breaking news
Pawan Kalyan
-
అసెంబ్లీలో వైఎస్ జగన్, చిరంజీవిపై బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్యలు
-
OG: ఆహా ఓహో అన్నా... చివరకి లేదుగా సాహో రేంజీ...
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు. ఇక పవన్ ఫ్యాన్స్ తమ హడావిడికి హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోయారు. వెయ్యి కోట్ల దాకా కలెక్షన్లు వచ్చేస్తాయంటూ పుష్ప రికార్డులు కూడా బద్దలైపోతాయంటూ ఊహాగానాలు చేసేశారు. అభిమానుల ఆశలు ఆకాంక్షలు అర్ధం చేసుకోదగినవే కానీ...పాపం వారి ఆశల్ని వమ్ము చేస్తూ ఓజీ నాలుగు రోజుల్లోనే నీరుగారిపోయింది(OG Box Office Collection). నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతుంటే...ఇందులో షుమారుగా ఓవర్సీస్ 50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు పైగా. కానీ తమిళ, హిందీ, కన్నడ పరిస్థితి ఏమిటి? తెలుగు వాళ్లున్న చోట్ల తప్ప వేరే భాషా ప్రేక్షకులు ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఓజీని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హిందీ మార్కెట్లో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది 2 కోట్లలోపే.. ఇక కన్నడిగులు అయితే మరీ కరివేపాకులా తీసి పారేశారు. నాలుగు రోజుల్లో నాలుగైదు లక్షలు దాటలేదు. దాంతో అక్కడ సినిమా అప్పుడే కనుమరుగైంది తమిళనాడు పరిస్థితి చూస్తే...నాలుగు రోజుల్లో 76 లక్షలు మాత్రమే గ్రాస్. తెలుగు వారున్న ప్రతీ చోటా బెనిఫిట్ షోల రూపంలో ఇష్టా రాజ్యంగా అభిమానుల్ని దోచుకోవడం, తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లలో టిక్కెట్ల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం... ఇవన్నీ కలిపితేనే ఆ మాత్రమైనా కలెక్షన్లు. అది కూడా ప్రకటిస్తున్న కలెక్షన్లలో ఎంత వరకూ నిజమో పబ్లిసిటీ స్టంటో తెలీదు.మొత్తం మీద విపరీతమైన అంచనాలతో వచ్చిన పవన్ 2 సినిమాలూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. హరిహర వీరమల్లు డిజాస్టర్గా నిలిస్తే... ఓజీ కలెక్షన్లు కూడా పాన్ ఇండియా రేంజిలో లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరచింది. పవన్ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన మిగిలిన టాలీవుడ్ హీరోలు ఇప్పటికే గ్లోబల్ స్టార్లుగా రూ.వేల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బోలెడంత ఫాలోయింగ్ ఉన్నట్టు చెప్పుకుంటున్న పవన్(Pawan Kalyan) మాత్రం పాన్ ఇండియా ఇమేజ్కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని ఓజీ సినిమా కుండబద్ధలు కొట్టినట్టు నిరూపించింది. పైగా ఇమ్రాన్ హష్మీ లాంటి బాలీవుడ్ స్టార్ ను ప్రధాన విలన్గా పెట్టుకున్నా అక్కడి ప్రేక్షకులు కన్నెత్తి కూడా ఓజీని చూడలేదంటే... ఇక చెప్పేదేముంది? కొసమెరుపు ఏమిటంటే... ఓజీ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలోనే వచ్చిన ప్రభాస్ సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే... వసూళ్లు మాత్రం రూ.250 కోట్లు దాటేశాయి. ఇందులో నార్త్ ఇండియా కలెక్షన్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. దీనిని బట్టి పవన్ లేదా ఆయనతో సినిమా తీసేవారు తెలుసుకోవాల్సిన చేదు వాస్తవం ఏమిటంటే... హీరోలు మెప్పించాల్సింది అభిమానుల్ని మాత్రమే కాదు. -
చిరంజీవి సీరియస్ బాబు, పవన్కు చెంప చెల్లు
-
పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!
పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణలో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ జీవో రిలీజ్ చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఓజీ టికెట్ రేట్స్ పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత.. జరిగిన పరిణామాలను పోలీస్ శాఖ తన జీవోలో ప్రస్తావించింది. అంతకుముందు ప్రీమియర్ షోలతో పాటు అక్టోబరు 4 వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.టికెట్ రేట్లపై పిటిషన్ఓజీ టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా టికెట్ రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ఈ నెల 26 వరకు స్టే విధించింది. రివ్యూ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
Venkat Reddy: నాకు ప్రాణహాని ఉంది కర్రలు, కత్తులతో... టీడీపీ నేతలు దాడులు
-
బాబు కుట్రలు.. పవన్ డ్రామాలు..! బట్టబయలు చేసిన చిరు
-
మీ అన్నను తిట్టినా సిగ్గు లేదా? నాగబాబు, పవన్ పై ఫైర్
-
అన్నకు తమ్ముళ్ల వెన్నుపోటు..!
-
అన్నని తిడితే మీకు సిగ్గులేదా..? పవన్, నాగబాబుకు గుడివాడ కౌంటర్
-
మెగాస్టార్కు ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ తమ రాజకీయ డ్రామాలో భాగంగానే ఆదివారం హైదరాబాద్లో ఇరువురూ కలుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో దానిని కవర్ చేసుకునేందుకు, రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్లోని పవన్కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబుగానీ, జనసేన ఎమ్మెల్యేలుగానీ కనీసం స్పందించలేదు. పవన్కళ్యాణ్ అయితే.. చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటివరకూ నోరువిప్పకపోగా ఆదివారం తన ఇంటికొచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛంతో ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు, కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. ఈ ఏడాది రెండు, మూడుసార్లు పవన్ అనారోగ్యానికి గురైనప్పటికీ అప్పుడెప్పుడూ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించని చంద్రబాబు ఈసారి హైదరాబాద్కు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించడాన్ని చూస్తుంటే ఇదంతా రాజకీయ డ్రామానేనని వారు ఆరోపిస్తున్నారు. పైగా.. పవన్కళ్యాణ్ గతంలో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమయంలో.. చంద్రబాబు ఓ అధికారిక సమావేశంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్తో పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. తాను పలకరిద్దామని ఫోన్చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని బాబు అప్పట్లో వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను చిరు అభిమానులు, కాపు నేతలు గుర్తుచేస్తున్నారు. పవన్పై చిరు అభిమానులు, కాపు వర్గీయుల్లో అసంతృప్తి.. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ వ్యాఖ్యల ఎపిసోడ్లో పవన్కళ్యాణ్ వ్యవహారశైలిపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా పవన్కళ్యాణ్ ఆయనకు ఏదో విధంగా అండగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఆ వర్గీయుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే.. బాలకృష్ణ కామెంట్లపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారుగానీ పవన్కళ్యాణ్ ఇప్పటివరకు ఈ అంశంపై కనీసం నోరువిప్పలేదని.. ఇది పరోక్షంగా బాబుకు మేలు చేయడమేనని వారు గుర్తుచేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నందున పవన్కళ్యాణ్ స్పందించలేదని అనుకున్నా.. డీఎస్సీ నియామకాల అంశంలో లోకేశ్ను అభినందిస్తూ పవన్ ప్రకటన జారీచేశారు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా విచారం వ్యక్తంచేశారు. కానీ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల అంశంలో మౌనం దాల్చడంపై ఆ వర్గీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎమ్మెల్సీ కాకముందు వరకు చిరంజీవిపై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడే నాగబాబు కూడా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాక ఆయన కూడా తన నోటికి తాళాలు వేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. పవన్ త్వరగా కోలుకోవాలని.. ఇక పవన్ నివాసానికి చంద్రబాబు రాకపై జనసేన పార్టీ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు పరామర్శించారని పేర్కొంది. ఈ సందర్భంగా.. మెగా డీఎస్సీ నియామకాలపైనా, అక్టోబరు 16న ప్రధాని రాష్ట్ర పర్యటనపైన, 4న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిపింది. టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే.. బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే చంద్రబాబు పవన్కళ్యాణ్ను పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్కళ్యాణ్ ఇందుకు తనవంతుగా బాబుకు తోడ్పాటు అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే, చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజికవర్గంలో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని వారంటున్నారు. -
నీకు జ్వరం వస్తే హైదరాబాద్ పోతావ్.. మరి పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే..
-
రోషం లేదా పవన్! సొంత అన్నను తిడితే మౌనమా? నువ్వు OG కాదు SG..
-
చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించని పవన్
-
మౌనం వీడలేదు.. నోరు పెగల్లేదు సైలెన్స్.. గంభీరా!
సాక్షి, అమరావతి: చిరంజీవిని ‘ఎవడు’ అంటూ పూచికపుల్లలా తీసివేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగాస్టార్ అభిమానులు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఓ వైపు బాలకృష్ణపై మండిపడుతూనే.. పవన్కళ్యాణ్ సైతం తన సొంత సోదరుడిని దారుణంగా అవమానించి 48 గంటలు గడిచిపోయినా నోరు విప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవే స్వయంగా స్పందించి బాలయ్య వ్యాఖ్యలను ఖండించినా పవన్ మాత్రం కిమ్మనకపోవడం ఏమిటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ కూడా గురువారం నిర్వహించిన డీఎస్సీ సభకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ ప్రకటన జారీ చేసిన పవన్కళ్యాణ్... బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి మౌనం పాటించడాన్ని తప్పుబడుతున్నాయి. ఆ విష ప్రచారాన్ని ఖండించిన ‘చిరు’.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసినప్పుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తే.. ఎన్నికల ముందు కూటమి నేతలు పవన్తో జతకట్టి దు్రష్పచారం చేయటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా చిరంజీవే ఖండించటాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని, అనంతరం కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తామంతా చర్చించామని చిరంజీవి అందులో స్పష్టం చేశారు. ఆ సమావేశం కారణంగానే నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టిక్కెట్ రేట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టారే స్వయంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎన్నికల ముందు పవన్కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ నేతలు వైస్ జగన్పై చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని తేటతెల్లమైందని చిరంజీవి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు అంత దు్రష్పచారం చేయగా.. ఇప్పుడు బాలకృష్ణ నేరుగానే చిరంజీవిని కించపరిచినా పవన్కళ్యాణ్ కనీసం ఖండించకపోవడాన్ని చిరంజీవి అభిమాన సంఘాలు, కాపు సామాజిక సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.రాజకీయాల కోసం కుటుంబ గౌరవం తాకట్టా?గతంలో తన తల్లిని అవమానించేలా నారా లోకేశ్ పోస్టులు పెట్టించారని స్వయంగా విమర్శలు చేసిన పవన్కళ్యాణ్.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ‘ఎవడు’ అంటూ తన సోదరుడు చిరంజీవిపై బాలకృష్ణ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదంటే చంద్రబాబు అంటే భయమా లేక నెల నెలా అందే ప్యాకేజీయే కారణమా.. అని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు కుటుంబానికి దాసోహమవడం కారణంగా మెగాస్టార్ కుటుంబం ఇలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చిరంజీవి అభిమానులు, కాపు సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. పవన్కళ్యాణ్ తీరు చూస్తుంటే కుటుంబం, జనసేన ప్రయోజనాల కన్నా చంద్రబాబు, లోకేశ్ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో సభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడాన్ని చిరంజీవి అభిమానులు, కాపు సంఘం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ ‘మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు’ అని వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక తాజాగా చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎమ్మెల్సీ పొందినంత మాత్రన ప్రస్తుతం నాగబాబు ఇంతలా దిగజారాలా అనే వ్యాఖ్యలు చిరంజీవి అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. చిరంజీవి ఏంది..? మా బ్లడ్ వేరు..! బాలకృష్ట గతంలోనూ పలు సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై పలు పోస్టులు పెడుతున్నారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘రాజకీయాల్లో విజయం సాధించడం ఒక్క రామారావు వల్లే అయింది. చిరంజీవి ఏంది...? మేం వేరు... మా బ్లడ్ వేరు... మా బ్రీడ్ వేరు... సస్టెయిన్బులిటీ ఉంది మాకు..!’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో సందర్భంలో ‘సంకరజాతి..’ ‘అలగా జనం..’ అంటూ బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. ఇవన్నీ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించినవేనని బాలకృష్ణపై మండిపడుతున్నారు. -
ఓజీ.. ఏ క్యా జీ!
సండే కదా.. ఓజీ సినిమాకి పోదామని అరవింద్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేద్దామనుకున్నాడు. తీరా చూసి నోరెళ్లబెట్టాడు. అంతకు రెండ్రోజుల క్రితమే ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపును హైకోర్టు కొట్టేసిందని విన్న అతనికి ఆ ధరలు చూస్తే ఏమీ అర్థం కాలేదు. నిజంగానే హైకోర్టు తగ్గింపు ఉత్తర్వులిచ్చిందా? లేక థియేటర్లు అమలు చేయడం లేదా? అనే డైలమాలో పడ్డాడు. సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ టికెట్ల ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు శుక్రవారం కొట్టివేసినా, పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారు. శనివారం టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్లో ప్రయతి్నస్తే పెంచిన ధరలే కనిపించాయని పలువురు వాపోయారు. హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోని థియేటర్లలో ఈ వ్యత్యాసం కనిపించిందని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ వరకు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిష¯న్ దాఖలు చేశారు.ఈ పిటిష¯న్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. టికెట్ ధరల పెంపు మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ హైకోర్టులో అప్పీల్ చేయగా, విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. 26న విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరింది. ‘ఓజీ’చిత్రానికి ఎలాంటి ఉపశమన ఆదేశాలు జారీ చేయలేమని శుక్రవారం విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నెల 24 ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ.. అక్టోబర్ 9కి విచారణ వాయిదా వేశారు. అయినా పెంచిన ధరలనే థియేటర్లు వసూలు చేస్తున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం..ఓజీ చిత్ర టికెట్ ధరల పెంపు మెమోను ప్రభుత్వం నిలిపివేసినా సోషల్ మీడియాలో తీర్పునకు వక్రభాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా టికెట్ ధరలను తగ్గించడం లేదు. తప్పుడు సందేశాలు, పెంచిన టికెట్ ధరలు వసూలు చేయడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. – బర్ల మల్లేశ్, న్యాయవాది -
ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు -
అన్నకు అవమానం.. పట్టించుకోని పవన్?
-
తెలంగాణలో OG టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్
-
హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి మరోసారి షాక్!
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది. -
టికెట్ రేట్ ఎఫెక్ట్ OG కలెక్షన్స్ ఎంతంటే..?
-
మెగా బ్రదర్స్ ఏమయ్యారు?
