May 29th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections 2024: May 29th Political Updates In Telugu | Sakshi
Sakshi News home page

May 29th AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Wed, May 29 2024 7:04 AM | Last Updated on Wed, May 29 2024 4:54 PM

AP Elections 2024: May 29th Political Updates In Telugu

May 29th AP Elections 2024 News Political Updates..

4:54 PM, May 29th, 2024
సీఈఓ మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు
  • ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు
  • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం
  • అటెస్టేషన్‌ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం
  • ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉంది
  • సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి

2:24 PM, May 29th, 2024

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న విశాఖ పోలీసులు..!

  • విశాఖపట్నం..
  • సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో విశాఖ నార్త్‌ను చేర్చిన పోలీసులు.
  • గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ వైఎ‍స్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లతో పాటు పార్టీ కీలక నేతలందరినీ పోలీస్ సమన్లు.
  • కౌంటింగ్ రోజు బయటకు రాకూడదంటూ హెచ్చరిక.
  • సుమారు 30 మందికి పైగా బైండోవర్‌
  • కౌంటింగ్ ఏజెంట్లకు కూడా నోటీసులు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కేకే రాజు..
  • వైఎస్సార​్‌సీపీ నేతల టార్గెట్‌గా ఈసీ వ్యవహారిస్తుందంటు కేకే రాజు ఆరోపణ.
     

 

2:00 PM, May 29th, 2024
ప్రత్యర్థి ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

  • వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్లకు వర్క్‌షాప్‌ కార్యక్రమం
  • ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
  • సజ్జల కామెంట్స్‌..
  • ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి.  
  • ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి.
  • కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది.
  • జూన్‌ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది.
  • అందులో ఎలాంటి అనుమానం లేదు

 

1:30 PM, May 29th, 2024
కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు..

  • ఏపీ సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
  • ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఫిర్యాదు చేసిన ఎంపీ నిరంజన్ రెడ్డి
  • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న వైఎస్సార్‌సీపీ
  • ఇది ఈసీఐ నిబంధనలకు విరుద్ధం
  • ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు
  • సీఈఓ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చెయ్యాలని కోరిన వైఎస్సార్‌సీపీ

 

10:20 AM, May 29th, 2024
ఈసీకి పేర్ని ప్రశ్నల వర్షం..

  • పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..
  • ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై పేర్ని నాని కామెంట్స్‌..
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ రాష్ట్రంలోని ఆర్వోలు అందరికీ ఆదేశాలు జారీ చేశారు.
  • వీటిపై వైఎస్సార్‌సీపీ తరపున మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం.
  • దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని వెసులు బాట్లు ఏపీలో ఎందుకు?

 

 

9:30 AM, May 29th, 2024
హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు..

  • పోలింగ్‌ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు
  • నేడు హైదరాబాద్‌కు చేరిన బాబు.
  • అమెరికా నుంచి వచ్చినట్టు పచ్చ బ్యాచ్‌ లీక్‌లు. 
  • కానీ, చంద్రబాబు మాత్రం మౌనం.

8:20 AM, May 29th, 2024
నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు

  • ఎన్నికల పోలింగ్‌ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.
  • నేడు తిరిగి హైదరాబాద్‌కు రానున్న చంద్రబాబు
  • ఇన్నాళ్లు ఎక్కడున్నారో చెప్పని బాబు. 
     

7:30 AM, May 29th, 2024
అల్లర్లకు ప్లాన్‌ చేస్తున్నా టీడీపీ..

  • మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్‌..
  • కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!
  • పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు
  • అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘం
  • చివరకు ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరు
  • ఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన మేరుగు నాగార్జున
     

 

 


ఆగని ‘సంక్షేమం’

  • రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత కూడా ఆగని ‘చేయూత’
  • లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బుల జమ 
  • పోలింగ్‌ అనంతరం 18న రూ. 1,513 కోట్లు
  • 24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు
  • 20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 629 కోట్లు
  • ఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు

 

6:50 AM, May 29th, 2024
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!

  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదంపై గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు

  • దేశవ్యాప్తంగా అవే అమలు కూడా..

  • కానీ, డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ అధికారి స్టాంప్‌ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి

  • ఆ మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు

  • అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలు

  • ఇది పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు.. శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళన

  • రాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత ‘పచ్చ’పాతంపై విస్మయం

     

6:40 AM, May 29th, 2024
ఈసీ అంపైర్‌లా లేదు

  • దానికి చంద్రబాబు వైరస్‌ సోకింది.. వారంలో టీడీపీ పీడ విరగడ

  • అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే

  • గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

  • వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక

  • సీఈసీ మార్గదర్శకాలు దేశమంతా ఒకేలా ఉండాలి..

  • పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించేందుకు బాబు కుట్ర

  • అందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డికి మాచర్ల టికెట్‌

  • చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయం

  • గోబెల్స్‌ ప్రచారం చేసి.. వ్యక్తిత్వహననంతో అధికారులను లొంగదీసుకునే యత్నం

  • అందులో భాగమే సీఎస్‌పై అభూతకల్పనలతో కథనాలు    

 

6:30 AM, May 29th, 2024
కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం 

  • ఫలితాలు వెలువడే వరకు ఏమరుపాటు పనికిరాదు
  • అనుమానాలు నివృత్తి చేసుకోవాలి.. 
  • కౌంటింగ్‌ ఏజెంట్ల జాబితా 31లోగా అందివ్వాలి 
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement