breaking news
AP Politics
-
ముగిసిన ఓజీ ప్రమోషన్స్! మళ్లీ పొలిటికల్ మోడ్లోకి..
హైదరాబాద్/అమరావతి, సాక్షి: జ్వరంతో రాజకీయాలకు, తన విధులకు స్వల్ప విరామం తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి బిజీ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు.వైరల్ ఫీవర్ కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని ఆయన సిబ్బంది అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడికి వచ్చాక ఆయన జ్వరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాగూ వచ్చా కదా అని.. హైదరాబాద్లో అన్నయ్య చిరు అండ్ మెగా ఫ్యామిలీతో కలిసి ఓజీ స్పెషల్ ప్రివ్యూ వేసుకుని చూశారు. అంతేకాదు.. ఓజీ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొని సందడి చేశారు. అఫ్కోర్స్.. ఈ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పవన్ను పరామర్శించారు అది వేరే విషయంలేండి. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్న టైంలో సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ’’ చేసిన వ్యాఖ్యలు.. వాటిపై స్పందించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ చిరు ఒక బహిరంగ ప్రకటనతో తేల్చేయడంతో బాలయ్యపై అటు మెగా అభిమానులు, ఇటు వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడాన్ని ఇటు చిరు ఫ్యాన్స్తో పాటు అటు జనసేన కార్యకర్తలే ఒకానొక దశలో భరించలేకపోయారు. మరి జ్వరం తగ్గింది కదా.. పొలిటికల్ అవతార్లోకి మారిపోయారు కదా.. ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి అంటున్నారు పలువురు నెటిజన్లు. -
9న అనకాపల్లికి వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు. .. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు. -
తెలివితక్కువ కథ(నా)లకు కేరాఫ్గా..
మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ, లోక్సభలో వైఎస్సార్ పార్టీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావడం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకు చెంపపెట్టే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా జరిగిన ఈ అక్రమ అరెస్ట్ ప్రత్యేక అధికారుల బృందం (సిట్)తోపాటు, కల్పిత కథలతో మద్యం కేసంటూ శివాలెత్తిన ఎల్లోమీడియాకూ పెద్ద హెచ్చరికగా కూడా చూడొచ్చు. ఎల్లోమీడియా కథనాలు చదివితే అర్థమయ్యేది ఒక్కటే. జర్నలిజానికి, నైతిక విలువలకు ఎప్పుడో పాతరేశారు అని. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏమంది? మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రను, మాస్టర్మైండ్ అనేందుకూ ప్రాథమిక ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. ముడుపుల వసూళ్ల ఆరోపణలకు, నేరపూరిత కుట్రకూ ఆధారాలెక్కడని ప్రశ్నించింది. సహ నిందితుల వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత ఉండదని తేల్చింది. ఒట్టి ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. జర్నలిజానికి విలువిచ్చే ఏ మీడియా సంస్థ అయినా.. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, బెయిల్ వచ్చిన సందర్భంలోనూ వార్తకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అరెస్ట్ను పతాక శీర్షికలకు చేర్చి బెయిల్ వార్తను అప్రధాన్యంగా మొక్కుబడిగా ఇవ్వడాన్ని బట్టే వీరి నైజం ఏమిటన్నది అర్థమైపోతుంది. ఈ క్రమంలో వారు కోర్టు వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటు ఎల్లోమీడియా, ఇటు పోలీసులు అధికారుల వద్ద కూడా సమాధానాలు లేవు. దీన్నిబట్టి చూస్తే జగన్ హయాంలో స్కాముల కోసం ఎల్లోమీడియా భూతద్దం వేసి చూసినా ఏమీ దొరకలేదన్నది స్పష్టమైంది. అందుకే ఒక మద్యం కేసు కట్టుకథ సృష్టించారు. డిస్టిలరీ కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథ అల్లారు. ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇచ్చామని కంపెనీలు కదా ఫిర్యాద చేయాల్సింది? కానీ ఈ కేసులో ఎవరో దారినపోయే దానయ్య ఫిర్యాదు ఇస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆఘమేఘాల మీద విచారణకు ఆదేశించడం. హుటాహుటిన సిట్ ఏర్పాటు జరిపోయాయి. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం అన్నమాట. పైగా ఇదే కేసులో నిందితుడు అంటూనే సిట్ విజయసాయిరెడ్డి జోలికి అస్సలు వెళ్లకపోవడం అనుమానాలను ధ్రువీకరిస్తుంది. గత ఆగస్టులో సిట్ వేసిన ఛార్జ్షీట్పై న్యాయస్థానం 21 అభ్యంతరాలను లేవనెత్తింది. దారిమళ్లాయని చెబుతున్న రూ.3,500 కోట్ల వివరాలు ఎక్కడ అనడం ఒకటైతే... సిట్ అధికారులు న్యాయస్థానం నుంచి ఏమి అభ్యర్థిస్తున్నారో చెప్పాలని అడగడమే విశేషం. ఛార్జ్షీట్లోని లోపాలను తాము అడిగిన విధంగా కూడా సరిదిద్దలేదని న్యాయస్థానం పోలీసులు ఇచ్చిన జవాబుపై వ్యాఖ్యానించడం గమనార్హం. తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. ఛార్జ్షీట్ సక్రమంగా లేకుండా రిమాండును అరవై లేదా తొంభై రోజులకు మించి పొడిగించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సిట్ కప్పగెంతులు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా ఎల్లో మీడియా మాత్రం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లు కథనాలు వండుతూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేసింది. తేదీలతో నిమిత్తం లేకుండా ఈనాడులో వచ్చిన కొన్ని స్టోరీలను చూద్దాం. ‘‘మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, ‘‘డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా రూ.400 కోట్ల తరలింపు’’ - మరికొన్ని మొత్తాలు యూకే, దుబాయి, అమెరికాకు తరలింపు.. ‘‘హవాలా ఏజెంట్ల విచారణలో సిట్కు కీలక అధారాలు లభ్యం’’ ..అని ఒక రోజు రాశారు. మరి ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. అలాంటి అభియోగాలతో వారు చెబుతున్న బిగ్ బాస్ పై కేసు పెట్టలేదే! అంటే తప్పుడు ప్రచారం కోసం అల్లిన కథేనని తెలియడం లేదూ! మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు అని పెద్ద హెడింగ్ పెట్టి ఈడీ సోదాలలో కీలక ఆధారాలు లభ్యం అని కొద్ది రోజుల క్రితం రాశారు. ఆ తర్వాత ఆ కథ ఏమైందో తెలియదు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై స్టోరీ ఇస్తూ డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అన్నారు. దీన్ని చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సవాల్ చేశారు. ఆ వార్తను కప్పిపుచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు భారీ కథనం ఇస్తూ బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర, అమలులో ప్రధాన పాత్ర, ముడుపుల వసూళ్ల నెట్ వర్క్ రూపొందించింది ఆయనే అని ఈ పత్రిక పేర్కొంది. సిట్ ఆధారాలు సేకరించిందని కూడా రాసేసింది. మరి అది నిజమే అయితే ఆ ఆధారాలేమిటో కోర్టు ముందుకు ఎందుకు ఉంచలేకపోయారో ఇప్పుడు రాయాలి కదా! ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు స్వయంగా తేల్చి చెప్పింది. మద్యం స్కామ్ ఛార్జ్షీట్లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావించారని ఈ పత్రిక తెలిపింది. కల్పిత కథలో ఆయననే టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఆ పేరు రాయకుండా ఎలా ఉంటారు. కాని ఏ చిన్న ఆధారం ఉన్నా ఈ పాటికి అరెస్టు అంటూ హడావుడి చేసేవారు కదా!. గతంలో ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావించారు. అయినా ఆయన నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఈ మీడియా ఎన్నడూ రాయలేదు. ఆ సన్నివేశం అంతా చూసిన ఓపెన్ కేసే అనే సంగతి తెలిసిందే. ఇప్పుడేమో కల్పిత స్కామ్ పేరుతో కథ నడుపుతున్నారు. మద్యం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంటూ ఇంకో రోజు ప్రచారం చేశారు. సిట్ కు ఆధారాలు దొరికపోయాయని కూడా సంబరపడ్డారు. ఇప్పటికీ అదేమీ తేలలేదు. పదహారు డిస్టిలరీల ముడుపులే రూ.1677 కోట్లు అని సిట్ వీరికి చెప్పిందట. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ పేరుతో పలు సంస్థల ఖాతాలలోకి మళ్లించి, నగదు విత్ డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి, తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోకి, డొల్ల కంపెనీలలోను పెట్టేదట. హవాలా ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేది అని సిట్ తేల్చిందట. ఇది చదువుతుంటే ఇంత తెలివితక్కువగా కథలు సృష్టిస్తారా అనిపించదా! .. బ్యాంకు ఖాతాల నుంచి ఇంత భారీ మొత్తాలలో విత్ డ్రా చేస్తే పట్టుకోవడం పోలీసులకు చేతకాదా?. మరి ఆ డబ్బు గురించి ఛార్జ్షీట్లో ఏమైనా రాశారా??.. అంటే అదీ ఉన్నట్లు లేదు. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి కలిసే ఈ కల్పిత గాథలను సృష్టించాయన్న అభిప్రాయం ఉంది. పోలీసులు వీరికి అండగా నిలుస్తూ వారి పాత్ర వారు పోషించారనుకోవాలి. ఉదాహరణకు.. బాక్సులు బద్దలు-లిక్కర్ స్కామ్ సొమ్ము-రూ.11 కోట్లు సీజ్ అని ఒక రోజు గోలగోల చేశారు. ఇదెలా అని అనుకుంటుండగానే, ఈ కేసులో నిందితుడు అయిన రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బు తనది కాదని, ఆ నోట్లపై నంబర్లు రికార్డు చేయండని అనగానే సిట్ అధికారులు జారుకున్నారు. ఆ డబ్బును కోర్టులో జమ చేయలేకపోయారు. పైగా బ్యాంకులో జమ చేసేసినట్లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఆ డబ్బు విడిగా ఉంచారో, లేదో తెలియదు. అలాగే వెంకటేష్ నాయుడు కథ మరొకటి. గుట్టలు, గుట్టలుగా నోట్ల కట్టలు.. దోచుకున్న సొమ్ముతో దొరికేశారు.. సిట్ కు చిక్కిన వీడియో అని ఈ ఎల్లో మీడియా హడావుడి చేసింది. తీరా చూస్తే తమ వద్ద ఎలాంటి వీడియో లేదని, వెంకటేష్ నాయుడి ఫోన్ను తెరవనే లేదని సిట్ కోర్టుకు చెప్పింది. ఈ వార్తను మాత్రం తమ పాఠకులకు పూర్తిగా తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తదితరులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటపడడంతో తేలుకుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ అయిపోయారు. ఈ కేసులో ఏ ప్రముఖుడిని అరెస్టు చేస్తే అతనే కీలకమని సూత్రధారి అని, ముడుపుల వసూళ్లు అతని ద్వారానే జరిగాయని అందరిమీద రాస్తూ వచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి డేటా పోయిందని, అదేదో మూడు లక్షల జీబీలు ఉంటుందని, కోట్ల పేజీలతో సమానం అంటూ ఒక కథను ఈనాడు అల్లింది. అది చూసి జనం నవ్వుకున్నారు. ఆ తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారం పోలేదని చెప్పడంతో ఈ మీడియా పరువు మరోసారి పోయింది. ఇలా ఒకటి కాదు..గత ఏడాది కాలంలో ఏదో రకంగా వైసీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల విన్యాసాలను అటు చంద్రబాబు సర్కార్ పోలీసులు, ఇటు ఎల్లో మీడియా ఎడతెగని పాట్లు పడుతూనే ఉంది. ఎటు తిరిగి మిథున్ రెడ్డి తదితరులను కొన్నాళ్లపాటు జైలులో ఉంచి శునకానందం పొందడడం తప్ప, సాధించింది ఏమీ లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల అయ్యాక మీడియాతో మాట్లాడుతూ తనను జైలులో టెర్రరిస్టు మాదిరి చూశారని ఆవేదన చెందారు. అయినప్పటికీ ఈ తప్పుడు కేసులకు భయపడేది లేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎపి లిక్కర్ స్కామ్ అన్నది ఒక ఊహాజనిత కథ అని ఎప్పటికప్పుడు అర్థం అవుతూనే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుంటే.. సీఎం చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే ఆల్మెట్టీ ఎత్తు పెంచడంతో రాయలసీమకు అన్యాయం జరగ్గా.. మరలా మరోసారి ఎత్తు పెంచాలన్న నిర్ణయంతో రాయలసీమతో పాటు పల్నాడు, ఒంగోలు వంటి ప్రాంతాలు ఏడారిగా మారడం ఖాయమని హెచ్చరించారు.ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనచేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..వ్యవస్థలను నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వంకూటమి ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబాటుకు గురవుతుంది. అన్నిరంగాలను ప్రభుత్వం నాశనం చేస్తుంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన చేస్తూ భవిష్యత్ తరాలకు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. అధికారమే పరమావధిగా అనుభవిస్తూ... ప్రజల రక్షణ, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేశారు. ఎంతసేపూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్రమ అరెస్టులు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ.. రాత్రికి రాత్రే అరెస్టులు చేస్తూ కుటుంబాలను వేధిస్తున్నారు.రౌడీమూకలను ఉపయోగించుకుని బెదిరించడంతో పాటు దాడులు కూడా చేయిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ఈ రకంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. పాలనను పూర్తిగా మర్చిపోయారు. దుర్మార్గంపై ధర్మం గెలుపునకు ప్రతీకకగా దసరా పండగ జరుపుకుంటారు. అదే విధంగా మళ్లీ ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అధర్మ పాలన, దుష్ట శక్తులకు తగిన గుణపాఠం చెప్పి మంచి రోజులకు నాంది పలకడం ఖాయం.రాయలసీమకు నీటి గండం - చంద్రబాబు ద్రోహంశ్రీశైలం ప్రాజెక్టుపై గాలిమాటలు చెప్పి రాయలసీమను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులపై కనీసం ఆలోచన చేయలేదు. రాయలసీమ ప్రజల మనోభావాలను తెలిసిన వ్యక్తిగా దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గండికోట, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2004లో అప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఈ ప్రాజెక్టులు వేటికీ హామీ ఇవ్వలేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడే. ఇది కాకుండా చంద్రబాబు ఆల్మెట్టీ ప్రాజెక్టు రూపంలో మరో తీవ్రమైన ద్రోహం చేశాడు.1995 నాటికి ఆల్మెట్టీ ప్రాజెక్టు కేవలం 53 టీఎంసీలతో ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీయే కూటమికి ఆ రోజుల్లో చంద్రబాబే చైర్మన్ గా ఉండగా.. మన ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు కర్ణాటక దేవేగౌడ నేతృత్వంలోని ప్రభుత్వం ఆల్మెట్టి ఎత్తును 509 అడుగులు నుంచి 524 పెంచే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోవడంతో.. ప్రజలు, ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోవడంతో.. సుప్రీం కోర్టు 519 అడుగులకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు సామర్ధ్యం 123 టీఎంసీలకు పెరిగింది. ఆ రకంగా చంద్రబాబు హయాంలోనే రాయలసీమకు అన్యాయం జరిగింది.మరలా దురదృష్టం కొద్దీ 2024లో కూడా టీడీపీ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆల్మెట్టీ డ్యామ్ సామర్ధ్యాన్ని పెంచడానికి మరో రూ.70 వేలు కోట్లు ఖర్చు పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఆల్మెట్టీ ఎత్తును 524 ఎత్తుకు పెంచబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 123 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టును 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీల పెంచబోయే ప్రాజెక్టు పనులకు టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. అయినా మాట వరసకి కూడా చంద్రబాబు వ్యతిరేకించడం లేదు. మాట్లాడ్డం లేదు. ఇది దుర్మార్గం కాదా ? అన్యాయం కాదా? కేవలం కృష్ణా జలాల మీదే ఆధారపడి ఉన్న రాయలసీమ భవిష్యత్తులో పూర్తిగానూ, నాగార్జున సాగర్ మీద ఆధారపడి ఉన్న పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, ఒంగోలు జిల్లాలు ఎడారి ప్రాంతాలుగా మిగలడం ఖాయం. కంటిన్యూస్ గా కనీసం 6 నెలలు వరద వస్తే తప్ప... నిండే పరిస్థితి లేదు.మరోసారి ఆల్మట్టి రూపంలో అన్యాయంగతంలో ఆల్మట్టి ప్రాజెక్టును 123 టీంఎంసీల నీటి సామర్ధ్యంతో నింపడమే దుర్మార్గం అనుకుంటే... మరలా ఇప్పుడు అదే చంద్రబాబు హయాంలో మరలా 279 టీఎంసీలకు పెంచబోవడం అత్యంత దారుణం. వీటి గురించి పట్టించుకోకుండా బనకచర్ల, సోమశిల అనుసంధానం అని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టుల మీద చంద్రబాబుకు కనీస చిత్తశుద్ధి, ఆలోచన లేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉండగా... రూ.83 వేల కోట్లతో బనకచర్ల అని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వాదన వినిపించకుండా... బనకచర్ల క్రాస్ ప్రాజెక్టుకు సరైన ప్రతిపాదనలు కూడా లేకుండా ప్రాజెక్టు కట్టేశామన్నంత బిల్డప్ ఇవ్వడంతో తెలంగాణా ప్రభుత్వం 904 టీఎంసీల కృష్ణా వాటర్ వాడుకునేందుకు జీవో జారీ చేశారు. ఇది ఎలా సాధ్యం?274 టీఎంసీలు ఆల్మెట్టీ ద్వారా కర్ణాటక ప్రభుత్వం, 904 టీఎంసీలు తెలంగాణా ప్రభుత్వం వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనిమీద ఎందుకు నోరు మెదపడం లేదు? బనకచర్ల డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండానే ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేస్తుంటే.. తెలంగాణా ప్రభుత్వం తమ పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణా, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మెట్టీ గురించే మాట్లాడుతుంది. ఇక్కడ అధికార పార్టీలో ఉంటూ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు.గతంలో 75 శాతం డిఫెండబులిటీ పేరుతో ఎగువ రాష్ట్రాలకు మేలు చేస్తూ.. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఓ నిబంధన పెట్టారు. దానిపైన కూడా పోరాటం చేయాలి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించకూడదు.. దిగువ ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన వినిపించడం లేదు. ఆల్మెట్టీ 274 టీఎంసీల సామర్ధ్యంతో విస్తరిస్తే.. జూరాల, నారాయణపూర్ దాటి ఏపీకి ఎప్పుడు నీళ్లొస్తాయి? మరోవైపు జూరాల దగ్గర నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ వంటి అనేక ప్రాజెక్టులను తెలంగాణా ప్రభుత్వం లిఫ్ట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ భవిష్యత్తు ఏంటి అన్న దానిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం కనీస చిత్తశుద్ధి కూడా లేకుండా వ్యవహరిస్తోంది.గతంలోరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి దాదాపు పూర్తిచేస్తే...దానికి పర్యావరణ అనుమతులు లేవని చెబుతున్నారు. కేంద్రంలో మీ బలంతో ప్రభుత్వం నడుస్తుంటే.. ఎందుకు సాధించలేకపోతున్నారు ? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదు ? జీ ఎన్ ఎస్ ఎస్ నుంచి హెచ్ ఎన్ ఎస్ ఎస్ కు కలిపే అద్భుతమైన ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదు కేవలం కల్లిబొల్లి మాటలు చెబుతున్నాడు. దాదాపుగా 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ ప్రాంతానికి ఏం చేశావు చంద్రబాబూ?రాయలసీమ అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే..రాయలసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు వచ్చాయంటే వైయస్సార్, వైయస్.జగన్ హయాంలో మాత్రమే. పోతిరెడ్డి పాటు కూడా వైయస్సార్ టైంలోనే వచ్చింది. ఎప్పటి నుంచో కలలు కంటున్న నంద్యాల, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా వైయస్.జగన్ కే దక్కుతుంది. మరోవైపు శ్రీ సిటీని వైఎస్సార్ ఏర్పాటు చేస్తే ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ జగన్ హయాంలో కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్ లు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, ఇరిగేషన్ అభివృద్ధి అంతా రాయలసీమలో వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో వచ్చినవి మాత్రమే. మీ హయాంలో అభివృద్ధి లేకపోగా.. అన్యాయం జరుగుతుంటే కూడా నోరు విప్పి మాట్లాడకపోవడం దారుణం.ప్రజా ధనంతో విలాసాలుఢిల్లీకు వారానికొకసారి తండ్రీకొడుకులు వెళ్లి షో చేస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప... రాష్ట్ర ప్రజలకు పైసా ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి స్ధాయిలో చంద్రబాబు ఏడాదిన్నరలోనే 71 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తే... 77-80 దఫాలు డిప్యూటీసీఎం, లోకేష్ లు ఇదే మాదిరిగా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలీకాప్టర్ లలోనూ చక్కెర్లు కొడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్కే పరిమితం అయ్యారు. కరోనా సమయంలో హైదరాబాద్లో ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజా సేవ గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండి విజయవాడలో ఉండి పరిపాలన చేయకుండా 70 దఫాలుకుపైగా హైదరాబాదకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తున్నారు.అన్ని వర్గాల ప్రజలకూ బాబు మొండిచేయి16 నెలల పాలనలో ఇప్పటికే మహిళలకు, రైతులకు, యువతకు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కింద రెండేళ్లకు దాదాపు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.5 వేలు ఇచ్చి అంతా ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదు.. వేసుకున్న పంటకు యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ స్ధితిలో ఈ ప్రభుత్వం ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మూడు విడతలుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు.మరో వైపు సున్నావడ్డీకి రుణాలు, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వల్ల మహిళలకు మేలు జరిగించే కార్యక్రమం చేశారు. ఇవాళ నెలకు రూ.1500 చొప్పున 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తామన్నది కూడా ఇవ్వడం లేదు. యువతను సర్వనాశనం చేస్తూ.. గంజాయితో కాలేజీలు, స్కూల్లు విచ్చలవిడిగా తయారైన పరిస్ధితి నెలకొంది. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకిచ్చిన హామీలుపై పట్టించుకున్న దాఖలాలు లేవు. పొలిటికల్ గేమ్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ.. పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు.గతంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. గతంలో వైయస్.జగన్ హాయంలో ఐదేళ్లలో కేవలం రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే... ఏడాదిన్నర కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా సంక్షేమం కూడా చేయడం లేదు. చేసిన అప్పు ఏం చేస్తున్నట్టు ? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? వివేకానందరెడ్డి హత్యలో మా పార్టీపై నిందలు మోపుతున్నారు. అధికారంలో ఉండి కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. లిక్కర్ కేసుపై నోటికొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఎంపీ మిధున్ రెడ్డి కేసులు ఇది చాలా స్పష్టంగా వెల్లడైంది. వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం మినహా మీరు చేసిందేమీ లేదు.రాయలసీమ ప్రాంత వాసులుగా.. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వినకపోతే ఆందోళనకు కూడా సిద్ధం. దుర్మార్గంగా వ్యవహరించి రాయలసీమకు అన్యాయం చేయవద్దు. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే ఆల్మెట్టీ టెండర్లు రద్దయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న తన భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఒప్పించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన మరే ప్రాజెక్టు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరైన వివరణ ప్రజలు ఇవ్వాలని లేని పక్షంలో ఆల్మెట్టీపై ప్రజా సంఘాలు, తటస్ఠ వ్యక్తులు, రైతులు, రైతు సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
ఎన్సీఆర్బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ నివేదికలోని వాస్తవాలను కూడా చంద్రబాబు కోసం వక్రీకరించే దుస్థితికి ఎల్లో మీడియా దిగజారిందని, ఆ నివేదికను ఉటంకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను అచ్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించి, విత్తనం నుంచి విక్రయం వరకు వారికి అండగా నిలబడటం వల్ల గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.వ్యవసాయం దండగ అని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, కడగండ్లు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తక్షణం ఆదుకున్న మానవత్వం వైఎస్ జగన్ది అయితే, వారి కుటుంబాలను గాలికి వదిలేసిన రాక్షసత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి, రైతులను డిస్ట్రస్ నుంచి తప్పించడానికి వైఎస్ జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ వ్యవసాయంలో సంక్షోభాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుని కాపాడేందుకు ఎల్లోమీడియా ఇవాళ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంది. 2023లో ఎన్సీఆర్బీ డేటాను తీసుకుని, చిలువలు పలవలు చేసి, వక్రీకరించి తప్పడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది.ఆత్మహత్య చేసుకున్న రైతులు.. మద్యం తాగి చనిపోయారన్న చంద్రబాబువైఎస్సార్సీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూ యజమానులైన రైతులు 309 మంది ఉండగా, కౌలు రైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో అవి 917కు తగ్గాయి.2023లో ఏడాదిలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 925. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు? రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి, వారి కుటుంబాలను కాపాడ్డానికి ఏ రోజు కూడా చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనా కాలంలో కాని, ఇవాళ కాని ముందుకు రావడం లేదన్నసంగతి తెలిసిందే. 2014-19 మధ్య రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వారంతా వ్యక్తిగత సమస్యలతోనూ, మద్యం తాగి చనిపోయినట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రైతుల పట్ల, వారి కష్టాల పట్ల చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఈ సారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. ఆయా కుటుంబాల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయంధాన్యం దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి సహా ప్రస్తుతం ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులు ఊబిలో కూరుకు పోయారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టారు, ఇ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలను నీరుగార్చారు. సీఎం యాప్ను తీసేశారు. ఈ పరిస్థితులన్నీ రైతులను తీవ్ర నిరాశాజనక వాతావరణం లోకి నెట్టేశాయి. పరిస్థితులను తట్టుకోలేక వారు బలవ్మనరణాలకు పాల్పడుతుంటే.. కనీసం ఆ కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం జాలి కూడా చూపడంలేదు.కానీ వైఎస్ జగన్ రైతులకు ప్రతి చోటా చేదోడు వాదోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని గొప్ప విదానాలు తీసుకువచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన అహర్నిశలు పని చేశారు. వైయస్సార్సీపీ పరిపాలనాకాలంలో 1794 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారందరికీ కూడా పరిహారం చెల్లించారు.ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలియగానే.. వెంటనే జిల్లా కలెక్టర్ను పంపి, ఆ కుటుంబాలకు బాసటగా నిలిచి, 48 గంటల్లోపే ఆ కుటుంబాలకు సహాయం అందించిన ఘటనలు కోకొల్లలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధానాన్ని తీసేశారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడ్డం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? అంతేకాదు 2014-19 మధ్య పునర్విచారణ జరిపి, 474 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందేలా చేశారు. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగింది. ఇలా దాదాపుగా రూ.117 కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పట్ల 'బాబు' నిర్లక్ష్యం2014-19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను కాపాడేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అరకొరగా ఆయా కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారంఅనేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్నిఅప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇది ఏరకంగా బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది.వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలు దారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించింది. జగన్మోహన్రెడ్డిగారు అత్యంత మానవతావాదిగా వారికి సహాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు రైతుల పట్ల, వారి కుటుంబాల పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరిస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు పరిపాలనా విధానం ప్రధాన కారణం. వ్యవసాయ రంగంలో ఆయన సృష్టించిన సంక్షోభమే దీనికి కారణం. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతుల ఉసురు పోసుకున్నారు.వైఎస్ జగన్ ఇదే నిధితో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నారు. మరి రైతు ద్రోహి ఎవరు? ఉచిత పంటల బీమాను జగన్ పెడితే, చంద్రబాబు దాన్ని రద్దు చేశారు. గత ఏడాది అందాల్సిన పంటల బీమా ఇప్పటి వరకూ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా.. నష్టాల గణనే లేకుండా పోయింది. వందల మంది రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం మీద వార్తలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబును జాకీలు పెట్టి లేపే పనిని ఎల్లో మీడియా మానుకుంటే మంచిది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తగ్గిన నేరాలుఇక ఎన్సీఆర్బీ డేటా విషయాని కొస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన విషయం చాలా స్పష్టంగా డేటాలో కనిపించింది. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు తగ్గాయని ఎన్ఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసుల 1,88,997 కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి, 2023లో 1,53,867 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి ఏటా తగ్గుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే 2020, 21, 22 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుకుంటా వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి. 2023లో 30,436కు పరిమితం అయ్యాయి. నేరాలకు పాల్పడే వారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో వైయస్సార్సీపీ హయాంలో గట్టిగా కృషి జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్దేశిచిన ఛార్జిషీటు దాఖలకు పెట్టిన గడువు 60 రోజులు అయితే, నమోదైన కేసుల్లో 91.6 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసి రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.శాంతిభద్రతల నిర్వహణ, కేసులు దర్యాప్తు, విచారణ, తర్వాత న్యాయ ప్రక్రియలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం ఇది. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా... 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. 2023లో హత్యలు 922. అంటే హత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మహిళల పై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం వైఎస్ జగన్ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయారంటూ మహిళలు, అమ్మాయిలు, బాలికల విషయంలో నమోదైన కేసుల్లో 85.7 శాతం రికవరీ 2023లో ఉంది. దేశంలో 54 శాతం మాత్రమే. దేశంలోనే రాష్ట్రం పనితీరు బాగున్నట్టుగా నివేదిక పేర్కొంది.ఎన్నికలకు ముందు 39 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయినట్టుగా ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఎన్సీఆర్బీ రిపోర్టు కొట్టి పారేసింది. పైగా వైఎస్సార్సీపీ హయాంలో ఫిర్యాదు చేయడానికీ, వాటిపై కేసుల నమోదుకూ, విచారణకూ పగడ్బందీ వ్యవస్థలు ఉండేవి. వీటి నమోదు ద్వారా నంబర్లు పెరుగుతాయని, తద్వారా కేసులు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉన్నప్పటికీ, వివిధ సంస్కరణలతో రిపోర్టింగ్ విధానాన్ని బలోపేతం చేశారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మెరుగ్గా పనిచేసినప్పటికీ వక్రీకరణలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. -
డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముపై చంద్రబాబు కన్ను: రాయన భాగ్యలక్ష్మి
సాక్షి, తాడేపల్లి: డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా చంద్రబాబు సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఉచితంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇచ్చిన లబ్ధిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అంటూ మండిపడ్డారు.మహిళల పొదుపు సొమ్మును పథకాల పేరుతో మళ్ళించి, తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఒక వైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా, వడ్డీతో కూడిన విద్యాలక్ష్మి రుణాలను ఇస్తామనడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. వీటిని పథకాలు అని చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబు సిగ్గపడాలని, ఇవి మహిళలకు చేస్తున్న ఢోకా కాదా అని నిలదీశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..డ్వాక్రా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును 'స్త్రీనిధి' సంస్థ ద్వారా దాచుకుంటారు. ఈ స్త్రీనిధి సంస్థ కూడా ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం కింద డబ్బును వడ్డీకి తీసుకువచ్చి, వాటిని డ్వాక్రా సంఘాలకు రుణంగా ఇస్తుంది. ఇలా డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు, వాటి ఆర్థిక అవసరాలను స్త్రీనిధి సంస్థ సమకూరుస్తుంటుంది. మహిళల పొదుపుసొమ్ము కూడా ఈ స్త్రీనిధి లోనే జమ అవుతూ ఉంటుంది. ఇటువంటి సంస్థ నుంచి కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేస్తామని చెబుతున్న ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాల పేరుతో ఏకంగా రూ.1000 కోట్లు సేకరిస్తోంది.ఈ సేకరించిన డబ్బును కూడా ఆయా పథకాల లబ్ధిదారులకు నాలుగు శాతం వడ్డీతో కూడిన రుణాలుగా ఇస్తామని చెబుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం షాదీ తోఫా, కళ్యాణమస్తు పథకాల కోసం అయిదేళ్ల కాలంలో రూ.427 కోట్లు ఖర్చు చేసింది. ఈ సొమ్మును కూడా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం ద్వారా వారికి అండగా నిలిచింది. నేడు చంద్రబాబు ఈ పథకాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని వడ్డీతో కూడిన రుణంగా మార్చేయడం అత్యంత దుర్మార్గం.ఇదేనా మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి? పైగా డ్వాక్రా పొదుపు నిధులతో ఆర్థికంగా పరిపుష్టం అయిన స్త్రీనిధి నుంచి సొమ్మును తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఆ సంస్థ పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చివరికి స్త్రీనిధి మనుగడే ప్రశ్నార్థకం కూడా అవుతుంది. మహిళలకు మంచి చేయాల్సింది పోయి, వారి పొదుపు సొమ్మును కూడా గల్లంతు చేసే పనిలో చంద్రబాబు సర్కార్ తలమునకలు అవుతోంది.గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు లబ్ధి2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.25,571 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి, దారుణంగా మోసం చేసింది. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 3,86,82,882 మంది డ్వాక్రా గ్రూప్ లబ్ధిదారులకు దాదాపు రూ.4,969 కోట్లు సున్నావడ్డీ పథకం కింద లబ్ధి చేకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సున్నావడ్డీ కింద వేయాల్సిన సొమ్మును జమ చేసేందుకు సిద్ధమైనా, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయింది. ఎన్నికలు అయిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులకు జమ చేయాల్సి ఉన్నా, నేటికీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో చేయూత, ఆసరా, భరోసా, తోడు ఇలా అనేక పథకాలను మహిళల కోసం అమలు చేశారు. రేషన్ కార్డుల్లోనూ ఇంటి యజమానిగా మహిళల పేరు, పేదలకు ఇచ్చిన ఇళ్ళస్థలాలు కూడా మహిళల పేరు మీదే ఇచ్చారు. నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తున్నారు. సున్నావడ్డీ, కళ్యాణమస్తు వంటి పథకాలను ఎగ్గొట్టారు.గత ఎన్నికలకు ముందు కూడా సూపర్ సిక్స్ పేరుతో ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే, అంతమందికీ రూ.18వేలు చొప్పున స్త్రీ నిధి కింద ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంత వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. దీని ఊసే లేదు. -
ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా?