ఏపీ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు రాష్ట్రంలో.. ఇంకా చెప్పాలంటే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో చర్చకు తెర లేపాయి. చిరంజీవిని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమాత్రం గౌరవించలేదని.. సినీ పరిశ్రమ సమస్యలను కష్టాలను వైఎస్ జగన్ పట్టించుకోలేదని ఇంకా ఏవేవో మాట్లాడుతూ చిరంజీవి తన స్థాయి దిగి మరి వైఎస్ జగన్ వద్ద మోకరిల్లారు అన్నట్లుగా బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి వివాదాలకు విద్వేషాలకు నిప్పు రాజేస్తుంటారు. ఈ అంశంపై నిన్ననే మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని విందుకు ఆహ్వానించి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూలకుషంగా విని వాటి పరిష్కారానికి తోడ్పాటును అందించారు అంటూ ఓ లేఖ విడుదల చేశారు. వాస్తవానికి చట్ట సభలో లేని వ్యక్తుల గురించి సభలో మాట్లాడకూడదు అన్నది నిబంధన. కానీ బాలకృష్ణ నోటి దురుసు, అహంకారంతో చిరంజీవిని మెగాస్టార్ అభిమానులు అందరిని గాయపరిచేలా నోటికి వచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నప్పటికీ చిరంజీవి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరు చట్టసభలో సభ్యులు అయినప్పటికీ ఎవరు దానిపై ఏమాత్రం స్పందించకపోవడం వారి బానిసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని కాపు సామాజిక వర్గం నుంచి ఆవేదన వెల్లువెత్తుతుంది. తన అన్నను ఎందుకు పనికిరాని వాడిగా బాలకృష్ణ కామెంట్ చేసినా... పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరూ వినీ వినట్లు ఊరుకున్నారు. వాస్తవానికి గతంలో కూడా మెగాస్టార్ అభిమానులందరినీ బాలకృష్ణ అలగా జనం అంటూ కామెంట్ చేశారు.. దీనిపై కూడా అప్పట్లో మెగా ఫ్యాన్స్ స్పందించారు తప్పితే మెగా బ్రదర్స్ ఎవరు? కనీసం తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతూ తన తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలుస్తానా అంటూ ప్రజలనే ప్రశ్నించారు. కానీ మళ్లీ అదే పార్టీతో చేతులు కలిపి ఇంకో 15 ఏళ్లపాటు తెలుగుదేశంతో పొత్తులో ఉంటాను అని ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ అసమర్థతను వ్యక్తం చేస్తుందని మెగా ఫ్యాన్స్ లోలోన ఆవేదన చెందుతున్నారు.తమ కుటుంబ పెద్ద అయినా మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలకృష్ణ చేసిన లేకి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాగబాబులను కనీసం కదిలించకపోవడం వారి దౌర్భాగ్యాన్ని సూచిస్తుందని కాపు యువతతో పాటు మెగా అభిమానులు సైతం లోలోన బాధపడుతున్నారు. ఇంత గోల జరుగుతున్న నాగబాబు కనీసం మాట్లాడకపోగా బిగ్ బాస్.. ఆట వంటి టీవీ కార్యక్రమాల గురించి కామెంట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని.. నాగబాబుకు పవన్ కళ్యాణ్కు ఈ పదవులు ఆటవిడుపు లాంటివి అనే భావన కలిగిస్తున్నారని ఫ్యాన్స్ లో వినిపిస్తోంది.రాజకీయంగా పదవులు వస్తే చాలు.. ప్రోటోకాల్ ఇతర సౌకర్యాలు వస్తే చాలు అనుకొని ఇద్దరు అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పెద్దన్నయ్య చిరంజీవికి చట్టసభలో బాలకృష్ణ చేసిన అవమానం గురించి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం వారి రాజకీయ అవకాశవాదానికి నిర్వచనం అన్నట్లుగా అభిమానులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు నేతలు భావిస్తున్నారు. బాలకృష్ణకు మొదటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు.. చిరంజీవి కుటుంబం అంటే చిన్న చూపు ఉన్నది. పలు సందర్భాల్లో బాలకృష్ణ తన దుగ్ధను .. అహంకారాన్ని బయటకు వెలిబుచ్చారు. ఈసారి ఏకంగా చట్టసభలోనే బాలకృష్ణ అలా మాట్లాడడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తుంది. కానీ దీనిపై మెగా కుటుంబం నుంచి కనీసం స్పందన రాకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. సిమ్మాదిరప్పన్నబాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్కు పవన్! -
వైద్యం కోసం హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ ప్రయాణం
-
బాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్కు పవన్!
హైదరాబాద్, సాక్షి: ఏపీ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On Chiru) తీవ్ర అలజడి రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలవడాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీలో బాలయ్య అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇటు వైఎస్సార్సీపీ, అటు మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై టీడీపీ ఏమో మౌనంగా ఉండిపోయింది. చిరుపై ‘ఎవడు’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్ర అభ్యంతరాలు(Chiru Fans Fire On Balayya) వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గతంలోనూ చిరును ఉద్దేశించి ఈ తరహాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు క్షమాపణలు చెప్పకపోతే ప్రజా క్షేత్రంలో నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో జనసేన స్పందించకపోవడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కలకలం వేళ.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) హైదరాబాద్కు వస్తుండడం చర్చనీయామైంది. అయితే ఆయన కేవలం వైద్యం కోసమే వస్తున్నట్లు ఆయన సిబ్బంది స్పష్టం చేసింది. తీవ్ర జ్వరంతో, దగ్గుతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ సభలో లేనిది చూసి కామినేని ఈ అంశం ప్రస్తావించడం.. దానికి బాలయ్య దురుసుగా మాట్లాడడం.. ఆ టైంలో స్పీకర్ స్థానంలో ఉండి కూడా రఘురామ కృష్ణంరాజు ఉండి కూడా వారించకపోగా నవ్వుతూ చూస్తూ ఉండిపోవడం.. వీటన్నింటిని నాటకీయ పరిణామాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అప్పటికే సభలో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారని, అయినా కూడా వాళ్ల నుంచి కనీస స్పందన లేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన పెద్దన్నయ్య చిరు తనకు తండ్రితో సమానం అంటూ పవన్(Pawan About Chiru) తరచూ చెబుతూ వస్తుంటారు. తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. తర్వాత అదే టీడీపీతో పొత్తులో ఉండిపోయారు. కానీ గతంలో ఎవరైనా చిరును ఒక్క మాట అన్నా ఊరుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు బాలయ్య చిరుపై నోరు జారారు. మరి ఈ వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలంటూ సినీ, రాజకీయ వర్గాలు కుతుహలంగా ఎదురు చూస్తున్నాయి(Will Pawan Reacts Balayya Comments).ఇదీ చదవండి: బాలయ్య వ్యాఖ్యలను తోసిపుచ్చిన చిరంజీవి -
‘విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ.. ఆయనే పెద్ద సైకో’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెగా అభిమానులు కూడా బాలయ్యను టార్గెట్ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ. మందు తాగి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. చిరంజీవి తనతో సమానమని బాలకృష్ణ అనుకుంటారు. చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ పనికిరారు. స్వశక్తితో చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన రోజే బాలకృష్ణ చచ్చిపోయారు. బాలకృష్ణను కాల్పుల ఘటనలో కాపాడింది వైఎస్సార్. బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచమని ఆదేశాలు ఇచ్చింది వైఎస్ జగన్. విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. చిరంజీవి ప్రకటన ద్వారా బాలకృష్ణ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చిరంజీవి దంపతులను వైఎస్ జగన్ దంపతులు ఎంతో గౌరవించారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్ జిల్లా...మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో బాలకృష్ణ జులాయిగా వ్యవహరించాడు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైఎస్సార్ మరిచిపోయావా?. వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపంలో తెలిపారు. నాడు వైఎస్ జగన్ చిరంజీవిని ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీని ఇంటికి పిలిచి వైఎస్ జగన్ సమస్యలను పరిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ని అప్రతిష్ట పాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి డబ్బులు మంజూరు చేసింది జగన్ అని తెలిపారు.కాకినాడ..వైఎస్సార్సీపీ నాయకురాలు వంగా గీతా మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై బాలకృష్ణ, కామినేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ సీఎం పట్ల అసెంబ్లీలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సభను అగౌరపరచడమే. అసెంబ్లీ అనేది ఎంతో పవిత్రమైన స్ధలం. కేవలం 175 మందికి మాత్రమే ఆ పవిత్రమైన స్ధలంలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. చంద్రబాబు హయంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకా.. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకైనా పెట్టారా?. వైఎస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారు. వైఎస్ జగన్కు ప్రజలంటే అభిమానం. చిరంజీవి చాలా సౌమ్యమైన వ్యక్తి. ఎప్పుడు ఒక్క అడుగు తగ్గే ఉంటారు. వైఎస్ జగన్, చిరంజీవి ఎదుట వారిని గౌరవించే వ్యక్తులు. ఎవర్ని తక్కువ చేయాలనుకునే వ్యక్తులు కాదు. అలాంటి ఆ ఇద్దరు వ్యక్తులను చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇక ముందు వైఎస్ జగన్, చిరంజీవిని తక్కువగా చేసి మాట్లాడవద్దు అని హితవు పలికారు.విశాఖ..మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘బాలకృష్ణ పెద్ద సైకో. బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు. వైఎస్ జగన్కు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారు. చిరంజీవిని చూసి బాలకృష్ణ ఓర్వలేకపోతున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారు. తాగుబోతు బాలయ్యకు నోరే సరిగా తిరగదు. బాలకృష్ణ నటనకు ఏనాడు అవార్డుల రాలేదు. రికమండేషన్లతో అవార్డులు సాధించిన వ్యక్తి బాలకృష్ణ అని చెప్పారు.వైఎస్సార్ జిల్లా.. నందమూరి బాలకృష్ణపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజాద్ బాషా మాట్లాడుతూ..‘అసెంబ్లీని బాలకృష్ణ అపహాస్యం చేశారు. మందు తాగి వచ్చిన వ్యక్తిలా నందమూరి బాలకృష్ణ ప్రవర్తించాడు. ఆయన వ్యాఖ్యలను వైఎస్సార్ పార్టీ పూర్తి ఖండిస్తుంది. బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి సైతం ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కనీసం ఖండించలేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
బాలకృష్ణది సైకో బుద్ధి, సైకో ఆలోచనలు: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్టీఆర్, బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలా? అని ప్రశ్నించారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైందా?. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ పెట్టాలి. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొడిగితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడు. సైకో బుద్దులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే. అఖండ సినిమాకు సాయం చేయమని సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పారు.సొంత అన్నలా చిరంజీవిని వైఎస్ జగన్ చూసుకున్నారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది. చిరంజీవి తక్షణం స్పందించడాన్ని వైఎస్సార్సీపీ స్వాగతిస్తుంది. మీ కాళ్ల దగ్గరకు సినిమా వాళ్లు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాం నాటి జీవోనే కూటమి పాలకులు కొనసాగిస్తున్నారు. సినిమా పేదోడికి దగ్గరగా ఉండాలని ఆరోజు మీటింగ్లో వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్సార్ సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేది. చంద్రబాబు హయంలో క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు ఆగిపోయాయని బాలయ్య చెప్పారు.గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత..వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత. కైకలూరు సమస్యల గురించి ఏనాడూ కామినేని శ్రీనివాస్ మాట్లాడరు. సినిమాలు, సినిమా రేట్లు, సినిమా మనుషుల గురించి కామినేని మాట్లాడతారు. కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విచక్షణ, ఇంగితజ్ఞానం లేకుండా కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. మంత్రి పదవి కోసం కామినేని పచ్చి పాపపు మాటలు మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడి రైతులకు నష్ట పరిహారం కింద నాలుగు పైసలు ఇచ్చారా?.ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు..మెరిట్ లిస్టు ప్రకటించకుండా నియామక పత్రాలు ఎలా ఇస్తారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకూ 1998 డీఎస్సీకి దిక్కుందా?. డీఎస్సీ ప్రశ్నాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అంటే హంగూ, ఆర్భాటం, హడావుడి ఉంటుంది. అలాగే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఏమైంది?. కూటమి పాలకులు హెలికాప్టర్లు, విమానాల్లో ఉంటారు.. ప్రజలు ఎవరిని అడగాలి అని ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీ ప్రశాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు. -
ఓజీ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. షాకిచ్చిన బెంగళూరు పోలీసులు!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఓజీ(OG Movie) అభిమానులకు బెంగళూరు పోలీసులు దిమ్మదిరిగే షాకిచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద రిలీజ్కు ముందే ఈవెంట్ నిర్వహించినందుకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఈవెంట్లో కొందరు ఫ్యాన్స్ కత్తులతో హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మడివాలా పోలీసులు వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సిటీ కోర్ట్ అనుమతితోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా బెంగళూరులోని ఓ థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేయడంతో మిగిలిన ఆడియన్స్ ఇబ్బందులు పడ్డారు. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)ప్రీమియర్ షోకు ముందే పవన్ అభిమానులు రోడ్లను బ్లాక్ చేసి, డీజే పెట్టి నిబంధనలను ఉల్లంఘించారు. దీనిపై కన్నడ రక్షణ వేదిక సభ్యులు థియేటర్ వద్దకు చేరుకుని.. రూల్స్ పాటించాలని పవన్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సమాచారం అందగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అక్కడ ఉన్న లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకుని.. ఏర్పాటు చేసిన వేదికను కూల్చివేయమని నిర్వాహకులను చెప్పామని వెల్లడించారు. కాగా.. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.1000 టికెట్ ధరల వల్లే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.( OG Movie Box Office Collections )మొదటి ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ఓవరాల్గా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 90.25 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.100 కోట్లకు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఓజీ వసూళ్లకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
ఇటు వైఎస్సార్సీపీ.. అటు మెగా ఫ్యాన్స్.. బాలయ్యకు బంతాటే!
సాక్షి, అమరావతి: అగ్రనటుడు చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అవమానించడంపై మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడడంపైనా వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను ఇరు వర్గాలు బంతాట ఆడుకుంటున్నాయి.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెచ్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాడెవడు అంటూ నోరుపారేసుకున్నారు. అయితే, బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు సహా జనసేన ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలంటూ చిరంజీవి అభిమానులు పవన్ కల్యాణ్ను సైతం కోరుతున్నారు. సోషల్మీడియాలో బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు.. అసెంబ్లీలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై కూడా బాలకృష్ణ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. బాలకృష్ణపై మండిపడుతున్నారు. నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. బాలకృష్ణ మానసిక స్థితిని పరీక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్కు తేడా తెలియకుండా మాట్లాడారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీదున్న కోపాన్ని వైఎస్ జగన్ మీద చూపిస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు . -
‘ఓజీ’తో ప్రజలకు ఒరిగేదేముంది?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రంతో ప్రజలకు ఒరిగేది ఏముందని, టికెట్ ధర పెంచితే ఎందుకు కొనాలని ప్రభుత్వాన్ని, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. రూ.వందల కోట్లతో చిత్ర నిర్మాణం చేపట్టే ముందు.. కొందరికి మాత్రమే రూ.కోట్లు ఇచ్చే ముందు ప్రజల అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. మీ ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి వందల కోట్లు ఖర్చు చేశాం.. ప్రజలు కూడా వందలకు వందలు వెచ్చించి కొనాల్సిందేనని భావించడం సమర్థనీయం కాదంది. శుక్రవారం (26న) మరోసారి వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని కోరుతున్నామని డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ అప్పీల్పై విచారణ ముగించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ వచ్చే నెల 4 వరకు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ హైకోర్టులో డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీలెంట్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారని, మెమో గడువు 4వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత విచారణతో అప్పీలెంట్కు ప్రయోజనం ఉండదన్నారు. పిటిషనర్కు కలిగింది రూ.100 నష్టం మాత్రమేనని, అది డిపాజిట్ చేస్తామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని రూ.100 కాదు.. రూ.100 కోట్లు డిపాజిట్ చేయండి అని అడిగింది. పిటిషనర్ దాఖలు చేసింది పిల్ కాదని, రిట్ పిటిషన్లో ప్రజా ప్రయోజనాలు కోరలేదని అవినాశ్ దేశాయ్ చెప్పారు. రిట్ పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్గోపాల్ వాదనలు వినిపిస్తూ.. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ ముఖ్య కార్య దర్శికి లేదన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు మాత్రమే ఆ అధికారం ఉందన్నారు. గతంలో సినిమా టికెట్లపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకోవడం చట్టవిరుద్ధమన్నారు. గేమ్ ఛేంజర్, పుష్ప చిత్రాలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇదే హైకోర్టు నిలిపివేసిందని గుర్తు చేశారు. కోర్టులు సమర్థించాలా? వాదనలు విన్న డివిజన్ బెంచ్.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచటం సరికాదంది. రూ.1,000 కోట్లు పెట్టి సినిమా తీయడం వల్ల ప్రజలకు ఒరిగేదేముందని ప్రశ్నించింది. అది కొందరు వ్యక్తుల లబ్ధికోసమేనని పేర్కొంది. రూ.150 టికెట్ను రూ.800కు ప్రజలు ఎందుకు కొనాలని.. దీనికి ప్రభుత్వం ఎందుకు సహకరించాలో ఒక్క కారణం చెప్పాలని అడిగింది. ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు సమర్థించాలా అని ప్రశ్నించింది. ప్రజలకు చెప్పి హైబడ్జెట్ సినిమాలు తీస్తున్నారా.. వాళ్లు తీయమని అడిగారా అని నిలదీసింది. టికెట్ల పెంపు విధానపరమైన నిర్ణయమైతే జీవో జారీ చేయకుండా.. మెమో ఎలా విడుదల చేస్తారని తప్పుబట్టింది. శుక్రవారం సింగిల్ జడ్జి విచారణ చేపట్టి.. ఈ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. -
Kancharapalem: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరు వ్యాపారుల నినాదాలు
-
‘ఓజీ’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్ చెబుతున్నాయి. (‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఎలివేషన్పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ ముందు ఉన్నంత అయితే హైప్ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్పై ఉంటుందో లేదో వీకెండ్లో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు టికెట్ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్పై ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆ ఓటీటీలోనే.. ఓజీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్ఫ్లిక్స్ అంత డబ్బు పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. -
Fishermen: సినిమా షూటింగ్ లకు ఆరోగ్యం బాగుంటుంది కానీ మా దగ్గరకు రావడానికి ఆరోగ్యం బాగోదా?
-
అసెంబ్లీకి డుమ్మా కొట్టి OG సినిమాకి చెక్కేసిన ఎమ్మెల్యేలు
-
OG సినిమా హిట్టా..! ఫట్టా..!
-
OGపై RK రోజా రియాక్షన్
-
హైకోర్టు హెచ్చరించినా లెక్కచేయని 'ఓజీ'
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. అయితే, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో అమలును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ, కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయలేదని చిత్ర యూనిట్పై విమర్శలు వస్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించరా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లలో పెంచిన ధరలే కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆపై ఓజీ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేయడంతో 18 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకుండా చూడాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.. దానిని కూడా వారు పాటించకుండా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిని సవాల్ హైదరాబాద్కు చెందిన బి.మల్లేశ్యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్ విచారణ చేపట్టారు. 2021లో జారీచేసిన జీవో120కి విరుద్ధంగా ఓజీ సినిమా టికెట్ ధరలు ఉన్నాయన్నారు. దీంతో న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేసింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్నారని సూటిగానే కోర్టు ప్రశ్నించింది. ఈ షోలతో వచ్చిన డబ్బుతో అనాథలకు ఏమైనా ఆసరాగా వినియోగిస్తున్నారా అంటూ చెప్పాలని కోరింది. కేవలం ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూర్చడానికి ఇలా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిస్తారా అంటూ కడిగిపారేసింది. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనలనే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయినప్పటికీ టికెట్ ధరలను మాత్రమ తగ్గించలేదు. దీంతో న్యాయస్థానం అంటూ ఎలాంటి గౌరవం లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
చిరువ్యాపారు ఏడుస్తుంటే.. OG సినిమా చూస్తున్న ఎమ్మెల్యే
-
OG రిలీజ్ లో అపశృతి.. పవన్ అభిమాని మృతి
-
‘పవన్ సీజ్ ద షిప్’ ఏమైంది!?
సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కాకినాడలో బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ చేయాలని, సీజ్ ద షిప్ అంటూ గతంలో ఆదేశించారని, ఆ కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పెరిగిన బియ్యం అక్రమ రవాణాకు నమోదైన కేసులే అద్దంపడుతున్నాయన్నారు. కాకినాడ, విశాఖ పోర్టుల కేంద్రంగా పెద్దఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందన్నారు. మరో ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. పౌర సరఫరాలు, పోలీసు శాఖలోని కొందరు రేషన్ మాఫియాతో చేతులు కలిపారని, కాకినాడ పోర్టులో బియ్యం డంప్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.అనంతరం.. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దుచేశామన్నారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 2,438 కేసులు నమోదుచేసి 5 లక్షల క్వింటాళ్లకు పైగా బియ్యం స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలపై ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదన్నారు. తూమాటి మాధవరావు మాట్లాడుతూ లులుకు ఖరీదైన భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కల్పలతారెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికోలను శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. -
OG X Review : ‘ఓజీ’ ట్విటర్ రివ్యూ
పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో అయినా తమ హీరోకి విజయం దక్కాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాకు కావాల్సినంత హైప్ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 25) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓజీ కథేంటి? ఎలా ఉంది? పవన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో సంబంధం లేదు. ఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటే..బాగోలేదని మరికొంతమంది చెబుతన్నారు. రొటీన్ గ్యాంగ్స్టర్ స్టోరీ అని.. ఎలివేషన్స్ తప్ప ఇంకేమి లేదని కామెంట్స్ చేస్తున్నారు. కథ- కథనం వదిలేసి..దర్శకుడు దృష్టంతా ఎలివేషన్పైనే పెట్టాడని విమర్శిస్తున్నారు. #OG A Run of the Mill Gangster Drama that is technically strong and has a few solid elevation blocks, but the rest is mundane!The first half of the film is satisfactory. Despite the drama moving in a flat way, it manages to build intrigue. The intro and interval block are well…— Venky Reviews (@venkyreviews) September 24, 2025ఓటీ టెక్నికల్గా బాగుంది. కొన్ని ఎలివేషన్స్ మినమా మిగతా కథంతా రొటీన్ అంటూ ఓ నెటిజన్ కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. OG MOVIE REVIEW:Story:❌❌❌❌Action:⭐️Acting:❌❌❌❌VFX: ⭐½BGM:⭐️OG MOVIE RATING: ⭐️⭐½#og #ogreview #ogmovie #pawankalyan #OGonSept25 pic.twitter.com/iTrVi0W1TH— Baap of movies (@baapofmovies) September 24, 2025 స్టోరీ బాగోలేదు. యాక్షన్, వీఎఫెక్స్ పర్వాలేదు. బీజీఎం బాగుంది అంటూ ఓవరాల్గా ఈ చిత్రానికి 2.25 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్.Rod movie ra babu 🙏🙏Sujeeth ga nvu TFI vadileyra Thamman bayya yentha kavalo antha iste saripodi talakaya noppi vachesindi bgm ki 🙏 #OGReview #TheycalllHimOGReview— Manoj AA (@AlluBhai__) September 24, 2025 ఓజీ ఓ రాడ్ మూవీ. సుజీత్ అర్జెంట్గా తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతే మంచిది. తమన్ బయ్యా..ఎంత కావాలో అంతే బీజీఎం ఇస్తే సరిపోతుంది. తలకాయ నొప్పి వచ్చేసింది నీ నేపథ్య సంగీతానికి’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#OGReview 1. Second Half inkoncham better ra thieyavachu and expected drama. 2. 70% movie antha fights ee unnie.3. @MusicThaman Ekkada negaloo kadu ekkada thagaloo kuda telisinavadu goppavadu ra ayya !!!!!!4. Heroine ndhukuuuu— Dune (@Aloanworrier) September 24, 2025 సెకండాఫ్ ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు. కథనం ఊహించేలా ఉంది. సినిమాలో 70 శాతం యాక్షనే ఉంది. తమన్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్పవాడు. హీరోయిన్ ఎందుకు ఉందో.. అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.#OGreview: Style without soul, mediocre fight choreographyRating: 2/5#Pawanakalyan #TheycalllHimOG #SujeethSambhavam @FridayWallMaghttps://t.co/Zg2Qz2fjUD— Kausalya Suharika R (@KausalyaSuhari1) September 24, 2025 First half is peak in every aspect, Sujeet fanism at high…2nd half starts with bang, loved the drama & emotion, then comes climax with cinematic high…BC this is just half of Gambheera he ll be unleashed in part2 #OG— The is my surname (@Bloodufan) September 24, 2025#TheyCallHimOG is Disappointing We were excited for this magnum opus after hearing the songs and seeing the trailer, but it did not live up to our expectations in terms of story or visual effects. Thaman is one of the few people who did their job from the start.— FukkardBO (@FukardBO) September 24, 2025#TheyCallHimOG - Original Gunapam🙏#OG #OGReview #PawanKalyan #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/fIbsouR5bs— cinee worldd (@Cinee_Worldd) September 24, 2025Rey edhem cinema ra babu 1000rs booka #DisasterOG #DisasterOG pic.twitter.com/yhWp70EabW— Tiger'sDragon🐲 (@TigersDragon999) September 24, 2025Finally Original Review 😭 💯 #OGReview || #DisasterOG pic.twitter.com/3tcKrOMVff— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 𝟐.𝟎 (@KarnaReddy2_0) September 24, 2025#TheyCallHimOG - PK’s Swag & Screen presence Super. Emraan, Priyanka Dummy. Thaman’s BGM elevates. Gud Visuals. Passable 1st Hlf & Poor 2nd Hlf. No proper Emotions. Intro Seq, Interval block, Police Stn scene, Traveling Soldier remix impressive. Style with no substance. AVERAGE!— Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2025 -
They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓజీనటీనటులు: పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదిరులునిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు : డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరిదర్శకత్వం: సుజీత్సంగీతం: తమన్ ఎస్సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: సెప్టెంబర్ 25, 2025‘హరిహర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన మూవీ ‘ఓజీ’(OG Review). మూడేళ్ల కిత్రం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమై.. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్స్ను చవిచూసిన పవన్కు ‘ఓజీ’తో అయినా హిట్ పడిందా, లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి.. సత్యదాదా డాన్గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు (OG Movie Review). ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..గ్యాంగ్స్టర్ కథలు.. అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ(They Call Him OG Review) కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ స్టోరీనే. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగేకొద్ది.. పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. వాటిని మరిపించేందుకు ఏవైనా ట్విస్టులు అయినా ఉంటాయా అంటే అదీ ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించొచ్చు. కథ-కథనం విషయాన్ని పక్కన పెట్టి.. ఎలివేషన్పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుర్తు తెస్తాయి. ఇక లాజిక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం.. రక్తంతో కాలి బూటుకి అంటుకున్న అగ్నిని చల్లార్చడం.. ఇలా ‘బాలయ్య’ ను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.జపాన్లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయం తెలిసిపోతుంది. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం.. ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం.. కన్మణితో ప్రేమాయణం ఒకవైపు.. ఓమీ అరచకాలు.. దాదా పోర్ట్పై దాడి.. ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం.. ఫస్టాప్ అంతా ఇలా రొటీన్గానే సాగినా.. క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఇక సెకండాఫ్ కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది. రక్తపాతం జరుగుతున్నా.. కీలక పాత్రలు కనుమరుగవుతున్నా.. ఎక్కడా జాలీ, బాధ కలగదు. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా.. క్లైమాక్స్లో ఓజీ ప్లాష్బ్యాక్కి మరో ఎలివేషన్ ఇచ్చారు. ‘అవసరం’ అయినప్పడు మళ్లీ వస్తా’ అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది.. రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. పవన్ నటన పరంగా చేయడానికేమి లేదు. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమి ఆశించొద్దు. ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూప్తో తీశారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లే కాదు ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్నే వాడినట్లు ఉన్నారు. కొన్ని చోట్ల పవన్కి కళ్లజోడు పెట్టి మ్యానేజ్ చేస్తే.. మరికొన్ని చోట్ల తలను కిందికి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రియారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆమె పాత్రకు ఒకటి రెండు బలమైన సన్నివేశాలు పడ్డాయి. తేజ్ సప్రూ, సుదేశ్ నాయర్, హరీశ్ ఉత్తమ్, రాహుల్ రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజీఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. వీఎఫెక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) -
11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?
'ఓజీ' సినిమా. ఈ పేరు చెప్పగానే చాలామంది పవన్ కల్యాణ్ అంటారేమో! కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజీత్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాసరే ముచ్చటగా మూడంటే మూడు మూవీస్ మాత్రమే చేశాడు. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ పిలిచి మరీ ఛాన్స్లు ఇచ్చారంటే మనోడిలో మేటర్ చాలానే ఉందని అర్థమవుతోంది. అసలు ఇంతకీ ఇతడెవరు? డైరెక్టర్ ఎలా అయ్యాడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ఒకప్పుడు దర్శకుడు కావాలంటే కచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్గా చాలా ఏళ్లు పనిచేయాల్సి వచ్చేది. కానీ 2010, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలామంది యూత్.. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తమలోని టాలెంట్ బయటపెట్టారు. అలాంటి కుర్రాళ్లలో ఒకడే సుజీత్. పుట్టింది అనంతపురం. చెన్నైలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. సినిమా అంటే పిచ్చి. దీంతో 17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాడు. పూరీ జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేయాలనేది ఇతడి ఆలోచన. కానీ పూరీని కలిసిన తర్వాత ఆ ఆలోచనని పక్కనపెట్టి, సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం షురూ చేశాడు.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ)అలా 30 వరకు లఘ చిత్రాలు తీశాడు. అయితే ఓ తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన కాంటెస్ట్లో పాల్గొని 'రన్ రాజా రన్' అనే షార్ట్ ఫిల్మ్తో విజేతగా నిలిచాడు. దీంతో యువీ క్రియేషన్స్ నుంచి ఇతడికి ఆఫర్ వచ్చింది. తొలుత ఓ లవ్ స్టోరీని వాళ్లకు చెప్పాడు. నిర్మాతలకు బాగానే నచ్చింది కానీ బడ్జెట్ సమస్యల వల్ల దీన్ని పక్కనబెట్టేశారు. ఆ బాధలో వర్షంలో బండి తోసుకుంటా ఇంటికెళ్లాడు. తల తుడుచుకుంటున్న టైంలో ఓ కథ ఫ్లాష్ అయింది. మూడు రోజుల్లో ఆ స్టోరీని పూర్తిగా రాసి నిర్మాతలకు వినిపించాడు. అదే 'రన్ రాజా రన్' సినిమా.శర్వానంద్తో తీసిన ఈ మూవీ హిట్ అయింది. దీంతో ఓ రోజు మాటల సందర్భంలో ప్రభాస్.. 'బాహుబలి' షూటింగ్ టైంలో సుజీత్ని కలిసి ఏదైనా కథ ఉంటే చూడు డార్లింగ్ అని అన్నాడు. అలా ఓ స్టోరీని అనుకుని వినిపించాడు. అదే 'సాహో'. మేకింగ్ పరంగా హాలీవుడ్లో రేంజ్లో ఉంటుంది. మరి 'బాహుబలి' తర్వాత రావడం వల్లనో ఏమో గానీ అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది. రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే అంతకు మించే కలెక్షన్స్ వచ్చాయి గానీ అందరినీ సంతృప్తి పరచలేకపోయింది.(ఇదీ చదవండి: మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!)'సాహో' తర్వతా సుజీత్కి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వచ్చాయి. అలా కొన్నేళ్ల పాటు హిందీలో సినిమా చేయాలని తెగ ప్రయత్నించాడు కానీ అదృష్టం కలిసి రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్కి వచ్చేశాడు. ఆ టైంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం చేసే ఛాన్స్ మొదట ఇతడికే వచ్చింది. కానీ రీమేక్ అని నో చెప్పేశాడు. తర్వాత పవన్ కల్యాణ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిస్తే ఓ రీమేక్ చేయాలని ఆఫర్. కానీ సొంత కథతోనే మూవీ చేస్తానని చెప్పి ఓ స్టోరీ రెడీ చేశాడు. అదే 'ఓజీ'.2022 నుంచి దాదాపు మూడేళ్ల పాటు తీసిన చిత్రమే 'ఓజీ'. అయితే ఈ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ అయ్యిండొచ్చు, తమన్ తన మ్యూజిక్తో వైబ్ తీసుకురావొచ్చు. కానీ దీనంతటికి కారణం మాత్రం సుజీత్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. తన విజన్తో అందరూ తన గురించి, సినిమా కోసం మాట్లాడుకునేలా చేశాడు. నెక్స్ట్ నానితో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుంది.సుజీత్.. 2020లోనే ప్రవల్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొన్న జరిగిన 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈమెతో పాటు కనిపించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈమె హైదరాబాద్లోనే డెంటిస్ట్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది) -
'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పెంచిన ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపోతే ముందు రోజు అనగా 24న రాత్రి వేసే ప్రీమియర్కు తెలంగాణలో రూ.800 టికెట్ ధర(జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.'హరిహర వీరమల్లు' లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. ఇమ్రాన్ హష్మీ విలన్. తమన్ సంగీతమందించాడు. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. -
కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్ల ట్వీట్ పవన్కేనా?
బండ్ల గణేశ్.. కమెడిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిర్మాతగా మారి బడా చిత్రాలను నిర్మించాడు.ఎన్టీఆర్, రవితేజ, పవన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మించి..టాలీవుడ్లో కొన్నాళ్ల పాటు అగ్ర నిర్మాతగాను కొనసాగాడు. అయితే గత కొంతకాలంగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి చిత్రాలు రావడం లేదు. నటుడిగానూ తెరపై కనిపించడం లేదు. అయినప్పటికీ బండ్ల గణేశ్ పేరు ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఆయన చేసే ప్రసంగాలు.. సోషల్ మీడియా పోస్టులు అనే చెప్పాలి. ప్రీరిలీజ్ ఈవెంట్స్తో ఆయన ఇచ్చే స్పీచ్లు వైరల్ అవుతుంటాయి. హీరోలను పొగడ్తలతో ముంచేస్తుంటాడు.ఇక పవన్ కల్యాణ్కు ఆయన చేసే భజన అంత ఇంతా కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ కొంతకాలంగా దూరం పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ సినిమా ఈవెంట్స్కి బండ్ల గణేశ్ కి ఆహ్వానం అందడం లేదు. ఇటీవల జరిగిన ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్కి సైతం బండ్ల గణేష్కు పిలుపు రాలేదు. దీంతో పవన్పై బండ్లన్న అలిగినట్లు ఉన్నాడు. తన అసహనాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.‘కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ గురించే చేశాడని నెటిజన్స్ అభిప్రాయపెడుతున్నారు. ‘నిజమే.. పవన్కి కృతజ్ఞత ఉండదు’, ‘ఈ విషయం ఇదివరకే అర్థమై చెప్పిన వారిపై గయ్యిన లేచే వాడివిగా! గుడ్డి మైకం లో ఉన్నప్పుడు, నీకు కూడా అర్దం కాలేదుగా! అయినా ఎప్పటికీ అర్దం కాని కొంతమంది పిచ్చి మలోకాలు ఎప్పటికీ ఉంటాయి! అందుకే ఎందుకు పనికి రాని వారు అందలం ఎక్కి ఊరేగుతారు! వారు వీరందరినీ పల్లకి మోసే బోయలు మాత్రమే!’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు.నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు.కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు.— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2025 -
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు షాక్
-
'ఓజీ'ని డామినేట్ చేసిన రిషబ్శెట్టి
టాలీవుడ్లో కేవలం వారం గ్యాప్లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ, అక్టోబర్ 2న రిషబ్శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్లో వ్యూస్ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్శెట్టి నటించిన కాంతారనే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే, కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్ ట్రైలర్ ఏకంగా 15 మిలియన్ల మార్క్ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్ చేశారంటూ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్కు కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్ దాటేసింది.'హరి హర వీరమల్లు' ట్రైలర్కు 48 మిలియన్ల వ్యూస్ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వ్యూస్ కోసం బాట్స్ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
మా ఎమ్మెల్యే ఎక్కడ?.. పవన్ పై తిరగబడ్డ ఉప్పాడ మత్స్యకారులు
-
మీ ఉల్ఫా గాళ్ల కోసం పేదల ఉసురు పోసుకుంటున్నావ్
-
Big Question: OG అంటే.. ఒంటరిగా గెలవలేను..!
-
మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్ను బ్యాడ్న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025 -
పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. ‘ఓజీ’ షోలు క్యాన్సిల్!
రిలీజ్కి రెండు రోజుల ముందు ఓవర్సీస్ మార్కెట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) నటించిన ఓజీ (OG) మూవీకి భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలు అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఓజీ షోలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన వెల్లడించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది. ‘సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక, రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రీబుకింగ్ చేసుకున్నవారికి రిఫండ్ చేస్తాం.పబ్లిక్ సెక్యూరిటే మా టాప్ ప్రయారిటీ’ అని యార్క్ సినిమాస్ ఓ సుధీర్గమైన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘నార్త్ అమెరికాలో ఓజీ సినిమాను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ తరపున యార్క్ సినిమాస్కు కొన్ని రిక్వెస్టులు వచ్చాయి. ఈ సినిమా సేల్స్ గణాంకాలను పెంచమని ఫోర్స్ చేశారు. తద్వారా భవిష్యత్లో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. గత కొద్దికాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధాలు పెంచుకొని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తుంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యతను పెంచేందుకు.. వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నిస్తుంది’ అని యార్క్ సినిమాస్ లేఖలో పేర్కొంది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.⚠️ Press Release (Safety)#YorkCinemas #TheyCallHimOG#OGMovie #Update pic.twitter.com/xoLCVV5oEU— York Cinemas (@yorkcinemas) September 22, 2025 -
ప్రతిపక్ష నేత తన సొంత ఖర్చులతో ఎక్కడికెళ్తే మీడియాకేంటని ప్రశ్నలు
-
OG సినిమా కోసం మరో జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
-
పిఠాపురం.. పైగా పవన్ చేతిలో పనే.. అయినా సైలెన్స్!
సాక్షి, కాకినాడ జిల్లా: సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం పరిధిలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతోందని, ఓఎన్జీసి కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమవుతోందన్నది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఓఎన్జీసి కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు.. వేటకు ఆటంకంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. వేలాఇ కుటుంబాల జీవనాధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసి ద్వారా నష్టపరిహరం ఇప్పించడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Fishermen Protests). పవన్ చేతిలో పనే, కానీ.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు కూడా. అయినప్పటికీ, స్థానిక సమస్యలపై ఆయన స్పందన లేకపోవడం గంగపుత్రులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. సముద్రం కలుషితమైతే, మత్స్యకారుల ఆరోగ్యం.. వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే.. నియంత్రించాల్సిన బాధత్య పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే, వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండడం అక్కడి జనాలకు కోపం తెప్పిస్తోంది. మరి ఇప్పుడైనా పవన్ స్పందిస్తారా? లేదంటే తన శాఖ పరిధిలోకి రాదని.. అధికారులదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి.. -
'అసలు పాసులు ఎందుకిచ్చావ్'.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు ఘోర అవమానం!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నెల 21 భారీస్థాయిలో హైదరాబాద్లోని ఎల్బీ స్డేడియంలో ఓజీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఎంతో ఆశతో ఈవెంట్కు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాసులు ఉన్న తమను లోపలికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు స్టేడియం గేటు బయటే వేచి చూశామని అభిమానులు వాపోయారు. మాకు పాసులు ఇచ్చిన లోపలికి పంపకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం అంతా ఖాళీగానే ఉందని.. తమను ఎందుకు పంపరని పోలీసులపై మండిపడ్డారు.ఇది బైట ఉన్న Fans పరిస్థితి !🙏🏻What a management of Telangana Police services truly excellent with this worst…#TheyCallHimOG #PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/ixIFG1Z1Dr— Karthikuuu (@Anchor_Karthik_) September 21, 2025 -
ఓజీ మూవీ ట్రైలర్ విడుదల
-
'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ'. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ గురువారమే(సెప్టెంబర్ 25) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్ల రూపంలో పాటలు, స్టిల్స్ వదిలారు. హైదరాబాద్లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఆ కార్యక్రమంలో ట్రైలర్ ప్లే చేశారు గానీ బయటకు మాత్రం వదల్లేదు. ఇప్పుడు పనంతా పూర్తవడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)ట్రైలర్ చూస్తుంటే ముందునుంచి చెప్పినట్లే యాక్షన్ కనిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఇమ్రాన్ హష్మీ ప్రెజెన్స్ బాగుంది. ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరుల సీన్స్ కూడా ట్రైలర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్) -
అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) తప్పుడు ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్సీపీ హయాంలో అప్పు కేవలం 2,61,683 కోట్లు మాత్రమే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు, ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో అప్పులు 10-14 లక్షల కోట్లు అని టీడీపీ, జనసేన, పచ్చ మీడియా గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(payyavula keshav) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ హయాంలో 2,61,683 కోట్లు మాత్రమే అప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉన్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. కాగా, చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక, కార్పోరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో 1,09,217 కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో మొత్తంగా 3,70,900 కోట్లు అప్పులు తెచ్చినట్టు ప్రకటించారు. మరోవైపు.. 2024 ఎన్నికలు సమయంలో తెచ్చిన అప్పు సైతం ఇందులో కలిపి ఆర్థిక శాఖ లెక్కలను తాజాగా మంత్రి వెల్లడించారు.ఇది కూడా చదవండి: డొల్ల మాటలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు!అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో టీడీపీ, పవన్(Pawan Kalyan) కల్యాణ్ తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ హయాంలో 10 నుండి 14 లక్షల కోట్లు అప్పు చేసినట్టు పచ్చ మీడియా, చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల ఫేక్ ప్రచారం బట్టబయలు అయ్యింది. -
KSR Live Show: జగన్ నిర్ణయానికి జై కొట్టిన ఇండస్టీ.. OG సినిమాపై నమ్మకం లేదు..!
-
'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది
హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ సందడి చేశారు. అయితే, ఈవెంట్ కాస్త వర్షార్పణం అయింది. 'వర్షం లేదు..బొక్కా లేదు' అని తమన్ బహిరంగంగానే కామెంట్ చేసినప్పటికీ వాన మాత్రం ఊరుకోలేదు. వేదికపై ఉన్న లైట్ బాయ్ నుంచి పవన్ కల్యాణ్ వరకు అందర్నీ తడిపేసింది. దీంతో ఓజీ ఈవెంట్ కాస్త వర్షార్పణం కావడం ఆపై ట్రైలర్ కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, వేదికపై పవన్ కల్యాణ్ చేసిన కత్తిసాము వల్ల తన సెక్యూరిటీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఓజీ స్టేజీపై పవన్ కల్యాణ్ ఇలా వ్యాఖ్యలు చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా..? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు' అంటూ కత్తి పట్టుకుని స్టేజీపై పవన్ కల్యాణ్ తిప్పుతుండగా తన సెక్యూరిటీ కంటి దగ్గరి నుంచి వెళ్లింది. అయితే, అతను అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. లేదంటే తన కంటికి తీవ్రమైన ప్రమాదమే జరిగేది. అది ఒరిజనల్ కత్తి కాదని కొందరు.. లేదూ ఒరిజినల్ కత్తే అంటూ మరికొందరూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అది అతని కన్ను వద్ద తగిలింటే మాత్రం ఏ కత్తి అయినా సరే తీవ్రమైన నష్టం జరిగేదని చెప్పొచ్చు. Just Miss 😲pic.twitter.com/IG8mlaL5aX— Christopher Kanagaraj (@Chrissuccess) September 21, 2025 -
ప్రజా సొమ్ముతో జల్సా రాయుళ్లు
-
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఎక్కే విమానం.. దిగే విమానం!
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారిది ఒకే తీరు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. వారాంతం విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్నారనే చర్చ అటు టీడీపీ కూటమి వర్గాలో.. ఇటు అధికార వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ 15 నెలల్లో సీఎం చంద్రబాబు దాదాపు 70 సార్లు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. మంత్రి లోకేశ్ 77 సార్లు ‘ప్రత్యేక’ంగా ప్రయాణాలు చేశారని తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ప్రత్యేక’ ప్రయాణాలకు అంతేలేదు. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడిపారు. పట్టుమంటే పదిరోజులు ఆయన విజయవాడలో ఉన్న దాఖలాలే లేవని అధికారులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా చంద్రబాబు వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్కు వెళ్లి.. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో ఉండి కూడా చుట్టపుచూపుగా విజయవాడ వస్తున్నారంటూ అధికారులు వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది అదే తీరు.2019లో అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైతే.. కనీసం వారికి మనోధైర్యం కలి్పంచేందుకు కూడా చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి రాలేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2019 మే 30 నుంచి 2024 జూన్ 7 మధ్య రెండు మూడుసార్లు మాత్రమే హైదరాబాద్కు వెళ్లారని.. నిత్యం ప్రజలకు సుపరిపాలన అందించడానికే సమయం వెచి్చంచారని గుర్తు చేస్తున్నారు. లోకేశ్ 77 సార్లు హైదరాబాద్కు.. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు 77 సార్లు వెళ్లినట్లు టీడీపీ కూటమి, సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అంటే.. గత 15 నెలలుగా సగటున వారానికి ఒకసారి లోకేశ్ హైదరాబాద్కు వెళ్లి సరదాగా గడిపినట్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతేడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను చుట్టముట్టి.. విలయం సృష్టించి.. అపార ఆస్తి, ప్రాణనష్టం జరిగినప్పుడు కూడా లోకేశ్ హైదరాబాద్, ముంబయిలో ఉన్నారని ప్రజలు ఎత్తి చూపుతున్నారు.2014–19 మధ్య టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేశ్ ఇదే రీతిలో వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు రాష్ట్రానికి వచి్చంది వేళ్లపై లెక్కపెట్టవచ్చు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో మినహా లోకేశ్ మిగతా రోజుల్లో హైదరాబాద్కే పరిమితం అయ్యారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో టూర్లు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే... దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ అటు అధికార వర్గాలు.. ఇటు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉంటున్నారన్నది స్పష్టమవుతోంది. కలెక్టర్ల సమావేశం వంటి ముఖ్యమైన సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొడుతుండడం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.ఈ 15 నెలల్లో పవన్ విజయవాడలో ఉన్నది చాలా తక్కువని సోషల్ మీడియాలో, కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమా షూటింగ్లు, వ్యక్తిగత పనుల నిమిత్తం పవన్ కళ్యాణ్ రాజధానిలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా గడుపుతున్నారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారాహి యాత్ర సమయంలో మినహా మిగతా సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. -
ఈ సినిమాకి ఆ ఇద్దరే స్టార్స్: పవన్ కల్యాణ్
‘‘ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలియదు. ‘ఖుషి’ చిత్రం సమయంలో ఈ జోష్ చూశాను. అలాంటి జోష్ మళ్లీ ‘ఓజీ’కి వచ్చింది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మీరు (ఫ్యాన్స్) నన్ను వదల్లేదనిపిస్తోంది.. మీరు కదా నాకు భవిష్యత్ ఇచ్చింది’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ–‘‘సుజిత్ నా అభిమాని. ‘జానీ’ మూవీ చూసి నాతో సినిమా తీయాలనుకున్నాడు. ‘సాహో’ సినిమా తర్వాత సుజిత్తో సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పి, నాకు పరిచయం చేశారు. తను కథని ముక్కలు ముక్కలుగా చెప్పినా సినిమా తీసేటప్పుడు తన సత్తా తెలిసింది. ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్... నాట్ పవన్ కల్యాణ్. వారిలో మొదటి క్రెడిట్ సుజిత్ది. రెండో క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ది. ‘నేను డిప్యూటీ సీఎం అని ఈ రోజు మరచిపోయాను.మీరు ఊహించుకోండి.. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. సుజిత్ టీమ్ చాలా అద్భుతమైనది. ఇలాంటి టీమ్ నేను దర్శకత్వం వహించే టప్పుడు నాకూ ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదేమో? ట్రైలర్ పూర్తిగా సిద్ధం కాలేదంటే కుదరదు. మా వాళ్లకి (ఫ్యాన్స్) ఈ రోజు ఎంతో కొంత చూపించాల్సిందే.నాకు తెలుసు కదా... అమితాబ్ బచ్చన్ గారి కోసం నేను చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాణ్ణో. ఆయన సినిమాకి టిక్కెట్ దొరక్కపోతే చంపేద్దాం అనిపించేది. ‘ఓజీ’ చిత్రం అందర్నీ రంజింపజేసేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, వై. రవిశంకర్, రచయిత కోన వెంకట్, ప్రియాంక మోహన్, సంగీత దర్శకుడు తమన్, నటులు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ మాట్లాడారు. -
డిప్యూటీ సీఎం పవన్ పై పోతిన మహేష్ విమర్శనాస్త్రాలు
-
‘పవన్-ఉమా ఎపిసోడ్.. ఐటీసీ కోహినూర్లో ఏం జరిగింది?’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎపిసోడ్పై వైఎస్సార్సీపీ నాయకులు పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. అలాగే, పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చింది అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నీతులు చెప్పడమే కాదు ఆచరించాలి. సిద్ధాంతాలు, భావజాలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం ఎందుకు ప్రశ్నించారు. ఎందుకు అంత ఘాటుగా మాట్లాడారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి కంపు కొడుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకుని చేసిన వసూళ్లన్నీ ఒకే పార్టీకి దక్కాయి. అందుకే పొల్యూషన్ బోర్డు గురించి తెరపైకి తెచ్చారని చర్చ నడుస్తోంది.హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ సాక్షిగా ఏం జరిగింది. హైదరాబాద్లో ఆస్తులు సమకూర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. బోండా-పవన్ మధ్య నడిచిన మాటల యుద్ధం అంతా అవినీతి వ్యవహారానికి సంబంధించినదే. పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చింది. అందుకే చంద్రబాబు ఈ విషయాన్ని తొక్కిపెట్టారు. పొల్యూషన్ను కంట్రోల్ చేయాల్సిన బోర్డు అవినీతికి పాల్పడటమేంటి?. కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతోందని టీడీపీ నేతలే చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో నీతి వ్యాఖ్యలు చెబుతూ అవినీతికి పాల్పడటమేంటి?. పవన్ చెబితేనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ మాట వింటారని బోండా చెబుతున్నారు. పవన్.. కృష్ణయ్యకు ఏం చెప్పారో.. ఏం దిశానిర్ధేశం చేశారో సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు వెల్లడించాలి. బోండా ఉమా ప్రశ్నలకు పవన్కు అంత కోపం రావడానికి కారణమేంటి?. ఈ విషయంపై ప్రజలు లోతుగా ఆలోచించాలి. కృష్ణయ్య పెద్ద పెద్ద కంపెనీలను బెదిరిస్తున్నారు. తునిలో దక్కన్ కెమికల్స్.. లార్స్ ల్యాబ్తో పాటు మరికొన్నింటిని టార్గెట్ చేశారు. పవన్, కృష్ణయ్య దెబ్బకు పెద్ద కంపెనీలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోతున్నాయి. కృష్ణయ్య రాత్రి పూట తనతో సెటిల్ చేసుకోకపోతే తనిఖీలు చేయిస్తారు. ఫార్మా వేస్టేజ్ను సిమెంట్ కంపెనీలకు అమ్మి ప్రతీ రోజూ 30 లక్షలు సంపాదించాలనేది కృష్ణయ్య లక్ష్యం.ప్రీ ప్రోసెసింగ్ యూనిట్లకు కృష్ణయ్య వల్ల చాలా నష్టం. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల జీఎస్టీ నష్టం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. బోండా వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు?. నిబంధనలన్నీ పాటిస్తే కంపెనీలు ఉండవని పవన్ చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలు పాటించారని పవన్ ఒప్పుకున్నారు. ప్రజల జీవితాలకంటే పరిశ్రమలు మీకు ఎక్కువా?. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.100 కోట్లు దోచుకోవడానికే విజయవాడ ఉత్సవ్. అందరూ విజయవాడ ఉత్సవ్ లో పాల్గొనాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మీరు ప్రజలకు ఏం చేశారని ఉత్సవాల్లో పాల్గొనాలి. బుడమేరు వరదలో మునిగిపోయినందుకు పాల్గొనాలా?. ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చేరినందుకా?. ఈరోజు వరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా విజయవాడ ఉత్సవ్లో పాల్గొనలేదు. విజయవాడ ఉత్సవ్ మీద టీడీపీ ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది అని అన్నారు. -
సూపర్ సిక్స్ అంటే పేదవాళ్ళును ఏడిపించటమేనా..!
-
కూటమిలో కుంపటి.. బోండా ఉమ Vs పవన్
-
పెంచేద్దాం.. దోచేద్దాం.. మనల్ని ఎవడ్రా ఆపేది
-
గద్దల రాజ్యం ప్రైవేట్ లిమిటెడ్!
‘‘నెహ్రూ ఒక ఫ్యూడల్. ఆయనకు బాగా డబ్బులున్నాయి. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన ఏ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడికో కారు వచ్చేది. ఆయన అనుసరించిన విధానాల వలన సింగపూర్తో మనం పోటీపడలేక పోయాము. సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ పోటీదారి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు. నెహ్రూ వల్ల మనం సింగపూర్తో పోటీపడలేకపోయాము.’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయనకు బాకా ఊదే మీడియాలో రిపోర్టయింది.బ్రిటిష్ వలస పాలన సంకెళ్లు తెగగొట్టడానికి మొట్ట మొదటిసారిగా లాహోర్ కాంగ్రెస్ సభలో ‘పూర్ణ స్వరాజ్’ శంఖా రావం చేసినవాడు నెహ్రూ. తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళి కలు వేసి నవభారత సౌధ నిర్మాణానికి ఇటుకలు పేర్చిన వాడాయన. అంతర్జాతీయ వేదికపై రష్యా – అమెరికా కూటము లకు దీటుగా ప్రవర్ధ స్వతంత్ర దేశాలను కూడగట్టి ‘అలీనోద్య మా’న్ని నిర్మించిన ప్రపంచస్థాయి నేత నెహ్రూ. అటువంటి నెహ్రూ గురించి ఐఏఎస్ శిక్షణ పొందిన వారికి తాను చెప్పేది తప్ప ఇంకేమీ తెలియకపోవచ్చనుకోవడం బాబు ఆత్మవిశ్వాసా నికి ఓ మచ్చుతునక అనుకోవాలి.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనేక గేట్లుంటాయి. ఆయన ఏ గేటులోంచి బయటికి వస్తారో తెలియదు గనుక ప్రతి గేటు దగ్గరా ఒక కారుండేదని బాబు చెబుతున్నారు. అంత డబ్బున్న వాడు గనుక ఆయన ‘ఫ్యూడల్’ అంటున్నారు. బాగా డబ్బున్న వాళ్లను ‘ఫ్యూడల్స్’ అనాలేమో! ఈ థియరీ ప్రకారం బోలెడంత డబ్బున్న ఎలాన్ మస్క్, అంబానీ వంటి వాళ్లంతా పెద్దపెద్ద ఫ్యూడల్స్ అనుకోవాలి. బాబు ప్రేమించే సింగపూర్లో పెద్దసంఖ్యలో బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నారు కాబట్టి అక్కడున్నది ఫ్యూడల్ వ్యవస్థేమో! సరే, ఈ జ్ఞానామృత సేవనాన్ని పక్కన బెడితే... నిజంగానే నెహ్రూ సంపన్నుడు. ఆయన తండ్రి మోతీ లాల్ నెహ్రూ ఒక విజయవంతమైన న్యాయవాదిగా రెండు చేతులా ఆర్జించారు. అలహాబాద్ (ప్రస్తుత ప్రయాగ్రాజ్)లో ప్యాలెస్ లాంటి ‘ఆనందభవన్’ను నిర్మించుకున్నారు. అనంతర కాలంలో ఆ ప్యాలెస్ స్వాతంత్య్రోద్యమానికీ, కాంగ్రెస్ కార్యకలా పాలకూ కేంద్ర స్థానంగా మారింది.లండన్లో నెహ్రూ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిష్ఠాత్మకమైన హారో స్కూల్లో జరిగింది. కాలేజీ చదువు ట్రినిటీ కాలేజీలో! ఇది కేంబ్రిడ్జి యూనివర్సిటీలో భాగం. ఆక్స్ఫర్డ్ కాదు. తర్వాత బారిస్డర్ శిక్షణ కూడా నెహ్రూ తీసుకున్నారు. చంద్రబాబు చెప్పిన ‘గేటుకో కారు’ అనే చందమామ కథను ఎక్కడి నుంచి సంగ్రహించారో తెలియదు. ప్రామాణిక గ్రంథాల్లో ఈ కథ ఎక్క డైనా ఉన్నదేమో అది చదివినవాళ్లే చెప్పాలి. బాబు జ్ఞానబోధ విన్న ఐఏఎస్లు, అధికారులంతా చరిత్ర ప్రసిద్ధిగన్న నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పాఠాన్ని చదివే ఉంటారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి అర్ధరాత్రి జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ స్వాతంత్య్రో ద్యమ లక్ష్యాల సాధన కోసం భారత్ మేల్కొంటున్నది. పేదరికం లేని, అసమానతలకు తావు లేని, రోగాలు రొష్ఠులెరుగని, అజ్ఞా నాన్ని పారదోలే వ్యవస్థను నిర్మించుకోవడమే జాతి లక్ష్యమ’ని నెహ్రూ ప్రకటించారు. ఇందులో ‘ఫ్యూడలిజం’ ఎక్కడ ఉన్నదో, పెత్తందారీతనమెక్కడ ఉన్నదో అధికారులే వెతికి పట్టుకోవాలి. సువిశాలమైన, వైవిధ్యభరితమైన, బహుళ సంస్కృతుల నిలయ మైన, అత్యధిక జనాభా కలిగిన భారత్ అభివృద్ధి గమనాన్ని ఒక చిన్న సిటీ స్టేట్ సింగపూర్తో పోల్చడం ఏ రకంగా విధాయకమో విజ్ఞులైన అధికారులు గ్రహించే ఉంటారు.ప్రభుత్వ ఉద్దేశాలను వివరించడానికి, ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కార్యోన్ముఖులను చేయడానికి కలెక్టర్ల సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇటువంటి అధికారిక సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చడం తగునా? దేశ తొలి ప్రధానిని కించపరిచే ఉపన్యాసాలు చేయడం సమంజసమేనా? నెహ్రూ అమలు చేసిన డెమోక్రటిక్ సోషలిస్టు విధానాలు ప్రైవేట్ వ్యాపా రులకు ఊడిగం చేసే నేటి పాలకులకు నచ్చకపోవచ్చు. కానీ, వారసత్వంగా వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని కాలదన్ను కొని స్వాతంత్య్రోద్యమంలో ఒక ముఖ్య సేనానిగా పాల్గొని పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన త్యాగధనుడిగానైనా ఆయన్ను గుర్తించి గౌరవించాలి కదా! ‘సంఘ్ పరివార్’కు ఆది నుంచి నెహ్రూతో సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. చాలా కాలంగా అధికారంలో ఉండి అన్ని హంగులూ అమర్చుకున్నందువల్ల నెహ్రూ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్ పెద్దయెత్తున చేపట్టింది.వాళ్లను సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు ఒకరితో ఒకరు పోటీపడు తున్నట్టున్నారు. బీజేపీ వాళ్లను మించి వీర సనాతనవాదిగా చలామణీ కావడానికి ఇటీవల పవన్ కల్యాణ్ పడిన పాట్లను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. నెహ్రూ విధానాల మీద నిందా ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు రకరకాల వేదికల్ని ఉపయోగించుకున్నారే గాని, చంద్రబాబు మాదిరిగా ఐఏఎస్ల సమావే శాన్ని మాత్రం ఉపయోగించుకున్నట్టు లేదు. ఈ రకంగా బాబు వాళ్లకు ఓ కొత్త దారిని చూపించాడనుకోవాలి. చంద్రబాబు పార్టీతో అంటకాగే అలవాటున్న ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.ఇంతకూ బాబు చెబుతున్నట్టు దేశంలో అభివృద్ధి రాహిత్యా నికి కారణమైన నెహ్రూ విధానాలేమిటి? రెండు శతాబ్దాల వలస దోపిడీ అనంతరం భారత్ ఆర్థికంగా చిక్కి శల్యమైంది. యూరప్ పారిశ్రామిక విప్లవం తర్వాత దేశంలో కొత్తగా పరిశ్రమలు రాకపోగా పాతకాలపు పరిశ్రమలు, చేతివృత్తులు మూల పడ్డాయి. బ్రిటన్కు ముడిసరుకుల పంపిణీ చేసే దేశంగా మిగిలి పోయింది. ఫలితంగా స్వదేశీ పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందలేదు. అందువల్ల భారీ పరిశ్రమల్ని, రైల్వేలు, నీటిపారు దల ప్రాజెక్టుల వంటి వాటిని ప్రభుత్వమే తలకెత్తుకోవలసి వచ్చింది. స్వదేశీ పెట్టుబడిదారీవర్గం నిర్వహించగలిగిన పరిశ్ర మల స్థాపనకు వారికి అనుమతులివ్వడం జరిగింది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం పక్కపక్కనే పనిచేయడం వల్ల ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత పెరిగింది. మెరుగైన వేతనాలు, సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఒక కొత్త మధ్యతరగతి వర్గం తయారైంది.కాలక్రమంలో ప్రైవేట్ రంగంలో పరిశ్రమల స్థాపనకు లైసెన్స్రాజ్, రెడ్ టేపిజమ్ ఆటంకంగా మారాయనే విమర్శలు మొదలయ్యాయి. నిజంగానే ఆ కాలంలో (1947–1991) ఆర్ధిక వృద్ధి రేటు నాలుగు శాతానికి మించి పెరగలేదు. ఫలితంగా ఉద్యోగాల కల్పన మందగించింది. అయితే ఇందుకు ప్రభుత్వ రంగం కారణం కాదు. కాలానుగుణంగా ప్రభుత్వాలు వ్యవహ రించి ఎగుమతి దిగుమతుల్లో ప్రొటెక్షనిస్టు పద్ధతులను సంస్కరించి, కొంతమేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించి, లైసెన్స్ రాజ్ – రెడ్ టేపిజాలను నియంత్రించి ఉంటే సరిపోయేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత విచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేయడమే అభివృద్ధి రహస్యమన్నట్టుగా కొందరు దళారీ రాజకీయవేత్తలు పరుగులు తీస్తున్నారు. వీళ్లకు చైనా విజయగాథ వినిపించదు. ప్రభుత్వ రంగమే ఆధిపత్యం వహిస్తూ ప్రభుత్వ నియంత్రణకు లోబడి ప్రైవేట్ పెట్టుబడి పనిచేస్తున్న ఈ ఆర్థిక వ్యవస్థ సృష్టించిన అద్భుతాలు చంద్రబాబు వంటి వారికి కనిపించవు.ప్రైవేటీకరణ అనేది భారీగా కమీషన్లు పిండుకునే కామ ధేనువుగా సంస్కరణానంతర కాలపు రాజకీయవేత్తల్లో కొందరికి కనిపించింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే (1995–2004) ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థ లను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లోనే 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సీపీఎం పార్టీ ఆధారాలతో సహా నిరూపించింది. ఇది పాతికేళ్ల కిందటి సంగతి. ఇప్పుడా విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్ భూములు, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్ నాలుగు యూనిట్లు, మరో అరడజన్ షుగర్ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టిన జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు వైఖరిలో ఏ మార్పూ రాలేదు. ఇప్పుడు ఏకంగా పది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఆయన తెగబడ్డారు.ఒక్కో కాలేజీకి ఖరీదైన 50 ఎకరాల స్థలంతోపాటు నిర్మా ణాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఏటా ఐదువేల రూపా యల నామమాత్రపు ధరకు 66 ఏళ్లపాటు వాటిని బినామీలకు లేదా కమీషన్లకు కట్టబెట్టబోతున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు. పీపీపీ మోడల్ అని ప్రభుత్వ పెద్దలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పేరులోనే తేడా! సారం మాత్రం ఒకటే. ఆ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నట్టయితే పేద, మధ్యతరగతి విద్యార్థులు వారి డాక్టర్ చదువుల కలను సాకారం చేసుకొని ఉండేవారు. ఇప్పుడు లక్షలు పోసి కొనగలిగిన వారికే మెడికల్ సీట్లు. అనుబంధంగా ఏర్పడే పెద్దాసుపత్రుల్లో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ఉన్నత స్థాయి వైద్యం లభించేది. ఇప్పుడా వైద్యాన్ని కూడా కొనుక్కోవాలి. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యను కూడా ఎన్డీఏ ప్రభుత్వం, యెల్లో మీడియా అభివృద్ధికర చర్యగా ప్రచారం చేసుకోవడాన్ని బరితెగింపు వ్యవహారంగానే పరిగణించాలి.ఆర్థిక సంస్కరణల తర్వాత పెరిగిన జీడీపీ వృద్ధి రేటు గురించి, ఉద్యోగాల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచార సాహిత్యం అందుబాటులో ఉన్నది. నిజమే, జీడీపీ వృద్ధి రేటు అంతకుముందున్న 4 శాతం నుంచి 6 శాతానికి ఎగబాకింది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్లనే ఇది సాధ్యమైందనే దండోరా కూడా వేస్తున్నారు. మరి పెరుగుతున్న ఆర్థిక అసమాన తల సంగతి? అసమానతలు పెరగడం అభివృద్ధికి సూచిక అను కోవాలా? మానవాభివృద్ధి సూచీలో మనం ఎక్కడున్నాం? స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, 1950 దశకం ఆరంభంలో మన దేశంలో ఉన్న అగ్రశ్రేణి 1 శాతం (జనాభాలో) శ్రీమంతుల సంపద మొత్తం జాతి సంపదలో 13 శాతంగా ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత (1982) అది 5 శాతానికి పడిపోయింది. ఈ ఒక్కశాతం శ్రీమంతులకు వారి దిగువశ్రేణిలో మరో 10 శాతం సంపన్నులను కలిపితే జాతి సంపదలో వారి వాటా 37 శాతంగా (1952) ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత అది 30 శాతానికి తగ్గింది. అదే సమయంలో జనాభాలోని అట్టడుగు 50 శాతం జనాభా వాటా స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 5 శాతంగా ఉంటే ముప్పయ్యేళ్ల తర్వాత అది 9 శాతానికి ఎగబాకింది. ఇది అభివృద్ధి నిరోధక పరిణామం?!ప్రైవేటీకరణల కాలం లెక్కలు కూడా చూద్దాం. ఈ లెక్క లన్నీ ప్రపంచ అసమానతల డేటా బేస్ (డబ్ల్యూఐడీ)లోవి. ఇప్పుడు మన అగ్రశ్రేణి ఒక్క శాతం శ్రీమంతుల సంపద జాతి సంపదలో 40 శాతానికి చేరింది. ఇది కదా అభివృద్ధి! వీరికి తర్వాత శ్రేణిలోని పది శాతం సంపన్నులను కూడా కలిపితే వారి ఉమ్మడి సంపద 66 శాతానికి చేరుకున్నది. ఇక మిగిలిన అట్టడుగు 50 శాతం జనాభా ఉమ్మడి వాటా జాతి సంపదలో 3 శాతానికి పడిపోయింది. రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస దోపిడీ అనంతరం ఈ వాటా 5 శాతంగా ఉండేది. ఈ పరిణామాన్ని కూడా అభివృద్ధే అందామా?తెలుగువారి సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర సర్కార్ పూర్తిగా సహకరిస్తున్నది. తాజాగా 22 కీలక విభాగాలను ప్రైవేటీకరించడమే దానికి తార్కాణం. పాడి రైతులకు మేలు చేస్తున్న ‘అమూల్’కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటళ్లను ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న పదివేల కోట్ల ఆస్తు లను కూడా కట్టబెడుతున్నారు. ఇకమీదట రాష్ట్ర పరిధిలోని రోడ్లను కూడా పీపీపీ మోడ్లో అభివృద్ధి చేస్తారట! అంటే పల్లె రోడ్ల మీద కూడా టోల్ కట్టాలన్నమాట. దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్నారు. జాతి సంపదలో నానాటికీ తమ వాటాను కోల్పోతున్న పేద ప్రజల కోసం ‘ఇంటికో జోలె’ పథకాన్ని అమలు చేస్తారట. దానికి ‘నాలుగు పీ’ల పథకంగా నామకరణం చేశారు. కొంతమంది సంపన్నుల ఇళ్లను వారికి కేటాయిస్తారు. కేటాయించిన ఇళ్ల ముందే పేదలు అడుక్కోవాలి. బౌండరీలు దాటకూడదు. పేదల జీవితాలను, ఆత్మగౌరవాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నారు. బహుజనులారా... బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
OG సినిమాకు టికెట్ 1000 రూపాయలా? పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లే సెటైర్లు
-
రైతుల కన్నా ఓజీ మీదే శ్రద్ధ ఎక్కువైంది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. కూటమి ప్రభుత్వం వాళ్ల సమస్యలను గాలికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా పవన్ సినిమా టికెట్ రేట్లను పెంచడంలోనే బిజీగా ఉందంటూ మండిపడ్డారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎరువులు, యూరియా అందకుండా రైతులు నష్టపోతున్నారు. అయినా వాళ్ల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎ్ససార్సీపీ పోరాటం చేస్తుంది. పవన్ ఓజీ సినిమా టికెట్ పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై పెడితే బాగుండు. .. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాగైనా అడ్డుకుని తీరతాం. ఎంతటి పోరాంట చేయడానికైనా సిద్ధం అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: పవన్ ఓజీ.. జగనే కరెక్ట్! -
అసెంబ్లీ సాక్షిగా ప్రజలను అవమానించిన పవన్ కళ్యాణ్
-
ఓజీ.. జగనే కరెక్ట్: నట్టి కుమార్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలు రెండు రాష్ట్రాల్లో భారీగా పెంచేశారు. ఏపీలో అయితే ఏకంగా ప్రీమియర్ షో ధర 1000 చేయడంతో సామాన్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా వ్యతిరేఖత వస్తుంది. ఒక సినిమా టికెట్ ధర ఈ రేంజ్లో పెంచడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధర లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఓజీ ధరలపై స్పందించారు.ఓజీ సినిమా టికెట్ రేట్లు ఇంతలా పెంచడం చాలా తప్పని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఈ విషయంలో చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్యతో పాటు ఫిలిం ఛాంబర్, కౌన్సిల్ వారు బాధ్యత వహించాలన్నారు. ఎవరైతే ఈ టికెట్ ధరల పెంపు వెనుక ఉన్నారో వారందరూ ఈ తప్పులో భాగమని పేర్కొన్నారు. ఓజీ టికెట్ ధరల పెంపు విషయంలో ఈ ప్రభుత్వాలు కళ్లు మూసుకొని అనుమతులు ఇచ్చేస్తున్నాయన్నారు. పేదవాడికి పెన్షన్ ఇస్తున్నామని కుడి చేత్తో ఇచ్చి ఇలా ఎడమచేత్తో లాగేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ రేట్లు పెంచితే పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని గుర్తుచేశారు. ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు ఓటీటీ, పైరసీలకు అలవాటు పడుతారన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.టికెట్ ధరల విషయంలో జగనే కరెక్ట్'సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే కరెక్ట్.. ఇండస్ట్రీ మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉండేవి. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఒక్కో టికెట్ మీద రూ. 100 పెంచారు. జీఎస్టీకి సంబంధించి ఎంత ఖర్చు అయిందో చూపితే అంత మొత్తాన్ని తిరిగిచెల్లిస్తామన్నారు. దీంతో చిన్న, పెద్ద చిత్రాలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చాలా బాగా పనిచేసింది. ఈ విషయంలో చిరంజీవి చోరవ చూపించగా జగన్ జీవో రూపంలో సడలింపులు ఇచ్చి ఇండస్ట్రీకి మేలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండానే టికెట్ ధరలు పెంచేస్తున్నారు. జగన్ నిర్ణయాలు కొందరికి నచ్చకపోయినప్పటికీ ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉండేవి.' అని ఆయన గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ ధరలను పెంచేసి ప్రేక్షకులను థియేటర్కు రాకుండా చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఒక్కసారి కర్ణాటక, తమిళనాడులో సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన కోరారు.రైతులకు న్యాయం చేయరుసినిమా టికెట్ ధరలు పెంచిన ఈ ప్రభుత్వ పెద్దలు రైతులకు అండగా నిలబడరని నట్టి కుమార్ ఇలా అన్నారు. 'రైతులు కూడా పెట్టుబడిదారులు.. పేదవాళ్లు.. వాళ్లకు సాయం చేస్తే గొప్పవాళ్లు అయిపోతారు. అందుకే వీళ్లు రైతులకు మద్ధతు ధరలు ప్రకటించరు. కానీ, ఇలా సినిమా టికెట్ ధరలు పెంచి నిర్మాత దానయ్య, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజులకు మాత్రం మేలు చేస్తున్నారు.. కానీ, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సరే సాయం చేయరు. కనీసం యూరియా కూడా వారికి దొరకడం లేదు. ఒక సినిమాకు మద్ధతు ధర ఇచ్చిన ఈ ప్రభుత్వం.. టమాటో, ఉల్లితో నష్టపోయిన రైతులకు మద్ధతు ధర ఎందుకు ఇవ్వరు. కనీసం సినిమాకు ఇచ్చిన ప్రయారిటీ రైతుకు ఇవ్వకుంటే ఎలా.. వాళ్లు ఆత్మహత్య చేసుకోవాలా..? నేడు రైతులు ఆవేశంతో ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించాలి.' -
వాషి యో వాషి.. పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.సాంగ్ రిలీజ్సెప్టెంబర్ 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్ప్రైజ్ వదిలారు. పవన్ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్ చేశారు. ఇది జపనీస్ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.డబ్బులు దండుకునే పనిఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పవన్ కు వినుత వార్నింగ్
-
మీకు దమ్ము, ధైర్యం ఉంటే పాడేరు రండి..
-
పవన్ కు వినుత హెచ్చరిక.. అది కరెక్ట్ కాదు.. మార్చుకో!
-
'ఓజీ' టికెట్ రేట్ల పెంపు.. ‘యూ టర్న్’ అంటూ హరీశ్రావు ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ పెంపుదలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ‘ఎక్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు రూ.800 రేట్లతో స్పెషల్ షోకు అనుమతిస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ సీఎం రేవంత్ వద్దే ఉండటం గమనార్హం. పుష్ప–2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతిచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్ను హరీశ్రావు తన పోస్ట్కు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్ షోలకు ఎలా అనుమతి ఇస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే ‘యూ టర్న్’ అంటూ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలుతెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈమేరకు జీవో కూడా విడుదలైంది. ఈ నెల 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800 అని పేర్కొంది. సినిమా విడుదలరోజు ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరలను పెంచేసింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.ఏపీలో టికెట్ రూ.1,000ఏపీలో 25న అర్ధరాత్రి 1గంటకు ఓజీ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. దాని టికెట్ ధర రూ.1,000 పెంచేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే, మిగిలినరోజుల్లో ప్రస్తుతమున్న ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్లలో రూ.125 , మల్టీప్లెక్స్ల్లో రూ.150 పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. గతంలో ఇంత భారీ ధర ఏ సినిమాకు అవకాశం కల్పించలేదు..@revanth_anumula U TURN@RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/QcJPftqQpb— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం సైతం ధరలు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. ఈ మేరకు ప్రత్యేక జీవోనూ విడుదల చేసింది. అంతేకాకుండా ఈనెల 24న రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.800 గా నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరల పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.150 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. దాదాపు పది రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఏపీలో భారీగా పెంపు..పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
పవన్ కల్యాణ్కు వినుత కోట బహిరంగ లేఖ
సాక్షి, తిరుపతి జిల్లా: జనసేన నేతల్లో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఎంపిక చిచ్చు రేపుతోంది. జనసేన కొట్టే సాయిని చైర్మన్ పదవికి ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్కు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంఛార్జ్ వినుత కోట బహిరంగ లేఖ రాశారు. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపిన వినుత.. పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.‘'కొట్టే సాయి ప్రసాద్కు పదవి ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వడం సరికాదు. నాపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో సాయి ప్రసాద్ ఒకడు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను జనసేన కార్యాలయానికి పంపించాను. మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను’’ అంటూ వినుత బహిరంగ లేఖలో పేర్కొన్నారు. -
Byreddy: ఎక్కడ పుట్టాడో నువ్వే అడుగు... పవన్ తో నన్ను తిట్టిస్తారా..
-
అందుబాటులో ఉండడం లేదన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ
-
పవన్ పేషీపై బోండా ఉమా సంచలన ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్గా కాసేపు ఎపిసోడ్ నడిచింది. పవన్ పేషీపై బోండా సంచలన ఆరోపణలకు దిగగా.. వాటిని పవన్ తోసిపుచ్చారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే 30, 40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూశామని కృష్ణయ్య అంటున్నారు. కానీ, ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తు పెట్టుకోవాలి. కృష్ణయ్య దగ్గరకు వెళ్తే.. పవన్ కల్యాణ్కు చెప్పాలి.. కానీ ఆయన కలవడం లేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్లను సరిదిద్దాలి అని అన్నారు. అయితే.. ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. ‘‘నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది. కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు. పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవు. అందరం కలిసి కలెక్టివ్గా చేయాల్సిన బాధ్యతలు ఇవి అని పవన్ వివరణ ఇచ్చారు. ఆ సమయంలో అధికారుల గ్యాలరీలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్య ఉండడం గమనార్హం. -
'OG' మూవీలో పవర్ఫుల్ రోల్లో ప్రకాశ్ రాజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఓజీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. సత్య దాదాగా ప్రకాశ్ రాజ్ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv— DVV Entertainment (@DVVMovies) September 18, 2025 చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్ -
పవన్ గురించి రిపోర్టర్ ప్రశ్న.. అవినాష్ రెడ్డి సమాధానం అదుర్స్
-
అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు
-
సనాతన శాఖా మంత్రి పవన్.. ఇంత అపచారం జరిగితే ఎక్కడ దాక్కున్నావ్
-
పవన్ కల్యాణ్ ఓజీ.. ఏపీలో భారీగా టికెట్ ధరల పెంపు
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పాడేరు మెడికల్ సీట్లు చంద్రబాబు తీసుకొచ్చారా.. ? పెద్ద అబద్ధం: అప్పలరాజు
-
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?
ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'ఓజీ'. పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే గ్లింప్స్, తొలి పాటతో హై తీసుకొచ్చారు గానీ తర్వాత వచ్చిన సాంగ్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్)రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేస్తున్నారు. అంతెందుకు పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు'కి కూడా రిలీజ్ ముందురోజు రాత్రి షోలు వేశారు. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటంతో మూవీ ఫలితం బెడిసికొట్టింది. దీంతో పోలిస్తే 'ఓజీ'పై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండొచ్చని కొన్నిరోజుల క్రితం టాక్ వినిపించింది. కానీ ఇప్పుడవి లేవని అంటున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువజామున 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్చొచని టాక్. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే గ్యాంగ్స్టర్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాత. (ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!) -
పవన్ కల్యాణ్ ఓజీ.. సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓమీ అనే సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఓమీ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.తాజాగా ఈ చిత్రం నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే పాటను విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రశ్నిస్తే దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్
-
కొట్టేసిన దేవుడి భూముల్లో OG ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి?
-
జన సైనికుల ముసుగులో రౌడీలు.. ఆ దాడి హేయం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: పవన్ కల్యాణ్పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు(Jana Sainiks) దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు వాళ్లను గనుక అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారాయన.‘‘ఆర్ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాత్రం దానికే జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారువందమందికి పైగా జనసేన గూండాలు(Jana Sena Goons) గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు. మరి పవన్ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా?.. వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు??. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా???జనసేన ముసుగు ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని,నన్ను,నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు తిడతారు. పవనను ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేస్తారు. గిరిధర్,సతీష్ ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్ని నాని అన్నారు.మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్(RMP Giridhar Attack) మంగళవారం ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ని నిలదీశారు. ఈ క్రమంలో.. ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. .. జనసేన పెద్దల ఒత్తిడితో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. గిరిధర్కు మద్దతుగా పీఎస్కు వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు కవ్వింపునకు దిగబోయాయి. దీంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని ఠాణా వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఇరు పార్టీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదీ చదవండి: మా పవనన్ననే నిలదీస్తావా? -
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సుగాలి ప్రీతి ఉదంతం.. 33వేల మందికి పైగా మహిళలు అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు ఓ మీడియా ఛానెల్లో విమర్శించినందుకు జనసేన మూకలు అతనిపై దాడి చేయడమేకాక అతని దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. పైగా అతనిని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించి, అతనిపైనే ఫిర్యాదు చేశారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన వివరాలివీ.. బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైఎస్సార్సీపీలో క్రీయాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా చానెల్లో మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు.. ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్కళ్యాణ్ తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని ప్రశి్నస్తూ పవన్ విధానాలను ప్రశి్నంచారు.ఈ వీడియో వైరల్ అవడంతో జనసేన నాయకుడు కొరియర్ శ్రీనుతోపాటు దాదాపు యాభై మందికి పైగా గురువారం రాత్రి 10.30 ప్రాంతంలో గిరి ఇంటిపై మూకుమ్మడిగా దాడిచేశారు. ఇంట్లోని వస్తువులతో పాటు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు. అతనిపైనా విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతేగాక.. గిరిని మోకాలిపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. అలాగే, దెబ్బలు తిన్న గిరిపైనే బందరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసి కేసు పెట్టించేందుకు బరితెగించారు. జనసేన నేతలపై పేర్ని నాని మండిపాటు.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి పేర్ని నాని జనసేన నాయకులపై మండిపడ్డారు. అకారణంగా, అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసినా.. దాడికి పాల్పడిన జనసేన నాయకులకు పోలీసులు కొమ్ముకాయాలని చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందరు డీఎస్పీ సీహెచ్ రాజాను కలిసి హెచ్చరించారు.తమ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళ్తానన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఏసుబాబు, ఎస్ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదుచేసుకున్నారు. మరోవైపు.. డీఎస్పీ కార్యాలయానికి పేర్ని నాని వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై జనసేన నాయకులు దాడి
-
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
ఏపీ ప్రజలారా.. చూస్తున్నారా బాబు మోసాన్ని !
-
Magazine Story: అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వానికి విజయోత్సవ సభ
-
పవన్ పై వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ వేరే లెవల్
-
సినిమా హిట్టు కలెక్షన్ ఫట్ చంద్రబాబుపై కేతిరెడ్డి సెటైర్లు
-
కత్తులతో జనసేన ర్యాలీ.. ఇప్పుడు పవన్ ప్రశ్నించరా?
-
మాయల ఫకీరు మాటలు.. పిట్టలదొర పంచాయతీలు.. కూటమిపై సెటైర్లు
-
NO.1 క్రిమినల్స్.! అంతా మనోళ్లే!
-
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రైతుల నోట్లో మట్టి.. సిగ్గుపడండి సీఎం, డిప్యూటీ సీఎంకు ఇచ్చిపడేసిన RK రోజా
-
MLC Kumbha Ravibabu: న్యాయం చేయమని అడిగితే అంత అలుసా..!
-
100కోట్ల GST ఎగ్గొట్టిన పవన్ బాబా!
-
గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా.. నువ్వొక డిప్యూటీ సీఎం గుర్తుందా
-
Big Question: మోదీ, అమిత్ షా మీ ఫ్రెండ్ కదా.. దమ్ముంటే రుజువు చెయ్..
-
సుగాలి ప్రీతి తల్లి ఆవేదన.. ఈ పాపం ఎవరిది పవన్?
-
కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు: బొత్స
-
పవన్.. మీరు ఉప్పు, కారం తినడం లేదా?
సాక్షి,కాకినాడ: ఊగిపోయి మాట్లాడావు కదా.. ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ,లాభంలేదని చంద్రబాబు బుర్రలో ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా ఎందుకు దొరుకుంతుంది? కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా ఎందుకు దొరకడం లేదు. 9వ తేదీన రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం. ఆర్డీవో ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తాం. 32మంది బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కుపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. విశాఖ ఉక్కుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విశాఖ ఉక్కు గురించి సీఎం,డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు. పవన్ కల్యాణ్ ఉగిపోయి మాట్లాడావు కదా.. ఏమైందీ మీ పౌరుషం. ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యచరణ ఏంటీ? పవన్.. మీరు ఉప్పు కారం తినడం లేదా?. ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు. 15నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.2లక్షల కోట్లు అప్పు చేసిందని’ వ్యాఖ్యానించారు. -
బర్త్ డే రోజు పవన్ కు బిగ్ షాక్
-
కంఫర్ట్ జోన్లోనే పవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య. చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు. ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించి హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడతో సుమారు రూ.60 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. దీంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కనీసం తమకు జీఎస్టీ అయినా చెల్లించాలని నిర్మాతను బయ్యర్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. తాను కూడా నష్టపోయానని సంబంధం లేదని తేల్చిచెప్పినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. సుమారు రూ. 18 కోట్ల జీఎస్టీలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశాన్ని సినిమాటోగ్రఫీ మాజీ మంత్రి పేర్ని నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జీఎస్టీ బిల్లు లేకుండానే అనుమతిహరి హర వీరమల్లు టికెట్ల రేట్లు పెంపు, జీఎస్టీ అంశం గురించి పేర్ని నాని ఇలా అన్నారు. ' ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీఓ ప్రస్తుత ప్రభుత్వం కొట్టివేయలేదు. కానీ, దానిని పాటించకుండా వారికి ఇష్టం వచ్చనట్లు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఒక్క జీఎస్టీ ప్రూఫ్ కూడా ఇవ్వకుండా కేవలం తెల్లకాగితంతో నిర్మాత వెళ్లితే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అందరికీ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇది తప్పనిపించలేదా.? అందరిని ప్రశ్నిస్తానని చెప్తాడు.. కానీ, ఆయన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేడు. సూక్తులు మాత్రమే చెప్తాడు.. వాటిని ఆయన ఎంత మాత్రం పాటించడు.' అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఓ ఎందుకు రద్దు చేయలేదు?సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఓ గురించి నాని ఇలా అన్నారు. 'హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవాలని మేము జీఓలో చెప్పాం. అందుకు సంబంధించిన జీఎస్టీ ప్రూఫ్స్ కూడా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే టికెట్ ధరల పెంపునకు అనుమతి తీసుకోవాలని గతంలో మేము జీఓ జారీ చేశాం. బ్లాక్ టికెట్ల అమ్మకాలు నిలువరించేందుకు అడ్డుకట్ట వేశాం. దీంతో పవన్ కల్యాణ్ ఊగిపోయారు. సినిమాల కోసం తాము పెట్టుబడిపెట్టుకుని నిర్మించుకుంటే ప్రభుత్వ జోక్యం ఏంటి అంటూ ఆయన రెచ్చిపోయారు. తాము తెచ్చిన ప్రభుత్వ జీఓపై నోటికొచ్చింది మాట్లాడుతూ ఊగిపోయారు. కానీ, ఇప్పటికీ అదే జీఓను ఏపీ సినిమా పరిశ్రమలో ఎందుకు కొనసాగుతుంది..?' అని నాని ప్రశ్నించారు. -
ఇదేం పరిపాలన అయ్యా.. బాబు, పవన్ కు పేర్ని కిట్టు ఛాలెంజ్
-
'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్
'ఓజీ' సినిమా నుంచి కొత్త గ్లింప్స్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం.. కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో విలన్ పాత్రధారిని పరిచయం చేశారు. అతడి పాత్ర పేరు ఓమి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ రోల్ చేశాడు. సదరు పాత్రతో గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే ఓజీ అని చెప్పించారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్గా మొదలుపెట్టేశారు)అంతా బాగానే ఉంది గానీ పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడిని హైలైట్ చేసే గ్లింప్స్ లాంటిది పడితే అభిమానులు కాస్త ఖుషీ అయ్యేవారు. అలా కాకుండా హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేలా గ్లింప్స్ రిలీజ్ చేయడం కాస్త విచిత్రంగా అనిపించింది. ఎప్పటిలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సుజీత్ దర్శకుడు కాగా తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు అభిమానుల్లో బజ్ గట్టిగానే ఉంది. పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు' దారుణంగా ఫెయిల్ అవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్) -
ఆటోపై పవన్ పోస్టర్ తీసేస్తున్న ఫ్యాన్స్
-
ప్రచారానికి వాడుకుని వదిలేశారు: సుగాలి ప్రీతి తల్లి పార్వతి
నంద్యాల (అర్బన్): హత్యాచారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసేనాని పవన్కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు. నంద్యాలలో సోమవారం గిరిజన సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ కేసును గాలికి వదిలేశారన్నారు. న్యాయం చేయాలంటూ అమరావతికి వెళితే జన సైనికులు, వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులు వెటకారం మాటలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ రెడ్బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్నాయక్ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం పవన్కళ్యాణ్కు అటవాటుగా మారిందని, ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు, సమాఖ్యల సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు. కార్యక్రమంలో జీపీఎస్ అధ్యక్షుడు రాజునాయక్, ఉపాధ్యక్షుడు రాంబాలాజీనాయక్, మాలమహానాడు అధ్యక్షుడు సాంబశివుడు, బిలావత్ శంకర్నాయక్, విక్రం సింహనాయక్ పాల్గొన్నారు. -
నాటి ప్రగల్భాలు ఏమయ్యాయి పవన్!
కర్నూలు(టౌన్): సుగాలి ప్రీతి హత్యాచారం కేసుపై గత ఎన్నికలకు ముందు ఊగిపోతూ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడరేమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులోని వాసవీ గార్డెన్స్లో ఉన్న సుగాలీ ప్రీతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రీతి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.అనంతరం వరుదు కళ్యాణి మాట్లాడుతూ 2017 ఆగస్టులో ప్రీతి హత్యాచారం జరిగితే ఆ తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశి్నంచారు. ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకున్నారని, అధికారంలోకి వస్తే దోషుల తాట తీస్తామని, వదిలి పెట్టే ప్రసక్తి లేదని ఊగిపోతూ ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అపాయింట్మెంటు కూడా ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం ‘‘రాష్ట్రంలో రోజూ 70 నుంచి 80 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కారు మహిళల రక్షణలో విఫలమైంది. హోంమంత్రిగా మహిళ ఉన్నా.. అబలలకు రక్షణ లేదు. అసలు హోంమంత్రి అనిత పనిచేస్తున్నారా? టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నా చర్యలు లేవు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని, కేసును సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రకు అనుమతి కోరితే ఈ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదు? రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన లోకేశ్.. సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు.?’’ అని కళ్యాణి ప్రశ్నించారు. జగనన్న వల్లే బాధిత కుటుంబానికి న్యాయం ‘‘2019లో జగనన్న సీఎం అయిన తరువాత సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యో గం, రూ.8 లక్షల నగదు అందజేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కారు ప్రీతి కేసులో న్యాయం చేయాలి. ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.’’ అని కళ్యాణి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు విజయ మనోహారి, గాజుల శ్వేతారెడ్డి, కల్లా నాగవేణి రెడ్డి, మంగమ్మ, భారతి పాల్గొన్నారు. -
బర్త్డే స్పెషల్
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కల్యాణ్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయనంక బోస్, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్: దినేష్ నరసింహన్, హరీష్. -
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
వైఎస్ జగన్ ఒక పెళ్లికి వెళితే వచ్చిన జనం కూడా నీ సభకు రాలేదు
-
మీ చెట్టుకు పళ్ళు ఉంటేగా రాళ్లు వేయడానికి.. పవన్ పై పేర్ని నాని లాస్ట్ పంచ్ సూపర్
-
సుగాలి ప్రీతీని అడ్డుపెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యావ్.. పవన్ పై YSRCP మహిళలు ఫైర్
-
సుగాలి ప్రీతి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ మోసం చేశారు
-
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు.. లైవ్ లో బొమ్మేసి ఏకిపారేసిన పేర్ని నాని
-
టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ: పేర్ని నాని సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా?. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిమా!. జనసేన సిద్ధాంతం అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేశారు.ప్రీతి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భూమి, ఇల్లు, ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి పవన్ కేకలు వేస్తూ మాట్లాడారు. ప్రీతి కేసును సీబీఐని అప్పగించాలని పవన్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయంలోనే నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలిప్రీతి హత్య విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును.. కానీ, ఆయనను ప్రశ్నించే ధైర్యం పవన్కు లేదు’ అంటూ విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. కూటమి వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. వీఆర్ఎస్ తీసుకోవడానికి మరో 1000 మంది ఉద్యోగులు రెడీ ఉన్నారు’ అని తెలిపారు. -
స్టీల్ ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది..స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటాము. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం. మా పార్టీ కార్పొరేటర్ల పోరాటంతో GVMCలో స్టీల్ ప్లాంట్పై తీర్మానం చేయించారు.విశాఖ ఉక్కు ప్రజల అందరి హక్కు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే కూటమి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బయట పడింది. ప్లాంట్ కోసం కూటమి నేతలు గతంలో దొంగ దీక్షలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మొదటి నుంచి వైఎస్ జగన్ది ఒకే మాట.. ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పారు. ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారు.పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు కారం తినాలని మాట్లాడారు. ఈ రోజు ఉప్పు కారం ఎవరికి పంపుతారు. ఎవరు తినాలి ఉప్పు కారం.. అది పవనే చెప్పాలి. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రధాన మంత్రితో మాట్లాడలేదు. వైఎస్ జగన్ ధైర్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని మోదీని కోరారు’ అని గుర్తు చేశారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ వ్యాఖ్యలకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
పవన్ కల్యాణ్ కు షాకిచ్చిన జనసైనికులు
-
ఒంటరి పోటీతో ఎలా ఉండేదో!.. చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యలు!
అల్లిపురం/జగదాంబ(విశాఖ): ఒంటరి పోటీతో జనసేనకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవన్న విషయం ఎప్పుడూ చర్చనీయాంశమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీలు పెట్టి, రాజకీయ వ్యూహం లేకపోవడం వల్ల ఎంతో మంది వెళ్లిపోయారని అన్నారు. అందుకే కేవలం ‘ఐడియాలజీ’పై మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహంతో గత ఎన్నికల్లో కలిసి జట్టుగా పోటీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ‘విడిగా వెళితే వచ్చి ఉండేదో.. రాదో..’ అని ఈ సందర్భంగా అన్నారు.రానున్న రోజుల్లో సినిమాలూ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల అనంతరం శనివారం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు త్రిశూల్ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తాం. ఏదో ఒక రోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి సుస్థిరంగా ఉండాలి. జనసేన వల్లే విశాఖ స్టీలు ప్రైవేటుపరం కాకుండా ఆగింది’ అని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. చిరంజీవిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు! కాగా, ‘పార్టీలు పెట్టి సరైన రాజకీయ వ్యూహం లేక వెళ్లిపోయారు’ అంటూ పరోక్షంగా అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించే ఆయన మాట్లాడరనే గుసగుసలు సమావేశంలోనే కార్యకర్తల నుంచి వినిపించడం గమనార్హం. దీంతో, పవన్ వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో సైతం పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
సుగాలి ప్రీతి మరణంతో పవన్ రాజకీయం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 14 ఏళ్ల గిరిజన బాలికపై టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వీరికి పరిహారం ఇచ్చింది. కేసును సీబీఐకి అప్పగించింది. తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీబీఐ కేసు నుంచి తప్పుకుంది. ‘న్యాయం’ చేస్తామన్న పవన్ కళ్యాణ్ మాట మార్చారు.‘ప్రీతి’కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని వారికి శిక్ష పడాలనే డిమాండ్తో ప్రీతి సమాధి వద్ద నుంచి అమరావతికి వీల్ చైర్ ర్యాలీ చేయాలనుకున్న ఆమె తల్లి సుగాలి పార్వతిని ప్రభుత్వం, పోలీసులు బెదిరించి ఆపేశారు. దీంతో ఏం చేయాలో తెలీక నిత్యవేదనతో జీవిస్తోంది ప్రీతి కుటుంబం. పవన్ కళ్యాణ్పై ప్రీతి తల్లి, ఆమెపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తిరిగి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరిది తప్పు అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ క్రమంలో ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ ప్రభుత్వ హయాంలో హత్యాచారం రాజునాయక్, పార్వతిల కుమార్తె ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూలులో చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతిపై అత్యాచారం చేసి, చంపేసి ఫ్యాన్కు ఊరేసుకున్నట్లు చిత్రీకరించారు. 2017 ఆగస్టు 21న పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య రిపోర్టులన్నీ ప్రీతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని తేల్చాయి. అయినప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. ఆశ్చర్యమేంటంటే కేసులోని ముగ్గురు కీలక నిందితుల్లో ఏ2, ఏ3కి ఎనిమిది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ పోక్సో కేసులో 90 రోజుల వరకు బెయిల్ ఇవ్వకూడదు.అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో బెయిల్ వచ్చింది. హత్యాచారం నిజమే అని అన్ని రిపోర్టులు చెప్పినా.. నిందితుల డీఎన్ఏ, అత్యాచారం ఘటనతో మ్యాచ్ కాలేదని చెప్పింది. అప్పుడు అధికారంలో ఉన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలను మార్చి నిందితులను తప్పించారని ప్రీతి తల్లి ఆరోపిస్తోంది. మరో ఘోరం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో బాధిత కుటుంబాలకు 6 నెలల్లో పరిహారం ఇవ్వాలి. కానీ రూ.8,12,500 డబ్బు మినహా 6 నెలల్లో ఇవ్వాల్సిన ఇతరత్రా బెనిఫిట్స్ను నాటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. దీన్నిబట్టే ఆ కేసుపై అప్పటి ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టమవుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ ప్రీతి తల్లి 2018లో వైఎస్ జగన్ను పాదయాత్రలో కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ప్రీతి తల్లి కలిశారు. కేసును సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేశారు. 2021లో కర్నూలు నగరంలో 5 సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వైఎస్ జగన్ అండగా నిలిచారు. రాజకీయానికి వాడుకున్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతిపై హత్యాచారం 2017లో జరిగితే అప్పట్లో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020 ఫిబ్రవరి 11న కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు. 2024లో కూటమి అధికారం వచ్చాక పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు. 2024 జూలై 27న ప్రీతి తల్లి కలిసి న్యాయం కోసం వేడుకున్నా పవన్ స్పందించలేదు. ఇంతలో ఈ కేసును స్వీకరించే వనరులు తమ వద్ద లేవని 2025 ఫిబ్రవరి 13న హైకోర్టుకు సీబీఐ చెప్పింది.అయినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చొరవ తీసుకోలేదు. దీంతో కేసును సీబీఐ స్వీకరించాలని ప్రీతి తల్లి దివ్యాంగురాలైన పార్వతి కౌంటర్ వేశారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసును సీఐడీకి అప్పగించి నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం యత్నించింది. అయితే ఇందులో డీఎస్పీ స్థాయి అధికారితోపాటు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ప్రమేయం ఉందని.. వారిని సీఐడీ విచారించలేదని, సీబీఐతోనే విచారణ చేయించాలని పార్వతి ప్రభుత్వానికి లేఖ రాశారు. న్యాయం జరిగేదాకా పోరాటంఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలో.. బెనిఫిట్స్ ఇవ్వంది అప్పుడే.. జగన్ ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు సీబీఐకి కేసును అప్పగిస్తూ జీవో జారీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ కేసు నుంచి తప్పుకుంది. సీఐడీకి అప్పగించింది. అదీ సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు విచారిస్తారట. ఈ కేసులో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కేఎన్ వినోద్కుమార్, రమణమూర్తి, సీఐలు మహేశ్వరరెడ్డి, శేషయ్యతో పాటు ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ లక్ష్మీనారాయణను విచారించాలి. వీరే కేసును నీరుగార్చారు. వీరిని విచారిస్తే ఎవరు ఒత్తిడి చేశారు? కేసు ఎందుకు నీరుగార్చారో తేలుతుంది. నిందితులకు శిక్ష పడుతుంది. ప్రీతికి న్యాయం జరుగుతుంది. అప్పటి వరకూ పోరాటం చేస్తా. – పార్వతి, సుగాలి ప్రీతి తల్లి -
జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టకు..!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును.. పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై పవన్ కళ్యాణ్ పోస్టర్ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్ కవర్ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అంబేద్కర్ కంటే పవన్ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?.. -
జనసేనలో అసంతృప్తి.. కిందా మీదా పడ్డ పవన్ కల్యాణ్
విశాఖ సిటీ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. కూటమి ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని పార్టీ నేతలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు, అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే.. అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టేశారని అధినేతనే నిలదీశారు. తమకు పదువులే కాదు.. కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయారు. వారిని సముదాయించడానికి పవన్ కల్యాణ్ కిందా మీదా పడాల్సి వచ్చింది. జనసేన ప్లీనరీ సందర్భంగా రెండు రోజులుగా విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు. ఇందులో నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో తమ పరిస్థితులను, కష్టాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలం జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని నమ్మిన జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇచ్చే బలంతోనే జనసేన జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలని పిలుపునిచ్చారు. సినిమా అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం తన ఉద్దేశం కాదని, పార్టీని సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నామని చాలా మంది అడుగుతున్నారన్నారు. కానీ జనసేనను భుజాన వేసుకుంటూ మోస్తున్నది జనసైనికులు, వీరమహిళలే అన్నారు. కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కూటమిలో విలువ లేదు.. కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు, కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నారని కొందరు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని, తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అధికారులు సైతం తమకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడితే ఇప్పటి వరకు పదవులు లేవని, గుర్తింపు కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని, దీని నుంచి బయట పడే విషయంపై పార్టీ పెద్దలు దృష్టిసారించాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలని, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ ప్రభావం పారీ్టపై కూడా పడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలకు అధినేత పవన్ సరి్ధచెప్పడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. -
రామ్మోహన్ నాయుడు వీడియో వేసి ఏకిపారేసిన గుడివాడ
-
రుషికొండలో పవన్, నాదెండ్ల కొత్త డ్రామా.. గుడివాడ అమర్నాథ్ మాస్ కౌంటర్
-
రుషికొండలో పవన్, నాదెండ్ల కొత్త డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖ: రుషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీపడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రుషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు రుషికొండ పర్యాటక ప్రాంతంగా మారింది. చంద్రబాబు హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కడతే అది పూరి గుడిసె.. అమరావతిలో ఐదు ఎకరాల్లో చంద్రబాబు రాజభవనం కడితే అది స్కీమ్ ఇల్లు. వైఎస్ జగన్ ఇల్లు కట్టుకుంటే అవి మాత్రం ప్యాలెస్. రుషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. అందుకే రుషికొండ భవనాలు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. రుషికొండ భవనం సీలింగ్ కట్ చేశారు. కట్ చేసిన ప్రాంతంలో పవన్ ఫోటో షూట్ చేశారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి కారిపోతుంది. చదరపు అంగుళానికి రూ.13వేలు పెట్టి కట్టారు. వాటి దుస్థితి చూడండి. అవి పవన్కు కనిపించడం లేదా?. ఏరోజైనా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమరావతి సచివాలయానికి వెళ్లారా?. ఎన్నికల్లో రుషికొండ భవనాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు. పర్యాటక రిసార్ట్ అంటూ ఎందుకు జీవో విడుదల చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్డ్ చేయడానికే రుషికొండలో పవన్ డ్రామాకు తెరలేపారు. రుషికొండలో పవన్, నాదెండ్ల మనోహర్ ఫోటో షూట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.స్టీల్ ప్లాంట్ కోసం డైవర్షన్ పాలిటిక్స్కు పవన్ కళ్యాణ్ తెరలేపారు. విశాఖ ఉక్కు నా ఆత్మ అంటూ చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడారు. విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఈవెంట్ల కోసం విశాఖ, పేమెంట్లు కోసం అమరావతి వాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చేతగాని వ్యక్తులు ఎవరో పవన్ను చూస్తే తెలుస్తుంది. వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డున పడ్డారు. వారి గురించి చంద్రబాబు, పవన్ ఒక మాట మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మా వైఖరి మారలేదు. మొదటి నుంచి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. స్టీల్ ప్లాంట్పై మా వైఖరి ఒకటే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కూటమి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు. వైఎస్ జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు, పవన్, లోకేష్ వైజాగ్ వస్తున్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. తప్పుడు హామీలు, అబద్ధాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల అవస్థలు కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్పై గతంలో పవన్ కల్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏం అయ్యాయి? అని ప్రశ్నించారు. -
KSR Live Show: ఆటలో అరటిపండు.. పవన్ ను వాడుకుంటున్న చంద్రబాబు
-
రుషికొండ డ్రామా బట్టబయలు
-
కుట్ర అడ్డం తిరిగింది.. అడ్డంగా ఇరుక్కున్న బాబు.. పవన్
-
Big Question: కార్మికులు రోడ్డున పడుతుంటే రుషికొండలో ఏం చేస్తున్నావ్ పవన్
-
నోటికి అన్నమే కదా తింటున్నావ్.. పవన్ పై జాడ శ్రావణ్ సంచలన వ్యాఖ్యలు
-
వీరమల్లును మించిన ఫ్లాప్ డ్రామా.. కుట్ర బయటపెట్టిన ఈశ్వర్
-
సుగాలి ప్రీతి తల్లిపై ఎదురుదాడి.. బయటపడ్డ పవన్ నిజస్వరూపం
-
జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక రిసార్ట్
ప్రతి విషయంపైనా ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నైజం అని మరోసారి నిరూపితమైంది...! విశాఖపట్నం రుషికొండ భవనాల సాక్షిగా... ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగా... చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు సాగించినదంతా తప్పుడు ప్రచారమేననితేలిపోయింది..! రుషికొండలో నిర్మించినది మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్యాలెస్ కాదని, అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది...! అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... దాదాపు ఏడాదిన్నర పాటు రుషికొండ భవనాలను విస్మరించింది...! ఇప్పుడు అది వైఎస్ జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ నిజాన్ని ఒప్పుకొని నాలుక్కర్చుకుంది...! ...అయితే, ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు... రుషికొండ భవనాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ముందుపెట్టి పెద్ద డ్రామా ఆడింది..! సీఎం చంద్రబాబు డైరెక్షన్లో... రుషికొండ భవనంలో పవన్ కళ్యాణ్ తన నట కౌశలాన్ని చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. రీల్ యాక్షన్, డ్రామా సన్నివేశాలను రియల్గానూ కొనసాగించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా సాగిందిలా..సాక్షి, అమరావతి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్... శుక్రవారం ఉదయం హఠాత్తుగా రుషికొండపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యద్భుత పర్యాటక భవనాలను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. అద్భుతంగా నిర్మించిన ఈ భవనంపై గతంలోనూ ఏడుపు ప్రదర్శించిన పవన్ మరోసారి అదే కంటగింపు కొనసాగించారు. రూ.లక్షల్లో కరెంట్ బిల్లు వస్తోందంటూ ఆరోపించారు. రూ.450 కోట్లతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు. అసలు వాస్తవం ఏమంటే, రుషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్నిచూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేటుకు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు... పవన్ కళ్యాణ్ను పంపించి డ్రామా సృష్టించినట్లు తెలుస్తోంది. నాసిరకం అని ముద్ర వేసే కుట్ర: రాజధాని పేరిట రూ.వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించిన చంద్రబాబు... కేవలం రూ.450 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలను చూసి అచ్చెరువొందారు. అద్భుతంగా నిర్మించారంటూ గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కితాబిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పారీ్టల నేతలంతా కూడా అద్భుతం అని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రుషికొండ నిర్మాణాల వ్యయాలను బేరీజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయం పైనా చర్చ లేవనెత్తారు. దీంతో రుషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు కుట్ర ప్రారంభించారు. ఏడాదిన్నర ఖాళీగా ఉంచి... దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చూసినప్పుడు లోపల సీలింగ్ విరిగి పడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే.. బరువైన సీలింగ్ నాసిరకంగా ఉండడం వల్ల పడిపోతే.. 90 డిగ్రీల కోణంలో సరిగ్గా కిందపడుతుంది. కానీ, ఈ ముక్కలు కాస్త పక్కన పడ్డాయి. పైగా సీలింగ్ను చూస్తే రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది. అంటే, పవన్ వస్తున్నారని తెలిసి.. ప్రభుత్వం ఇదే అదనుగా సీలింగ్ను విరగ్గొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లీకులు లేకుండా సీలింగ్ ఎలా పడిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. కావాలని రుషికొండ భవనానికి చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇల్లు ఖాళీగా ఉన్నా కరెంటు బిల్లు రాదా? రుషికొండ భవనాలకు భారీగా కరెంటు బిల్లు వస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే, పటిష్ఠ నిర్మాణాన్ని ఏడాదిన్నరగా వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా? అంటూ అధికారులు గుసగుసలాడడం కనిపించింది. అయినప్పటికీ, ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పేనని చెప్పడం చూస్తే... అభాండాలు వేసేందుకు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరమ్మతుల పేరుతో కొట్టేసి.. ప్రైవేట్కు ఇచ్చేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాలను ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్కు ఇచ్చేందుకు స్కెచ్ వేశారు. టూరిజం భవనాలు కాబట్టి.. టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి, దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు రుషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ భవనాలు ఎందుకు పనికొస్తాయి? అని స్వయంగా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రైవేట్కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే తనపై వ్యతిరేకత వస్తుందని భావించి, పవన్ను పావుగా వాడుకున్నట్లుంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్తో చంద్రబాబు మాట్లాడి రుషికొండ భవనాలను పరిశీలించాలని ప్రైవేట్కు ఇవ్వాలా? ఎలా వాడాలి? అనేదానిపై మీడియాతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. బాబు పథకం ప్రకారమే... అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత పవన్ ప్రవేశించి.. సినిమా షూటింగ్ తరహాలో యాక్షన్ డ్రామా మొదలుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కర్నూలుకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య అంశాన్ని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ లబి్ధకి ఉపయోగించుకున్నారు. దీనిపై ప్రీతి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసు ఫైల్ పైనే సంతకం చేస్తానని పవన్కళ్యాణ్ చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నిoచారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు పవన్.. విశాఖలో రుషికొండ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రులూ.. ఏం చేద్దాం చెప్పండి..! రుషికొండ భవనాలు పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ వాస్తవాన్ని అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భవనాలను సముచితంగా ఉపయోగించుకునేలా అధ్యయనానికి, సిఫార్సులు చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ రిసార్ట్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు.విశాఖ స్టీల్ప్లాంట్పై కిక్కురుమనకుండా..» అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారిందేల? » ప్లాంట్ ప్రైవేటీ కరణపై జనసేనాని రెండు నాల్కల ధోరణివిశాఖ స్టీల్ ప్లాంట్లోని కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గురించి పవన్ కిక్కురుమనలేదు. అసలు ఆ విషయం రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూసేందుకు వెళ్లారు. అందులో సీలింగ్ వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేశారు. అటు రూ.వేల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా డైవర్ట్ చేస్తూ ఇలా పూట గడిపేశారని విశాఖ యువత దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో టీడీపీ, జనసేన ఎంపీల బలం ఉన్న ఈ సమయంలో పవన్కళ్యాణ్ కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విశాఖ పర్యటనలో బేలగా మాట్లాడారు. ఇది కార్మికులతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేంద్రం మెడలు వంచైనా ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు ప్రతిఘటిస్తుంటే.. ‘‘ఢిల్లీ అంటే ఏమనుకుంటారు?’’ అంటూ వారిని పరోక్షంగా తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వేగంగా చేపడుతున్న ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలేవీ చేపట్టకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ధోరణి కనబరిచారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా దీక్షకూ సిద్ధమని మాట్లాడిన జనసేన అధినేత, ఇప్పుడు కార్మికులను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు. క్యాప్టివ్ మైన్స్ తేవడం చేతకాక వైఎస్సార్సీపీపై నిందలా? » చంద్రబాబు, పవన్ చేతికానితనంతోనే ప్రైవేటీకరణ » వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకానితనం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను వేగంగా కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉంటూ టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్ను సాధించలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ లాస్లో ఉన్నట్టు చూపించి అమ్మేసే పనిలో ఉంటే మౌనం దాల్చారని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని... తాము ఉద్యోగులు, కార్మికుల తరుఫున పోరాడతామని చెప్పారు. ఈ ప్లాంట్కు జపాన్, కొరియా, అమెరికా, రష్యాల్లో మార్కెట్ ఉందని, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది వైఎస్ జగన్. ఆపలేక చేతులెత్తేసింది మీరు. చిత్తశుద్ధి లేని కూటమి నాయకులు, ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారు’ అంటూ జూపూడి మండిపడ్డారు. -
మాపై పవన్ ఆరోపణలు సరికాదు: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్న తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు.‘‘తమకు న్యాయం చేయక పోగా పవన్.. తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ రెండు ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు. డీఎన్ఏ రిపోర్టులు మార్చారని.. పవన్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించేవరకు పోరాడతా’’ అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు.