ఛత్తీస్గఢ్); 60 మీ. హర్డిల్స్: 1.క్రిషిక్ (కర్ణాటక), 2.రాతీశ్ (రిలయన్స్), 3. ముహమ్మద్ లజాన్ (జేఎస్డబ్ల్యూ); షాట్పుట్: 1.రవికుమార్ (బీఎస్ఎఫ్), 2.ఆధిశ్ గిల్దియాల్ (ఉత్తరాఖండ్); 3.బాలాజీ (తమిళనాడు). మహిళల ఈవెంట్స్: 3000 మీ. పరుగు: 1.ప్రియాంక (కర్ణాటక), 2.కాజల్ (గుజరాత్), 3.అక్షయ (తమిళనాడు); షాట్పుట్: 1.రేఖ (ఎన్సీఓఈ, పాటియాలా), 2.మయూరి (కర్ణాటక); లాంగ్జంప్: 1. అనామిక (జేఎస్డబ్ల్యూ), 2.మనీశా మెరెల్ (ఒరిస్సా), 3.శెరిన్ (జేఎస్డబ్ల్యూ). -
రామ్ చరణ్కు గాయం.. షూటింగ్కు బ్రేక్
రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్లో చరణ్కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తోంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్లో చేరతారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే చరణ్తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్ను విడుదల చేస్తారని టాక్..గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. -
ఉత్తరాన గట్టిపోరు.. 54 స్థానాలు కీలకం
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.నువ్వా, నేనా! బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పార్టీలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్కు తృణమూల్కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచ్చింది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఎందుకు కీలకం.. ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతను నా క్లాస్మేట్.. స్టార్ హీరోపై శృతి హాసన్ కామెంట్
పాన్ ఇండియా కథానాయికల్లో ఒకరు శృతి హాసన్. ఈమె నటుడు కమలహాసన్ వారసురాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న నటి ఈమె. అంతేకాకుండా సంచనాలకు నిలయం శృతి హాసన్(Shruti Haasan) అనే ట్యాగ్లైన్ను కూడా వేసుకున్నారీమె. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే ఈమె ప్రేమ వ్యవహారం కూడా తెలిసిన పుస్తకమే. కాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక బేటిలో శృతిహాసన్ తన పాఠశాల జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కర్ సల్మాన్ తాను బాల్యంలో చెన్నైలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. రెండు ప్రముఖ పాఠశాలల్లో తమ విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆ సమయంలో తాము తరచూ కలుసుకునేవారుమని చెప్పారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. అప్పట్లో పలువురు సహా విద్యార్థులతో కలిసి తాను సోంబి పాటను పాడిన అనుభవం ఉందన్నారు. ఆ తర్వాతనే తనను దుల్కర్ సల్మాన్ సోంబి అని పిలిచే వాడిని పేర్కొన్నారు. అతనితో కలిసి చదివిన విద్యార్థులకు తాను కమలహాసన్ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు అని, తన పేరు తెలియదని చెప్పారు. కాగా తాజాగా ఈ భామ దుల్కర్ సల్మాన్తో కలిసి ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రం లో నటించడం విశేషం. ఈ చిత్రం తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో రూపొందుతోంది. -
బెంగాల్పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్ మహారాజ్ను కాలియాగంజ్ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సౌమన్ రాయ్తో ఉత్పల్ పోటీ పడే అవకాశముంది.ఉల్బేరియా సౌత్ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్ దక్కింది. తృణమూల్కు చెందిన పులోక్ రాయ్తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్ నుంచి శ్రీ శృతి శేఖర్ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్ మహారాజ్ పోటీలో ఉన్నారు. హన్సన్ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్ సిట్టింగ్ స్థానాలే ఉండటం విశేషం! -
నేడు కాంగ్రెస్కు రాజీనామా.. జీవన్ పయనమెటు?
సాక్షి,జగిత్యాల: నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా అనంతరం ఏఐసీసీ, పీసీసీకి లేఖ పంపనున్నారు.కాంగ్రెస్తో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు పెట్టనున్న జీవన్ రెడ్డి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామా విషయంలో చివరి క్షణం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ దూత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కలిసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు.దీంతో జీవన్ రెడ్డి రాజీనామా, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న నేతగా జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం ఉంది. ఆయన స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్ఎస్లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం వంటి అవకాశాలు చర్చనీయాంశమవుతున్నాయి.జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. -
పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోతుందని, కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో నగరంలో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందారు. మంగళవారం ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్పేట వంటి అనేక ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు పోటెత్తారు. రాత్రివేళకు సగానికి పైగా పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు రావడంతో బంకుల్లో నిల్వలు త్వరగా అయిపోయాయి. చమురు కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉండడం వరుస సెలవుల వల్ల కొన్ని బంకులకు సకాలంలో స్టాక్ చేరకపోవడం కూడా కొంత ప్రభావం చూపింది. ఆటో.. ఎటో.. మహా నగరంలో రవాణాకు వెన్నెముకగా నిలిచే ఆటోలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. కొద్ది రోజులుగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తే.. మధ్యాహా్ననికి కూడా ట్యాంకులు నిండని పరిస్థితి నెలకొంది. పశి్చమాసియా యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కమ్మేయడంతో... దాని ప్రభావం హైదరాబాద్ ఆటో డ్రైవర్లపై పడింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో డిమాండ్ను సాకుగా చూపి కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లు స్టాక్ ఉన్నా లేదని బోర్డులు పెడుతున్నాయి. నగరంలో ఎల్పీజీ ఆటోల సంఖ్య లక్ష పైనే. రోజువారీ గ్యాస్ డిమాండ్ 1.70 లక్షల కిలోలు ఉండగా, సరఫరాలో సగటున 30–40 శాతం లోటు కనిపిస్తోంది. భారత్ గ్యాస్ లిమిటెడ్ , ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థలతో పాటు బీజీఎల్, ప్రైవేటు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. నగర వ్యాప్తంగా సీఎన్జీ, ఎల్పీజీ స్టేషన్లు ఉన్నప్పటికీ, సగంపైగా బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి.ప్రైవేటు గ్యాస్ సైతం... ప్రభుత్వ రంగంలోని ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో పాటు ప్రైవేటులో సూపర్ గ్యాస్, గో గ్యాస్, ఏజిస్ లాజిస్టిక్స్, తెలంగాణ గ్యాస్, టోటల్ ఎనర్జీస్కు నగర వ్యాప్తంగా స్టేషన్లు ఉన్నాయి. ప్రైవేటు సంఖ్య తక్కువే అయినా అత్యవసర సమయాల్లో ఇవే దిక్కు. దీంతో కొంత ఎక్కువ వసూలు చేస్తాయి. కాగా, యుద్ధానికి ముందు కిలో సీఎన్జీ ధర రూ.70–75 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.90–రూ.100 దాటింది. కొన్ని ప్రైవేట్ స్టేషన్లలో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల బంకుల్లో గ్యాస్ అయిపోవడంతో డ్రైవర్లు ప్రైవేట్లును ఆశ్రయిస్తున్నారు. అక్కడ లీటరుకు రూ.15–20 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. -
నాడు మైక్ ఇవ్వలేదు.. నేడు వాకౌట్ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కనీసం సభ్యులుగా గౌరవించేవారు కాదు. నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా మాట్లాడుతుంటే వినాల్సిందిపోయి బడ్జెట్ కాగితాలను చించి చెవిలో పువ్వుల్లాగా పెట్టుకుని వెళ్లిపోవడం సంస్కారమా? సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి, ఇక్కడ భట్టి విక్రమార్క, అక్కడ శ్రీధర్ బాబు కూర్చోవడం ఏమిటి? అనే చులకన భావంతో చూడొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజాతీర్పును గౌరవించాలి’ అని బీఆర్ఎస్ సభ్యులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్పై శాసనసభలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, బడ్జెట్ పద్దుల పుస్తకాలను సకాలంలో ఇవ్వడం లేదని ఆరోపిస్తూ భట్టి విక్రమార్క సమాధానాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు ప్రకటించి తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. ప్రశ్నించడానికి బీఆర్ఎస్ సభ్యులకు వీలైనంత సమయమిచి్చనా వాకౌట్ చేయడం సరికాదని భట్టి తప్పుబట్టారు. నాడు ఎన్ని అవమానాలకు గురిచేసినా తాము వాకౌట్ చేయలేదన్నారు. వాస్తవికతకు దగ్గరగా... ఆదాయం లేకున్నా ఏటా 20 శాతం బడ్జెట్ను గత బీఆర్ఎస్ సర్కారు పెంచిన తరహాలో పెంచుకుంటూ పోవడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. అలా చేస్తే ఈ పాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరేదన్నారు. ఏటా 6 శాతం వృద్ధితో బడ్జెట్ అంచనాలను పెంచుకుంటూ పోతున్నామని, మరో రెండుమూడేళ్లలో వాస్తవిక గణాంకాలకు దగ్గరగా ప్రతిపాదనలను తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల కోసం రైతు భరోసా చెల్లించారని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను భట్టి తోసిపుచ్చారు. గత బీఆర్ఎస్ సర్కారు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ చేయడంతో వడ్డీలపై వడ్డీలు పెరిగి రైతులు నష్టపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను గాలికి వదిలేసిందన్నారు. తాము వచ్చాక రాష్ట్ర వాటా రూ.3 వేల కోట్లను చెల్లించి రూ.10వేల కోట్ల కేంద్ర నిధులను సాధించామని చెప్పారు. అప్పులకే ఏటా రూ.93,194 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను విధ్వంసం చేసి ందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర అప్పులు, తిరిగి చెల్లింపులు 2014–15లో రూ.9,580 కోట్లు మాత్రమే ఉండగా, గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులతో 2023–24 నాటికి రూ.25,350 కోట్లు, 2024–25 నాటికి రూ.66,545 కోట్లు, 2025–26 నాటికి రూ.93,194 కోట్లు కట్టాల్సి వచి్చందన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.1,59,165 కోట్ల అప్పులు చేసి రూ.1,85,090 కోట్ల అప్పులను తిరిగి చెల్లించిందన్నారు. మోదీ అప్పులు రూ.140 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం 1950–51 నుంచి 2013–14 మధ్యకాలంలో 13 మంది ప్రధానుల ఆధ్వర్యంలో రూ.56.66 లక్షల కోట్లు అప్పులు చేస్తే ప్రస్తుత ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో ఏకంగా రూ.140 లక్షల కోట్లు కొత్త అప్పులు చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర అప్పులపై బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన దీటుగా బదులిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయికి 30 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది. దేశంలో అంతర్భాగం కాదా? కేంద్రం ఇలా ఇవ్వడమే చీటింగ్ అని ఏలేటిని నిలదీశారు.రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.10 పెంచినట్టు ఏలేటి చేసిన ఆరోపణ లు అవాస్తమని తప్పుబట్టారు. నాడు మహాత్మాగాం«దీని భౌతికంగా లేకుండా చేశారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని బీజేపీపై మండిపడ్డారు. భట్టి శాసనమండలిలో సైతం బడ్జెట్పై చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అర్ధరాత్రి వరకు సమాధానమిచ్చారు.పార్టీ ఆఫీస్ నడిపినట్టు సభ నడిపారు: మంత్రి శ్రీధర్బాబు బీఆర్ఎస్ హయాంలో సభను ఆ పార్టీ ఆఫీస్ను నడిపినట్టు నడిపారని మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు తగిన సమయమిచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సీఎం రేవంత్రెడ్డి సమాధానమిచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ను తీవ్రంగా తప్పుబడుతూ సభలో మాట్లాడారు. -
ప్రమాదం కాదు.. వ్యవస్థీకృత కుట్ర
సాక్షి బెంగళూరు: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి సంబంధించిన కేసు కొత్త మలుపు తీసుకుంది. విమాన ప్రమాదం వెనుక పెద్దకుట్ర ఉందని బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అజిత్ పవార్ అల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో ఏముంది? ఇది కేవలం ప్రమాదం కాదని, దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉండొచ్చని రోహిత్ పవార్ అనుమానించారు. ప్రమాదానికి కారణమైన విమానం ప్రయాణానికి అనుకూలంగా లేదని డీజీసీఏ నివేదిక వెల్లడించినట్టు గుర్తు చేశారు. విమాన ఇంజన్ కాలపరిమితి ముగింపు దశకు చేరుకున్నప్పటికీ వాణిజ్య వినియోగానికి ఉపయోగించారని ఆరోపించారు. అమెరికాలో సేవలకు స్వస్తి పలికిన విమానాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఉపయోగించారని విమర్శించారు. విమాన సమయాన్ని కూడా తక్కువగా చూపించారని, వాస్తవానికి విమానం 8 వేల గంటలకంటే ఎక్కువ సేపు ప్రయాణం సాగించినట్టు తెలుస్తోందన్నారు. చీఫ్ పైలట్ సుమిత్ కపూర్కు మద్యం అలవాటు ఉందని, గతంలో ఆయనను సస్పెండ్ చేశారని కూడా రోహిత్ ఆరోపించారు.చివరి క్షణంలో సురక్షిత రన్వే కాదని ప్రమాదకర టేబుల్ టాప్ రన్వేను ఉపయోగించారన్నారు. విమానం కూలడానికి ముందు కోపైలట్ ‘ఓహ్ షిట్’ అని అరిచినప్పటికీ ముఖ్య పైలట్ ఎలాంటి అత్యవసర సందేశం పంపించకుండా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. ప్రధాన పైలట్ సుమిత్ మద్యం మత్తులో ఉండటమో లేక ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నారో తమకు అనుమానంగా ఉందన్నారు. ఇదొక వ్యవస్థీకృత కుట్రలో భాగంగా జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అజిత్ పవార్ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉందని, కానీ చివరి క్షణంలో విమాన ప్రయాణంగా మారిందని, దీని వెనుక ఎవరున్నారో తనిఖీ చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన బారామతిలో దట్టమైన పొగమంచు అలుముకుందని, కనిష్టంగా 5 కిలోమీటర్ల విజిబిలిటీ లేకపోయినప్పకీ ల్యాండింగ్కు అవకాశం కల్పించినది ఎవరని ప్రశ్నించారు. -
హామీల ఎగవేత అప్పుల మోత
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదనే ఆవిరి చేస్తూ తాజాగా మంగళవారం 7.88 శాతం వడ్డీతో మరో రూ.3,900 కోట్లు బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో ఈ ఆర్థిక ఏడాది ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులతో చరిత్ర సృష్టించారు. తాజా అప్పుతో 22 నెలల పాలనలో చంద్రబాబు బడ్జెట్లో చేసిన అప్పులు ఏకంగా రూ.1,86,164 కోట్లకు చేరాయి.వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు మరో రూ.1,51,057 కోట్లకు ఎగబాకాయి. దీంతో బాబు పాలనలో మొత్తం అప్పులు రూ.3,37,221 కోట్లకు చేరాయి. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్య కృత్యంగా టీడీపీ కూటమి సర్కారు పాలన సాగుతోందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు. -
మాజీ సీఎం జగన్తో పిన్నెల్లి భేటీ
సాక్షి, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న ఆయన ఇటీవల బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. తనపైన, తన సోదరుడిపైన టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా జగన్కు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ అభయమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పిన్నెల్లి కుమారుడు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. -
పట్టణాల్లో వార్డుల సంఖ్య పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. జనాభా సంఖ్య ఆధారంగా కార్పొరేషన్లలో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డులను విభజించనున్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.దీని ప్రకారం నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52 మధ్య, కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉండాలని నిర్ణయించారు. చివరి సారిగా జరిగిన జనాభా లెక్కల ఆధారంగా వార్డుల విభజన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కించారు. -
అల్లరి వేళల అప్రమత్తం
రంగంపేట/రాయవరం: పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆటలాడితేనే ఆరోగ్యం. ఆలోచిస్తేనే మేధోబలం. ఇవన్నీ నియంత్రణలో ఉన్నపుడే వారికీ.. వారి తల్లిదండ్రులకు.. చదువులు చెప్పే గురువులకు గౌరవం.. మన్నన. ఎండల తీవ్రత పెరగడంతో విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల నుంచి రాగానే పుస్తకాల సంచీ అవతల పడేసి ఆదరాబాదరగా అన్నం తినేసి స్నేహితులతో ఆటలకు పరుగులెడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులు పెడితే విద్యార్థులు మళ్లీ ఆ ఎండనే పడి ఆటలాడడం ఆలోచించాల్సి విషయం. ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల భద్రతను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫేట్ మారుస్తున్న ఫీట్స్.. దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు కాలువలు, చెరువులు, వాగులు, వంకలు, బావుల్లో ఈత సరదా కోసం వెళ్లి మత్యువాత పడుతున్నట్లు యూనిసెఫ్ సర్వే సారాంశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నీటి వనరులకు కొదవు లేకపోవడంతో ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఎక్కువ. నీటిని చూడగానే సహజంగానే పిల్లలు ఈతకు ఉపక్రమిస్తుంటారు. స్థానికులైతే కొంత పరవాలేదు కానీ.. చుట్టపుచూపుగా వచ్చిన బంధువుల పిల్లలు, స్నేహితులు అయితే ఆ కాలువో, చెరువో లేదా మరేదైనా దాని లోతెంతో తెలియక.. ఊబి ఉందా.. బంక మట్టి ఉందా తెలియక వాటిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు చిన్నారులు తోటి స్నేహితులు ఈదుతున్నారు కదా అని ఈత రాకపోయినా వారు కూడా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రమాదకర ఫీట్స్ చేసి తగలరాని చోట ఏదో తగిలి.. లేదా నిలువుగా డైవ్ చేసే వేళ నిగ్రహించుకోలేని లోతులకు దూసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్ల కొమ్మల నుంచి.. కాలువ గట్ల పైనుంచి దూకుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఒంటి పూట బడులు, రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు మరింత అప్రమత్తమై అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కాలువైనా.. వ్యవసాయ బావులైనా.. నదులైనా ఎక్కడ ఎంత లోతు ఉంది.. పిల్లలు దిగరాదని.. నీటి లోపలి మట్టి జారుడుగా ఉందా.. ఊబులు ఉండే అవకాశం ఉందా.. అట్టడుగున తూటికాడ, గుర్రపుడెక్క ఉండే అవకాశం ఉందా.. దానిలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం ఉందా తదితర వివరాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.పంచాయతీలు, నీటిపారుదల శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద మెష్లతో కంచెలు నిర్మిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది.తేలికపాటి ఆహారం మంచిది...వేసవిలో పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. వేపుళ్లు, మాంసాహారం వంటివి వేసవిలో మంచిది కాదు. రాత్రిపూట త్వరగా నిద్రకు ఉపక్రమించేలా, నిద్ర లేచిన తరువాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ వేణుశ్రీలక్ష్మి, పీహెచ్సీ, రంగంపేట మండుటెండల్లోనే ఆటలువిద్యార్థులు ఎండ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల వదిలాక ఇళ్లకు వచ్చే క్రమంలో తలకు టోపీ ధరించడం, ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రవి కిరణాలతో ప్రమాదంఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు భూమిపై నిటారుగా పడుతుంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం, ప్రయాణ సమయాల్లో పిల్లలను వాహనాల ముందు భాగంలో కూర్చోపెట్టకుండా వడదెబ్బ నుంచి కాపాడడం అవసరమని వారు సూచిస్తున్నారు.ఆటలలో అజాగ్రత్త వద్దువిద్యార్థులు స్మార్ట్ మొబైళ్లకు బానిసలు కాకుండా నీడ పట్టున ఆడే ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాల పఠనం, అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువర్గంతో ఎక్కువ సమయం గడపడం అత్యంత ఆవశ్యకం. తద్వారా పెద్దలతో మసలే తీరు తెలుసుకునే అవకాశం, మంచీ చెడూ తెలుస్తాయి. మధ్యాహ్న వేళ కొంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. -
ఇంటర్ కొత్త సిలబస్ కార్పొ‘రేట్’కు కాసుల పంట
సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు తమ ఆ«దీనంలో ఉన్న సంస్థలకు పలురకాలుగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఓ ప్రైవేట్ సంస్థకు మేలు చేకూరుస్తూ, కోట్లాది రూపాయల విలువైన ముద్రణ టెండర్ను కట్టబెట్టడం వింతగా మారింది. ఇందుకోసం తెలుగు అకాడమీని సైతం బలి పశువును చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం రూ.10 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో ఉన్న వీజీఎస్ ముద్రణా సంస్థ కోసం టెండర్ నిబంధనలు మార్చి ఇంటర్మీడియెట్ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు అప్పగించారని, ఇందుకోసం విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచే ప్రక్రియ నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే జరిగిందంటే..! 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ సిలబస్ మారింది. తొలుత మొదటి సంవత్సరం సిలబస్ను మార్చారు. 2026–27లో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. కొత్త పుస్తకాల ముద్రణను తెలుగు అకాడమీ ద్వారా రూ.19 కోట్ల కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్ సంస్థలు టెండర్లు ద్వారా పొందాయి. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకుండానే సిలబస్ సాఫ్ట్ కాపీలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం గమనార్హం. దీని వెనుక వీజీఎస్ ముద్రణా సంస్థ ఉన్నట్టు గుర్తించిన తెలుగు అకాడమీ సదరు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిబంధనలకు పాతర.. గత ప్రభుత్వంలో పుస్తకాల ముదణ్రను ఐదు నుంచి ఆరు సంస్థలకు అప్పగించేవారు. ఇందుకోసం సంస్థల చరిత్ర, పనితీరుతో పాటు వాటిపై ఉన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునే కాంట్రాక్టు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకతకు పూర్తిగా తిలోదకాలిచ్చి అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్ సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలనే మార్చినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా 2026–27 ఇంటర్మీడియెట్ రెండో ఏడాదిలో కొత్త సిలబస్తో రూ.19 కోట్లకు పుస్తకాల ముద్రణను వీజీఎస్కు 70 శాతం, విక్రమ్కు 30 శాతం కాంట్రాక్టును వారం రోజుల క్రితం అప్పగించింది. తెలుగు అకాడమీ సిద్ధం చేసిన సిలబస్ సాఫ్ట్ కాపీలను ఆయా సంస్థలకు అందించారు. రెండు రోజుల్లోనే ఫిజిక్స్, గణితం, మరికొన్ని సబ్జెక్టుల పుస్తకాల సాఫ్ట్ కాపీలు వాటా్సప్లలో హల్చల్ చేశాయి. అప్పటికే అవి పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలకు చేరిపోయాయి. తెలుగు అకాడమీ చరిత్రలో కాపీరైట్ పుస్తకాల కాపీలు ముద్రణకు ముందే కార్పొరేట్ సంస్థలకు వెళ్లిపోవడం దురదృష్టకరం. సాఫ్ట్కాపీలు అందించిన సదరు సంస్థలకు రూ.10 కోట్లు లబ్ధి చేకూరినట్టు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు బుట్టదాఖలు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందిన ముద్రణ సంస్థలు మెటీరియల్ను ఇతరులకు విక్రయించడం లేదా ఇవ్వడం, చేరవేయడం చట్టరీత్యా నేరం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ముద్రణ కాంట్రాక్టును దక్కించుకుని, మరోపక్క ముద్రణకు ఇచ్చిన సిలబస్ సాఫ్ట్ కాపీలను కార్పొరేట్ విద్యాసంస్థలకు అమ్ముకున్నారు. ఇంటర్ పుస్తకాల ముద్రణ దక్కించుకున్న వీజీఎస్ సంస్థ గతంలో కూడా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీఈఆర్టీ సిలబస్ను ప్రైవేటు స్కూళ్లకు అమ్ముకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ ముద్రణా సంస్థపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, ఆ కంపెనీకి మేలు చేసేందుకు ఏకంగా నిబంధనలే మార్చారు. దీంతో ఆయా సంస్థలు కాంట్రాక్టు దక్కించుకోవడంతో పాటు కాసుల వేటలో పడ్డాయి. -
శాసనసభ స్థానాలు 263కి పెంపు!
సాక్షి, అమరావతి: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో శాసనసభ, లోక్సభ స్థానాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో లోక్సభ, 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన గంపగుత్తగా 50 శాతం స్థానాలను పెంచడం.. 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో కలిపి) చేస్తూ రూపొందించిన మార్గదర్శకాలతో కూడిన బిల్లుపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక.. పెరిగే నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే 86 లేదా 87 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఇక లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరగనున్నాయి. అందులో మహిళలకు 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల్లో సమూల మార్పు..ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాసనసభ స్థానాలను ఎస్సీలకు, ఏడు శాసనభ స్థానాలకు ఎస్టీలకు రిజర్వు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు (చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం) ఎస్సీలకు, ఒక లోక్సభ స్థానం(అరకు) ఎస్టీలకు రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు శాసనసభ, లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఎస్సీల జనాభా గరిష్టంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ఎస్టీల జనాభా గరిష్టంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాల పరిధిలోనూ ఏడు చొప్పున శాసనసభ స్థానాల ఉన్నాయి. కానీ.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ఒక్కో రీతిలో శాసనసభ స్థానాల ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. లోక్సభ నియోజకవర్గాల స్వరూపం సమగ్రంగా మారిపోనుంది. ఇక శాసనసభ స్థానాల స్వరూపం కూడా సమగ్రంగా మారనుంది.పెరగనున్న మంత్రివర్గం కోటా:శాసనసభ స్థానాల్లో 15 శాతం లోపు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ప్రస్తుతం శాసనసభలో 175 స్థానాలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 26కి మించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 262 లేదా 263కు పెరగనుంది. ఆ మేరకు మంత్రివర్గం కోటా కూడా 26 నుంచి 39కి పెరగనుంది. -
ఎంబీబీఎస్ ‘ఫీ’టముడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు వైద్య విద్య మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేట్ వైద్య కళాశాలలే కాకుండా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పద్మావతి కాలేజీలోనూ ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ఐదేళ్ల ఫీజులను బలవంతంగా వసూలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలను తుంగలో తొక్కి మరీ ధార్మిక సంస్థ కర్కశంగా వ్యవహరించడంపై విద్యార్థు లు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఐదో టర్మ్ ఫీజు కట్టడానికి గడువు విధించి, ఆలోపు చెల్లించకపోతే రోజువారీ పెనాల్టీ విధిస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హెల్త్ వర్సిటీ తీర్మానమూ బేఖాతర్ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేళ్లు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు విద్యార్థులు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల్లో నడిచే వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని గత ప్రభుత్వం జీవో–146ను విడుదల చేసింది. నాలుగున్నరేళ్ల ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఇటీవల హెల్త్ వర్సిటీ కార్యవర్గమూ తీర్మానించింది. అయినా ఐదేళ్ల ఫీజు చెల్లించాలని ఈ నెల 14న పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా ఆదేశాలు జారీ చేశారు. ఐదో టర్మ్(ఏడాది)ఫీజు చెల్లించడానికి బుధవారం(మార్చి 25) చివరి గడువు విధించారు. ఇదేమి అన్యాయమని తల్లిదండ్రులు ప్రశ్నించినా ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని కళాశాల అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. కోర్టు ఉత్తర్వులున్నా.. వైద్య కళాశాలలు నాలుగున్నరేళ్లకే ఎంబీబీఎస్ ఫీజు వసూలు చేయాలని కోర్టులు సైతం ఇప్పటికే పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులనూ పద్మావతితో పాటు, రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలు బేఖాతరు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్ సమయంలోనే చివరి ఏడాది పూర్తి ఫీజు చెల్లించాలని షరతు పెడుతున్నాయి. అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్నా.. చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కళాశాలలను నియంత్రించాల్సిన హెల్త్ వర్సిటీ చోద్యం చూస్తోంది. -
23 ‘ప్రభుత్వ’పదవులకు మమత రాజీనామా
కోల్కతా: త్వరలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడనున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో, ఇతర ప్రభుత్వరంగ బోర్డ్లు, అకాడమీలకు మొత్తంగా 23 పదవులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు హోం శాఖ, ఇతరత్రాల శాఖల నుంచి ఉత్తర్వులు జారీచేశారు.రాష్ట్ర ఆరోగ్య మిషన్, రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్, ఎకోటూరిజం అడ్వైజరీ బోర్డ్, 125వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల కమిటీ, ఉర్దూ అకాడమీ పాలకమండలి, బంగ్లా సంగీత్మండలి ఆర్గనైజింగ్ కమిటీ, ఎస్సీ, ఎస్టీల సలహా మండలి, పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, విపత్తుల నిర్వహణ సంస్థ సహా పలు సంస్థలకు చీఫ్ పదవి నుంచి మమత రాజీనామాచేశారు. లేఖలో ప్రస్తావించకపోయినా, తాను ప్రాతినిధ్యంవహించే ప్రతి ఒక్క సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు సంబంధిత ఉత్తర్వులో ప్రస్తావించారు. -
ఇక మంటలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గతం కంటె ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. ప్రధానంగా వచ్చే ఐదు రోజుల్లో వేడి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మరోవైపు కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి 28వ తేదీ వరకూ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 27, 28 తేదీల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు.‘ఎల్నినో’నే కారణంఈ వాతావరణ మార్పులకు ఎల్నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ వల్ల ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి పంట కోత సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ ప్రజా పోరాటం
సాక్షి, అనంతపురం/అమరావతి: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమకు కల్పతరువుగా మారిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) కింద అననుమతులను పునరుద్ధరించింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోని మరిన్ని ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. 2031 వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల గొంతుకగా వైఎస్సార్సీపీ చేసిన పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని ప్రజలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. దీనిని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయతి్నస్తున్నారంటూ మండిపడుతున్నారు. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. 2025 ఏప్రిల్ 21న కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకపోవడంతో ఆర్డీటీ విదేశీ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. దీంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ సంస్థ పథకాలు అందక వారంతా నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. పేదలు పడుతున్న కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతలను మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించగా.. ఆయన పార్టీ నేతలు, ప్రజలతో కలిసి ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానమంత్రికి విజ్ఞప్తులు పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంతోపాటు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై స్పందించిన కేంద్రం ఎట్టకేలకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన టీడీపీ నాయకులు ఒక్కరోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. వైఎస్ జగన్ అభినందనలు ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్చేసి అభినందించారు.వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతోనే విజయం 1969 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్డీటీ అని, అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం చేపట్టి విజయం సాధించామని మాజీ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతో విజయం సాధించాం.10 నెలల నిరంతర పోరాట ఫలితంగా కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. దీని ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఉద్యమానికి అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, సహకరించిన ప్రజా సంఘాలకు, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దారుణం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం కూటమి నేతలు చేసిందేమీ లేదు’ అని స్పష్టం చేశారు. -
హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రధానంగా హార్మూజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్మూజ్ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, పశ్చిమాసియా పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించామని స్పష్టంచేశారు. కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై నేతలు చర్చించారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. -
దేశద్రోహం కేసులో ముగ్గురు అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు)/విజయవాడలీగల్: ఆన్లైన్ రాడికలైజేషన్, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయవాడ నగరానికి చెందిన ముగ్గురిని దేశద్రోహం కేసులో అరెస్టు చేసినట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ట త్రిపాఠి చెప్పారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. నిందితులు మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సొహైల్ సామాజిక మాధ్యమాల్లో సంఘటిత గ్రూపులను నిర్వహిస్తూ, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన డిజిటల్ కంటెంట్ను వ్యవస్థీకృతంగా ప్రచారం చేస్తున్నట్లు, సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తులను ఆకర్షించడం, నియమించుకునే యత్నాలు చేస్తున్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. వారు దేశం వెలుపల ఉన్న కొంత మంది వ్యక్తులతోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించామని వివరించారు. మొబైల్ ఫోన్లు, అనుమానాస్పద వస్తువులతోసహా పలు ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని త్రిపాఠి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్పటేల్, ఏసీపీ లతాకుమారి, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గన్లు ఇస్తే యుద్ధం చేయాలనిపిస్తోంది! అనంతరం నిందితులను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరచడంతో న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో నిందితులు ‘పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్పై జరుగుతున్న యుద్ధం మమ్మల్ని కలచివేశాయి.. గన్లు, మారణాయుధాలు ఇస్తే అక్కడకు వెళ్లి యుద్ధం చేయాలనిపిస్తోంది’’ అని చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులోనూ పేర్కొన్నట్లు సమాచారం. -
ఇరాన్ జాతీయ భద్రతా మండలికి కొత్త చీఫ్
దుబాయ్: ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు నూతన కార్యదర్శిగా మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ను నియమించారు. ఈయన గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్స్ప్ (ఐఆర్జీసీ)లో గతంలో కమాండర్గా సేవలందించారు. ఐఆర్జీసీలో ఉంటూ ఈయన గతంలో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగారు.ఇప్పటికే జోల్ఘదర్ ఇరాన్ పార్లమెంట్కు, 12 మంది సభ్యులుండే గార్డియన్ కౌన్సిల్కు మధ్య పొడచూపే విబేధాలను పరిష్కరించే ఇరాన్ ఎక్స్పిడియన్సీ కౌన్సిల్కు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలా లారిజానీ ఇటీవల దాడుల్లో చనిపోవడంతో జోల్ఘదర్ను ఎంపికచేశారు. -
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. -
కార్లకు రుణమాఫీ చేయండి
సాక్షి, అమరావతి: ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా ఇచ్చిన ‘థాంక్యూ సీఎం సార్’ కార్లపై ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కార్యాలయం వద్ద లబ్దిదారులు ధర్నా చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ లబ్దిదారులు మంగళవారం ధర్నా అనంతరం తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ ఎండీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక, అభివృద్ధి సంస్థ(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ఆర్థిక సహకారంతో 2016 నుంచి 2019 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ కార్లు అందించిందన్నారు. వాటిని స్థానిక అధికారులకు అద్దెకు పెట్టుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. వాస్తవానికి ఆ కార్లను అధికారులకు అద్దెకు పెట్టుకోలేదని, ఆ తర్వాత కిరాయిలు కూడా లేక అప్పులు చేసి మరీ కిస్తీలు చెల్లించామని వాపోయారు. కిస్తీల కోసం అధికారుల వేధింపులు పెరిగాయని వాపోయారు. ఏప్రిల్ నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే కార్లు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్లు ప్రయోజనాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచి్చన కార్లకు రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. -
ఉద్యోగుల పాలిట రు‘బాబు పాలన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. ఛీత్కారాలు, వేధింపులు, పనిభారంతోపాటు దాడులు, దాష్టీకాలకు బలవుతున్నారు. తాజాగా తిరుపతిలో సచివాలయ ఉద్యోగిపై జరిగిన దాడే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులను నియమించారు. వారిని ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములను చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేలా రోజూ స్పందన కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగులకు సమాజంలో గౌరవప్రతిష్టలు పెరిగాయి. ఆ ఐదేళ్లు పైరవీలు, పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించడంతో ఉద్యోగులకు ప్రజల్లో మర్యాద పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక స్పందన రద్దుతోపాటు సర్కారు విధానాల వల్ల ప్రజల నుంచి సచివాలయ ఉద్యోగులు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ నేతల వేధింపులకు బలవుతున్నారు. సర్వేలు, పన్ను టార్గెట్లతో ప్రజల్లో ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం తరచూ సర్వేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచింది. దీంతో ఇంటింటి సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లాల్సి వస్తోంది. అడిగిన సమాచారమే మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. దీంతో ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావం పెరగడంతోపాటు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. తాజాగా పన్నుల వసూళ్లు టార్గెట్లు పెట్టి మరీ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతోపాటు వసూళ్లు చేయకపోతే సంజాయిషీలు, చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. బలవంతపు వసూళ్లకు పురిగొల్పింంది. తమపై ఉన్న ఒత్తిడితో ఉద్యోగులు పదేపదే ఇంటింటికీ వెళ్లి పన్నులు అడుగుతుండడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తిరుపతి నగరంలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడికి ఇదే కారణమని చెబుతున్నారు. సర్కారు విధానాల వల్ల ఉద్యోగులు వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంబద్ధ ప్రశ్నలతో చికాకు.. సర్వేల పేరుతో ప్రభుత్వం రూపొందించే అసంబద్ధ ప్రశ్నలు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనికితోడు ప్రతిసారీ ఓటీపీలు అడుగుతుండడంతో ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహానికి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారు.కుక్కల లెక్కలకూ వాళ్లే.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కల లెక్కలూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. మరుగుదొడ్ల వద్ద విధులూ కేటాయిస్తోంది. ఇప్పుడు పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి వంద శాతం వసూలు చేయాల్సిందేనని రుబాబు చేస్తోంది. దీంతో పని ఒత్తిడి ఎక్కువై ఉద్యోగులు మరణిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో దాడులు, దాష్టీకాలకు గురవుతున్నారు. దీనికి సర్కారు విధానాలే కారణం. తిరుపతిలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఒత్తిడి, ప్రజల వ్యతిరేకతతో.. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత మధ్య సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు. తిరుపతిలో విధి నిర్వహణలో ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నాగార్జునపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలి. – ఎం.డి.జానిపాషా, బి.అంకమ్మరావు, గ్రామ/వార్డు సచివాలయం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
సమర్థంగా ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒకబృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోందని అన్నారు. ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి కోవిడ్–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే.. సోమవారం కొత్తగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సప్లై చైన్స్, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల ఆధారంగా చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించినట్లు చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.దక్షిణాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన వ్యూహాలపై సాధికార బృందాలు కసరత్తు చేస్తాయన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఒక ప్రత్యేకమైన స్వభావం కలదని, దానికి తగినట్టుగానే విభిన్నమైన రీతిలో పరిష్కారాలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు నిరంతరం మారుతున్నాయని, అందుకే ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. పశ్చిమాసియా ప్రతికూల పరిణామాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.శాంతి యత్నాలకు భారత్ మద్దతు ఎరువుల సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రాబోయే పంటల సీజన్లో సరిపడా ఎరువులు అందజేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం మన బాధ్యత అని వివరించారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. దక్షిణాసియా లో శాంతి యత్నాలకు భారత్ మద్దతు కచి్చతంగా ఉంటుందన్నారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోయి, హర్మూజ్ జలసంధి తేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఒకవేళ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ఒకవైపు అంతులేని అప్పులు.. మరోవైపు యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం! రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సర్కారు నిర్వాకాలకు ఇది మరో నిదర్శనం! సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లోని లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ.1,472.50 కోట్ల భారం పడింది. రాజధానిలో 220 కేవీ, 400 కేవీ విద్యుత్ లైన్లను విస్మరించి మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. దీనివల్ల ఇప్పుడు నిర్మాణాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయని.. వాటిని మార్చాల్సిందేనని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించింది. ఆ మేరకు ఆ పనులను ప్యాకేజీల కింద విడగొట్టి.. వాటిని 8.98, 8.99 శాతం అధిక ధరలకు ముఖ్యనేతకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనులు మనోళ్లకు అప్పగిస్తే మురికివాడలు నిర్మిస్తారని 2016లో సీఎం చంద్రబాబు మన ఇంజనీర్లను అవహేళన చేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరి.. సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్ప్లాన్ లోపాల వల్ల ఖజానాపై పడిన భారీ భారం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.తప్పుబట్టిన ‘కాగ్’..217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులను నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్కు 2016లో నామినేషన్పై చంద్రబాబు సర్కార్ అప్పగించడాన్ని కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తప్పుబట్టింది.. మాస్టర్ ప్లాన్ను రూపొందించిన ఆ సంస్థకు రూ.20.28 కోట్లను అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది. ఆ ప్లాన్ ప్రకారమే అప్పట్లో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ.. రాజధాని ప్రాంతంలో గతంలో 38 కి.మీ.ల పొడవున వేసిన 400 కేవీ విద్యుత్ లైన్, 55 కిమీల పొడవున వేసిన 220 కేవీ లైన్లు నిర్మాణాలకు అడ్డంకిగా మారాయి. ఇది మాస్టర్ ప్లాన్లో లోపాలను బహిర్గతం చేసింది. దాంతో ఆ విద్యుత్ లైన్లను మార్చే పనులకు గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.నిబంధనలు తుంగలో తొక్కి..రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకు 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ(ఈహెచ్వీ) లైన్ అండర్ గ్రౌండ్లో ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో ఏపీ ట్రాన్స్కో 18 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ(డైరెక్ట్ కరెంట్) లైన్స్లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 220 కేవీ లైన్ను మార్చే పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు రూ.1,082.44 కోట్లకు కట్టబెట్టింది. అంతేకాదు.. కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి 400 కేవీ లైన్ను మార్చే పనులను రూ.390.06 కోట్లకు అప్పగించింది. కాగా టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.114.68 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరింది. ఈ పనులను కాంట్రాక్టర్కు అప్పగిస్తూ గతేడాది మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.10,319.11 కోట్లు ప్రయోజనమంటూ వితండవాదన..విద్యుత్ లైన్లను మార్చే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. 220 కేవీ లైన్ను మార్చడం వల్ల 271.82 ఎకరాలు, 400 కేవీ లైన్ను మార్చడం వల్ల 244.14 ఎకరాల భూమి మిగులుతుందని.. ప్రస్తుతం ఎకరం మార్కెట్ విలువ రూ.20 కోట్లు పలుకుతోందని.. దీనివల్ల మొత్తం రూ.10,319.11 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని ఆ ప్రతిపాదనల్లో సీఆర్డీఏ పేర్కొంది. కానీ.. రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. విద్యుత్ లైన్లను మార్చే పనులకు అనుమతి కోసం వితండవాదనతో కూడిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సీఆర్డీఏ పంపిందన్నది స్పష్టమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
నెట్టింట లాక్డౌన్ చర్చ
సాక్షి, స్పెషల్ డెస్క్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2020 మార్చి 24న ప్రకటించిన దేశవ్యాప్త కోవిడ్–19 లాక్డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో లాక్డౌన్ అనే అంశంపై గూగుల్ వేదికగా మంగళవారం రోజంతా చర్చ సాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై సోమవారం పార్లమెంటులో ప్రసంగించే క్రమంలో ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులను కోవిడ్ మహమ్మారితో పోల్చారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఏర్పడిన అంతరాయాన్ని ఎదుర్కోవడానికి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చూపినటువంటి సామూహిక సహనం, ఐక్యత, సంసిద్ధతను ప్రజలు ప్రదర్శించాలని ఆయన కోరారు. అదే సమయంలో పౌరులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ నిర్ణయాలను నమ్మాలని ప్రధాని ఉద్ఘాటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త లాక్డౌన్కు సంకేతమని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమైంది. నాటి దేశవ్యాప్త దిగ్బంధం, నిర్జన రోడ్లు, లక్షలాది మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం, కార్యాలయాలు అకస్మాత్తుగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలోకి మారడం వంటి ఆనాటి దుర్భర పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని నెటిజన్లు కంగారుపడ్డారు.దీనికితోడు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇంధన పొదుపు కోసం 10 సూచనలు చేస్తూ వాటిని ‘కోవిడ్ తరహా చర్యలు’గా అభివర్ణించింది. అయితే ఇది కూడా సోషల్ మీడియాలో తప్పుగా వ్యాప్తి చెందింది. ఐఈఏ పేర్కొన్న ‘స్వచ్ఛంద’ అనే పదాన్ని తీసేసి ఇది ప్రభుత్వం విధించబోయే ‘తప్పనిసరి’ ఆదేశమంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు తప్పుగా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవన్నీ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు మరింత అగ్గిరాజేశాయి. నెట్టింట లాక్డౌన్ చర్చకు కారణమయ్యాయి. -
ఐనా.. ఆగని దాడులు!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినా మిత్ర దేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా దీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులకు దిగింది. అంతేగాక ‘పూర్తి విజయం’సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది! దీనికితోడు అమెరికా కూడా వేలాదిమంది మెరైన్ సైనికులను గల్ఫ్కు పంపిస్తోంది. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడం లేదు.దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాలన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ విషయమై ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్టు వెల్లడించింది. యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ సోమవారం ప్రకటించడం తెలిసిందే. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్కు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జెరేద్ కుష్నర్ వాటిలో పాల్గొంటున్నారు. చర్చలు ఈ వారమంతా కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఖండించింది. చమురు క్షేత్రాలకు నష్టం ఇరాన్లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు విన్పించాయి. దాడుల్లో రెండు ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బ తిన్నట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. ‘‘ఇస్ఫహాన్లోని సహజవాయు కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఖొర్రంషార్లో కీలక విద్యుత్కేంద్రానికి గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి’’అని పేర్కొంది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అపార్ట్మెంట్పై జరిగిన దాడిలో కనీసం ముగ్గురు మృత్యువాత పడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాయబారిని దేశం వీడాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. టెల్ అవీవ్లో విధ్వంసం ఇరాన్ కూడా ఇజ్రాయెల్పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్ హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్మెంట్తో పాటు పలు భవనాలు దెబ్బ తిన్నాయి. నలుగురికి స్వల్ప గాయలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బ తిన్నాయి. దాంతో పలు ప్రాంతాలు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచి్చంది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూలి్చనట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలిపింది. యూఏఈలో జరిగిన దాడుల్లో మొరాకోకు చెందిన ఒక కాంట్రాక్టర్ మరణించినట్టు సమాచారం. బహ్రెయిన్లోని తమ డేటా సెంటర్లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. దాడులతో అక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కావడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్లో 16కు పెరిగిన మృతుల సంఖ్యఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో హెజ్బొల్లా దాడుల్లో ఒక రైతు మరణించాడు. దాంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ 4,5654 మంది గాయపడ్డట్టు ఆ దేశ అత్యవసర వైద్య సేవల విభాగం పేర్కొంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు బలైనవారి సంఖ్య 1,000 దాటింది. ఇక ఇరాన్లో ఇప్పటిదాకా 1,500 మందికి పైగా మరణించారు. యుద్ధ నెపం హెగ్సెత్పై!దాడి చేద్దామన్నది ఆయనే: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధానికి దిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాల్లో పడ్డారు. ఇరాన్పై దాడులు చేద్దామని తొలుత సూచించింది తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెతే అని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు! టెనెసీలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు హెగ్సెత్ ఆయన పక్కనే ఉండటం విశేషం.‘‘ఇరాన్ సమస్యపై ఆ మధ్య నా సన్నిహితులందరినీ పిలిచి లోతుగా చర్చించా. పరిస్థితిని వారికి వివరించా. అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఏం చేద్దామని అడిగా. అందరికంటే ముందు హెగ్సెత్ స్పందించారు. ఇరాన్పై దాడి చేద్దామని చెప్పుకొచ్చారు’’అన్నారు. అంతేగాక పక్కనే ఉన్న హెగ్సెత్కేసి తిరిగి, ‘‘అంతేకదా! ఇరాన్పై దాడి చేద్దామని ముందుగా చెప్పింది నువ్వే కదా! ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు అవకాశమివ్వొద్దని కూడా అన్నావు’’అంటూ అడిగారు. -
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు విడుదల చేయడంతోపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగ నియామకాల భర్తీ హామీ నెరవేర్చాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో విద్యార్థులు, యువతకు మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకుని లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్లో విద్యకు 18 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసినా కేటాయింపులు 8 శాతానికే పరిమితం చేశారు. గత ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన ఫీజు రీయింబర్స్మెంటులో 80 శాతం నిధులను విడుదల చేయలేదు. రూ.8 వేల కోట్ల బకాయిలకుగాను రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం మోసగిస్తోంది. బడ్జెట్లో విద్యానిధి పథకం, రూ.5 లక్షల విద్యా రుణం హామీ ఊసేలేదు. రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ కేలండర్ అమలు చేస్తామని ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయని రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’అని అన్నారు. విద్యార్థి నేతల అరెస్టు అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అరెస్టు చేసి పంజగుట్ట, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసులు పలువురు బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం నేతల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీసులు అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్ తదితరులు తమ ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చిన వీడియోలను ట్వీట్ చేశారు. విద్యార్థుల అరెస్ట్ దుర్మార్గ చర్య: కేటీఆర్ పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగ నియామకాల హామీ అమలు కోసం నిలదీసిన బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా ప్రశ్నించిన గొంతులపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఇచి్చన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి వచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. జాబ్ కేలండర్కు పాతరేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను నిర్లజ్జగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కుప్పకూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిదే. 127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా సీఎం రేవంత్రెడ్డిలో కనీసం చలనం లేదు. ఇప్పటికైనా బకాయిపడ్డ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేడో, రేపో సీన్ రీ కన్స్ట్రక్షన్!
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను సిట్ విచారించింది. రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని సోదరుడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్శర్మను మంగళవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని బందోబస్తు మధ్య శంషాబాద్ ఠాణాకు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. మొదట రోహిత్రెడ్డితో ప్రారంభించి, ముగ్గురిని వేర్వేరుగా విచారించారు.సిట్ బృందం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు మధ్యాహ్నం శంషాబాద్ ఠాణాకు వచ్చి నిందితులను స్వయంగా విచారించారు. వేర్వేరుగా ముగ్గురిని విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. ఫామ్హౌస్లో కుటుంబ సభ్యులతో పార్టీలు మాత్రమే జరుగుతుంటాయని రోహిత్రెడ్డి అడ్వొకేట్ శ్రీకాంత్రెడ్డి మీడియాతో తెలిపారు. పాత సంఘటలను కాకుండా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే విచారించాలని కోర్టు సూచించినట్టు చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు, కాల్పుల వ్యవహారంపై ఆరా కాల్పుల వ్యవహారం, డ్రగ్స్ కొనుగోలు అంశాలపై సిట్ అధికా రులు నిందితులను ప్రశ్నించినట్టు తెలిసింది. డ్రగ్స్ ఎక్కడ కొను గోలు చేశారు.. ఎవరు సరఫరా చేశారు.. డ్రగ్స్ పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి వంటి ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాల్పుల వ్యవహారంపై నమిత్శర్మను ప్రశ్నించి పలు విషయాలు తెలుసు కున్నారు. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసింది రోహిత్రెడ్డే కావడంతో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విచారణలో నాలుగు కొత్త పేర్లు బయటకొచ్చినట్టు సమాచారం. మిగిలిన రెండు రోజుల విచారణలో డ్రగ్స్ మూలాలకు సంబంధించిన వివరా లను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఫామ్హౌస్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
సర్వత్రా డీలిమిటేషన్ చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నియోజకవర్గాల పునర్విభ జన హాట్ టాపిక్గా మారింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందనే సమాచారంతో.. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా రాజకీయ నేతలనే తేడా లేకుండా పునర్విభజన గురించిన చర్చే జరుగుతోంది. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, అధికారులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా మాట్లాడుకోవడం కన్పించింది. ముఖ్యంగా సెంట్రల్, నార్త్, సౌత్ తెలంగాణల్లో ఎక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే సెంట్రల్ తెలంగాణగా పరిగణించే హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయి అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించగలిగే పార్టీలు సులువుగా అధికారం దక్కించుకునే విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల జనాభాలో మార్పురాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే పునర్విభజన ఆయా జిల్లాల పరిధిలోనే ఉండనుంది. కొత్త జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఈ మేరకు నియోజకవర్గాల జనాభాలో మార్పు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకుంటారనేది నిపుణుల భావన. జిల్లా, రాష్ట్రం యూనిట్గానియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల కేటాయింపునకు చాలా కాలంగా ఓ పద్ధతి పాటిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల కోసం జిల్లా యూనిట్గా, ఎస్టీ నియోజకవర్గాల కోసం రాష్ట్రం యూనిట్గా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఒకటి లేదా రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎస్టీ రిజర్వుడు స్థానాల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం వారి జనాభా ఆధారంగా మొత్తం స్థానాలను నిర్ధారించి, ఆ మేరకు ఎస్టీల జనాభా ఎక్కువ ఉండే నియోజకవర్గాలను రిజర్వు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో మహిళా కోటాఈసారి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో 60 అసెంబ్లీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో రిజర్వు అవుతాయని, పదిహేనేళ్లలో ఈ రొటేషన్ పూర్తయి రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిసారి ప్రతి జిల్లాలో ఒకటి నుంచి మూడు స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా లోక్సభ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతమున్న 17కు తోడు అదనంగా పెరిగే 9 స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి. పదవుల సంఖ్యలోనూ మార్పులుప్రస్తుతం జరుగుతున్న చర్చకు అనుగుణంగా శాసన, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే, ఆ మేరకు పలు పదవుల సంఖ్య కూడా మారనుంది. ముఖ్యంగా శాసనమండలిలోనూ సగం స్థానాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా, పునర్విభజన అనంతరం అది 60కి చేరనుంది. దీంతో పాటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు కూడా పెరగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 11కు చేరనుంది. ఇక రాష్ట్ర మంత్రివర్గం సైజు కూడా పునర్విభజన అనంతరం పెరగనుంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం మంది మంత్రులుగా పనిచేసే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల గరిష్ట సంఖ్య 18గా ఉంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 17 మంది మంత్రులుగా పనిచేయవచ్చు. అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మంత్రివర్గం సంఖ్య 27కు చేరనుంది. అయితే పునర్విభజన బిల్లుకు, ఇతర అంశాలకు సంబంధం లేని మండలి నుంచి మంత్రివర్గం వరకు ప్రత్యేక బిల్లుల ద్వారా సవరణలు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయంగా ఎవరికి లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయాలకతీతంగా, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా, జనాభా లెక్కలు, భౌగోళిక సరిహద్దుల ఆధారంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పునర్విభజన సమయంలో నియోజకవర్గాల కూర్పు, ఆయా నియోజకవర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు, నగర ప్రాంతాల్లో పెరిగే స్థానాలు, గ్రామీణ ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో జరిగే మార్పులను బట్టి ఈ లబ్ధిని అంచనా వేయగలుగుతామని చెబుతున్నారు. అయితే సెంట్రల్ తెలంగాణలో సీట్లు భారీగా పెరిగిన పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లకు కొంత మేలు జరగవచ్చని, గ్రామీణ తెలంగాణలో సీట్లు ఎక్కువగా పెరిగితే కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కూతురును కడతేర్చి... తానూ ఆత్మహత్యాయత్నం
సంస్థాన్ నారాయణపురం: భార్యాభర్తల మధ్య కలహాలతో కుమార్తెకు ఎలుకల మందు పెట్టి కడతేర్చాడు ఓ తండ్రి. అనంతరం తానూ నీళ్లలో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవికి నాలుగేళ్ల క్రితం మాడుగులపల్లికి చెందిన స్వాతితో వివాహం జరిగింది. వీరికి మేఘన(2)తో పాటు 9 నెలల వయసున్న మయూరి అనే కుమార్తె ఉన్నారు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తె మయూరిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మేఘన తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే పెద్ద కుమార్తె మేఘనను కూడా తన దగ్గరికి పంపించాలని స్వాతి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై భార్యాభర్తలు పెద్దమనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాల్సి ఉంది. కాగా.. తన చిన్న కుమార్తెను తీసుకుని భార్య తల్లిగారింటికి వెళ్లిందనే కోపంతో రవి తన పెద్ద కుమార్తె మేఘనకు మంగళవారం సపోట పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. మేఘన ఆ సపోట పండు తిని వాంతులు చేసుకుంది. అనంతరం రవి కూడా ఎలుకల మందు నీళ్లలో కలుపుకొని తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి మేఘనను హైదరాబాద్కు, రవిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన మృతిచెందింది. రవి పరిస్థితి విషమంగా ఉంది. రవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోలుకున్న పసిడి... అక్కడే వెండి
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల నుంచి పసిడి బయటపడింది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి రూ.1.44లక్షలకు (పన్నులు సహా) చేరుకుంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకి రూ.2.30 లక్షల వద్దే ఉన్నట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో రికవరీకితోడు, కనిష్ట స్థాయిల్లో కొనగోళ్ల మద్దతుతో బంగారం ధర పెరిగినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్స్కు 17 డాలర్ల వరకు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి సైతం 1% పుంజుకుని ఔన్స్కు 69.86 డాలర్ల స్థాయిని చేరుకుంది. ‘9 రోజుల క్షీణత తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్కు 4,420 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అప్రమత్తతతో కూడిన ఆశావహధోరణి కనిపించింది’ అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ
కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ -
50 శాతం సీట్ల పెంపు ముమ్మాటికీ కుట్రే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని విమర్శించారు. ‘ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదేస్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దక్షిణాది నుంచి చోటు ఉండదు... తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు. మోదీ త్రీడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్, డివల్యూషన్, డి్రస్కిమినేషన్ ఈ త్రీడీ విధానంలో ప్రభుత్వాన్ని మోదీ నడపాలనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాలనుకుంటున్నాం. గతంలో దక్షిణాదికి రాజకీయాల్లో ప్రాముఖ్యత ఉండేది. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు. ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదు. రాజకీయ ప్రాధాన్యంలో దక్షిణాదికి చాలా నష్టం జరుగుతోంది. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్కు పంపించేశారు. దక్షిణాదికి ఢిల్లీలో గుర్తింపేలేదు. మోదీ వచ్చిన తర్వాత రాజకీయ వివక్ష ఎక్కువైంది. కేసీఆర్ది కుటుంబ సమస్య కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత వైరం లేదు, ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. కేసీఆర్ సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడే. గృహ నిర్బంధం చేసి ఏదో రకంగా సీఎం కావాలని చూస్తున్నది అల్లుడు, మీరిద్దరు కాదు నేను సీఎం అవుతా అని కవిత చూస్తున్నది. వారసత్వ రాజకీయాలు నమ్ముకున్న కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకు కాలేదు అల్లుడు అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతా అని హరీశ్రావు అనుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కేసీఆర్ను ఫామ్హౌస్లో వాళ్లే నిర్బంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోవడం ఖాయం. వాళ్లది ఫెవికాల్ బంధం. వాళ్లిద్దరినీ వేర్వేరుగా చూడాలనుకోవడంలేదు. రెండింటినీ మడతేసి కొట్టాలన్నదే నా లెక్క. నాకు ఇప్పటికైతే జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ఇంకా 8 ఏళ్లు 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. -
మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
12 శాతం వరకు పెరగనున్న ఏసీల రేట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ వెల్లడించారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు. మంగళవారమిక్కడ కంపెనీ ఫ్లాగ్íÙప్ ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సేల్స్ 5% తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు సూద్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఏసీల మార్కెట్లో తమకు 14.2% మార్కెట్ వాటా ఉండగా దీన్ని 14.7 శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో 18.5%, ఆంధ్రప్రదేశ్లో 15.5% మార్కెట్ వాటా ఉందన్నారు. వివిధ ధరల శ్రేణిలో కొత్త ప్రమాణాలకు తగ్గట్లుగా 125 ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ హింగోరాని తెలిపారు. వీటిలో ఇన్వర్టర్, ఫిక్సిడ్, స్పీడ్, విండో ఏసీలతో పాటు ఐకానియా పేరిట ప్రీమియం మోడల్ కూడా ఉన్నట్లు ఆయన వివరించారు. -
ఇరాన్కు అమెరికా స్పెషల్ ఫోర్స్.. రీజన్ ఇదే..?
మధ్యప్రాచ్యంలో యుద్దంపై అమెరికా ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు అదనపు బలగాలు అక్కడికి పంపిస్తున్నట్లు సమాచారం. తాజాగా అమెరికా మెరైన్ బలగాలకు సహాయంగా మిడిల్ ఈస్ట్కు అత్యంత శక్తివంతమైన 3,000 మంది ఎలైట్ సైనికులు పంపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి..ఇంతకాలం బాంబులు మిసైళ్లతో దద్దరిళ్లిన మిడిల్ ఈస్ట్ ఇప్పుడు కొంత శాంతించింది. ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇవ్వడంలో ప్రస్తుతం ఇరు వర్గాలు శాంతించాయి. అయితే ఇరాన్తో చర్చలు సఫలమవుతున్నాయని అణు ఆయుధాలు తయారు చేయకుండా ఉండడానికి ఆదేశం అంగీకరించదని వైట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా సాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా, అమెరికా తన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుండి సుమారు 3,000 మంది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉన్న మెరైన్ బలగాలకు మద్ధతుగా ఈ ఎలైట్ సైనికులు రాబోయే శుక్రవారం నాటికి అక్కడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడానికి లేదా ఇరాన్ యొక్క వ్యూహాత్మక దీవులను నియంత్రించడానికి ఈ బలగాలను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఇరాన్ మూసివేసినట్లు ప్రకటించిన హోర్ముజ్ జలసంధిని తెరిపించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ చాలా శక్తివంతమైన ఆర్మీగా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ 18 గంటల్లో వీరు చేరుకోగలరు. వీరు పారాచూట్ ద్వారా శత్రువుల ప్రాంతాల్లోకి ప్రవేశించడంలో దిట్టలు. -
వన్ ఇండియా సర్వీస్
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ పౌరసేవల్లో మధ్యవర్తిత్వానికి ఇక తావు లేదు. వివిధ రకాల సర్వీసుల కోసం ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు మొదలు బదిలీ వరకు ఎక్కడా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోయే ‘వాహన్ పోర్టల్’రెండు రోజుల క్రితం అమల్లోకి వచ్చింది. వాహనాల కొనుగోలు సమయంలో ఆటోమొబైల్ డీలర్లు చేసే మాయాజాలానికి, ఫైనాన్స్ సంస్థల దోపిడీకి ‘వాహన్’అడ్డుకట్ట వేయనుంది. నకిలీబీమా సంస్థల అక్రమాలకు సైతం కళ్లెం పడనుంది. 2014లోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ను ప్రవేశపెట్టింది. 2016 నాటికి ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో వాహన్ పోర్టల్తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సేవలపైన ‘సారథి పోర్టల్’అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సారథి పోర్టల్ సేవలు కొనసాగుతుండగా, రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ‘వాహన్ పోర్టల్’ ను ప్రారంభించారు.ఈ రెండు రోజుల్లో ‘వాహన్’కు 1702 దరఖాస్తులు అందాయి. 318 టీఆర్లను (తాత్కాలిక రిజిస్ట్రేషన్) జారీ చేసి నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా నమోదయ్యే వ్యక్తిగత వాహనాలకే ఈ పోర్టల్ సేవలు లభిస్తున్నాయి. త్వరలో రవాణా వాహనాలకు సైతం పోర్టల్ను విస్తరించనున్నారు. ఈజీగా అంతర్రాష్ట్ర బదిలీలు సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం బదిలీ కావాలంటే సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) అందజేయాలి. ఆ పత్రాన్ని బదిలీ కానున్న రాష్ట్రంలోని అధికారి ధృవీకరించుకొనేందుకు చాలా రోజుల సమయం పట్టేది. దీంతో బదిలీల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకునేది. పైగా అధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు ఏజెంట్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనం వివరాలు వాహన్లో ఉంటాయి. మిగతా రాష్ట్రాల వాహనాల వివరాలు ఇప్పటికే ఈ పోర్టల్లో ఉన్నాయి. కాబట్టి రవాణా అధికారులు ఈ పోర్టల్లో లభించే డేటా ఆధారంగా క్షణాల్లో ఎన్ఓసీ అందజేసే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని తీసుకోవచ్చు. డీలర్లు మాయ చేయలేరు రవాణాశాఖకు చెల్లించే జీవితకాల పన్నును తగ్గించేందుకు, వాహన ధరలను పెంచేందుకు, లేదా తగ్గించేందుకు ఆటోమొబైల్ డీలర్లు ఇక ఏ మాత్రం మాయ చేయలేరు. వాహనం తయారీ సంస్థ నిర్ణయించిన ధర మేరకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ డీలర్ల సర్వర్ పోర్టల్ ‘హోమో లోగేషన్’ను వాహన్తో అనుసంధానం చేశారు. దీనివల్ల తయారీ సంస్థ నిర్ణయించిన ధర, వాహన ఇంజిన్ నంబర్, ఛాసీస్ నంబర్ తదితర వివరాల నమోదులో డీలర్లు ఎలాంటి తప్పులు చేసేందుకు అవకాశం ఉండదు. అదనపు చార్జీలను కూడా వాహనదారుడి నుంచి వసూలు చేసేందుకు వీల్లేదు. ఇన్వాయిస్లో ఉన్న ధర మాత్రమే వాహనదారుడు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ప్రస్తుతం షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండటం వల్ల వాహనదారుడు ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. ఫైనాన్స్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా వాహన్తో అనుసంధానమై ఉంటాయి. వాహనాలకు రుణాలు ఇవ్వాలనుకునే ప్రతి సంస్థ రవాణాశాఖ ఆమోదంతో అనుసంధానం కావాల్సిందే. ఇందుకోసం సదరు సంస్థల జీఎస్టీ గుర్తింపు, పాన్, ప్రభుత్వ గుర్తింపు, ఆర్బీఐ నుంచి పొందిన ఆమోద పత్రాలను తప్పనిసరిగా వాహన్లో అప్లోడ్ చేయాలి. దీంతో వాహనదారులకు అందజేసే రుణాలు, ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీ, ఆదాయపన్ను, తదితర అన్ని రకాల చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. నకిలీ బీమాకు తెర వాహన్ వల్ల నకిలీ బీమా సంస్థల మోసాలకు కూడా తెరపడుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బోర్డ్ (ఐఆర్బీ) అనుమతి పొందిన అన్ని బీమా సంస్థలు వాహన్తో అనుసంధానమై ఉంటాయి. దీంతో నకిలీ సంస్థల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వంద శాతం పారదర్శకం దేశవ్యాప్తంగా అన్ని రకాల పౌర సేవలను ఏకీకృతం చేసే లక్ష్యంతో కేంద్రం మిషన్ మేడ్ ప్రాజెక్ట్ (ఎంఎంపీ)లో భాగంగా ‘ఒకే భారత్, ఒకే లైసెన్స్, ఒకే వాహనం నంబర్’విధానాన్ని కొనసాగిస్తోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా దేశవ్యాప్తంగా 1,423 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ‘వాహన్ సారథి’పోర్టల్ సేవలను అందజేస్తున్నాం. వంద శాతం పారదర్శకత, జవాబుదారీతనం ఈ మిషన్ లక్ష్యం. – ఎస్.కాశిరెడ్డి, ఎన్ఐసీ, తెలంగాణ కోఆర్డినేటర్ -
వార్కు బ్రేక్.. బుల్కు జోష్!
ముంబై: ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో దలాల్ స్ట్రీట్లో రిలీఫ్ ర్యాలీ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడం... క్రూడ్ ధర దిగిరావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,372 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్లు బలపడి 22,912 వద్ద నిలిచింది. సూచీల 2% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు చేరింది. అదిరిపోయే ఆరంభం: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,793 పాయింట్లు ఎగసి 74,489 వద్ద, నిఫ్టీ 544 పాయింట్లు బలపడి 23 వేల స్థాయిపైన 23,057 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు లభించడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో పవర్గ్రిడ్ (–0.81%), సన్ఫార్మా (–0.20%), ఎస్బీఐ(–0.09%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లూ లాభడ్డాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో సర్వీసెస్ 3.46%, ఇండ్రస్టియల్స్ 3%, ప్రైవేటు బ్యాంక్స్ 2.63%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.46%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.39%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34%, ఆటో 2.30%, కమోడిటీస్ 2.19 శాతం పెరిగాయి. ‘ఇరాన్ ఇంధన సదుపాయాలపై అమెరికా దాడులు తాత్కాలికంగా నిలివేయడం పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత తగ్గే అవకాశానికి సంకేతంగా భావించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. అయినప్పట్టకీ.., హర్మూజ్ జలసంధి చుట్టూ జరిగే రాజకీయ, భౌగోళిక పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీస్తున్నాయి. దౌత్య సంబంధాలు ఏ మాత్రం బెడిసికొట్టినా మార్కెట్లపై మళ్లీ బేర్స్ పట్టుబిగించే వీలుంది. భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వేల్యూ బయింగ్ కారణంగా ర్యాలీ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిని ఇన్వెస్టర్లు తక్కువ ధరల్లో నాణ్యమైన షేర్లను కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలి’ అని లైవ్ లాంగ్ వెల్త్ రీసెర్చ్ విశ్లేషకుడు హరిప్రసాద్ తెలిపారు.ప్రపంచ మార్కెట్లు..నష్టాల్లోంచి లాభాల్లోకియుద్ధంపై చర్చలకు సంబంధించి అమెరికా నుంచి సంకేతాలు అందాయంటూ ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పష్టం చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోంచి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్కాంగ్ 3%, దక్షిణ కొరియా 2.67%, చైనా 1.75%, జపాన్ 1.41%, థాయిలాండ్ 1%, సింగపూర్ అరశాతం పెరిగాయి. ఇంట్రాడేలో 2% పతనమైన యూరప్ మార్కెట్లు నష్టాలను దాదాపు భర్తీ చేసుకున్నాయి. జర్మనీ డాక్స్ 0.25% స్వల్ప నష్టంతో ముగిసింది. ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.1% లాభపడగా, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.5% పెరిగింది. యూఎస్ ప్రధాన సూచీల్లో నాస్డాక్ 0.45% నష్టాల్లో ట్రేడవుతోంది. డోజోన్స్ 0.25%, ఎస్అండ్పీ–500 సూచీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.సరికొత్త కనిష్టానికి రూపాయి... 23 పైసలు బలహీనపడి 93.76 వద్దకు.. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, క్రూడాయిల్ ధరల రికవరీ, పశి్చమాసియా సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తదితర అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 93.66 వద్ద మొదలైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరికి ఇంట్రాడే కనిష్టం(93.76) వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో 93.65 – 94.25 శ్రేణిలో ట్రేడవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మార్చిలో రూపాయి 4.5 శాతం కరిగిపోయింది. జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ సక్సెస్ ఆగ్రోకెమికల్ కంపెనీ జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర రూ.320తో పోలిస్తే బీఎస్ఈలో 4% ప్రీమియంతో రూ.332 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఒకదశలో 14% ఎగిసి రూ.364 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.356 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,656.53 కోట్లుగా నమోదైంది. -
రాయల్ ‘బిర్లా’ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. లీగ్ విలువను చూపిస్తూ రెండు ఐపీఎల్ జట్లు కలిపి ఏకంగా సుమారు రూ.32 వేల కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. క్రికెట్తో పరిచయం లేని అమెరికా వ్యాపార సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా లీగ్తో జత కట్టేందుకు భారీ మొత్తాలతో ముందుకు వచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆరంభమైన 2008 నుంచి లీగ్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ జట్టును అమ్మకానికి ఉంచగా... అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్ టీమ్లో 100 శాతం వాటాను దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో ఆరిజోనాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమానితో పాటు రాబ్ వాల్టన్, హ్యాంప్ ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్నారు. టెక్నాలజీ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్, డేటా ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్, ఎడ్యుటెక్ సర్వీసెస్ రంగాల్లో ఇన్ట్రా ఎడ్జ్, ట్రూయో.ఏఐ, అకడమియన్ వంటి సంస్థలకు అధిపతిగా సోమాని ఉన్నారు. రాబ్ వాల్టన్ ప్రఖ్యాత వాల్మార్ట్ కంపెనీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, ఫోర్డ్ మోటార్ కంపెనీకి హ్యాంప్ ఫ్యామిలీ యజమానిగా ఉంది. సోమాని రాజస్తాన్ జట్టులో 2021 నుంచి చిన్న వాటాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దానిని సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్–2026 ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి జట్టుపై హక్కులు లభిస్తాయి. అసాధారణ పెరుగుదల... నిజానికి ఐపీఎల్లో ఆట, అభిమానులపరంగా చూస్తే రాజస్తాన్ రాయల్స్ జట్టుకే చివరి స్థానం దక్కుతుంది. 2008లో తొలిసారి టోర్నీ గెలవడం మినహా ఆ తర్వాత ఎప్పుడూ చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమ్ సాగుతూ వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్లలో టీమ్పై నిషేధం కూడా పడింది. 2008లో 67 మిలియన్ డాలర్లకు ఈ జట్టు అమ్ముడుపోయింది. నాటి రూపాయి విలువ ప్రకారం జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే! ఇతర ఏడు జట్లతో పోలిస్తే రాజస్తాన్ అన్నింటికంటే తక్కువ ధరకు అమ్ముడుపోయింది. రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు (ఇప్పటి వరకు) మనోజ్ బదాలే (ఎమర్జింగ్ మీడియా) 65%, రెడ్బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ 15%, లక్లాన్ మర్డోక్ 13%, ఇతరులు 7% ఎవరు కొన్నారు? కాల్ సోమాని: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ఇన్ట్రా ఎడ్జ్ కంపెనీ సీఈఓ రాబ్ వాల్టన్: వాల్మార్ట్ కుటుంబ వారసుడు, అమెరికాలోని నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో డెన్వర్ బ్రోంకోస్ జట్టు యజమాని. హ్యాంప్ ఫ్యామిలీ: ఫోర్డ్ కంపెనీ మరియు ఫైర్స్టోన్ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్... హ్యాంప్ ఫ్యామిలీ కోడలిగా మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఎన్ఎఫ్ఎల్లో డెట్రాయిట్ లయన్స్ జట్టుకు యజమాని. ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకం కూడా పూర్తయినట్లు సమాచారం. 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,753 కోట్లు) ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం జట్టును సొంతం చేసుకుంది. ఐపీఎల్ టీమ్తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోని ఆర్సీబీ జట్టు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఆర్సీబీని కొన్న కన్సార్టియంలో నలుగురు భాగస్వాములుగా ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్స్ (బీఎక్స్పీఈ) కలిసి భారీ మొత్తానికి బెంగళూరు జట్టును తమదిగా మార్చుకున్నాయి. 2008 తొలి ఐపీఎల్ సమయంలో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ గ్రూప్ 111.6 మిలియన్ డాలర్లకు (నాటి విలువ ప్రకారం సుమారు రూ.485 కోట్లు) సొంతం చేసుకుంది. బోల్ట్ వెంచర్స్ తరఫున ప్రముఖ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్స్, బీఎక్స్పీఈ తరఫున విరాల్ పటేల్ టీమ్ యాజమాన్యంలో భాగస్వాములు కానుండగా... ఆర్యమాన్ బిర్లా చైర్మన్గా, టైమ్స్ గ్రూప్ నుంచి సత్యన్ గాజ్వాని వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. -
ప్రీమియం బైక్లకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్రీమియం మోటర్సైకిల్స్కి ఆదరణ పెరుగుతోందని యమహా మోటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ తెలిపారు. ఆర్15, ఎంటీ–15, ఎఫ్జెడ్ మోటర్ సైకిల్స్, ఏరాక్స్ 155, 125 సీసీ, ఫాసినాలాంటి స్కూటర్లకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో ప్రీమియం వైపు మళ్లుతున్న ధోరణి కనిపిస్తోందని ఆయన చెప్పారు. తమ దక్షిణాది మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 13 శాతం వాటాతో కీలకంగా ఉంటున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు.రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 40 ప్రీమియం బ్లూ స్క్వేర్ షోరూమ్లతో పాటు మొత్తం 115 పైగా టచ్ పాయింట్లు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బ్లూ స్క్వేర్ డీలర్షిప్లను ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు ఇతరత్రా కొత్త మార్కెట్లలోను మరింతగా విస్తరించనున్నట్లు సింగ్ వివరించారు. పండుగల సందర్భంగా ఆర్15, ఫాసినో తదితర మోడల్స్పై ఆకర్షణనీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీచర్స్, పనితీరుకు యూత్ ప్రాధాన్యం.. హైదరాబాద్లాంటి అర్బన్ మార్కెట్లలో యువత ప్రధానంగా పనితీరు, స్టయిల్తో పాటు అధునాతన ఫీచర్స్ ఉన్న ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని సింగ్ చెప్పారు. కొనుగోళ్ల విషయంలో సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫాంలు, ఆన్లైన్ రివ్యూలు, ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్, రైడింగ్ కమ్యూనిటీల అభిప్రాయాల ప్రభావం ఉంటోందన్నారు. 2018లోనే ప్రీమియం వాహనాలకు డిమాండ్ని అంచనా వేసి వివిధ మోడల్స్ తెచ్చామన్నారు. దీనితో 2025 క్యాలెండర్ సంవత్సరంలో 11% మార్కెట్ వాటా దక్కించుకున్నామని సింగ్ చెప్పారు. సానుకూలంగా అవుట్లుక్.. ఆదాయాలు పెరుగుతుండటం, పట్టణ–సెమీ అర్బన్ మార్కెట్లలో వాహనాలకు డిమాండ్ మొదలైనవి టూ–వీలర్ల పరి శ్రమకు సానుకూలాంశాలమని సింగ్ చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ కనెక్టివిటీ, అధునాతన భద్రతా ఫీచర్లు, డిజైన్ వంటివి కొనుగోలు ప్రణాళికలను ప్రభావితం చేస్తాయన్నారు. కొత్త సాంకేతికతల వినియోగం, ఎగుమతి అవకాశాలు మొదలైన అంశాల దన్నుతో పరిశ్రమ సానుకూల వృద్ధిని సాధించవచ్చని తెలిపారు.ఎలక్ట్రిక్పై ఫోకస్.. పర్యావరణహితమైన, చౌకైన మొబిలిటీ సొల్యూషన్స్ వైపు పట్టణ ప్రాంతాల్లోని వారు మొగ్గు చూపుతున్నందున ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోందని సింగ్ తెలిపారు. దీన్ని తాము స్వల్పకాలిక మార్పు కాకుండా దీర్ఘకాలిక అవకాశంగా పరిగణిస్తున్నామని, ఈ విభాగాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన ఉత్పత్తులను ఆవిష్కరించే వ్యూహంలో భాగంగా ఈసీ–06, ఏరాక్స్–ఈ వాహనాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణమైన ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత వాహనాలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. -
తగ్గేదేలే.. తెగదెంపులే!
జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్రెడ్డితో చర్చించారు. వారు జీవన్రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం జీవన్రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్రెడ్డి ఓడిపోవడం.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్కుమార్ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్తో చేతులు కలపడంతో జీవన్రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్ పెద్దలు.. మెట్టు దిగని జీవన్రెడ్డి జీవన్రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జీవన్రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్కుమార్గౌడ్ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్గౌడ్ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. నేడు సమావేశం: జీవన్రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే జీవన్, జీవన్ అంటే కాంగ్రెస్లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘జెయింట్స్’ స్థాయి పెరిగేనా!
ఐపీఎల్లో ఆలస్యంగా అడుగు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరి ఆకట్టుకుంది. అయితే గత రెండు సీజన్లలో జట్టు ఆటతీరు పేలవంగా ఉంది. వరుసగా రెండేళ్లు కూడా టీమ్ ఏడో స్థానానికే పరిమితమైంది. 2025లో రికార్డు మొత్తంతో కొత్త కెప్టెన్గా వచ్చిన రిషభ్ పంత్ చివరి మ్యాచ్ మినహా టోర్నీ అంతా విఫలం కాగా... ఇతర ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉండటం జట్టును దెబ్బ తీసింది. ఐపీఎల్లో ఐదో సీజన్ ఆడబోతున్న లక్నో ఈసారైనా తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుందో లేదో వేచి చూడాలి. – సాక్షి క్రీడా విభాగం తొలి ఎనిమిది మ్యాచ్లలో ఐదు విజయాలు, తర్వాతి ఆరు మ్యాచ్లలో ఒకే ఒక్క గెలుపు! గత ఏడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి. టోర్నీని మెరుగ్గా ఆరంభించినా ఆ తర్వాత అంతా గతి తప్పింది. ఈసారి అది పునరావృతం కారాదని జట్టు పట్టుదలగా ఉంది. మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, అవసరం అనుకుంటే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ కనిపించే టీమ్ యాజమాని సంజీవ్ గోయెంకా అంచనాలు, ఆశలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం టీమ్ విఫలమవుతోంది. తొలి సీజన్ తర్వాత టీమ్ కిట్ను పూర్తిగా మార్చిన మేనేజ్మెంట్ మూడు సీజన్లు దానిని కొనసాగించింది. ఏదైనా నమ్మకాల వల్ల కావచ్చు 2026 సీజన్ కోసం కూడా చాలా మార్పులు చేసింది. టీమ్ జెర్సీని పూర్తిగా మార్చేయడంతో పాటు లోగోను కూడా కొత్తగా డిజైన్ చేయించింది. మైదానంలో ఈ ‘సెంటిమెంట్’లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది ఆసక్తికరం. పంత్పై ఆశలు... టాప్–3 విదేశీ ఆటగాళ్లతో లక్నో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. మిచెల్ మార్‡్షతో పాటు మార్క్రమ్ ఓపెనింగ్ చేస్తాడు. వీరిద్దరు మంచి ఆరంభాన్ని అందిస్తే పూరన్ అదే ధాటిని కొనసాగించగలడు. పంత్ మూడో స్థానంలో ఆడటంపై చర్చ జరిగినా... ఈ ముగ్గురు బ్యాటర్లను చూస్తే పంత్కు నాలుగో స్థానమే ఖాయంగా కనిపిస్తోంది. పేసర్లతో ఫుల్... షమీ, నోర్జే, మయాంక్, అవేశ్, మొహసిన్, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారి, ఆకాశ్ సింగ్, ప్రిన్స్, అర్షిన్, మార్‡్ష... రెగ్యులర్ బౌలర్లు, ఆల్రౌండర్లు కలిపి ఏకంగా 11 పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయాలు లక్నోకు అందుబాటులో ఉన్నాయి. స్పిన్ బలహీనం... ఐపీఎల్లో చాలా మ్యాచ్లలో స్పిన్నర్లు కీలక ప్రభావం చూపించడం ఖాయం. సూపర్ జెయింట్స్ హోమ్ గ్రౌండ్ లక్నో కూడా సగటు భారత పిచ్ల తరహాలో పేస్కంటే కూడా స్పిన్కే కొంత అనుకూలిస్తుంది. కానీ ఈ విషయంలో లక్నో బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన స్పిన్నర్గా లంక ఆటగాడు హసరంగను జట్టు ఎంచుకుంది. అతనిపైనే ప్రధానంగా భారం ఉంది. లక్నో జట్టు వివరాలు: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఇన్గ్లిస్, బ్రీట్కే, హసరంగ, నోర్జే, హిమ్మత్, ముకుల్, అక్షత్, సమద్, షహబాజ్, అర్షిన్, బదోని, షమీ, అవేశ్ , సిద్ధార్్థ, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ సింగ్, ప్రిన్స్, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారి, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్. -
సారీ... ఈ సీజన్ ఆడలేను: డకెట్
లండన్: ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఈ సీజన్ ఐపీఎల్ బరిలోకి దిగడం లేదని చావుకబురు చల్లగా చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాల్సిన అతను చాలా ఆలస్యంగా తన గైర్హాజరు నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ తప్పలేదు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెబుతున్నా. వేలంలో నాపై నమ్మకముంచి ఐపీఎల్ ఆడే అవకాశమిచి్చన ఫ్రాంచైజీ తరఫున ఆడలేకపోవడం విచారకరం’ అని డకెట్ పోస్ట్ చేశాడు. దీంతో ఐపీఎల్ నియమావళి ప్రకారం అతను రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశముంది. లీగ్ నిబంధన ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్నాక సహేతుక కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్నెస్ సమస్యలు, పితృత్వపు సెలవులకు మినహాయింపు ఉంటుంది. డకెట్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎక్కువసేపు గడిపేందుకు భారత్కు రావడం లేదని చెప్పాడు. దీంతో అతనికి నిషేధం తప్పదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో... ఈ సీజన్కు ముందు ఫ్రాంచైజీలన్నీ గాయాల బెడదను ఎదుర్కొంటున్నాయి. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో సీజన్ మొత్తానికి దూరమయ్యారు. తాజాగా వారి స్థానాలను ఆయా ఫ్రాంచైజీలు భర్తీ చేసుకున్నాయి. » కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేసర్ ఆకాశ్దీప్ స్థానంలో రూ. 30 లక్షలతో సౌరభ్ దూబేను తీసుకుంది. » సన్రైజర్స్ హైదరాబాద్ జాక్ ఎడ్వర్డ్స్ (ఆ్రస్టేలియా) స్థానాన్ని డేవిడ్ పైన్ (ఇంగ్లండ్; రూ.1.5 కోట్లు)తో భర్తీ చేసుకుంది. » చెన్నై సూపర్ కింగ్స్ గాయపడిన నాథన్ ఎలీస్ స్థానంలో ఆసీస్కే చెందిన సహచరుడు స్పెన్సర్ జాన్సన్ (రూ. 1.5 కోట్లు)ను తీసుకుంది. -
గర్జించేందుకు గిల్ రెడీ
అహ్మదాబాద్: మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... ప్రశాంతంగా ఉండటం వల్ల సునిశిత దృష్టి అలవడుతుందని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. ఇటీవల టి20 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు రెండో టైటిల్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తొలి సీజన్లోనే చాంపియన్ అవతరించింది. ఆ తర్వాత ఏడాది రన్నరప్గా నిలిచిన టైటాన్స్... గత సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. శుక్రవారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ ఫ్రాంచైజీ ‘శుభారంభం–2026’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం గిల్ మాట్లాడుతూ... ‘నేను సాధారణంగా ప్రశాంతంగానే ఉంటాను. అదే నాకు జట్టుపై నమ్మకం, విశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనూ కాకుండా ఉండటం ద్వారా విశాల దృక్పథం అలవుడుతుంది. దీంతో ఆ క్షణాలను విభిన్నంగా చూడగల శక్తి వస్తుంది. అప్పుడు సమస్యల పరిష్కారం సులువు అవుతుంది’ అని వెల్లడించాడు.ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ... ‘గతేడాది మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం ద్వారా ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాం. దీంతో జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరగడంతో పాటు పరస్పర నమ్మకం కలుగుతుంది. వేలంలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశాం. జట్టు కూర్పుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాం. ఆ ఫలితాలు మరి కొన్ని రోజుల్లో మీ ముందు ఉంటాయి’ అని అన్నాడు. -
తప్పుడు చార్జిషీటుతో అక్రమ కేసు
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేటు మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చార్జిషీటు పేరిట మళ్లీ తెరపైకి ఫార్ములా–ఈ తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసిన తొలి సంతకానికి సంబంధించిన ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. గతంలో తాను చెప్పినట్టు ఫార్ములా–ఈ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని చెప్పారు. శాసనసభ లాబీల్లోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో మంగళవారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఫార్ములా–ఈ అంశాన్ని గోరంతను కొండంతగా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడి నుంచి పంపిన నిధులు రూ.45 కోట్లు అయితే రూ.600 కోట్లకు పైగా ఉన్నాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ నుంచి పంపిన రూ.45 కోట్లు ఫార్ములా–ఈ బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయి. ఆ నిధులను ప్రభుత్వం ఎందుకు వెనక్కి రప్పించడం లేదు. ఈ కేసులో అనుచిత లబ్ధి జరిగిందని చెబుతున్న వారి పేరు చార్జిషీటులో లేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘అందాల పోటీల వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం లేకపోగా తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం అంతర్జాతీయంగా అప్రతిష్టపాలైంది. ఇంత దారుణం జరిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసు నమోదు కాలేదు. సీఎం సరదా కోసం రూ.100 కోట్లతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేసినా కేసు నమోదు కాలేదు. ఫార్ములా–ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడదు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ను వదిలిపెట్టేది లేదు’అని కేటీఆర్ చెప్పారు. మూసీపై ప్రణాళిక లేకుండానే.. ‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూపాయి లేకున్నా ఏడీబీ అప్పు ఇస్తుందనే ఉద్దేశంతో డీపీఆర్ లేకుండానే మూసీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతోంది. మూసీ ప్రాజెక్టుపై ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా మూసీ బాధితులతో చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మేధా పాట్కర్ వంటి మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు’అని కేటీఆర్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ ‘2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే స్వాగతిస్తాం. జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతమున్న నిష్పత్తిలో పునర్విభజన జరగాలి. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి 24శాతం ప్రాతినిథ్యం ఉంది. అదే నిష్పత్తిలో దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్రం చూడాలి. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. టీడీఆర్ స్కామ్ ‘‘ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కచ్చితంగా టీడీఆర్లు కొనుగోలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ కుంభకోణంపై విచారణ జరిపిస్తాం. నిర్వాసితుల నుంచి అతి తక్కువ ధరకు టీడీఆర్ కొనుగోలు చేసి వాటిని అడ్డగోలు ధరలకు తిరిగి అమ్ముకుంటున్న రేవంత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పాత్రను బయటపెడతాం. రేవంత్ పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్’గా మారిపోయాయి. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ కుటుంబం టీడీఆర్లను ఏటీఎంగా మార్చుకున్న తీరును బయటపెడతాం’అని కేటీఆర్ చెప్పారు. -
‘హంపి తప్పు చేసింది’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్ చెస్ సమాఖ్య (సీసీఎఫ్) అధ్యక్షుడు క్రిటాన్ టొర్నారిటిస్ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్ చెస్ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్లలో మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్ అన్నాడు. అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్కు దూరం కాగా... భారత్ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్ముఖ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. -
బరువెక్కుతున్న బాల్యం బాల ‘భార’తం
ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన చిన్నారులు మోయలేని బరువు మోస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల్లో ఊబకాయం మహమ్మారిలా విస్తరిస్తోంది. అరికట్టడానికి రూపొందించుకున్న ప్రణాళికలు సైతం నీరుగారిపోతున్నాయని తాజా నివేదికలుహెచ్చరిస్తున్నాయి. ఈ ‘బరువెక్కిన’ దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ముంచుకొస్తున్న ముప్పునకు ఒక హెచ్చరిక.⇒ వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 నాటికి చిన్నపిల్లల్లో ఊబకాయాన్ని అరికట్టాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఈ లక్ష్యం విఫలయత్నంగా మిగిలిపోవడం నిరాశ కలిగించే అంశం.⇒ ఇదే లక్ష్య సాధన కోసం గడువును ఇప్పుడు 2030 వరకు పొడిగించినప్పటికీ, చాలా దేశాలు ఇందుకు సిద్ధంగా లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ ధోరణిని నియంత్రించడంలో ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం.⇒ కోట్లాది మంది భారతీయ పిల్లలు ఇప్పటికే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. 2025లో భారతదేశంలో 5 నుంచి 9 ఏళ్ల వయస్సు గల దాదాపు 1.49 కోట్ల (14.921 మిలియన్లు) మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉన్నారు.⇒ 10 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారిలో అధిక బరువు, ఊబకాయుల సంఖ్య ఇంకా ఎక్కువగా, అంటే 2.64 కోట్లు (26.402 మిలియన్లు) గా ఉంది.⇒ మొత్తంమీద భారతదేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బిఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్– ఎత్తుకుతగ్గ బరువును కలిగి ఉండటాన్ని కొలిచే ప్రామాణిక పద్ధతి)తో జీవిస్తున్నారు. వీరిలో 1.4 కోట్ల మంది ఊబకాయం గలవారిగా గుర్తించారు.⇒ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 5 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఐదుగురు పిల్లలలో ఒకరు (20.7 శాతం) అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బందిపడుతున్నారు. 2010లో ఇది 14.6 శాతంగా ఉండేది, ఇప్పుడు గణనీయంగా పెరిగింది.⇒ ఇదే ధోరణి ముందురోజుల్లోనూ కొనసాగితే, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50.7 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది.⇒ కేవలం 10 దేశాల్లోనే 20 కోట్లకు పైగా పాఠశాల వయస్సు పిల్లలు అధిక బి.ఎం.ఐ తో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అధిక బి.ఎం.ఐ. ఉన్న పిల్లల సంఖ్యలో చైనా, భారత్, అమెరికా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.⇒ చైనాలో 6.2 కోట్ల మంది పిల్లలు అధిక బి.ఎం.ఐ. తో ఉండగా, అందులో 3.3 కోట్ల మంది ఊబకాయంతో ఉన్నారు.⇒ అమెరికాలో 2.7 కోట్ల మంది పిల్లలు అధిక బి.ఎం.ఐ తో ఉండగా, అందులో 1.3 కోట్ల మంది ఊబకాయంతో ఉన్నారు.⇒ ఈ గణాంకాల ప్రకారం, 519 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలలో అధిక బి.ఎం.ఐ ఉన్నవారి సంఖ్యలో భారతదేశం ఇప్పుడు అమెరికాను కూడా దాటేసింది. ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలే ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్బీనగర్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ రెండంతస్తుల వంతెన నిర్మాణం కానుంది. దిగువన సాధారణ రోడ్డు... ఆపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. అందులో తొలి అంతస్తులో ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితం కానుండగా రెండో అంతస్తులో మెట్రో కారిడార్ నిర్మాణం కానుంది. ఎల్బీనగర్లోని పనామా గోడౌన్ నుంచి హయత్నగర్ వరకు దాదాపు 5.5 కి.మీ. నిడివితో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రూపొందనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వచ్చే నెలలో ఆ శాఖ వార్షిక ప్రణాళిక ఖరారు కోసం జరగనున్న సమావేశంలో దీనికి తుది అనుమతి విషయంలో స్పష్టత రానుంది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొంత నియోజకవర్గమైన నాగ్పూర్లో ఇప్పటికే ఇదే డిజైన్లో 5.62 కి.మీ. మేర ఫ్లైఓవర్ రూపొందింది. ఆ వంతెనను చూసే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రతిపాదించింది. ఇటీవల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపే అవకాశం ఉందని ఆయన మంగళవారం శాసనసభలో వెల్లడించారు. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సందర్భంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత ఇచ్చారు. పెరిగిన కాలనీలు, ట్రాఫిక్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో.. ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్డును ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్ నుంచి నగర శివారు వరకు 8 వరుసలకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా భారీగా కాలనీలు వెలిశాయి. అలాగే హయత్నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఇటీవలి కాలంలో కాలనీలు వేగంగా పెరిగాయి. దాదాపు 15 లక్షల మంది ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ స్థానిక వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. కాలనీల్లోకి వెళ్లాలంటే రెండున్నర కి.మీ. ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తోంది. ఇందుకోసం ఈ పరిధిలో 8 అండర్పాస్లను నిర్మించేందుకు డిజైన్ చేశారు. ఇందులో నాలుగు పూర్తవగా ఒకటి నిర్మాణంలో ఉంది. ఈ అండర్పాస్ డిజైన్ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న సూచన వచ్చింది. ఇదే సమయంలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ తర్వాతి వరకు 7.1 కి.మీ. మేర మెట్రో రైలు కారిడార్ ఖరారైంది. ఆరు స్టేషన్లతో ఈ కారిడార్ను నిర్మించనున్నారు. అది కూడా ఇదే మార్గంలో రూపొందుతుంది. దీంతో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మిస్తే మెట్రో ప్రాజెక్టుకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో రెండూ ఒకే నిర్మాణంలో ఉండేలా తాజాగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు రూపకల్పన చేశారు. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ. 200 కోట్లు ఈ ప్రాజెక్టుకు రూ. 940.75 కోట్లు ఖర్చవుతుందని ఎల్ఎన్ మాల్వియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక అంచనాతో నివేదికను సమర్పించింది. దీంతో ఈ వ్యయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి రూ. 200 కోట్లను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మిగతా మొత్తాన్ని కేంద్రం భరించాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఆ శాఖ వార్షిక ప్రణాళికలో దీన్ని చేరి్పంచేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. అనుమతి రాగానే మరో ఆరు నెలల్లో దీనికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెండోది... ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో ఆ డిజైన్తో నిర్మితమయ్యే రెండో కట్టడం కానుంది. ఇప్పటికే పుణే–హెదరాబాద్ జాతీయ రహదారిపై మదీనాగూడ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 1.20 కి.మీ. పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీనికి రాష్ట్ర పభుత్వం రూ. 53.55 కోట్ల వాటా చెల్లించేందుకు కూడా అంగీకారం తెలిపింది. -
ఆశల పల్లకీలో!
(శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే.. 60 స్థానాలు పెరిగితే 179 కావాలి.. కానీ ప్రతి లోక్సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. పునర్విభజన ఇలా..! రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మహిళలకు ఎలా..? మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని.. ఆదిలాబాద్లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్ (నిర్మల్) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. నిజామాబాద్లో 3 నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్ సౌత్ లేదా నార్త్, బోధన్ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కరీంనగర్లో 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, సుల్తాన్బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. మెదక్లో 7 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్పూర్, సదాశివపేట, మెదక్ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. నల్లగొండలో 6 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఖమ్మంలో 2 ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. వరంగల్లో 9 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. మహబూబ్నగర్లో 6 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్నగర్ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్ మరో రెండు మండలాలతో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ మొత్తం 51 హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. -
సెల్ఫోన్ పిల్లలు బొద్దుగా.. బద్ధకంగా
‘ఫోన్ చూపిస్తూ అన్నం తినిపించడం’ ఇది చంటి పిల్లల నుంచి స్కూలు పిల్లల వరకూ తల్లులు ఎంచుకున్న సులభ మార్గం. వాళ్లు ఫోన్ చూస్తుంటే నచ్చింది, నచ్చంది కడుపు నిండా పెట్టేయొచ్చనుకుంటారు. ఈ అలవాటు, ఆ తర్వాత ఫోను అలవాటు వారిని ‘భార బాలలు’గా మార్చేస్తోంది.గుజరాత్లో 2025లో సాగించిన అధ్యయనం ప్రకారం రోజుకు 4 గంటలు స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లలు అధిక బరువుతో, ఊబకాయంతో బాధ పడుతున్నారు. వివరాలు...ముంబైలోని హిరానందాని హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో పని చేసే డాక్టర్ విమల్ పహుజా దగ్గరికి 12 సంవత్సరాల పిల్లవాణ్ణి తీసుకువచ్చారు. సమస్య ఏమిటంటే... అతను 6 నెలల్లో 8 కిలోల బరువు పెరిగాడు. గంటలు గంటలు సెల్ఫోన్ చూస్తూ గేమింగ్ చేస్తూ జంక్ ఫుడ్, , బర్గర్లు, ఫ్రైడ్ స్నాక్స్ తిని కోలాలు తాగడం వల్ల ఇది జరిగింది. డాక్టర్ పహుజా పరీక్షలు చేయిస్తే ఆ వయసుకే ఆ అబ్బాయికి నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, విటమిన్ డి కొరత, నిద్రలేమి, దీర్ఘ అలసట, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం గమనించారు. గుజరాత్ రాష్ట్రంలో 2025లో సాగిన ఒక అధ్యయనం ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ కార్డియో వాస్క్యులర్ జర్నల్’లో ప్రచురితమైన దరిమిలా వివిధ నగరాల్లోని వైద్య నిపుణులు ఈ విషయమై పై విధంగా తమ అనుభవాలతో తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.పదికి ఎనిమిదిగుజరాత్లో సాగిన ఈ అధ్యయనంలో 14 ఏళ్ల లోపు పిల్లల్లో పదికి ఎనిమిది మంది అన్నం తినేటప్పుడు ఫోన్ గాని, ట్యాబ్గానీ కావాలంటున్నారని తేలింది. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నా, అన్నం తిననని మారాం చేస్తున్నా ఫోన్ చేతిలో పెట్టి గబగబా వాళ్ల నోటి నిండా అన్నం కుక్కడం అలవాటు చేసిన తల్లులు పిల్లలు ఎంత ప్రమాదకరమైన ఫోన్ అడిక్షన్కు మళ్లుతున్నారో తెలుసుకోలేకపోయారు. ఫోన్ చూస్తూ తినడం అలవాటయ్యాక ఇక మామూలుగా అన్నం తినే పరిస్థితే ఉండటం లేదు. దీనివల్ల తాము తింటున్నది ఏమిటో, దాని రుచి ఏమిటో, రంగు ఏమిటో తెలుసుకోకనే పిల్లలు కడుపు నింపుకుంటున్నారు. ‘పచ్చి బఠాణీలు ఇష్టపడే పిల్లాడు వాటిని అడగక క్యారెట్ కూరైనా సరే గొంతులో పెట్టుకుంటాడు’ అన్నారు ఇలాంటి కేసులే గమనిస్తున్న ముంబైలోని ఎస్ఎల్ రహేజా హాస్పిటల్కు చెందిన డాక్టర్ అస్మితా మహాజన్.బుర్రలేని తిండిఫోన్ చూస్తూ తినడం బుర్ర లేకుండా తినడం. దీనిని ‘మైండ్లెస్ ఈటింగ్’ అంటారు. ముంబైకి చెందిన న్యూట్రిషనిస్ట్ సంగీత అయ్యర్ ఈ విషయాన్ని ఇలా వివరించారు. ‘మీరు సినిమా హాల్లో పెద్ద పాప్కార్న్ బకెట్ను తీసుకుంటూ ఇంత ఎక్కడ తినగలం అనుకుంటారు. కాని సినిమా చూస్తూ మొత్తం బకెట్ను ఖాళీ చేసేస్తారు. మీ బుర్ర సినిమాలో లీనమవడం వల్ల అది తిండికి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంక చాలు అనే సిగ్నల్ పంపదు. అందువల్ల మీరు తింటూనే ఉంటారు. పిల్లలు కూడా అలాగే సెల్ఫోన్ చూస్తూ ఎక్కువ తింటారు’ అన్నారామె. అదొక ప్రమాదమైతే సెల్ఫోన్ చూడటం వల్ల బ్రేక్ఫాస్ట్గాని లంచ్ గానీ డిన్నర్ గానీ స్కిప్ చేయడం, పోషక పదార్థాలు తీసుకోకపోవడం, ఆటలకు దూరంగా ఉండటం ఇవన్నీ పెద్ద సమస్యలుగా తర్వాతి రోజుల్లో మారతాయి. ఇటువంటి చిన్నారుల్లో డిప్రెషన్, గుండెజబ్బులు త్వరగా వచ్చే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు. వీరిలో కొందరు రుచిని గుర్తించే సామర్థ్యాన్ని సైతం కోల్పోతారని అంటున్నారు.ఇలా చేస్తే మేలు..⇒ పిల్లలు సెల్ఫోన్ కు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.⇒ పిల్లల అభిరుచులు గుర్తించాలి. వాటిని ్రపోత్సహించాలి. చిత్రలేఖనం, సంగీతం, నాట్యం వంటివాటిపై ఆసక్తి పెంచేలా ఇంట్లో వాతావరణాన్ని సృష్టించాలి.⇒ పిల్లల్ని సాయంత్రాలు వాకింగ్కు తీసుకెళ్లాలి. ఆ సమయంలో మీ ఫోన్ తోపాటు వారి ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టాలి. ⇒ అన్నం తినేటప్పుడు పిల్లలతో కబుర్లు చె΄్పాలి. స్కూల్లో జరిగిన సంగతులు, ఫ్రెండ్స్ విషయాలు మాట్లాడుతూ వారి దృష్టిని ఫోన్ నుంచి మళ్లించాలి.⇒ పిల్లలంతా ఒకచోట కలిసి ఆడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఆ సమయంలో వారి వద్ద ఫోన్లు లేకుండా చూసుకోవాలి. ⇒ రాత్రి 8 తర్వాత ఫోన్ పక్కన పెట్టించాలి. వారితోపాటు మీరు కూడా ఫోన్ చూడటం మానేయాలి. -
ఈ రాశి వారికి శుభవార్తలు.. ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి సా.5.46 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మృగశిర రా.8.35 వరకు, తదుపరి ఆరుద్ర,వర్జ్యం: తె.4.27 నుండి 5.57 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.30 వరకు, అమృత ఘడియలు: ప.12.23 నుండి 1.52 వరకు.సూర్యోదయం : 6.04సూర్యాస్తమయం : 6.07రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.వృషభం.... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు.ఉద్యోగస్తుల యత్నాలు విఫలం. ఆకస్మిక ప్రయాణాలు.మిథునం.... పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల స్నేహితులు కలుస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.కర్కాటకం.. కుటుంబసభ్యల నుంచి వ్యతిరేకత. రాబడి అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.సింహం.... వ్యాపారాలలో ముందంజ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనాలు కొంటారు. దేవాలయదర్శనాలు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు.కన్య..... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విజయాలు.తుల... కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. వ్యాపారులు నిరుత్సాహపడతారు. ఉద్యోగాలలో మార్పులు.వృశ్చికం... లేనిపోని విమర్శలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దేవాలయ దర్శనాలు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.ధనుస్సు.... సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు విశేష గుర్తింపు.మకరం.... నూతన పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు దేవాలయ దర్శనాలు. ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో ఎదురుండదు.కుంభం.. కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. శారీరక రుగ్మతలు.మీనం... ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు చిక్కులు. కార్యక్రమాలలో అవాతంరాలు. దైవదర్శనాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు. -
ఇంకానా... ఇకపై చెల్లదు!
లింగ వివక్ష అనేది ప్రత్యక్షంగా, కనిపించే రూపంలోనే కాదు... చాపకింద నీరులా కూడా తిష్టవేసి ఉంటుంది. అయితే కాలమే ఆ వివక్షను తొలగిస్తూ వెళుతుంది అనే ఆశాభావానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు బలాన్ని ఇస్తోంది. భారత సాయుధ దళాలలో మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్కు అర్హులు అని చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు...‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనుకునే సందర్భం ఇది!సాయుధ దళాల్లో లింగసమానత్వాన్ని బలోపేతం చేసే చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. మహిళా షార్ట్ సర్వీస్ కమీషన్ (ఎస్ఎస్సీ) అధికారులకు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్కు అర్హత ఉందని స్పష్టం చేసింది. వ్యవస్థాగత పక్షపాతాన్ని ప్రస్తావించింది. మహిళా ఎస్ఎస్సీ అధికారులకు శాశ్వత కమిషన్ను నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ ఉన్నత న్యాయస్థానం ఈ చారిత్రాత్మక సంచలన తీర్పును ఇచ్చింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. శాశ్వత కమిషన్కు సంవత్సరానికి 250 మంది మహిళా అధికారులకే అవకాశం ఇవ్వాలనే నిబం«ధన సరికాదు అని చెప్పింది. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకొని ముందుకు సాగేలా, మహిళలకు సమాన అవకాశాలు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.శాశ్వత కమిషన్ ప్రకారం...షార్ట్ సర్వీస్ కమిషన్లో పది నుంచి పద్నాలుగేళ్లు పనిచేస్తారు. పై స్థాయికి వెళ్లే అవకాశాలు తక్కువ. ఉద్యోగ విరమణ తరువాత పూర్తిగా పెన్షన్ రాదు. ఇక శాశ్వత కమిషన్ విషయానికి వస్తే పదవీ విరమణ చేసే వరకు సేవ చేసే పూర్తి కెరీర్ను అందిస్తుంది. ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేయవచ్చు. సీనియర్ నాయకత్వ స్థానాలలో పలు హోదాలలో చేరవచ్చు. పింఛన్తో సహా అన్ని పదవీ విరమణ ప్రయోజనాలకు అర్హులు అవుతారు.లోపాలు ఉన్నాయి...మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించడం వివక్షపూరితమని పేర్కొంటూ సైన్యం, నావికాదళం రెండింటిలోనూ మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానం సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కూడా కోర్టు ఎత్తి చూపింది. మహిళా అధికారులు శాశ్వత కమిషన్కు ఎప్పటికీ అర్హులు కారంటూ ముందుగా ఏర్పర్చుకున్న అంచనా ఆధారంగా సరైన ఆలోచన లేకుండా, అజాగ్రత్తగా వార్షిక గోప్య నివేదికలను(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్–ఎసీఆర్) రూపొందించారని కోర్టు పేర్కొంది. మహిళల శాశ్వత కమిషన్కు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో జాప్యం జరిగిందని, దీని ప్రభావం మహిళా అధికారులపై పడింది అని చెప్పింది.అలా చేయలేదు...‘తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే కోర్సులు చేయడానికి మహిళా అధికారులను పంపలేదు, అర్హతా ప్రమాణాల ఆధారంగా నియామకాలు (క్రైటీరియా అపాయింట్మెంట్స్) చేయలేదు. వృత్తిలో వారి పురోగతిపై ఇది ప్రభావం చూపింది’ అని లింగవివక్షతను ఎత్తిచూపింది. శాశ్వత కమిషన్కు అర్హులైన మహిళా అధికారులు 20 సంవత్సరాల అర్హత సర్వీస్ను పూర్తి చేసినట్లుగా పరిగణించబడతారని, వారు పింఛన్తోపాటు తత్సంబంధితమైన అన్ని ప్రయోజనాలకు అర్హులు అవుతారని కోర్టు తెలియజేసింది.ఇక ముందు అలా జరగకూడదునిర్మాణాత్మక పక్షపాతాలను తొలగించడానికి, మహిళా అధికారులు నష్టపోకుండా చూసేందుకు సాయుధ దళాలన్నింటిలోనూ అధికారుల పనితీరును అంచనా వేసే విధానాలపై సమగ్ర సమీక్ష జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. మహిళా అభ్యర్థులను ఎన్డిఎ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించాలని 2021లో సుప్రీం కోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. విధాన నిర్ణయం ‘లింగ వివక్షత’పై ఆధారపడి ఉందని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తూ, సైన్యం వైఖరిని ఖండించింది. అత్యున్నత స్థాయి సైనికాధికారులను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రతిష్ఠాత్మక ఎన్డీఏ 2022లో తొలి విడతగా 10 మంది మహిళా క్యాడెట్లకు స్వాగతం పలికింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. -
వినోదాల సందడి
మార్చి నెల ముగింపుకు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనే చర్చ ఆడియన్స్లో మొదలైంది. వచ్చే నెలలో డిఫరెంట్ జానర్స్లోని సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ జాబితాలో ‘పెద్ది’ వంటి పెద్ద చిత్రం నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి... ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు ఈ విధంగా...పెద్ది పోరాటం వచ్చే నెల చివర్లో థియేటర్స్లోకి రానున్నాడు పెద్ది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ అండ్ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్కు చెందిన టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అయితే ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. తొలుత ‘పెద్ది’ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయా లనుకున్నారు మేకర్స్. కానీ ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ చాలా స్పీడ్గా షూటింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి ఇలా జరగకూడదని పక్కా ప్లాన్తో షూటింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్లో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేస్తారని, ఇదే సాంగ్లో ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ సైతం కాలు కదుపుతారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.అలాగే ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ నుంచి సర్ప్రైజింగ్గా ఓ యాక్షన్ టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. ‘పెద్ది’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో రామ్చరణ్ క్రికెటర్గానే కనిపించారు. కానీ రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా రాబోతున్న యాక్షన్ టీజర్లో చరణ్ కుస్తీ పడుతున్న సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇంకా ‘పెద్ది’ చిత్రంలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.అంతేకాదు... ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఊరిలో నెలకొన్న ఓ సమస్య కోసం హీరో పాత్ర పోరాటం చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎమోషనల్ బైకర్ ఏప్రిల్ 3న థియేటర్స్లోకి దూసుకు రానున్నాడు బైకర్. శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘వాడికి రేసింగ్ అంటే ప్రాణం..’, ‘నువ్వు అందరికంటే ముందు రాలేదు... నీ కంటే అందరూ వెనకాల వచ్చారు.రెండింటికి చాలా తేడా ఉంది’, ‘విక్కీతో కొంచెం మాములుగా ఉండొచ్చు కదా... ఎందుకంత కంట్రోల్ చేస్తావ్..., ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్... నథింగ్ ఈజ్ బిగ్గర్ థేన్ స్పోర్ట్’, ‘నీలాంటి పిరికివాడితో పని చేయడం నాకు తెలియదు రా..’, ‘వాళ్ల నాన్నకు విక్కీ కొడుకు కాదు... రేసర్ అంతే..’, ‘కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రిని ఒక్కర్ని చూపించు’ వంటి డైలాగ్స్ ‘బైకర్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో వికాస్ నారాయణన్ పాత్రలో శర్వానంద్, బుల్లెట్ సునిల్ పాత్రలో రాజశేఖర్ నటించారు. ఇందులో రాజశేఖర్, శర్వానంద్ తండ్రీకొడుకులుగా చేశారు.‘బైకర్’ సినిమాలో రైసింగ్ అంశాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ 1990, 2000... ఇలా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుంది. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ‘బైకర్’ సినిమాను తొలుత గత ఏడాది డిసెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్లో రాజీ పడకూడదని, యూనిట్ ఈ సినిమా రిలీజ్ను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శర్వానంద్ నుంచి రానున్న ‘బైకర్’ చిత్రంపై ఆడియన్స్లో అంచనాలు ఉన్నాయి.మాజీ ప్రేమికుల ప్రయాణం బ్రేకప్ తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమికులు తిరిగి ప్రేమలో పడతారా? ఈ ప్రయాణంలో వారు వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు? అన్న అంశాల నేపథ్యంలో ‘డెకాయిట్’ సినిమా తెరకెక్కిందని తెలిసింది. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర చేశారు. దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు.అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ... ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో వచ్చే ఓ రాబరీ ఎపిసోడ్, అలాగే ‘కన్నె పిట్టరో..’ పాట హైలైట్స్గా ఉంటాయని సమాచారం. షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా వ్యవహరించారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తొలుత ‘డెకాయిట్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి రణ్వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజ్కు షెడ్యూల్ కావడంతో ‘డెకాయిట్’ను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. ఈ నెల 28న ఈ సినిమా నుంచి ‘చిచ్చుబడ్డి’ అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2022లో అడివి శేష్ హీరోగా ‘హిట్: ది సెకండ్ కేసు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం తర్వాత అడివి శేష్ సోలో హీరోగా మరో సినిమా థియేటర్స్కు రాలేదు. మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా అడివి శేష్ నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొని ఉంది. ఇక గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో అడివి శేష్ ఓ అతిథి పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.కాపాడే కవచం నిఖిల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిం చారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. అయితే ‘స్వయంభూ’ సినిమాను తొలుత ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చనే టాక్ తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా ఒకవేళ విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమా విడుదలయ్యేలా ‘స్వయంభూ’ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక ఇటీవల ‘స్వయంభూ’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి, శ్రీరాముడికి అందించిన ఈ సింగోలుకి కూడా అరణ్యవాసమా?’, ‘యుద్ధమా?’, ‘అంతర్యుద్ధం..’, ‘కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా..’, ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా... కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.అమెరికా రిటర్న్స్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ కామెడీ సినిమా ‘రాకాస’. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్కు రైటర్గా, ‘బెంచ్లైఫ్’ సిరీస్కు దర్శకురాలిగా చేసిన మానసా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మానసా శర్మకు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఉమేష్ కుమార్ బన్సల్తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇటీవల ‘రాకాస’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘నరకం నుండి సందేశం వస్తుంది.ఇక సమయం లేదు’, ‘మన ఊరి శాపం ఇది’, ‘మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’, ‘ఐయామ్ వీరూ సార్... అమెరికా రిటర్న్స్’, ‘నేను రైట్ అడ్రస్కు వచ్చిన రాంగ్ పర్స్ని సార్... నాకు, ఈ ఊరికి అస్సలు సంబంధం లేదు సార్...’, ‘ఇది ఆఖరి హెచ్చరిక’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. అయితే టీజర్లోని కంటెంట్, డైలాగ్స్ను బట్టి ‘రాకాస’ కథనం ఓ ఊరు, అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. నేడు (బుధవారం) ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇక ‘మ్యాడ్, మ్యాడ్ 2’ వంటి ఫీచర్ ఫిల్మ్స్లో సంగీత్ శోభన్ ఓ లీడ్ రోల్లో నటించారు. అలాగే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్లో హీరోగా చేశారు. కానీ ‘రాకాస’ చిత్రంలో మాత్రం సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశారు. మరి... ఈ సినిమా సంగీత్ కెరీర్కు ఎంత మైలేజ్ ఇస్తుందన్న విషయం మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ స్నేక్ డ్యాన్స్ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్రనిర్మాత–నటి నిహారిక కొణిదెల గెస్ట్ రోల్ చేశారని తెలిసింది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.తిమ్మరాజుపల్లిలో ఏం జరిగింది? సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పీరియాడికల్ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిం చారు. 1990 కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. తేజ వేల్పుచర్లతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం తిమ్మరాజుపల్లి అనే ఊరి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఆ ఊరి ప్రజలు, హీరో ప్రేమకథ, శివరాత్రి జాగారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు... ఇలాంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట. వంశీకాంత్ రేఖన ఈ చిత్రానికి సంగీతం అందించారు.పాపం ప్రతాప్ ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తిరువీర్. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.పి దుర్గా నరేష్ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ భార్యాభర్తలుగా నటించారు.అనువాద చిత్రాలూ ఉన్నాయికోలీవుడ్లో ఏప్రిల్లో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ‘కర’ ఒకటి. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, మమితా బైజు హీరోయిన్గా నటించారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేష్ ఈ సినిమాను నిర్మించారు. రివెంజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి మమితా బైజు, కేఎస్ రవికుమార్ల ఫస్ట్ లుక్స్ను రిలీజ్ చేశారు.‘కర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పత్య్రేకంగా చె΄్పాల్సిన అవసరం లేదు. ‘లవ్ టుడే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), డ్యూడ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరో పటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే ’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా ఏప్రిల్ 10కి వాయిదా పడిందని టాక్. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. శరవణన్ ‘లీడర్’ చిత్రం కూడా ఏప్రిల్లోనే రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్లో వచ్చే నెల రిలీజ్ కానున్న సినిమా ‘భూత్ బంగ్లా’. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ హారర్ సినిమాలో పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి మంగళవారం ‘తుహీ దిస్దా’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు.అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మరోవైపు మాలీవుడ్లో ఏప్రిల్ 10న ‘పళ్లి చట్టంబి’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. టొవినో థామస్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.1950–1960 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. కన్నడలో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రేమ్ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రామచంద్రన్ ఈ మూవీలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇలా వచ్చే నెల తెలుగులో రిలీజ్ కానున్న మరికొన్ని అనువాద సినిమాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ
‘‘రాకాస’ కథని నిహారికగారు ఓ పావు గంట వినగానే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా ఔట్పుట్ కూడా ఆమెకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. డైరెక్టర్గా ‘రాకాస’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. నాకు వెబ్ సిరీస్లు చేసిన అనుభవం ఉండటంతో ‘రాకాస’ తీయడం సవాల్గా అనిపించలేదు’’ అని డైరెక్టర్ మానస శర్మ పేర్కొన్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్రదర్శకురాలు మానస శర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్గా చేశాను. అనంతరం ‘బెంచ్ లైఫ్’ సిరీస్ చేశాను. ‘రాకాస’ని ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. సంగీత్ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్ నాకు ఇష్టం.నయన్ సారిక ప్రతిభ, నటన చూసి ఈ చిత్రంలోకి తీసుకున్నాం. థియేటర్లో చూసి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. అనుదీప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిహారికగారు మంచి నిర్మాత. ఇక నా తర్వాతి ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాను’’ అని తెలిపారు. -
న్యూ లుక్... ఫ్యాన్స్కి కిక్
రజనీకాంత్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కెరీర్లోని ఈ 173వ సినిమాను కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాలోని ఇతర నటీనటుల ఎంపిక, లుక్ డిజైనింగ్ వంటి అంశాలపై సిబీ ఫోకస్ పెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్ను సరికొత్తగా చూపించేందుకు దాదాపు 80 రకాల లుక్స్ను పరిశీలించారట సిబీ. ఈ లుక్స్లో మూడు లుక్స్ను ఎంపిక చేసి, వీటిలో రజనీకాంత్ మెచ్చిన లుక్ను ఫైనలైజ్ చేయనున్నారని సమాచారం. ఈ లుక్ రజనీ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా ఉంటుందని కోలీవుడ్ టాక్. -
ఇరాన్ ఆ విషయంలో హామీ ఇచ్చింది : ట్రంప్
పశ్చిమాసియా యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పుడూ అణ్వాయుధాలు తయారు చేయమని హామీ ఇచ్చిందన్నారు. ఇది చర్చలలో కీలక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. వైట్హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు.పశ్చిమాసియా యుద్ధం తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అమెరికా తరచుగా చెబుతున్నప్పటికీ టెహ్రాన్ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైట్హౌస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ప్రస్తుతం ఇరాన్లో సరైన వ్యక్తులతో మాట్లాడుతున్నాం వారు ఒప్పందం చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco పాల్గొంటున్నారు అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని అంగీకరించిందని తెలిపారు.అదేవిధంగా ఇరాన్పై అమెరికా చేసిన దాడుల వల్ల అక్కడి పాలనలో మార్పు జరగబోతుందని తెలిపారు. కాగా ఈ యుద్ధం ముగిసినట్టేనా?: ఇరాన్తో శాంతి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుందని ట్రంప్ను ప్రశ్నించగా.. "ఈ యుద్ధంలో విజయం సాధించాం" అని సమాధానమిచ్చారు. అయితే చర్చల విషయంలో ఇరాన్ ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం -
గుర్రం లాగిన రైలుబండి
గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు, విలాసవంతమైన ఓరియంట్ ఎక్స్ప్రెస్ లేదా మంచు కొండల గుండా సాగే ట్రాన్స్–సైబీరియన్ రైళ్ల గురించి గొప్పగా చెప్పుకొంటాం. కానీ కోట్లాది మంది సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఈ రైలు ప్రయాణ విప్లవం ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. సరిగ్గా 219 సంవత్స రాల క్రితం (1807 మార్చి 25) తేదీన బ్రిటన్ సౌత్ వేల్స్లోని ఒక చిన్న సముద్ర తీర గ్రామంలో, కేవలం ఒక గుర్రం లాగే బండితో డబ్బులు చెల్లించి చేసే రైలు ప్రయాణ చరిత్ర ప్రారంభమయ్యింది. ఆ రోజుల్లో రైల్వే పట్టాలు కేవలం బొగ్గు, సున్నపురాయి వంటి ముడి సరుకులను రవాణా చేయడానికి మాత్రమే వాడే వారు. మంబుల్స్ గ్రామంలోని గనుల నుంచి బొగ్గును స్వాన్సీ ఓడరేవుకు చేరవేసేందుకు 1804 లోనే పట్టాలు వేశారు. అయితే ఆ పట్టాలపై వెళ్లే సరుకు బండ్లను చూసి పిల్లలు సరదాగా వాటిపై ఎక్కి సవారీ చేసేవారు. ఆ దృశ్యాన్ని చూసిన ‘బెంజమిన్ ఫ్రెంచ్’ అనే వ్యాపారవేత్తకు మనుషులను కూడా పట్టాలపై రవాణా చేయాలనే ఆలోచన వచ్చింది. 12 సీట్లు ఉన్న ఒక గుర్రపు బండిని సిద్ధం చేశాడు. అది స్వాన్సీలోని ‘ద మౌంట్’ నుండి ‘ఆయిస్టర్ మౌత్’ వరకూ ఐదు మైళ్ల దూరం ప్రయాణించేది. దీనికి రెండు షిల్లింగుల వరకు ఛార్జీ వసూలు చేసేవారు. ‘ద మౌంట్’ ప్రపంచంలోనే తొలి రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. అక్కడ ప్లాట్ ఫారమ్ లేకపోవడంతో ప్రయాణికులు పట్టాల పక్కనే ఉన్న ఒక మట్టి దిబ్బ మీద నుంచి బండిలోకి ఎక్కేవారు.ఇంతింతై...ప్రపంచంలోనే అత్యధిక రకాల శక్తి వనరులను వాడిన రైల్వేగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గుర్రంతో మొదలైన ఈ రైలు ప్రయాణం, క్రమంగా ఆవిరి యంత్రాలు, గాలి (సెయిల్), డీజిల్, గ్యాసోలిన్, చివరకు విద్యుత్ శక్తి వరకు వినియోగించుకుంటూ ఎదిగింది. మొత్తం ఆరు రకాల ఇంధనాలను వాడిన రైళ్లు పరుగులిడిన ఏకైక రైలు మార్గమిది. 1877లో ఆవిరి యంత్రాలు వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకే సారి 15 బోగీలతో సుమారు 1,300 మందిని ఇది తీసుకెళ్లేది. 1928లో ఈ లైన్ను విద్యుదీకరించారు. ఆ సమయంలో బ్రిటన్ లోనే అతిపెద్దవైన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ట్రామ్ కార్లను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఒక్కో రైలులో 212 మంది వరకు కూర్చునే అవ కాశం ఉండేది. 1940వ దశకంలో ఏడాదికి దాదాపు 50 లక్షల మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించారంటే దీనికి ఆదరణ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.ఈ రైలు ప్రయాణం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, అది ప్రజల జీవితాల్లో ఒక తీపి జ్ఞాపకం. అప్పటి ప్రయా ణికులు ఆ రైలు సీట్లు మెత్తని చర్మంతో ఉండేవనీ, పట్టాలపై వెళ్తున్నప్పుడు ఆ బండి చేసే శబ్దం ఎంతో దూరం వరకు వినిపించేదనీ గుర్తు చేసుకుంటారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరిస్థితులు మారిపోయాయి. చమురు నియంత్రణలు తొలగిపోవడంతో కార్లు, బస్సుల వాడకం పెరిగింది. పాతబడిన పట్టాల మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని భావించిన అధికారులు, దీనిని మూసివేయాలని నిర్ణయించారు.చివరకు 1960 జనవరి 5వ తేదీన ఈ చారిత్రక రైలు తన చివరి ప్రయాణాన్ని సాగించింది. ఆ రాత్రి వేలాది మంది ప్రజలు విచారంతో రోడ్ల మీదకు వచ్చారు. తమ ప్రియమైన రైలుకు వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియల తరహాలో నల్లటి బట్టలు ధరించి, ఒక ఖాళీ శవపేటికను మోస్తూ పాటలు పాడారు.నేడు స్వాన్సీలో అక్కడక్కడా కొన్ని శిథిలాలు తప్ప ఈ చారిత్రక రైలుకు సంబంధించిన ఆనవాళ్లు పెద్దగా లేవు. కానీ, ఈ రైలు ప్రయాణం చరిత్రలో ఎప్పటికీ ఒక అద్భుత అధ్యాయంగానే నిలిచిపోతుంది. -
లండన్లో యూదు అంబులెన్సులు దగ్ధం
లండన్లో యూదు స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు.యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్లోని గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గత సోమవారం తెల్లవారు జామున దుండగులు ఈచర్యకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించే నాలుగు అంబులెన్స్లు దగ్ధమయ్యాయి. వాహనాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పక్కనే ఉన్న భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.ఈ ఘటనను ఆదేశ్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గత రెండేళ్లలో బ్రిటన్లో యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు భారీగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. 2022లో 1,662 ఘటనలు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,700కు పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి. -
సంక్షోభ సమయం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగానే ఉండబోతున్నదనీ, అది దీర్ఘకాలం కొనసాగుతుందనీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతాలు సహజంగానే అందరినీ కలవరపెడతాయి. ఆయన సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఆరేళ్ల క్రితం కోవిడ్ రోజుల నాటి పరిస్థితులతో వర్తమాన స్థితిని పోల్చారంటే దేశం మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 23 రోజుల క్రితం ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటన తర్వాత ఆగిన సంకేతాలు కనబడినా, యుద్ధ విరమణ ఉండబోదన్న ఇజ్రాయెల్ తీరు చూస్తే అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు... అటు ఇరాన్ సైతం అమెరికాతో చర్చించలేదని చెబుతోంది. చివరకు అదేమవుతుందన్న సంగతలా ఉంచితే, ఇప్పటికే ప్రపంచంతోపాటు మనమూ సంక్షోభంలో చిక్కుకుపోయామని తెలుస్తూనే ఉంది. క్షణక్షణం మాట మార్చే ట్రంప్ను ఇరాన్తోపాటు ప్రపంచ ప్రజానీకం కూడా పెద్దగా విశ్వసించలేదుగానీ... స్టాక్ మార్కెట్లు మాత్రం నమ్మదల్చుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. మార్కెట్లన్నీ మంగళవారం ఉత్సాహంతో ఉరకలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కానీ ఈ ధోరణి దీర్ఘకాలం కొనసాగటం అనుమానమే. యుద్ధంపై కేంద్రం నుంచి వెలువడిన ఈ తొలి ప్రకటన సాధారణ జనంలో కొద్ది రోజులుగా ఉన్న భయాందోళనలు నిర్హేతుకం కాదని సూచిస్తోంది. ఆర్థిక, జాతీయ భద్రతా రంగాలతోపాటు మానవతారంగంలోనూ పెను సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని ప్రధాని చెబుతున్నారు. మన ఆర్థిక ప్రగతికి ప్రధానంగా తోడ్పడే చమురు, సహజవాయువుల్లో సింహభాగం పశ్చిమాసియా నుంచే రావాలి. ఆ ప్రాంతం మామూలు స్థితికి చేరేదాకా ఆ రెండు దిగుమతులపైనా అనిశ్చితి కొనసాగుతుంది. గల్ఫ్ దేశాల్లో భిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కోటిమంది భారతీయుల్లో 3 లక్షల మంది ఇప్పటికే వెనక్కొచ్చారు. ఇరాన్ ప్రతిదాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల అవి గడ్డు పరిస్థితుల్లో పడ్డాయి. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. తమ గ్యాస్ ఉత్పాదక క్షేత్రాన్ని చక్కదిద్దటానికి చాలా ఏళ్లు పట్టవచ్చని ఖతార్ అంటున్నది. కనుక గల్ఫ్లో ఉపాధి కల్పన మళ్లీ పట్టాలెక్కడం అంత సులభం కాదు. గల్ఫ్ సంక్షోభంతో రాబోయే ఖరీఫ్ సీజన్కు అవసరమైన స్థాయిలో ఎరువులు అందుతాయా అన్న సందేహాలున్నాయి. సాగుకు లోటురానీయబోమని మోదీ హామీ ఇవ్వడం అందుకే. ఆయన చెబుతున్న ప్రకారం కొన్ని శక్తులు ఈ సంక్షోభాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఆంతరంగిక భద్రతపై ప్రభావం చూపుతుంది. దేశం ఐక్యంగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ సమయాల్లో పెద్దగా చర్చకు రాని విదేశాంగ విధానం సంక్షోభ కాలంలో ముందుకొస్తుంది. మనది మోదీ వ్యక్తిగత విధానంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తమ కాలంలో ఎప్పుడూ ఇలా లేదని కూడా చెబుతున్నారు. కానీ నాటి ద్విధ్రువ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అప్పుడు అలీన విధానం అని చెప్పుకున్నామేగానీ సోవియెట్కు సన్నిహితంగా మెలిగాం. అప్పట్లో అమెరికాపై దూకుడు ప్రదర్శించటం అందులో భాగమే. నిజంగా తటస్థంగా ఉన్నట్టయితే హంగేరీ (1956), జెకొస్లోవేకియా(1968), అఫ్గాన్(1979)లపై సోవియెట్ దురాక్రమణకు దిగినప్పుడు ఖండించి ఉండేవాళ్లం. మారిన పరిస్థితుల్లో భిన్న దేశాలపై వేర్వేరు అంశాల్లో ఆధారపడి ఉన్నామన్నది కాదనలేని సత్యం. నిజానికి అన్ని దేశాల పరిస్థితీ అదే. చైనా, రష్యాలు ఇరాన్కు గట్టి మద్దతుదార్లుగా నిలిచినా ఆపత్సమయంలో అవి తటస్థంగానే ఉండిపోక తప్పలేదు. ఉక్రెయిన్కు అమెరికా సాయం చేయటాన్ని చూపి, కనీసం రష్యా ఇరాన్కు నిఘా సమాచారాన్ని ఇచ్చింది. పరిస్థితులు మున్ముందు మరింత సంక్లిష్టంగా మారినా మారొచ్చు. ఈలోగా మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే మెరుగైన విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటే మంచిది. -
ముగుస్తున్న సమాంతర చరిత్ర
దేశంలో ‘నక్సలిజం అంతానికి’ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఆపరేషన్ కగార్ గడువు మరికొద్ది రోజులలో మార్చి 31న ముగియనున్నది. మరునాడు ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఎక్కడా నక్స లైట్లు గానీ, నక్సలిజం గానీ జాడలేని పరిస్థితి ఏర్పడుతుందా అన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గానీ, గత 59 సంవత్సరాలుగా మనం చూస్తున్న తరహా ఉద్యమం మాత్రం ముగింపునకు వస్తున్నదనటంలో సందేహం లేదు. ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు చనిపోవడం లేదా నాయకులతో సహా లొంగిపోవటం జరుగుతున్న ప్పుడు, ఉద్యమం ఇప్పటివలె ఇంకా కొనసాగగలదని భావించటం నిర్హేతుకమవుతుంది.అరవై ఏళ్ల పోరాటంభారతదేశం 1947లో స్వతంత్రాన్ని సాధించుకోగా, తర్వాత 20 సంవత్సరాలకే 1967లో నక్సలిజానికి బీజాలు పడ్డాయి. అప్పటి నుంచి దేశ చరిత్రకు సమాంతరంగా నక్సలిజం చరిత్ర దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక నియంతృత్వ వ్యవస్థలో రైతాంగం, ఆదివాసీలు, పేదలు ఇంత సుదీర్ఘమైన విప్లవోద్యమాన్ని సాగించి ఉంటే అది వేరు. కానీ, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఇట్లా ఎందుకు జరిగిందన్నది జాగ్రత్తగా, నిర్వికారంగా అర్థం చేసుకోవలసిన విషయం.అనేక శతాబ్దాల పాటు రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలలో, తర్వాత బ్రిటిష్ వలస పాలనలో తీవ్రమైన పీడనకు గురైన ఇండియా వ్యవ సాయిక దేశం. పీడనకు గురైన ప్రజలలో అత్యధికులు రైతులు, కౌలు దార్లు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వివిధ వృత్తులవారు, ఆదివాసీలు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్య మించిన కాంగ్రెస్ తదితర పార్టీల నాయకత్వాలు ఈ సమస్యను మొదటి నుంచి గుర్తించాయి. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం రైతాంగం కోసమే. అది, బిహార్లోని చంపారన్లో 1917లో నీలిమందు రైతుల సమస్యలపై. ఆయన తన ప్రథమ శిష్యునిగా ప్రకటించిన వల్లభ్ భాయ్ పటేల్ ఆ మరుసటి సంవ త్సరమే గుజరాత్లోని ఖేడా ప్రాంతంలో మహత్తరమైన రైతాంగ పోరాటం నడిపారు.ఈ నేపథ్యంలోకి వెళ్లటం ఎందుకంటే, నక్సలైట్లు ఏ పేద రైతాంగం కోసమైతే పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో 1967లో సాయుధ ఉద్యమం ఆరంభించారో, అంతకు సరిగా 50 సంవత్స రాల ముందు, కాంగ్రెస్ నాయకత్వం అదే రైతుల కోసం ఉద్యమించింది. మరొక విధంగా చెప్పాలంటే, దేశ స్వాతంత్య్రానికి 30 సంవత్సరాల క్రితం అన్నమాట. అంతే కాదు– చంపారన్, ఖేడా రైతుల సమస్యల పరిష్కారంతో వారు దేశ రైతాంగాన్ని మరవలేదు. వారి విషయమై ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాలు చేస్తూ పోయారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మహజర్లు సమర్పించారు. గవర్న మెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 ప్రకారం ఎన్నికలు జరిగి రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఏర్పడినపుడు రైతాంగ అనుకూల చర్యలు తీసుకున్నారు.ఎందుకు తలెత్తినట్టు?స్వాతంత్య్రం తర్వాత ఇదే ధోరణి కొనసాగిస్తూ నెహ్రూ ప్రభుత్వం అనేక వ్యవసాయ సంస్కరణలను ప్రవేశ పెట్టింది. భూమిపై యాజమాన్యం సాగుచేసే రైతులకు మాత్రమే ఉండాలని, ఎవరెంత సాగు చేయగలిగితే అంతమాత్రమే లభించాలన్న గాంధీజీ సూచనల స్ఫూర్తితో భూపరిమితి చట్టాలు, జమీందారీ రద్దు, భూపంపిణీలు, కౌల్దారీ చట్టాల వంటివి చేశారు. రైతులకు ఉప యోగపడే సహకార చట్టాలు, పంచాయతీ రాజ్లను కూడా అమ లుకు తెచ్చారు. రుణ పరపతి విధానం ప్రవేశ పెట్టారు.విషయం ఏమంటే, 1947 కన్న ముందటి వ్యవసాయ రంగ పరిస్థితులను అంతగా అర్థం చేసుకుని, ఆ తర్వాత ఇన్నిన్ని చర్యలు తీసుకున్నప్పుడు, 20 సంవత్సరాలు గడిచేసరికి పేద రైతాంగం, రైతు కూలీల కేంద్రంగా నక్సలైట్ ఉద్యమం అసలు తలెత్తి ఉండ కూడదు. అదంతా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు కనిపించే ఏకైక సమాధానం, పైన పేర్కొన్న వేర్వేరు ప్రభుత్వ చర్యలలో కొన్ని అరకొరగా అమలుకాగా, కొన్ని అసలు కాకపోవటం. నిజమైన ఆధిపత్యం చాలావరకు పెద్దవారి చేతులలోనే మిగిలి పోవటం. రాచ కుటుంబాల వారు, జమీందారీ తరగతులు, ఇతర ప్రాబల్య వర్గాలు కాంగ్రెస్లో చేరి, అధికారుల సహాయంతో రకరకాల యుక్తుల ద్వారా భూసంస్కరణలతో పాటు నెహ్రూ ప్రభుత్వపు అనేక సంస్క రణలను వీలైనంత బలహీనపరచారు. 1964లో ఆయన మరణం తర్వాత ఇక వారికి ఏ అడ్డూ అదుపూ లేకపోయింది. మరొక మూడేళ్లు గడిచేసరికి నక్సల్బరీకి అంకురార్పణ జరిగింది.‘అభివృద్ధి’కి ఇక అడ్డేమిటి?1917 నుంచి ఆరంభించి 1950ల వరకు కాంగ్రెస్ పార్టీ రైతాంగం పట్ల, ఆదివాసీల పట్ల చూపిన శ్రద్ధ మేరకు కార్యాచరణ జరిగి ఉంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రకు సమాంతరంగా నక్సలైట్ ఉద్యమ చరిత్ర అంటూ ఒకటి ఉండేదే కాదు. దానిని ‘అంతం’ చేయవలసిన అవసరమంటూ ఇపుడు ఏర్పడేది కాదు. మొదట అనుకున్నట్లు మొత్తానికి ఉద్యమమైతే ఇక ముగిసి పోతు న్నది. అందుకు ఒక ముఖ్య కారణం ప్రభుత్వాల అణచివేత. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సమన్వయంతో గతంలో లేనంత తీవ్ర మైన చర్యలు తీసుకుంటుండవచ్చు. కానీ, గత ప్రభుత్వాల చర్యలు తక్కువేమీ కాదు. రెండవ ముఖ్య కారణం ఉద్యమంలోని అనేక లోపాలు. సైద్ధాంతిక అవగాహనలో, దాని అన్వయంలో, వ్యూహ రచనలో, వ్యవస్థల నిర్మాణంలో, ఆచరణలో... ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అనేక లోపాలు కొనసాగినపుడు ఎంతటి ఉద్యమ మైనా క్రమంగా విఫలం కాక తప్పదు.విచారకరం ఏమంటే, కాంగ్రెస్కు 1917 నుంచి గణనీయమైన స్పృహ ఉండి, 1947 నుంచి ఎన్నో చర్యలు తీసుకుని, 1967 నుంచి తీవ్ర స్థాయిలో నక్సలైట్ ఉద్యమం జరిగిన తర్వాత కూడా, దేశం 2027 ముంగిట ఉండగా, రైతులూ, ఆదివాసీల స్థితిగతులు అసలు మెరుగుపడలేదనలేము. కానీ, మెరుగుపడవలసింది ఇంకా చాలా ఉందన్నది వాస్తవం. వారిలో గల అసంతృప్తి కూడా తక్కువ కాదు. అందువల్ల, నక్సలిజమైతే ‘అంతమవుతున్నది’ గానీ, అందుకు కార ణమైన సమస్యలను కూడా అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఏమి చర్యలు తీసుకోగలవో వేచి చూడవలసి ఉంది. నక్స లైట్లను ఇంతకాలం అభివృద్ధికి అడ్డుపడుతున్న శక్తులుగా నిందించిన మీదట, ఇక అటువంటి అడ్డులనేది లేకుండా ఈ నెల 31తో తొలగి పోతున్నందున, రైతులు, కౌలుదార్లు, కూలీలు, వృత్తి పనులవారు, ఆదివాసీలు, నిరుద్యోగులు తదితర వర్గాల సమస్యలను శీఘ్రగతిన తొలగించి అభివృద్ధి పరచేందుకు ఇపుడు మార్గం పూర్తిగా సుగమ మవుతున్నది. ఆ పని చేయనున్నారా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు. -
అక్రమ మట్టి తవ్వకాలపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పొట్టిలంకలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కలిసి మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఎన్జీటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సర్వే నెంబర్ 147లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ గర్భానికి తూర్పు పొడుస్తూ తవ్వకాలు జరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.దొంగ పట్టాలు సృష్టించి మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీ మట్టి ఒక్కొక్కటి రూ.14,000కి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో మట్టి మాఫియా ఇంతగా చెలరేగిపోతున్నా.. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం మౌనంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడే దిశగా తక్షణ చర్యలు అవసరమని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. -
కంటికి తల తీస్తాం.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో చర్చల అంశం నడుస్తున్న వేళ ఇరాన్ ట్రంప్నకు భారీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతుందని నూతన సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయీ అన్నారు. కంటికి బదులు తల తీసుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయని దానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తోంది: అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతోందని, ఈ ఊబి నుండి బయటపడటానికి ట్రంప్కు ఎక్కువ సమయం లేదని రెజాయీ పేర్కొన్నారు.అక్కడి ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ "మీరు మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా స్పందన 'కంటికి కన్ను' అన్నట్టుగా ఉండదు. కంటికి తలతీసే విధంగా ఉంటుంది అమెరికా యుద్ధనౌకలను అరేబియా గల్ఫ్లో ముంచివేస్తాం, అమెరికా మెుత్తాన్ని స్తంభింపజేస్తాం " అని హెచ్చరించారు.అమెరికాని ఇజ్రాయెల్ కుట్రపన్ని పావులా వాడుకుందని 'గ్రేటర్ ఇజ్రాయెల్' కల కోసం ట్రంప్ను ఈ అక్రమ యుద్ధంలోకి నెట్టిందన్నారు, ప్రస్తుతం ట్రంప్ తన సైనిక కమాండర్లు మరియు ఇజ్రాయెల్ మధ్య అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధం ముగియాలంటే ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇరాన్పై ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు. -
జనం రద్దీ లేని చల్లని ప్లేసెస్ ఎక్కడెక్కడ ...!
ఒకప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు తహతహలాడేవారు. అయితే ఇప్పుడు ఎండల్ని తప్పించుకోవడానికి చల్లని చోటుతో పాటు అక్కడ రద్దీ కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఊటీ, కొడైకెనాల్, మునార్ తదితర పేరొందిన హిల్ స్టేషన్లు విపరీతమైన పర్యాటక రద్దీని ఎదుర్కుంటున్న పరిస్థితుల్లో... అంతగా ప్రాచుర్యం లేని సరికొత్త గమ్యస్థానాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం...పర్వ‘తవాంగ్’...అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ తూర్పు హిమాలయాలలో ఎతై ్తన ప్రదేశంలో ఉన్న ఒక అద్భుతమైన, ఏకాంతమైన, ప్రశాంతమైన ప్రాంతం. ఏప్రిల్ నాటికి, ఈ ప్రాంతంపై శీతాకాలపు పట్టు క్రమంగా సడలుతుంది. మంచు కరగడం, చుట్టుపక్కల కొండలను కప్పివేసేలా రోడోడెండ్రాన్ పువ్వులు విపరీతంగా పూయడంతో, నిర్మలమైన ఆకాశం సందర్శకులకు పర్వతాల సౌందర్యాన్ని కళ్లు ముందుకు తెస్తుంది. ఎతై ్తన ప్రదేశంలో ఉన్న సేలా కనుమ గుండా ప్రయాణిస్తున్నప్పుడు, గడ్డకట్టిన సరస్సులు ఎడమ, కుడి వైపులా దర్శనమిచ్చి తవాంగ్కు చేసే ప్రయాణాన్ని మరువలేనిదిగా మారుస్తాయి. భారతదేశంలోనే అతి పెద్దదైన, లోయ అంచున ఉన్న తవాంగ్ మఠం ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, తగిన అనుమతితో, తవాంగ్ను సందర్శించేవారు భారత్/చైనా సరిహద్దులోని బుమ్లా పాస్కు రమణీయమైన ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది, మార్గమధ్యంలో అద్భుతమైన మాధురి సరస్సు అందాలను ఆస్వాదించవచ్చు.‘కల్ప’ న కాదు...కమనీయం...హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ ప్రాంతంలోని ఒక చిన్న హిమాలయ గ్రామమైన కల్పలో జీవనశైలి చాలా నిదానంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలతో నిండిన కిన్నౌర్ కైలాష్ శ్రేణి ఈ ప్రదేశాన్ని అద్భుతంగా మార్చే అంశాలలో ఒకటి. వసంతకాలం రాకతో, లోయ అంతా ఆపిల్ పూలతో నిండిపోతుంది, ఏప్రిల్ నెల కల్పలో గడపడానికి చాలా చాలా సరైన సమయం. అక్కడ ఉన్నప్పుడు, ప్రశాంతమైన గ్రామ వీధుల్లో నడవవచ్చు, నారాయణ నాగిని ఆలయాన్ని (ఒక చారిత్రక ప్రదేశం) సందర్శించవచ్చు, సంగ్లా లోయ, చిత్కుల్ వంటి స్థానిక లోయల గుండా ప్రయాణించవచ్చు. ఇక్కడ అద్భుతమైన ఆల్పైన్ ప్రకృతి దృశ్యాలు, అందమైన నదులు సాంప్రదాయ చెక్క ఇళ్ళు ఆకట్టుకుంటాయి.అందమైన దృశ్యమ్...యుక్సోమ్...యుక్సోమ్ ఒక ప్రశాంతమైన పర్వత పట్టణం, ఇది ఒకప్పుడు సిక్కింకు మొదటి రాజధానిగా ఉండేది. నేడు, ఇది హిమాలయాల్లోని అనేక ట్రెక్కింగ్ రూట్లకు ప్రారంభ స్థానంగా ప్రసిద్ధి చెందింది. ఏప్రిల్ నెలలో, కొండ వాలుల వెంబడి రోడోడెండ్రాన్ పువ్వులు వికసించడంతో పట్టణం చుట్టూ ఉన్న అడవులు రంగుల మయంగా మారిపోతాయి, చల్లని వాతావరణం బహిరంగ ప్రదేశాల సందర్శనను మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఆ రాష్ట్రంలోని పురాతన మఠాలలో ఒకటైన చారిత్రాత్మక దుబ్ది మఠాన్ని సందర్శించవచ్చు ప్రశాంతమైన జలపాతాలకు దారితీసే అటవీ మార్గాలలో విహరించవచ్చు. చాలా మంది ట్రెక్కర్లు ప్రసిద్ధ గోయెచా లా ట్రెక్కు యుక్సోమ్ను బేస్గా కూడా ఉపయోగిస్తారు, ఇది కాంచన్ జంగాకు చెందిన అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది.పచ్చని తివాచీ..జీరో వ్యాలీ..అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్న జీరో లోయ హిమాలయాల్లోని చాలా ప్రదేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎతై ్తన పర్వతాలకు బదులుగా, ఇది చుట్టూ ఉన్న కొండలు పొడవైన పైన్ చెట్లతో కూడిన విశాలమైన వరి పొలాలను కలిగి ఉంది. ఇక్కడ అపటాని అనే గిరిజన తెగ నివసిస్తుంది, వీరికి సుస్థిర వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. సమీప గ్రామాలకు వెళ్లడానికి, చెక్క వంతెనలను దాటడానికి పరుచుకున్న పచ్చదనాన్ని చూడటానికి ఇక్కడ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రత మితంగా ఉండి, పచ్చిక బయళ్ళు సమృద్ధిగా కనిపిస్తాయి.హిమ‘ఆలయ’పట్టణం..చోప్టాఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చోప్టా చెట్లు పొడవైన మంచుతో కప్పబడిన శిఖరాలతో కూడిన ఒక చిన్న హిమాలయ పట్టణం. ఏప్రిల్లో వసంతకాలం సమీపిస్తున్న కొద్దీ, నిర్మలమైన నీలాకాశం చౌఖంబా శిఖరాల మీద అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. చాలా మందికి, ఈ యాత్రలో అత్యంత ఆకర్షణీయమైన భాగం, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివాలయాలలో ఒకటైన తుంగనాథ్ ఆలయానికి చేసే ట్రెక్కింగ్. ఆలయానికి చేరుకోవడానికి ట్రెక్కింగ్ ఎక్కువ దూరం ఉండదు; అయినప్పటికీ, ఆలయానికి వెళ్లే మార్గంలో దట్టమైన అడవులు పచ్చని ఆల్పైన్ పచ్చిక బయళ్ల గుండా వెళుతుంది కాబట్టి, ఇది అద్భుతమైన ట్రెక్కింగ్గా పేరొందింది.ఈశాన్య పుష్ప..జుకౌ లోయమణిపూర్–నాగాలాండ్ జుకౌ లోయ ఎగుడుదిగుడుగా ఉండే పచ్చని కొండలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి విశాలమైన ప్రదేశాలు ప్రకృతి తరంగాలు భూభాగంపై కదులుతున్నట్లుగా అనిపిస్తాయి. ఈ లోయకు వెళ్లే ప్రయాణంలో బేస్ విలేజ్ నుంచి ఒక చిన్న, నిటారుగా ఉండే ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, ఇది మార్గమధ్యంలో అదనపు సాహసాన్ని జోడిస్తుంది. జుకౌ లోయకు చేరుకున్న తర్వాత, పచ్చని పొలాలు, ప్రశాంతమైన సెలయేళ్లు చుట్టుపక్కల పర్వత శ్రేణులతో ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతాయి. ‘ఈశాన్య పుష్ప లోయ‘గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, ఏప్రిల్ నెలలో సందర్శించడానికి అత్యంత అనువైనది.నుబ్రా లోయ, లడఖ్లడఖ్లోని నుబ్రా లోయ అత్యంత విశిష్టమైన ప్రకృతికి నిలయంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మోటారు వాహనాలు వెళ్ళడానికి వీలైన అత్యంత ఎతై ్తన కనుమలలో ఒకటైన ఖార్దుంగ్ లా కనుమ మార్గం ద్వారా నుబ్రా లోయను చేరుకోవచ్చు. నుబ్రా లోయలో చల్లని ఎడారి దిబ్బలు, మంచుతో కప్పబడిన శిఖరాలు ష్యోక్ నది ఒడ్డున పచ్చని గ్రామాలు ఉన్నాయి. లోయను వీక్షిస్తున్నట్లుగా ఉండే మైత్రేయ బుద్ధుని పెద్ద విగ్రహం గల డిస్కిట్ మఠాన్ని సందర్శించడం ఓ వినూత్న అనుభూతి. డు్ర¯Œ లో హండర్ ఇసుక దిబ్బను కనుగొనవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే, రెండు మూపురాలు గల బాక్ట్రియన్ ఒంటెలు ఈ ఎడారి ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతాయి. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని దీని ద్వారా రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి లక్షా 15 వేల 551 ఎలక్ట్రిక్ వాహనాలకు 925.94 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవి పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ వచ్చేలా ఈవి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఈవి వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే,చైనా లతో పోటీపడుతుందని తెలిపారు.ఈవి వాహనాలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్యూర్ ఏరియా లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.. క్యూర్ ఏరియా లో డీజిల్ ఆటో లు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్క్రాపేజీ పాలసీ లో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ లో వాహన్ , సారథి పోర్టల్ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యం తో EV వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందని 2 వేల కిలోమీటర్ల మేరకు CURE చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ సీఎస్ పేర్కొన్నారు. నగరం లో ఈవిబిబస్సు లను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ లో అమలు చేస్తున్న ఈవి పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందన్నారు.EVS -
ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..!
తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.స్వాతంత్య్రానంతరం వేగంగా అభివృద్ధి రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. ప్రతికూల అంశాలు ఇవే.. పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది. -వెబ్డెస్క్ -
భవిష్య కెప్టెన్గా రింకూ సింగ్.. ప్రకటన విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్గా టీమిండియా స్టార్, టీ20 ప్రపంచకప్ విజేత రింకూ సింగ్ను నియమించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేకేఆర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐపీఎల్-2024లో కేకేఆర్ కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టును చాంపియన్గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. ట్రోఫీ అందించిన కెప్టెన్ అయినప్పటికీ కేకేఆర్ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి. కెప్టెన్గా రహానేఇక మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు శ్రేయస్ను కొనుగోలు చేసి.. కెప్టెన్ను చేసింది. ప్రతిగా 2025లో జట్టును ఫైనల్కు చేర్చి అతడు సత్తా చాటాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్గా నియమించింది.గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగు మ్యాచ్లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్గా కొనసాగించనుంది.భవిష్య కెప్టెన్ రింకూనేనిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి కేకేఆర్ భవిష్య కెప్టెన్ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.కాగా 2018 నుంచి రింకూ సింగ్ కేకేఆర్తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్గా ఉన్నాడు. ఇక ఇటీవల ముగిసిన పొట్టి క్రికెట్ వరల్డ్కప్ 2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. పేద కుటుంబంఉత్తరప్రదేశ్కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్గా ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్లైట్లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.లోక్సభ ఎంపీతో నిశ్చితార్థంవరల్డ్కప్ సమయంలో తండ్రి కన్నుమూసినా బాధను దిగమింగి.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. మరోవైపు.. త్వరలోనే రింకూ పెళ్లి బంధంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. లోక్సభ ఎంపీ, సుప్రీంకోర్టు లాయర్ ప్రియా సరోజ్తో గతేడాది అతడి నిశ్చితార్థం జరిగింది.చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?God’s plan has a new chapter ✨ pic.twitter.com/2Gsy55mipi— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026 -
మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్.. బిగ్ బాస్ దివి స్టన్నింగ్ పోజులు
కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..బిగ్బాస్ దివి స్టన్నింగ్ పోజులు..మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్..బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక.. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం
తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు. -వెబ్డెస్క్ -
గ్యాస్ కొరతకు చెక్.. 20 శాతం పెరిగిన కేటాయింపు!
భారతదేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు లభ్యతను మరింత బలపరచడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సరఫరాను పెంచే నిర్ణయం తీసుకుంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అదనంగా 20% కమర్షియల్ LPG సిలిండర్ల కేటాయింపును ఆమోదించింది. దీంతో మొత్తం కేటాయింపు సగటు నెలవారీ అవసరంలో 50%కి పెరిగింది. ఈ పెంపు వలన వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా మరింత స్థిరంగా, సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది.India is strengthening commercial LPG availability across the country.An additional 20% allocation of commercial LPG cylinders has been approved—taking the total allocation to 50% of the average monthly requirement.IndianOil is working across its extensive nationwide network… pic.twitter.com/zYFkE5qB1d— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 24, 2026ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు వంటి రంగాలు గ్యాస్ కొరత నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్లను సమయానికి, సులభంగా అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం వల్ల వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతాయి. అంతేకాకుండా, వినియోగదారులకు ఆహారం, ఇతర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. గ్యాస్ కొరత కారణంగా ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. ధరల స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. -
'ఆ అమ్మాయి నా కూతురితో సమానం'.. దురంధర్ నటుడు
దురంధర్లో రణ్వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్ అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.అయితే తాజాగా దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని అన్నారు. -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన ప్రకటన.. వేటు తప్పదు!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.రూ. 2 కోట్లుకాగా గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ ఆప్షన్గా పనికివస్తాడనే కారణంతో అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్తో కలిసి డకెట్ ఓపెనింగ్ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి.ఢిల్లీ క్యాపిటల్స్ నెత్తిన పిడుగుఅయితే, తాజాగా బెన్ డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నెత్తిన పిడుగు వేశాడు. తాను ఈ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు.. ‘‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను.క్షమించండిఅందుకు తగ్గట్లుగానే ఫ్రాంఛైజీ కూడా తమ జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో చింతిస్తున్నా.ఢిల్లీ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఐపీఎల్ నుంచి వైదొలగాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. ఈ విషయాన్ని చెప్పడం ఎంతో బాధగా ఉంది. అయితే, చిన్ననాటి నుంచి ఇంగ్లండ్ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను.నా సర్వస్వం ఇంగ్లండ్ క్రికెట్కే అంకితంనా సర్వస్వం ఇంగ్లండ్ క్రికెట్కే ధారబోయాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్గా ఉండాలి. సమ్మర్ షెడ్యూల్ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని డకెట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా డకెట్ ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్లో ఆడకుండా అతడిపై రెండేళ్ల నిషేధం పడనుంది. పాలక మండలి ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. రెండేళ్ల నిషేధంఅలాకాని పక్షంలో ఇష్టానికి టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో ఇంగ్లిష్ ప్లేయర్ డకెట్ ఈ జాబితాలో చేరనున్నాడు.కాగా డకెట్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో యాషెస్ టెస్టు సిరీస్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం 221 పరుగులే చేయగలిగాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో సమ్మర్ షెడ్యూల్లో భాగంగా సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు డకెట్ ఇటీవల పేర్కొన్నాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఆ విదేశీ ఆటగాళ్లపై వేటు వేయండి: గావస్కర్ ఫైర్ -
పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మంగళవారం 297 హామీలతో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబంలోని యజమానురాలికి ప్రతినెల రూ.2000, మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. పన్నుల భారం, వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని పేర్కొంది."పాలన సామర్థ్యం లేని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గత 5 సంవత్సరాల్లో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరిగాయి. దాంతో కుటుంబాల రోజువారీ ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ భారం తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తాం" అని మేనిఫెస్టోలో ఉంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుఈపీఎస్ మహిళల కోసం "కుల విలక్కు పథకం" రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పుధాన్యాలుఉచితంగా ఫ్రిడ్జి కూడా ఇస్తామని ప్రకటనమహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు -
ఒవైసీ మూడో ఫ్రంట్.. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోరు!
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్లో పత్తర్గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్లో ముక్కోణపు పోరు మొదలైంది.ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్కు ప్రతికూలాంశంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
రూ.181 కోట్లు నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం
కోల్కతా: 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత సామగ్రి సహా రూ.181 కోట్లకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మొత్తం 294 నియోజకవర్గాల పరిధిలో ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడం తెల్సిందే. అప్పట్నుంచి, విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) కార్యాలయం తెలిపింది. జిల్లాలవారీగా 3,58,986 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,11,829 ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలను, 19,901 ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులకు స్పందించడానికి, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి 1,800కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTలు), 2,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTలు)ను మోహరించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి కోల్కతా పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి బరనగర్, కాళీఘాట్లలో జరిగిన సంఘటనలలో జోక్యం చేసుకున్నారని వారు తెలిపారు. -
రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది!
ఆన్లైన్ షాపింగ్లో లెక్కకు మించిన మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఇప్పుడు మరోమారు తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్వగత్ నాయక్ అనే వ్యక్తి తన స్టార్టప్ కోసం సుమారు రూ. 2.9 లక్షల విలువ గల హైఎండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఆర్డర్ చేశారు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత అతను ప్యాకెట్ను ఓపెన్ చేసి చూడగా అందులో గ్రాఫిక్స్ కార్డ్ బదులుగా 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఉండటం చూసి షాకయ్యారు.'ఫుల్ఫిల్డ్ బై అమెజాన్' (FBA) పద్ధతిలో డెలివరీ జరిగింది. అంటే దీనిని అమెజాన్ గోదాములో నిల్వ చేసి నేరుగా అక్కడి నుంచే రవాణా చేశారని స్వగత్ వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి ఆర్డర్లకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఎందుకంటే కంపెనీ స్వయంగా స్టోర్ చేసి ఆర్డర్ చేసుకున్నవారికి డెలివరీ చేస్తుంది.డెలివరీ ప్యాకేజింగ్పై అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లు స్వగత్ పేర్కొన్నారు. తయారీదారు పెట్టిన అసలు సీల్ కోసి మళ్లీ టేప్ చేశారు, అలాగే నకిలీ బార్కోడ్ కూడా అతికించారని అన్నారు. అదే విధంగా, ప్యాకెట్పై ఉన్న షిప్పింగ్ లేబుల్లో బరువు 1.56 కేజీలుగా చూపించారు. కానీ ఒక అసలు RTX 5090 గ్రాఫిక్స్ కార్డ్ ప్యాకేజింగ్తో కలిపి సుమారు 3 కిలోల వరకు ఉంటుంది.ఇవన్నీ గమనించిన స్వగత్ నాయక్, ఇది స్పష్టంగా మోసం అని పేర్కొన్నాడు. అతను తన అన్బాక్సింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను అమెజాన్ కస్టమర్ సపోర్ట్ను సంప్రదించినప్పటికీ, కేవలం 15 నిమిషాల్లోనే అతని కంప్లైంట్ను మూసివేశారు. ప్రస్తుతం కంపెనీ రీఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇది వినియోగదారుల హక్కులు, ఆన్లైన్ షాపింగ్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్లతో తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలనే పంచుకోగా, మరికొందరు నాయక్ వాదనలను ప్రశ్నిస్తూ, ఆ అన్బాక్సింగ్ వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.Scammed for ₹2.9L on @AmazonIN. Ordered a GIGABYTE RTX 5090 for our startup, received 1kg of Ghadi detergent. This was "Fulfilled by Amazon" (FBA), meaning it was stored and shipped directly from an Amazon warehouse. @AmazonHelp #AmazonScam #ConsumerRights [more in thread] pic.twitter.com/NfgUL0jmvL— Swagat Nayak (@autocarrrot) March 22, 2026 -
‘అఫ్గనిస్తాన్తో సిరీస్ బాయ్కాట్ చేయొచ్చు’
క్రికెట్ ఐర్లాండ్ ఇటీవలే అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.కాగా గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు అఫ్గనిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్ అఫ్గన్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఆడింది. ఇక ఐర్లాండ్ తాజాగా అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్తో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. క్రికెట్ ఐర్లాండ్ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్ అఫ్గనిస్తాన్తో సిరీస్ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్తో సిరీస్ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైంది. కనీసం సూపర్-8 దశ చేరకుండానే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్ పదవికి పాల్ స్టిర్లిండ్ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు బ్రీడీ, బెల్ఫాస్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
ఆలాంటి తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అనుకోను: కేటీఆర్
హైదరాబాద్: నియోజకవర్గాల డిలిమిటేనేషన్ను స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిలిమిటేషన్ అనేది ఎప్పుడో జరగాలని, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ పునర్విభజన హామీ ఉందన్నారు కేటీఆర్. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ పార్లమెంట్లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దానిని యథావిధిగా కొనసాగించాలి. కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జురుమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. డిలిమిటేషన్తో ఈ వ్యత్యాసం పోతుంది’ అని అన్నారు కేటీఆర్ఇక ఫార్ములా రేస్ కేసు గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల డైవర్షన్ కోసమే ఈ ఫార్ములా కేసు. చార్జ్షీట్. ప్రజల దృష్టిని మరల్చడానికి చార్జ్షీట్ వ్యవహారం. ఫార్ములా ఈ-రేసింగ్ కేసు లొట్టపీస్ కేసు. నేను మొదటి నుంచి చెప్తొన్న.. ఇది లొట్ట పీస్ కేసు. న్యాయస్థానాల్లో ఫార్ములా ఈ -రేసు కేసు నిలబడదు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారు. కక్ష ఉంటే నామీద తీర్చుకోండి. అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు?, డబ్బులు చెల్లింపుపై నేనే మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదు. తప్పు జరగలేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగింది. అరెస్ట్ల గుంరించి రేవంత్ రెండేళ్ళుగా చెప్తూనే ఉన్నారు. రిమాండ్కు పంపేది కోర్టులు.. రేవంత్ రెడ్డి కాదు’ అని పేర్కొన్నారు. -
కాంతార ఇమిటేషన్.. దురంధర్ హీరో అలా చేయాల్సిందే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్-2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దురంధర్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో పార్ట్-2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంపై సౌత్ స్టార్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం కొనియాడారు. అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. కాంతార ఇమిటేషన్ కేసులో ఊరట..అయితే గతంలో రణ్వీర్ సింగ్ కాంతార మూవీ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్ వీర్ సింగ్ ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత తన ప్రవర్తనపై రణ్వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రజల భక్తి, సెంటిమెంట్ కావడంతో రణ్వీర్ సింగ్ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాగా.. చాముండి దేవత పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. అయితే దైవాంశమైన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణ సరిపోదని.. ప్రత్యక్షంగా వచ్చి సారీ చెప్పాలని పిటిషన్లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రణ్వీర్ సింగ్కు ఊరటనిచ్చింది. చాముండి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పాలంటూ రణ్వీర్ సింగ్ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడు క్షమాపణ కోసం కోర్టుకు హాజరు కావాలని కోరితే.. అందుకు అంగీకరించాలని కోర్టు సూచించింది.దీనిపై క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని.. రణ్వీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని హీరో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో రణవీర్ సింగ్ తండ్రి హాజరయ్యారు. కోర్టు సూచనలతో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కోర్టులో క్షమాపణ చెప్పి.. చాముండి ఆలయాన్ని సందర్శించనున్నారు.కాగా.. గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
హైదరాబాద్లో కుమ్మేసిన వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో వర్షం కురిసింది. కూకట్పల్లి, మియాపూర్, చందనగర్లో కుండపోత వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్లో భారీ వర్షం కురవగా, మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లిలో వడగళ్ల వాన పడింది. వానవెలిసే వరకు మెట్రో పిల్లర్ల కింద కొందరు వాహనాలను కాసేపు ఆపే ప్రయత్నం చేశారు.కామారెడ్డి జిల్లా జుక్కల్లో గాలివానతో పాటు పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం పడింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. -
అన్నింటిలోనూ జనసేనకు తీవ్ర అన్యాయం: బొలిశెట్టి శ్రీనివాస్
విజయవాడ: తమ పార్టీకి అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ వారు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదాంట్లో జనసేన అసంతృప్తిగానే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నాం.. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. -
‘దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు’
హైదరాబాద్: డిలిమిటేషన్లో మహిళా రిజర్వేషన్ అనేది 33 శాతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జనగణన అనంతరం డిలిమిటేషన్ జరుగుతుందన్నారు. జనాభా , ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని, ఒకవేళ అలా జరిగితే నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల సీట్లు పెరగవన్నారు రాంచందర్రావు. ‘ఇక్కడ 8 వేలు ,10 వేలు జనాభా ఉన్న సీట్లు ఉన్నాయి. జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందని కాంగ్రెస్ చేసే ఆరోపణలో నిజం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు. ఉత్తరాదికి పెరిగిన ప్రపోషన్ ఆధారంగా దక్షిణాదిన సీట్లు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ లు మతం మార్పిడి చేస్తే రిజర్వేషన్ వర్తించదనే కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రలోభాలకు గురి చేసి మతం మార్చుకుంటున్నారు. మత మార్పిడిల వల్ల ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ తో ఎస్సీ ఎస్టీ లకు అందాల్సిన సరైన ఫలాలు అందుతాయి’ అన్నారు. -
మళ్లీ భారీగా అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు చేసింది. ఇవాళ (మార్చి 24న) రూ.3,900 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరణ చేసుకుంది. గత మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. వారం తిరగకుండానే మళ్లీ రూ.3,900 కో అప్పు తెచ్చింది. చంద్రబాబు పాలనలో అప్పుల్లో నెంబర్ వన్గా ఏపీ తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అప్పు రూ.3,37,221 కోట్లకు చేరింది. 22 నెలల్లోనే ఇన్ని కోట్ల అప్పు చేసింది. రూ.1,86,164 కోట్ల బడ్జెటరీ అప్పులు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.1,03,670 కోట్లు అప్పు, అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పులు తీసుకుంది. -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.మంచు లక్ష్మీ తన పోస్ట్లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. Apple...Watching you blossom into such a beautiful young girl fills my heart with a joy I can’t even put into words. You are the very embodiment of kindness, gentleness, warmth, laughter, loyalty, and that effortless spark of sass that makes you you.Every moment of watching… pic.twitter.com/smHR7J6HZ8— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 24, 2026 -
అత్యంత క్లిష్ట సమయం: బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గడిచిన మూడు నెలల కాలం తన కెప్టెన్సీ కెరీర్లో అత్యంత కష్టతరమైనదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నాడు.ఘోర పరాభవంఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో 4-1తో ఓడిపోయిన స్టోక్స్ బృందం.. ఈ కీలక టెస్టు సిరీస్ను ఆసీస్కు సమర్పించుకుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్కు ఊరటనిచ్చిన ఒకే ఒక్క అంశం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు గెలవడం మాత్రమే. రాజీనామా డిమాండ్లూఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు ఆట తీరుపై.. ముఖ్యంగా బజ్బాల్ పేరిట టెస్టు క్రికెట్లోనూ దూకుడుగా ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రాజీనామా చేయాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) మాత్రం వీరిపై నమ్మకం ఉంచింది.అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదుECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గుడ్ ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘అంతర్గతంగా యాషెస్ వైఫల్యంపై సమీక్ష జరిపాము. కొన్నిసార్లు నాయకత్వ బృందాన్ని మార్చడం తేలికైన పని అనిపిస్తుంది. కానీ అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు.అదృష్టవశాత్తూ మా నాయకత్వ బృందానికి అంకితభావం, లక్ష్య సాధనకై శ్రమించే తత్వం ఎక్కువ. యాషెస్ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు’’ అని పేర్కొన్నాడు. అత్యంత క్లిష్టమైనదిఈ మేరకు రిచర్డ్ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా ఉండటం అత్యంత గొప్ప గౌరవం. దీనిని నేను తేలికగా తీసుకోవడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.కొన్నిసార్లు నవ్వితే.. మరికొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు. గత మూడు నెలల కాలం నా కెప్టెన్సీ ప్రయాణంలో అత్యంత క్లిష్టమైనది. బజ్ (మెకల్లమ్), రాబ్ కీ (సెలక్టర్), నేను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాము.జట్టును విజయపథంలో నడిపించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మేము కొన్ని తప్పులు చేశామని మాకు తెలుసు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. అపజయాలను విజయాలుగా మారుస్తాము. సమ్మర్ టెస్టు షెడ్యూల్తో జూన్లో మిమ్మల్ని కలసుకుంటాను’’ అని స్టోక్స్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా బజ్, రాబ్తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం -
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం ఎక్స్లో చేసిన పోస్ట్లో ఈ వివరాలు తెలిపారు.కాగా, అలీ లారిజానీ మృతితో కొత్త సెక్యూరిటీ చీఫ్ను నియమించింది ఇరాన్. మొహమ్మద్ బాఘర్ జోల్ఘద్ర్ ను సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమించింది. దేశ భద్రతా విధానాలను నిర్ణయించే అత్యున్నత సంస్థే ఈ ‘కౌన్సిల్’. డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజులపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసినప్పటికీ ఇరాన్ దాడులు ఆపడం లేదు. ఇరాన్ నుంచి వచ్చిన 5 బాలిస్టిక్ క్షిపణులను, 17 డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ ఇవాళ ప్రకటించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఫిలిప్పీన్స్ ‘జాతీయ శక్తి అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ ప్రకటన చేశారు. దేశీయ ఇంధన సరఫరాలు, ఎనర్జీ స్టెబిలిటీపై ఇరాన్ యుద్ధం వల్ల పడ్డ ప్రభావాన్ని ఆయన గుర్తు చేశారు.“పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో, దేశ ఎనర్జీ సరఫరా లభ్యత, స్థిరత్వానికి ప్రమాదం ఉండడంతో జాతీయ శక్తి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం,” అని ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులో తెలిపారు. President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open.— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026 -
13 ఏళ్ల పోరాటం : తనువు చాలించిన హరీష్ రాణా
న్యూఢిల్లీ: నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి (passive euthanasia) చట్టపరమైన ఆమోదం పొందిన భారతదేశంలోని తొలి వ్యక్తి హరీష్ రాణా కన్నుమూశారు. మంగళవారం (మార్చి 24) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. దీంతో హరీష్ మరణం దేశ వైద్య-చట్టపరమైన రంగంలో ఒక కీలక ఘట్టంగా మిగిలింది. మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గౌరవప్రదమైన రీతిలో ప్రాణాలు విడిచేలా వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ ర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయనకు అందిస్తున్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు. దీంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిగా ఉన్నప్పుడు, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలైన 31 ఏళ్ల హరీష్ రాణా, 2013 నుంచి కోమాలో ఉన్నారు. గత దశాబ్దానికి పైగా కృత్రిమ పోషణ, అడపాదడపా ఆక్సిజన్ సహాయంతో రాణా జీవించారు. నిపుణుల పర్యవేక్షణలోమార్చి 14న రానాను ఘాజియాబాద్లోని తన నివాసం నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్లోని పాలియేటివ్ కేర్ యూనిట్కు తరలించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో రానాకు అందుతున్న కృత్రిమ పోషకాహార మద్దతును (Artificial Nutritional Support) క్రమంగా ఉపసంహరించారు. న్యూరో సర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ నిపుణులు సహా, డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షించింది.ప్యాసివ్ యుథనేషియా అంటే ఏమిటి?కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ జీవన మద్దతును (వెంటీలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటివి) నిలిపివేయడం ద్వారా మరణం సంభవించేలా చేయడం. దీనిని సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతించింది. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ కృతజ్ఞతలు
తాడేపల్లి: రూరల్ డెవలప్ ట్రస్ట్(ఆర్డీటీ)కి ఎఫ్సీఆర్ఏ((ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పర్మిషన్లు రెన్యువల్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య ,వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్కు ఏడాదికాలం ఎందుకు పట్టిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు.చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్ జగన్. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి FCRA పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి, కేంద్ర హోంమంత్రి అమిత్షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల… pic.twitter.com/FFrb8rpPfO— YS Jagan Mohan Reddy (@ysjagan) March 24, 2026 ఇదీ చదవండి:ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం -
సాయి పల్లవి ఎంట్రీ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ఏక్ దిన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'నేను కోరుకున్నది నా కళ్లముందే ఉంది.. కొన్ని జీవితాలకు ఒక్క రోజే ఎక్కువ' అనే డైలాగ్స్ వింటుంటే పక్కా ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. Sometimes, One Day is enough. ❤️Oka Roju Trailer Out Now!Watch #OkaRoju only in theatres on 1st May 2026.#JunaidKhan #SaiPallavi pic.twitter.com/PVOBLDDRot— Aamir Khan Productions (@AKPPL_Official) March 24, 2026 -
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్ను యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్కు వెళ్లడం గానీ, ఆన్లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు! -
ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. అయితే ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న యూ టర్న్కు ముందు ఏం జరిగింది అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్ సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వార్కు బ్రేక్ ప్రకటించడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగిన ఒక రహస్య ట్రేడింగ్ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది?20 నిమిషాల్లో రూ. 840 కోట్ల లాభం: మిస్టరీ ట్రేడ్ఇరాన్ ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని ట్రంప్ ప్రకటనకు కేవలం 15 నిమిషాల ముందే మార్కెట్లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు సమాచారం. ఈచెయిన్ రియాక్షన్ కేవలం 20 నిమిషాల్లోనే సుమారు రూ. 840 కోట్ల లాభాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నారు.న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:20 గంటలకు). ఎవరో గుర్తుతెలియని వ్యక్తి/సంస్థ ఒక్కసారిగా రూ. 12,600 కోట్ల విలువైన S&P 500 ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దాదాపు రూ. 1,615 కోట్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.ట్రంప్ వార్ బ్రేక్ ప్రకటన రాగానే చమురు ధర భారీగా పడిపోయింది. అలాగే మార్కెట్ ప్రారంభానికి ముందే ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ 109 డాలర్ల నుండి 92 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దాదాపు 6 శాతం పడిపోయి, బ్యారెల్కు 88.70 డాలర్లను తాకింది.ఇరాన్పై దాడులు ఆగిపోవడంతో చమురు సరఫరాకు ఢోకా ఉండదని భావించిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 109 డాలర్ల నుండి 92 డాలర్లకు పడిపోయింది.ఫలితంగా కేవలం ఆయిల్ ధరల మార్పు వల్లే ఆ వ్యక్తికి 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు (100 మిలియన్ డార్లు) లాభం వచ్చింది. ఇక షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభం దీనికి అదనం.'అన్యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రకారం, ఈ ట్రేడ్లను నిర్వహించిన వారు రెండు సమన్వయ పందాలు వేశారు. మొదటిది ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాతో, వారు సుమారు రూ. 12,600 కోట్లు లేదా 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్&పి 500 ఫ్యూచర్స్ను కొనుగోలు చేశారు.రెండో బెట్ సరఫరా భయాలు తొలగిపోతే ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనాతో సుమారు రూ. 1,615 కోట్లు లేదా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ను విక్రయించారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో, దాదాపు 580 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 4,870 కోట్ల విలువైన 6,200 బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు చేతులు మారాయి. ఇది ఆ గంటలో ట్రేడ్ అవుతున్న మిగతా వాటి కంటే నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ.ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలుట్రంప్ నిర్ణయం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా, అంత భారీ మొత్తంలో (రూ. 14,000 కోట్లకు పైగా) పక్కా టైమింగ్తో పెట్టుబడి పెట్టడం చూస్తుంటే.. ప్రభుత్వ నిర్ణయం ముందే ఎవరికైనా తెలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తన 25 ఏళ్ల మార్కెట్ అనుభవంలో ఇలాంటి వింతైన ట్రేడింగ్ పద్ధతిని ఎప్పుడూ చూడలేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మాట్ విలియం ఎక్స్లో పేర్కొన్నారు. ఒక యూ.ఎస్. బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. కారణాన్ని నిరూపించడం సులభం కానప్పటికీ, ట్రంప్ పోస్ట్ వెలువడటానికి 15 నిమిషాల ముందు ఏం జరిగింది అనేదానిపై కచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.నికోలస్ మదురో అరెస్ట్కు ముందు కూడాఅలాగే గతంలో వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ విషయంలో కూడా ఇలాగే 'పాలీమార్కెట్'లో ముందే బెట్టింగ్ జరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు జనవరి నాటికి అమెరికా వెనిజులాపై దాడి చేస్తుందని సుమారు 34వేల డాలర్ల పందెం వేశారు. దీంతో వీరికి అంతర్గత సమాచారం అంది ఉంటుందనే అనుమానాలు ట్రేడర్లలో తలెత్తాయి.కాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ విచారణ జరిగితే దీని వెనుక ఎవరున్నారు అనేది నిగ్గు తేలే అవకాశం ఉంది. ఇదీ చదవండి : ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ -
RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్-2008 విజేత రాజస్తాన్ రాయల్స్ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.రూ. 15 వేల కోట్లకు సొంతం!జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్లో భాగమైనట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ రాజస్తాన్ రాయల్స్కు యజమానిగా ఉంది. రెడ్బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్, లాచ్లాన్ ముర్దోచ్ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బిల్ట్జర్ రాయల్స్ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.ఎవరీ కల్ సోమానీ?ఎడ్ టెక్, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్ సంస్థలు ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్ రాయల్స్లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
సీక్రెట్గా సింగర్ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.ఆరేళ్ల క్రితమే విడాకులు.. ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్లో పలు బ్లాక్బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్స్లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ జంటకి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈషాతో డేటింగ్.. విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.పెళ్లి ఫోటోలు వైరల్.. తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) -
బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా..
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్ ఆరోపించింది.ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అఫిడవిట్లో రాజీవ్ చంద్రశేఖర్ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. Dear @Ceokerala,BJP candidate from Nemom constituency, Rajeev Chandrasekhar, has not disclosed his residence, a 49,000 sq.ft mansion in Koramangala 3rd Block, Bengaluru, in his affidavit.This is a 1.07 acre property in one of the most expensive locations in the country, where… pic.twitter.com/pyyzD5Sft7— Congress Kerala (@INCKerala) March 23, 2026 -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరువు జిల్లా అనంతపురంలో మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజనాథ్, అలాగే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రెస్మీట్లో అనంతపురం జిల్లా నేతలు ఇంకా ఏమన్నారంటే..వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం: వెంకట్రామిరెడ్డికరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ చేసిన సేవలు అమూల్యం. అయితే 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ నిలిపివేయడంతో సంస్థ సేవలు నిలిచిపోయి జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. ఆర్డీటీ సంస్థ ప్రారంభించిన కళ్యాణదుర్గం నుంచి పోరాటం మొదలు పెట్టేందుకు మాజీ ఎంపీ రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.పాదయాత్రకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రధాన మంత్రికి నేరుగా వినతులు పంపడం, అలాగే కేంద్ర మంత్రి అమిత్షాను కలిసి వినతిపత్రం అందజేయడం వంటి చర్యలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ సమగ్ర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ ఆర్డీటీ సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, సహకరించిన ప్రజా సంఘాలు, జిల్లా ప్రజలకు అనంత వెంకట్రామిరెడ్డి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. క్రెడిట్ చోరీ కూటమి నేతలకు అలవాటుగా మారింది: శైలజనాథ్రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ లభించడం శుభపరిణామం. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దురదృష్టకరం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ వారికి అలవాటైందని చర్చించుకుంటున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాసంఘాలు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసింది. కానీ కూటమి నేతలు ఒక్క నిరసన కూడా చేపట్టలేదు. 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏను నిలిపివేసినప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నది కూటమి నేతలు మరచిపోయారు. ఏడాది పాటు నిధులు లేక ఆర్డీటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సేవా కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చాంవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించాలని తలారి రంగయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, లక్ష పోస్టుకార్డుల ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు వంటి కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది ప్రజల పోరాట ఫలితం. కూటమి నేతలు ఎలాంటి పోరాటం చేయకపోయినా తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడటం విడ్డూరం. ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి భవిష్యత్తులో ఇలాంటి అవరోధాలు కలగకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సాకె శైలజనాథ్ స్పష్టం చేశారు.వైఎస్ జగన్ ఆశీస్సులు..ప్రజల మద్దతుతో విజయం: తలారి రంగయ్యరూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) 1969 నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 2025 మే 17న బైక్ ర్యాలీ, జూన్లో 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ ఆశీస్సులతో పోరాటాన్ని కొనసాగించి విజయం సాధించాం. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్ష పోస్టుకార్డుల కార్యక్రమం నిర్వహించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు పార్లమెంట్లో పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టాం. 10 నెలల నిరంతర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం.ఈ విజయాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణిస్తూ, శాంతియుత, గాంధేయ మార్గంలో సాధించిన ఫలితమని తలారి రంగయ్య పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?
చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్లోనూ గందరగోళం నెలకొంది. అఫ్గనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2026 నిర్వహణ విషయంలో బోర్డు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది.ప్రేక్షకులు లేకుండానే..ఆరంభ మ్యాచ్లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించమని.. కరాచీ, లాహోర్లలో మాత్రమే మ్యాచ్లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ భద్రతా ముప్పు ఉందని భావిస్తే PSLలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని అమినుల్ వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు PSLలో పాల్గొనేందుకు NOCలు జారీ చేసినట్లు సమాచారం.బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఈ విషయం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్బజ్తో మాట్లాడారు. ‘‘విదేశాంగ శాఖతో మేము చర్చలు జరిపాము. ఇస్లామాబాద్లో ఉన్న మా హై కమిషన్ను కూడా సంప్రదించాము. వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే PSLలో ఆడేందుకు మా ఆటగాళ్లకు అనుమతి ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.కాగా మరోసారి ఐపీఎల్కు పోటీగా పాక్ బోర్డు PSLను నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 26న తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఇక బంగ్లాదేశ్కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ తదితరులు ఈ సీజన్లో భాగం కానున్నారు.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
ఆర్సీబీకి భారీ షాక్.. ఆరంభ మ్యాచ్లకు స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్-2026 సీజన్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గాయాల బెడద వెంటాడుతోంది. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ జోష్ హాజిల్వుడ్, శ్రీలంక పేసర్ నువాన్ తుషారలు ఇంకా జట్టుతో చేరలేదు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న నువాన్ తుషారకు ఒకట్రెండు రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహరించనుంది.ఒకవేళ అందులో అతడు పాసైతే లంక క్రికెట్ బోర్డు ఎన్వోసీ జారీ చేయనుంది. అతడు దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే మోకాలి గాయంతో బాధపడుతున్న హాజిల్వుడ్ మాత్రం కోలుకోవడానిని మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు హేజిల్వుడ్ అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ ధ్రువీకరించారు."జోష్ హేజిల్వుడ్ గాయాల కారణంగా ఇటీవల పోటీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. అతడు ప్రస్తుతం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అతడి ఫిట్నెస్పై సీఏ వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే భారత్కు వచ్చేందుకు అనుమతి లభిస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియాతో మేము నిరంతరం టచ్లో ఉన్నాము.అయితే మా జట్టులో అభినందన్, రషిక్ ధార్ వంటి అద్భుతమైన డొమాస్టిక్ బౌలర్లు ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ వంటి అనుభవం ఉన్న బౌలర్లు కూడా ఉన్నారు" అని బోబాట్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ముంబై తుది జట్టు ఇదే.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్? -
అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్..!
కేకు కావచ్చు.. పూతరేకు కావచ్చు.. కాదేదీ కళకు అనర్హం అంటున్నారు ఆధునిక చెఫ్స్. తినిపించడానికి ముందు కనిపించే విధానంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. నోరూరించే రుచులను చూడగానే ఆకట్టుకునే కళా నైపుణ్యాన్ని అద్దుతున్నారు. అదే విధంగా తాను సృష్టించిన పేస్ట్రీలకు అచ్చమైన పండ్ల రూపాలను అందిస్తూ అంతర్జాతీయంగా వైరల్ అయ్యాడు పారిస్కు చెందిన ఓ ప్రముఖ చెఫ్. ఇప్పుడు ఆయన సృష్టించిన పండ్ల తరహా డిజర్ట్స్ భాగ్య నగరానికి కూడా వచ్చేయడం విశేషం. సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. దుబాయ్లోని కునాఫా చాక్లెట్ నుంచి టోక్యోలోని మెత్తటి పాన్కేక్స్ వరకు ఖండాలను దాటి తరలివస్తున్న ఆహార ధోరణులను మనం నగరంలోనూ చూడగలుగుతున్నాం. ఇదే క్రమంలో సిటీకి వచ్చేసింది పారిస్ డిజర్ట్. పండ్ల ఆకారాన్ని పోలిన ఇవి చూసేందుకు కూడా పండ్లలా కనిపిస్తాయి. పేస్ట్రీ కళలోని నైపుణ్యాన్ని మనసుకు హత్తుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాషన్ క్యాపిటల్ నుంచి.. పారిస్ అనగానే ఫ్యాషన్ ప్రియుల కలల చిరునామా అని తెలిసిందే. మన డిజైనర్లకు అక్కడ ప్రదర్శనలో పాల్గొనడం అంటే జీవితకాలపు కల సాకారం కావడమే. అలాంటి వస్త్రశైలి గురించి మాత్రమే చర్చలు చేసే సిటీ.. తొలిసారి అక్కడి డిజర్ట్స్ గురించి కూడా మాట్లాడుతోంది. దీనికి కారణం అక్కడి ప్రసిద్ధ పేస్ట్రీ మేకింగ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ సృష్టించిన పండ్ల ఆకారపు స్వీట్లు.ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.డిజర్ట్ ట్రెండ్.. నిమ్మకాయలు, ఆపిల్, స్ట్రాబెర్రీ, పీచెస్.. ఇలా అనేక రకాల పండ్ల రూపాలకు ప్రతి సృష్టి చేస్తున్నారు. అచ్చం ఆయా ఫలాలను పోలిన రూపంలో సృష్టించిన డిజర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ప్రత్యేకంగా మారడానికి కారణం నిజమైన పండ్లలా అనిపించే వాటి రూపం మాత్రమే కాదు, రుచి కూడా. ఈ డిజర్ట్స్లో మూస్, కంపోట్, స్పాంజ్, చాక్లెట్ పొరలు రుచికరమైన ఆకృతులను సమతుల్యం చేశాయి. తద్వారా ఆధునిక పేస్ట్రీ వైవిధ్యానికి అంతర్జాతీయ చిహ్నంగా ఇవి మారాయి.నగరానికి వచ్చేశాయ్.. అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకున్న ఈ పండ్ల ఆకారపు డిజర్ట్స్ ఇప్పుడు నగరంలోనూ సందడి చేస్తున్నాయి. బహుళ పొరలను ప్రదర్శించే ఈ స్వీట్ శిల్పాలను తెలంగాణ రాష్ట్రం బంజారాహిల్స్లోని నోమ్ కేఫ్ వంటి పేరున్న కేఫ్స్ అందిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా పర్షియన్ చెఫ్లను సైతం తీసుకొస్తున్నారు. ఈ ఫ్రూట్ డిజర్ట్స్ మెనూలో రాస్బెర్రీ, ఆర్కిటిక్ బ్లిస్ బెర్రీ, హాజెల్నట్, గ్రీన్ ఆపిల్, కొబ్బరి, బొప్పాయి, క్రౌన్ పియర్ వంటి రుచులు నగరంలో కొలువుదీరాయి. View this post on Instagram A post shared by Arts Terra (@arts_terra)(చదవండి: అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాయ్..! కానీ 17 కిలోమీటర్లు..) -
ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్లోని ఒక హై-రైజ్ సొసైటీలో 42 ఏళ్ల జ్యోతిష్కుడు రాజ్వీర్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. జ్యోతిష్కుడిగా ఉంటూ ఇతరుల జాతకాలు చెప్పే వ్యక్తి, అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజ్వీర్ 13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్వీర్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా గ్రౌండ్ ఫ్లోర్లోని ఫ్లాట్లో దుప్పటిలో చుట్టి ఉన్న అతని 70 ఏళ్ల తల్లి సత్నాం మృతదేహం కనిపించింది. బాడీమీద ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య అనేకోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. కనీసం రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాతే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.అమ్మతో పాటే నేనుతల్లి చనిపోతే తాను కూడా చనిపోతానని రాజ్వీర్ గతంలో సన్నిహితులతో చెప్పేవాడని సమాచారం. తల్లి మృతదేహంతో రెండు రోజులు గడిపిన తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. లక్షల అప్పు, భార్యతో విభేదాలురాజ్వీర్కు సుమారు 15 - 16 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగు నెలలుగా అతను ఇంటి ఖర్చులకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదని అతని భార్య తెలిపింది.ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రాజ్వీర్ తన మొబైల్ ఫోన్ లాక్ కోడ్ను భార్యకు మెసేజ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్ను తనిఖీ చేయగా, హర్యానాకు చెందిన ఒక మహిళతో అతను ప్రేమలో ఉన్నాడని, తనకు విడాకులు అయ్యాయని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిసింది. రాజ్వీర్ తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. పొరుగువారితో పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర నిరాశకు లోనైన అతను కఠిన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. -
రేపు అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రేపు(మార్చి 25, బుధవారం) అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