‘‘విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్.. ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం’’.. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం.‘‘సమర్థత, అనుభవం.. ఫలితమే ఛార్జీల తగ్గింపు’’.. ఆంధ్రజ్యోతి ఇచ్చిన వార్త‘‘ఈఆర్సీ సీరియస్.. సర్కార్కు షాక్ - దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు’’.. సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్తపైవాటిల్లో సత్యమేది? అసత్యమేది? అనే సంశయం పాఠకులకు రావచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలివేషన్ ఇవ్వడానికి నిరంతరం పాటు పడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే ప్రభుత్వానికి నెగిటివ్గా ఇవ్వాల్సిన వార్తను అలా ఇవ్వకపోతే మానే.. ప్రజలకు పచ్చి అబద్దపు సమాచారం ఇవ్వడానికి ఎక్కడా సిగ్గు పడకపోవడం ఈ రెండు మీడియా సంస్థల ప్రత్యేకతగా మారిపోయింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరుపై నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జీలు తగ్గించాలని, ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తే, దానిని వక్రీకరించి అదేదో ప్రభుత్వం ప్రజలపై దయతో తగ్గించినట్లుగా కథనాలు ఇవ్వడం పాఠకులను, ప్రజలను మోసం చేయడమే!. ఈ విషయాన్ని సాక్షి మీడియా బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలోనూ సమాచారం విస్తారంగా వచ్చింది. దాంతో ప్రభుత్వం పరువుతోపాటు, టీడీపీకి మద్దతిచ్చి అసత్యాలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల బాగోతం మరోసారి బట్టబయలమైంది. సాక్షి, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు టీడీపీ మీడియా వండి వార్చిన అసత్యాలనే నమ్మాల్సి వచ్చేది. అసలు విషయం ఏమిటి! 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15,485 కోట్ల అదనపు బాదుడుకు ఈఆర్సీ అనుమతి కోరడం, ఈఆర్సీ యూనిట్కు రూ.5.27లకు కొనుగోలుకు ఓకే చేస్తే డిస్కంలు రూ.5.84 నుంచి రూ.5.89 వరకు కొన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రూ.2787 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరింది. కాని ఈఆర్సీ రూ.1863 కోట్ల అదనపు వసూలుకు అంగీకరించింది. అయినా ప్రభుత్వం, డిస్కమ్ ఏదైనా అనండి.. ఈఆర్సీ ఆదేశాన్ని కాదని రూ.2787 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఈఆర్సీ అదనంగా వసూలు చేసిన రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం యూనిట్కు పదమూడు పైసలు తగ్గుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అదనపు బాదుడు బాదకుండా, విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత తగ్గించి ఉంటే అప్పుడు నిజంగానే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. ఆయన సమర్థుడు అని భుజకీర్తులు తగిలించినా బాగానే ఉండేది. అలాకాకుండా.. ఎప్పటి మాదిరే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఇందులో మతలబు. అసలు కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం ఎందుకు మోపింది? ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తగ్గింపు ఆదేశాలు ఇచ్చింది చెప్పకుండా అదేదో తమ చంద్రబాబు నిర్ణయం అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడమే శోచనీయం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సుమారు రూ. 19 వేల కోట్ల భారం వేశారని లెక్కలతో సహా వార్తలు వస్తున్నాయి. ఇది ఏపాటి సమర్ధత అవుతుందో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా వారే చెప్పాలి! పోనీ అదెందుకు! డిస్కంలు మరో రూ.12771 కోట్ల అదనపు వసూలుకు ఈఆర్సీని అనుమతి కోరాయి కదా.. దానిని ఉపసంహరించుకుంటామని చంద్రబాబు కాని, ఆయన తరపున ఎల్లో మీడియా కాని ప్రకటిస్తాయా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పొగడరా! పొగడరా! అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని పొగిడాడట వెనుకటి ఒకడు. అలాగే ఈ ఎల్లోమీడియా ఎంతకైనా దిగజారుతున్నాయి. జగన్ టైమ్లో విద్యుత్ రంగాన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా, అప్పట్లో ఇంకేముంది ఛార్జీలు పెంచేశారు అంటూ ప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పుడు వేల కోట్ల అదనపు భారాలు ప్రజలపై కూటమి మోపుతున్నా ,దానిని కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. ఆ తర్వాత దానిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవడానికి ఆయన ఏమి చెప్పారంటే, తాను తెచ్చిన సంస్కరణల వల్లే అది సాధ్యమైందని ప్రచారం చేసుకున్నారు.అలా ఉంటుంది చంద్రబాబు తెలివి. ఈసారి కూడా అదే తరహాలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన చేసిన యత్నం వికటించి ప్రజలకు వాస్తవం తెలిసిపోయిందని అనుకోవాలి.నకిలీ వార్తల వెల్లువ అంటూ ఈనాడు దినపత్రిక(Eenadu Fke News) ఈ మధ్య ఒక సంపాదకీయం రాసింది. అందులో నకిలీ వార్తల గురించి గుండెలు బాదుకుంది. మంచిదే కాని తానేమి చేస్తున్నది మర్చిపోయి ఎదుటి వారిపై నిందించే రీతిలో ఆ సంపాదకీయం రాసుకుని ఆత్మవంచన చేసుకుందని చెప్పాలి. 'ఎన్నికలలో గెలిస్తే ప్రజా సంక్షేమానికి, సమ్మిళిత ప్రగతికి, ఎలాంటి కృషి చేస్తామో చెబుతూ ఓట్లు అడగడం నైతిక నిష్ట కలిగిన నాయకుల పద్దతి. అలాంటివారు అరుదైపోయి అబద్ధాలతో అధికారాన్ని గుప్పిట పడదామనుకునే జగత్ కిలాడీలతో రాజకీయాలు భ్రష్టు పడుతుండడం నేటి భారతం దుర్గతి. దానికి తగ్గట్లే పార్టీల నిర్వహణలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో కొన్ని బూటకపు వార్తా కథనాలను విచ్చలవిడిగా జనం మీదకు వదులుతున్నాయి. వ్యక్తిత్వ హననాలకు తెగపడుతున్నాయి. ఇలాంటి పెడపోకడలను అడ్డుకోకపోతే నకిలీ వార్తా సంస్థలను జవాబుదారి చేయకపోతే కపట నేతల స్వార్ధ ప్రయోజనాలకు ప్రజాస్వామ్యం బలి పశువు అవుతుంది"అ ని రాశారు. ఇది చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ఎడిటోరియల్ రాశారని తెలిసిపోవడం లేదా!. ఒక పక్క తప్పుడు వార్తలనండి, నకిలీ వార్తలనండి వారే ఇష్టానుసారంగా పాఠకులపై రుద్దుతో పార్టీల మీడియా ఏదో చేస్తోందంటూ నిస్సిగ్గుగా రాసిందనిపించదా! విద్యుత్ ఛార్జీల విషయంలో జరిగిందేమిటి.ఎల్లో మీడియా రాసిందేమిటి? దానిని నకిలీ అంటారా? తప్పుడు వార్తలు అంటారా! కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా? లేదా? అదనపు వసూళ్లకు పాల్పడ్డారా? లేదా? అన్నది చెప్పకుండా కథలు రాయడం టీడీపీ మీడియాది జగత్ కిలాడి తనం అవుతుందా? లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. అలాగే వీరు చెప్పే నీతిసూత్రం ప్రకారం టీడీపీ, జనసేన కూటమి నేతలే జగత్ కిలాడీలు అవ్వాలి కదా! ఆ మాటను ఎందుకు నేరుగా రాయలేకపోయారు!. ఎంతసేపు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఈనాడు మీడియా సుద్దులు చెప్పడం ఆశ్చర్యమే. అబద్దాలతో అధికారం గుప్పిట పెడదామనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అవి అబద్దపు హామీలా? కాదా? అన్నదానిపై ఎన్నడైనా ఒక్క వార్త ఇచ్చారా? ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలను ప్రచారం చేశారో ఈనాడు వంటి ఎల్లో మీడియాకు గుర్తు లేదేమో కాని, కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యే పాఠకులందరికి తెలియకుండా ఉంటుందా! ఈనాడు మీడియా ఒక్కసారి తమను తాము అద్దంలో చూసుకుని ,ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే వారికే తెలుస్తుంది ఎవరు నకిలీ వార్తలు రాస్తున్నారో,ఎవరు తప్పుడు కధనాలు ఇస్తున్నారో!.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
డిజిటల్ బుక్ ముకుతాడు వేస్తుందా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. పార్టీ కార్యకర్తల రక్షణకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా పార్టీ లీగల్ టీమ్ వెంటనే రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారు. దీని వల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్లో ఎలా నమోదు చేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీసు అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైనా, అక్రమ అరెస్టు జరుగుతున్నా, వెంటనే వాటిని చిత్రీకరించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తే లీగల్ సెల్ తక్షణమే చొరవ తీసుకుని పని చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులు వైసీపీ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టకుండా ఉండే చాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీపరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయింది.పోలీసులు మఫ్టీలో వచ్చి సవీంద్రరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అదుపులోకి తీసుకున్న వెంటనే లీగల్ టీమ్ అతని తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. హైకోర్టు కూడా పౌర రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతిని అర్థం చేసుకున్న కోర్టు సవీంద్రరెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇదో రికార్డు. కేసును సీబీఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియచేస్తుంది.అంతేకాదు.. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీసు స్టేషన్లలోనే గంజాయిని అందుబాటులో ఉంచుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కూడా కలుగుతుంది. అందుకే హైకోర్టు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారనుకోవాలి. ఇంత జరిగినా కొందరు పోలీసులు మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులను అదే రోజు అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది.ఈ బుక్లో సాక్ష్యాధారాలు కూడా నమోదు అవుతాయి కనుక అవి ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. అదే టైమ్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతుంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పరకామణి వ్యవహారంలో జగన్పై నీచమైన ఆరోపణలు చేస్తూ టీడీసీ సోషల్ మీడియా ప్రచారం చేసిందట. అది తప్పా? కాదా? అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు. కాని టీడీపీ వారు ఏమీ చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ధర్మబద్దంగా చర్య తీసుకోవల్సిన పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియచేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేయవచ్చు. కాని డిజిటల్ బుక్ పరిధి పెరుగుతుంది. ఎంతవరకూ ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అలాగే డిజిటల్ బుక్ జరగకుండా జాగ్రత్తపడాలి.అంతే కాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటరై తప్పుడు ఆరోపణలు చేయకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.డిజిటల్ బుక్తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు, కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి ధైర్యం ఇచ్చిన వైనం కచ్చితంగా పార్టీ కేడర్కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది.కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్లో అలాంటి అభిప్రాయం నెలకొంది.. అది వేరే విషయం. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు ఆస్పత్రులు వంటివాటిని ఎందుకు ప్రభుత్వాలు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు.అట్టర్ ఫ్లాఫ్ అయిన సూపర్ సిక్స్కు విజయోత్సవ సభ జరిపారని ఎద్దేవా చేశారు. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్ పై దాడి, మరో వైపు కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి ఈ సమావేశంలో జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగానే డిజిటల్ బుక్ తెచ్చారు. దీని ప్రభావంతోనైనా ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టే విషయంలో కాస్త అయినా వెనక్కి తగ్గుతారా! ఏమో చెప్పలేం!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్ ముందు వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు.వైఎస్సార్సీపీ నేత అక్రమ అరెస్ట్పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. -
కూటమి సర్కార్పై స్టీల్ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్పై స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతమైంది మలి దశకు విశాఖ ఉక్కు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న అమరావతిలో భారీ సమావేశానికి పోరాట కమిటీ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులతో కలిసి సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పోరాట కమిటీ ఉంది.మరోవైపు, కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్ను నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్ సేవలో తరిస్తోందని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత శనివారం జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్పై చూపిస్తున్న తపన విశాఖ స్టీల్ ప్లాంట్పై చూపకపోవడం ప్రజలను వంచించడమేనన్నారు. -
ఈఆర్సీ నిర్ణయం సర్కారుకు చెంపపెట్టు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనుమతించిన ధరకు మించి కొనుగోలు 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు. 2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు. -
చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం కోసం బిల్లు!
సాక్షి, అమరావతి: ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని ప్రభుత్వమే అంటోంది.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?’’ అని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం బిల్లును ప్రవేశపెట్టగా.. వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని బిల్లులో చెప్పారు. రాజకీయ ప్రేరేపిత హత్య జరిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు?. అదేదో.. దేశానికి పేరు తెచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తే బావుంటుంది. కానీ ఇదేం సంప్రదాయం?. మీ పార్టీ పరంగా ఏదైనా సహాయం చేసుకోండి. అంతేగానీ రాజకీయ ప్రేరేపిత హత్య జరిగితే ఎలా ఉద్యోగం ఇస్తారు?. ఇప్పుడు గనుక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఫ్యాక్షన్ని ప్రోత్సహించినట్టు అవుద్ది. తప్పుడు ఆలోచనను రేకెత్తించినట్టు అవుతుంది. ఈ బిల్లు ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పై డివిజన్(ఒక బిల్లును ఆమోదించాలా వద్దా అనే విషయంలో సభ్యుల ఓట్లను స్పష్టంగా లెక్కించమని కోరడం) కోరుతున్నాం’’ అని బొత్స అన్నారు. అయితే.. దీనికి మంత్రి పయ్యావుల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ ప్రేరేపిత హత్యలు జరగకూడదనే ఉద్దేశంతోనే చంద్రయ్య కొడుకు వీరాంజనేయులికి ఉద్యోగం(Chandraiah Son Govt Job) ఇస్తున్నామని అన్నారు. ఇలా ఇస్తూ పోతే అరాచకాలు మరింత పెరుగుతాయని బొత్స అనడంతో.. మంత్రులు ఊగిపోయారు. నచ్చకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి దురుసుగా మాట్లాడారు. దీంతో బొత్స ‘‘మేం ప్రజా సమస్లపై మాట్లాడేందుకు సభకు వచ్చామంటూ’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇంత జరిగినా సభాపతి స్పందించరేం? -
‘నా వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించండి..’ కామినేని శ్రీనివాస్
సాక్షి, అమరావతి: సినిమా వాళ్లను పిలిచి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్(Kamineni Srinivas) అబద్ధపు ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అయితే ఈ ప్రకటనపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్కు శనివారం విజ్ఞప్తి చేశారు. ‘‘మొన్న సభలో నేను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయని భావిస్తున్నాను. అందుకే రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా’’ అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సహా.. హీరోలను జగన్ అవమానించినట్లు మాట్లాడిన మాటలను తొలగించాలని కోరారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించినట్టు కామినేని అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ను కలవడానికి వెళ్లినప్పుడు, వారికి సరైన గౌరవం ఇవ్వలేదు. జగన్ వారిని కలవడానికి ఆసక్తి చూపలేదు. చివరికి చిరంజీవి గారు ఒత్తిడి చేయడంతోనే జగన్ కలవడానికి అంగీకరించారు’’ అని అన్నారు. కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో చిరుపై బాలయ్య నోరు పారేసుకున్నారు. అయితే.. కాసేపటికే కామినేని అబద్ధాలు చెప్పారంటూ స్వయంగా చిరంజీవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో.. వివాదం మరింత రాజుకుంది. ఇంకోవైపు వైఎస్ జగన్పైనా అనుచిత వ్యాఖ్య చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే కామినేని మాటలు టీడీపీ మెగా అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీయగా.. పవన్ జనసేన మాత్రం సైలెంట్గా చూస్తూ ఉండిపోయాయి. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు మౌనంగా ఉండిపోవడం గమనార్హం. -
‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందేనని ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజుకు జరిగిన అవమానంపై నల్లకండువాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శనివారం సమావేశాలకు హాజరయ్యారు. ఈ అంశంపై చర్చకు బొత్స పట్టుబడడంతో శనివారం మండలి హీటెక్కింది. ‘‘రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను గౌరవించాలనేది మా డిమాండ్. రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. ప్రభుత్వం సభ్యులకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి తీరాలి. సభాపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ, ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి స్పందన కూడా రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదు. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం అన్నట్లు కాకుండా వ్యక్తిగత విషయంలా చూడటం ఆక్షేపనీయం.... బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చైర్లో కూర్చున్న వారికే కాదు ఎవరికి కులాలు ఆపాదించకూడదు. శాసనసభలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తన సభలో అందరూ చూశారు(Balayya Comments). ఒక మాజీ ముఖ్యమంత్రిని, మాజీ కేంద్ర మంత్రిని ఎలా మాట్లాడారో అందరూ చూశారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు, సభాపతి స్పందించి ఇప్పటికే మాట్లాడాలి. కానీ.. మొన్న ఘటన జరిగితే ఇప్పటిదాకా స్పీకర్(Assembly Speaker Silence On Balayya Comments) స్పందించలేదు. ఆయన తనకేం సంబంధం లేని విషయం అన్నట్లుగా ఉన్నారు. ఇటు సంబంధిత అధికారులను పిలిచి మండలి చైర్మన్ అవమానం విషయంలో ఏ జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయాలి. సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలనేదే మా ఉద్దేశ్యం. నిబంధనల ప్రకారం సభ్యులంతా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి’’ అని బొత్స అన్నారు.తప్పు ఒప్పుకున్న పయ్యావుల!శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju)కు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ ఇవాళ కూడా ఆందోళన కొనసాగించింది. దీనికి సభా నాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసింది. ‘‘మండలి చైర్మన్ అవమానం పై ముందు తేల్చండి. ప్రభుత్వం ఎందుకు జరిగిన తప్పు పై స్పందించడం లేదు’’ అని బొత్స ప్రశ్నించారు. దీనికి మంత్రి పయ్యావుల సమాధానమిస్తూ.. ప్రభుత్వానికి ఎక్కడ చైర్మన్ను చిన్నచూపు చూడాలనే ఉద్దేశం లేదన్నారు. ‘‘మొదటి నుంచి పార్టీలో క్రమశిక్షణ నేర్పుతారు. చైర్ గౌరవానికి తగ్గట్లుగా నడుచుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.. మండలి నిర్వహణకు సహకరించాలని’’ అని వైఎస్సార్సీపీ సభ్యులను కోరారు. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్మన్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రిపీట్డెడ్గా ఇలా జరుగుతోందని బొత్స అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం కలిగించే బిల్లులకు మేం వ్యతిరేకం కాదు. మండలి చైర్మన్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మండలి సభ్యులంటేనే మరీ చిన్నతనంగా చూస్తున్నారు’’ అని బొత్స అన్నారు. ఈ ఆందోళల నడుమ మండలి కాసేపు వాయిదా పడింది. ఏం జరిగిందంటే.. అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ‘‘మండలి చైర్మన్గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని వరుసగా అవమానించడం దారుణం. గతంలో స్పోర్ట్స్ మీట్ సందర్భంలో కూడా చైర్మన్ను అవమానించారు. దీనిపై సీఎం, మంత్రి క్షమాపణ చెప్పాలి” అని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అయితే.. తిరుపతి సదస్సుకు చైర్మన్ రానని అధికారులు తెలిపారని మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇవ్వగా.. తాను అలా చెప్పలేదంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పడంతో మండలి ఒక్కసారిగా వేడెక్కింది.ఇదీ చదవండి: చైర్మన్కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘనే! -
చంద్రబాబుకు బాలకృష్ణ తొత్తుగా మారిపోయాడు: వైఎస్సార్సీపీ
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెగా అభిమానులు కూడా బాలయ్యను టార్గెట్ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. పోలీసులు.. కోర్టును తప్పుదోవ పట్టించారని సవీంద్ర తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. ‘‘ రాత్రి 7:30 గంటలకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెబుతున్నాడు...కన్ఫెషన్ రిపోర్టులో రాత్రి 7.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 8.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. లాలాపేట ఎస్హెచ్వో శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా ఉంది. రాత్రి 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పీఎస్కు వచ్చినట్లు సీసీటీవీలో ఉంది. సవీంద్ర ఫోన్ సాయంత్రం 6:21కి స్విచాఫ్ చేసినట్లు స్పష్టంగా ఉంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ సుమోటోగా తీసుకుని విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ కోరారు.‘‘సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు ఎలా పెట్టారు?. సుప్రీంకోర్టు తీర్పులున్న యూనిఫాం లేకుండా ఎలా పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టా లేదా తెలియాలంటే సీబిఐతో విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సీబీఐ అక్టోబర్ 13వ తేదీ కల్లా కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, బుధవారం( సెప్టెంబర్ 24) ఈ కేసును విచారిస్తూ.. పోలీసులు యూనిఫామ్లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది.తన భర్త సవీంద్రరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది. -
బాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్కు పవన్!
హైదరాబాద్, సాక్షి: ఏపీ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On Chiru) తీవ్ర అలజడి రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలవడాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీలో బాలయ్య అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇటు వైఎస్సార్సీపీ, అటు మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై టీడీపీ ఏమో మౌనంగా ఉండిపోయింది. చిరుపై ‘ఎవడు’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్ర అభ్యంతరాలు(Chiru Fans Fire On Balayya) వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గతంలోనూ చిరును ఉద్దేశించి ఈ తరహాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు క్షమాపణలు చెప్పకపోతే ప్రజా క్షేత్రంలో నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో జనసేన స్పందించకపోవడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కలకలం వేళ.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) హైదరాబాద్కు వస్తుండడం చర్చనీయామైంది. అయితే ఆయన కేవలం వైద్యం కోసమే వస్తున్నట్లు ఆయన సిబ్బంది స్పష్టం చేసింది. తీవ్ర జ్వరంతో, దగ్గుతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ సభలో లేనిది చూసి కామినేని ఈ అంశం ప్రస్తావించడం.. దానికి బాలయ్య దురుసుగా మాట్లాడడం.. ఆ టైంలో స్పీకర్ స్థానంలో ఉండి కూడా రఘురామ కృష్ణంరాజు ఉండి కూడా వారించకపోగా నవ్వుతూ చూస్తూ ఉండిపోవడం.. వీటన్నింటిని నాటకీయ పరిణామాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అప్పటికే సభలో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారని, అయినా కూడా వాళ్ల నుంచి కనీస స్పందన లేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన పెద్దన్నయ్య చిరు తనకు తండ్రితో సమానం అంటూ పవన్(Pawan About Chiru) తరచూ చెబుతూ వస్తుంటారు. తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. తర్వాత అదే టీడీపీతో పొత్తులో ఉండిపోయారు. కానీ గతంలో ఎవరైనా చిరును ఒక్క మాట అన్నా ఊరుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు బాలయ్య చిరుపై నోరు జారారు. మరి ఈ వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలంటూ సినీ, రాజకీయ వర్గాలు కుతుహలంగా ఎదురు చూస్తున్నాయి(Will Pawan Reacts Balayya Comments).ఇదీ చదవండి: బాలయ్య వ్యాఖ్యలను తోసిపుచ్చిన చిరంజీవి -
ఆ వ్యాఖ్యలతో ఏపీ అన్నపూర్ణ బ్రాండ్ ఇమేజ్కు గట్టి దెబ్బ!
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు. ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు. ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది. మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! -
జనసేన బానిసత్వం ఇంకెన్నాళ్లు?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో బసవతారకం ఆస్పత్రికి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎంతో సహకరించారని, అలాంటి వ్యక్తిపై నోరు పారేసుకుని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తప్పు చేశారని వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వైఎస్ జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యపై శుక్రవారం నిరసన చేపట్టారాయన. శుక్రవారం బాడవ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పణలో దేవినేని అవినాష్(Devineni Avinash) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ జగన్. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On YS Jagan) సభ్యసమాజానికి సిగ్గుచేటు. ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ మాకు దైవ సమానులే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మీకు గౌరవం ఉండేది. కానీ, ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణపై ఉన్న గౌరవం పోయింది. గతంలో తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ఏ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా?. కనీసం అలాంటి ఆలోచనైనా చేశారా?. ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్ము వైఎస్ జగన్ది. ఆయన అధికారంలో ఉండగా బాలకృష్ణ సినిమాలకే కాదు.. బసవతారకం ఆస్పత్రికి కూడా సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. వైఎస్సార్, జగన్ వల్ల మీ కుటుంబానికి జరిగిన మేలును బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలి. సభలో లేని.. అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా బాలకృష్ణ తూలనాడారు. చిరంజీవిని తులనాడినా(Balayya on Chiru).. జనసేన తరఫు నుంచి కనీసం స్పందన లేదు. సభలో ఉన్న జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం?. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా?. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారంతో తిరిగి ఏమీ అనలేకపోతున్నాం. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం. బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాటు విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ , అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: చిరు.. ఎవడు?? -
బాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి?: బొత్స
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలపై చర్చ సందర్భంగా గురువారం శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఒకరు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు(TDP Minister) అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నానాయాగీ చేశారు. అయితే వాటిని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్(MLC Ramesh Yadav) ఎన్నికల హామీలు ఇచ్చే సమయాన్ని ప్రస్తావిస్తూ.. ఆనాడు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. అయితే ‘సభాపతిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అంటూ అవమానిస్తారా?’ అని టీడీపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని.. ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను సీనియర్ నేత బొత్స సమర్థించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది?. కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలి. అని అన్నారు. దీంతో.. టీడీపీ మంత్రలు మరింత ఊగిపోయారు. ఈ తరుణంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కలుగజేసుకున్నారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి మండలి కాసేపు వాయిదా వేశారు. ఆపై.. 👉విరామ సమయంలో ఎమ్మెల్సీలు మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. ‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ను ప్రతీసారి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. అందుకే ఇక నుంచి మా పంథా కూడా మారుతుంది. మండలిలో సెం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తాం. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని.. ఇక నుంచి ఇలాగే మాట్లాడతాం అని అన్నారు. 👉తాజా పరిణామాలపై మండలి చైర్మన్ మోషేన్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాద పాటించేలా మండలి సభ్యులు వ్యవహరించాలి. కొందరు సభ్యులు, మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తాం. గతంలో పదవులు, హోదాలలో పనిచేసిన వారిని గౌరవించుకోవాలి. ఒడిపోయినంత మాత్రాన గౌరవించకుండా మాట్లాడతాం అంటే సమంజసం కాదు. ఎవరూ ఎవ్వరినీ అగౌరవంగా మాట్లాడొద్దు అని సభ్యులకు సూచించారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: ఓజీ సినిమా కోసం అసెంబ్లీకి డుమ్మా! -
‘వార్నీ సిన్మా తగలెయ్యా.. ముందు అసెంబ్లీకి రండయ్యా!’
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై చర్చే లేకుండా.. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఏకపక్షంగా, చప్పగా సాగిపోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకే(TDP MLAs) బోర్ కొట్టిందేమో.. భారీ సంఖ్యలో గైర్హాజరు అవుతున్నారు. ఇవాళ(గురువారం) 114 మంది సభ్యులకుగానూ కేవలం మూడో వంతు హాజరు కాకపోవడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions 2025) సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజుల్లో కూటమి ఎమ్మెల్యేలు పూర్తి హాజరైనా.. నెమ్మదిగా డుమ్మా కొట్టడం ప్రారంభించారు. ఇందులో టీడీపీ వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇవాళ సమావేశం ప్రారంభ సమయంలో కేవలం 30 మంది మాత్రమే కనిపించారు. మిగతా రెండు పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో సభ పలుచగా కనిపించింది. దీంతో చీఫ్ విప్, విప్లు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మని బతిమాలారు. దీంతో బలవంతంగా మరో 15 మంది సభకు వచ్చారు. అయితే.. జనసేన ఎమ్మెల్యేలు మాత్రం తాము తమ అధినేత పవన్ కల్యాణ్ ఓజీ సినిమా(Pawan Kalyan OG Cinema)లో బిజీగా ఉన్నామని చెప్పారట. సినిమా తర్వాత చూడొచ్చని.. పరువు పోతుందని బతిమాలి.. వాళ్లను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. సభకు ఎమ్మెల్యేలు ఆలస్యంగా వస్తుండడం, గైర్హాజరు, సభలో వ్యవహరిస్తున్న తీరుపైనా స్పీకర్ అయ్యన్న తరచూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది తెలిసిందే.ఇదీ చదవండి: డర్టీ పాలిటిక్స్పై చంద్రబాబు వేదాలు!! -
బొత్స సవాల్.. నీళ్లు నమిలిన పయ్యావుల.. వైఎస్సార్సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చ కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) గట్టి కౌంటర్ ఇచ్చారు.పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత మాట్లాడారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు ఉన్నాయి. నేటి వరకు పీఆర్సీ చైర్మన్ నియామకం లేదు. పరిశీలిస్తామంటూ మంత్రి దాట వేస్తున్నారు. నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. ప్రతీ పండుగకు ఉద్యోగులకు డీఏ కోసం ఎదురుచూస్తున్నారు.. ..ఈ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో పెట్టింది.. పెన్షనర్స్ ఒక్కొక్కరికీ 15 నుంచి 20 లక్షల బకాయిలు పెట్టారు. గతంలో జగన్ వచ్చిన 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి బకాయిలు చెల్లించాలి. ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత చెల్లింపులు చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(AP Finance Minister Payyavula Keshav) సమధానమిస్తూ.. గతంలో రివర్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వీళ్ళదే(వైస్సార్సీపీ సభ్యులను చూపిస్తూ..). ఉద్యోగులు మాకు కొత్త జీతాలు వద్దు పాత జీతాలే ఇవ్వండని బ్రతిమిలాడుకునే పరిస్థితికి తెచ్చారు. గతంలో ఒక మంత్రి మీకు 15వ తేదీ కల్లా జీతాలు ఇస్తున్నాం కదా అని హేళనగా మాట్లాడారు. ప్రభుత్వ మార్పుకు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఒప్పుకుంటున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వాడేసుకుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వైసీపీ సభ్యుల తీరు. మా ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చిత్తశుధ్దితోనే ఉంది. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. పయ్యావుల వ్యాఖ్యలకు విపక్షనేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారు. వీళ్లు ఒత్తిడి చేశారో.. వాళ్లు రిజైన్ చేశారో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారై అయితే ఇప్పటికే కమిషన్ వేసేవారు. ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్నకు రాజకీయ కోణంలో సమాధానం చెప్పారు. ప్రభుత్వాలు మారాయి.. అటు ఉన్నవాళ్ళు ఇటు వచ్చారు.. ఇటు ఉన్నవాళ్ళు అటు వెళ్ళారు. గత ప్రభుత్వ హయాంలో 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిషన్ వేస్తారా.. ఫిట్మెంట్ ఇస్తారా అనేది చెప్పాలి. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ లో మాట్లాడటానికి సిద్ధం. ఎవరు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చర్చిద్దాం. అన్నీ రికార్డు ప్రకారమే మాట్లాడుకుందాం అని సవాల్ విసిరారు. అయితే దీనికి మంత్రి పయ్యావుల నుంచి స్పందన రాలేదు. దీంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు.అంతకు ముందు.. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాగే మహిళలు, చిన్నారుల అదృశ్యాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ మోషేన్ రాజు దానిని తిరస్కరించారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఖబడ్దార్ -
చంద్రబాబు నీతులు చెబుతుంటే..
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం.... ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?.. ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!. టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో ఒక రౌడీషీటర్ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను రౌడీ అని, పేకాట క్లబ్లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???.. చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రశ్నించే గొంతులను అణచివేస్తారా?: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన ప్రతిసారీ అక్రమ కేసులు, తప్పుడు అరెస్ట్లతో కూటమి ప్రభుత్వం డైవర్షన్కు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల్లో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివీస్ట్లు కనిపించకుండా పోయారని.. హెబియస్ కార్ఫస్ పిటీషన్ వేస్తే ఒకరిని తాము అరెస్ట్ చేసినట్లు పోలీసులు హైకోర్టు ఎదుట హాజరుపరిచారని తెలిపారు.మిగిలిన ఇద్దరిని కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులే తమతో తీసుకువెళ్ళారని, వారి కుటుంబసభ్యులకు ఎటువంటి సమాచారం చెప్పకుండా వేధిస్తున్నారని అన్నారు. అరెస్ట్ చేసిన వారిపై కుట్రపూరితంగా గంజాయి కేసులు పెట్టి, జైళ్ల నుంచి బయటకు రానివ్వకుండా చేయాలనే కుట్రతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు చట్టాలను అపహాస్యం చేస్తూ, ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారే కారణంతో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కక్షసాధింపుతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన ప్రతి సందర్భంలోనూ డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేయడం, సోషల్ మీడియా యాక్టివీస్ట్లను అరెస్ట్ చేసి హంగామా సృష్టించడం చేస్తోంది. తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో దానిని డైవర్ట్ చేయడానికి మరోసారి పోలీసులను ప్రయోగించి సోషల్ మీడియా యాక్టివీస్ట్లపై అన్యాయంగా కేసులు పెట్టడం తిరిగి ప్రారంభించారు.గతంలో జరిగిన ఘటనలను చూపుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిలో భాగంగానే సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. సోషల్ మీడియా పోస్ట్లకు బదులుగా కొత్త కేసులను నమోదు చేసి, న్యాయస్థానాలను కూడ బురిడీ కొట్టించేందుకు సిద్దపడ్డారు. పాతూరులో జ్యూస్ షాప్ నడుపుకుంటున్న సవీంద్రారెడ్డిని పోలీసులు మఫ్టీలో బ్లూ కలర్ కార్లో వచ్చి, అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయన కారును కూడా పోలీసులు తమతో పాటు తీసుకువెళ్ళారు. సవీంద్రారెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియక ఆయన భార్య తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే 100 నెంబర్కు ఏడుసార్లు ఫోన్ చేసినా కూడా స్పందన రాలేదు. దీనిపై మరుసటి రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.సవీంద్రారెడ్డి ఆచూకీ కనుక్కొని కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే సవీంద్రారెడ్డి పోలీసుల ఆధీనంలో లేరని, పోలీసులు అరెస్ట్ చేయలేదని, ఒకవేళ ఏదైనా ఇతర కేసుల్లో వేరేచోట ఆయనను అరెస్ట్ చేసి ఉంటే, సంబంధిత కోర్ట్ల పరిధిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది చెప్పాడు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలో ఏ కోర్టు పరిధిలోనూ అతడిని హాజరుపరచడానికి వీలులేదు, హైకోర్టులోనే హాజరుపరచాలని చాలా స్పష్టంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో పత్తిపాడు పోలీస్స్టేషన్లో సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు నమోదు చేసి, గుంటూరు కోర్ట్లో దాదాపు అదే సమయానికి హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశాలను తెలుసుకున్న గుంటూరు మేజిస్ట్రేట్ రిమాండ్కు పంపకుండా, ఈ రోజు హైకోర్టులో హాజరుపరచాలని సూచించింది.హైకోర్టులో సవీంద్రారెడ్డి తనపట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, తనపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారని, రిమాండ్ రిపోర్ట్ను కూడా పరిశీలించాలని విన్నవించుకున్నారు. రిమాండ్ రిపోర్ట్ను చూసిన హైకోర్టు సైతం దీనిపై విస్మయం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసే సందర్భంలో నిబంధనలను ఎందుకు పాటించలేదు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించింది. తాడేపల్లిలో రాత్రి ఏడు గంటలకు సవీంద్రారెడ్డి కనిపించడం లేదని ఆయన భార్య రిపోర్ట్ ఇచ్చిందని, పత్తిపాడులో ఏడున్నరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు ఎలా చూపించారంటూ కోర్టు ప్రశ్నించింది. నిజాలు తెలుసుకునేందుకు తాడేపల్లి సీసీటీవీ ఫుటేజీని, అలాగే సవీంద్రారెడ్డికి సంబంధించి ఈనెల 22, 23 తేదీలకు గానూ సెల్ఫోన్ టవర్స్ను ట్రాక్ చేయాలని, ఆయన జియో కంపెనీ సిమ్ ఉపయోగించిన నేపథ్యంలో ఆ సంస్థ జీఎంను కూడా పార్టీగా చేరుస్తూ ఆదేశించింది.మరో ఇద్దరు సోషల్ మీడియా యాక్టివీస్ట్లను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు సోషల్ మీడియా యాక్టివీస్ట్ లను పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిలో తారక్ అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ ఉదయం గుంటూరు నుంచి తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తుండగా కనిపించకుండా పోయాడు. మణిపాల్ ఆసుపత్రి వద్ద తనను పికప్ చేసుకోవాలని తన స్నేహితుడికి ఫోన్ చేసిన తారక్ అక్కడ కనిపించలేదని ఆయన స్నేహితుడు చెబుతున్నారు. ఆయన సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. ఆయన తల్లిదండ్రులు గుంటూరులోని పాతూరు స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారు దానిని తీసుకోలేదు. కనీసం పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు.మఫ్టీలో వచ్చిన పోలీసులే తారక్ను అదుపులోకి తీసుకుని, కనీసం ఆ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు కూడా తెలియకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అనంతపురంలో సూర్యభార్గవ్ అనే వ్యక్తి ఇంటికి పోలీసులు వెళ్ళి నాలుగైదు గంటల పాటు విచారించి, తమ వెంట తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు ఆయనను ఎక్కడకు తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వడం లేదు. సోషల్ మీడియా యాక్టివీస్ట్లను వేరే మార్గాల్లో తప్పుడు కేసులు పెట్టి, సులభంగా జైలు నుంచి బయటకు రానివ్వకుండా గంజాయి వంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.ఇటువంటి దుష్ట సంప్రదాయానికి తెగబడుతున్నారు. చట్టాలంటే గౌరవం, న్యాయస్థానాలు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరికి పత్రికా విలేకరులపైన కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సాక్షి పత్రికకు చెందని ఎడిటర్తో సహా పలువురిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశారు. సాక్షి కార్యాలయాలపైన దాడులకు తెగబడిన వారికి పోలీసులు కొమ్మకాస్తున్నారు. చివరికి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులపై కూడా అక్రమ కేసులు బనాయించేందుకు తెగబడుతున్నారు. వీటన్నింటికీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ పెద్దలు, తప్పు చేసిన పోలీసులు కోర్టుల ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ నిర్బంధం
సాక్షి, తాడేపల్లి: హైకోర్టు హెచ్చరించినా పోలీసులు తీరు మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సవీంద్ర కేసులో పోలీసుల వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలతో సవీంద్ర విడుదలయ్యారు. అయితే, అదే సమయంలో మరో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్రెడ్డిని నిర్బంధించారు.తారక్ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయిభార్గవ్పై అనంతపురం జిల్లా పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఇంటి నుండి బలవంతంగా రాప్తాడు పీఎస్కు తరలించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లోనే ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. -
చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డిసెంబర్ 15 నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత:మామూలుగా ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్లు పాలన చేయడానికి ప్రజలు అధికారం ఇస్తారు. ఎవరికేదైనా మినహాయింపు ఉంటుందంటే, ప్రజలకు మంచి పనులు చేసినందు వల్ల, మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేసినందువల్ల మనకు ఉంటుందనుకున్నాం. ఆ దిశలో మార్పు ఉంటుందని కూడా ఆశించాం. కానీ, మనకే పరిస్థితి ఆ రేంజ్లో రివర్స్ అయినప్పుడు, చంద్రబాబు మాదిరిగా మోసాలు చేస్తూ, అబద్దాలు చెబుతున్న వ్యక్తికి తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెబుతారు.కాలం చాలా వేగంగా తిరుగుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు. మామూలుగా ఐదేళ్లు అంటే, చివరి ఏడాది ఎలక్షనీరింగ్ కింద తీసేస్తే నాలుగేళ్లు ఉంటుందనుకోవచ్చు. నాలుగేళ్లలో దాదాపు రెండేళ్లు పూర్తయ్యాయి. కళ్లు మూసితెరిచే లోగా మరో రెండేళ్లు పూర్తవుతాయి. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మామూలుగా రెండేళ్ల తర్వాత పరిపాలన ఎలా ఉందనేది చూస్తే ప్రజల్లో ఈ తరహా వ్యతిరేకత కనిపించేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మీద ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్న విషయమే.సంపద ఎవరికి సృష్టిస్తున్నారు?:ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు? వచ్చాక ఏం చేస్తున్నాడు? అనేది చూస్తే, ఈ మనిషి అప్పట్లో పదే పదే చెప్పిన మాటలు.. సంపద సృష్టిస్తానని చెప్పడం. ఇంకా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు, జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఎన్నికలప్పుడు ప్రతి మీటింగ్లో అదే చెప్పాడు.కానీ, ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటని చూస్తే.. సంపద సృష్టించడం అంటే, కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని. అదే తేటతెల్లం అయింది. అసలు రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తానన్న పెద్ద మనిషి వాటి సంగతి దేవుడెరుగు.. అంతకు ముందు మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములు కూడా పూర్తిగా రద్దయ్యి పోయి, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ప్రభుత్వం అనేది ఎలా ఉండాలి?:ఒక ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ఎవరైనా ఏమేం ఆశిస్తారు? ఆ ప్రభుత్వ కనీస బాధ్యతలు ఏవి అంటే.. ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యావ్యవస్థను ఇస్తుందని అనుకుంటాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, ఒక మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని అనుకుంటాం. రైతుకు అండగా, దండగా ఉంటుందనుకుంటాం. అలాగే ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పని చేయాలని, అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా కొనసాగాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనిపించేది తిరోగమనమే.‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’..!:ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ విద్యార్థిని కదిలించినా, ఏ నిరుద్యోగిని కదలించినా, ఏ యువకుడిని కదిలించినా, ఏ మహిళను కదిలించినా చివరికి ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా ఈ ప్రభుత్వం గురించి వారు చెప్పేది ఏమిటో తెలుసా?.. ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అని ప్రతి నోటా వినిపిస్తోంది. ఇది నిజంగా వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో 16 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు గతంలో మనం ఎప్పుడూ చూసుండం. కానీ ఇప్పుడు కనిపిస్తోంది.పథకాలు మాయమైపోయాయి:ఈమధ్య ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అనంతపురంలో విజయోత్సవ సభ అని పెట్టబోతున్నప్పుడు ఆ ప్రకటన ఇచ్చాడు. సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ అని ఒకటి ఈ మధ్యే చేశారు. అప్పుడు ఇలా ఈ మాదిరిగా వాళ్ల పాంప్లెట్ పేపర్లో అడ్వరై్టజ్మెంట్ ఇచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెట్టారు. అప్పుడు మనం ఏమనుకుంటాం.. అందులో చెప్పినవన్నీ అమలు చేశామని అనుకుంటాం కదా?. కానీ ఆ అడ్వరై్టజ్మెంట్లో ఏముంది? అంతకు ముందు ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఏముందో చూడాలంటూ.. (ఆ రెండు అడ్వరైటజ్మెంట్స్ పీపీటీలో చూపారు)రెండింటిలో తేడా చూస్తే.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి. ఎన్నికలప్పడు యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. అది మొన్నటి అడ్వరైటజ్మెంట్లో కనిపించలేదు. అలాగే ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. కానీ, తాజాగా ఇచ్చిన అడ్వరైటజ్మెంట్లో అవి కనిపించలేదు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా కనిపించలేదు.ఏ స్థాయిలో వీరి మోసం ఉందంటే, వీరు చెప్పే అబద్ధాలు ఎలా ఉన్నాయంటే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 16 నెలల తర్వాత కూడా అమలు చేయకపోయినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చేసేశామంటూ.. వాటికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్స్లోని అంశాలను మార్చివేశారు. బలవంతపు విజయోత్సవాలు జరిపించేసి.. అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేశారు. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో చాలా తక్కువగా ఉంటారేమో?. ఇంకా చెప్పాలంటే ఇలాంటోడు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు.ఇంటింటికీ బాండ్లు. సంతకాలతో ప్రతిజ్ఞలు:సూపర్సిక్స్, సూపర్సెవెన్ అంటూ, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఎంత మొత్తం ఎంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు.ఇంకా సంతకాలతో పంపించిన ప్రతిజ్ఞా పత్రంలో ఏమన్నారంటే..‘చంద్రబాబునాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024, జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు.ఇంకా ఏకంగా చెక్కు రాసినట్టుగా రాసేయడం.. ‘ఇదిగో అమ్మ మీ ఇంట్లో ఇద్దరున్నారు. మీ ఇంట్లో ఒక చదువుకున్న పిల్లాడు ఉన్నాడు. వాడికి నిరుద్యోగ భృతి కింద ఏటా రూ.36 వేలు, మీ ఇంట్లో రైతు ఉన్నారు. ఆయనకు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం‘ అని చెప్పారు. ఇంకా 2024లో టీడీపీ, జనసేన సంయుక్త కూటమి అధికారంలోకి రావడంతోనే మేమిద్దరం భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్ధానాలను అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి పరస్పర సహకారంతో సమన్వయంతో పని చేస్తామంటూ బాండ్లు ఇచ్చారు.కానీ.. వాస్తవంగా ఏం చేశారు?:అలా బాండ్లు, ప్రతిజ్ఞా పత్రాలతో ప్రజలను నమ్మించిన వారి మోసాలు అధికారంలోకి వచ్చాక ఏ స్ధాయిలో ఉన్నాయంటే, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో ఉన్న హామీలు అమలు చేయలేదు. కొన్నింటిని ఏదైనా కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎన్నికల్లో చెప్పినంత ఇవ్వలేదు.పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగుర కొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఈ పెద్దమనిషి ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికి మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు.మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ అబద్ధమే కనిపిస్తోంది చంద్రబాబు నాయుడిగారి పాలనలో.రైతులకు అంతులేని కష్టాలు:ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని వ్యవస్థలూ నీరుగారిపోయిన పరిస్ధితి కనిపిస్తోంది. రైతులు ఎంత దారుణ పరిస్ధితుల్లో ఉన్నారంటే, ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అయినా యూరియా దొరకని దుస్థితి. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. నేను అడుగుతా ఉన్నా. మనం ఉన్నప్పుడు గడిచిన ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా?. యూరియా దొరక లేదని ఏనాడన్నా ఐదేళ్లలో ఒక్కసారైనా రైతు క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా.యూరియా దొరక్క ఈరోజు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఉందంటే దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లనే. దళారీలతో వీళ్లే చేతులు కలిపి ప్రైవేటుకి కోటా పెంచేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇక పనిలో పని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఇంకా ఆర్బీకేలు లేవు. ఈ–క్రాప్ లేదు. మరోవైపు ప్రైవేటుకి యూరియా కోటా పెంచేశారు. దాంతో మార్కెట్లో యూరియా లేదు. వాళ్లు బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. రూ.266 ఉండే యూరియా బస్తాకు మరో రూ.200 ఎక్కువ ఇస్తే తప్ప యూరియా దొరకని పరిస్థితిలో ఇప్పుడు రైతుల బతుకులు దిగజారిన పరిస్థితి కనిపిస్తోంది.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో..:మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతుకు ఆర్బీకేల ద్వారా, ఈ–క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. గరిష్ట చిల్లర ధర (ఎమ్మెస్పీ) కన్నా ఎక్కువ ఇచ్చాం. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్సఫోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి.ఈ ధాన్యం ప్రజలు తినరట! అందుకే గిట్టుబాటు ధర రావడం లేదట!: కానీ, ఈరోజు చంద్రబాబునాయుడు వచ్చేసరికి పరిస్థితి మారింది. ధాన్యానికి ఎందుకు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు అని అడిగితే, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడిగితే ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు అంటాడు రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన ఇప్పుడు చెప్తాడు. ఈ ధాన్యమంతా కూడా ఇథనాల్ (లిక్కర్లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారని ఈయన అంటున్నాడు. అంటే దానర్థం ఏంటి. రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా. ధాన్యం పండించిన రైతుకి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు. మీరంతా పండించడం మానేయండి అని చెబుతున్నాడు.పోనీ ధాన్యం పరిస్థితి గురించి ఇలా చెబుతున్నాడనే అనుకుందాం. ఆయనొచ్చాక రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర వచ్చింది చంద్రబాబూ అని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నా. కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటో, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తోందా? అని అడుగుతున్నా. ఏ పంటకూ కనీస ధర రావడం లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ–క్రాప్ను నిర్వీర్యం చేయడమే.నాడు రూ.7 వేల కోట్లతో కొనుగోలు: నాడు మన ప్రభుత్వం సీఎం–యాప్ ఏర్పాటు చేసి ఆర్బీకే స్థాయిలో మనం జాయింట్ కలెక్టర్లను, మార్క్ఫెడ్ జాయింట్ ఎండీకి ప్రోక్యూర్మెంట్ బాధ్యతలు అప్పగించి, ఆర్బీకేల్లో పోస్టర్లు పెట్టి ఫలాన పంటకు ఈ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడంతో రాష్ట్రంలో ఏ పంటకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొంది.అధ్వాన్నంగా విద్యా రంగం:విద్యా రంగంలో ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితిని పక్కన పెడితే, నాడు–నేడు పనులు ఆగిపోయాయి, టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది.కూటమి పాలనలో త్రైమాసికానికి సంబంధించి ఫీజులు అందని పరిస్థితి నెలకొంది. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్కు సంబంధించి, ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.వసతి దీవెన బకాయిలు రూ.2200 కోట్లు:గత ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతిదీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఈరోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. చదువుకోవడానికి పిల్లలు ధైర్యం చేయడం లేదు. చదువుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు అందడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను చేర్పించుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇదీ విద్యారంగం పరిస్థితి.వైద్య రంగం నిర్వీర్యం:ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆరోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెల రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆసు త్రులకు వెళ్లలేని పరిస్థితి.ఆరోగ్య ఆసరా ఊసే లేదు:రోగికి చికిత్స తర్వాత విశ్రాతి సమయంలో, డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది పెద్ద సున్నా.మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం:ఒకవైపు వైద్య ఆరోగ్య రంగం అన్ని విధాలుగా నిర్వీర్యం కాగా, మరోవైపు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచన చేయండి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ గాని బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా?. అందుకోసమే దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు.అందుకే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం:ఆరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ కాలేజీని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంత మంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది.మిగిలిన వారికి కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వంటేజ్. రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఇలాంటి కార్యక్రమానికి చంద్రబాబు స్కామ్ల కోసం ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు.ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం:రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వ రాకముందే ప్రారంభోత్సవానికి అన్నీ సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా?. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు.రూ.2 లక్షల కోట్లతో అమరావతికి ప్రణాళికలు!:అమరావతిలో ఈ పెద్ద మనిషి చేస్తున్నది ఏంటి? చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే ఖర్చు అవుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు.ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని చంద్రబాబు ఎస్టిమేషన్ వేశాడు. మరీ ఈ రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? చేతిలో డబ్బు లేదు కానీ అమరావతికి రూ. 2 లక్షల కోట్లతో ప్రణాళికలు రూపొందించాడు. మరి ఇంత మంది పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి చంద్రబాబు దగ్గర డబ్బు లేదట!. చంద్రబాబు అసలు నీవు మనిషివేనా?. ఇదీ ఇవాళ రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయం పరిస్థితి. ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు.అంతులేని అవినీతి. యథేచ్ఛ దోపిడి:కూటమి పాలనలో అవినీతి గురించి ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›్జ, సిలికాన్, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే, ఎకరా భూమి 90 పైసలే. కరెంటు కొనుగోలుకు సంబంధించి మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60కి కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.ఏదీ చూసినా స్కామ్లే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ప్రభుత్వ ఖజానాకు రావడం లేదు. దారి మళ్లీ వీరి జేబుల్లోకి వెళ్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. మన హయాంలోలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా?. అందుకే ఇవాళ రాష్ట్ర ఆదాయం తగ్గి దివాళ తీస్తోంది.రూ.2 లక్షల కోట్ల అప్పులు:చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం అప్పు కేవలం 16 నెలల్లోనే చేశారు. కొత్తగా స్కీమ్లు లేవు, పాత స్కీమ్లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది. ఎవరి జేబుల్లోకి పోతోంది. అవినీతి ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్:చంద్రబాబు అనే వ్యక్తి తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ ఏదైనా జరుగుతుందంటే చాలు.. ఆ ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, దాంట్లో నుంచి డైవర్ట్ చేయడం. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి.మీరంతా గట్టిగా నిలబడాలి:‘మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. సజావుగా ఎన్నికలు జరుపుకునే పరిస్థితి అంత కన్నా లేదు. సజావుగా ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావాలని ఆయనకు కూడా తెలుసు. ఈ పెద్ద మనిషి సజావుగా ఎన్నికలు జరపడం లేదు కాబట్టే మీరందరూ ఇంకా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది.కార్యకర్తలే పార్టీకి బలం:మన పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయ్యింది. బహుశా మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడ ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైయస్ఆర్సీపీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డాం. ఆ స్థాయిలో మనం నిలబడగలిగామంటే దానికి కారణం కార్యకర్తలే. ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే.నేను ఈ గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తను, ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని, ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని, యువత అధ్యక్షుడిని, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని, ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజ స్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తరువాత చంద్రబాబు నాయుడు కాదు కదా? వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైయస్ఆర్సీపీపై పోటీకి కూడా పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి.అనుబంధ విభాగాలు కీలకం:ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రచర్ను చూస్తే ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్చార్జులు ఉన్నారు. వీరంతా కూడా డిస్ట్రీక్ట్ కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు. వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అ ధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి.వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు. అలా కమిటీలు వేసుకున్న తరువాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్ష్యాత్తు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారే రేపు పొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్లను ముందుర పెట్టి.. వాళ్ల ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను.అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలను వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు వేయండి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ స్థాయి కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ గురించి వివరించండి.గ్రామస్థాయిలో కమిటీలు. ఏర్పాటుకు టార్గెట్:తర్వాత గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు, ఎవరు మహిళా అధ్యక్షురాలు, ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు, ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు. ఎవరు బీసీ అధ్యక్షుడు, ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోండి. సంక్రాంతి కల్లా పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు.ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు, ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు చెబుతారు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. అంటే ఆ గ్రామంలోకి ఎటరవుతానే మీరు ఏడుగురి పేర్లు టకటకా చెబుతారు. గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి 8 మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఆ విధంగా మీరు ఆ 8 మంది పేర్లు టక టకా చెప్పగలిగారంటే.. మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే. ఇది మిమ్మల్ని ఎలక్షనీరింగ్ కు సన్నద్ధం చేయడం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ రైతు కమిటీలు, అనుబంధ కమిటీలు, యూత్, యూత్ కమిటీలు, మహిళా కమిటీలు, స్టూడెంట్స్ కమిటీలు, సోషల్ మీడియా కమిటీలు, బీసీ కమిటీలు, ఎస్సీ కమిటీలు చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్తో పార్టీ ఇచ్చే మెసేజ్తో ఏ కార్యక్రమాన్నైనా గ్రామంలో విస్త్తృతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో పది మందిని పేరు పెట్టి మీరు పిలవగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది.డిజిటల్ బుక్.. ఆవిష్కరణ.. లక్ష్యం:మన కార్యకర్తల కోసం ఒక కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్ ను ఈరోజు లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి db.weysrcp.comలో ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం వెబ్సైట్ లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డాటా.. ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి.రెండోది ఐవీఆర్ ఎస్ విధానం. ఒక ఫోన్ నెం: 040–49171718 అన్యాయానికి గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆ నెంబర్కు ఫోన్ చేసి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్కు ఫోన్ చేయగానే దశలవారీగా సమాచారం తీసుకుంటారు.డిజిటల్ బుక్ ఒక శ్రీరామరక్ష:ఈ డిజిటల్ బుక్.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు శ్రీరామరక్ష. మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసిన కేసుల మీద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా, రాష్ట్రంలో లేకపోయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసినవారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు దీని ద్వారా వేస్తాం. వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారు. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలి అన్న శ్రీ వైయస్ జగన్.. ఆ తర్వాత డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. -
డిజిటల్ బుక్తో కూటమికి ఇక సినిమానే!
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ బుక్ యాప్(YSRCP Digital Book)ను లాంచ్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ గురించి సమావేశం అనటతరం బయటకు వచ్చిన నేతలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేసే వీలుందని తెలిపారు. ‘‘కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను వైఎస్ జగన్ లాంచ్ చేశారు. రెడ్బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుంది. రెడ్బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేరొనవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ ఉంటుంది. అన్యాయం చేసిన వారు ఎక్కడున్న సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారు’’ అని వివరించారు. అదే సమయంలో.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రతీకార రాజకీయాలపై గతంలోనూ వైఎస్ జగన్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశారు. ‘‘కూటమి పాలనలో ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వైఎస్సార్సీపీలో పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం. రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే.. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం’’ అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ బుక్ పేరిట ఇప్పుడు యాప్ విడుదల చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కూటమి సర్కార్ -
అప్పులపై కూటమి తప్పుడు ప్రచారం బట్టబయలు
ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదు వేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్న మాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియా వారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదువేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్నమాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఎపినే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రేదశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియావారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్ధిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఏపీ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈనాడు వంటి ఎల్లో మీడియా జగన్ హయాంలో అప్పు చేసినప్పుడల్లా అది ఎంత చిన్న మొత్తం అయినా, ఏపీ అప్పుల చిప్ప అయిపోయిందని, మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించేది. అలాగే వారి టీవీలలో విపరీతంగా ప్రసారం చేసేది. కాని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే కేవలం 15 నెలల్లోనే దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినా ఈ మీడియా కిమ్మనడం లేదు. పైగా దీనికి ఇదంతా రుణాల సమీకరణ అని ముద్దుపేరు పెట్టుకుని రాస్తున్నాయి. ప్రభుత్వం చూపించే లెక్కల ప్రకారం 1,17 లక్షల మొత్తం నిధుల రాష్ట్రానికి ఈ ఐదు నెలల్లో సమకూరితే అందులో సింహభాగం అప్పులే కావడం గమనార్హం. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాలు ప్రస్తుతం చేస్తున్న అప్పు గురించి నోరు ఎత్తడం లేదు. పైగా ఇప్పటికీ చంద్రబాబు ఆయా సభలలో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని అసత్య ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిస్థితిపై నెటిజన్లు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. జగన్ నెలకు 5500 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక.. చంద్రబాబు నెలకు 11వేల కోట్ల అప్పు చేస్తే సింగపూర్ అయినట్లా అని వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ లో తెలిపిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తీసుకోదలచిన అప్పుల్లో మూడింట రెండు వంతుల మేర అప్పుడే ప్రభుత్వం తీసేసుకుందని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ టైమ్ నాటి 2023-34 ఐదు నెలలతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 8752 కోట్ల రాబడి తగ్గిందని కాగ్ వెల్లడించింది. అలాగే అదే కాలానికి ప్రభుత్వం పెట్టే వ్యయంలో కూడా 10663 కోట్లు తగ్గిందని, దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై కనబడుతోందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి ,జగన్ టైమ్ నాటికన్నా, ఈ ఏడాది ఐదు నెలల్లో కేంద్రం నుంచి 16వేల కోట్ల ఆదాయం తక్కువ వచ్చిందని తేలుతోంది. ఆదాయం ఆశించినంత రాక రెవెన్యూ లోటు, అప్పుల వల్ల ద్రవ్య లోటు తీవ్రంగా పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఈ లెక్కలు గమనిస్తే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ ఆర్ధిక ఆరోగ్యం క్షీణించినట్లు కనబడుతుంది. రెవెన్యూ లోటులో దేశంలోనే నెంబర్ టు స్థానంలో ఏపీఉంది.మరో వైపు ప్రభుత్వం ఆయా రంగాలకు చెల్లించవలసిన బకాయిలు వేల కోట్లు ఉంటున్నాయి. ఉదాహరణకు ఒక్క ఆరోగ్యశ్రీ బకాయిలే 2700 కోట్లు అని స్వయంగా ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చిన్న,మద్య తరగతి క ఆంట్రాక్టర్ లకు ఆరేడువేల కోట్లు చెల్లించవలసి ఉందని కదనాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 30వేల కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. వీటితో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చలేదు. వాటిని అరకొరగా అయినా చేయాలంటే మరింత అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంది. ఈ దశలోజీఎస్టీ కొత్త సంస్కరణలు రావడం రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పైకి మాత్రం ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు చెబుతూ లోపల మాత్రం ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. తెలంగాణలోజీఎస్టీ మార్పుల వల్ల నష్టం ఏడువేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు.ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుని భారాన్ని రాష్ట్రాలపై మోపిందని, ఇందుకు నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో కూడా ఎనిమిదివేల కోట్లకుపైగా నష్టం ఉందని లెక్కలు కడుతున్నారు. అసలే రెవెన్యూ లోటుతో కింద, మీద పడుతున్న తరుణంలో ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆయా అధికారిక సమావేశాలలో వివిధ శాఖల బడ్జెట్లలో కోత పెట్టడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.ఈ క్రమంలో ముందుగా విద్య, వైద్య రంగాలను బలి చేయడానికి సన్నద్ధం అవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ టైమ్లో నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేస్తే, ఇప్పుడు దానికి దాదాపు మంగళం పలికినట్లేనా అన్న సందేహం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో విరాళాలు, ఆయా సంస్థల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పడమే నిదర్శనంగా ఉంది. అలాగే సంజీవని కార్యక్రమం చేపట్టడం, ఇతర పద్దతుల ద్వారా ఆరోగ్య శాఖ బడ్జెట్ లో 30 శాతం తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన ఆ మాట అన్నారంటే అధికారులకు పరోక్షంగా ఆ రకంగా కోతలు పెట్టమని చెప్పడమే కదా!. జీఎస్టీ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను గురించి వివరించాలని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. దానివల్ల నిజంగా జనానికి ఎంత మేలు కలుగుతుందో కాని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కోతల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందేమోనన్న భయం పలువురిలో వ్యక్తం అవుతోంది.ఆర్థికంగా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇబ్బందులు వస్తాయని ఆర్థిక మంత్రి, అధికారులు చెప్పినా, ప్రజా ప్రయోజనాల రీత్యా మద్దతు ఇవ్వాలని తాను తెలిపానని ఆయన అన్నారు. నిజానికి చంద్రబాబు వంటివారికి ఇవి నచ్చుతాయంటే అంతగా నమ్మలేం. గత అనుభవాలు ఈ విషయాన్ని చెబుతాయి. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, మోదీని ఈ మధ్య కాలంలో విపరీతంగా పొగుడుతున్న నేపథ్యంలో ఇంతకన్నా వేరే మార్గం చంద్రబాబుకు లేదన్న సంగతి బహిరంగ రహస్యమే. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా రాబడి తగ్గుతుండడంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలు కూడా ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని శాసనసభలోనే ఆయన వ్యాఖ్యానించడం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆరోగ్య బీమాపై పన్ను తీసివేసినందున రాష్ట్రానికి 800 కోట్లు ఆదా అవుతుందని ఆయన అన్నారు. బాగానే ఉంది. అలాంటప్పుడు ఆరోగ్య శాఖ బడ్జెట్ 30 శాతం తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చెప్పారో తెలియదు. వ్యవసాయం ఖర్చు తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు చెప్పేస్తున్నారు. ఒక పక్క తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, అల్లాడుతుంటే, వారికి ఆదాయం పెరుగుతుందని సీఎం అంటున్నారు. నిజంగా అలా జరిగితే సంతోషమే. కాని ఊహాజనిత అంశాల ఆధారంగా మాట్లాడితేనే సమస్య వస్తుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల కొన్నిటి ధరలు తగ్గి ప్రజలకు కొంత ప్రయోజనం ఉండవచ్చు. కాని దానితోనే ప్రజల జీవితంలో పెనుమార్పులు వస్తాయని అనుకుంటే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఇప్పటికే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయని చెబుతున్నారు. తద్వారా పన్ను రాయితీలు వచ్చినా, ప్రజలకు లభించేది పెద్దగా ఉండకపోవచ్చునని అంటున్నారు. మరో వైపు పోరాటా వంటి ఉత్తరాది ఆహార పదార్థాలకు పన్ను తీసి వేసి, ఇడ్లి, దోసె వంటి దక్షిణాది పదార్ధాలపై పన్నులు ఉంచడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. జీఎస్టీ రూపేణా ఇంతకాలం అధిక పన్నులు వసూలు చేసి, ఇప్పుడేదో తగ్గించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏతావాతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునే అవకాశం కనిపిస్తోందని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ పిటిషన్.. స్పీకర్ అయ్యన్నకి నోటీసులు
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష తిరస్కరిస్తూ ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకొచ్చిన రూలింగ్ను వైఎస్ జగన్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, స్పీకర్ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తోపాటు శాసనవ్యవహారాల కార్యదర్శికి నోటీసులు జారీ అయ్యాయి. జగన్ పిటిషన్ ఆధారంగా ఈ ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకూడదనే ఉద్దేశంతో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5వ తేదీన ఓ రూలింగ్ను తీసుకొచ్చారు. దీనిని సవాల్ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) న్యాయ పోరాటానికి దిగారు. ‘‘స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయి. ఇది స్పీకర్ ఒక్కరి నిర్ణయమే కాదు.. అధికార పార్టీ సమిష్టి నిర్ణయం. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసన వ్యవహారాల మంత్రి కూడా మీడియాతో ఇదే చెప్పారు. స్పీకర్ చేసిన రూలింగ్ నిష్పాక్షికంగా, తటస్థంగా లేదు. .. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాగే చట్టంలో కూడా స్పష్టమైన నిర్వచనం ఉంది. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు. అయినా కూడా చట్టంలోని లేని పరిమితిని స్పీకర్ తన రూలింగ్లో నిర్దేశించారు. వైఎస్సార్సీపీనే ఏకైక ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీ నాయకుడిగా నేనే ప్రతిపక్ష నేతను అవుతాను. .. ప్రతిపక్షాన్ని అణచివేయడమే స్పీకర్ రూలింగ్ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ రూలింగ్ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలి. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షం.. నాకు ప్రతిపక్ష నేత హోదా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలి’’ అని తన పిటిషన్లో వైఎస్ జగన్ కోర్టును(Jagan Petition in AP High Court) కోరారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న అభ్యర్థనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెండింగ్లో ఉంచుతూ వచ్చారు. దీంతో ఈ అంశాన్ని సవాల్ చేస్తూ కిందటి ఏడాది జులైలోనే వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ పెండింగ్లో ఉండగానే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ రూలింగ్ తెచ్చారు. జగన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ ఆ రూలింగ్లో పేర్కొన్నారు. అయితే ఆ రూలింగ్ రాజకీయ ప్రేరేపితంగా ఉందంటూ జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లో.. గతంలో పలు పార్టీలకు, వాటి అధినేతలకు సీట్ల సంఖ్య లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిన ఉదంతాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: స్పీకర్ అయ్యన్న రూలింగ్ వెనుక.. -
ముగిసిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సూపర్ సిక్స్ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులతో పలు అంశాలపై పార్టీ కేడర్కు ఆయన ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో(Tadepalle Central Office) జరుగుతున్న ఈ మీటింగ్కు రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)లు హాజరయ్యారు. -
AP Assembly: ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని..
ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు ప్రతిపక్ష నేతకు తగినన్ని అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాలపై పెద్దగా నమ్మకం లేనివారి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. తమ గొంతు వినిపించేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలపై వీరు అస్సలు నోరు మెదపడం లేదు. పైగా.. ప్రతిపక్షానికి సమయం ఇవ్వడం వల్ల అధికార పక్షానికీ మేలు జరుగుతుంది. వారి విమర్శలను తిప్పికొట్టేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకూ అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అవకాశాలన్నింటినీ తోసిపుచ్చుతున్నారు. 2024 ఎన్నికల తరువాత 11 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ అసెంబ్లీకి హాజరు కాని విషయం ప్రజలందరికీ తెలిసిందే. తమ గొంతులు నొక్కేస్తూ, అవమానిస్తున్న కారణంగా అసెంబ్లీకి రామని ఆ పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ స్వోత్కర్షలతో నిస్సారంగా సాగుతున్నాయి. ప్రతిపక్షానికి సంఖ్యాబలం ఆధారంగా కాకుండా... చర్చనీయ అంశం ఆధారంగా తగిన సమయమిస్తామని స్పీకర్ లేదంటే సీఎం భరోసా ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అప్పుడు బాధ్యత వైసీపీది అయ్యేది. టీడీపీ ఆ పని చేయలేదు. మరోవైపు.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ(YSRCP Opposition Status Demand) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన నోటీసుకూ స్పీకర్ ఇప్పటివరకూ స్పందించలేదు. సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గతాన్ని మరచిపోయారు. 1972లో సీపీఐకి కేవలం ఏడుగురే సభ్యులుంటే సీపీఎంకు ఒకే ఒక్క సభ్యుడు ఉండే వారు. అయినా ఆయా పార్టీల నేతలు మాట్లాడేందుకు తగిన సమయం లభించేది. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 మందే సభ్యులతో ప్రతిపక్ష హోదా రాలేదు. కాంగ్రెస్ నేత పీజేఆర్ తదితరులు సమయం కోసం పోరాడాల్సి వచ్చేది. దాంతో వారు కోరినట్లు ఆనాటి స్పీకర్ యనమలకు కొంత టైమ్ కేటాయించక తప్పేది కాదు. 2004లో సీపీఐ (ఎంఎల్) తరఫున గుమ్మడి నరసయ్య ఒక్కరే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయినా ఆయన గౌరవానికి ఏమాత్రం విఘాతం కలగకుండా చర్చల్లో పాల్గొనేందుకు తగినంత సమయం కేటాయించేవారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం విమర్శలను భరించే స్థితిలో లేదు. దీంతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష హోదా(Opposition Status) ఇవ్వడానికి పదిశాతం సభ్యులు ఉండాలన్నది ఒక సంప్రదాయం మాత్రమే. కాబట్టి వైసీపీకి ఆ హోదా ఇచ్చి ఉంటే హుందాగా ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నా 70 స్థానాలున్న అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మీడియా సమావేశాల ద్వారా జగన్ తన గళాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నప్పటికీ అసెంబ్లీలోనూ తగిన అవకాశాలిస్తామని స్పీకర్ చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలలు మరింత స్పష్టమవుతాయో అన్న భయం కాబోలు!. 1994లో అఖండ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు(NT Rama Rao) ప్రభుత్వాన్ని 1995లో ఆయన అల్లుడైన చంద్రబాబు కూల్చివేశారు. ఆ టైమ్లో ఎన్టీఆర్ తన వెంట ఉన్న 35 మంది సభ్యులతో విశ్వాసపరీక్ష కోసం అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు వెన్నుపోటుపై మాట్లాడేందుకు శతథా ప్రయత్నించారు. కానీ అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడే మాట మాటకూ మైక్ కట్ చేసిన అందరికీ తెలుసు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఎన్టీఆర్ కారణంగానే తనకు స్పీకర్ పదవి దక్కిందన్న విషయమూ యనమల మరచిపోయారు. సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్తోనే ఇలా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అవకాశం ఇస్తారన్నది వట్టిమాటే. అందుకే మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి అంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక సభ్యుల గైర్హాజరి కూడా కొత్తగా జరుగుతున్నది కాదు. 1989-94 మధ్య ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు దాదాపు రెండేళ్లు సభలోకి రాలేదు. ఒక సందర్భంలో తనను ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019-2024 టర్మ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరిపై ఎవరో అనుచితంగా మాట్లాడారంటూ లేని ఆరోపణలు చేసి సుమారు రెండేళ్లు సభకు గైర్హాజరయ్యారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు 23 యంది వైసీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు, వారిపై ఫిరాయింపు చట్టం అమలు చేయనందుకు నిరసనగా జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి సభను సుమారు రెండేళ్లు బహిష్కరించారు. ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే చంద్రబాబు సభలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించి, వారి ఖర్మ అని అనడం. ఆయన బహిష్కరించిన్పుడు కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది కదా! జీఎస్టీ లాంటి బ్రహ్మాండమైన సంస్కరణలు వస్తుంటే వైసీపీ అసెంబ్లికి రాలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావని అనడం చిత్రం. జగన్ మీడియా సమావేశంలో(Jagan Press Meet) అడిగే ప్రశ్నలకే జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్న చంద్రబాబు, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి నిలదీస్తే మాత్రం స్పందిస్తారా? ఏదో రకంగా జగన్ను, వైసీపీని దూషించి అవమానించాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ సభకు రాకపోవడాన్ని తప్పు పట్టే చంద్రబాబు తాను, అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు కదా అనే దాని గురించి మాట్లాడరు. అప్పుడు వారిపై ఆనాటి స్పీకర్లు అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు మాత్రం అనర్హత వేటు అంటూ బెదిరించే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీని ఈ సభలో చంద్రబాబు తెగ పొగిడారు. మరి ఇదే సభలో మోడీని గతంలో చంద్రబాబు నానా మాటలు అన్నారు కదా! దాని గురించి ఏమి చెబుతారు? సభలోకి వచ్చి వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే అది చంద్రబాబుకు, టీడీపీకి ఇరకాటంగా ఉంటుంది. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ గట్టిగానే నిలదీస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు మంత్రులు బదులు చెప్పలేక తంటాలు పడుతున్నారు. అదే ప్రకారం ప్రశ్నిస్తారన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా ఉంటేనే బెటర్ అన్న భావన కూటమిలో ఉందనిపిస్తుంది. సభలోకి వైసీపీ సభ్యులు వెళ్లినా మాట్లాడడానికి తగు అవకాశం ఇవ్వడానికి సిద్దంగా లేరు. ప్రజాస్వామ్య స్పూర్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఇంతకన్నా ఏమి ఆశించగలం!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: హిట్టా.. ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబూ! -
పిఠాపురం.. పైగా పవన్ చేతిలో పనే.. అయినా సైలెన్స్!
సాక్షి, కాకినాడ జిల్లా: సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం పరిధిలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతోందని, ఓఎన్జీసి కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమవుతోందన్నది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఓఎన్జీసి కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు.. వేటకు ఆటంకంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. వేలాఇ కుటుంబాల జీవనాధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసి ద్వారా నష్టపరిహరం ఇప్పించడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Fishermen Protests). పవన్ చేతిలో పనే, కానీ.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు కూడా. అయినప్పటికీ, స్థానిక సమస్యలపై ఆయన స్పందన లేకపోవడం గంగపుత్రులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. సముద్రం కలుషితమైతే, మత్స్యకారుల ఆరోగ్యం.. వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే.. నియంత్రించాల్సిన బాధత్య పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే, వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండడం అక్కడి జనాలకు కోపం తెప్పిస్తోంది. మరి ఇప్పుడైనా పవన్ స్పందిస్తారా? లేదంటే తన శాఖ పరిధిలోకి రాదని.. అధికారులదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి.. -
‘నాపై సొంత కూటమి ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అయిన తనను కూటమికే చెందిన పొరుగు ఎమ్మెల్యే రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభలో జీరో అవర్ సందర్భంగా తన దుస్థితిని చెప్పుకునే అవకాశం దొరికిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో ఎంతైనా పోరాటం చేయొచ్చు గానీ, సొంత కూటమికే చెందిన తనపక్క నియోజవర్గ ఎమ్మెల్యే కుట్రకు కొమ్ముకాస్తుంటే ఎమ్మెల్యేగా ఎవరికి చెప్పుకోవాలని సభలో ప్రశ్నించారు.10 రోజులుగా తనపై తీవ్ర ఆరోపణలతో పత్రికలు, టీవీల్లో వార్తలు రాయిస్తూ తీవ్ర అవమానానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో క్వారీలు తీసుకున్న వారికి రూ.కోట్లు జరిమానాలు విధించారు. కానీ మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారు. నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రజా సమస్యలపై నా పని నేను చేస్తుంటే వ్యాపారాలు చేసుకోవడం కోసం నన్ను బలి చేయడం చాలా తప్పు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే థామస్పై సొంతపార్టీ నేతల తిరుగుబాటు
చిత్తూరు జిల్లా: పాలసముద్రం మండలంలో ఎర్రమట్టి గ్రావెల్ను గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుచరులు తమిళనాడుకు తరలించుకుని దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర నేత చిట్టిబాబు వర్గానికి చెందిన కూటమి నాయకులు సోమవారం ఎర్రమట్టి గ్రావెల్ తీసుకెళ్లుతున్న ప్రదేశంలో సీపీఐ నేతలతో కలసి ధర్నా చేపట్టారు.మండలంలో ఎమ్మెల్యే అనుచరులు ఐదు, ఆరు నెలలుగా తమిళనాడు సరిహద్దులోని ఎర్రమట్టిని టిప్పర్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారని నిరసిస్తూ చిట్టిబాబుతో సహా పలువురు టీడీపీ, సీపీఐ నేతలు నిరసనలు, ధర్నా చేశారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేయాల్సిన ఎమ్మెల్యే.. పచ్చని గుట్టలను దొచుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. అనంతరం వారు తహశీల్దార్కు వినతిపత్రమిచ్చారు. -
108 సర్వీసులకు బాబు సర్కారు ఉరి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ చేసినా 108 సర్విసు రాకపోవడంతో పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఆటోను ఆశ్రయించాల్సి వచి్చందని, చివరకు అందులోనే ప్రసవం జరిగిందని.. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జత చేసి చంద్రబాబు సర్కార్ అసమర్థతను నిలదీస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో తన ఖాతాలో సోమవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ప్రజల ప్రాణాలు పోతున్నాయ్ ⇒ ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్విసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోంది. నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచి్చంది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మృతి చెందింది. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంబులెన్స్లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలనే నిబంధన ఉంటే.. దాన్ని అధిగమిస్తూ 12–14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే.. 16–17 నిమిషాల్లోనే వచ్చేవి. గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన ఉంటే దాన్ని కూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఇప్పుడు ఎందుకు చేరుకోవడం లేదు? ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా! కలెక్షన్ల మీద మినహా ప్రజల పట్ల ధ్యాస ఉంటే కదా? -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రైతులకు కష్టాలే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతంచంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ను ఆనాడు పీఎం వాజపేయ్కు చెప్పి, వన్మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.1987లో ఎన్సీపీఏ డ్రిప్ ఇరిగేషన్ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది. - కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి. - మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి. - పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి. - సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి. - మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది. - ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు. - వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలివరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. యూరియాపై రెండు నాలుకల ధోరణియూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి. పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్ను దక్కుతుంది. ల్యాబ్లు, రీజనల్ కోడింగ్ సెంటర్లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేకౌలురైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
కుయ్.. కుయ్.. మూగబోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: 108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోతో సహా ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. ‘‘కుయ్.. కుయ్.. మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైఎస్సార్సీపీ హయాంలో అంబులెన్స్లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి...గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదు?. ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదు?. ప్రభుత్వం అన్నది పని చేస్తేనే కదా?. కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటేకదా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.కుయ్.. కుయ్.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయిప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు @ncbn ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం… pic.twitter.com/klxCNlRJnS— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025 -
బురద చల్లడం తేలికే.. దమ్ముంటే నిరూపించాలి: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) వల్ల వెంకటేశ్వర స్వామి ఖ్యాతి తగ్గుతోందని.. ఆయన నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas) మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలోనూ దుర్గమ్మ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి దిగారంటూ ధ్వజమెత్తారు.‘‘నవరాత్రి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇళయరాజా మ్యూజిక్ షోకి టిక్కెట్ రూ.59 వేలకు విక్రయిస్తారా?. ఇంత దారుణమైన దోపిడీ చేస్తారా?. ఆ దోపిడీ సొమ్మంతా నారా లోకేష్(Nara Lokesh) జేబులోకి వెళ్తున్నాయి. వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. మెడికల్ కాలేజీల వివాదాన్ని డైవర్షన్ చేయటానికి టీటీడీ(TTD)ని తెర మీదకు తెచ్చారు. బీఆర్ నాయుడు ఛైర్మన్ అయ్యాక వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారింది. చంద్రబాబు సీఎం అయి ఉండి లడ్డూని వివాదాస్పదం చేశారు’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు సరిగా చేయనందునే తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. మా హయాంలో శ్రీవాణి టిక్కెట్లపై అనవసర వివాదం చేశారు. మేము ఆనాడు వెయ్యి టికెట్లు అమ్మితే ఇప్పుడు రెండు వేల టిక్కెట్లు ఎలా అమ్ముతున్నారు?. శ్రీవాణి టిక్కెట్లు ఆపేస్తామన్న బీఆర్ నాయుడు ఇప్పుడు అంతకంటే అధికంగా ఎలా విక్రయిస్తున్నారు?. వీఐపీ టిక్కెట్లను భారీగా పెంచి సామాన్యులకు స్వామి దర్శనాన్ని తగ్గించారు. పరకామణి భవనాన్ని సైతం జగన్ హయాంలోనే నిర్మించి ప్రారంభించారు...సీసీ కెమెరాలతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాం కాబట్టే రవికుమార్ లాంటి దొంగలు దొరికారు. చంద్రబాబు హయాంలో దొంగను పట్టుకోలేక పోయారు. మా హయాంలో దొంగను పట్టుకుని వారి ఆస్తులను టీటీడీకి స్వాధీనపరిచాం. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే దీనిపై సీబిఐతో విచారణ జరిపించండి. అంతేగానీ వెంకటేశ్వరస్వామి ఖ్యాతిని తగ్గించవద్దు. తప్పు చేసినవారిని ఎవరినీ వెంకటేశ్వర స్వామి క్షమించరు.. తప్పకుండా తగిన శిక్ష వేస్తారు. దుర్గమ్మ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి తెర తీశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టవద్దు’’ అంటూ వెల్లంపల్లి హితవు పలికారు.ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలుఅధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వలన సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవరాత్రి ఉత్సవాలపై కనీసం ఒక్క సమీక్షనైనా ఎంపీ, ఎమ్మెల్యే పెట్టారా?. విజయవాడ ఉత్సవ్ మీద ఉన్న ప్రేమ నవరాత్రి ఉత్సవాల మీద ఎందుకు లేదు?. స్టాల్స్ ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇళయరాజా షో కోసం టిక్కెట్ రూ.59 వేలకు విక్రయిస్తారా?. ఇది దోపిడీ కాక మరేమిటి?. ఈ దోపిడీలను ఆపకపోతే మేము న్యాయ పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు: బొత్స
సాక్షి, అమరావతి: కార్మికుల హక్కులను కూటమి సర్కార్ కాల రాస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పని గంటలు 8 నుండి 12 గంటలకు పెంచటంపై తాము ప్రశ్నించామన్నారు. అంత హడావుడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదన్న బొత్స.. ఎంతో కాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహిళల రక్షణపై కూడా ఈ బిల్లులో క్లారిటీ లేదు. దీనిపై మేము వాకౌట్ చేశాం. జీఎస్టీపై మేము మాట్లాడుతుంటే మాట్లాడనివ్వటం లేదు. కనీసం మా సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వం తీసుకోలేదు. చపాతీ, రోటీకి జీఎస్టీలేదన్నారు. మరి ఇడ్లీ, దోశకు ఉందా? అని అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు...ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్లో మాట్లాడమని చెప్పాం. చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకు మీద జీఎస్టీని తొలగించమని అడిగితే ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం ఇచ్చిన నోట్ను మేము చదివి వెళ్లిపోవాలన్నట్టుగా వారు చూస్తున్నారు’’ అని బొత్స దుయ్యబట్టారు.ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు -
డొల్ల మాటలు... ఊకదంపుడు ఉపన్యాసాలు!
ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలంటే.. ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షలు, లోటుపాట్ల సవరణ వంటిపై చర్చలు జరుగతాయని అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ తీరు వేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని కూడా ఆత్మస్తుతి, పరనిందకు వేదికలుగా మార్చేసుకుంటున్నారు. ఈ మధ్యే రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల కష్టాల గురించి కాకుండా రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలకే అధిక ప్రాధాన్యం లభించింది. ఒక పక్క రైతులకు యూరియా అందక నానా అగచాట్లూ పడుతూంటే.. టమోటా, ఉల్లి, తదితర పంటలకు తగిన ధరలు దొరక్క సతమతమవుతూంటే చంద్రబాబు వాటి గురించి కాకుండా దుష్ప్రచారం జరుగుతోందని ఒకసారి, అధికారుల వైఫల్యమని ఇంకోసారి మాట్లాడారు. జగన్ హయాంలో మాదిరిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలనో ఇంకో మార్గమో చూపాలి కదా? అదేది చేయలేదు బాబు. ఈ వైరుద్ధ్యం ప్రజల దృష్టిలో పడదన్నది ఆయనగారి ధైర్యం! ఈ సదస్సుల్లో ఒక విషయమైతే స్పష్టమైంది. జగన్ హయాంలో మాదిరిగా ప్రజాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలను ప్రోత్సహించరాదని చంద్రబాబు తీర్మానించుకున్నట్టు కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ బడ్జెట్లో 30 శాతం కోతకు, విద్యాసంస్థల బాగుకు విరాళాలపై ఆధారపడాలన్న ఆలోచనలను ప్రోత్సహిస్తూండటం ఇందుకు కారణం. మద్యం ఆదాయం 10.29 శాతం పెరిగిందన్న సమాచారం కూడా ఏమంత ప్రజానుకూలమైన విషయం కాదు. రాష్ట్రంలో హోం, రెవెన్యూ, మున్సిపల్ శాఖల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చంద్రబాబు ఈ సమావేశాల్లో ప్రకటించారు. పాలనపై పట్టు తప్పడం, రెడ్బుక్ రాజ్యాంగం పెచ్చరిల్లడం, టీడీపీ, జనసేన దౌర్జన్యాలు, కబ్జాకాండలు, ఇసుక, మద్య అక్రమ వ్యవహారలు కారణం కావచ్చ కానీ చంద్రబాబు వీటిని ప్రస్తావించడం లేదు. తనది రాజకీయ పాలనే అని బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. ఇది కాస్తా పార్టీ శ్రేణులకు గ్రీన్ సిగ్నల్లా మారిపోయింది. మరింత రెచ్చిపోతూ రాష్ట్రాన్ని అధ్వాన్న స్థితిలోకి నెట్టేశారు. పోలీసులు కూడా అధికారంలో ఉన్న పార్టీలతో ఒకలా.. ప్రతిపక్షాలతో ఇంకోలా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో భూముల రీసర్వే చేపడితే టీడీపీ, జనసేన ఎల్లో మీడియాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనర్థం వీరు గత ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేసినట్లే కదా? జగన్ సీఎంగా తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు వడివడిగా అడుగులేస్తున్న ఈ పరిస్థితుల్లో తాజాగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకో ఆందోళనకరమైన ప్రకటన చేశారు. పాఠశాలల మౌలిక వసతులకు అవసరమైన రూ.2820 కోట్లను ఎన్నారైలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీల నుంచి సేకరించాలని సంబంధిత శాఖ మంత్రి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. లీడ్ యాప్లో డోనార్స్ స్పాన్సర్షిప్ అనే ఆప్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఓకే అనుకుందాం. ఒకవేళ ఇంత మొత్తం విరాళాలుగా రాకపోతే? మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యావ్యవస్థను మరింత నీరుగారుస్తారా? ఆరోగ్య శాఖ సమీక్షలో రూ.20 వేల వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో 33 శాతం తగ్గించినా డబ్బు భారీగా ఆదా అవుతుందని చంద్రబాబు అన్నారట. సంజీవని కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని అంటున్నారు. ఆ మధ్య ఈ ప్రోగ్రాం గురించి చెబుతూ మనిషి కనీస ఆయుష్షు 120 ఏళ్లు అని అన్నట్లు వచ్చిన వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడేమో నిధులలో కోత పెట్టాలంటున్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2500 కోట్ల గురించి, నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె గురించి ఎందుకు మాట్లాడ లేదని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం అస్సలు దొరకదు. ప్రభుత్వానికి అందుతున్న దరఖాస్తుల్లో ఆరవైశాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవని చెప్పడం ద్వారా చంద్రబాబు గత ప్రభుత్వ సమర్థతను, ప్రస్తుత ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని బయటపెట్టుకున్నట్లు అయ్యింది. గతంలో రాష్ట్రమంతా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల పుణ్యమా అని ఎక్కడి సమస్యలక్కడే పరిష్కారమైపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సహజంగానే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుంది. రైతు సమస్యలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించే లక్ష్యంతో జగన్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసేసింది. ఫలితమే రైతుల ఇక్కట్లు! ఇన్ని అంశాలపై బహిరంగ చర్చ జరిపిన ఈ సదస్సులో శాంతి భద్రతల గురించి మాత్రం రహస్యంగా సమీక్షించారట. ఎందుకో మరి? పైకి ఒకలా..లోపల ఇంకోలా వ్యవహరించే తన వైఖరి బయటపడిపోతుందనా? సీఎం గారు నేరాలు 33 శాతం తగ్గాయని ఈ సమావేశాల్లో చెప్పారట. టీడీపీ, జనసేన నేతల అరాచకాలను అరికట్టేందుకు ఏం చేయాలన్నదానిపై కూడా అధికారులకు సలహా ఇచ్చారా? అలా చేయకుండా కేవలం రెడ్ బుక్కే ప్రాముఖ్యత ఇస్తూంటే శాంతిభద్రతల అదుపు ఎలా సాధ్యం? కలెక్టర్లు, జిల్లా ఎస్పీల ఈ సమావేశం జరుగుతున్న తీరుపై ఎల్లో మీడియా రాసిన ఒక వార్త మాత్రం ఆసక్తికరమైంది. ‘‘సారు మారారు..’’ అంటూ ఇచ్చిన ఒక కథనంలో చంద్రబాబు టైమ్ కీపర్ అవతారమెత్తారని చంద్రబాబును కొనియాడారు. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు పది లక్ష్యాలు పెట్టినట్లు ఎల్లో మీడియా రాసింది. ఇవి ప్రజలకు ఏ మేరకు ఉపయోగమో తెలియదు. జీఎస్పీడీపీలో 15 శాతం వృద్ది రేటు సాధించాలని నిర్దేశించారు కానీ... అది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుందన్నది మరిచినట్లు ఉన్నారు. ఎక్కువమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలని వర్క్ ఫ్రం హోం విధానాలు రావాలని బాబు గారు నిర్దేశించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో వర్క్ ఫ్రం హోం నిమిత్తం చంద్రబాబు ఆయా పట్టణాలకు వెళ్లి ఏమి చెప్పారో గుర్తు చేసుకోవాలి కదా! అదేమి చేయకుండా కలెక్టర్లను దానికి బాధ్యులను చేస్తే ఏమి ప్రయోజనం? ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ పానెళ్లు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని సీఎం సలహా ఇచ్చారు. సీఎం ఇతర మంత్రులు కూడా వీటిని వాడుతున్నారో లేదో తెలియదు. సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వాలట.అందులో పోలీసు వ్యవస్థ భాగస్వామి కావాలట. కొత్త, కొత్త పదాలు వాడడంలో మాత్రం చంద్రబాబు దిట్ట అని చెప్పాల్సిందే. ఈ సర్కులర్ ఎకానమీ ఏమిటో, అందులో పోలీసుల పాత్ర ఏమిటో జనానికి అర్థం కాదు. రోడ్లు, హైవేలు, పోర్టుల, రైల్వేలు, విమానాశ్రయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని అవన్ని వేగంగా జరిగేలా కలెక్టర్లు చూడాలట. నిధులు ఇస్తే ఆటోమాటిక్ గా సాగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. అమరావతిలో తప్ప మిగిలిన చోట్లకు ఏ మేరకు నిధులు కేటాయించారో చెప్పి ఉంటే బాగుండేది. సంక్షేమ పథకాలు నిరాటంకంగా క్షేత్రస్థాయికి వెళ్లాలట. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టో దగ్గర పెట్టుకుని వెల్ప్ ర్ పై తగు ఆదేశాలు ఇస్తే ఏమైనా చేస్తారు కాని రొటీన్ గా మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? వేగంగా అనుమతులు ఇవ్వాలని, శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని చెప్పడం బాగానే ఉంది. కాకపోతే ప్రభుత్వంలోని వారే వాటిని చెడగొడుతున్న సంగతిని విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి . అధికారులంతా ఫిట్ నెస్ తో ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మెడికల్ కాలేజీల విషయంలో పాపం మూట కట్టుకుంటున్న బాబు సర్కార్
సాక్షి, వెలగపూడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు.. రాజకీయంగానూ వైఎస్సార్సీపీ తమ ఆందోళనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో.. చట్ట సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్కు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలతో మండలిపై శాసనమండలికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘‘ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్ పోడియం చుట్టూ చేరి వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు.మండలి బయట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పాపం మూట కట్టుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఆపాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నా చంద్రబాబుకు చెవికి ఎక్కటం లేదు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దీనిపై తిరుగుబాటు చేయబోతున్నారు. వైద్యం అందుబాటులో లేక జనం ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా?. 17 కాలేజీలను ప్రభుత్వ పరంలోనే నడపాలి అని డిమాండ్ చేశారు.అంతకు ముందు.. సోమవారం ఉదయం శాసనమండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ‘‘కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం’’ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు. -
‘అలీబాబా అర డజను దొంగల్లో నువ్వూ ఒకడివి’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఫైర్ అయ్యింది. తిరుమల పరకామణిని సైతం తన రాజకీయాలకు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్కు ఒక అలవాటుగా మారింది. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.‘‘దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ను పట్టుకున్నది 2023, ఏప్రిల్లో. అంటే వైఎస్సార్సీపీ హయాంలో. లోకేష్ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివి.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో, రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇదంతా చట్టప్రకారం, కోర్టులు నిర్దేశించిన న్యాయసూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగింది...లోకేష్.. నువ్వైతే పంచాయతీలు చేసి, ఈ ఆస్తులను కొట్టేసి, దొంగ పెట్టుబడుల రూపంలో ఏ దుబాయ్కో తరలించేవాడివి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఓ స్లోగన్ నడుస్తోంది.. క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్.. అని. ఈ ప్రభుత్వంలోని అలీబాబా అరడజను దొంగల్లో నువ్వు ఒకడివి’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.#LooterLokeshరాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్కు ఒక అలవాటుగా మారింది. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ… https://t.co/p6pkWARVqW— YSR Congress Party (@YSRCParty) September 20, 2025 -
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు అంటూ చురకలు అంటించారు.‘‘పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. తన పచ్చి అబద్దాల కోసం చనిపోయిన వాజపేయిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు శిలా ఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్సార్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్సార్. కానీ తానే చేసినట్టు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లటం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు. చంద్రబాబు అసమర్థ నిర్ణయాల వలనే పోలవరం ఆలస్యం అవుతోంది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే కట్టాల్సి ఉంది. కానీ కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరాన్ని తీసుకున్నారు. పోలవరాన్ని పేటిఎంలాగా వాడుకుంటున్నారని ప్రధాని మోదీనే చెప్పారు’’ అని అంబటి గుర్తు చేశారు.‘‘స్పిల్ వే నిర్మాణం చేసి నదిని డైవర్ట్ చేసిన ఘనత జగన్ది. 41.15 మీటర్లకే నీటిని నిలిపేందుకు చంద్రబాబు అంగీకరించారు. దీని వలన ఉత్తరాంధ్రకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. పోలవరం నిర్మాణంలో తప్పులు జరిగాయని సాక్షాత్తు అంతర్జాతీయ నిపుణుల కమిటీనే తేల్చి చెప్పింది. డయాఫ్రం వాల్ నిర్మాణం కూడా చంద్రబాబు హయాంలోనే డ్యామేజీ అయిందని కమిటీ చెప్పింది. మా హయాంలో వచ్చిన వరదల సమయంలో అద్భుతంగా పని చేశామని అదే నిపుణుల కమిటీ మా ప్రభుత్వాన్ని మెచ్చుకుంది. పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిన ఘనత వైఎస్సార్ది. ఆయన కృషిని జగన్ కొనసాగిస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు..కరోనా సమయంలో సైతం పోలవరాన్ని వేగంగా నిర్మాణం చేయించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. అది ఆయన కలలు కన్న ప్రాజెక్టు కాదు. అసెంబ్లీలో మాత్రమే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారు. కనీసం కేబినెట్ మీటింగ్లకు కూడా హాజరు కావటం లేదు. దీని వెనుక మర్మం ఏంటో పవన్కే తెలియాలి. డిప్యూటీ సీఎం సినిమాలో నటిస్తే టికెట్ ధర వెయ్యి చేస్తారా?. అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా?. ఈ దోపిడీ కరెక్టు కాదు. జనాన్ని పీక్కుతింటామంటే కుదరదు. ఎక్కువ మంది జనం చూస్తే డబ్బులు రావాలని కోరుకోవాలే గానీ ఇలా దోపిడీ చేయడం కరెక్టు కాదు. పరకామణిని వైఎస్సార్సీపీ వారు దోచుకున్నారంటూ లోకేష్ ట్వీట్ చేయటం అవివేకం. ప్రతిదానిలోనూ మేము ఉంటామని చెప్పటం లోకేష్కు అలవాటే. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా మూడేళ్లు కొనసాగిస్తారు. ఆ తర్వాత సంగతేంటో కూడా లోకేష్ గుర్తిస్తే మంచిది’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేస్తాం: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీపై పడి పచ్చమూక దోచుకుని తింటుందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ‘‘పేద విద్యార్థి వైద్య విద్యను అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చింది. అలాంటి మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ అంగట్లో పెట్టి అమ్ముతుందని సతీష్రెడ్డి దుయ్యబట్టారు. రైతులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అన్నారు. కనీసం ఇలాంటి ఒక హామీ ఇచ్చామన్న విషయం కూడా కూటమికి గుర్తు లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థలు నడపలేని పరిస్థితి. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్పై విష ప్రచారం చేయడమే కూటమి ఏజెండాగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ బంధువు అనిల్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడంటూ కూటమి ప్రభుత్వం లీకులు ఇస్తుంది. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి తీసుకున్న నోట్లపై పెద్ద డ్రామా చేశారు. ఏపీలో యూరియా కొరత తీవ్ర స్థాయిలో ఉంది. కూటమి ప్రభుత్వం పలుకుబడి అంతా వైఎస్సార్సీపీ నేతల పై కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు.’’ అంటూ సతీష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ భారతికి రెండు కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు.. దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా?.. నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారు.’’ అని సతీష్రెడ్డి పేర్కొన్నారు. ‘‘మద్యం ఏరులైపారుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం రేట్లు పెంచారు. నాడు-నేడు పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హాయాంలో ఏర్పాటు చేసినవే.. చంద్రబాబు నీ అబద్దాలు ఆపు’’ అంటూ ఎస్వీ సతీష్రెడ్డి నిప్పులు చెరిగారు. -
రైతుల కన్నా ఓజీ మీదే శ్రద్ధ ఎక్కువైంది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. కూటమి ప్రభుత్వం వాళ్ల సమస్యలను గాలికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా పవన్ సినిమా టికెట్ రేట్లను పెంచడంలోనే బిజీగా ఉందంటూ మండిపడ్డారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎరువులు, యూరియా అందకుండా రైతులు నష్టపోతున్నారు. అయినా వాళ్ల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎ్ససార్సీపీ పోరాటం చేస్తుంది. పవన్ ఓజీ సినిమా టికెట్ పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై పెడితే బాగుండు. .. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాగైనా అడ్డుకుని తీరతాం. ఎంతటి పోరాంట చేయడానికైనా సిద్ధం అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: పవన్ ఓజీ.. జగనే కరెక్ట్! -
మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘చంద్రబాబూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం...మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో పాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు..@ncbn గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు… pic.twitter.com/EkqzMcG9cW— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2025 -
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదువైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారుప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలివైఎస్సార్సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు. -
అప్పు చేసి అమరావతికి పప్పన్నమా?
ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టూ ఒక రోడ్డు వేసేందుకు పాతిక వేల కోట్లు ఖర్చు అవుతుందట. ఇంత మొత్తం పెట్టేందుకు కేంద్రం, రాష్ట్రం కూడా సిద్ధమేనట. ఈ భారీ ఖర్చుకు తోడు.. రాజధాని ప్రాంతాన్ని వరదనీరు ముంచేయకుండా ఉండేందుకు రెండు ఎత్తిపోతల పథకాలు. వీటి కోసం రూ.ఆరు వేల కోట్ల ఖర్చు! ఇంతింత ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద సామాన్యులకు చౌకగా వైద్యం అందించేందుకు పనికొచ్చే వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం పైసా లేకపోవడం విచిత్రమే! డబ్బుల్లేకే వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది పాపం!అమరావతిలో 34 వేల ఎకరాల రైతుల భూమి, ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో తెగ చెప్పేవారు.. ఇప్పుడేమో ఆ భూమి మున్సిపాల్టీ స్థాయిది అంటున్నారు. అంతర్జాతీయ నగరం కావాలంటే ఇంకో 44 వేల ఎకరాలైనా కావాలంటున్నారు. ఈ రెండు విషయాలను వింటే ఏమనిపిస్తుంది? ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతోందన్న అనుమానం వస్తుంది.రియల్ ఎస్టేట్ వారి ప్రయోజనాల కోసం, ప్రైవేటు పెట్టుదారుల లాభాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను విస్మరించిందన్న విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా అణ, కాణీలకు ప్రైవేటు వారికి కట్టబెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రైవేటు సంస్థలు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ,ప్రభుత్వం నుంచి రాయితీలు పొందితే ఫర్వాలేదు. అలా కాకుండా ఉత్తిపుణ్యానికి ప్రభుత్వ ఆస్తులు పొందడమే కాకుండా, రాయితీలు కూడా అనుభవిస్తే ప్రజలలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతుంది.విశాఖపట్నంలో రిషికొండపై కేవలం రూ.450 కోట్ల వ్యయంతో గతంలో ఉన్నవాటి స్థానంలో ఏడు కొత్త భవనాలను నిర్మిస్తే వృథా ఖర్చు, పర్యావరణానికి విఘాతమని విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట తీసేసుకున్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ విస్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. స్వభావరీత్యా అక్కడి భూమి భారీ భవనాల నిర్మాణానికి అనువు కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ... చంద్రబాబు ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ముందుకు సాగుతోంది.పరిపాలన కేంద్రమైన రాజధాని కోసం అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని అప్పట్లోనే చాలామంది చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు సరికదా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసేది. పోనీ.. అప్పట్లో తీసుకున్న ముప్ఫైవేల పైచిలుకు భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసిన రైతులకు ఇస్తామన్న భూమి ఇచ్చారా? ఊహూ లేదు. అలా చేసి ఇప్పుడు అదనపు భూమి కోసం అడిగితే రైతుల నుంచి అభ్యంతరాలు పెద్దగా వచ్చేవి కావేమో. ఒకపక్క అప్పుడప్పుడూ భూములు బలవంతంగా తీసుకోమని చెబుతూనే ఇంకోపక్క దానికి భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి అలవాటైపోయింది.తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్, హోటల్ యాజమాన్యం బలవంతంగా తీసుకుందని ఇద్దరు చిన్నకారు రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవగా భూములిచ్చేయమని సలహాలు పారేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్డీయే కూడా భూములను బలవంతంగా లాక్కొనేందుకు సిద్ధమవుతోంది రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులకు కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై విష ప్రచారం ఆరంభిస్తారు. అమరావతి దేవతల రాజధాని అని, రాక్షసులు కొందరు దానిని చెడగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మొదలు అందరూ విమర్శించడం ఆరంభిస్తారు.రైతుల పాట్ల మాటేమిటి అని ఎవరూ ప్రశ్నించకూడదు. లక్షల కోట్లు వ్యయం చేసి ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మించడం ఎలా సాధ్యమని చాలామందిలో అనుమానం ఉన్నా ఎవరికి వారు ఏమోలే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త, కొత్త ప్రతిపాదనలలోకి వెళుతుండడంతో గతంలో భూములు ఇచ్చిన వారిలో సందేహాలు, భయం మొదలయ్యాయి. దానికితోడు ఇప్పుడు ఇది చిన్న మున్సిపాల్టీ అవుతుందని సీఎం స్వయంగా అనడం మరింత నిశ్చేష్టులను చేస్తోంది.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నట్లు ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేస్తుందా? లేక ఒక నగరం నిర్మిస్తుందా? ఏది ఆచరణాత్మకం? మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాము అమరావతికి వ్యతిరేకం కాదని, వచ్చేసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడనుంచే పాలన చేస్తారని స్పష్టం చేశారు. అయితే లక్షల కోట్ల వ్యయం ఒకే చోట చేయడం కన్నా, అవసరమైన రాజధాని భవనాలు నిర్మించి, ఆ తర్వాత అభివృద్ది ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని అన్నారు. సజ్జల ప్రకటనను కూడా వక్రికరిస్తూ ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసింది. అది వేరే విషయం. సజ్జలకాని, బుగ్గన కాని చెప్పినట్లు ఒకే చోట లక్షల కోట్లు వ్యయం చేస్తే మిగిలిన రాష్ట్ర ప్రజల మాటేమిటి?ఆ ప్రాంతంలో అభివృద్ది సంగేతేమిటి? విశాఖలోని ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతూ అమరావతిలో మాత్రం కోట్ల రూపాయల ధరలు చెబితే పరిశ్రమలు ఎలా ఇక్కడకు వస్తాయి? అన్నది కూడా చర్చ అవుతుంది. అనంతపురంలో జరిగిన సభలో అమరావతి రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందుకోసం అప్పులు కూడా తీసుకు వస్తున్నామని ధైర్యంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆరువేల కోట్లు ప్రభుత్వం వద్ద లేకపోతే, అమరావతి రాజధానికి మాత్రం ఇన్నివేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి.రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం ఏపాటి తెలివైన పని. సభలు,ఉచిత ఉపన్యాసాలు ఇతర ప్రాంతాలకి, లక్షల కోట్ల ఖర్చు మాత్రం అమరావతికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రాంతీయ అసమానతలు ఏర్పడవా? ఆ తరహా చర్చ జరగడం ఏపీకి మంచిదా? పోనీ ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతోందా అంటే అదీ కనిపించడం లేదు. వారు ప్రభుత్వానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటివాటికి ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు.కేవలం బెదిరింపులు, పోలీసుల ద్వారా భయపెట్టి వేల ఎకరాలను సమీకరించుకోవాలనుకోవడం విపరిణామాలకు దారి తీయవచ్చు.వీటన్నిటిని గమనించి సమతుల్యతతో కూడిన సమిశ్ర అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఏపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ పేషీపై బోండా ఉమా సంచలన ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్గా కాసేపు ఎపిసోడ్ నడిచింది. పవన్ పేషీపై బోండా సంచలన ఆరోపణలకు దిగగా.. వాటిని పవన్ తోసిపుచ్చారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే 30, 40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూశామని కృష్ణయ్య అంటున్నారు. కానీ, ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తు పెట్టుకోవాలి. కృష్ణయ్య దగ్గరకు వెళ్తే.. పవన్ కల్యాణ్కు చెప్పాలి.. కానీ ఆయన కలవడం లేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్లను సరిదిద్దాలి అని అన్నారు. అయితే.. ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. ‘‘నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది. కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు. పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవు. అందరం కలిసి కలెక్టివ్గా చేయాల్సిన బాధ్యతలు ఇవి అని పవన్ వివరణ ఇచ్చారు. ఆ సమయంలో అధికారుల గ్యాలరీలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్య ఉండడం గమనార్హం. -
YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్ కాలేజీ
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహించబోంది. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదువైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందని ప్రైవేట్కు అప్పగించాలని నిర్ణయించడం దారుణంప్రైవేటైజేషన్ విధానాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వ్యతిరేకించాయిప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్కు మంచి పేరు వస్తుందని తట్టుకోలేకపోతున్నారుకూటమి నేతలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా?చంద్రబాబు మంత్రులు నాతో వస్తే మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో చూపిస్తావిజనరీ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు 5వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా?చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడుఅనిత ఇంఛార్జ్గా ఉన్న విజయనగరం, పాడేరు, నర్సీపట్నం కాలేజీలు నాతో అనిత వస్తే చూపిస్తాను15నెలల్లో మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమంత్రి సవిత మెడికల్ కాలేజేల వద్ద కామెడి స్కిట్స్ చేస్తున్నారుబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రూ. 50 కోట్లు కూడా విడుదల చేయించుకోలేకపోయారు.చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేస్తుంది.- వరదు కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లారాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కామెంట్స్పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్లచంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం -మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు ప్రకాశంచంద్రబాబుకి పేదలంటే అసహ్యంఅందుకే వైద్యం విద్య దూరం చేస్తున్నాడుమార్కాపురం కాలేజీ పూర్తి కాలేదు అంటున్న. కూటమి నాయకులు కళ్లు తెరుచుకొని చూడాలిఅమరావతి మీద ఉన్న శ్రద్ద మెడికల్ కాలేజీల మీదలేదుఅమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుందిమెడికల్ కాలేజీ అందరికీ ఉపయోగపడుతుంది - మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్కూటమి నేతలు కళ్లున్న కబోదిల్లా వ్యవహరిస్తున్నారుమార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా కాలేదో తెలుస్తుందిపదహారు సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం నేతలకు వెనకబడిన ప్రాంతం కనపడలేదుపేదవాళ్ల ఉసురు చంద్రబాబుకి తప్పదుకూటమి నేతలు కృరమృగాలులా ప్రవర్తిస్తున్నారు..ఎవడబ్బ సొత్తు అని ప్రయివేటు పరం చేస్తావ్ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడువందల కోట్లు ఖర్చుపెట్టలేని మీరు మీ విలాసాలకు మూడు హెలికాప్టర్స్ కావాలా?దోచుకోవడమే పనిగా పెట్టుకొని అన్నీ ప్రయివేటు పరం చేస్తున్నాడుఇంజన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతూ మట్టి నుండి ఆకాశం వరకూ దోచుకుంటున్నారు-యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ నంద్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు నిరసనగా ఛలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు30 పోలిస్ యాక్ట్ అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుప్రైవేటీకరణ దారుణమంటూ ఆందోళనకు వచ్చిన వారిని బలవంతంగా పోలీసుల జీపుల్లో , లారీల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలింపుమెడికల్ కళాశాలలే కట్టలేదు అని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయంఅరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ హెచ్చరించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంవైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్,సర్పంచ్ సుజిత్తో పాటు, మహిళలను, విద్యార్థులను,వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులుమడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపార్వతీపురం మన్యం జిల్లా:రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్ల:చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం-మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నమయ్యమదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేతీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీకి పిలుపు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి , మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి, షమీం అష్లాంఏలూరు జిల్లాకూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ..వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజ్ నిరసనకు పిలుపుఏలూరులో వైఎస్సార్సీపీ నేతల నిరసనను అడ్డుకున్న పోలీసులుజిల్లా పార్టీ కార్యాలయం నుండి మెడికల్ కాలేజీకి వెళ్తుండగా నిలిపివేసిన పోలీసులురోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులునిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులుశ్రీ సత్యసాయి జిల్లా:పెనుకొండ మెడికల్ కాలేజీ ని పరిశీలించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జక్కంపూడి రాజా, హిందూపురం సమన్వయకర్త దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీంవైఎస్సార్ జిల్లా:పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగపు నాయకులుఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని,పీపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్పేదలకు వైద్య విద్యా, వైద్యాన్ని దూరం చేసేందుకు పీపీపీ పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుందిడౌన్ డౌన్ సీఎం వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసననల్గొండ జిల్లామిర్యాలగూడ వద్ద గురజాల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులుగుంటూరులో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లా...ఆదోని మెడికల్ కాలేజ్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజ్ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన సంఘం నాయకులుమెడికల్ కాలేజ్ ప్రవేటికరణకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తు విద్యార్థులు,వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్ది సంఘాలుప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్దులుఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ బుట్టారేణుకా , మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,రాష్ట్ర నాయకురాలు ఎస్వీ విజయమనోహరి,విద్యార్ది ,యువజన నాయకులు విశాఖ :జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద aisf ధర్నా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్..విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి..ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం..మంత్రి లోకేష్ విద్యా రంగంలోని సమస్యలను గాలికి వదిలేసారు..యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..లోకేష్కి చేతనైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో నడపాలి..లేనిపక్షంలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యాలి.. అనకాపల్లి నర్సీపట్నంనర్సీపట్నం ఛలో మెడికల్ కాలేజీపై పోలీసుల ఆంక్షలునర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించకుండా భారీ కేడ్లు ఏర్పాటుమెడికల్ కాలేజీకి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న వైనంఛలో మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటున్న పోలీసులు..పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..మచిలీపట్నంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలుఛలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు,శ్రేణులపై ఆంక్షలుమచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్ , మొండితోక జగన్మోహన్ రావు , దేవభక్తుని చక్రవర్తి , వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలను అడ్డుకున్న పోలీసులుతమ వాహనాలను అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలుతూర్పుగోదావరి జిల్లా...ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ భరత్, వైఎస్ఆర్సీపీ శ్రేణులుమార్గాన్ని భరత్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుతూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంమాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ,జక్కంపూడి గణేష్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గూడూరు శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద బైఠాయించిన నేతలు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే మెడికల్ కాలేజీ సీటు కోటి రూపాయల పైన పలుకుతోందిఒక డాక్టర్ బయటకు రావాలంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు అవుతోందిఇంత ఖర్చుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదవగలరా?అందుకే జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారుఅలాంటి కాలేజీలను ప్రైవేటీకరణతో చంద్రబాబు పేదల ఆశలను నీరు గార్చారుమెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబుమెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరంచేసే వరకు ఆందోళనలు చేస్తాం - శివరామిరెడ్డి, ఎమ్మెల్సీపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారు వైఎస్సార్ కుటుంబం పేదల కోసం పాటు పడిందివైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పేరుతో ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారువైఎస్ జగన్ మెడికల్ కాలేజీలతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారుఅలాంటి వాటిని ప్రైవేటీకరణ సరికాదుపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారుపేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటం సబబు కాదుపీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తాం -బొమ్ము ఇజ్రాయిల్, ఎమ్మెల్సీచంద్రబాబు పేదల మీద కక్ష కట్టారుఅందుకే మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్నారుదీన్ని మేము వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం- సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను యధావిధిగా కొనసాగించాలి.మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదుచంద్రబాబు ఆలోచన స్వార్ధ పూరితమైనది.చంద్రబాబు ప్రభుత్వం వారి బినామీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తోంది.తమ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం సరికాదు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకువస్తాం -విక్రాంత్, ఎమ్మెల్సీ విడుదల రజినిని అడ్డుకున్న పోలీసులుచిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజిని ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపుచలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన మాజీ మంత్రి విడదల రజినిఅడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఏపీలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం లో విద్యార్థి ,యువజన విభాగాల కార్యకర్తలుపిడుగురాళ్ల, బాపట్ల మెడికల్ కాలేజీలకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి యువజన విభాగాల కార్యకర్తలుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వెళ్ళకూడదు అంటూ అంబటి రాంబాబుకు నోటీసులుపల్నాడులో మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంబూరు శంకర్రావు ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపుపిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంపౌండ్లోకి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని వెళ్లనివ్వకుండా బారికేడ్లు ఏర్పాటుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాందోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారుఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాంగతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదుప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరంఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాంకళ్ళుండి చూడలేకపోతున్న కూటమి ప్రభుత్వంఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..మేం ఎంత ఖర్చు చేశామో వాళ్ళే చెప్తున్నారుపీపీ అంటే దోపిడీ నా.. పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు..చేతకాకపోతే ఏదీ కాదు..ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి..- శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చరిత్ర హీనుడిగా చంద్రబాబు..చంద్రబాబు నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పుపేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రలుమూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా?జగన్ చరిత్ర సృష్టిస్తే.. బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు:::ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేదవాడిపై బాబు సర్కార్ కక్ష కట్టిందిపేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంపై ఆంక్షలు విధించారుబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చాడా?::: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అల్లూరి జిల్లా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు చలో మెడికల్ కాలేజీ కు వైయస్సార్సీపి పిలుపు.పాడేరు మెడికల్ కాలేజీను కాసేపట్లో సందర్శించనున్న వైయస్సార్సీపీ నేతలు..పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీకి వైఎస్సార్సీపీ నాయకులు.500 కోట్లతో 35 ఎకరాల్లో వైయస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభం.ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీ తరగతులు..చంద్రబాబు నిర్లక్ష్యం వలన 150 ఎంబీబీఎస్ సీట్లు, 50 సీట్లకు కుదింపువైయస్ జగన్ పాలనలో 70 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణంకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులుతూర్పుగోదావరి జిల్లా..వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద పోలీస్ కాపలానేతలను హౌస్ చేసిన పోలీసులు.. నోటీసులు అందజేతమాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపుఅమరావతిమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వాయిదా తీర్మానంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని తీర్మానంమరోవైపు.. వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీ నిర్వహణఅనంతపురం జిల్లా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన జ్వాలలునేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీశ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద కార్యక్రమంపెద్దసంఖ్యలో తరలివస్తున్న విద్యార్థులు, యువకులుచంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలుహాజరుకానున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిప్రకాశం జిల్లా ..మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడం పై నిరసన తెలుపునున్నా వైయస్సార్సీపీ నాయకులుఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన మార్కాపురం పోలీసులుచీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్యతూర్పుగోదావరి జిల్లా.ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీకర్నూలు జిల్లా ..ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు,మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్ని మెడికల్ కాలేజ్ ల వద్ద శాంతియుత నిరసనకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు,శాంతియుత నిరసన తెలపడానికి నంద్యాల మెడికల్ కాలేజ్ కి వెళ్తున్న రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే మీరు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి,సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు,సిద్దార్థ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమంహాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలుగత వైఎస్సార్సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టబోతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది కూడా.తాడేపల్లి.ఈనెల 19న వైయస్సార్సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమంతాడేపల్లి:తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’… pic.twitter.com/kE5cjf0dqE— YSR Congress Party (@YSRCParty) September 18, 2025 -
అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని తెలిపారు. అసలు రాష్ట్రంలోప్రభుత్వం ఉందా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు.శాసనసభలో తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే, వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి, కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ఆయన ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటేరియల్ సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం:రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల ముందు.. 2024 జనవరి–మార్చి మొదలు ఈ ఏడాది సెప్టెంబరు వరకు చూస్తే.. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4900 కోట్లు బకాయి. అయితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా దాదాపు లా రూ.4 వేల కోట్లు బకాయి. వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు. ఈ ఏడాది మరో దఫా పెండింగ్. అలా మొత్తం రూ.4200 కోట్లు బకాయి.వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు పని చేయకపోవడం కూడా ఆగిపోయింది. ఇంకా పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు. ఇక వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో పథకంలో వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఇంకా ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్ల బకాయి పడ్డారు.ఇవీ మెడికల్ కాలేజీల ప్రయోజనాలు:మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ అనేది కేవలం కాలేజీ మాత్రమే కాదు. దాంతో టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. మంచి వైద్య సేవలందుతాయి. అది ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు నడపకపోతే.. ఆయా రంగాల్లో ప్రై వేటు దోపిడిని అరికట్టగలుగుతారా? అందుకే ఎక్కడైనా, వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహిస్తుంది.మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. ఒక మెడికల్ కాలేజీ ఉంటే, సీనియర్ వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు అందరూ అందుబాటులోకి వస్తారు. వైద్య సేవలందిస్తారు. అలా ప్రజలకు మంచి వైద్యం అందడమే కాకుండా, మన పిల్లలకు.. ముఖ్యంగా నిరుపేద పిల్లలకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.వ్యవసాయ రంగం పరిస్థితి దారుణం:రైతులకు యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్ మార్కెట్ను నడిపిస్తున్నారు. ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఏ పంటకు ఎంత ధర ఇవ్వాలన్న దానిపై నాడు మనం ప్రతి గ్రామంలోనూ పోస్టర్ ఇచ్చే వాళ్లం. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు తోడుగా నిలబడే వాళ్లం. మార్కెట్ జోక్యంతో మంచి ధరలకు పంటలు కొన్నాం. అందుకు రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. వ్యవసాయం చేయడానికి రైతులు భయపడుతున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తిగా తిరోగమనమే.ఎక్కడికక్కడ దోపిడి. నీకింత.. నాకింత:శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అక్రమంగా పర్మిట్ రూమ్లు నడుపుతున్నారు. ఉచిత ఇసుక అన్నారు. అది లేదు. ఇంకా క్వార్ట్›్జ, సిలికా.. దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్ కూడా అమ్మేసుకుంటున్నారు.అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్హిట్!:అన్నింటా దారుణంగా విఫలమైనా, ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోయినా, ఇటీవల సూపర్సిక్స్.. సూపర్హిట్ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్, ఎన్నికల నాటి యాడ్తో చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ రూ.4 వేలు లేవు. పథకాలు కూడా మారిపోయాయి. ఇదీ ఈ ప్రభుత్వ నిర్వాకం.ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు:అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ నుంచి వారంలోనే 5గురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే, నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆమేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పేది విన్నాం. కానీ, ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం లేకుండా ఉండాలని కోరుతోంది. అందుకే మనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దని అనుకుంటోంది. అందుకే మనల్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇటీవల ప్రెస్మీట్లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే, ఏం మాట్లాడగలం?ఉన్నదే ఏకైక విపక్షం.. అయినా..!:నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒకేఒక విపక్షం. అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమి. ఇక్కడ మనది ఒకేఒక విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.గట్టిగా నిలబడండి. నిలదీయండి:కానీ, మనకు కౌన్సిల్లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని నిలదీయండి.వీటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీయండి:సూపర్ సిక్స్. సూపర్ సెవెన్ వైఫల్యం..రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు..పెన్షన్ కోతలు..ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన బకాయిలు..యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు..పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం..రైతుల ఆత్మహత్యలు..కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..వైఎస్సార్సీపీ ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం..ఆరోగ్య శ్రీ బంద్..విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..ప్రభుత్వంలో అవినీతి దోపిడీ..ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్ లీవ్స్ తదితర బకాయిలు, వారిపై వేధింపులు..పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..అమరావతిలో తొలివిడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్ పూలింగ్..అసైన్డ్ అన్న పదయం తీసేయడం. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు..రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం..15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడు..రాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండి:రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?. వీళ్లే బెల్టు షాప్లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లోకి వేసుకుంటున్నారు. లాటరైట్, క్వార్ట్›్జ తవ్వుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. ప్రభుత్వానికి పైసా ఆదాయం రావడం లేదు. మండలిలో మనకు మంచి బలం ఉంది. కాబట్టి మండలి సభ్యులు పోరాట పటిమ చూపాలి. ప్రజలకోసం గట్టిగా పోరాటం చేయాలి.అధికార పక్షం.. డబుల్ యాక్షన్:అసెంబ్లీలో అధికారపక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇంకా.. ‘ప్రజల్ని ఏడిపించేది ప్రభుత్వమే. వారిని ఏడిపించి, మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫను తామే ఏడుస్తామంటూ ప్రభుత్వం డబుల్ రోల్ ప్లే చేస్తానంటోంది. అలా రెండు వైపులా యాక్షన్ చేస్తోంది’. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించిన మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మేము ప్రజా సమస్యలు లేవనెత్తితేనే, అందులో నిజాయితీ ఉంటుంది.నాడు చంద్రబాబు డ్రామాలు:నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్ సెషన్లో గవర్నర్ అడ్రస్ సమయంలో అటెండ్ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాంమెడికల్ కాలేజీలు కాపాడుకోవాలి:మెడికల్ కాలేజీలు అన్నవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా రూ.57 లక్షలకు పెంచేస్తున్నాడు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నాడు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రజలకు అత్యంత నష్టం కలిగిస్తున్న ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్నిరకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తే సహించేది లేదు -
మండలిలో డొంకతిరుగుడు సమాధానాలు.. వైఎస్సార్సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్సార్సీపీ సంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది. చివరకు తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్య సమాధానాలిచ్చారు. దీంతో.. నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ఏమీ పట్టవా?. మాకు కావాల్సింది రాజకీయ లబ్ధి కాదు.. ప్రజలకు మంచి జరగడం అని అన్నారాయన. ‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు. ప్రజలకు మంచి జరిగేందుకు పోరాటం చేయడం మా బాధ్యత. కల్తీ మద్యం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మద్యం ఏరులైపారుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం లేదు. తిరుపతి,సింహాచలం ఘటనలు ప్రభుత్వనిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే డొంకతిరుగుడు సమాధానం ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడాన్ని విమర్శిస్తున్నారు. .. మేం ఎంతో హుందాగా ప్రశ్నలు అడిగాం. కానీ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తిరుపతి,సింహాచలం ఘటనలతో ప్రభుత్వం ,మంత్రికి సంబంధం లేదా?. ఈ ప్రభుత్వానికి.. ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదు. ఎంత సేపూ కుర్చీ కోసమే ఆరాటం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే అంశాలనే మేం తీసుకుంటున్నాం. మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని రెండు రోజుల నుంచి పదిరోజులకు మార్చామని విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు. అంతకు ముందు మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ..తిరుపతిలో జరిగింది ఘోరమైన ఘటనేనని, ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. టీటీడీ పాలకమడలి భక్తులకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదని.. బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని వరుదు కళ్యాణి నిలదీశారు. భక్తుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? అని ప్రశ్నించారామె. ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారామె. -
ఏం మంత్రులయ్యా మీరు?: స్పీకర్ అయ్యన్న చురకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మళ్లీ కోపమొచ్చింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో ఆయన మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం మంత్రులయ్యా మీరు అన్నరీతిలో చురకలంటించారాయన.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే.. మంత్రుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. జీరో అవర్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తున్న సమయంలో.. మంత్రులు ఏం పట్టనట్లు చూస్తూ ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యేల ప్రశ్నలను నమోదు చెయ్యని మంత్రులు, అధికారులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క మంత్రి కూడా నోట్ చేసుకోరా?. గతంలో ఉన్న సంప్రదాయం ఇప్పుడెందుకు లేదు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. జీరో అవర్ లో మాట్లాడిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలా అసహనం.. ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్తేం కాదు. గతంలో కూటమి ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అసెంబ్లీకి తోలుకుని రావడంపై, అలాగే మంత్రులు ఆలస్యంగా రావడం.. క్వశ్చన్ అవర్ను సీరియస్గా తీసుకోకపోవడంపైనా ఆయన మందలింపు వ్యాఖ్యలు చేశారు. -
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు అని అన్నారాయన. -
మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది. తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్ చేసింది.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ, ఎమ్మార్పీఎస్, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా. -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నేడు జరగనుంది. గురువారం మధ్యాహ్నా ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఏ ముఖం పెట్టుకుని ఈ సంబరాలు బాబూ: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవంతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలనను తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రకటనలతో కూటమి నాయకులు ప్రజల్ని ఇప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా ఇంకా రెట్టింపు ఇస్తామని 143 హామీలతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు తనని తిట్టుకుంటున్నారని తెలిసి కూడా ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్టు చంద్రబాబు 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో అనంతపురంలో హడావుడి చేశాడు.సూపర్ సిక్స్లో సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీఇచ్చాడు. ఈ పథకానికి రూ.10,800 కోట్లు అవసరం అనుకుంటే, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలిచ్చి చేతులు దులిపేసుకున్నాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 1.80 కోట్ల మంది మహిళలను వంచించాడు.ఆ లెక్కన ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి రూ.32,400 కోట్లు చొప్పున అవసరం అవుతాయి. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చెప్పి, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది మాత్రం అరకొరగా అమలు చేశాడు. ఆఖరుకి స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మొదలుపెట్టి కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేసి ఆంక్షలు విధించాడు. దీపం-2 పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గతేడాది ఒక్క సిలిండర్ ఇచ్చాడు.ఈ ఏడాది ఒక్క సిలిండర్ కూడా ఇచ్చింది లేదు. ఆ ఆరు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావాలంటే ఏడాదికి రూ.70 వేల కోట్లు కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి నేటికి 15 నెలలు గడిచిపోయాయి. వారిచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దాదాపు రూ. 90 వేల కోట్లు కావాలి. కానీ రూ. 12 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాల్లోనే ప్రదర్శించేవాళ్లం. ఆ విధంగానే ఆయా గ్రామాల్లో ఏ పథకానికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించే దమ్ము చంద్రబాబుకి ఉందా?50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ ఊసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా 15 నెలల్లో దాదాపు 5 లక్షల పింఛన్లు పీకేశాడు. ఇది కాకుండా మరో 7 నుంచి 10 లక్షల మంది పింఛన్లకు అర్హులై ఉండి దరఖాస్తు చేసుకున్నా వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీజుల కోసం కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు.ప్రభుత్వం దగ్గర రూ. 4500 కోట్లు లేవా?నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజి కూడా తీసుకురాలేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను మాత్రం కుట్ర పూరితంగా ప్రైవేటుపరం చేసి పేదలకు దూరం చేస్తున్నాడు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని వైఎస్ జగన్ కోరుకుంటే చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు తన వారికి ధారాదత్తం చేసేస్తున్నాడు. వైఎస్ జగన్ ప్రణాళిక ప్రకారం 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 2550 మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఏడాది కాలంగా ఆపేసి, సేఫ్ క్లోజ్ పేరుతో వాటిని మూసేశాడు.డాక్టర్లు కావాలనుకునే పేద విద్యార్థుల కలను చిదిమేశాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే 5 మెడికల్ కాలేజీలు నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రిలో పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి. రెండో విడతలో పాడేరులో 50 సీట్లతో క్లాసులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ మీద కోపంతో పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అసలు పనులే జరగలేదంటూ పిల్లర్ల దశలో ఉన్న భవనాల వద్దకు పోయి వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పక్కనపెట్టేశాడు. ఎందుకని అడిగితే వాటిని పూర్తి చేయాలంటే రూ. 4500 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని బీద అరుపులు అరుస్తున్నాడు. చంద్రబాబు చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ. 4500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారంటే ఈయన్ను విజనరీ అని ఎలా అనాలో అర్ధం కావడం లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రభుత్వ ఆస్తులను కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసే విధానాలను చూసి అసహ్యించుకుంటున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనతో చంద్రబాబు పాలననను పోల్చి చూస్తూ అసలైన విజనరీ జగనా, చంద్రబాబో ప్రజలు నిర్ణయానికొచ్చేశారు.రైతులను పట్టించుకోవడం మానేశారుకూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేశాడు. రైతులను చిన్నచూపు చూస్తున్నాడు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం ఇవ్వకుండా మోసం చేసిందే కాకుండా వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసేశాడు. గతంలో ఎప్పుడూ లేనిది రైతులు యూరియా బస్తా కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితులు తీసుకొచ్చాడు. యూరియా ఏదని అడిగిన రైతులకు రాజకీయాలు ఆపాదించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో కిలో ఉల్లి రూ.40ల ధర పలికితే నేడు రూ.3 లకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కిలో టమాట రూపాయిన్నరకి అమ్మాల్సి వస్తుంది. రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అరటి, పొగాకు, మిర్చి, మామిడి, చీనీ, వరి, శెనగ, వేరుశెనగ.. ఇలా రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వైఎస్ జగన్ ధరల పతనంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమీక్షల పేరుతో రెండురోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం తప్పించి రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యవసాయం అధోగతే అని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా చంద్రబాబు రైతు సమస్యలపై దృష్టిపెట్టాలి.వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారుప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక సందర్భం లేకపోయినా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్సార్సీపీని రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లిలా బురద రాజకీయాలు చేస్తారో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. షర్మిల, సునీతలను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ పూర్తి చేసి చార్జిషీట్ వేసిన తర్వాత కూడా పునర్విచారణ కావాలని కోరడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని టీడీపీ భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. వారికి ఆ ధైర్యం ఇచ్చింది చంద్రబాబు కాదా? అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సైతం అవినీతి సంపాదనకి డోర్లు తెరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలెక్షన్ కోసం ఏకంగా ఒక ఫ్లోర్నే కేటాయించారు. చంద్రబాబు ఇచ్చిన 143 హామీలన్నింటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్యారంటీ సంతకాలు చేశాడు. కానీ వాటి అమలు గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. స్పెషల్ హెలికాఫ్టర్లలో తిరిగే ఆయనకి ప్రజా సమస్యలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదు.చంద్రబాబుకి రాజ్యాంగం మీద గౌరవం లేదు..చంద్రబాబుకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు కాబట్టే 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. సమస్యల మీద చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు భయపడిపోతున్నారు. 11 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూసి 164 మంది భయపడిపోతున్నారు. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అనేక ప్రెస్మీట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. కానీ ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పే దమ్ము అధికార పార్టీకి లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడనిస్తారంటే ఎవరైనా నమ్మగలరా? -
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు‘‘అసలు మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు, జగన్లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్ డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు. -
వెంకయ్యా.. వెన్నుపోటు బాబును వెనుకేసుకు రావొద్దు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది. ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు లేదు. తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె. -
నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరో ఉద్దానంగా ఇబ్రహీంపట్నం.. మా పోరాటం ఆగదు: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు హయాంలో గాలి, నీరు.. మొత్తం కలుషితం అయిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మూలపాడు డంప్ నుంచి టీడీపీ నేతల బూడిద అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆందోళన చేపట్టిన ఆయన్ని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. భవానిపురం పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వస్తే ఏ సంస్థ అయిన ప్రవేట్ అవ్వాల్సిందే. బూడిద(ఫ్లై యాష్) టెండర్ ఒక వింగ్గా చేసి లోకేష్ కనుసన్నల్లో ప్రవేట్ చేసేశారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు నీరు, గాలి మొత్తం కలుషితం అయ్యింది. ప్రజలు, థర్మల్ ప్లాంట్లలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. వెరసి.. ఇబ్రహీంపట్నం మరో ఉద్దానం గా మారింది. అందుకే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఇబ్రహీంపట్నం నుంచి అక్రమంగా బూడిద నిలువ చేసి హైదరాబాద్కి తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరితే.. అధికారులు మమ్మల్నే అరెస్ట్ చేస్తున్నారు. కనీసం చంద్రబాబైనా స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొంటారా?. వీటీపీఎస్లో బూడిద టెండర్లు తక్షణమే రద్దు చేయాలి. కాలుష్యం భరితంగా మారిగా గ్రామాలను ఆదుకోవాలి. మొక్కలు నాటించి.. చెట్ల సంరక్షణ కొనసాగించాలి. అక్రమ డంప్ని ప్రభుత్వం చేసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అని జోగి రమేష్ అన్నారు. ఇదిలా ఉంటే.. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది. -
ఎల్లుండి వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఎల్లుండి (సెప్టెంబర్ 18, గురువారం) ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష) భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
లేని లిక్కర్ స్కాంలో సిట్ భేతాళ కథలు: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని.. ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్మీద ఉన్నారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీని అణచాలని చూడటం దుర్మార్గం. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు.. నవ్వుతున్నారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని అంబటి హితవు పలికారు.‘‘లేని లిక్కర్ స్కాంలో సిట్ ఇంకా భేతాళ కథలే అల్లుతోంది. వైఎస్ జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్టు చేయటమే లక్ష్యంగా సిట్ పని చేస్తోంది. ఒక దురుద్దేశంతో నడుపుతున్న కథే లిక్కర్ స్కాం. కట్టుకథల ఛార్జిషీట్ను కోర్టు కూడా వెనక్కు పంపినా సిట్కు బుద్ధి రాలేదు. జగన్ వెంట ఉంటున్నాడని చెవిరెడ్డి, ఆయన కుమారుడిని వేధిస్తున్నారు. చెవిరెడ్డి కుటుంబం విపరీతమైన దైవభక్తి ఉన్న కుటుంబం. ప్రభుత్వానికి టాక్స్లు కడుతూ వ్యాపారాలు చేసినా సిట్ తప్పుపడుతోంది..భూములు కొన్నా, అమ్మినా కూడా స్కాం అని ఎల్లోమీడియా రాస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలతోనే ఛార్జిషీట్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఉండటం లేదు. రూ.11 కోట్ల విషయంలో కోర్టుకు సిట్ దొరికిపోయారు. తప్పుడు కథలు చెప్తే కోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ నీళ్లు నమిలింది. ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పుడు ఇక మధ్యవర్తుల పాత్ర ఎలా ఉంటుంది?. అసలైన లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం..ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలపడతాం. ఎంత అణచివేయాలని చూస్తే అంతగా పైకి ఎదుగుతాం. సరైన ఆధారాలు చూపే శక్తి సిట్కు లేదు. అసలు స్కామే జరగనప్పుడు ఇక ఆధారాలు ఎలా ఉంటాయి?. ప్రజలను నమ్మించాలనుకుంటే అది జరగదు. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. పర్మినెంటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ని ఈ మూడేళ్లలో కట్టగలరా?. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతారా?. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అమ్మేస్తారా?. కులాల మధ్య చిచ్చు పెట్టటం జనసేనకే అలవాటు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తోంది?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. -
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా టీడీపీ నేతల బాగోతాన్ని ఎండగట్టారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సీఐడీతో విచారణ చేయించగలరా? అంటూ ప్రశ్నించారు‘‘2024 ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తుల విలువ రెండు కోట్లు. కొల్లు రవీంద్ర కోటి రూపాయలు చందా ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం కోటి చందా ఇచ్చే స్తోమత ఉందా మీకు. వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా?. వీకెండ్కు హైదరాబాద్, రెండు నెలలకోసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా?. దుబాయ్కి వెళ్లిన పాస్ పోర్టు, వీసా చూపించే దమ్ముందా?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘మచిలీపట్నంలో డిఫ్యాక్టో మంత్రి, ఎమ్మెల్యే.. టీడీపీ నేత గోపిచంద్. గొర్రిపాటి గోపీచంద్ తెర వెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నాడు. గొర్రిపాటి గోపీచంద్ బందర్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. బైపాస్లో దేవుడి ఆస్తి కాజేశానని నాపై విష ప్రచారం చేస్తున్నారు. 2006లో ఆక్షన్లో గోపీచంద్, అతని భార్య పాల్గొన్నారా? లేదా?. గోపీచంద్ భార్య రాజేశ్వరి పేరుతో చలానా కట్టారా.. లేదా?.’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025 -
చంద్రబాబు సర్కార్పై భగ్గుమన్న ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ
సాక్షి, అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్పై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ భగ్గుమంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి నిధుల నిలిపివేతపై నిరసనకారులు మండిపడ్డారు. భారీ ర్యాలీతో కలెక్టరేట్ను ముట్టడించారు. నిరసన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ఎందుకు కక్ష సాధింపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీటీ స్వచ్చంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిరసన కారుల ధ్వజమెత్తారు. -
ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్న ఎంపీ శబరి, సీఎం అడిషనల్ సెక్రటరీ!
సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ నేతలు ఇవాళ (సోమవారం) సందర్శించారు. మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 90 శాతం మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రూ.532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో కేవలం దాదాపు రూ.120 కోట్ల రూపాయలు పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని.. ఆ పనులు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలను సందర్శించి ఫేస్ 3,4 నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని ఆవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్వయంగా పరిశీలించి 50 సీట్లకు పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చిందని.. అధికారంలో ఉన్న చేతకాని ప్రభుత్వం మెడికల్ సీట్లను వెనక్కి పంపిందన్నారు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి నీచ పనులు చేసిందని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ భాష, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సుభాష్ వ్యాఖ్యలు.. ఖండించిన శెట్టిబలిజ నేతలు
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను శెట్టిబలిజ నేతలు ఖండించారు. మంత్రి సుభాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సూర్య ప్రకాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్, జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్నారు.పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారని విషయం మరిచిపోకూడదని సూర్యప్రకాష్ అన్నారు. శెట్టిబలిజ జాతికి సుభాష్ చేసిందేమీ లేదు. మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. వైస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కులాల మధ్య చిచ్చు పెట్టలేదని సూర్య ప్రకాష్ అన్నారు. -
చంద్రబాబుకు మోసం వెన్నతో పెట్టిన విద్య: కోన రఘుపతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుకి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు, మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి, ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సామాజిక బాధ్యతగా పేదవాడికి అందించాల్సిన విద్య, వైద్యాన్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పక్కదారి పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప వారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని.... మేం మాత్రం పెత్తనం చేయాలన్న ధోరణి చంద్రబాబుకు పుట్టుకతో వచ్చింది. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబుది కుక్కతోక వంకర బుద్ధి. ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం కళ్లార్పకుండా ప్రజలకు అబద్దపు హామీలివ్వడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయంప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది వైయస్.జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. మేధావులు, విజ్ఞులు కూడా దీనిపై ఆలోచన చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే... 2019-24 తర్వాత వైయస్.జగన్ హయాంలో నీతిఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్రతిపాదనను అందిపుచ్చుకుని ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వైయస్.జగన్ గారు తీసుకున్న నిర్ణయం మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే... ఏటా మనం ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.3వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం, దానితో పోల్చుకుంటే వీటి నిర్మాణం కష్టం కాదని చెప్పారు.మరోవైపు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను మనం చూశాం. రాష్ట్ర విభజన తర్వాత అత్యాధునిక వైద్యం అందించే ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చెన్నై, బెంగుళూరులో కూడా ఆరోగ్యశ్రీ కింది చికిత్స పొందే అవకాశం కల్పించాం. కానీ శాశ్వతంగా మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇదే మంచి సమయం అని ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయించారు.అయినా సొంత మీడియాలో తప్పడు రాతలు..ప్రతి ప్రభుత్వ బోధనాసుపత్రి పరిధిలో 500 పడకల ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అత్యుత్తమ వైద్య విద్యను, వైద్యాన్ని అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప పనిని ప్రశంసించకపోగా.. తమ చేతిలో మీడియా ఉందని తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు ప్రచారంతో విద్యావంతులను సైతం తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కొంత రుసుముతో పేమెంట్ కోటా తరహాలో చేసి ఆ వచ్చిన మొత్తాన్ని ఆయా కాలేజీల నిర్వహణ, అభివృద్దికి ఉపయోగించాలని ప్రతిపాదన చేస్తే... ఆ రోజు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ లు దానిపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు.తాము అధికారంలోకి వస్తే...ఆ విధానాన్ని రద్దు చేస్తాం.. పేదల సీట్లు అమ్ముకుంటారా అంటూ పెద్ద, పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కాలేజీలనే ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామనడం ఎంతవరకు సమంజసం. వాస్తవానికి ఇవాల ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ప్రవైటు ఆసుపత్రులన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నియంత్రణలో పనిచేయాలి. కానీ వాటిని మనం ఏ మేరకు కంట్రోల్ చేయగలుగుతున్నామన్న విషయం అందిరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామనడం దారుణం.ఇవిగో మెడికల్ కాలేజీలు.. కళ్లు తెరిచి చూడండి..వైఎస్ జగన్ ప్రభుత్వ నేతృత్వంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీల కోసం అనుమతిలు తెచ్చి, స్దల సేకరణ పూర్తి చేయడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. వీటిలో 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయగా.. 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే.. వద్దని ఎంసిఐ కు లేఖ రాశారు. మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్ మెంట్, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా అందని విధంగా వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించారు.బాధ్యత గల ప్రభుత్వంగా మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాల్సింది పోయి, వాటిని ప్రైవేటు పరం చేయడానికి... చంద్రబాబు సహా మంత్రులు మాట్లాడుతున్న పచ్చి అబద్దాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. కనీస హోంవర్క్ చేయకుండా మాట్లాడుతున్న హోం మంత్రి అనిత అయితే కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు మచిలీపట్నం లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయింది. విజయనగరంలో అన్ని రకాల వసతులతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తైతే... ఇవేవీ మీ కళ్లకు కనిపించడం లేదా? పైగా ఎల్లో మీడియాలో 10 కొత్త కాలేజీలకు శ్రీకారం అంటూ అబద్దపు వార్తలు వండి వార్చుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే ప్రభుత్వ రంగంలో మంజూరైన కాలేజీలనే... ప్రైవేటు పరం చేస్తూ... మళ్లీ వాటిని తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు రాయడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఇంకోకటుండదు. కళ్లకు పచ్చపాతం సోకిన వ్యక్తులను ఏవరూ ఏం చేయలేదు. కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులు, తటస్థులు వాస్తవాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. అప్పుడే నిజాలు తెలుస్తాయి. లేదంటే పచ్చ పత్రికలు రుషికొండ టూరిజం భవనాల తరహాలో ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తారు.మీరు చేయని పనికి కూడా క్రెడిట్ తీసుకోవడం మీకెప్పుడూ అలవాటే చంద్రబాబూ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి, పూర్తి చేసింది కూడా వైఎస్సారే. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి మీ హయాంలో కనీసం భూసేకరణ కూడా చేయలేదు. కానీ మీరే కట్టామని నిస్సిగ్గుగా కేడర్ తో మాట్లాడతారు. మీరేం చెప్పినా వాటిని ప్రచారం చేసే మాధ్యమాలున్నాయన్న ధీమాతో అబద్దాలను నూరుపోస్తున్నారు. పదే, పదే అబద్దాలు ప్రజలకు నూరుపోసి వాటినే నిజాలని భ్రమింపజేయడం మీకు మొదటి నుంచీ అలవాటే.నంద్యాల మెడికల్ కాలేజీ అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే రండి వెళ్లి చూసి వద్దాం. పేద ప్రజలకు వైద్యం, పేద విద్యార్ధులకు వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ వీటి నిర్మాణం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగమే కాదు వ్యవసాయ రంగం కూడా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం వల్ల రైతులకు మద్ధతు ధర కూడా రావడం లేదు.ప్రతి వేయి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్య విద్యను అభ్యసించాల్సిన పిల్లలను ప్రోత్సహించాల్సి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తున్నారు. 15 నెలల్లో రూ.1.90 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయి. ఎవరి జేబుల్లోకి పోయాయి. పేదవాడి వైద్యానికి అవసరమయ్యే వైద్య కళాశాలలు కట్టమంటే... డబ్బుల్లేవని బీద పలుగులు పలుకుతున్నావు. పైగా వైయస్.జగన్ హయాంలో రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేస్తే... రూ.10-12 లక్షల కోట్లు అప్పు చేశారని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారు. తీరాచూస్తే అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్ధిక మంత్రే వైఎస్ జగన్ జగన్ హయాంలో రూ.4.67 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి.. సభ బయటకు రాగానే మరలా ఇంకో రకంగా మాట్లాడ్డం సిగ్గుచేటు. మీ మంత్రి పార్ధసారధి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెబితే... చంద్రబాబు మాత్రం వైయస్.జగన్ హయాంలో ఒక్క కాలేజీ పూర్తి కాలేదు. మేమే తెచ్చాం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు.రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో రూ.1లక్ష కోట్లు అని చెప్పాడు. ఇప్పుడేమో అది ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో రాజధాని నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కేవలం రూ.4 వేల కోట్లు ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందించే మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టలేవా చంద్రబాబూ? వైయస్.జగన్ ప్రభుత్వంలో అప్పులు గురించి గగ్గోలు పెడుతూ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన మీరు.. ఓట్లు కోసం సూపర్ సిక్స్ పేరుతో విపరీతమైన హామీలిచ్చారు.తీరా ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మేధావులు, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాలు నిగ్గు తేల్చాల్చి ఉంది. నిజాలు మీరే క్షేత్రస్ధాయిలో పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఆ తర్వాత మీరే నిజాలు ప్రజలకు తెలియజేయండి.బాపట్ల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి...బాపట్లలో నాడు నేడు కింది అన్ని పీహెచ్ సీలను ఆధునీకరించాం. రూ.3.50 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. కొత్తగా వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. బాపట్ల ఏరియా ఆసుపత్రిలో గతంలో ఒక ఎమర్జెన్సీ వార్డులో రెండు ఆక్సిజన్ బెడ్స్ ఉండే పరిస్థితి నుంచి కోవిడ్ మహమ్మూరిని సమర్ధవంతంగా ఎదుర్కున్నాం. ఇప్పుడు 120 ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ వైయస్.జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేశాం. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తే... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు కేటాయిస్తే.. మాకు వద్దు అని లేఖ రాసిన ముఖ్యమంత్రి మీరే చంద్రబాబూ..?వైద్య విద్య కోసం కజికిస్తాన్, యుక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి మన పిల్లలు వైద్య విద్య కోసం వెళ్తుంటే.. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కాలేజీలను మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు చంద్రబాబూ ? నిత్యం చంద్రబాబు గ్రాఫిక్స్ చూసి అలవాటు పడిన టీడీపీ కార్యకర్తలు కూడా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైయస్.జగన్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చూపిస్తున్నవి గ్రాఫిక్స్ కాదు... నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కాలేజీలు అన్న విషయాన్ని క్షేత్రస్దాయికి వెళ్లి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీటితో పాటు రెండో దశలో పిడుగురాళ్లలో 75 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. మార్కాపురంలో లో శరవేగంగా మెడికల్ కాలేజీ పనులు జరుగుతుంటే 15 నెలలుగా వాటి నిర్మాణానికి బ్రేక్ వేశారు.బాపట్లలో మెడికల్ కాలేజీ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. చెరువులో కడుతున్నారని చెబుతున్నారు. నువ్వు చెబుతున్న ఐకానిక్ టవర్ నిర్మాణం నీటిలో మునిగిపోతే.. నీటిని తోడడానికే కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు కేటాయించి.. ఆ రైతులను గాలికొదిలి, మరలా మరో 40 వేల ఎకరాలు అవసరం అని చెబుతున్నారు. అంతా మాటల కనికట్టు తప్ప చేతల్లో ఏమీ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కటే విషయం స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వాస్తవాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి మీరే నిజాలు నిగ్గు తేల్చాలని కోన రఘపతి ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. -
‘జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ‘కూటమి’కి ఉందా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దళితులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఓ ఆర్ఎంపీపై జనసేన నేతలు దాడి చేశారని సుధాకర్బాబు నిప్పులు చెరిగారు.‘‘గతంలో వైఎస్ జగన్ పట్ల లోకేష్, పవన్ అసభ్యంగా మాట్లాడారు. వైఎస్ జగన్ పట్ల అసభ్యంగా మాట్లాడిన లోకేష్, పవన్పై ఎందుకు చర్యల తీసుకోలేదు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా’’ అంటూ సుధాకర్బాబు నిలదీశారు.‘‘చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు. ఎస్పీల సమావేశంలో చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయాలని ఎస్పీలకు సూచించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అశాంతి కనిపిస్తుంది. ఆయన అసమర్థ పాలన గురించి జనం మాట్లాడుకోకుండా డైవర్షన్స్ చేస్తుంటారు. అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లకు అనుకూలమైన పోలీసులకే పోస్టింగులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది...రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లకు లేని ఆధారాలు సృష్టించి కేసులు పెడుతున్నారు. పవన్పై ఒక్క మాట జారిన వ్యక్తిపై కేసులు పెట్టారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారు. గతంలో పవన్ మాట్లాడిన మాటలకు ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలి. వాడు, వీడు.. యూస్ లెస్ ఫెలో అని మాట్లాడిన లోకేష్ పై ఎందుకు కేసులు పెట్టలేదు. మీ ప్రభుత్వంపై ప్రతీ ఒక్కరికీ నమ్మకం పోయింది. బాధితులపై తిరుగు కేసులు పెడుతున్న మీరు పోలీసులను కూర్చోబెట్టుకుని ఏం చెప్తారు’’ అంటూ సుధాకర్బాబు ప్రశ్నించారు. -
కులాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమి సర్కార్: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ది పొందాలని కుటిల యత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల యత్నాన్ని ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కులధృవీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గం ఆందోళన చెందే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. పైగా ఈ నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నదేనన్న మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గతంలో మెమో జారీ చేసిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం అయితే దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబరు 25 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెమోకు జీవోకు తేడా తెలియకుండా మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..జీవో జారీ చేసిందే చంద్రబాబు ప్రభుత్వంప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేస్తుంది. దీనిపై శెట్టిబలిజ సామాజికవర్గంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ... ఇది సాంకేతికపరమైన ఇబ్బంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల తర్వాత సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధంగా కులధృవీకరణ పత్రాలు జారీ చేసిందని చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.తమకు నష్టం జరుగుతుందని, తమ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ... నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 19-06-1997లో జీవో నెంబరు 16 విడుదల అయింది. వాస్తవానికి 15-05-1995లో సామాజిక స్పృహ కలిగిన నాయకుడు, అందరూ సర్ధార్ అని పిలిచే గౌతు లచ్చన్న గారు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచన చేసి ఈ జీవో నెంబరు 16ను ప్రతిపాదించారు.ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రభాకర్ రావు వంటి పెద్దలు కూడా సమ్మతి తెలిపారు. అనంతరం విడుదలైన జీవో ప్రకారం అంతా గౌడగా ఉండాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై కొంతమంది శెట్టిబలిజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించేదిగా ఉందని.. ఎప్పటిలానే శెట్టిబలిజలుగానే తమ నామకరణం ఉండాలని ప్రతిపాదించారు. ఇదే విషయంపై కోర్టులకు కూడా వెళ్లారు. దీంతో కులాల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి.. ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేశాయి. ఈ జీవోను జారీ చేసింది చంద్రబాబేఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ జీవో అమలు కాలేదు. 2014-19 వరకు మరలా చంద్రబాబు ఉన్నప్పుడూ కూడా ఈ జీవో అమలు కాలేదు. 2019-24 వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది గౌడ సోదరులు గౌతులచ్చన్న గారి ప్రతిపాదనను మరలా తెరపైకి తీసుకొచ్చారు. కేవీ సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ తో పాటు కొంతమంది కలిసి 23-02-2023 నాడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది.మా హయాంలోనే జీవో నెంబరు 25 జారీ..గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అసమ్మతి వచ్చిందో.... ఈ మెమో జారీ చేసినప్పుడు కూడా అదే విధంగా వ్యతిరేకత వచ్చింది. కృష్ణా జిల్లాలో శెట్టిబలిజ కులస్తులు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే గౌడ అని వస్తుందని అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు 10-11-2023 నాడు రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నా వారికి కేవలం శెట్టిబలిజ అని మాత్రమే ఇవ్వాలని జీవో ఎం ఎస్ నెంబరు 25 జారీ చేశాం. అదే సమయంలో రాయలసీమలో ఉన్న శెట్టిబలిజలుది గీత వృత్తి కాకపోవడంతో గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు కూడా వర్తించదని జీవోలో పొందుపరిచాం.మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వంకానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కారణమో లేక ఇతర కారణాల వల్ల గతంలో ఎవ్వరూ అమలు చేయని నిర్ణయాన్ని కేవలం ఒక మెమోని మాత్రమే ఆధారంగా చేసుకుని గౌడ అని ముందు చేర్చి తర్వాత శెట్టిబలిజ, ఈడిగ, యాత అని చేర్చడం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ శెట్టిబలిజల్లో ఆందోళనకు కారణమైంది. ధృవీకరణ పత్రాలు జారీ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. తమ తప్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించకుండానే.. ప్రజలకేం చెప్పినా నమ్ముతారన్న అతి విశ్వాసంతో ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు.మెమోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడ్డం హాస్యాస్పదం. ప్రజలు వారి వారి కులాల పేర్ల మీదే కులధృవీకరణ పత్రాలు మంజారు చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా, జీవో నెంబరు 6 జారీ చేయడం ద్వారా వారి అశాంతికి కారణం అయింది. గౌత లచ్చన్న గారి ఆశయానికి కూడా కూటమి ప్రభుత్వం చరమ గీతం పాడింది. మాస్టర్ కేస్ట్ సర్టిఫికేట్ పేరుతో మా ప్రభుత్వం గౌడ, శెట్టిబలిజ, యాత కులాలను కలిపి ఉంచామని ఒకవైపు చెబుతారు, మరోవైపు వైఎస్ జగన్ వచ్చి అందరికీ విడిగా కార్పొరేషన్లు ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి. వారికి ఒక వేదిక ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 672 మందిని డైరెక్టర్లుగా నియమించాం. ఇవాళ ఏడాదిన్నర కావస్తున్నా కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను భర్తీ చేయలేదు.బీసీలకు అండగా నిలిచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేబీసీలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలుంటే వాటిని ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా అందేటట్టు చేసిన ఘనత దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్లకే చెందుతుంది. మార్కెటింగ్ కమిటీల్లోనూ, దేవాలయాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ కాదా?, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీల, ఎస్టీలు, మైనార్టీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. బీసీలకు మేలు చేశామని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వారికి ఒక మగ్గమో, మోకూ, చక్రమో ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప వారి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పనిచేయలేదు.కేవలం వారిని గౌరవిస్తున్నట్టు నటిస్తూ.. వారి ఆశయాలను నశింపజేసే ప్రక్రియ కూటమి పాలనలో జరుగుతుంది. కులాల మధ్య ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని తక్షణమే పరిష్కరించాం. కానీ అవగాహన లేని మంత్రి మాత్రం ఫేక్ జీవో అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం. ఆయన మెమోకి జీవోకి తేడా తెలుసుకోవాలి. కేవలం కులాల నడుమ ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఈ వివాదం. ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి -
సంబంధం లేని ఎమ్మార్ కేసులో జగన్పై తప్పుడు రాతలు: శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంబంధం లేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైయస్ జగన్ను ఏ1 నిందితుడు అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆనందం కోసం రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ జర్నలిజాన్ని సమాధి చేస్తూ, వైఎస్సార్సీపీ పైన తప్పుడు రాతలు రాయడమే ఈనాడు లక్ష్యం అన్నట్లుగా పత్రికను నడుపుతున్నారని మండిపడ్డారు.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ నిందితుడుగా ఉన్నట్లు ఒక్క ఆధారమైనా చూపగలరా అని ప్రశ్నించారు. న్యాయవాది, వ్యాపారిగా ఉన్న సునీల్ రెడ్డిని వైఎస్ జగన్కు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్నాడంటూ అర్థం లేకుండా పిచ్చిరాతలు రాసిన ఈనాడు ఒక్కసారైనా ఆయన గత ఐదేళ్లలో ఇక్కడకు వచ్చినట్లు, ఏదైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు నిరూపించగలరా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..‘‘ఎల్లో మీడియా ఈనాడులో బేతాళ కథల మాదిరిగా రోజుకో కొత్త కథను లిక్కర్ స్కాం అంటూ వండి వారుస్తున్నారు. వైఎస్ జగన్తో ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఈనాడు పత్రిక బాకా ఊదుతోంది. అన్ని విలువలను వదిలిపెట్టి, బురదచల్లడమే జర్నలిజంగా తన విధానాన్ని మార్చుకుంది. గతంలో రామోజీరావు ఉన్నప్పుడు ఎలా భజనచేశారో, దానికి మించి ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్ మొత్తం పత్రికనే చంద్రబాబు పాదాక్రాంతం చేస్తూ, అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయి, అబద్ధాలు, అభూతకల్పనలతో కథనాలను రాస్తున్నారు...దీనిలో భాగంగానే వైఎస్ జగన్కు నమ్మినబంటు, ఎమ్మార్ ప్రాపర్టీలో నిందితుడు సునీల్ రెడ్డి లిక్కర్ స్కాంలో కీలకం అంటూ ఒక కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో సునీల్ రెడ్డి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఏ7 అయితే, దీనిలో వైఎస్ జగన్ ఏ1 అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ రాశారు. ఈనాడు కిరణ్ తన పత్రికను జర్నలిజం ప్రకారం నడుపుతున్నారా? లేక తన బ్రోకరిజం పాలసీ మేరకు నడుపుతున్నారా? ఎమ్మార్ కేసులో వైయస్ జగన్కు ఏం సంబంధం? కోర్టులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ కేసులో ఏ1 బిభూ ప్రసాద్ ఆచార్య. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ పేరు ఎక్కడ ఉందో చూపగలరా?..కనీస అవగాహన లేకుండా తప్పుడు కథనం రాశామని, మరుసటి రోజు అయినా సవరణ వేస్తారని చూశాం. కానీ వారి వైఖరి చూస్తుంటే, కావాలనే వైఎస్ జగన్పై బురదచల్లేందుకే ఈ కథనం రాశారని అర్థమవుతోంది. పైగా ఇదే కథనంలో వైఎస్ జగన్కు సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అంటూ రాశారు. సునీల్ అనే వ్యక్తి న్యాయవాది, వ్యాపారి. ఏనాడైనా ఆయన గత అయిదేళ్ళలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడకు వచ్చారా? ఎక్కడైనా ఏదైనా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా? సూట్కేసు కంపెనీలను ఏర్పాటు చేశాడంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేశారో ఈనాడు పత్రిక చెప్పాలి...అత్యంత సన్నిహితుడు అంటే చంద్రబాబుకు నిత్యం భజన చేస్తూ పత్రికను నడిపించిన రామోజీరావు, ఆయన మరణం తరువాత ఆ స్థానంలో ఉన్న చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు. వీరు కదా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. సునీల్ రెడ్డి నివాసంలో సిట్ జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు దొరికాయని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు దొరికాయంటూ ఈనాడులో రాశారు. సిట్లోని ఏ అధికారి కీలక ఆధారాలు దొరికాయని చెప్పారో వెల్లడించాలి...గతంలో ఇదే లిక్కర్ స్కాంలో బంగారం, విదేశాల్లో ఫ్యాక్టరీలు, దుబాయ్లో ఆస్తులు ఇలా అనేక రకాలుగా ఊహాత్మక అంశాలను వార్తా కథనాలుగా రాశారు. ఈనాడు ఇలా దిగజారిపోయి రాస్తున్న తప్పుడు రాతలను చూస్తే, చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం జర్నలిజం విలువలను సమాధి చేసి, భజన చేయడమే తమ జీవితాశయంగా పత్రికను నడుపుతున్నారని అర్థమవుతోంది. లేని లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ను దోషిగా చూపాలన్నదే వారి తాపత్రేయంగా కనిపిస్తోంది...ఈనాడు పత్రిక పేరును చంద్రనాడు అని మార్చుకుంటే బాగుంటుంది. ఇటువంటి తప్పుడు వార్తను ప్రచురించినందుకు ఈనాడు పత్రిక నిర్వాహకుడు చెరుకూరి కిరణ్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే ఈనాడు పత్రికను ప్రజలు టిష్యూ పేపర్గా చూస్తున్నారు. దానిని టాయిలెట్ పేపర్ స్థాయికి తీసుకువెళ్ళేందుకు ఈనాడు కిరణ్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అబద్దపు రాతలపై చర్యలు తీసుకుంటామంటున్న సీఎం చంద్రబాబు, తన నమ్మినబంటు చెరుకూరి కిరణ్ ఈనాడులో రాస్తున్న అసత్య కథనాలపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని పుత్తా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. -
పీపీపీ అంటే పే ఫర్ ప్రాజెక్టుగా అర్థం మార్చేశారు: సీదిరి
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పండగ సందర్భంగా మెగా సెల్ పెట్టినట్లు ఫ్రీ గా మంత్రులు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్కి కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘పీపీపీ మంచిదని మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రైవేట్కి మెడికల్ కాలేజీలు ఇవ్వడం ట్రయిల్ రన్గా మొదలు పెట్టారా? అంటూ అప్పలరాజు ప్రశ్నించారు.‘‘భవిష్యత్లో ఎన్ని చూడాలో.. టూరిజం కూడా ప్రైవేట్కి ఇచ్చేశారు.. అన్ని టూరిజం కార్యాలయాలను అమ్మకాలకు పెట్టారు. మంత్రులకు సిగ్గు ఉందా?. మంత్రులు రాజీనామా చేసి వల్ల పదవులు కన్సల్టెన్సీకి ఇవ్వండి.. వాళ్లు ప్రభుత్వం నడుపుతారు. మంత్రి పదవులు కాపాడుకోవడానికి పీపీపీని సమర్థిస్తారా?. పీపీపీ బాగుంటే, బ్రహ్మాండంగా ఉంటే ఎయిమ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అప్పల రాజు నిలదీశారు.టెక్నాలజీ మెరుగుపరచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. హోంమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫెయిల్యూర్ మంత్రులు. ఏది అడిగిన డబ్బులు లేవని అంటున్నారు.. మరి రెండు లక్షల కోట్లు అప్పు ఎక్కడ?. నచ్చిన పని చేయడానికి లక్షల కోట్లు అప్పులు చేస్తారు. పేద ప్రజలకు సీట్లు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఉన్నట్లు నడిపితే 2500 కోట్లు మిగులుతుంది. 11 వేల కోట్లు లాస్ట్ 5 ఏళ్లలో ఖర్చు చేశాం. కోటి 43లక్షల కుటుంబాలకు 3575 కోట్లు ఖర్చు అవుతుంది...2500 రూపాయల చొప్పుమ 4075 కోట్లు ప్రీమియం ఇస్తున్నారు.. ఏడాదికి 5 కాలేజీలు ప్రారంభించండి. 8400 కోట్లు 17 మెడికల్ కాలేజీలకు బడ్జెట్ అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా మెడికల్ కాలేజీలు నిర్మించాలో గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సోషలో మీడియాలో అసత్యాలు మాట్లాడే వాళ్లపై కేసులు పెట్టాలి అంటే అనిత మీద పెట్టాలి. 24-25 సంవత్సరంలో క్లాసులు తరగతులు నిర్వహించడానికి అవసరం అయినా పనులు పూర్తయినట్లు ఈనాడులో రాసారు. మెడికల్ కాలేజీలు తానే తీసుకొని వచ్చానని చంద్రబాబు అబద్ధాలు చెపుతున్నాడు...గతంలో ఎప్పుడో వచ్చిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు తన అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు, తిరుపతిలో మెడికల్ కాలేజీలు 2014 జూన్లో ప్రారంభం అయితే అదే నెలలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎలా పర్మిషన్ తీసుకొని వస్తారు. 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అమ్మడం అంటే అంత కంటే దౌర్భాగ్యం ఉండదు. 2015 లో వేసిన సీఆర్డీఏకి వేసిన పునాది ఫొటోస్ నేడు గూగుల్లో చూపిస్తుంది. మార్కాపురం, మదనపల్లి, బాపట్ల బిల్డింగ్స్ గూగుల్లో కనిపిస్తాయి...పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ కాలేజీల గురించి మంత్రి అనిత తగ్గించి మాట్లాడతారా? ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ప్రైవేటైజేషన్ సక్సెస్ స్టోరీ అని చంద్రబాబు ఒక పుస్తకం రాశాడు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కి అమ్మేయడాన్ని పొగుడుకొంటూ ఆయనకు ఆయన రాసుకున్నారు. పీపీపీ అంటే పే ఫర్ ప్రాజెక్టుగా అర్థం మార్చేశారు. టూరిజం డిపార్ట్మెంట్లు, హాస్పిటల్, ఆరోగ్యశ్రీ అన్ని ఇచ్చేసారు.. రాష్టాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టేసారు. లులూ మాల్కి ప్రైమ్ లొకేషన్లో ఫ్రీగా స్థలం ఇచ్చేశారు. పీపీపీకి ప్రైవేట్ కాలేజీలు ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలి.. లేదంటే పోరాటం చేస్తాం’’ అని అప్పలరాజు హెచ్చరించారు. -
జనసేనకు సర్ప్రైజ్ షాక్
సాక్షి, అనకాపల్లి: జనసేన పార్టీకి సర్ప్రైజ్ షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి తిరిగి వైఎస్సార్సీపీ గూటికే చేరుకున్నారు. ధర్మశ్రీ, కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఊహించని ఈ పరిణామంపై జనసేన వర్గాలు కంగుతిన్నాయి.అభివృద్ధి కోసమే జనసేన పార్టీలో చేరాను. మా మండలాన్ని అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కూటమి నేతలు మోసం చేశారు. పార్టీలో నన్ను అవమానాలకు గురి చేశారు. జనసేన పార్టీలో అభివృద్ధి కోరుకునేవారికి తగిన గుర్తింపు ఉండదు అని జయలక్ష్మి అన్నారామె. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ కేడర్కు ఆమె క్షమాపణలు తెలియజేశారు.వైయస్ఆర్సీపీని వీడి తప్పు చేశాను, నన్ను క్షమించాలి. చేసిన తప్పును సర్దించుకోవడం కోసం మళ్లీ వైఎస్సార్సీపీలో తిరిగి జాయిన్ అయ్యాను అని ఎంపీపీ మల్ల జయలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఆగష్టులో మల్ల జయలక్ష్మి జనసేనలో చేరారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీకి స్థానికంగా పెద్ద దెబ్బ పడిందంటూ జనసేన శ్రేణులు సంబురాలు చేసుకోవడమూ తీవ్ర చర్చనీయాంశంగానూ మారింది. -
జగన్ మీద విషం.. అడ్డంగా బుక్కైన ఈనాడు
కూటమి పాలనలో ఎల్లో మీడియా రెచ్చిపోతూనే ఉంది. తాజాగా.. టీడీపీ కరపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విషం చిమ్మింది. తీవ్ర ఆరోపణలు.. పచ్చి అబద్ధాలతో.. నిసిగ్గుగా ఓ కథనం ఇచ్చింది. ఈ క్రమంలో.. సంబంధం లేని అంశాలను జోడించి ప్రజల్లో అపోహలు కలిగించే తీవ్రంగా ప్రయత్నం చేసింది. లాయర్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన సునీల్ రెడ్డిని మద్యం కేసులో సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా నడిపించింది. సోదా సమయంలో సిట్ సభ్యులు తమతో పాటు లోపలికి ఓ బ్యాగ్ తీసుకెళ్లడం, అలాగే ఓ ప్రైవేట్ వాహనం రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనంలో ఉన్న వస్తువులను కార్యాలయంలోకి చేరవేసి.. మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారనే ఆ అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఒకవైపు తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ నానాతిప్పలు పడుతుంటే.. మరోవైపు తప్పుడు కేసు కోసం ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ పదవులు చేపట్టని సునీల్రెడ్డి అనే వ్యక్తిని.. జగన్కు అత్యంత సన్నిహితుడని, ఆయన కోసం డొల్ల కంపెనీలు సృష్టించారంటూ కథనాలు అచ్చేసింది. ఇక.. చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసం ఇంతకు ముందూ జగన్, వైఎస్సార్సీపీ నేతలపై పలు అవాస్తవ కథనాలు ప్రచురించింది. మార్గదర్శి అక్రమాలపై చంద్రబాబు విచారణ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాబు ప్రాపకం కోసం ఈనాడు బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజా కథనం కూడా బాబుకు అనుకూలంగా, జగన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అల్లేసిందనేనని వైఎస్సార్సీపీ అంటోంది.మీడియా స్వేచ్ఛ అనే పదాన్ని ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు వేదికగా మార్చుకున్న ఈనాడు.. రాజకీయ అనుకూలత కోసం నిజాన్ని వక్రీకరించడంలో మరోసారి తన పాత్రను బహిరంగం చేసుకుందనే విమర్శ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. -
జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్ -
సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లిలో గ్రావెల్కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందాం. సీబీఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా?. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే.. వాళ్లే పోటీ చేయాలని కాకాణి అన్నారు.అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్న కాకాణి.. డిమాండ్ వున్న ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వైపు యూరియా కొరత.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు శూన్యం. సోమిరెడ్డికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదు. ఏదో జగన్ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నోరు పారేసుకోకు అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
హిట్టా? ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూండటం, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై జగన్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అదే రోజు ఇంకో సమావేశంలో చంద్రబాబు యథాప్రకారం జగన్ దూషణకు పరిమితమయ్యారు. జగన్ సంధించిన నిర్దిష్ట ప్రశ్నలు ఒక్కదానికి కూడా నేరుగా చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కూటమి అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అన్న జగన్ ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే.. సూపర్సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిపిన హడావుడికి చాలాచోట్ల నుంచి ప్రజలను బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని కొన్ని గ్రామాల్లో చాటింపు వేశారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కొందరు అధికారులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు సభకు రాకపోతే రూ.200 జరిమానా పడుతుందని హెచ్చరించారట. ఇక వేల ఆర్టీసీ బస్సులతో జనాన్ని బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ బలవంతపు విజయోత్సవాలు అన్న వ్యాఖ్య అర్ధవంతంగానే ఉందనిపిస్తుంంది. బలవంతపు విజయోత్సవాలు అనేదానికి.. చంద్రబాబు దీనిపై ఎక్కడా స్పందించలేదు. సూపర్ సిక్స్ హిట్ అయినందుకే జనం తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ సిక్స్ హిట్ అయిందా? లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించినప్పుడు జనం ననుంచి పెద్దగా స్పందన రాలేదు. చప్పట్లు కొట్టాలని ఒకటి రెండుసార్లు సార్లు ఆయనే అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 👉చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా చంద్రబాబూ అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. 👉నిరుద్యోగ యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి కదా! రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడుతున్నావు కదా? అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమే లేదు. 👉సూపర్ సిక్స్తోపాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ ఏభై ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారికి నెలకు రూ.నాలుగు వేల ఫించన్ ఇస్తానన్న వాగ్ధానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు. 👉వృద్ధాప్య ఫించన్లో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణపైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. సూపర్ సిక్స్ కు సంబంధించి ఎన్నికల ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలకు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, ఏభై ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడతారని అంటూ, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు, ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి జగన్ ఆధారసహితంగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద రూ.3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇవ్వకపోవడం జనాన్ని మోసం చేయడం కాదా? అని నిలదీశారు. తల్లికి వందనం స్కీమ్ లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన విషయాలను లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములను కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్ని అమలు చేసేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజలలో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటిన్లలో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకిలెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా, మిగిలినవాటి సంగతేమిటి? తల్లికి వందనం లో రూ.15 వేలు ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పునే ఇచ్చింది వాస్తవమా? కాదా? అందులోను చాలామందికి కోత పడిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు జవాబు రాలేదు. ఉచిత బస్సు గురించి మీరు ఇచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టిసి బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా?లేదా? అని అంటూ, అప్పట్లో చంద్రబాబు దానికి సంబందించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా, ఫ్రీ బస్ హిట్ అయిందని, ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు కేవలం కూటమి ప్రభుత్వమే రైతులకు ఇస్తుందని ఎన్నికలకు ముదు హామీ ఇచ్చి ,ఒక ఏడాది ఇవ్వకుండా, ఈ ఏడాది రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చింది నిజం కాదా అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు. తొలివిడతలో రూ.ఏడు వేలు ఇచ్చామని సభలో చెప్పారు. మరి హామీ నెరవేర్చినట్లు అవుతుందా? అందువల్ల ఇది హిట్టా? ఫట్టా అని అంటే ఫట్ కాకపోయినా, రైతులను మోసం చేసినట్లే అవుతుందన్న విశ్లేషణ వస్తుంది. ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు,క్లాస్ రూమ్ల ఫోటోలను ,వీడియో క్లిప్పింగ్ లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్దం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా? అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి క్యాబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకు వచ్చిందని వెల్లడించి, అందులో ఏడు పూర్తి అయ్యాయని, పదింటిని పీపీపీ పద్దతిలోకి మార్చుతున్నామని చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్ను ,చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్దాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఇలా అసత్యాలు కాకుండా, జగన్ ప్రభుత్వం వీటిని తెచ్చిందని, వాటిని ఎందువల్ల తాము పిపిపి మోడల్ గా మార్చుతున్నామో వివరించి ఉంటే గౌరవంగా ఉండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం ఏభై సీట్లు ఇస్తే, తమకు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడనే లేదు. యూరియా కొరత లేదని తొలుత కొన్నాళ్లపాటు డబాయించిన చంద్రబాబుఈ సభలో మాత్రం యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పడం గమనించదగ్గ విషయమే. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే , వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు.తమ సూపర్ సిక్స్ హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజలలో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జన సైనికుల ముసుగులో రౌడీలు.. ఆ దాడి హేయం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: పవన్ కల్యాణ్పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు(Jana Sainiks) దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు వాళ్లను గనుక అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారాయన.‘‘ఆర్ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాత్రం దానికే జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారువందమందికి పైగా జనసేన గూండాలు(Jana Sena Goons) గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు. మరి పవన్ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా?.. వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు??. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా???జనసేన ముసుగు ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని,నన్ను,నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు తిడతారు. పవనను ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేస్తారు. గిరిధర్,సతీష్ ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్ని నాని అన్నారు.మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్(RMP Giridhar Attack) మంగళవారం ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ని నిలదీశారు. ఈ క్రమంలో.. ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. .. జనసేన పెద్దల ఒత్తిడితో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. గిరిధర్కు మద్దతుగా పీఎస్కు వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు కవ్వింపునకు దిగబోయాయి. దీంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని ఠాణా వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఇరు పార్టీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదీ చదవండి: మా పవనన్ననే నిలదీస్తావా? -
టార్గెట్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మళ్లీ జేసీ మార్క్ రాజకీయం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారు.తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని వివరణ ఇచ్చారు.జేసీ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. మళ్లీ మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ గతంలో జేసీ ప్రభాకర్రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
‘ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు: రవీంద్రనాథ్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందని.. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అని.. బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పాలన రాష్ట్రంలో సాగుతుందంటూ దుయ్యబట్టారు. ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించారని.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గొప్ప ఆలోచన చేశారని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు.‘‘మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజలకు మంచి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం.. ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్య చదివేందుకు వీలు ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ విజయోత్సవ సభ పెట్టడం సిగ్గు చేటు. ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబు మానుకోవాలి’’ అని రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. -
పుత్తా వర్సెస్ రెడ్డెమ్మ
సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పోరు ముదిరింది. కడప కేంద్రంగా పరస్పర బలప్రదర్శనల జోరు ఊపందుకుంది. ఇరుగుపొరుగు నియోజకవర్గాలైన కమలాపురం కడప ఎమ్మెల్యేలు, నేతల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరింది. వరుస వివాదాల నేపధ్యంలో ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠానికి ఎసరు పెట్టారు. అధ్యక్షుడు మార్పు జరగాల్సిందేనంటూ ఓ వర్గం పట్టుబట్టడం గమనార్హం.జిల్లా కేంద్రమైన కడపలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కూటమి సర్కార్ 16 నెలల కాలంలో తెరపైకి వస్తున్నాయి. ‘మద్యం వ్యాపారం మా వర్గీయులే చేయాలంటూ’ స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు ఆది నుంచి హుకుం జారీ చేయసాగారు. ఫలితంగా ముప్పై ఏళ్లుగా మద్యం వ్యాపారంలో కొనసాగుతు న్న లక్ష్మిరెడ్డికి చెందిన రెండు బార్లు బలవంతంగా స్వాహా చేశారు. తాజాగా 27 బార్ల లైసెన్సుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే 14బార్లకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. మిగతా 13 పెండింగ్లో ఉన్నాయి. అందులో జిల్లా కేంద్రమైన కడపలో 4బార్లు పెండింగ్లో ఉన్నాయి. 9 టెండర్లలో పలువురికి దక్కాయి. అందులో యల్లటూరు విశ్వనాథరెడ్డికి ఓ బార్ దక్కింది. కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో బార్ ప్రారంభోత్సవానికి ప్రయత్నించగా..కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఇక్కడ బార్ పెట్టొద్దంటూ హంగామా చేశారు. ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఇంతలోనే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి బ్యానర్లతో కూడిన వాహనాల్లో కొంతమంది అక్కడి చేరు కోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాలు పరస్పర సవాళ్లు చేసుకున్నారు. కాసేపటికే అక్కడి నుంచి జారుకున్న కడప ఎమ్మెల్యే వర్గీయులు.. బుధవారం రాత్రి సదరు బార్ అండ్ రెస్టారెంట్ నేమ్బోర్డును ధ్వంసం చేసినట్లు సమాచారం. కాగా, జిల్లా కేంద్రంలో మాధవి, వాసు నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టాలనే దిశగా తెలుగుదేశం పార్టీ నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.పెండింగ్లో కడప సిటీ కమిటీ టీడీపీ సీనియర్ నేతల ఫిర్యాదు మేరకు ఆ పార్టీ కడప సిటీ కమిటీ నియామకం పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. పఠాన్ మన్సూర్ అలీఖాన్ టీడీపీ సిటీ అధ్యక్షుడిగా, జనరల్ సెక్రెటరీగా ముక్కెర సుబ్బారెడ్డిలతో కలిసి సిటీ కమిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సిఫార్సులు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆ పార్టీలోని సీనియర్లు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో టీడీపీ జెండా మోసినోళ్లు కాదనీ, వేరే పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారిచే సిటీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన దౌర్భాగ్యం ఏమిటీ? అని కొందరు నిలదీసినట్లు తెలిసింది. ఏకంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సిటీ కమిటీ నియామకం పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీలో అనైక్యత కొరవడి రగడ తీవ్రస్థాయికి చేరిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.టీడీపీ అధ్యక్ష పీఠానికి ఎసరుజిల్లా కేంద్రమైన కడపలో ఏకపక్ష చర్యలకు చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నడుం బిగించారు. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం మార్పు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తోడుగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఉండడంతో ప్రజాస్వామ్య పరిస్థితులను కాలరాస్తున్నారని కొంతమంది టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమేరకు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరించినట్లు తెలుస్తోంది. పొలిట్బ్యూరో సభ్యుడిగా, జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడ్డికి రెండు పదవులు ఉన్న నేపధ్యంలో అధ్యక్ష పీఠం తప్పించాలని కోరినట్లు సమాచారం. ఆమేరకు టీడీపీ అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే అన్వేషణలో జమ్మలమడుగు ఇన్చార్జీ చదిపిరాళ్ల భూపేష్రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. టీడీపీలో భూపేష్రెడ్డి అందరీకి ఆమోదయోగ్యడుగా నిలువనున్నట్లు అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. -
వేదికపై చంద్రబాబు.. ఎదురుగా ఖాళీ కుర్చీలు
సాక్షి, అనంతపురం: సూపర్సిక్స్-సూపర్హిట్’ పేరుతో తె.దే.పా-జనసేన-బీజేపీ కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. అయితే ఈ సభలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టీడీపీ శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న టైంలోనే జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతూ కనిపించారు. వాళ్లను ఆపేందుకు తె.దే.పా కేడర్, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ఎదురుగా చంద్రబాబు మాట్లాడుతున్న టైంలోనూ ఇవతల ఖాళీ కుర్చీలే అక్కడ దర్శనమిచ్చాయి. -
అది శ్రీవారి ఆలయమా?.. టీవీ5 కార్యాలయమా?: భూమన
సాక్షి,తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్నీ వివాదాలే నెలకొంటున్నాయని.. తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనునిత్యం ఏదో ఒకటి అపచారం జరుగుతున్నాయి. ప్రశ్నించి మాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చంద్ర గ్రహణం రోజున మహాద్వారం మూసి వేసిన తర్వాత ఇత్తడి గ్రిల్ గేటు తాళాలు వేస్తున్నారు. టీవీ5 శ్రీవారి ఆలయమా..టీవీ5 కార్యాలయమా?.బీఆర్ నాయుడు సైన్యంలో ఒకరు తాళం వేస్తున్నారు. ఇది దేనికి సంకేతం.ఇది చాలా తప్పిదం. బోర్డు సభ్యుడు మహాద్వారం వద్ద పెద్ద గొడవ జరిగింది.మీ సైన్యంలో ముఖ్యుడు శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వద్ద ఆలయ డిప్యూటి ఈవో పని చేస్తున్నాడనే ఫిర్యాదులందాయి. టీడీపీ కార్యకర్తగా టివీ5 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బీఆర్ నాయుడు ఉన్నారనే ధైర్యంతో ఈ బరితెగింపు బయటపడింది. ఆలయం లోపల మరోముఖ్యుడు చేస్తున్నవి బయటకు రాలేదు.శ్రీవారి కల్యాణాలు జరపాలని తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు తరపున రవి కుమార్ వేమూరి కోరారు. సెప్టెంబర్ ఆరు నుంచి 16 చోట్ల శ్రీవారి కల్యాణాలు జరపాలని కోరారు. బీఆర్ నాయుడు తన బలంతో ఒకే చేశారు..ప్రొసీడింగ్స్ ఇచ్చారు. శ్రీవారి కల్యాణాలు మొట్ట మొదటిగా మా హయంలో సూళ్లూరుపేట దళితవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు హాంబర్గ్లో కళ్యాణోత్సవాలుకు టికెట్ ధర 116 యూరోలు , జంటగా కల్యాణోత్సవం 81 యూరోలు, విశేష కళ్యాణానికి 515 యూరోలు పేరుతో టికెట్లు పెట్టడం జరిగింది. టీడీపీ ఎన్నికల ఫండ్స్ ఇచ్చిన వారికి సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారా..? టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అనుమతితో జరుగుతోంది. ధనవంతులు ఇళ్లలో లక్ష్మి పూజలు మీ అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. మీరు చేసిన బ్లాక్ మెయిల్ చేసినవి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాం. మీరు చేస్తున్న అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. -
నందిగామ: వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. నందిగామలో అన్నదాత పోరులో పాల్గొన్నందుకు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ర్యాలీపై నందిగామ ఏఎస్ఐ లంకపల్లి రవి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 30 నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా నిరసన, ర్యాలీ చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావులతో పాటు మొత్తం 20 మంది పై కేసులు చేశారు. -
చంద్రబాబువన్నీ మోసాలే.. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో.. యూరియా కొరత, గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న అవస్థలు, 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీయడం.. అలాగే సూపర్సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, సూపర్హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గురించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్కు పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. (అంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసులు మీడియాకు పీపీటీలో చూపారు) యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా? (అంటూ.. యూరియా కోసం అనేక చోట్ల రైతులు బారులు తీరిన ఫోటోలు ప్రదర్శన. చివరకు కుప్పం, టెక్కలిలో కూడా అదే స్థితి).నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? అప్పులు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు?. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.చంద్రబాబు నోట అబద్ధాలు..ఈనెల 3న మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు. మరి చంద్రబాబుగారు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్లు చేసి అందరూ పంచుకుంటున్నారు.మరోవైపు, ఏ ఒక పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, చీనీ.. ఏది చూసినా. ఇప్పుడు కూడా ఉల్లి, టమోటా పరిస్థితి కూడా అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు పట్టించుకోడు. తూతూ మంత్రంగా ప్రకటన చేస్తాడు. అసలు ముందు వాస్తవాలు ఒప్పుకోడు. తప్పదనుకుంటే, ఒక ప్రకటన చేస్తాడు. దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది. ఈరోజు ఉల్లి క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.300 ఉంటే, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.34. అంటే క్వింటాలుకు రూ.3400.మా ప్రభుత్వ హయాంలో రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. మార్కెట్లో పంటల ధరలు తగ్గితే.. సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి, కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడవేవీ లేవు. మా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు మంగళం పాడేశారు.ప్రజారోగ్య రంగం నిర్వీర్యం.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్లకు పరాకాష్ట. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి, క్లాస్లు కూడా ప్రారంభం అయ్యాయి. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి, ప్రారంభించాం. మెడికల్ కాలేజీలే కాదు.. మా హయాంలో ఎంతో చేశాం. కానీ చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది మెడికల్ సీట్లు వద్దన్న చంద్రబాబుచంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. (అంటూ ఆ కాలేజీల ఫోటోలు కూడా చూపారు). ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ ప్రకారం మేము పనులు చేశాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం?మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధులకు ఓకే అయింది. కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి.ఇంకా చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయింది. మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల 95 శాతం కవర్ అయ్యారు. దాని నిర్వహణకు నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు, ఇంకా మరో మోసం. డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఉదాహరణ. 2 నెలల్లో 45 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువ.సూపర్హిట్ ఫ్లాప్ సంబరాలు:చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి. (అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అడ్వరై్జజ్మెంట్స్. సూపర్సిక్స్పై ప్రదర్శన). ఇంకా ఎన్నికల ముందు సూపర్సిక్స్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది చూద్దాం. (అంటూ ఆ పత్రికా ప్రకటనలు. అప్పుడు ఇంటింటికీ పంపించిన బాండ్లు. వాటిలో ఏమేం చెప్పారు?. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. దీనిపై చంద్రబాబు, పవన్కళ్యాణ ఫోటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇంకా పథకాలపై చంద్రబాబు హామీల ప్రచార వీడియోల ప్రదర్శన).ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఇవన్నీ మోసాలు కావా?:18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు మోసం కాదా? అది నీ సూపర్సిక్స్ హామీ కాదా?.. 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?. పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్లు రద్దు చేశావు. ఇది మోసం కాదా?.. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్హిట్ పేరుతో బలవంతపు వేడుకలు. ఇది దారుణం.15 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులుఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. రాష్ట్రం విభజించిన రోజు, మొత్తం అప్పులు కలిపి రూ.140,717 కోట్లు ఉంటే ఆయన దిగిపోయేనాటికి రూ,3,90,247. అంటే 22.63 శాతం సీఏజీఆర్. అది మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే. ఇక మా ప్రభుత్వ హయాంలో అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి రూ.7,21,918 కోట్లకు పెరిగింది. అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు.ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్రూంలు, బెల్టు షాప్లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్కామ్ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. – రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఈ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, వాటన్నింటినీ రద్దు చేస్తాం. ఆ కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.మీడియాతో జగన్ చిట్చాట్ 👉స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. 👉ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే.. 👉18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాతోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదన్న రీతిలో సభను నడిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిరోజులు అసెంబ్లీకి వచ్చారు. జరగనిదాన్ని జరిగిందని రాద్ధాంతం చేశారు.👉సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 👉వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’ -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్సీపీ నేత ఎస్వీ సతీష్రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.తిరుపతి: అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.చెవిరెడ్డి అక్షిత్రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారుఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం. -
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు. విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన భవంతుల్లో పిచ్చాసుపత్రి పెట్టాలని ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నట్లు అయ్యింది. క్షత్రియ సంక్షేమ సమితి సభ్యుల సన్మానం సందర్భంగా ఆయన నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాల్లో బస చేయమన్నా నిద్రపట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని వ్యాఖ్యానించారు. అక్కడికి రిషికొండపై ఇప్పుడే భవనాలేవో నిర్మించినట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. టూరిజం శాఖ భవనాల స్థానంలో చూడముచ్చటైన నిర్మాణాన్ని చేసినందుకు హర్షించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. పైగా ఇదో ఉచిత సలహా అంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగింది మాత్రం కాదు. ఆయనలో రాచరికం వాసనలు ఇంకా పోనట్టు ఉంది. తమ కోటలను మించిన అద్భుతమైన భవనాలు ఇంకెక్కడ ఉండకూడదన్న అక్కసుతో రిషికొండ భవనాలపై ఈ ఆరోపణలు చేశారేమో అనుకోవలి. చిత్రంగా ఎల్లోమీడియా ఇవే వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించి చంకలు గుద్దుకుంది. అయితే..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెట్టిన విపరీత ఖర్చులపై ఏనాడూ ఆక్షేపణ చెప్పని అశోక్ గజపతి రాజుకు మూడు వేల మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం యాభై అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నా ఆయనకు పాలకుల సైకోతత్వం అవగతం కాలేదు. రిషికొండ భవనాలను ఎలా వాడుకోవాలన్న విషయంపై అధ్యయనం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే పవన్ అక్కడకు వెళ్లినప్పుడు ఇంకో రకం డ్రామా జరిగింది. ఫాల్స్ సీలింగ్ను ఎవరో కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చుమీద కనిపించింది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా.. అక్కడి సిబ్బంది దాన్ని తొలగించలేదు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజలలో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేశారు. అమరావతిలో అనవసరంగా వేల కోట్లు వ్యయం చేస్తూ, విశాఖలో రూ.450 కోట్లతో ఏడు భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దానిని వాడుకోవడం చాతకాని ప్రభుత్వంగా మారింది. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవీ వ్యామోహం లేదని భావించే వారు. కాని తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో, లేక స్వయంగా పైరవీ చేసుకున్నారో కాని, ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాకు గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే పరువు తక్కువ అనే అభిప్రాయం పలువురిలో ఉంది. బీజేపీ నేతలు విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.హరిబాబు వంటివారు ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కాని వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి, సీనియర్ నేతగా ఉన్న అశోక్ కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీనిని ఏమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్ పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అని అనడం బహుశా వయసు మీద పడడం వల్ల వచ్చిన సమస్య కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరు అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు.అయితే ఆయన మాత్రం అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు. అశోక్ గజపతి రాజే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్నిసార్లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ మధ్య ఆయన ఒక సభలో మాట్లాడుతూ కనీసం 120 ఏళ్లు జీవించవచ్చని, తాను సంజీవని అనే స్కీమ్ తీసుకు వస్తున్నానని అన్నప్పుడు సభికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బహుశా ఆయన మనసులోని కోరికను ఇలా బయటపెట్టారేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే కాదు.. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చిన తర్వాత, సముద్రాన్ని కంట్రోల్ చేశామని అనడం చిత్రం అనిపించింది. అమరావతిలో పది డిగ్రీల వేడి తగ్గించడానికి ఆదేశాలు ఇచ్చానని ఒకసారి, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తామని ఇంకోసారి ..ఇలా పలురకాలుగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు తమ వయసును గుర్తు చేస్తున్నారన్నఅభిప్రాయం కలుగుతుంది. ‘‘వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’’ అన్న గజపతిరాజు వ్యాఖ్యలకు ఒక పౌరుడి స్పందన ఏమిటంటే... ‘‘అవును నిజమే! 15 నెలల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలామందికి పిచ్చి ఎక్కిన పరిస్థితి ఉంది, నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాదు... రాష్ట్రమంతా పిచ్చి ఆస్పత్రులు పెట్టాలి. మొట్టమొదటగా విజయనగరంలో అలాంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే మేలు’’ అని!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
Annadata Poru Updates: వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ లైవ్ అప్డేట్స్.. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
ఇదేనా పాలనంటే?.. చంద్రబాబు సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు...చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు....స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్రెడ్డి తేల్చి చెప్పారు.మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు అనుకున్నంత పనీ చేశారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా?. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు?. ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది?. అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025‘‘మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?. రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా?. కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా?. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబూ?. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబూ?..ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా?ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబూ?. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు...చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా?. మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?...ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?. ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా?. అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా?. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం...ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా?. లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా?. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?. చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?..కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
సోషల్ మీడియా దెబ్బ.. చంద్రబాబు అబ్బా..
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.-సిమ్మాదిరప్పన్న -
పబ్లిక్ టాక్: ఆ దొంగలే ఎంతో నయం!
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు. టెక్నాలజీ చాలా మందిని పట్టిచ్చేస్తోంది. కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి, దొంగచాటుగా, అప్పగించేసి, లెంపలు వాయించుకుని, క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే. ఆ యవ్వారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉన్నదని గ్రహించాల్సిందే. ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి.. మన రాజకీయ నాయకులందరికీ కానుకలుగా పంపాలని కంకణం కట్టుకోవాల్సిందే. ఇంతకీ ఏమిటీ తమాషా అనుకుంటున్నారా?.. అనగనగా బుక్కరాయసముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతుంటారు కదా.. అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు. కానీ.. కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు. ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈలోగా.. ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి, దానితో పాటు ఓ ఉత్తరం కూడా పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.హుండీ సొమ్ము దొంగిలించిన కాణ్నించీ.. మా యింట్లో పిల్లలకి ఆరోగ్యం బాగా లేదు. ముసలమ్మ సొమ్ము దొంగిలించి తప్పు చేశాం. అందుకే తిరిగి యిచ్చేస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులకు అయిన డబ్బు మాత్రం వాడుకున్నాం. క్షమించండి.. అని ఆ ఉత్తరంలో వారు వాక్రుచ్చారు. పోలీసులు తిరగొచ్చిన సొమ్మును లెక్కవేస్తే 1.86 లక్షల రూపాయల దాకా తేలింది. దొంగలెవరో కనిపెట్టాలని వెతుకుతున్నారు.పాపం.. ఆ ముసలమ్మ హుండీ దొంగల పశ్చాత్తామని, పాపభీతిని పక్కన పెడదాం. సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్లించుకుందాం. ఈ వార్త చదివితే.. ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా.. అని మనకు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారం దక్కింది.. ఉన్న కాడికి దోచెయ్యాలి.. జీవితంలో మళ్లీ అధికారం అనేది మన దాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంపరం పుట్టిస్తోంది. పబ్లిక్ టాక్ ఏంటంటే..ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటే.. చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం.. అప్పుడప్పుడూ రంకెలు వేస్తూ.. ‘లేస్తే మనిషిని కాదు.. ఖబడ్దార్’ అంటూ ఉంటారు. ఒకవైపు హామీల అమలులో విఫలమై.. ప్రజాసందోహంలో పరువు పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో.. మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటూ గెలవం అనే భయమే వారిని దోపిడీ వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి మొబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు, లిక్కర్ దుకాణాల్ని అయినవారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకుంటున్న మొత్తాలు, ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వాటితో ప్రారంభించి.. అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పశ్చాత్తాపం రావాలంటే.. వారికోసం ఎంత పవర్ ఫుల్ దేవుళ్లు... వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా.. దేవుళ్ల మహిమతో, ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా.. ఒక అమరావతి కాదు కదా.. పది అమరావతిలు, పది పోలవరం డ్యాములు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు.అయినా.. దొంగలకు ఉండే స్ఫూర్తి ఈ నాయకులకు ఎందుకుంటుంది? దొంగలు చాలా గొప్పవాళ్లు కదా? అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం, బుద్ధి.. అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.:::ఎం.రాజేశ్వరి -
ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్
సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు. కిరణ్ రాయల్ తాజాగా ప్రెస్మీట్లో భూమన కరుణాకర్రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్ అన్నారు. -
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
ఎద్దు ఈనిందనగానే.. జున్నుపాలు అడిగాడంట!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది. ఓ కార్యకర్త నారా లోకేష్ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు. Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5— Lokesh Nara (@naralokesh) September 4, 2025ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే... ‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!. సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు. మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు. నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు. కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.:::ఎం. రాజేశ్వరి -
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
పీఏ గారి ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒరేయ్ పైడిరాజు ఇలాగైపోయిందేటిరా అన్నాడు సిమాచలం.. బంగ్లా వేపచెట్టు కింద ఎండాకులు నలుపుతూ.. ఏమైందిరా అంటూ ఆత్రుతగా దగ్గరకు జరుగుతూ అడిగాడు పైడిరాజు.. వెంటనే సిమాచలం మేధావిలా ఫోజెట్టి... ఏట్లేదురా... ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నారు కదా... ఆయమ్మ కూడా అచ్చం గూగుల్ చూసి కారు నడిపినట్లు స్టీరింగ్ మొత్తం ఆ జొన్నాడు రాజుకు ఇచ్చేసి ఈయమ్మ ఎనకసీట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు అనిపిస్తంది. ఈ రాజుకు అసలే డ్రైవింగ్ కొత్త.. జోరుమీద మన అమ్మిని ఏ గోతిలోలో, గుమ్మిలోనో తోసేట్టాడేమో అని నా అనుమానం అన్నాడు.. ఎండిపోయిన సమోసా ముక్క కొరుకుతూ.. ఒసే.. అలా ఆవుద్దంతావేంటి అన్నాడు పైడిరాజు.. ఎందుకవ్వదురా. పేనుకు పెత్తనం ఇస్తే బుర్రగోరక్కుండా ఉంటాదేటి.. దొంగోడికి తాళం ఇస్తే మాల్ లేపకుండా ఉంటాడేటి అన్నాడు సిమాచలం. అంటే ఏట్రా నాకు సమంగా అర్థం కాలేదు... మళ్లీ చెప్మి అన్నాడు పైడిరాజు. ఒరేయ్ నీకు ఇక్కడ కుర్చీలు సర్దడం తప్ప ఏం తెలీదురా అని ఎగతాళి చేస్తూనే సిమాచలం చెప్పడం మొదలెట్టాడు. ఇప్పుడూ మనోళ్లు ఇదే బంగ్లాలో.. వేపచెట్ల కింద కుర్చీలు సర్దుతూ... వచ్చినోళ్లను పలకరిస్తూ పాతికముప్పై ఏళ్ల నుంచి ఉన్నోళ్లు ఉన్నారా? మరి అలాంటోళ్లను.. ఉమ్మడి జిల్లానేతలందర్నీ నేరుగా పిలిచి పలకరించే చనువున్న అలాంటి వాళ్లను పులుసులో ముక్కలా తీసేసి.. తమలపాకుకు.. కంపురొడ్డాకుకు తేడా కూడా తెలీని ఈ ఎంపీటీసీని నెత్తిన పెట్టుకోవడం ఏట్రా చిత్రం కాపోతే... అన్నాడు సిమాచలం. పోనీ ఎలా దొరికాడో దొరికాడు.. తెచ్చుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే పదవి మొత్తం ఆయన కాలికాడా పెట్టేసినట్లు పెట్టేసి ఈయమ్మ రెస్ట్ తీసుకుంటే ఎలారా?. ఈ బంళ్లాను నమ్ముకుని ఎంతమంది ఉన్నారు. నగరంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు.. ఆళ్లంతా ఏమైపోవాలి.. అన్నాడు సింహాచలం. బాధ...కోపం...ఆవేదన... నిర్వేదం నిండిన భావనలతో.. యేటి అయిపోవడం... ఎందుకు అలా గింజుకుపోతన్నావు.. అంతా పీఏగారు చూసుకుంటున్నారు కదేటి అన్నాడు పైడి రాజు. దెబ్బకు సిమాచలానికి చిర్రెత్తుకొచ్చేసింది. ఒరేయ్ కెక్కున తన్నానంటే క్రోటన్ మొక్కల్లో పడతావు అన్నాడు సిమాచలం కోపంతో...ఆయన పార్టీని చూసుకోవడం కాదురా.. పార్టీయే ఆయన్ను చూసుకుంటుంది. కాంట్రాక్టులు.. పేమెంట్లు.. బిల్లులు.. పనులు.. పైరవీలు అన్నీ ఆయనే చూస్తున్నాడ్రా బాబు.. మరైతే అమ్మగారు యేటి చేస్తారు అన్నాడు పైడిరాజు చిరాగ్గా మొకం పెట్టి.. ఒరేయ్ దరిద్రంగా మొకం పెట్టకు. మార్చు. చెబుతాను అంటూ మళ్లీ అందుకున్నాడు సిమాచలం. ఒరేయ్ నియోజకవర్గం మొత్తం ఆయన చేతిలోనే పెట్టేసింది అమ్మగారు. ఆయన నంది అంటే నంది.. పంది అంటే పంది.. అలాగైపోయింది ఆఖరుకు.. అన్నాడు సిమాచలం. పోన్లేరా అమ్మగారికి మంచి నమ్మకమైన పనోడు దొరికాడు అన్నాడు పైడిరాజు.ఒరేయ్ బురత్రక్కువోడా ఆయన నమ్మకమైన పనోడు కాదనే కదా క్యాడర్ గోల.. ఆయన అమ్మకం.. ఏకంగా అమ్మగారి పరువును.. పార్టీ ప్రతిష్టను కూడా గంటస్తంభం కాడ అమ్మకానికి పెట్టేస్తున్నాడని కదా కార్యకర్తల బాధ.. అన్నాడు సిమాచలం. అంటే ముందొచ్చిన చెవులకన్నా.. ఎనకొచ్చిన.. అదేగా నీ బాధ అన్నాడు పైడిరాజు సమోసా ముక్క కింద పడేసి. ఆ అదే అదే.. నీ తెలివి ఉందిగానీ ఇలాగైతే ఎలాగరా.. అన్నాడు సిమాచలం.ఏమీ కాదురా.. మొదట్లో బాధపడతారు.. ఆ తరువాత చిరాకు పడతారు.. ఆ ఎనక అలవాటుపడతారు.. ఇంకేటి కాదు అన్నాడు పైడిరాజు.. అంటే మొత్తానికి కార్యకర్తలు కష్టపడతారు.. ఇలాంటోళ్లు మధ్యలో వచ్చి సుఖపడతారు.. అంతేనా అన్నాడు సిమాచలం. అంతే.. అంతే .. కాపోతే రేపిల్లుండి జరిగే పంచాయతీ ఎన్నికల సంగతి ఈ బుడంకాయ పీఏ చూస్కుంటాడా..? క్యాడర్ను వదిలేసి ఈయమ్మ రాజకీయం ఎలా చేస్తుందో ఏటోరా అంతా సిరాగ్గా ఉంది అన్నాడు సిమాచలం. కాపోతే ఇది కూడా గూగుల్ చూసుకుని కార్లో వెళ్తున్నట్లే ఉంటాది. వెళ్లినంతకాలం బాగానే ఉంటాది కానీ ఏదోచోట ఆ కారు గోతిలోనో.. బ్రిడ్జి కాసి కిందకో పడిపోవడం మాత్రం గ్యారెంటీ.. దాన్నెవరూ ఆపలేరు.. అన్నాడు పైడిరాజు. ఓరి ఓరి ఎంతమాట అన్నాడు సిమాచలం.. మరి కాదేటిరా .. ఎవలెవలికో అధికారం ఇచ్చేసి. ఎనకసీట్లో రిలాక్సయి కూకుంటే జర్నీ ఎలా ఉంటాది.. ఇలాగే ఉంటాది.. రాజకీయమైనా .. జీవితమైనా.. అన్నాడు పైడిరాజు.. ఓర్నీ నీలో తింగరితనమే ఉందనుకున్ను ఇంత తెలివి ఎక్కణ్ణుంచి వచ్చిందిరా అన్నాడు సిమాచలం.. ఇదిగో ఈ వేపాకులు నమిలే తెలివి పెంచుకున్నాను.. నువ్వూ నవులు .. నీకూ తెలివి పెరుగుద్ది అంటూ నాలుగు ఆకులు సిమాచలానికి ఇచ్చాడు.. ఓరి నీ తెలివికి దండంరా బాబు అంటూ అక్కణ్ణుంచి కదిలాడు. -
కంఫర్ట్ జోన్లోనే పవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య. చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు. ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దెందులూరులో టీడీపీ నేతల గూండా గిరి
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండా గిరికి తెగబడ్డారు. వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం శ్రీరామవరం వెళ్లిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరీ నాని, కొందరు టీడీపీ కార్యకర్తలు.. కామిరెడ్డి నానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు రెచ్చిపోయి.. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్!
ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్షీట్పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్షీట్లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది? చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది. స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కోర్టువారు సైతం ఈ అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్షీట్లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్లు, ఛార్జ్షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్హౌస్లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్చుప్! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. సిట్ వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సన్నిధానం క్యాంటీన్ పట్ల TTDకి ఎందుకంత ప్రేమ?: భూమన
కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి, వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాయల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.సాక్షి, తిరుపతి: తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి తరిస్తోంది. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుందని అన్నారాయన. ● అద్దె బకాయిలు - అయినా అడ్డగోలు ఉత్తర్వులునిబంధనల ప్రకారం అద్దె చెల్లించక పోవడంతో టీటీడీ రెవెన్యూ అధికారులు సన్నిధానం క్యాంటీన్ ను 21-12-2024న మూసివేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని 30-12-2024 నాడు సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలని ఉత్తర్యులు జారీ చేసింది. వాస్తవానికి టీటీడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు 26-05-2025 నాటికి రూ.2,85,7,106 నగదు చెల్లించాలి. అందులో నిర్వాహకులు నాలుగు దఫాలుగా కేవలం రూ.1,00,24,400 మాత్రమే చెల్లించారు. అయినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీటీడీ వారికి తలుపులు బార్లా తెరిచి సేవ చేసింది. మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారు. దీనిపై అధికారులు తనిఖీ చేసి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 16-09-2024 నాడు టీటీడీ ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కూడా వీళ్ల ఆక్రమణపై లేఖ రాస్తూ... క్యాంటీన్ నిర్వాహకులు ఆక్రమించిన స్ధలంలో కట్టడాలు చేపట్టిన మాట వాస్తవమే, మేం తనిఖీలు చేసినప్పుడు నిర్మాణం ఆపి మరలా ప్రారంభించారు అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. టీటీడీ లైసెన్స్ నిబంధనలు ప్రకారం రెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆఖరు నెల రెంట్ కట్టకపోతే క్యాంటీన్ మూసివేయాలి. ఈ నిబంధన టీటీడీ ప్రొసీడింగ్స్ లో ఉన్న సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకింత ప్రేమ ?● ప్రభుత్వ పెద్దల ఒత్తిడి- తప్పుడు నివేదిక.. నిబంధనలు పాటించని క్యాంటీన్ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. ఒకవైపు దేవస్థానం భూమి ఆక్రమణలు చేయడమే కాకుండా ఆ స్ధలంలో 15 పెద్ద చెట్లను కూడా తొలగించారు. సన్నిధానం క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ కేవలం నాలుగు అకేషియా చెట్లను మాత్రమే తొలగించారని తప్పుడు నివేదిక ఇచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ రాగానే జనవరిలోనే క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించగా.. టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1, 2025న రీఓపెన్ చేసినట్లు రాసుకున్నారు. ఆ మూడు నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేస్తే వాస్తవాలు కచ్చితంగా బయటపడతాయి. మరోవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులకు కేవలం నెలకు రూ.50వేలు ఫీజు నిర్ణయించింది. అంటే టీటీడీ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే... ఇలా ఫైన్లు వేసి వదిలేస్తే తిరుమలలో ఇంచు స్థలం కూడా మిగలదు. ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. అక్కడితో ఆగకుండా... టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు దాదాపు రూ.2 కోట్ల అద్దె కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు క్యాంటీన్ జనవరి నుంచి నడిచినా కూడా రన్ చేయలేదని చూపిస్తూ... 3 నెలల అద్దెను మినహాయించడం దారుణం. భక్తులకు సేవ చేయాల్సిన చైర్మన్, టీటీడీ బోర్డు ఇలా క్యాంటీన్ నిర్వాహకుల సేవలో మునిగిపోవడం దుర్మార్గం. దీనిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి అక్రమాలపై కచ్చితంగా పోరాటం చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. -
రెచ్చిపోయి కొట్టుకున్న టీడీపీ జనసేన శ్రేణులు
సాక్షి, అన్నమయ్య: గణేష్ నిమజ్జనం సాక్షిగా.. కూటమి పార్టీల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డెక్కి కొట్టుకున్నాయి. దీంతో తీవ్ర గాయాలతో పలువురు ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. పీలేరులో గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి ప్రవర్తించాయి. ఈ క్రమంలో జనసేన వర్గాలతో వాగ్వాదానికి దిగారు. అది ముదిరి రోడ్డునపడి కొట్టుకున్నారు. దీంతో పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కూటమి పార్టీల మధ్య పీలేరుతో ఇలాంటి ఘర్షణలు కొత్తేం కాదు. తాజా ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి! -
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
క్రెడిట్ కొట్టేయగల సమర్థుడు చంద్రబాబు: అంబటి
కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదంటూ శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం. పని చేసేది ఒకరు.. క్రెడిట్ పొందేది మరొకరు. క్రెడిట్ను దొంగిలించగలిగిన సమర్థుడు చంద్రబాబు ఆరితేరారు. కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1989 నుంచి ఆయనే అక్కడ పోటీ చేస్తున్నారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్ నీళ్లు ఇచ్చారు. కానీ, చంద్రబాబు లైనింగ్ పేరిట సీఎం రమేష్ కంపెనీకి అప్పనంగా డబ్బులు ఇచ్చారు.. .. ప్రపంచంలోనే పోలవరం చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికి వదిలేశారు. రెండు కాపర్డ్యామ్లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు. ఆయన చేసిన పనికి అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే. చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన రామా నాయుడా? డ్రామా నాయుడా?. సరైన, సక్రమ పద్దతుల్లో పోలవరం నిర్మాణం జరగడం లేదు. డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. రాక్ తగిలే వరకు డయాఫ్రం వాల్ వేయాలి. కానీ, చంద్రబాబు నాయకత్వంలో 0.9 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆయన అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా వినడం లేదు. పోలవరం ప్రాజెక్టుపై మేం చర్చకు సిద్ధం.. ఇది సవాల్ కాదు చర్చకు రావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా’’ అని అంబటి అన్నారు. -
జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టకు..!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును.. పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై పవన్ కళ్యాణ్ పోస్టర్ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్ కవర్ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అంబేద్కర్ కంటే పవన్ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?.. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
సుగాలి ప్రీతి కేసు లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసులేదు
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని.. ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..:::సిమ్మాదిరప్పన్న -
కావలిలో అడుగు పెట్టి తీరతాం.. బుడ్డ బెదిరింపులకు భయపడం: కాకాణి
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయల్దేరాం. కానీ, కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం.. తలలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ, టీడీపీ బుడ్డ బెదిరింపులకి భయపడేది లేదు. అక్రమాలపై పోరాడతాం. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతను గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపోమాపో కావలిలో అడుగుపెట్టి తీరతాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెడతాం అని కాకాణి అన్నారు.హౌజ్ అరెస్ట్లో ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది. మాపైనే దాడి చేసి.. తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టుతో ఈ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి టోల్ ప్లాజా దాటితే తలలు నరుకుతామని టీడీపీ బెదిరిస్తోంది. ఇప్పుడు పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయిస్తోంది అని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసును నిరసిస్తూ కాకాణి, చంద్రశేఖర్ కావలికి పయనం అయ్యారు. అయితే.. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాను అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపునకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశాలనుసారం వేదాయపాళెం పోలీసులు నోటీసులు జారీ చేయడానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
మీ జాతకాలు నా దగ్గరున్నాయి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ జాతకాలు అన్నీ నా వద్ద ఉన్నాయి. ఎవరెవరు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. పదవి అనేది మనకు సేవ చేసేందుకు లభించిన అవకాశం. కానీ కొంత మంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. కనీసం మనల్ని నిలబెట్టిన కేడర్ను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది సరికాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కూడా ప్రకటిస్తా మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే నా తరహాలో నేను సరిదిద్దాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు విశాఖలో తలపెట్టిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తానని తెలపడంతో పాటు ప్రతీ ఒక్కరి పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక మెకానిజం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని.. వీటిని వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీ తీరు మారకపోతే నేను నా పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా చంద్రబాబు తరహాలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నామని తెలపడంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పడం గమనార్హం. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న సమావేశాల్లో మొదటిరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలే టాప్..!ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిపై భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. మైనింగ్ నుంచి పోస్టింగుల వరకూ.. ప్రతీ పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై నేరుగా కొంత మంది చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కేబినెట్ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిదిద్దుకోవాలని సూచించినట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పూర్తిస్థాయిలో అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మండలానికి ఒకరిని నియమించి వసూళ్లు చేపడుతుండగా.. మరో ఎమ్మెల్యే సోదరుడు మొత్తం పెత్తనమంతా చేస్తున్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే అందినకాడికి దండుకుంటున్నారని కూడా పక్కా సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేపై నేరుగా ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఆయన అల్లుడిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా పవన్ పేర్కొన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలుగురి ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిని వెలిబుచ్చినట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.చంద్రబాబు ఆదేశాలతోనే...!వాస్తవానికి గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమిలోని ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మందలించి పంపుతున్నానని.. బీజేపీ, జనసేన అధ్యక్షులు కూడా వారి ఎమ్మెల్యేలను పిలిచి తప్పులుంటే సరిచేసుకోవాలని చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ పీకారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలకు పనితీరు ఆధారంగా చంద్రబాబు తరహాలో రేటింగ్ కూడా ఇస్తానని చెప్పడం పట్ల జనసేన నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రతీ పార్టీ పనితీరుకు ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మరో పార్టీ స్టైల్ను ఫాలో కావడం మంచిది కాదు. చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆదేశించారంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఈ తరహాలో క్లాస్ పీకడం సరికాదు’ అని సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీ అధినేత నిరంతరం ఈ విధంగా సమావేశం కావడం మంచిదేనని.. కార్యకర్తలు చెప్పే సమస్యలు వింటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
నా వద్దే టోల్ వసూలు చేస్తారా? రెచ్చిపోయిన టీడీపీ నేత
సాక్షి, కర్నూలు: అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నందవరం మండలం హాలహర్వి (NH 167) టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్రెడ్డి దాడికి దిగారు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. టోల్ గేట్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత.. దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ పుటేజ్లో రికార్డయ్యాయి.కాగా, శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం(ఆగస్టు 27) చిలమత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.ప్రెస్మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించారు. -
ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్రెడ్డి
సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు...వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం...రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. -
గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటం పాపం కాదా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కొన్నిసార్లు హిందూత్వవాదిగా, కొన్నిసార్లు లౌకికవాదిగా రంగులు మార్చుతారని.. పీఠాలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చేసి, తాను హిందూవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలోనే తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు.. అలాంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని గట్టిగా నమ్మిన మనిషి వైఎస్ జగన్.. ఆయన వినాయకుని పూజ చేస్తే చంద్రబాబు భయపడి పోయారు. ఆగమేఘాల మీద విజయవాడలో వినాయకుని దర్శనానికి వెళ్లారు’’ అని విష్ణు పేర్కొన్నారు...అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకుని డూండీ వినాయకుని దర్శనానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. దేవుడి చెంత కూడా రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. అందునా విష ప్రచారం చేయటానికి నోరు ఎలా వచ్చింది?. జగన్ హయాంలో వినాయకుని మంటపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్ ని తెచ్చాం. మా విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ మాపైనే విమర్శలు చేస్తున్నారు. రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల మోత ప్రజల మీద వేసి, వినాయక పందిళ్లకు ఫ్రీగా కరెంటు ఇచ్చామంటున్నారు...అసలు ఎన్ని పందిళ్లకు కరెంటు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. చంద్రబాబు వెళ్లిన వినాయక మంటపం నిర్వాహకులు ప్రజల నుండి ఎంత విరాళాలు వసూలు చేశారో చెప్పాలి. 2019-24 మధ్య జగన్ హయాంలో కాణిపాకం ఆలయాన్ని పునర్నిర్మించారు. బంగారు రథాన్ని కూడా జగన్ హయాంలోనే చేశారు. చంద్రబాబు హయాంలో తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగాయి. భక్తులు మరణించారు...తిరుపతిలో జగన్ వకుళమాత ఆలయాన్ని నిర్మాణం చేశారు. హిందూమతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్నో పీఠాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు ఆ పీఠాల భూములను లాక్కున్నారు. విశాఖపట్నంలో ఊరు, పేరులేని కంపెనీలకు వేల ఎకారలను ఇస్తూ, శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
‘చంద్రబాబూ.. మూల్యం చెల్లించుకోక తప్పదు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డితో మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అభూత కల్పనలతో లిక్కర్ స్కాం కేసు తయారు చేశారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో జైలు, బెయిల్తోనే కాలం గడిచిపోయిందని.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే అధికంగా ప్రతిపక్షాలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ జైలు వద్ద పవన్ కళ్యాణ్ వచ్చారు. అప్పుడు జైలు వద్ద పవన్ కళ్యాణ్ మాటలు కోటల దాటాయి. ఇప్పుడు ఆయన గడప కూడా దాటే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జైల్లో మిథున్ రెడ్డిని హింస పెడుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా సెంట్రల్ జైలు వద్ద భారీ గేడ్లు కట్టారు’’ అంటూ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటున్నారు.. మనీ ట్రైల్ ఎలా జరిగిందో 90 రోజులైనా నిరూపించలేకపోయారు. మద్యం డిస్టిలరీలు ఎవరికి ముడుపులు ఇచ్చారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన హెచ్చరించారు. -
అది హిందువుల దురదృష్టం.. BR నాయుడికి భూమన కౌంటర్
తిరుపతి, సాక్షి: అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి మరోసారి నిలదీశారు. గురువారం తిరుపతిలో మీడియాతో భూమన మాట్లాడారు. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు?. అత్యంత విలువైన భూములను ఎందుకు ఇస్తున్నారు?. నా ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. పైగా అడినందుకు బూతులు తిడుతున్నారు. బీఆర్ నాయుడి వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టం అని భూమన అన్నారు. అలాగే తనపై బీఆర్ నాయుడు చేస్తున్న ఆరోపణలపైనా భూమన స్పందించారు. బీఆర్ నాయుడు.. తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్. ఆయనో దోపిడీదారుడు.. పైరవీకారుడు. అలాంటి వ్యక్తి బెదిరింపులకు భయపడం. నాపై చేసే ఆరోపణలకు సీబీఐ విచారణకైనా సిద్ధం. జూబ్లీహిల్స్ సొసైటీలో బీఆర్ నాయుడు అనేక అక్రమాలు చేశారు. అతని అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటాం అని భూమన అన్నారు. ‘‘బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారు. క్విడ్ప్రో కింద బీఆర్ నాయుడికి ఆ పదవి వచ్చింది. ఆ పదవి శాశ్వతం కాదనే విషయం బీఆర్ నాయుడు గుర్తుంచుకోవాలి’’ అని భూమన హెచ్చరించారు. -
చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వికలాంగుల పెన్షన్ కోతపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమేకాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారు. చంద్రబాబూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024, మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వం హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కాని, మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్లకోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరుచేసి, 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం. కాని, మీరు వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారికి వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు..@ncbn గారూ… మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్… pic.twitter.com/VUKFqePO92— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025..చంద్రబాబూ.. ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఈ గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాలకోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా? వీటి పరిస్థితి ఇది అయితే, ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతిపెద్దమోసం. ఇది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ!’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
తమలపాకుతో కొట్టినట్లు.. నెమలీకతో మొట్టినట్లు..!
మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు.. సెలబ్రిటీలతో ఫొటోలతో కాలం గడుపుతూ ఉంటారు.. ఇటు ఎమ్మెల్యేలు దాదాపుగా తమ నియోజకవర్గాలకు సీఎంలుగా భావించుకుంటూ ఏకంగా నియంతలుగా మరి చెలరేగిపోతుంటారు.. ఇది పలుసందర్భాల్లో రుజువైంది.ఇలా ఎమ్మెల్యేలు కట్టుతప్పి మీడియాకు.. ప్రతిపక్షాలకు వార్తంశంగా మారిన ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు సీరియస్ గెటప్ వేస్తారు. వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ అందరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలు భయ పడతారు. సొంత పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో చంద్ర నిప్పులు అంటూ కథనాలు వస్తాయి.. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక మళ్ళీ అందరూ ఎవరి స్టయిల్లో వాళ్ళు జనం మీద స్వారీ చేస్తారు.. మళ్ళీ బాబుగారు ఆగ్రహం నటిస్తారు.. తమలపాకుతో తీవ్రంగా కొడతారు.. నెమలీకలతో మొట్టికాయలు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆ దెబ్బలకు తాళలేక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ కుయ్యో మొర్రో.. ఇక ముందు మేం తప్పులు చేయం అని ఎటెన్షన్ లోకి వస్తారు.. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా తనకుతాను మహరాజులా.. నియోజకవర్గానికి సర్వాంతర్యామిలా మారిపోయి అధికారం చెలాయిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెలు ఆదిమూలం , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వంటివాళ్ళు మహిళలను వేధించే పనుల్లో బిజీ అయ్యారు. వారిమీద సొంతపార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందికి రాత్రిపూట ఫోన్లు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయన దెబ్బకు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించారు.ఇక నిన్నగాక మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే తగిన మత్తులో ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ సిబ్బందిని తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టినా అయన చప్పుడు చేయలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించగా ఆ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇక ఎచ్చెర్ల జనసేన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర రావు అయితే నియోజనవర్గంలోని ఏ వ్యాపార సంస్థనూ వదలడం లేదు.. నెలవారీ మామూళ్లు ఇవ్వకుంటే వ్యాపారాలు నడవదు అని బహిరంగ వార్ణింగ్ ఇస్తున్నారు. జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు నడవాలంటే నా కనుసన్నల్లో ఉండాలి అంటూ చెలరేపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపేవాళ్లు లేకపోతున్నారు.నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీయార్ మీద ఇష్టానుసారం మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అభిమానులు హైద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టింది. మరోవైపు ఈ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించాలని చినబాబు లోకేష్ నిర్ణయించారట.ఏకంగా చంద్రబాబు వార్నింగులనే పట్టించుకోని ఈ ముదురు ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రిని లెక్క చేస్తారా? ఆయన మాకన్నా ఏం ఎక్కువ.. అయన చెబితే మేం వినాలా.. అసలు మా జిల్లాలో పక్కజిల్లా మంత్రి పెత్తనం ఏమిటన్న ఉక్రోషంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రి మాటలు ఖాతరు చేస్తారా అని పార్టీ ఇన్సైడర్ టాక్ నడుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కోకిలపూడి శ్రీనివాస్ కూడా గెలిచింది మొదటి సారి కానీ బండెడు ఆరోపణలు.. పుట్టెడు వివాదాలతో తులతూగుతున్నారు.ఇక పరిస్థితి చేయిదాటిపోతుంది జనంలో పార్టీ, ప్రభుత్వం పరువుపోతుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు సీరియస్ అవుతుంటారు.. ఇలా ఐతే ఉపేక్షించను.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను.. ఈ విషయంలో ఎవర్నీ క్షమించేది లేదని హెచ్చరిస్తారు.. కాదు కాదు.. హెచ్చరించినట్లు కలరింగ్ ఇస్తారు.. ఇటు ఎమ్మెల్యేలు కూడా బెదిరిపోయినట్లు నటిస్తారు.. అందరూ చాయ్ తాగి సమోసాలు తిని భుజమ్మీద చేతులు వేసుకుంటూ బయటకు వస్తారు.. మళ్లీయే ఎవరి దందాలు వాళ్ళవి. ఇలా ఉంటుంది బాబుగారి ఆగ్రహం.-సిమ్మాదిరప్పన్న -
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్పై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్గా ఉన్నాడు...వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్ను చంపినట్టే వెంకట ప్రసాద్ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు. -
ప్రశ్నించడమంటే ఇదేనా పవనూ: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుడ్డా రాజశేఖరరెడ్డ పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీశాఖ అధికారుపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు’’ అంటూ మాధవ్ మండిపడ్డారు.ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పని చేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను దూషిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు.బుడ్డా రాజశేఖరరెడ్డిని అరెస్టు కూడా చేయలేదు. పైగా తూతూమంత్రపు కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలు తప్ప అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ పదవి కి రాజీనామా చేయాలి. పోలీసులపై దాడి జరుగుతుంటే పోలీసు సంఘం ఏం చేస్తుంది?. ఇంతవరకు కనీసం నోరెత్తి ఎందుకు ప్రశ్నించలేదు. బుడ్డా రాజశేఖరరెడ్డి దౌర్జన్యాలకు చంద్రబాబు అవార్డు ఇస్తాడేమో?’’ అంటూ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు. -
పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతేంటి?
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం.. .. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు. అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఈ సందులో తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. -
అనితమ్మా.. ముందు ముందు చాలా ఉంది!
కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య అక్కడక్కడా విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతుండడం తెలిసిందే. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసేన నేతల నుంచి వార్నింగ్ రావడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.సాక్షి, అనకాపల్లి: కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య ఏపీలో పలు నియోజకవర్గాల్లో విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసైనికులు వార్నింగ్ ఇచ్చారు.పాయకరావుపేటలో అధికార పార్టీల మధ్య ప్రోటోకాల్ చిచ్చు రాజుకుంది. హోంమంత్రి అనిత తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫ్లెక్సీలో జనసేన ఇన్చార్జి గెడ్డం బుజ్జి ఫోటో లేకపోవడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అనితకు టార్గెట్ చేస్తూ నిన్నటి నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. ‘‘అనితమ్మా.. ఈరోజుతో అయిపోయిందనుకుంటే అది మీ భ్రమ. ఇది అలా అయిపోయేది కాదు. ముందు ముందు చాలా ఎన్నికలు ఉన్నాయి’’ అంటూ వార్నింగ్ పోస్టులు చేస్తున్నారు. అదే సమయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ కొందరు నేతలు బహిరంగంగానే అనితకు సూచిస్తున్నారు. పాయకరావుపేట సీటును అనితకు గెడ్డం బుజ్జి త్యాగం చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.కూటమి అధికారం చేపట్టాక చాలా చోట్ల టీడీపీ వాళ్ల ఆధిపత్యమే కొనసాగడాన్ని జనసైనికులు భరించలేకపోతున్నారు. ఒక్క పాయకరావుపేటలోనే కాదు.. చాలాచోట్ల టీడీపీ జనసేనల మధ్య ఇలాంటి వైరమే కొనసాగుతోంది. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు.
-
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకోండి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు.48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయం.. ఎమ్మెల్యే దగ్గుపాటికి పట్టుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు.అనంతపురంలో ఉద్రిక్తత..ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ.. ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘నాకు లేని ల్యాప్టాప్ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్క్లబ్లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదునాకు ల్యాప్టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాంటీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతిమద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టుషాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు -
‘చంద్రబాబు కుట్ర.. దివ్యాంగుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. -
జనాలకు అర్థమైంది..? ఏపీలో సాక్షి టీవీ కోసం డిమాండ్స్
-
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఈ వింగ్లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి...చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు. -
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్రెడ్డి హెచ్చరించారు. -
‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్లు తొలగించారని, వచ్చెనెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్లను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తికట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత పేదరికంలో ఉండి వయస్సు మీరిపోయి, పనులు చేసుకోలేని వృద్ధులకు ఒక కొడుకులా అండగా నిలబడేందుకు ప్రతినెలా సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లను అందించారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పెన్షన్లను కొనసాగించాయి.వైఎస్ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు:వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందాయి. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెన్షన్లను పెంచుతామని, దివ్యాంగులకు కేటగిరిల వారీగా రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇస్తామని, కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏడాది కాలంలోనే పెన్షన్ల సంఖ్యను 62.19 లక్షలకు కుదించుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలల్లో దాదాపు 4.15 లక్షల పెన్షన్లను తొలగించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లలో కూడా భారీగా కోత పెడుతూ వస్తున్నారు. పదేళ్ళ నుంచి పెన్షన్లు పొందుతున్న వారిని కూడా వివిధ కారణాలను చూపుతూ వారిని తొలగించారు. దివ్యాంగుల పైన కూడా ఇదే విధంగా కక్షసాధింపులు ప్రారంభమయ్యాయి.రీ వెరిఫికేషన్ పేరుతో, సదరం క్యాంప్ల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకుంటేనే పెన్షన్లు ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ హయాంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతూ ఉంటే, వారిలో సుమారు 2 లక్షల మందిని తొలగించేందుకు సిద్దయయ్యారు. వచ్చేనెల నుంచి వీరికి పెన్షన్లను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా వారి వైకల్యం శాతంను తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న వత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రత్యేక హెలికాఫ్టర్లతో వెళ్ళి, భారీ బందోబస్త్, పెద్ద ఎత్తున ప్రచారం కోసం ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న ఖర్చును వృద్దులు, దివ్యాంగుల కోసం చేస్తే భారం తగ్గదా..?చంద్రబాబు దుర్మార్గాలపై పోరాడతాం:అనంతపురం జిల్లాలోనే ఏడాది కాలంలో 19 వేల మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు తాజాగా దివ్యాంగులను 9601 పెన్షన్లను ఈ నెలలో తొలగించారు. వీరినే కాకుండా 2314 మందిని దివ్యాంగుల కోటా వర్తించదు కాబట్టి, వారిని వృద్దాప్య పెన్షన్ల కింద మార్పు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇంత అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. అనంతపురం మున్సిపల కార్పోరేషన్లో 23వేల మందికి పైగా ఉంటే తాజాగా 1008 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు విశ్వాసఘాతకంగా చేస్తున్న పని.ఎన్నికల ముందు దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమ చూపించి, వారి పక్షాన నిలబడతామని నమ్మించి, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నంకు ఒక దివ్యాంగుడు ప్రయత్నించాడు. పెన్షన్లు తీసేస్తే ఎలా బతకాలని దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. తమ దుర్మార్గంపై దివ్యాంగులు పోరాటం చేయలేరనే ధీమాతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వారి పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాంగుల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాలను దిగ్భందం చేస్తాం.టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు.మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నాలుగైదేళ్ళ కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. -
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు. ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే.. శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్లో బంధించి వేధించాడు. ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్కు కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
‘బీఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు’
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. -
ఏపీ కేబినెట్ భేటీలో.. టీడీపీ ఎమ్మెల్యేల బూతులపై చర్చ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నోట.. మళ్లీ అదే మాట. సొంత ఎమ్మెల్యేలు తప్పుడు పనులకు, అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా అంగీకరించారు. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల అలసత్వంతో పాటు ఎమ్మెల్యేల అరాచకాలపైనా చర్చ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో ఎవరో ఒకరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదే పదే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా.. కేబినెట్ భేటీలో మునుపెన్నడూ లేని రీతిలో అరుదైన చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతోపాటు ఉద్యోగులపై దాడులు చేసిన ఘటనలపైనా హీటెక్కింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జరిగినవి.. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై వేధింపులకు దిగగా.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో క్లిప్ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్లే కాదు.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో వేధింపులు భరించలేక టీడీపీకే చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్, బండారు శ్రావణి, ఇలా మరికొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ‘‘ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారు?. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసింది ఎవరైనా ఇక మీదట చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో.. అదేసమయంలో.. మంత్రుల పెరఫార్మెన్సుపైనా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. వాళ్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఫైల్స్ క్లీయరెన్సులో ఘోరంగా వెనకబడ్డారని అధికారులు తేల్చారు. దీంతో ఒక్కో ఫైల్ కు సరాసరిని ఒక్కో మంత్రి ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలి.. నిర్ణిత సమయంలో ఫైల్స్ క్లియర్ కావాలి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
సుపరిపాలన అంటే స్కామ్లు, దాడులేనా?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: సుపరిపాలన అంటే స్కాంలు, దళితుల మీద దాడులు చేయటమా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం, ఇసుకలో దోపిడీ చేయటమే సుపరిపాలనా? సాక్షాత్తు ఎమ్మెల్యేలే అధికారులను కిడ్నాప్ చేస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషించిన ఎమ్మెల్యేకి చంద్రబాబు వత్తాసు పలికారు. ఇదేనా సుపరిపాలన అంటే?. ప్రణాళికాబద్దంగా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరగిందేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దారుణంగా దూషిస్తే కనీస చర్యల్లేవు. కూన రవికుమార్ ఒక మహిళా ప్రొఫెసర్ని వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘మంత్రి అచ్చెన్నాయుడు వేధింపులకు ఆగ్రోస్ అధికారి సెలవుపై వెళ్లిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఎమ్మెల్యేలు, మంత్రుల నీతి మాలిన చర్యల వెనుక చంద్రబాబు ఆమోదం ఉంది. భూ కుంభకోణాల గురించి జనం చర్చించుకుంటున్నారని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాయలసీమకు తాగునీరు రాకపోతున్నా పట్టించుకోరా?. దెందులూరులో మా పార్టీ నేత పామాయిల్ తోటలోకి టీడీపీ గూండాలు చొరపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడలను ఇకనైనా ఆపండి’’ అంటూ శైలజానాథ్ హెచ్చరించారు.‘‘రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వటం వెనుక హోంశాఖ ఉండటం దుర్మార్గం. ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. అరుణ సెల్ఫీ వీడియోకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఇస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు. -
టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్ వేదిక వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.Third-Rate… Vulgar LeadersIn just the last few days, the Telugu Desam Party (TDP) has been rocked by a string of scandals involving its ministers and MLAs, raising serious questions about the government’s credibility and governance. The controversies range from brazen attacks…— YSR Congress Party (@YSRCParty) August 20, 2025..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది. -
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జైళ్లు అడ్డంకి కాదు.. సోమిరెడ్డి దోపిడీని అడ్డుకుంటాం: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదు. నెల్లూరు జిల్లా ప్రజలే నా ఆస్తి. మాజీ మంత్రి(నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి) ఇంటిపై దాడి దుర్మార్గం. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం’’ అని కాకాణి అన్నారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా.. కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు పెట్టిందని వైఎస్సార్సీపీ అంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాణి జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా.. ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు.