breaking news
TDP
-
ఆ ఆదాయం ఎక్కడికి పోతోంది.. వైఎస్సార్సీపీ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైఎస్సార్సీపీ ఆశ్చర్య వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, పర్మిట్ రూముల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గటంపై మండిపడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందంటూ ట్వీట్ చేసింది.ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో అనేక మార్పులు చేసింది. మద్యం షాపులను తమవారి చేతిలో పెట్టారు. మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. పర్మిట్ రూమ్లను మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వలన సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ పేర్కొంది.ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో కూడా సహజంగా 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ అన్ని మార్పులు చేసినా ఆదాయ వృద్ధి తగ్గటం ఆశ్చర్యమేస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు విపరీతమైన నష్టం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వలనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.With respect to excise revenues, the @JaiTDP alliance Government, privatized retail operations of liquor, increased number of shops, encouraged illegal belt shops and reintroduced illegal permit rooms. All these policy changes should have resulted in huge increase in liquor… pic.twitter.com/A3aKO0eysQ— YSR Congress Party (@YSRCParty) September 17, 2025 -
టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలి
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలైయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతదిగా గుర్తించారు. అప్పారావు పాలెం రీచ్ నుంచి నెల్లూరుకు రోజూ ట్రిప్పులు వేస్తున్నారు. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడికి చెందిన టిప్పర్గా సమాచారం. ఇసుక టిప్పర్.. రాంగ్ రూట్లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.కారు నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండున్నర గంటలపైగా శ్రమించారు. మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్, గుర్రం వారి వీధికి చెందిన తాళ్లూరు రాధ(38), శ్రీనివాసులు (40), సారమ్మ(40), వెంగయ్య(45), లక్ష్మి(30), డ్రైవర్గా పోలీసులు గుర్తించారు.ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు‘‘అసలు మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు, జగన్లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్ డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు. -
టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రూ.6,400 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచింది. దీంతో వేలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు. ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్æ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని కారణం చూపి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్ కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మెరిట్ను ఎలా విస్మరిస్తారు?
-
గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ఇచ్చినా మిమ్మల్ని తొలగించం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. వేతనాలు పెంచుతాం.. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తాం..’ ఇవీ కూటమి ప్రభుత్వం గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు ఇచ్చిన హామీలు. వీటిని సైతం కూటమి సర్కార్ చెత్త బుట్టలో పడేసి.. గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల బతుకులకు భరోసా లేకుండా చేసింది. అడవి బిడ్డలకు అక్షర వెలుగులు పంచుతున్న వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వారిని బయటకు పంపేస్తోంది. కూటమి ప్రభుత్వ దగాతో 1,143 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారబోతోంది. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది ఔట్సోర్సింగ్ విధానంలో 10 నుంచి 18 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా మార్చి.. ఉద్యోగ భద్రతకల్పించాలని కోరగా.. వాటిని నెరవేరుస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. దీంతో గతేడాది నవంబర్లో 45 రోజులపాటు ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో 1,143 గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్ల పోస్టులు చూపించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తాము అన్యాయమైపోతామంటూ ధర్నాలు చేశారు.ఈ నేపథ్యంలో వారితో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తామని నమ్మబలికి సమ్మె విరమింపజేశారు. అవే విషయాలను అసెంబ్లీలో సైతం మంత్రి సంధ్యారాణి స్పష్టంగా ప్రకటించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. వారిని తొలగించవద్దని ఆదేశాలివ్వగా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2026 వరకు వారిని కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది. మీరంతా బయటకు వెళ్లిపోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.మరీ ఇంత దారుణమా?డీఎస్సీలో పోస్టులు పేర్కొన్నప్పటికీ.. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తాన్న హామీ ఏమైందని గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు, లెక్చరర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు. మీ ఉద్యోగాలు తొలగించబోమని పదే పదే చెప్పిన ప్రభుత్వం.. 1,143 మందిని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో పోస్టులు భర్తీ అవుతున్నాయని.. ఇక మీరు బయటకు వెళ్లిపోవాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారని వాపోయారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శనఫీజు బకాయి చెల్లించకపోతే టీసీఇవ్వలేమన్న ఎస్వీ ఆర్ట్ కాలేజ్ అధికారులుతిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, హాస్టల్ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువీకరణపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్íÙప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
ఆది నుంచి దగా
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్ను పట్టించుకోకుండా అన్యాయం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధాన్యం మెలిక పెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్ 12న తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా, ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. రెండు రోజుల క్రితం ఫలితాలు ప్రకటించే దాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి.తప్పుడు లెక్కలు.. భర్తీ ప్రక్రియలో సాగదీతలు⇒ ‘మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యా శాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్లో 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు.⇒ గతేడాది డిసెంబర్ నాటికే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో ఆందోళన⇒ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. ఇలా కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.⇒ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది.ప్రశ్నల్లో తప్పులున్నాసరిచేయకుండానే ఎంపిక⇒ డీఎస్సీ ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యా శాఖ సరిచేయలేదు. అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించినా రెస్పాన్స్ షీట్లలో జవాబులు గుర్తించినట్టు లేకపోవడంతో ఖంగుతిన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 60 నుంచి 20 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా నమోదైంది.⇒ అభ్యర్థులు గుర్తించిన జవాబుకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్)తో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రకటించిన ఫైనల్ ‘కీ’లో అనేక లోపాలను అభ్యర్థులు గుర్తించారు. వాటికి ఆధారాలను సైతం విద్యా శాఖకు పంపించారు. కానీ ఆయా అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియలేదు.⇒ ఆపై మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సరి్టఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం.కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’⇒ ఒకే కేటగిరీకి చెందిన వారిలో వెనక ఉన్న వారికి తొలుత లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం.⇒ ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అంటున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు⇒ డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సరి్టఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు.⇒ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు.⇒ దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కల్పోయారు. ఇలా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అడుగడుగునా కుట్ర పూరితంగానే వ్యవహరించింది.⇒ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీపై 104 వరకు కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నప్పటికీ, అర్హత సాధించాక నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సోమవారం హడావుడిగా తుది ఫలితాలను ప్రకటించేసింది. ఆపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లగా చుక్కెదురైంది. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రతి దశలోనూ కుట్ర పూరితంగానే వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
సీఎం సార్.. ఇదిగో ప్రూఫ్ జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు
-
కర్నూలు: ఉల్లి రైతు కంట కన్నీరు
సాక్షి, కర్నూలు: జిల్లాలో రైతులకు ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. పత్తికొండ రూరల్లో పులికొండ రైతు పొలాన్ని దున్నేశారు. టమోటా, ఉల్లి పంటలు తమ కొంప ముంచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానికులు ఉల్లి దోపిడీ చేస్తున్నారు. మార్కెట్లోనే రైతులు ఉల్లినివదిలేసి వెళ్తున్నారు. రైతులు వదిలేసి వెళ్లిన ఉల్లిని స్థానికులు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. బైకులపై ఆటోలలో ఉల్లిగడ్డ మూటలను స్థానికులు ఎత్తుకెళ్తున్నారు.పత్తికొండ టమోటా మార్కెట్ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు టమోటాకు ధర లేక రైతులు బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని శ్రీదేవి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విత్తనం నుండి విక్రయం దాకా రైతాంగానికి అండగా జగనన్న ఉండేవారని.. రైతులు టమోటాలను రోడ్డుపై పారవేస్తున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గాని స్పందించిన దాఖలాలు లేవంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా టమోటాకు గిట్టు బాటుధర కల్పించాలని శ్రీదేవి డిమాండ్ చేశారు.రైతుల ఆవేదనను పట్టించుకోకుండా గిట్టుబాటు ధర ప్రకటించడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మితే కోత ఖర్చులు కూడా రావంటూ పొలాన్ని రైతులు దున్నేస్తున్నారు. 1200 గిట్టుబాటు ధర సరిపోదంటూ మరింత నష్టాల్లో కూరుకుపోకుండా పత్తికొండ రైతులు.. పంటను దున్నేస్తున్నారు. కనీసం 2500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని కొనుగోలు చేయాలని రైతలు డిమాండ్ చేస్తున్నారు. పొలంలో ఉల్లి పంటలు దున్నివేస్తున్న రైతులను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. కంగాటి శ్రీదేవితో రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు. -
లేని లిక్కర్ స్కాంలో సిట్ భేతాళ కథలు: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని.. ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్మీద ఉన్నారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీని అణచాలని చూడటం దుర్మార్గం. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు.. నవ్వుతున్నారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని అంబటి హితవు పలికారు.‘‘లేని లిక్కర్ స్కాంలో సిట్ ఇంకా భేతాళ కథలే అల్లుతోంది. వైఎస్ జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్టు చేయటమే లక్ష్యంగా సిట్ పని చేస్తోంది. ఒక దురుద్దేశంతో నడుపుతున్న కథే లిక్కర్ స్కాం. కట్టుకథల ఛార్జిషీట్ను కోర్టు కూడా వెనక్కు పంపినా సిట్కు బుద్ధి రాలేదు. జగన్ వెంట ఉంటున్నాడని చెవిరెడ్డి, ఆయన కుమారుడిని వేధిస్తున్నారు. చెవిరెడ్డి కుటుంబం విపరీతమైన దైవభక్తి ఉన్న కుటుంబం. ప్రభుత్వానికి టాక్స్లు కడుతూ వ్యాపారాలు చేసినా సిట్ తప్పుపడుతోంది..భూములు కొన్నా, అమ్మినా కూడా స్కాం అని ఎల్లోమీడియా రాస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలతోనే ఛార్జిషీట్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఉండటం లేదు. రూ.11 కోట్ల విషయంలో కోర్టుకు సిట్ దొరికిపోయారు. తప్పుడు కథలు చెప్తే కోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ నీళ్లు నమిలింది. ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పుడు ఇక మధ్యవర్తుల పాత్ర ఎలా ఉంటుంది?. అసలైన లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం..ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలపడతాం. ఎంత అణచివేయాలని చూస్తే అంతగా పైకి ఎదుగుతాం. సరైన ఆధారాలు చూపే శక్తి సిట్కు లేదు. అసలు స్కామే జరగనప్పుడు ఇక ఆధారాలు ఎలా ఉంటాయి?. ప్రజలను నమ్మించాలనుకుంటే అది జరగదు. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. పర్మినెంటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ని ఈ మూడేళ్లలో కట్టగలరా?. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతారా?. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అమ్మేస్తారా?. కులాల మధ్య చిచ్చు పెట్టటం జనసేనకే అలవాటు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తోంది?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. -
‘విజయవాడ ఉత్సవ్’ స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,వియవాడ: ‘విజయవాడ ఉత్సవ్’ స్థలవివాదంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాలకు దేవాదాయ భూమి ఇవ్వొద్దని సూచించింది.గొల్లపూడిలోని 40 ఎకరాల ఆలయ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయ భూమిని వాణిజ్యంగా ఎలా ఉపయోగిస్తారంటూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.గొల్లపూడిలో దేవాదాయశాఖ భూమిని వినియోగించొద్దని, గోల్ఫ్ కోర్సుకు ఐదెకరాల కేటాయింపు ప్రతిపాదన పై స్టే విధించింది. దీంతోపాటు తాత్కాలిక ఉత్సవాలు కేటాయింపు పైనా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములను యధాతధంగా ఉంచాలని హైకోర్టు వెల్లడించించింది. -
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా టీడీపీ నేతల బాగోతాన్ని ఎండగట్టారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సీఐడీతో విచారణ చేయించగలరా? అంటూ ప్రశ్నించారు‘‘2024 ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తుల విలువ రెండు కోట్లు. కొల్లు రవీంద్ర కోటి రూపాయలు చందా ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం కోటి చందా ఇచ్చే స్తోమత ఉందా మీకు. వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా?. వీకెండ్కు హైదరాబాద్, రెండు నెలలకోసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా?. దుబాయ్కి వెళ్లిన పాస్ పోర్టు, వీసా చూపించే దమ్ముందా?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘మచిలీపట్నంలో డిఫ్యాక్టో మంత్రి, ఎమ్మెల్యే.. టీడీపీ నేత గోపిచంద్. గొర్రిపాటి గోపీచంద్ తెర వెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నాడు. గొర్రిపాటి గోపీచంద్ బందర్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. బైపాస్లో దేవుడి ఆస్తి కాజేశానని నాపై విష ప్రచారం చేస్తున్నారు. 2006లో ఆక్షన్లో గోపీచంద్, అతని భార్య పాల్గొన్నారా? లేదా?. గోపీచంద్ భార్య రాజేశ్వరి పేరుతో చలానా కట్టారా.. లేదా?.’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
కొల్లు రవీంద్ర, పట్టాభి బండారం బయటపెట్టిన పేర్ని నాని
-
పార్టీ మారలేదని YSRCP నేతపై చింతమనేని దౌర్జన్యం..
-
నిమ్మల రామానాయుడికి తెలుగు తమ్ముళ్ల ఝలక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గంలో కేడర్ నుంచి లీడర్ వరకు తానేనంటూ.. తక్కువ పనితో ఎక్కువ పబ్లిసిటీతో నిత్యం ఫోకస్లో ఉండే మంత్రి తీరుపై తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నారు. నియోజకవర్గంలో భవిష్యత్లో కూడా తనకు పోటీగా ఎవరూ ఉండకూడదని.. దానికనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కీలక నామినేటెడ్ పదవులు తన నియోజకవర్గంలో దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. తెరమీద పదవులు ఇవ్వాలి కాబట్టి డైరెక్టర్ పదవులతో మమా అనిపించడంతో తిరుగుబాటు మొదలైంది. పదేళ్లు మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అంగర రామ్మోహనరావును జలవనరుల శాఖ బోర్డు డైరెక్టర్గా నియమించడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తాను పదవి తీసుకోలేనంటూ చంద్రబాబుకే లేఖ రాశారు. ఇదే రీతిలో నామినేటెడ్ పదవులు పొందిన మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా తమకు ఈ పదవులు వద్దని బహిరంగంగా ప్రకటించడం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు రాజకీయ ఎత్తుగడలకు టీడీపీ కేడర్ చెక్పెడుతోంది. బీసీ సామాజిక వర్గంలో పట్టు ఉన్న అంగర రామ్మోహనరావు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో పాలకొల్లు ఎంపీపీగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో పాలకొల్లు ఎంపీపీగా, రెండు పర్యాయాలు మండలి సభ్యుడిగా ఉన్నారు. మండలి విప్గా, లెజిస్టేటివ్ లైబ్రరీ చైర్మన్గా పనిచేశారు. పార్టీ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక కార్యక్రమాలు నిర్వహించానని రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడి పదవి తాను స్వీకరించలేకపోతున్నానని ముఖ్యమంత్రికి లేఖ రాయడం తీవ్ర కలకలం రేపింది. వాస్తవానికి అంగర ప్రభుత్వంలో కీలక పదవి లేదా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే నియోజకవర్గంలో మంత్రిగా నిమ్మల రామానాయుడు ఉన్నారు. రాజకీయంగా అంగర పాలకొల్లులో సీనియర్. అలాంటిది జూనియర్ నేత మంత్రిగా ఉన్న శాఖలో చైర్మన్ కాకుండా డైరెక్టర్ పదవితో అవమానించారనేది రామ్మోహనరావు ఆవేదన. దీంతో గత వారం లేఖ ద్వారా అసంతృప్తిని తెలియజేశారు. అంగర బాటలో మరో ఇద్దరు మొత్తంగా పాలకొల్లు నియోజకవర్గానికి ఇటీవల మూడు నామినేటెడ్ పదవులు దక్కాయి. విచిత్రమేమిటంటే ఒక్క రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కిన నేత ఈ నియోజకవర్గంలో లేకపోవడం గమనార్హం. పారీ్టలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నా ఎంతటి ట్రాక్ రికార్డు ఉన్నా ఈ నియోజకవర్గంలో డైరెక్టర్ పదవే ఫైనల్. ఈ క్రమంలో ఇటీవల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గొట్టుముక్కల సూర్యనారాయణరాజును నియమించారు. ఆయన కూడా ఈ పదవి అక్కర్లేదని తేల్చి చెప్పారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కడలి గోపాలరావు గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పారీ్టలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టపెట్టారు. గోపాలరావు తనకు ఈ పదవి వద్దంటూ సోషల్ మీడియావేదికగా ప్రకటించారు. మొత్తం మీద ముగ్గురు నేతలు మూడు డైరెక్టర్ల పదవులు తిరస్కరించడం టీడీపీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి నిమ్మల వ్యవహారంపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. -
మీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయండి.. అనిత, సవితపై షర్మిల రెడ్డి ఫైర్
-
వక్ఫ్ భూమికి ఎసరు!
సాక్షి ప్రతినిధి కర్నూలు: అధికారం ఉండగానే వీలైనంతగా దండుకోవాలన్నట్లుగా ఉంది టీడీపీ నేతల తీరు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారు. కర్నూలు జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసేందుకు పచ్చబ్యాచ్ పావులు కదుపుతుంటే, నంద్యాల జిల్లా బనగానపల్లిలో అయితే ఏకంగా వక్ఫ్బోర్డు స్థలానికే ఎసరు పెట్టేశారు. మంత్రి బీసీ జనార్థన్రెడ్డి కనుసన్నల్లోనే ఈ బాగోతం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్లకు పైగా విలువైన స్థలం కబ్జా చేయడం ఇప్పుడు పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది. బనగానపల్లె పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాల్వ) పక్కన సర్వే నెంబర్ 132లో 12.66 ఎకరాలు ఉంది. సర్వే నంబర్ 132/2బీలో 5.11 ఎకరాలు, 132/3లో 4.30 ఎకరాలు, 132/2లో 3.24 ఎకరాలు ఉంది. ఇందులో కొంత ఎస్ఆర్బీసీకి వినియోగించారు. అయితే, సర్వే నంబర్ 132/3లోని 4.30 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇందులో కంపచెట్లు ఉన్నాయి. ఈ స్థలంపై టీడీపీ నేతల కన్నుపడింది. మూడ్రోజులుగా అక్కడ కంపచెట్లను జేసీబీలతో తొలగించి స్థలాన్ని చదును చేస్తున్నారు. గ్రావెల్ తోలి దాన్ని కబ్జా చేస్తున్నారు. ఇలా కంపచెట్లు తొలగించి, చదును చేసి ఆక్రమించిన స్థలం 75 సెంట్లు ఉంటుందని సమాచారం.అధికారంతో అప్పనంగా కొట్టేయాలని.. మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్న ఈ స్థలం సర్వే నంబర్ను రిజి్రస్టేషన్ శాఖలో విచారిస్తే అది వక్ఫ్ బోర్డు స్థలంగా తేలింది. రిజిస్ట్రేషన్ శాఖలో పైన పేర్కొన్న మూడు సర్వే నంబర్లలోని 12.66 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది. ఈ క్రమంలో వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఎలాంటి లీజుకు తీసుకోకుండా కబ్జాచేయడం చూస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పనంగా కొట్టేయాలన్న కుట్ర కన్పిస్తోంది. స్థలం విలువ రూ.10 కోట్లుపైనేఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ ప్రాంతంలో సెంటు స్థలం విలువ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఉంది. రూ.15 లక్షలు చొప్పున లెక్కించినా కబ్జా చేస్తున్న 75 సెంట్ల స్థలం విలువ రూ. 11.25 కోట్లు ఉంది. ఈ కబ్జా 75 సెంట్లతోనే ఆగుతారా? లేదా విడతల వారీగా మొత్తం 4.30 ఎకరాలు స్వాహాచేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ మొత్తం 4.30 ఎకరాలు హస్తగతం చేసుకుంటే రూ.64 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కాజేసినట్లే. ఈ స్థలాన్ని మంత్రి బీసీ జనార్థన్రెడ్డి అనుచరులు చదునుచేసి అభివృద్ధి చేస్తున్నారు. అయితే, అనుచరులు కాదు.. మంత్రే కబ్జా చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి.. వక్ఫ్ బోర్డు భూములు, స్థలాలను ముస్లిం మైనార్టీల అవసరాలకు మాత్రమే వినియోగించాలి, కానీ, అసలు వక్ఫ్ బోర్డుకు సంబంధంలేకుండా, వారి అనుమతిలేకుండా కబ్జా చేయడం చూస్తే బీసీ గ్యాంగ్ ఏ స్థాయిలో అరాచకం చేస్తోందనేది స్పష్టమవుతోంది.మా దృష్టికి వచ్చింది, ఫిర్యాదు చేశాం బనగానపల్లిలో వక్ఫ్ బోర్డు స్థలంలో ముళ్లపొదలు తొలగించి కబ్జా చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచి్చంది. మొత్తం 4.30 ఎకరాల వక్ఫ్ స్థలం ఉంది. ఈ కబ్జాపై బనగానపల్లి తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై చర్యలు తీసుకుంటాం. – ఇమ్రాన్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ -
AP: మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఔట్!
సాక్షి, అమరావతి: అటు కేంద్రంలోనూ అధికారంలో కొనసాగుతూ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి.. రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెళ్లగొట్టేలా వ్యవహరిస్తుండటంపై పారిశ్రామిక వర్గాల్లో విభ్రాంతి వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూతపడుతున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది. కీలకమైన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో, మిధానీ కలసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ స్థాపించేలా వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. పలు కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ విషయం నాల్కో స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే మంగళం పలకబోతున్నారని, రా్ష్ట్రం నుంచి ఒక భారీ ప్రాజెక్టును తరిమేస్తున్నారని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కూటమి నేతలు దీనిపై నోరు విప్పక పోవడం పట్ల ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు చేజారిపోతున్నా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలపైనే మోజు.. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలపై ఉన్న మోజు ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండదని పలు సందర్భాల్లో రుజువైంది. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నా నోరు తెరవడం లేదు. పైగా ఈ యూనిట్ మూసివేతకు సహకరించే విధంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో అనకాపల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయిస్తూ దానికి సొంత ఇనుప గనులు కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా కేంద్రాన్ని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడి చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 600 ఎకరాల్లో ఎనీ్టపీసీ, బీహెచ్ఈఎల్తో రూ.6,000 కోట్లతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ను తీసుకురాగా విభజన అనంతరం టీడీపీ హయాంలో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. శరవేగంగా అన్ని అనుమతులు..నెల్లూరులో హైఎండ్ అల్యూమినియం కంపెనీ ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేసింది. నాల్కో, మిధానీ కలసి 2019 ఆగస్టులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ (యూఏడీఎన్ఎల్) పేరిట భాగస్వామ్య కంపెనీనీ ఏర్పాటు చేశాయి. 2020 అక్టోబర్లో నెల్లూరు జిల్లా బీవీపాలెం వద్ద 110 ఎకరాలు భూమిని కేటాయించిన గత ప్రభుత్వం భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను సైతం వేగంగా పరిష్కరించింది. దీంతో 2021 జూలైలో ఉత్కర్ష కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అత్యవసరమైన పర్యావరణ అనుమతులు సైతం 2021 జూలైలో వచ్చేశాయి. నాల్కో సీఎండీ శ్రీధర్పాత్ర, మిధానీ ఎండీ సంజయ్కుమార్ 2022 ఏప్రిల్లో నాటి సీఎం వైఎస్ జగన్ను కలసి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. -
AP: ‘యూరియా’పై హ్యాండ్సప్!
కొరతలేదు.. న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టి పనిష్ చేస్తాఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడైనా ఎరువులు లేవంటే నేనే అక్కడకు వెళ్తా! కావాలని న్యూసెన్స్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి పనిష్ చేస్తా.. మీరు రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు.. రైతులు రైతులుగా ప్రవర్తించండి! డ్రామాలు ఆడితే ఈ ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తాం.. – ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఔను.. యూరియా పంపిణీలో విఫలమయ్యాం.. రైతులకు యూరియా సరఫరాలో వైఫల్యం చెందాం.. ఇది మానవ తప్పిదమే. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. భూసార పరీక్షలు నిర్వహించ లేదు.. రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదు.. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇప్పుడు ఉల్లి, టమాటా ధరలు పడిపోయాయి.. ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలి. – కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందామని, ఇది మానవ తప్పిదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని సీఎం అంగీకరించారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో రైతుల పడిగాపులు ఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, ఎక్కడైనా ఎరువులు లేవంటే తానే స్వయంగా అక్కడకు వెళ్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు తాజాగా యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఎట్టకేలకు కలెక్టర్ల సదస్సు సాక్షిగా ఒప్పుకోవడం గమనార్హం. సాగు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో వృద్ధి లక్ష్యాలపై ప్రజెంటేషన్ అనంతరం కలెక్టర్లు వివిధ సమస్యలను ప్రస్తావించిన సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.అల్లూరి సీతారామరాజు జిల్లా తోటపల్లిలో క్యూలైన్లో చెప్పులు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు..యూరియా సరఫరాలో వైఫల్యం మానవ తప్పిదమే అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడేవి కావని, కరెంట్ ఉండేది కాదని, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసుకుని పోయేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని, అయితే రైతులకు యూరియా సరఫరా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో ప్రణాళిక సరిగా అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో వైఫల్యం చెందామన్నారు. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. భూసార పరీక్షలు.. పోషకాల పంపిణీ లేదు ఈ ఏడాది భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ముందుగా భూసార పరీక్షలు చేసి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇవ్వాలని సూచించారు. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే కేన్సర్ జబ్బుల్లో తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మొదటి స్థానానికి వెళ్తుందని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పంజాబ్ను కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఆ దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం వినియోగిస్తున్న యూరియాలో ఒక బస్తా తగ్గించే రైతులకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని, ఆ మొత్తాన్ని యూరియా వాడకం తగ్గించే రైతులకు ఇస్తామని చెప్పారు. త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఉల్లి, టమాటా రైతులు రోడ్డెక్కకుండా చూడాలి..రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. యూరప్ దేశాల్లో మన ఉత్పత్తులకు ధర తగ్గిస్తున్నారన్నారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్నారు. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, లేదంటే ఉత్పత్తులను కొనేవారు ఉండరన్నారు. డిమాండ్, సరఫరాకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్యపరచడంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. పొగాకు కొనుగోలు చేశామని, ఈ ఏడాది పంట హాలిడే ఇచ్చామన్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా ధరలు పడిపోయాయని, ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా వారి ఇబ్బందులను తగ్గించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కడప నుంచి రైతులు టమోటా తీసుకురావాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతుందని వదిలేస్తున్నారని, అలా కాకుండా రవాణా చార్జీలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. పట్టణ నియోజకవర్గాలను మినహాయించి మిగతా 157 చోట్ల పశువుల హాస్టళ్లను చేపట్టాలని సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్∙గిఫ్ట్ ఇస్తుందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో పశు సంపద పాత్ర కీలకమన్నారు. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేయాలని సూచించారు.రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ కట్సాగు వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలిపేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికి 30 శాతం మందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా వారు కూడా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే యూనిట్ విద్యుత్ రూ.1.50 సరఫరాను నిలుపుదల చేస్తామన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల్లో క్రమశిక్షణ అవసరమన్నారు. కాలుష్యం పెరిగి ఆక్వా ఉత్పత్తులు దెబ్బ తింటే కొనేవారు ఉండరని సీఎం పేర్కొన్నారు.కోనసీమ కంటే ‘అనంత’ తలసరి ఆదాయం అధికం..కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. ఇందుకు ఉద్యాన పంటలే కారణమన్నారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయిల్ పామ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్గా మారిందన్నారు. ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. ఫెయిల్.. పాస్ మంత్రులకూ వర్తిస్తుంది ఈ ఆర్థిక ఏడాది వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఎవరు ఫెయిల్? ఎవరు పాస్? అనేది డేటా ప్రకారం తేలుతుందని, ఇది కలెక్టర్లతోపాటు మంత్రులకూ వర్తిస్తుందని సీఎం స్పష్టంచేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి సాధించాలన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారి నుంచి మంత్రులు, కలెక్టర్లు గ్రామ కార్యదర్శి వరకు వృద్ధి సాధనలో పాత్ర పోషించాలన్నారు. విమానాశ్రయాలు, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టుల వద్ద ఎకో సిస్టం రూపొందించాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. -
Visakhapatnam: టీడీపీ సిండికేట్ కుట్రలు... కులాల బార్లపై కూటమి కన్ను
-
వైఎస్సార్సీపీ కార్యకర్తపై పచ్చ మూకల దాడి
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని చక్రాయపేట మండలంలో పచ్చ మూకలు బీభత్సం సృష్టించారు. చిలేకాంపల్లె నారపురెడ్డి వారి పల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆదినారాయణ రెడ్డిపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన పలువురు అల్లరి మూకలతో కలిసి కాపుకాచి ఆదినారాయణరెడ్డిపై దాడి చేశారు. ఆదినారాయణ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు పాలైన ఆదినారాయణ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై టీడీపీకి చెందిన పలువురు అడ్డగించి మరీ దాడి చేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
వైద్య రంగంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం: భూమన
సాక్షి, తిరుపతి: విద్య, వైద్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మేలు చేసేందుకే వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. వాటిని ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.‘‘తిరుపతిలో నిలోఫర్ ఆసుపత్రికి మిన్నగా టీటీడీ శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను తీసుకువచ్చారు. 2021లో చిన్నపిల్లల హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి గుండె మార్పిడి పరికరాలు అందుబాటులోకి తెచ్చాం. 2021 అక్టోబర్ 3 నుంచి ఇప్పటికీ వరకు మూడువేలకు పైగా ఓపెన్ హార్ట్స్ సర్జరీలు, 15 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలో 15 గుండె మార్పిడులు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఏడాదిన్నర కాలంలో వెయ్యి ఆపరేషన్లు పూర్తి చేయలేదు’’ అని భూమన మండిపడ్డారు.‘‘80 శాతం పైగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తిరుపతిలో పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 20 శాతం పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయలేకపోయారు. 15 విభాగాలలతో శ్రీపద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం, రాయలసీమకి తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రికి రూ.200 కోట్లతో మూడు దశల్లో పనులు చేపట్టాం. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం, పీజీ హాస్టల్ భవనం, రుయాలో డయాగ్నోసిస్ బ్లాక్కు నూతన భవనాలు నిర్మించాము..న్యూరాలజీ, కార్డియాలజీ బ్లాక్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్విమ్స్ ఆధునీకరణ అవసరం లేదన్నారు. 18 పద్మావతి కాలేజీల హాస్టల్ బ్లాక్ కూడా పనులు నిలిపి వేసింది. వైఎస్ జగన్ పాలనలో మూడువేల మందికి చిన్నారులకు శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా పునర్జన్మ ఇచ్చారు.’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్న ఎంపీ శబరి, సీఎం అడిషనల్ సెక్రటరీ!
సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘చరిత్ర చెరిపేస్తే చెరగదు’ అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్ చేశారు. ‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం (15 సెప్టెంబర్ 2023) వైఎస్సార్సీపీ హయాంలో విజయ నగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం. ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రక నిర్ణయం, వైఎస్సార్సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని పోస్ట్ చేశారు.✅ చరిత్ర చెరిపేస్తే చెరగదు!🩺 సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం – 15 సెప్టెంబర్ 2023వైఎస్సార్సీపీ హయాంలోవిజయనగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం!🎓 ఇవి కేవలం కాలేజీలు కాదు…✊ ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసంమాజీ… pic.twitter.com/O51mJb6NcH— Rajini Vidadala (@VidadalaRajini) September 15, 2025 -
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు
-
మంత్రి సవితమ్మకు పిచ్చి బాగా ముదిరింది.. ఇదిగో బాగా చూడు..
-
నా కొడుకుకు అడ్డస్తే ఎవరినైనా తొక్కేస్తా..
-
‘పచ్చ’దండులో భీకరపోరు నువ్వా, నేనా సై!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు, అధికారుల పోస్టింగ్ల విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. వాటాలు పంచుకునే విషయంలో, డబ్బులు దండుకోవడంలోనూ సిగపట్లు పడుతున్నారు. ఈ వ్యవహారాల్లో మీ పెత్తనం ఏమిటని ఎంపీలపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. పలువురు ఎంపీలు సీఎం చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అండతో అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తుండడాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో ఎంపీల పెత్తనం ఏమిటని నిలదీస్తున్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. విశాఖలో లోకేశ్ తోడల్లుడు భరత్ హవా.. ముఖ్యంగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ తీరుతో ఆ జిల్లా ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. నారా లోకేశ్కు స్వయానా తోడల్లుడు కావడంతో భరత్ అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలోనూ భరత్ వేలుపెట్టడాన్ని పల్లా సహించలేకపోతున్నారు. ప్రభుత్వమే తన చేతిలో ఉన్నట్లు భరత్ విశాఖ వ్యవహారాలన్నింట్లో తలదూర్చుతుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. భరత్ అన్ని నియోజకవర్గాల్లోనూ తన వర్గాన్ని తయారు చేసుకుని వారిని ప్రోత్సహిస్తూ వారికే పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గాజువాక నియోజకవర్గంలో ఒక భూమి పంచాయతీలో తలదూర్చి అక్కడికి తన అనుచరుల్ని పంపి వీరంగం సృష్టించారు. ఈ విషయంలో బాబ్జీకి ఎంపీ భరత్ మద్దతు పలికారు. అంతేకాకుండా బాబ్జీకి అనుకూలంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పల్లా తన నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం ఏమిటని భరత్ను నిలదీయడంతోపాటు పోలీస్ కమిషనర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంకా పలు వ్యవహారాల్లో భరత్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉండే వారిని ప్రోత్సహిస్తుండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం ఎంపీ తీరుపై రగిలిపోతున్నారు. రాయలసీమలో తండ్రి అండతో శబరి జోరు నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరికి ఎమ్మెల్యేలతో ఏమాత్రం సరిపడడంలేదు. ముఖ్యంగా శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, భూమా అఖిలప్రియ, జయసూర్యలతో అయితే ఆమెకు అసలు సరిపడడం లేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. శబరి తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ద్వారా చక్రం తిప్పుతుండటంతో ఎమ్మెల్యేలు ఆమె స్పీడుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న పరిచయాలు, పలుకుబడితో పలు నియోజకవర్గాల్లో బైరెడ్డి జోక్యం చేసుకోవడంతో కొందరు ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో తండ్రిని నిలువరించాలని, ఎక్కడా ఆయన జోక్యం ఉండకూడదని అధిష్టానం శబరికి ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల శ్రీశైలం నియోజకవర్గంలో సుపరిపాలన కార్యక్రమంలో శబరి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి వర్గీయులు ఆమె సమక్షంలోనే ఏరాసుపై దాడికి దిగారు. శబరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బుడ్డాతోనూ ఆమెకు వైరం ఏర్పడింది. ఒక్క డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి తప్ప ఎవరితోనూ ఎంపీ శబరికి సఖ్యత లేదు. దీంతో తాను ఎంపీగా ఉండి ఉపయోగం ఏమిటని ఆమె అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బెజవాడ బెల్టులో అంతా తానైన చిన్ని.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని).. నారా లోకేశ్ అండతో ఎన్టీఆర్ జిల్లాను తన గుప్పిటపట్టారు. దీంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా రగిలిపోతున్నారు. ఒక్క మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తప్ప ఎవరితోనూ కేశినేని చిన్నికి సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు, ఇసుక, మద్యం అన్నీ తనకే కావాలని తన మనుషుల్ని పంపడం, వారితోనే అన్ని పనులు చేయిస్తుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెటిల్మెంట్ల కోసమే ఆయన తన కార్యాలయంలో ప్రత్యేకంగా కొందరిని నియమించుకుని, వారితోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. సింహపురి వేమిరెడ్డి దంపతులదే దందా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా మొత్తాన్ని దున్నేయాలనే చూస్తున్నారని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. టీడీపీ పెద్దల అండతో ఎంపీ చేస్తున్న అక్రమ క్వార్జ్ తవ్వకాలను ఎమ్మెల్యేలే వ్యతిరేకించి రచ్చ చేశారు. ఆయన క్వార్జ్ దందాపై విమర్శలు వెల్లువెత్తినా ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వేమిరెడ్డికి మద్దతుగా ఒక్క చిన్నమాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎంపీ తీరుపై రగిలిపోతున్నారు. తన నియోజకవర్గంలో ఎంపీ క్వార్జ్ దందా నడపుతుండడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డితోనూ ఎంపీ వేమిరెడ్డికి సరైన సంబంధాలు లేవని టాక్ నడుస్తోంది. లావుపై పల్నాటి యుద్ధం ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, అరవింద్బాబు వ్యతిరేక వర్గాలకు ఆయన మద్దతిస్తుండడంతో వారిద్దరూ రగిలిపోతున్నారు. సత్తెనపల్లి, మాచర్ల, చిలకలూరిపేట ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులతోనూ ఎంపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. అన్నింట్లోనూ తనదే పైచేయిగా ఉండాలని చూస్తుండడం, అక్కడ తన వర్గం వారికే పనులు చేయాలని పట్టుబడుతుండడంతో లావు శ్రీకృష్ణదేవరాయలను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఎంపీలతో ఎమ్మెల్యేల కుస్తీలు గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, కర్నూలు ఎంపీ నాగరాజుకు తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు. పోస్టింగులు, వాటాలు, దందాల దగ్గర ఎంపీల పెత్తనంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇక జనసేన ఎంపీలు ఉన్న కాకినాడ, మచిలీపట్నంల్లో అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు, వారికి అసలు పొసగడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తుండటంతో ఆ పంచాయతీలు తీర్చడానికి చంద్రబాబు పార్టీ కార్యాలయంలో కొందరిని ప్రత్యేకంగా నియమించారు. -
మంత్రి సుభాష్ వ్యాఖ్యలు.. ఖండించిన శెట్టిబలిజ నేతలు
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను శెట్టిబలిజ నేతలు ఖండించారు. మంత్రి సుభాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సూర్య ప్రకాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్, జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్నారు.పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారని విషయం మరిచిపోకూడదని సూర్యప్రకాష్ అన్నారు. శెట్టిబలిజ జాతికి సుభాష్ చేసిందేమీ లేదు. మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. వైస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కులాల మధ్య చిచ్చు పెట్టలేదని సూర్య ప్రకాష్ అన్నారు. -
చంద్రబాబుకు మోసం వెన్నతో పెట్టిన విద్య: కోన రఘుపతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుకి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు, మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి, ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సామాజిక బాధ్యతగా పేదవాడికి అందించాల్సిన విద్య, వైద్యాన్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పక్కదారి పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప వారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని.... మేం మాత్రం పెత్తనం చేయాలన్న ధోరణి చంద్రబాబుకు పుట్టుకతో వచ్చింది. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబుది కుక్కతోక వంకర బుద్ధి. ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం కళ్లార్పకుండా ప్రజలకు అబద్దపు హామీలివ్వడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయంప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది వైయస్.జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. మేధావులు, విజ్ఞులు కూడా దీనిపై ఆలోచన చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే... 2019-24 తర్వాత వైయస్.జగన్ హయాంలో నీతిఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్రతిపాదనను అందిపుచ్చుకుని ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వైయస్.జగన్ గారు తీసుకున్న నిర్ణయం మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే... ఏటా మనం ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.3వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం, దానితో పోల్చుకుంటే వీటి నిర్మాణం కష్టం కాదని చెప్పారు.మరోవైపు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను మనం చూశాం. రాష్ట్ర విభజన తర్వాత అత్యాధునిక వైద్యం అందించే ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చెన్నై, బెంగుళూరులో కూడా ఆరోగ్యశ్రీ కింది చికిత్స పొందే అవకాశం కల్పించాం. కానీ శాశ్వతంగా మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇదే మంచి సమయం అని ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయించారు.అయినా సొంత మీడియాలో తప్పడు రాతలు..ప్రతి ప్రభుత్వ బోధనాసుపత్రి పరిధిలో 500 పడకల ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అత్యుత్తమ వైద్య విద్యను, వైద్యాన్ని అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప పనిని ప్రశంసించకపోగా.. తమ చేతిలో మీడియా ఉందని తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు ప్రచారంతో విద్యావంతులను సైతం తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కొంత రుసుముతో పేమెంట్ కోటా తరహాలో చేసి ఆ వచ్చిన మొత్తాన్ని ఆయా కాలేజీల నిర్వహణ, అభివృద్దికి ఉపయోగించాలని ప్రతిపాదన చేస్తే... ఆ రోజు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ లు దానిపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు.తాము అధికారంలోకి వస్తే...ఆ విధానాన్ని రద్దు చేస్తాం.. పేదల సీట్లు అమ్ముకుంటారా అంటూ పెద్ద, పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కాలేజీలనే ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామనడం ఎంతవరకు సమంజసం. వాస్తవానికి ఇవాల ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ప్రవైటు ఆసుపత్రులన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నియంత్రణలో పనిచేయాలి. కానీ వాటిని మనం ఏ మేరకు కంట్రోల్ చేయగలుగుతున్నామన్న విషయం అందిరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామనడం దారుణం.ఇవిగో మెడికల్ కాలేజీలు.. కళ్లు తెరిచి చూడండి..వైఎస్ జగన్ ప్రభుత్వ నేతృత్వంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీల కోసం అనుమతిలు తెచ్చి, స్దల సేకరణ పూర్తి చేయడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. వీటిలో 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయగా.. 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే.. వద్దని ఎంసిఐ కు లేఖ రాశారు. మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్ మెంట్, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా అందని విధంగా వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించారు.బాధ్యత గల ప్రభుత్వంగా మిగిలిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాల్సింది పోయి, వాటిని ప్రైవేటు పరం చేయడానికి... చంద్రబాబు సహా మంత్రులు మాట్లాడుతున్న పచ్చి అబద్దాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. కనీస హోంవర్క్ చేయకుండా మాట్లాడుతున్న హోం మంత్రి అనిత అయితే కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు మచిలీపట్నం లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయింది. విజయనగరంలో అన్ని రకాల వసతులతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తైతే... ఇవేవీ మీ కళ్లకు కనిపించడం లేదా? పైగా ఎల్లో మీడియాలో 10 కొత్త కాలేజీలకు శ్రీకారం అంటూ అబద్దపు వార్తలు వండి వార్చుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే ప్రభుత్వ రంగంలో మంజూరైన కాలేజీలనే... ప్రైవేటు పరం చేస్తూ... మళ్లీ వాటిని తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు రాయడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఇంకోకటుండదు. కళ్లకు పచ్చపాతం సోకిన వ్యక్తులను ఏవరూ ఏం చేయలేదు. కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులు, తటస్థులు వాస్తవాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. అప్పుడే నిజాలు తెలుస్తాయి. లేదంటే పచ్చ పత్రికలు రుషికొండ టూరిజం భవనాల తరహాలో ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తారు.మీరు చేయని పనికి కూడా క్రెడిట్ తీసుకోవడం మీకెప్పుడూ అలవాటే చంద్రబాబూ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి, పూర్తి చేసింది కూడా వైఎస్సారే. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి మీ హయాంలో కనీసం భూసేకరణ కూడా చేయలేదు. కానీ మీరే కట్టామని నిస్సిగ్గుగా కేడర్ తో మాట్లాడతారు. మీరేం చెప్పినా వాటిని ప్రచారం చేసే మాధ్యమాలున్నాయన్న ధీమాతో అబద్దాలను నూరుపోస్తున్నారు. పదే, పదే అబద్దాలు ప్రజలకు నూరుపోసి వాటినే నిజాలని భ్రమింపజేయడం మీకు మొదటి నుంచీ అలవాటే.నంద్యాల మెడికల్ కాలేజీ అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే రండి వెళ్లి చూసి వద్దాం. పేద ప్రజలకు వైద్యం, పేద విద్యార్ధులకు వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ వీటి నిర్మాణం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగమే కాదు వ్యవసాయ రంగం కూడా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం వల్ల రైతులకు మద్ధతు ధర కూడా రావడం లేదు.ప్రతి వేయి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్య విద్యను అభ్యసించాల్సిన పిల్లలను ప్రోత్సహించాల్సి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తున్నారు. 15 నెలల్లో రూ.1.90 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయి. ఎవరి జేబుల్లోకి పోయాయి. పేదవాడి వైద్యానికి అవసరమయ్యే వైద్య కళాశాలలు కట్టమంటే... డబ్బుల్లేవని బీద పలుగులు పలుకుతున్నావు. పైగా వైయస్.జగన్ హయాంలో రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేస్తే... రూ.10-12 లక్షల కోట్లు అప్పు చేశారని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారు. తీరాచూస్తే అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్ధిక మంత్రే వైఎస్ జగన్ జగన్ హయాంలో రూ.4.67 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి.. సభ బయటకు రాగానే మరలా ఇంకో రకంగా మాట్లాడ్డం సిగ్గుచేటు. మీ మంత్రి పార్ధసారధి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెబితే... చంద్రబాబు మాత్రం వైయస్.జగన్ హయాంలో ఒక్క కాలేజీ పూర్తి కాలేదు. మేమే తెచ్చాం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు.రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో రూ.1లక్ష కోట్లు అని చెప్పాడు. ఇప్పుడేమో అది ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో రాజధాని నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కేవలం రూ.4 వేల కోట్లు ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందించే మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టలేవా చంద్రబాబూ? వైయస్.జగన్ ప్రభుత్వంలో అప్పులు గురించి గగ్గోలు పెడుతూ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన మీరు.. ఓట్లు కోసం సూపర్ సిక్స్ పేరుతో విపరీతమైన హామీలిచ్చారు.తీరా ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మేధావులు, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాలు నిగ్గు తేల్చాల్చి ఉంది. నిజాలు మీరే క్షేత్రస్ధాయిలో పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఆ తర్వాత మీరే నిజాలు ప్రజలకు తెలియజేయండి.బాపట్ల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి...బాపట్లలో నాడు నేడు కింది అన్ని పీహెచ్ సీలను ఆధునీకరించాం. రూ.3.50 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. కొత్తగా వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. బాపట్ల ఏరియా ఆసుపత్రిలో గతంలో ఒక ఎమర్జెన్సీ వార్డులో రెండు ఆక్సిజన్ బెడ్స్ ఉండే పరిస్థితి నుంచి కోవిడ్ మహమ్మూరిని సమర్ధవంతంగా ఎదుర్కున్నాం. ఇప్పుడు 120 ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ వైయస్.జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేశాం. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తే... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు కేటాయిస్తే.. మాకు వద్దు అని లేఖ రాసిన ముఖ్యమంత్రి మీరే చంద్రబాబూ..?వైద్య విద్య కోసం కజికిస్తాన్, యుక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి మన పిల్లలు వైద్య విద్య కోసం వెళ్తుంటే.. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కాలేజీలను మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు చంద్రబాబూ ? నిత్యం చంద్రబాబు గ్రాఫిక్స్ చూసి అలవాటు పడిన టీడీపీ కార్యకర్తలు కూడా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైయస్.జగన్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చూపిస్తున్నవి గ్రాఫిక్స్ కాదు... నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కాలేజీలు అన్న విషయాన్ని క్షేత్రస్దాయికి వెళ్లి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీటితో పాటు రెండో దశలో పిడుగురాళ్లలో 75 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. మార్కాపురంలో లో శరవేగంగా మెడికల్ కాలేజీ పనులు జరుగుతుంటే 15 నెలలుగా వాటి నిర్మాణానికి బ్రేక్ వేశారు.బాపట్లలో మెడికల్ కాలేజీ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. చెరువులో కడుతున్నారని చెబుతున్నారు. నువ్వు చెబుతున్న ఐకానిక్ టవర్ నిర్మాణం నీటిలో మునిగిపోతే.. నీటిని తోడడానికే కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు కేటాయించి.. ఆ రైతులను గాలికొదిలి, మరలా మరో 40 వేల ఎకరాలు అవసరం అని చెబుతున్నారు. అంతా మాటల కనికట్టు తప్ప చేతల్లో ఏమీ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కటే విషయం స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వాస్తవాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి మీరే నిజాలు నిగ్గు తేల్చాలని కోన రఘపతి ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. -
‘జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ‘కూటమి’కి ఉందా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దళితులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఓ ఆర్ఎంపీపై జనసేన నేతలు దాడి చేశారని సుధాకర్బాబు నిప్పులు చెరిగారు.‘‘గతంలో వైఎస్ జగన్ పట్ల లోకేష్, పవన్ అసభ్యంగా మాట్లాడారు. వైఎస్ జగన్ పట్ల అసభ్యంగా మాట్లాడిన లోకేష్, పవన్పై ఎందుకు చర్యల తీసుకోలేదు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా’’ అంటూ సుధాకర్బాబు నిలదీశారు.‘‘చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు. ఎస్పీల సమావేశంలో చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయాలని ఎస్పీలకు సూచించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అశాంతి కనిపిస్తుంది. ఆయన అసమర్థ పాలన గురించి జనం మాట్లాడుకోకుండా డైవర్షన్స్ చేస్తుంటారు. అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లకు అనుకూలమైన పోలీసులకే పోస్టింగులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది...రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లకు లేని ఆధారాలు సృష్టించి కేసులు పెడుతున్నారు. పవన్పై ఒక్క మాట జారిన వ్యక్తిపై కేసులు పెట్టారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారు. గతంలో పవన్ మాట్లాడిన మాటలకు ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలి. వాడు, వీడు.. యూస్ లెస్ ఫెలో అని మాట్లాడిన లోకేష్ పై ఎందుకు కేసులు పెట్టలేదు. మీ ప్రభుత్వంపై ప్రతీ ఒక్కరికీ నమ్మకం పోయింది. బాధితులపై తిరుగు కేసులు పెడుతున్న మీరు పోలీసులను కూర్చోబెట్టుకుని ఏం చెప్తారు’’ అంటూ సుధాకర్బాబు ప్రశ్నించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకోండి.. కోర్టు సంచలన తీర్పు
సాక్షి, టాస్క్ఫోర్స్: తీసుకున్న అప్పును చెల్లించని కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో పాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించింది.వివరాల ప్రకారం.. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్కు చెందిన పృధ్వీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని సర్వే నంబర్ 670/ ఏ1సీ1, 2 ఎకరాల ఆస్తి (కామిశెట్టి కాలేజీ)ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు చెందిన పృధ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు తీర్పు ఇచ్చింది.ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 16న ఉదయం 10 గంటలలోపు సదరు ఆస్తిని పృధ్వీ కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. రాధా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు బద్వేలి శ్రీనివాసులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మీనా, ఓబుళమ్మ, ఇంద్ర, ఉమాదేవి, హరినాథరెడ్డి, సుదర్శన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, శివారెడ్డి, నైనితారెడ్డి, విజయశేఖర్రెడ్డి, రఘునాథరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. -
యూరియా కోసం యుద్ధం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు. » అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. » విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. » కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు. » యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కులాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమి సర్కార్: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ది పొందాలని కుటిల యత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల యత్నాన్ని ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కులధృవీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గం ఆందోళన చెందే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. పైగా ఈ నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నదేనన్న మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గతంలో మెమో జారీ చేసిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం అయితే దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబరు 25 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెమోకు జీవోకు తేడా తెలియకుండా మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..జీవో జారీ చేసిందే చంద్రబాబు ప్రభుత్వంప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేస్తుంది. దీనిపై శెట్టిబలిజ సామాజికవర్గంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ... ఇది సాంకేతికపరమైన ఇబ్బంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల తర్వాత సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధంగా కులధృవీకరణ పత్రాలు జారీ చేసిందని చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.తమకు నష్టం జరుగుతుందని, తమ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ... నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 19-06-1997లో జీవో నెంబరు 16 విడుదల అయింది. వాస్తవానికి 15-05-1995లో సామాజిక స్పృహ కలిగిన నాయకుడు, అందరూ సర్ధార్ అని పిలిచే గౌతు లచ్చన్న గారు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచన చేసి ఈ జీవో నెంబరు 16ను ప్రతిపాదించారు.ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రభాకర్ రావు వంటి పెద్దలు కూడా సమ్మతి తెలిపారు. అనంతరం విడుదలైన జీవో ప్రకారం అంతా గౌడగా ఉండాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై కొంతమంది శెట్టిబలిజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించేదిగా ఉందని.. ఎప్పటిలానే శెట్టిబలిజలుగానే తమ నామకరణం ఉండాలని ప్రతిపాదించారు. ఇదే విషయంపై కోర్టులకు కూడా వెళ్లారు. దీంతో కులాల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి.. ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేశాయి. ఈ జీవోను జారీ చేసింది చంద్రబాబేఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ జీవో అమలు కాలేదు. 2014-19 వరకు మరలా చంద్రబాబు ఉన్నప్పుడూ కూడా ఈ జీవో అమలు కాలేదు. 2019-24 వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది గౌడ సోదరులు గౌతులచ్చన్న గారి ప్రతిపాదనను మరలా తెరపైకి తీసుకొచ్చారు. కేవీ సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ తో పాటు కొంతమంది కలిసి 23-02-2023 నాడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది.మా హయాంలోనే జీవో నెంబరు 25 జారీ..గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అసమ్మతి వచ్చిందో.... ఈ మెమో జారీ చేసినప్పుడు కూడా అదే విధంగా వ్యతిరేకత వచ్చింది. కృష్ణా జిల్లాలో శెట్టిబలిజ కులస్తులు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే గౌడ అని వస్తుందని అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు 10-11-2023 నాడు రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నా వారికి కేవలం శెట్టిబలిజ అని మాత్రమే ఇవ్వాలని జీవో ఎం ఎస్ నెంబరు 25 జారీ చేశాం. అదే సమయంలో రాయలసీమలో ఉన్న శెట్టిబలిజలుది గీత వృత్తి కాకపోవడంతో గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు కూడా వర్తించదని జీవోలో పొందుపరిచాం.మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వంకానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కారణమో లేక ఇతర కారణాల వల్ల గతంలో ఎవ్వరూ అమలు చేయని నిర్ణయాన్ని కేవలం ఒక మెమోని మాత్రమే ఆధారంగా చేసుకుని గౌడ అని ముందు చేర్చి తర్వాత శెట్టిబలిజ, ఈడిగ, యాత అని చేర్చడం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ శెట్టిబలిజల్లో ఆందోళనకు కారణమైంది. ధృవీకరణ పత్రాలు జారీ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. తమ తప్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించకుండానే.. ప్రజలకేం చెప్పినా నమ్ముతారన్న అతి విశ్వాసంతో ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు.మెమోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడ్డం హాస్యాస్పదం. ప్రజలు వారి వారి కులాల పేర్ల మీదే కులధృవీకరణ పత్రాలు మంజారు చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా, జీవో నెంబరు 6 జారీ చేయడం ద్వారా వారి అశాంతికి కారణం అయింది. గౌత లచ్చన్న గారి ఆశయానికి కూడా కూటమి ప్రభుత్వం చరమ గీతం పాడింది. మాస్టర్ కేస్ట్ సర్టిఫికేట్ పేరుతో మా ప్రభుత్వం గౌడ, శెట్టిబలిజ, యాత కులాలను కలిపి ఉంచామని ఒకవైపు చెబుతారు, మరోవైపు వైఎస్ జగన్ వచ్చి అందరికీ విడిగా కార్పొరేషన్లు ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి. వారికి ఒక వేదిక ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 672 మందిని డైరెక్టర్లుగా నియమించాం. ఇవాళ ఏడాదిన్నర కావస్తున్నా కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను భర్తీ చేయలేదు.బీసీలకు అండగా నిలిచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేబీసీలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలుంటే వాటిని ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా అందేటట్టు చేసిన ఘనత దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్లకే చెందుతుంది. మార్కెటింగ్ కమిటీల్లోనూ, దేవాలయాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ కాదా?, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీల, ఎస్టీలు, మైనార్టీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. బీసీలకు మేలు చేశామని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వారికి ఒక మగ్గమో, మోకూ, చక్రమో ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప వారి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పనిచేయలేదు.కేవలం వారిని గౌరవిస్తున్నట్టు నటిస్తూ.. వారి ఆశయాలను నశింపజేసే ప్రక్రియ కూటమి పాలనలో జరుగుతుంది. కులాల మధ్య ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని తక్షణమే పరిష్కరించాం. కానీ అవగాహన లేని మంత్రి మాత్రం ఫేక్ జీవో అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం. ఆయన మెమోకి జీవోకి తేడా తెలుసుకోవాలి. కేవలం కులాల నడుమ ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఈ వివాదం. ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి -
సంబంధం లేని ఎమ్మార్ కేసులో జగన్పై తప్పుడు రాతలు: శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంబంధం లేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైయస్ జగన్ను ఏ1 నిందితుడు అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆనందం కోసం రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ జర్నలిజాన్ని సమాధి చేస్తూ, వైఎస్సార్సీపీ పైన తప్పుడు రాతలు రాయడమే ఈనాడు లక్ష్యం అన్నట్లుగా పత్రికను నడుపుతున్నారని మండిపడ్డారు.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ నిందితుడుగా ఉన్నట్లు ఒక్క ఆధారమైనా చూపగలరా అని ప్రశ్నించారు. న్యాయవాది, వ్యాపారిగా ఉన్న సునీల్ రెడ్డిని వైఎస్ జగన్కు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్నాడంటూ అర్థం లేకుండా పిచ్చిరాతలు రాసిన ఈనాడు ఒక్కసారైనా ఆయన గత ఐదేళ్లలో ఇక్కడకు వచ్చినట్లు, ఏదైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు నిరూపించగలరా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..‘‘ఎల్లో మీడియా ఈనాడులో బేతాళ కథల మాదిరిగా రోజుకో కొత్త కథను లిక్కర్ స్కాం అంటూ వండి వారుస్తున్నారు. వైఎస్ జగన్తో ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఈనాడు పత్రిక బాకా ఊదుతోంది. అన్ని విలువలను వదిలిపెట్టి, బురదచల్లడమే జర్నలిజంగా తన విధానాన్ని మార్చుకుంది. గతంలో రామోజీరావు ఉన్నప్పుడు ఎలా భజనచేశారో, దానికి మించి ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్ మొత్తం పత్రికనే చంద్రబాబు పాదాక్రాంతం చేస్తూ, అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయి, అబద్ధాలు, అభూతకల్పనలతో కథనాలను రాస్తున్నారు...దీనిలో భాగంగానే వైఎస్ జగన్కు నమ్మినబంటు, ఎమ్మార్ ప్రాపర్టీలో నిందితుడు సునీల్ రెడ్డి లిక్కర్ స్కాంలో కీలకం అంటూ ఒక కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో సునీల్ రెడ్డి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఏ7 అయితే, దీనిలో వైఎస్ జగన్ ఏ1 అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ రాశారు. ఈనాడు కిరణ్ తన పత్రికను జర్నలిజం ప్రకారం నడుపుతున్నారా? లేక తన బ్రోకరిజం పాలసీ మేరకు నడుపుతున్నారా? ఎమ్మార్ కేసులో వైయస్ జగన్కు ఏం సంబంధం? కోర్టులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ కేసులో ఏ1 బిభూ ప్రసాద్ ఆచార్య. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ పేరు ఎక్కడ ఉందో చూపగలరా?..కనీస అవగాహన లేకుండా తప్పుడు కథనం రాశామని, మరుసటి రోజు అయినా సవరణ వేస్తారని చూశాం. కానీ వారి వైఖరి చూస్తుంటే, కావాలనే వైఎస్ జగన్పై బురదచల్లేందుకే ఈ కథనం రాశారని అర్థమవుతోంది. పైగా ఇదే కథనంలో వైఎస్ జగన్కు సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అంటూ రాశారు. సునీల్ అనే వ్యక్తి న్యాయవాది, వ్యాపారి. ఏనాడైనా ఆయన గత అయిదేళ్ళలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడకు వచ్చారా? ఎక్కడైనా ఏదైనా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా? సూట్కేసు కంపెనీలను ఏర్పాటు చేశాడంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేశారో ఈనాడు పత్రిక చెప్పాలి...అత్యంత సన్నిహితుడు అంటే చంద్రబాబుకు నిత్యం భజన చేస్తూ పత్రికను నడిపించిన రామోజీరావు, ఆయన మరణం తరువాత ఆ స్థానంలో ఉన్న చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు. వీరు కదా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. సునీల్ రెడ్డి నివాసంలో సిట్ జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు దొరికాయని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు దొరికాయంటూ ఈనాడులో రాశారు. సిట్లోని ఏ అధికారి కీలక ఆధారాలు దొరికాయని చెప్పారో వెల్లడించాలి...గతంలో ఇదే లిక్కర్ స్కాంలో బంగారం, విదేశాల్లో ఫ్యాక్టరీలు, దుబాయ్లో ఆస్తులు ఇలా అనేక రకాలుగా ఊహాత్మక అంశాలను వార్తా కథనాలుగా రాశారు. ఈనాడు ఇలా దిగజారిపోయి రాస్తున్న తప్పుడు రాతలను చూస్తే, చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం జర్నలిజం విలువలను సమాధి చేసి, భజన చేయడమే తమ జీవితాశయంగా పత్రికను నడుపుతున్నారని అర్థమవుతోంది. లేని లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ను దోషిగా చూపాలన్నదే వారి తాపత్రేయంగా కనిపిస్తోంది...ఈనాడు పత్రిక పేరును చంద్రనాడు అని మార్చుకుంటే బాగుంటుంది. ఇటువంటి తప్పుడు వార్తను ప్రచురించినందుకు ఈనాడు పత్రిక నిర్వాహకుడు చెరుకూరి కిరణ్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే ఈనాడు పత్రికను ప్రజలు టిష్యూ పేపర్గా చూస్తున్నారు. దానిని టాయిలెట్ పేపర్ స్థాయికి తీసుకువెళ్ళేందుకు ఈనాడు కిరణ్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అబద్దపు రాతలపై చర్యలు తీసుకుంటామంటున్న సీఎం చంద్రబాబు, తన నమ్మినబంటు చెరుకూరి కిరణ్ ఈనాడులో రాస్తున్న అసత్య కథనాలపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని పుత్తా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. -
‘పచ్చ’ బరితెగింపు.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత
సాక్షి, కృష్ణా జిల్లా: మోపిదేవిలంకలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇంటిని కూల్చేశారు. టీడీపీ నేతల దాడిలో విజయ్కుమార్కు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే నెపంతో ఈడే విజయ్ కుమార్ ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. తమ ఇల్లు కూల్చొద్దని విజయ్ కుమార్ కుటుంబం వేడుకున్నా కానీ వారిని దౌర్జన్యంగా టీడీపీ నేత అనుచరులు పక్కకు లాగేసి పడేశారు. టీడీపీ నేత దాడిలో గాయపడిన విజయకుమార్ అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రీ రమేష్ బాబు శనివారం పరామర్శించారు. దౌర్జన్యంగా విజయ్ ఇంటిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వారిపై దాడి చేశారని.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పేదల ఇల్లు పడగొట్టి పాపం కూడగట్టుకుంటున్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని సింహాద్రీ రమేష్బాబు డిఆమండ్ చేశారు. -
Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు
-
Anakapalli: కుమార్తెను ప్రేమించాడని యువకుడిని హత్య చేయించిన టీడీపీ నేత కుటుంబం
-
నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం, ఆఫీస్ లో సోదాల పేరిట సిట్ హైడ్రామా
-
సీపీఐ సెల్వకుమార్ దంపతులపై దాడి
-
కర్నూలులో 2 వేల 700 కోట్ల రూపాయల విలువైన స్థలంపై గురి...
-
ఉల్లి రైతుకు వాత..మద్దతు ధరకు కోత!?
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి రైతులను నిలువునా ముంచేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరకొరగా ఉన్న మద్దతు ధరకూ కోత పెడుతూ వారికి తీరని అన్యాయం చేస్తోంది. క్వింటా రూ.1,200 మద్దతు ధరతో నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తామని ప్రకటించిన మూడు రోజులకే చేతులెత్తేస్తోంది. ఈ నెల 1 నుంచి 3 వరకు మార్క్ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేసింది. ఆ తర్వాత.. ప్రతి లాట్ను వ్యాపారులు కొనాల్సిందేనని, వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంతవరకు ఒక్క రైతు బ్యాంకు ఖాతాకు కూడా ఆ వ్యత్యాసం మొత్తం జమ అయిన దాఖలాల్లేవు. పైగా.. ఇప్పుడు మద్దతు ధరను తగ్గించే కుట్రకు శ్రీకారం చుట్టింది. నాణ్యత తక్కువుందన్న సాకుతో మద్దతు ధరను క్వింటాకు రూ.800కు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాణ్యత బాగున్న ఉల్లిని రూ.1,200, నాణ్యతలేని ఉల్లిని రూ.800 ధరతో కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం తీసుకెళ్లండి.. మరోవైపు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకురావడానికే రవాణా చార్జీల భారంతో రైతులు అల్లాడుతుంటే అధికారుల పిడుగులాంటి వార్త ఉల్లి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడేనికి ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలని అధికారులు సూచించడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. నిజానికి.. తాడేపల్లిగూడెం మార్కెట్ పూర్తిగా ప్రైవేటుది. రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి.అన్నీ భరించి తీసుకెళ్లినా అక్కడ రైతులకు అన్యాయం జరిగినా పట్టించుకునే దిక్కుండదు. అదే కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నిత్యం కలెక్టర్, జేసీ, జిల్లా ఎస్పీలతో పాటు విజిలెన్స్, మార్కెటింగ్ శాఖాధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం మార్కెట్కు ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలని అధికారులే సూచించడం ఉల్లి రైతుల్లో కలకలం రేపుతోంది. భారీగా కుళ్లిపోతున్న ఉల్లి.. ఇక మద్దతు ధరతో ఇప్పటివరకు మార్క్ఫెడ్ 4,500 టన్నుల ఉల్లి మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో రెండువేల టన్నుల వరకు వివిధ జిల్లాలకు తరలించారు. ఇంకా 2,500 టన్నుల ఉల్లి మార్కెట్ యార్డు, వివిధ గోదాముల్లో నిల్వ ఉంది. ముందస్తు ప్లానింగ్ లేకపోవడంవల్ల ఉల్లి భారీగా కుళ్లిపోతోంది. వివిధ జిల్లాలకు తరలించిన రెండువేల టన్నుల ఉల్లిలో నాణ్యతలేదనే కారణంతో దాదాపు 500 టన్నులు పారబోసినట్లు తెలుస్తోంది. -
తప్పుడు సాక్ష్యాలు.. అసత్య ప్రచారాలు
సాక్షి, అమరావతి : మద్యం విధానంపై అక్రమ కేసులో కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రాలకు తెర తీస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సరికొత్త పన్నాగానికి పదును పెడుతోంది. అందులో తాజా అంకంగానే హైదరాబాద్కు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట సిట్ హైడ్రామా నడిపింది. ముందస్తు పన్నాగంతోనే టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా సిట్ అధికారుల ద్వారానే తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నించడం విస్మయ పరిచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వ ఈ తాజా కుట్ర కూడా బొల్తా కొట్టింది. కొండను తవి్వనంత హడావుడి చేసిన సిట్.. చివరికి అక్కడ ఎలుక కూడా లేదని తెలుసుకుని చేతులెత్తేసింది. వైఎస్ జగన్పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన తాజా కుట్ర వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ వాహనం.. అందులో బ్యాగులు, సామగ్రి.. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్కు చెందిన న్యాయవాది, వ్యాపార వేత్త నర్రెడ్డి సునీల్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆయన కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాల పేరుతో రాద్ధాంతం చేశారు. సోదాలు నిర్వహించేందుకు ఉన్న నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తూ వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారు. సోదాల ముసుగులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. హైదరాబాద్లోని న్యాయవాది సునీల్ రెడ్డి కార్యాలయంలో తనిఖీల సమాచారం తెలుసుకుని ఆయన తరఫు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. కానీ వారిని సిట్ అధికారులు లోపలికి అనుమతించ లేదు. దాదాపు 4 గంటలపాటు వారు కార్యాలయంలోకి వెళ్లకుండా సిట్ అధికారులు అడ్డుకోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించేటప్పుడు న్యాయవాదులను అనుమతించాలి. అందుకు భిన్నంగా సిట్ అధికారులు వ్యవహరించడం వెనుక తప్పుడు సాక్ష్యాలను సృష్టించే కుతంత్రం ఉన్నట్లు స్పష్టమైంది. కార్యాలయంలోకి వెళ్లేటపుడే సిట్ అధికారులు తమతో పాటు ఓ బ్యాగును లోనికి తీసుకువెళ్లారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్ వాహనం అక్కడికి చేరుకుంది. ఆ వాహనంలో కొన్ని బ్యాగ్లు, ఇతర వస్తువులు ఉండటాన్ని చూసి సునీల్రెడ్డి తరఫు న్యాయవాదులు గేటువద్ద అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని ఎందుకు లోపలకు తీసుకువెళ్తున్నారని నిలదీసినా.. సిట్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ముందు ఒక బ్యాగ్ను తమతోపాటు లోనికి తీసుకువెళ్లిన అధికారులు ఆ తర్వాత ఈ వాహనంలోని మరికొన్ని బ్యాగ్లను, ఇతర వస్తువులను, ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వీటిని సోదాల సమయంలో సునీల్రెడ్డి కార్యాలయంలో గుర్తించినట్లుగా కట్టు కథ వినిపించాలన్నది సిట్ అధికారుల ఉద్దేశం. ఆ వాహనంలోనే సిట్కు సంబంధం లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఉండటం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో దు్రష్పచారానికి పాల్పడుతున్నారన్నది స్పష్టంగా వెల్లడవుతోంది. సన్నిహితులంటే ఎలా ఉంటారంటే... » న్యాయవాది, వ్యాపారవేత్త సునీల్ రెడ్డి నివాసంలో సోదాల పేరుతో హైడ్రామా సాగించిన సిట్ అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ తమకు అలవాటైన రీతిలో టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ వెంటనే అవాస్తవాలు, అభూత కల్పనలతో ఎల్లో మీడియా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించింది. » వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓ సాధారణ పరిచయస్తుడైన న్యాయవాది, వ్యాపారవేత్త సునీల్రెడ్డిని పట్టుకుని ఆయనకు అత్యంత సన్నిహితుడని.. మద్యం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అవాస్తవ కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారానికి తెగబడింది. అసలు అత్యంత సన్నిహితుడని ఎవర్ని అంటారో ఈనాడుకుగానీ, ఇతర టీడీపీ ఎల్లో మీడియాకు గానీ తెలుసా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. » అత్యంత సన్నిహితులు అంటే ఎలా ఉంటారు అంటే.. చంద్రబాబు–ఈనాడు ఎండీ కిరణ్, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 చానల్ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు చంద్రబాబును తరచూ కలుస్తూ ఉంటారు. టీడీపీ అక్రమాలకు వత్తాసు పలుకుతారు.. చంద్రబాబు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. చంద్రబాబుకు చిన్న సమస్య రాగానే జాకీలెత్తి మోస్తుంటారు. జీవితకాలం మా బాబుగారే సీఎంగా ఉండాలంటూ భజన చేస్తుంటారు.. బాబుగారు క్వాంటం కంప్యూటింగ్ అన్నా, ఏఐ అన్నా, బుల్లెట్ రైలు అన్నా ఆహా ఓహో అని కీర్తిస్తుంటారు.. » న్యాయవాది అయిన సునీల్ రెడ్డి వ్యాపారవేత్తగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. గత పదేళ్లలో ఆయన ఆంధ్రప్రదేశ్కు నాలుగైదుసార్లు కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఏనాడూ రాజధానివైపు రానే లేదు. వైఎస్ జగన్ను కలిసిందీ కూడా లేదు. మరి సునీల్ రెడ్డి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడని టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ఎలా సూత్రీకరిస్తుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. » టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు సిట్ ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ సాగిస్తున్నారని, అందుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ బురద చల్లుతోందన్నది స్పష్టమవుతోంది. -
రూ.2,700 కోట్ల స్థలంపై గురి.. క్యాంపు ‘భరతం’ పట్టేస్తా..!
చుట్టూ కాంక్రీట్ కట్టడాల నడుమ ఫొటోలో ఆకుపచ్చగా కనిపిస్తున్న ఈ ప్రాంతం కర్నూలులోని బీ, సీ క్యాంపు క్వార్టర్స్. కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అధికారులు నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఏ, బీ, సీ క్వార్టర్లను నిర్మించింది. బీ, సీ క్యాంపు క్వార్టర్స్లో దాదాపు వంద ఏళ్ల నాటి భారీ వృక్షాలు ఉన్నాయి. కిక్కిరిసిన నగరానికి ప్రాణ వాయువు అందించడంలో వీటి పాత్ర చాలా కీలకం. కర్నూలులోనే అత్యధికంగా చెట్లు ఉన్న ఈ ప్రాంతం కూడా ఇదే. అక్కడకు వెళితే ఆ చల్లదనానికి మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి భారీ వృక్షాలను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. బీ, సీ క్వార్టర్లను కూలగొట్టి టీడీపీ జిల్లా కార్యాలయానికి స్థలంతోపాటు మినీ క్రికెట్ స్టేడియం, మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో చకచకా మంత్రాంగం జరుగుతోంది. దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపు క్వార్టర్స్ విలువ దాదాపు రూ.2,700 కోట్లు! కర్నూలు చరిత్రలోనే దీన్ని అతి పెద్ద దోపిడీగా అభివర్ణిస్తున్నారు. బీ, సీ క్యాంపు స్థలాలను ఖాళీ చేయాలని అందులో ఉంటున్న వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా నీరు, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.సాక్షి ప్రతినిధి కర్నూలు: భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబరు 31 వరకూ కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారులు నివాసం ఉండేందుకు ఏ, బీ, సీ క్వార్టర్లను నాటి ప్రభుత్వం నిర్మించింది. నగరంలో ఆ ప్రాంతాలను ఇప్పటికీ ఏ, బీ, సీ క్యాంపు అని వ్యవహరిస్తుంటారు. మొత్తం 1,090 క్వార్టర్లలో ప్రస్తుతం 953 ఉన్నాయి. ఇందులో 367 క్వార్టర్లలో అధికారికంగా కొందరు, 490 క్వార్టర్లలో అనధికారికంగా మరికొందరు నివాసం ఉంటున్నారు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ సెంటు రూ.30 లక్షలకుపైగా ఉంది. ప్రధాన రహదారి ప్రాంతంలోనైతే రూ.50 లక్షలుపైనే ఉంది. సగటున రూ.30 లక్షలు అనుకున్నా ఎకరా రూ.30 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 90 ఎకరాల విలువ రూ.2,700 కోట్లపైనే! నగర నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని, అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆలోచించారు. ఆయన హఠాన్మరణంతో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. సర్కారు ఖరీదైన స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధుల కన్ను బీ, సీ క్యాంపులోని క్వార్టర్లను తొలగించి మినీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని మంత్రి టీజీ భరత్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు గుప్పిట పట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్లు లీజుకు తీసుకుని మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో తొలుత 39 క్వార్టర్లను కూల్చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు అందులో నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనంతరం మిగతావారికి జారీ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ స్థలం కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. తొలగించిన స్థలంలో 3–5 ఎకరాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి మిగతా 85–87 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో 33 ఏళ్లు దక్కించుకునేలా సిద్ధమయ్యారు. ఆ తర్వాత కూడా లీజుదారుడు కొనసాగాలని భావిస్తే మరో రెండు దఫాలు అంటే 66 ఏళ్లు వారి ఆదీనంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే లీజు పేరుతో 99 ఏళ్లు వారి ఆజమాయిషిలోనే ఉంటుంది. కర్నూలులో అత్యంత విలువైన స్థలం ఇదే కావడం గమనార్హం! స్టేడియం కోసం ఇప్పటికే స్థలం సేకరించిన బీసీసీఐ.. కర్నూలులో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐ ఇప్పటికే నేషనల్ హైవే సమీపంలో బాలసాయి స్కూలు పక్కన 16.40 ఎకరాలను సేకరించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే వీలుంది. హైదరాబాద్–బెంగళూరు హైవే పక్కనే ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తవు. ఈ స్థలం ఉన్నప్పటికీ మళ్లీ మినీ క్రికెట్ స్టేడియం పేరుతో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై కూటమి ప్రజాప్రతినిధులు కన్నేయడం గమనార్హం! రెండు నెలలు గడువిద్దామన్నా.. క్వార్టర్లు ఖాళీ చేయించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఐదు ప్రభుత్వ శాఖలను పురమాయించారు. పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ అధికారులను రంగంలోకి దించారు. ఈ నెల 8వతేదీ నుంచి అధికారులు నీరు, కరెంట్ సరఫరా నిలిపివేశారు. పండుగ వేళ తామంతా ఎక్కడికి వెళ్లాలి? పిల్లల చదువులు ఏం కావాలి? ఉన్నఫళంగా కరెంటు, నీరు ఆపేస్తే తాము ఏం చేయాలని అందులో ఉంటున్న కుటుంబాలు అవస్థ పడుతున్నాయి. ఆర్అండ్బీ, కలెక్టరేట్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద మూడు రోజులుగా ఆందోళనకు దిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రెండు నెలలు గడువిద్దామని కీలక ప్రజాప్రతినిధికి అధికారులు సర్దిచెప్పే యత్నం చేసినా వినలేదని చర్చించుకుంటున్నారు. రూ.120 కోట్ల స్థలంలో టీడీపీ కార్యాలయం!టీడీపీ జిల్లా కార్యాలయం కోసం రెండెకరాలు 99 ఏళ్ల పాటు లీజుకివ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలెక్టర్ రంజిత్బాషాకు లేఖకు రాశారు. కర్నూలులో ‘బీ’ క్యాంపు మెయిన్ రోడ్డులోని ఖరీదైన స్థలాన్ని టీడీపీ కోరింది. ఇక్కడ సెంటు రూ.60 లక్షలు వరకు ఉంది. ఈ లెక్కన టీడీపీ కోరుతున్న రెండు ఎకరాల విలువ రూ.120 కోట్లకుపైనే ఉంటుంది! -
తిరుపతిలో ఇద్దరు మహిళలని కిడ్నాప్ చేసిన కూటమి నేత
-
సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లిలో గ్రావెల్కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందాం. సీబీఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా?. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే.. వాళ్లే పోటీ చేయాలని కాకాణి అన్నారు.అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్న కాకాణి.. డిమాండ్ వున్న ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వైపు యూరియా కొరత.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు శూన్యం. సోమిరెడ్డికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదు. ఏదో జగన్ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నోరు పారేసుకోకు అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
టార్గెట్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మళ్లీ జేసీ మార్క్ రాజకీయం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారు.తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని వివరణ ఇచ్చారు.జేసీ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. మళ్లీ మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ గతంలో జేసీ ప్రభాకర్రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
ఆంధ్రప్రదేశ్లో వెయ్యి ఎకరాల దేవుడి భూముల స్వాహాపర్వం... అధికార తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాకాండ
-
గుడి వెనుక గూడు పుఠాణీ
దేవుడి భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే... వాటిని ధారాదత్తం చేసేలా ఆదేశాలిచ్చింది! వారసత్వంగా వస్తున్న మాన్యాన్ని కాపాడాల్సిన సర్కారే... దగ్గరుండి దోచుకునే అవకాశం కల్పిస్తోంది!విలువైన ఆస్తులు కబ్జాకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులనే అడ్డుపెట్టుకుని... అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది..! కళ్లుమూసుకుని... కోర్టు ఆదేశాలను పక్కదారి పట్టిస్తూ.. ఒకటీ, రెండు కాదు ఏకంగా వెయ్యి ఎకరాల ఆక్రమణను ప్రోత్సహిస్తోంది..! సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో భూములకు రక్షణ లేకుండా పోతోంది. అత్యంత విలువైనవాటిని రూపాయి అర్ధరూపాయికి కట్టబెట్టడమే కాదు... వేల ఎకరాలను అమాంతం మింగేసే కుతంత్రాలూ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన రూ. వెయ్యి కోట్ల విలువైన భూముల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వంలో పైస్థాయి పెద్దల సహకారంతో స్థానిక నేతలు చక్రం తిప్పి ఈ బాగోతం నడిపించారు. ఈ గుడికి చెందిన 1036.37 ఎకరాలను ‘‘రిజిస్ట్రేషన్ నిషేధించిన దేవదాయ భూములు’’ జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ద్వారా రిజిస్ట్రార్కు లేఖ రాశారు. ‘‘రిజిస్ట్రేషన్లు నిషే«దించిన దేవదాయ భూముల జాబితా నుంచి తొలగింపు’’ అంటే ఈ వెయ్యి ఎకరాలకు పైగా భూముల స్వాహాకు తెరతీసినట్లే..! ఇకమీద ఎవరైనా అమ్ముకునే, కొనుక్కునేందుకు వీలు కల్పించినట్లే! తద్వారా వేణుగోపాలస్వామి భూములపై ఆలయం అన్ని అధికారాలు కోల్పోయినట్టే...! ఈ విషయాన్ని దేవదాయ శాఖ వర్గాలే నేరుగా అంగీకరిస్తున్నాయి...! ప్రభుత్వ ఆదేశాల వెనుక ‘ముఖ్య’నేత సహకారం, ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ నేత పాత్ర ఉందని తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతల పైరవీలు, పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారడంతోనే ఇలా జరిగిందని ఉద్యోగులు చెప్పుకొంటున్నారు.6 దశాబ్దాలుగా దేవుడి పేరిట...గంపలగూడెం మండలం నారికంపాడు గ్రామంలో సర్వే నంబర్ 1 నుంచి 74–2 మధ్య ఉన్న 1036.37 ఎకరాలను పలువురు దాతలు వినపగడప జగన్మోహన వేణుగోపాలస్వామి ఆలయానికి రాసిచ్చారు. దీనిపై దేవదాయ శాఖ వద్ద 60 ఏళ్ల నాటి రికార్డులు కూడా ఉన్నాయి. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం నిర్వహించే ఆలయ రికార్డులో, 1987 దేవదాయ శాఖ చట్టం మేరకు ఆలయాల వారీ ఆస్తుల రిజిస్టర్డ్ నంబరు 43లోనూ 1036.37 ఎకరాలు వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన ఇనాం భూమిగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అంతేగాక దేవదాయ శాఖ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ల నిషేధ 22(ఏ)(1)(సి) జాబితాలోనూ ఉంచారు. అయితే, ఈ 1036.37 ఎకరాలలో 28.35 ఎకరాలు తమవిగా పేర్కొంటూ మేకా తనూజ్ రంగయ్య అప్పారావు, మరో వ్యక్తి హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారి భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత ఏడాది అక్టోబరు 18వ తేదీన హైకోర్టు ఆదేశాలిచ్చింది. వీటిప్రకారం చర్యలు తీసుకోవాలంటూ మేకా తనూజ్ రంగయ్య అప్పారావు... ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీన 28.35 ఎకరాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దేవదాయ శాఖ కమిషనర్కు లేఖ రాశారు. తర్వాత దేవదాయ శాఖ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వం మధ్య ఈ ఏడాది మార్చి 6, 8న, ఏప్రిల్ 8, జూలై 4న ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. అనంతరం ఏకంగా మొత్తం 1,036.37 ఎకరాలను రిజిస్ట్రేషన్ల నిషేధ జాబితా నుంచి తొలగించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ఆగస్టు 13న ఆదేశాలిచ్చేశారు.అర్చకుడికి జీతాలూ ఇవ్వలేని స్థితివినగడప శ్రీజగన్మోహన వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.లక్ష ఆదాయం కూడా లేదు. రూ.12 లక్షలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా... వడ్డీ, ఇతర రాబడులు అన్నీ కలిపి ఏటా రూ.70–రూ.80 వేల మధ్య వస్తున్నాయి. ఈ డబ్బు అర్చకుడి జీతాల చెల్లింపులకే సరిపోతున్నాయని, చిన్న ఉత్సవం జరగాలన్నా గ్రామస్తులు చందాలు వేసుకోవాల్సి వస్తున్నదని ఆలయ సిబ్బంది వాపోతున్నారు.ధర్మకర్తే అధర్మంగా వ్యవహరిస్తే...దేవుడి భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవదాయ శాఖలది. ఈ క్రమంలో కొన్నిసార్లు కింది కోర్టుల తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా... గుడి ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఉదాహరణలున్నాయి. ఒక్క గజం కూడా కోల్పోకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, శ్రీజగన్మోహన వేణుగోపాలస్వామి ఆలయ భూములపై హైకోర్టు కేవలం 28.35 ఎకరాల విషయంలో తీర్పు చెబితే... ప్రభుత్వం ఏకంగా 1,036 ఎకరాలను రిజిస్ట్రేషన్ల నిషేధ దేవదాయ శాఖ భూముల జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతకంటే విడ్డూరం ఏమీ ఉండదని దేవదాయ శాఖ అధికారుల్లో చర్చ నడుస్తోంది.హైకోర్టు తీర్పునే తప్పుదారి పట్టించేశారు...నిరుడు అక్టోబరు 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు... ఆ భూముల సాగుదారులుగా పేర్కొంటున్న రైతులు దేవదాయ శాఖను సంప్రదించారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొంది... 1,036.37 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు దేవదాయ శాఖ ఉన్నతాధికారి పేర్కొంటున్నారు. కానీ, హైకోర్టు తీర్పు వెలువరించిన పిటిషన్లో... తమ 28.35 ఎకరాలకు సంబంధించి మాత్రమే పిటిషన్దారులు కేసు వేశారు. కోర్టు కూడా ఆ భూములపైనే తీర్పు ఇచ్చింది.⇒ ఇక గతంలో... జగన్మోహన వేణుగోపాలస్వామి ఆలయానికి దాతలు ఇచ్చిన 1036.37 ఎకరాలకు ఏటా రూ.1,080 (ఎకరాకు రూ.1.04) చొప్పున భత్యం చెల్లించే ఒప్పందంతో జిల్లా కలెక్టర్ ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.సుప్రీం తీర్పును పక్కన పెట్టిమరీ..దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఇనాం భూములపై గతం నుంచి వర్తించే విధంగా... సుప్రీంకోర్టు 2013లో కీలక తీర్పు వెలువరించింది. దీనిప్రకారం 2013కి ముందు, ఆ తర్వాత సంబంధిత ఇనాం భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవు. 2013కు ముందు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి వాటిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ అది చెల్లుబాటు కాదు. వినగడప వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల రికార్డులో ఇనాంగా పేర్కొన్నందున సుప్రీంతీర్పు ఈ భూములకూ వర్తిస్తుంది. కానీ, అధికార పార్టీ నేతల పైరవీలు, పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, వేణుగోపాలస్వామి ఆలయ భూములు దేవదాయ శాఖవి కాబట్టే కలెక్టరు ఏటా భత్యం చెల్లిస్తున్నారని, రిజిస్ట్రేషన్ల నిషేధ జాబితా నుంచి తొలగిస్తే ఆ భూములపై హక్కు కోల్పోయినట్టేనని అధికారులు పేర్కొంటున్నారు. -
‘దేవుడి ఆస్తిని 99ఏళ్ళు లీజుకు ఇస్తారా..?.. ఇదేం దోపిడి చంద్రబాబు’
సాక్షి,తాడేపల్లి: వైఎస్ జగన్ను తిట్టిన పట్టాభికి దేవుడి ఆస్తులను అక్రమంగా కట్టబెట్టారు. దేవుడి ఆస్తిని 99ఏళ్ళు లీజుకు ఇస్తారా..? కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా?. దేవుడి ఆస్తులను దొంగలకు దోచిపెడతారా? అంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆఫీస్ నుంచి టైప్చేస్తే బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయనగరంలో రఘురాముడి తలను ధ్వంసం చేసింది కూటమి సభ్యుడు. నారసింహుడి రథం దహనం కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశాం. అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని పునర్నిర్మించింది వైఎస్ జగన్.ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ,టీడీపీ కలిసి చేసే పాపాలను మర్చిపోదామా?. తిరుమలలో వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన ఘటనను మర్చిపోదామా. తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసిన వారిని మర్చిపోదామా?. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చిన ఘటనను మర్చిపోదామా? గోదావరి పుష్కరాల్లో మరణాలను మర్చిపోదామా?’ అని ప్రశ్నిస్తూ.. తన ప్రెస్మీట్ను కొనసాగించారు.టీడీపీ హయాంలో ధ్వంసమైన ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారు. విజయవాడలో 200 ఆలయాలను చంద్రబాబు హయాంలో కూల్చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆలయాలను కూల్చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకు,గ్రావెల్,మట్టి దోచేసి ఇప్పుడు దేవుడు ఆస్తులను కూడా దోచ్చేస్తున్నారు. వైఎస్ జగన్ను తిట్టిన పట్టాభికి దేవుడి ఆస్తులను అక్రమంగా కట్టబెట్టారు. దేవుడి ఆస్తులను దొంగలకు దోచిపెడతారా? అంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మద్యం అక్రమ కేసు.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లొ సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలోనూ కూడా సునీల్ పని చేయలేదు. మరో భేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.కుట్రలు.. పన్నాగాలు.. బెదిరింపులు.. వేధింపుల మధ్య.. అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మద్యం అక్రమ కేసును నడిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కక్ష సాధింపే లక్ష్యంగా.. దెబ్బతీయడమే ఉద్దేశంగా.. అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లుతోంది.కాగా, మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు సర్కార్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది. -
Dulam Nageswara Rao: అదే నా ధైర్యం కైకలూరు గడ్డ DNR అడ్డా
-
‘ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు: రవీంద్రనాథ్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందని.. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అని.. బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పాలన రాష్ట్రంలో సాగుతుందంటూ దుయ్యబట్టారు. ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించారని.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గొప్ప ఆలోచన చేశారని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు.‘‘మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజలకు మంచి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం.. ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్య చదివేందుకు వీలు ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ విజయోత్సవ సభ పెట్టడం సిగ్గు చేటు. ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబు మానుకోవాలి’’ అని రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. -
పవన్ తో చంద్రబాబు.. లోకేష్ ఎక్కడ? తండ్రిని పక్కనబెట్టిన చినబాబు!
-
సూపర్ సిక్స్ సభకు రాకుంటే రూ.200 ఫైన్
సాక్షి, అనంతపురం: ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్ సభకు రానివారికి రూ.200 ఫైన్ వేస్తాం. లోన్ మంజూరు, పొదుపు సమయంలో ఇబ్బందిపడతారు’ అంటూ డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ అనంతపురంలో ప్రభుత్వం బుధవారం నిర్వహించిన సభకు తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలపై వెలుగు యానిమేటర్లు, సీసీల ద్వారా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో వారు అయిష్టంగానే సభకు వచ్చారు. అయినా, సీఎం చంద్రబాబుతో పాటు ఇతర నాయకుల ప్రసంగాలు వినకుండా అన్యమనస్కంగా కనిపించారు. ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్లిపోదామా అనే భావనతో ఉన్నట్లు అనిపించింది.అనంతపురం రూరల్ మండలం పాపంపేట, మరికొన్ని ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల లీడర్లు అధికారులపై తిరగబడ్డారు. మాకు ప్రభుత్వం తరఫున పైసా లబ్ధి చేకూర్చలేదు. మేం సభకు ఎందుకు రావాలి అని నిలదీశారు. రాయలసీమలోని పాత ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడపల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసినా సభకు అంతంతమాత్రమే హాజరయ్యారు. కొన్ని బస్సుల్లో అయితే నలుగురైదుగురు కూడా రాలేదు. చివరకు కూటమి పార్టీల కార్యకర్తలకు సైతం చాలావరకు డబ్బు, మద్యం, ఆహార పొట్లాలు ఇచ్చి ప్రత్యేక బస్సులు, వాహనాల్లో తీసుకొచ్చారు. తప్పతాగిన ‘తమ్ముళ్లు’ సభా ప్రాంగణంలోనే చిందులు తొక్కారు.మరికొందరు మద్యం మత్తులో సభకు రాలేక బస్సుల్లోనే ఉండిపోయారు. ఇక ట్రాఫిక్ మళ్లింపుతో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–44) గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతపురం నగరంలోనూ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించడంతో ప్రజలు, వాహనదారులు అసహనానికి గురయ్యారు. సీఎం సభ ఉంటే మరీ ఇన్ని ఆంక్షలా? ఇంత ఓవరాక్షనా? అంటూ మండిపడ్డారు. -
నందిగామ: వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. నందిగామలో అన్నదాత పోరులో పాల్గొన్నందుకు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ర్యాలీపై నందిగామ ఏఎస్ఐ లంకపల్లి రవి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 30 నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా నిరసన, ర్యాలీ చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావులతో పాటు మొత్తం 20 మంది పై కేసులు చేశారు. -
ఈవీఎంలు, ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాల పోరాటాలు చేస్తామన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. తాను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానానని వైఎస్ జగన్ తెలిపారు. ఇదేస సమయంలో పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రైవేటీకరణపై అన్నిరకాల పోరాటం చేస్తాం. ఆందోళనలు, నిరసనలు చేస్తాం. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాలుగా పోరాడుతాం. నేను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఇందులో కలిసి రావాలని పిలుపు ఇస్తున్నాం. అయినా బరి తెగిస్తే.. ఊరుకోం. ఎవరు టెండర్లలో పాల్గొంటారో పాల్గొండి.. మేం చూస్తాం. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేస్తాం.. గుర్తు పెట్టుకోండిప్రతిపక్ష హోదాపై..18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మా పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏం చెప్పగలుగుతాం. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మాకు హోదా ఇవ్వడం లేదు. గతంలో సభలో జరగిని దాడికి చంద్రబాబు ఏడ్చేసి నానా యాగి చేశారు. చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారు అని ప్రశ్నించారు.ఎన్నికల విషయమై..స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ అనే.. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్లో ఇవాళ ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్.. ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్టైజ్మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్సిక్స్లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.సూపర్ సిక్స్కు పొంతనేది..ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్కు ఈరోజు సూపర్ సిక్స్ పొంతన లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ ధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రతీ మహిళకు 36వేలు ఇచ్చారా?.నిరుద్యోగ భృతి కింద రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు బాకీ పడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు గతేడాది 48వేలు, ఈ ఏడాది 48 వేలు పెన్షన్లకు ఎగనామం పెట్టారు. మేము దిగిపోయే నాటికి 66,34,742 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పుడు 61,91,864 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇది మోసం కాదా? చంద్రబాబు అని అడుగుతున్నాను. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామన్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రైతులకు రూ.40వేలు బాకీపడ్డారు. తల్లికివందనం కింద 15వేలు ఇస్తామన్నారు. రూ.8వేలు, 9వేలు, 13వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.ఉచితం పేరిట.. ఇసుక దోపిడీ నడుస్తోంది. లిక్కర్ మాఫియా నడుస్తోంది. అమరావతి పేరిట మాపియా జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు. సూపర్సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం ఇది. చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి అని చెప్పుకొచ్చారు. -
బ్లాక్ మార్కెట్కు చంద్రబాబే భాగస్వామి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది?. సీఎం సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.ఏపీలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ైవైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా?. మా హయంలో రైతులకు ఇబ్బంది అనేదే రాలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారు. మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు. అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?. జగన్ అనే వ్యక్తి రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించారు. ఇప్పుడు ఎరువుల దగ్గర కూడా స్కామ్లకు పాల్పడుతున్నారు. ీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది. ఎంత మొత్తంలో ఎరువులు కావాలో తెలియదా?. చంద్రబాబు చెప్పినట్టు యూరియా సరఫలా జరిగిందా.?రైతుల అవస్థలకు కారణం.. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబే ఇందులో భాగస్వామి రైతులను పీడించి.. స్కామ్లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు. దాచుకో.. దోచుకు. యూరియా విషయంలో రూ.250 కోట్ల స్కామ జరిగింది’ అని ఆరోపించారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే.. మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి. తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. అందుకే ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరి మీద చర్యలు లేవు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా?. ఉల్లి, టమాటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సున్నా వడ్డీ పథకం ఎత్తేశారు అని ఆరోపించారు. -
బాబు ప్రైవేట్ పిపాసకు ఏపీలో వైద్యం బలి!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒట్టి అమాయకులన్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొందరు నేతల చేతిలో పదే పదే మోసపోతూంటారు మరి. ఒకసారైతే ఏమో అనుకోవచ్చు కానీ.. పదే పదే మోసపోతూంటే అది ప్రజల తప్పే కదా? ప్రస్తుత ముఖ్యమంత్రి.. గతంలోనూ ఈ పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడినే ఉదాహరణగా తీసుకోండి. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఈయన చెప్పేదొకటి. చేసేది ఇంకోటి. మూడుసార్లు సీఎంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిన రికార్డు మాత్రం లేదీయనకు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షించి వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన పది వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే నడపాలని నిర్ణయించారు. మెరుపువేగంతో పలు కళాశాలల నిర్మాణమూ సాగింది. ఐదింటిని ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా మొదలుపెట్టే క్రమంలో ఎన్నికలకొచ్చాయి. అధికారం జగన్ చేజారింది. చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఈ వైద్యకళాశాలలపై పగబట్టినట్టు వ్యవహరించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లు వద్దనేశారు. ప్రజల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఫలితంగా వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు పరం కానుంది. అయితే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని, తమది సంపద సృష్టించే పార్టీ అని ఎన్నికల సమయంలో ఊరంతా ఊదరగొట్టిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సంపదను అప్పనంగా ఇంకొకరికి ధారాదత్తం చేస్తున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్! ఎకరాకు వంద రూపాయల లీజంట. కాకపోతే ఆయన సంపద సృష్టిస్తానన్నారే గానీ.. పేదల కోసమని చెప్పారా ఏంటి? చెప్పలేదు లెండి! ఇంకో విచిత్రమూ ఉందిక్కడ. చంద్రబాబు ఈ మధ్య పదే పదే వల్లెవేస్తున్న పీ-4కు ఈ వైద్య కళాశాలల అమ్మకానికి లింకు పెట్టడం! ప్రభుత్వం నుంచి చౌక ధరలకు ఆస్తులు ఆస్తులు పొందిన వారు లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పీ-4 కింద పేదలను దత్తత తీసుకుని వారిని ఉద్ధరిస్తారని బాబు చెబుతున్నారు. పైగా సంపన్నులు-పేదల మద్య లింక్ పెట్టడానికి పి-4 విధానం తెస్తానని అన్నారు. అదేమిటో తొలుత చాలామందికి అర్ధం కాలేదు. ప్రభుత్వంలోకి వచ్చాక తన స్కీములు కొన్నిటిని ముఖ్యంగా ఆడబిడ్డ నిధి బదులు పి-4 తో సరిపెట్టుకోవాలని ఆయన ప్రత్యక్షంగా,పరోక్షంగా చెప్పారు. అంటే ఆయన ప్రైవేటువారికి సంపద సృష్టిస్తారు.ఆ తర్వాత వారు దయతలచి పేదలకు ఏదో కొంత విదిలిస్తారన్నమాట. 2024లో అనూహ్యంగా ఎన్నికై ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని విషయాలలో చంద్రబాబు యు-టర్న్ తీసుకున్నారో చెప్పనవసరం లేదు. బాబు ప్రైవేట్ పక్షపాతి అనేందుకు వైద్య కళాశాలల ఉదంతం తాజాది మాత్రమే. గతంలోనూ ఎన్నో కనిపిస్తాయి. అత్యంత విలువైన విశాఖ భూములను అణా, కాణికి తెగనమ్ముతూండటం గురించి చెప్పుకోవాలిక్కడ. గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ కోసం టాటా కన్సెల్టెన్సీ సంస్థ భూమి లీజుకు అడిగింది. వ్యవహారం ముందు నడుస్తూండగానే అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ప్రభుత్వం లీజుమాటను పక్కకు పెట్టేసి చాలా ఉదారంగా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకు ధారాదత్తం చేస్తామని ప్రకటించింది. అయితే న్యాయస్థానాలు, ప్రజాసంఘాల విమర్శల నేపథ్యంలో దీన్ని లీజుగా మార్చారేమో తెలియదు. పనిలో పనిగా తమకు కావాల్సిన మరో కంపెనీకి 60 ఎకరాలు ఇదే పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కానీ.. వివాదం కావడంతో ఎకరా అర కోటికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. పరోక్షంగా రూ.వంద కోట్ల లాభం చేసి పెట్టారన్నమాట. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. వాటిలోని ఉద్యోగులందరికి వీఆర్ఎస్ ఇచ్చి పంపేశారు. ఆ సంస్థలను పొందిన కొన్ని కంపెనీలు అక్కడి భూమితోనే సంపద సృష్టించుకోగలిగాయి. విశాఖ స్టీల్ను ఎట్టి పరిస్థితిలోను ప్రైవేట్ పరం కానివ్వమని ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు 34 విభాగాల ప్రైవేటీకరణను ఖండించకపోగా తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు సందర్భంలోనూ బోలెడంత ఆదా అవుతుంందని, ఛార్జీలు తగ్గించవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది సున్నా. మోపెడైన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు నలుగురు యువకుల మరణానికి కారణమయ్యారు. ఉచిత విద్యుత్తునిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. తదనంతర కాలంలో తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని ప్రచారం చేసుకోగలిగారు నిస్సిగ్గుగా! అంతెందుకు! గత జగన్ టర్మ్లో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లెక్కించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేశ్ పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అవే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు కూడా బిగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీల పరం చేస్తున్నారు. దీనివల్ల బీమా కంపెనీలకు ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆ సంస్థలకు సంపద అంటే ప్రజల ధనం చేరుతుందన్నమాట. జగన్ ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను ఊరుబయట నడిపిస్తే, చంద్రబాబు సీఎం కాగానే వాటన్నిటిని తీసేసి ప్రైవేటు వారికి, ముఖ్యంగా తన పార్టీ వారికి ఆదాయ వనరుగా మార్చారు. అది సంపద సృష్టి అన్నమాట.పలు రోడ్లను ప్రైవేటు పరం చేస్తారట. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కూడా ఎల్లో మీడియా అండతో సమర్థించుకోవడం ఆరంభమైంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ప్రభుత్వ రంగంలో అయితే బాగా నడవవని కూడా ప్రచారం చేయిస్తారు. ప్రభుత్వ ప్రచారం కోసం రూ.2300 కోట్లతో ఫైబర్ నెట్ సంస్థను అభివృద్ది చేసి, నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగిస్తారని ఎల్లో మీడియానే రాసింది. సూపర్ సిక్స్ వంటివాటి అమలుపై పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అని కూడా చంద్రబాబు కొన్నిసార్లు అన్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కొన్ని హామీలనైనా కొంతమేరకైనా అమలు చేయక తప్పడం లేదు. వైద్య కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఘాటు ప్రకటన చేశారు. ‘‘కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా’’ అని ప్రశ్నించారు. 2019కి ముందు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తెచ్చారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వైద్య కళాశాలలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.టీడీపీ మద్దతుదారుల్లోనూ చాలామందికి వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నచ్చడం లేదు. ఈ మధ్య లోకేశ్ విజన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా అదే తరహా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగం చూస్తే ఆయన ప్రస్తుత మంత్రి నారాయణ ద్వారా బ్రిడ్జి కోర్స్ చదివారట. మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలలోనే ఆయన చదువు కొనసాగింది. ప్రైవేటు యూనివర్శిటేలే బెటర్ అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న ఆయన ప్రస్తుత విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇవేవి పట్టవు కాబట్టి వీరికి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు పేదల సంక్షేమానికి పుట్టిన పార్టీగా చెప్పేవారు. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక అది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టించే పార్టీగా గుర్తింపు పొందుతోంది. సినిమాల ద్వారా ధనికుడు అయిన ఎన్టీఆర్. పేదల సంక్షేమం గురించి స్కీములు తెచ్చారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లు పేదల పక్షపాతులుగా పేరు తెచ్చుకున్నారు. పేదరికం నుంచే వచ్చిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శకు గురి అవుతున్నారు.. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సి.ఎమ్.గా రికార్డు సాధించారు. ఆయన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల డార్లింగ్ గా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైద్య కళాశాలలను పిపిపి పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఆంధ్ర ప్రజలదా? లేక చంద్రబాబుదా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Audio Leak: జేసి అనుచరుడి సంచలన ఆడియో
-
చంద్రబాబు సభ.. తాడిపత్రి టీడీపీలో పొలిటికల్ వార్
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తమ బల ప్రదర్శనకు ఇరు వర్గాల నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు తాడిపత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. సొంత పార్టీ నేతల వాహనాలపై విధ్వంసానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సిద్దమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గాల మధ్య రాజకీయం ఘర్షణలకు దారి తీస్తోంది. తాడిపత్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే చంద్రబాబు సభ వద్దకు వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో లేని వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో జేసీ వర్గం.. నిర్దేశిత ఫార్మాట్, ఆడియోను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మరోవైపు.. సుమారు వంద వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేశారు. జేసీ వర్గానికి కౌంటర్ ఇస్తూ వాహనాలపై స్టిక్కర్లు వేసినట్టు సమాచారం. ఇక, జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా రాళ్లు జేసీ ప్రభాకర్-కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. -
సభకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్
అనంతపురం: ‘సంక్షేమ పథకాలు తీసుకునేవారు సీఎం చంద్రబాబు సభకు హాజరు కావాలి. అలా వస్తేనే పథకాలు కొనసాగుతాయి..’ ఇది అనంతపురం జిల్లాలోని గ్రామాల్లో వేసిన చాటింపు. బుధవారం అనంతలో ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ పేరిట ప్రభుత్వం భారీ సభ తలపెట్టింది. దీనికి చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడచూసినా కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు, పోలీసుల హడావుడే..! ఐదు కిలోమీటర్ల దూరం నుంచే బస్సులు, భారీ వాహనాల మళ్లింపు, నగరంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి.సభ ఏర్పాట్ల పేరిట ఇబ్బంది పెడుతుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. బెంగళూరుకు వెళ్లే రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అనంతపురం నుంచి వడియంపేట–బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్–నార్పల–ధర్మవరం–ఎన్ఎస్ గేట్ మీదుగా వాహనాలను మళ్లించడంతో 100–120 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. నార్పల నుంచి బత్తలపల్లికి వెళ్లే మార్గం సరిగా లేదు. వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కియా కంపెనీ ఉద్యోగులు అనంతపురం నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. చంద్రబాబు సభ పుణ్యమాని ఏకంగా 150 కిలోమీటర్ల దూరం చుట్టి వెళ్లాల్సి వస్తోంది. అనంతపురం శివారు కక్కలపల్లి టమాట మండీలకు నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మండీలకు సమీపాన జాతీయ రహదారి–44 పక్కనే సీఎం సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే వాహన రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ టమాట వాహనాలను ఆపి పంపుతున్నారు. కక్కలపల్లి మండీ సమీపంలోకి వెళ్లడానికి వీల్లేకుండా చేశారు. టమాట వాహనాలను తిప్పి పంపుతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇక నగర వీధులను ఫ్లెక్సీలతో నింపేశారు. సామాన్యులు రోడ్డుపై తిరగలేని పరిస్థితి కల్పించారు. దీనినితోడు నగరంలోనూ వాహన సంచారంపై పోలీసులు ఆంక్షలు విధించడం విమర్శలకు తావిస్తోంది. సభకు రాకుంటే పథకాల కోత! ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు సభలకు స్పందన లేకపోవడంతో జన సమీకరణకు సరికొత్త డ్రామాలకు తెరలేపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో చాటింపు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలి. దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారు. చంద్రబాబు సభలో పాల్గొన్నవారికే పథకాలు వస్తాయి’’ అంటూ దండోరా వేయడం విమర్శలకు తావిచ్చింది. పాఠశాలలకు సెలవు.. ఉపాధ్యాయుల ఆగ్రహం అనంతపురంలో సూపర్సిక్స్ సభ నేపథ్యంలో బుధవారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు సభకు పాఠశాలల బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. నేటి సెలవుకు బదులుగా రెండో శనివారం (ఈనెల 13న) అన్ని యాజమాన్యాల పాఠశాలలు పని చేయాల్సి ఉంటుందని డీఈఓలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఎకరం రూ.వంద.. పక్కా దందా!
సాక్షి, అమరావతి: డాక్టర్ కావాలని కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్ర విద్యార్థులను టీడీపీ కూటమి ప్రభుత్వం నమ్మించి గొంతు కోసింది. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోకి తెస్తామని హామీలిచి్చ, గద్దెనెక్కాక నిలువునా వంచించింది. సీట్లను ప్రభుత్వ కోటాలోకి తేవడం అటుంచి.. ఏకంగా కళాశాలలనే కారు చౌకగా ప్రైవేట్పరం చేయడానికి పూనుకుని విద్యార్థులతో పాటు, రాష్ట్ర ప్రజలకూ సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్పరం చేయడానికి ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వైద్య కళాశాలలను పీపీపీలో నిర్వహణకు అధికారుల కమిటీ సూచించిన ప్రతిపాదనలకు మంగళవారం వైద్య శాఖ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో 10 కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడానికి అనుమతిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ల ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే బాధ్యతను ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పజెప్పారు. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె.. రెండో విడతలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురం వైద్య కళాశాలలు ప్రైవేట్కు ధారాదత్తం చేయనున్నారు. ఏకంగా 66 ఏళ్లపాటు హక్కులు ⇒ సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి కత్తెర వేసి పేదలను నిలువునా దగా చేశారు. ప్రభుత్వాస్తులను అస్మదీయులకు దోచి పెట్టడం కోసం పీపీపీ ముసుగులో కుట్రలకు తెరలేపారు. ఈ కుట్రలో రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కల, నిరుపేదల ఉన్నత వైద్యం ఆశలు నెరవేర్చే ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకూ మినహాయింపు ఇవ్వలేదు. ⇒ తద్వారా తాను నడుపుతోంది ప్రభుత్వం కాదని.. నారా వారి మాయాబజార్ అని బాబు మరోసారి నిరూపించుకున్నారు. రూ.వేల కోట్ల ప్రజాధనం వెచి్చంచి, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, వాటి భూములను తేరగా పప్పు బెల్లాలుగా అస్మదీయులకు పంచిపెడుతున్నారు. పీపీపీ నిర్వహణ పేరిట ఏకంగా 66 ఏళ్ల పాటు వాటిపై హక్కులు కల్పించబోతున్నారు. ⇒ విశాఖలో రూ.కోట్ల విలువైన భూమి ఉర్సాకు ఎకరం రూ.99 పైసలకే కట్టబెట్టడానికి యత్నించిన విధంగానే వైద్య కళాశాలలకు సంబంధించిన విలువైన భూమిని ఎకరానికి కేవలం రూ.100గా నిర్ణయించారు. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా పెట్టుబడిదారులకు తేరగా అప్పగించేస్తుండటం విస్తుగొలుపుతోంది. ⇒ ప్రైవేట్ వ్యక్తుల అజమాయిïÙలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు ఉండవు. ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి వంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందుతాయి. పీపీపీలో ప్రైవేట్కు ఇచ్చేస్తున్న నేపథ్యంలో 30 శాతం పడకల్లో ఇన్ పేషంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లలకు ప్రజల నుంచి యాజమాన్యానికి డబ్బు వసూళ్లు చేసుకునే వీలు కలి్పంచారు. సగం మెడికల్ సీట్లను ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. 2,450 మంది జీవితాలు తలకిందులు ⇒ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంపు, బోధనాస్పత్రి రూపంలో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఐదు కళాశాలలు 2023–24లోనే అందుబాటులోకి రావడంతో రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల కళాశాలలు ప్రారంభం అవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుçపడింది. పులివెందులలో 50 సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వగా, ప్రభుత్వమే కుట్ర పూరితంగా లేఖ రాసి అనుమతులు రద్దు చేయించింది. ⇒ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాదే 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా బాబు ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలతో ఏకంగా 700 సీట్లు రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వాల్సిన పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ఆగిపోయాయి. ఈ కళాశాలలు ఈ ఏడాది ప్రారంభమై ఉంటే 1,050 సీట్లు సమకూరేవి. ⇒ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కోసం కళాశాలలు రాకుండా బాబు ప్రభుత్వం అడ్డుపడటంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. దీంతో డాక్టర్ కావాలని ఆశలు పెట్టుకున్న 2,450 మంది విద్యార్థుల జీవితాలు ఇప్పటికే తలకిందులు అయ్యాయి. -
బాబు.. బూటకపు బీమా!
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం’.. ఇదీ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ, అన్ని వాగ్దానాల్లాగానే దీనినీ తుంగలో తొక్కారు సీఎం చంద్రబాబు. ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేసేందుకు ‘బీమా’ను తెరపైకి తెచ్చింది కాక... అందులో కూడా మోసానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు 3,257 ప్రొసీజర్లతో రూ.25 లక్షల కవరేజీతో అమలవుతున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ 2,550 ప్రొసీజర్లతో కేవలం రూ.2.5 లక్షలకే బీమాను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ బీమా విధానానికి ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై)లోని ప్రొసీజర్లకు మరికొన్ని జోడించి బీమా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులిచ్చింది. ఈ మేరకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ⇒ 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అరకొరగా ఆరోగ్యశ్రీ సేవలు అందేవి. ⇒ అనారోగ్యం పాలైన పేదలు వైద్య చికిత్సలకు తల తాకట్టు పెట్టి అప్పులు చేయాల్సి వచ్చేది. 2019–24 మధ్య ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దిన వైఎస్ జగన్ ప్రభుత్వం... ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 3,257 ప్రొసీజర్లతో రూ.25 లక్షల వరకు పరిమితితో ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. ⇒ నిరుడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ బీమా విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటించింది. మళ్లీ 2019కి ముందునాటి పరిస్థితులకు నాంది పలికింది. పీఎంజేఏవైలోని 1949 ప్రొసీజర్లకు 601 కలిపి బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ లెక్కన 700పైగా ప్రొసీజర్లకు ప్రభుత్వం కోత విధించినట్టు స్పష్టమవుతోంది.అంతేగాక వీటిలోని 324 ప్రొసీజర్లను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. రేషనలైజేషన్ సాకుతో ఏకంగా 186 ప్రొసీజర్లను ఎత్తేశారు. 197 ప్రొసీజర్లను ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు రిజర్వ్ చేసినప్పటికీ వీటికి డబ్బులను చికిత్స అనంతరం బీమా కంపెనీకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. అంటే, పేద, మధ్య తరగతి ప్రజలకు రూ.2.5 లక్షలకు మించి చికిత్స వ్యయం అయితే ఆ భారాన్ని తొలుత బీమా కంపెనీలే భరించాలి. ఈ లెక్కన చిన్న అనారోగ్య సమస్య నుంచి కాక్లియర్ ఇంప్లాంటేషన్ వంటి పెద్ద చికిత్సల దాక ప్రతిదానికి ప్రజలు బీమా కంపెనీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన దుస్థితిని ప్రభుత్వమే నేరుగా కల్పిస్తోంది. ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 1.63 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అర్హతల్లో వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో పేదలతో పాటు, మధ్య తరగతికి చెందిన 1.43 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. ప్రజారోగ్యంతో బాబు చెలగాటం..కూటమి 15 నెలల పాలనలో ఆరోగ్యశ్రీని నిరీ్వర్యం చేస్తూ వచ్చారు చంద్రబాబు. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం, కొత్త ఆస్పత్రులకు అవకాశం ఇవ్వకపోవడం సహా పథకం అమలును గాలికి వదిలేశారు. పేదలు చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేట్ ఆస్పత్రుల మెట్లెక్కితే యాజమాన్యాలు నిర్మొహమాటంగా బయటకు పంపించే పరిస్థితి తెచ్చారు. వివిధ రాష్ట్రాల్లో విఫలమైన బీమా విధానాన్ని ఏపీలో అమలు చేస్తూ ప్రజారోగ్యంతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కుపిండి ప్రీమియం వసూలు చేసి, ప్రయోజనాలు అందించడంలో ఎగవేతలు, కోతలకు దిగే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యం పెడుతున్నారని విమర్శలు హోరెత్తుతున్నాయి. -
సర్కారు దగాకోరు విధానాలపై అన్నదాత కన్నెర్ర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి.. కృత్రిమ కొరత సృష్టించి.. ఎమ్మార్పీ ధర కంటే బస్తాపై రూ.200 అధికంగా విక్రయిస్తూ తమను దోపిడీ చేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్న టీడీపీ కూటమి సర్కార్పై రైతులు తిరగబడ్డారు. టమాటా, మిర్చి, పొగాకు నుంచి బత్తాయి, ఉల్లి వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి, ధీమా లేకుండా చేయడంతోపాటు వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన సర్కార్ తీరును నిరసిస్తూ కదంతొక్కారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యధావిధిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి పోలీసులను ప్రయోగించింది. దాంతో.. పోలీసు యాక్ట్–30 అమల్లో ఉందని, నిరసన కార్యక్రమాలు చేపట్టినా.. పాల్గొన్నా కేసులు పెడతామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మైక్ల ద్వారా ప్రచారం చేశారు. మంగళవారం తెల్లవారుజామునే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి.. గృహ నిర్బంధం చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లే దారులపై భారీ ఎత్తున బారికేడ్లు పెట్టి.. రైతులు వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరించారు. గృహ నిర్బంధాలను వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయలేదు. పోలీసుల బెదిరింపులకు రైతులు అదరలేదు, బెదరలేదు సరికదా తిరగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు వేలాదిగా కదలివచ్చి.. టీడీపీ కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ కదంతొక్కారు. ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతు ద్రోహి చంద్రబాబు..’ అంటూ నినాదాలు చేశారు. రాజమహేంద్రవరంలో ఉద్రిక్తతరాజమహేంద్రవరంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణరెడ్డి రెండు గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య నేతలు, రైతులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అనంతపురంలో కదం తొక్కుతున్న రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆంక్షలు విధించినప్పటికీ నేతలు, రైతులు లెక్క చేయలేదు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ఆర్డీవో కార్యాలయాల సమీపంలో పోలీసులు రైతులను నిలువరించడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. ‘అన్నదాత పోరు’ కార్యక్రమం ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో విజయవంతంగా సాగింది. అనకాపల్లి జిల్లాలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. విశాఖ జిల్లాలో ఉద్రిక్తత నడుమ అన్నదాత పోరు విజయవంతమైంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలువురు నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను హౌస్ అరెస్ట్ చేశారు. అనకాపల్లిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు నోటీసులు ఇచ్చి, పోలీసులు చుట్టుముట్టారు. కార్యకర్తలను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అన్ని చోట్లా ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోలకు వినతిపత్రం అందజేశారు.ఆంక్షలను లెక్క చేయని ‘సీమ’ రైతులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ‘అన్నదాత పోరు’ విజయవంతమైంది. పలుచోట్ల అడుగడుగునా ఆంక్షలు విధించినా కర్షకులు పట్టుదలతో కదం తొక్కారు. కర్నూలు జిల్లాలో యూరియా సంచులు, వరి, ఉల్లి పంటను చేత బట్టి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. పలమనేరులో మీడియాను సైతం అనుమతించ లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గట్టిగా ప్రశ్నించడంతో ముఖ్య నాయకులు, మీడియాను లోనికి అనుమతినిచ్చారు. కుప్పంలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రైతుల భారీ బైక్ ర్యాలీ అయినప్పటికీ పలువురు నేతలు, రైతులు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. సూళ్లూరుపేటలో పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా అన్ని చోట్లా అన్నదాత పోరు విజయవంతమైంది. తిరుపతిలో అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చుని ఉంటే.. ఎరువులు, విత్తనాల కోసం రైతుల వారి కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో రైతు పోరు హోరెత్తింది. రాయచోటిలో జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రైతుల నినాదాలతో హోరెత్తిన రాష్ట్రంఅవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించలేని ప్రభుత్వం డౌన్ డౌన్.. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన కూటమి సర్కార్ డౌన్ డౌన్.. గిట్టుబాటు ధర కల్పించలేని కూటమి సర్కార్ డౌన్ డౌన్.. అంటూ రైతులు చేసిన నినాదాలతో రాష్ట్రం మారుమోగిపోయింది. రైతులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ల కార్యాలయాలకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. అవసరమైన మేరకు ఎరువులు అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, వర్షం వల్ల పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా పోలీసులు నిర్బంధించినా.. కేసుల పేరుతో బెదిరించినా రైతులు బెదరకుండా వేలాదిగా కదలివచ్చి కదంతొక్కడంతో వైఎస్సార్సీపీ అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 15 నెలల పాలనలో టీడీపీ కూటమి సర్కార్పై రైతుల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీల్లో ఎక్కడికక్కడ వేలాది మంది కర్షకులు కదం తొక్కడమే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసుల ద్వారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం.. 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రైతులు సమరోత్సాహంతో రణభేరి మోగించడం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అన్నదాత పోరులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ ర్యాలీగా వెళుతున్న రైతులు గతేడాది డిసెంబర్ 13న అన్నదాతల సమస్యలపై రైతు పోరు.. డిసెంబర్ 27న కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన విద్యుత్ పోరు.. మార్చి 12న యువత సమస్యలపై నిర్వహించిన యువత పోరు తరహాలోనే అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.హౌస్ అరెస్ట్లు.. బెదిరింపులు⇒ వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కాకూడదని సర్కారు పెద్దలు పోలీసులను ఉసిగొల్పారు. దీంతో వారు ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్భంధం చేశారు. కేసులు పెడతామంటూ మరికొందరిని బెదిరించారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్లను సోమవారం రాత్రే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం రాత్రి 11 గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ జిల్లాలో అన్నదాత పోరు విజయవంతమైంది. ⇒ జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలపై హోరెత్తించారు. ఒంగోలులో ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులను పోలీసులు పలుమార్లు అడ్డుకున్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని నోటీసులు ఇచ్చినా ఎవరూ లెక్క చేయలేదు. రాజమహేంద్ర వరంలో రైతులను, వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు ⇒ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా నిర్బంధించారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఆమదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కవిటిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావును అడ్డుకున్నారు. వేలాది మందిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినప్పటికీ పలువురు నాయకులు పలాస, టెక్కలి ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. గుడివాడలో ఆర్డీవో కార్యాలయం లోపలికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినాదాలు చేశారు. నందిగామలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పార్టీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మొండితోక జగన్మోహనరావు, తన్నీరు నాగేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాసు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, అవుతు శ్రీనివాసులురెడ్డిలను గాంధీ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. మార్గం మధ్యలో మాజీ మంత్రి జోగి రమేష్ను ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్ద, ఇతర నేతలను తిరువూరు, జగ్గయ్యపేటలో పోలీసులు అడ్డుకున్నారు. ⇒ గుంటూరు, తెనాలి, చీరాల ఆర్డీవో కార్యాలయాల వద్ద భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో వంద ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. రేపల్లె, వేమూరు, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల ప్రాంతాల్లోనూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ రైతులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీకి తరలి వచ్చారు. ⇒ నెల్లూరు జిల్లాలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ముఖ్య నేతలకు నోటీసులిచ్చి, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అన్నదాతలు కదంతొక్కారు. ఆత్మకూరులో రైతుల కోసం ఏర్పాటు చేసిన షామియానాను సీఐ గంగాధర్ తొలగించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
కొవ్వూరులో టీడీపీ-జనసేన మధ్య భగ్గుమన్న విభేదాలు
-
నీది ఒక బొక్కలో పార్టీ.. చంద్రబాబుని ఏకిపారేసిన సీదిరి
-
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఉత్తర్వులు జారీ
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశించింది. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది.ఫేజ్-1కింద పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నాలుగు కాలేజీలను డెవలపర్కు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం,నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్సీపీ నేత ఎస్వీ సతీష్రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.తిరుపతి: అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.చెవిరెడ్డి అక్షిత్రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారుఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం. -
నేను టీడీపీనే.. బాబు వరస్ట్.. జగన్ పాలనే బెస్ట్..
-
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
Annadata Poru Updates: వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ లైవ్ అప్డేట్స్.. -
మండలంలో లేకుండా చేస్తాం..
పాలసముద్రం: అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు, పొక్లెయిన్ను తహసీల్దార్, ఎస్ఐ అడ్డుకుని వాటిని సీజ్ చేసినందుకు వారిని మండలంలో లేకుండా చేస్తామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు ఒకరు బెదిరించాడు. పైగా.. ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..పాలసముద్రం మండలం నుంచి టీడీపీ కూటమి నాయకులు మూడు, నాలుగు నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టల్లో నుంచి అనుమతుల్లేకుండా తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్న సంఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని తొమ్మిది టిప్పర్లు, రెండు పొక్లెయిన్లను సీజ్చేశారు. ఇలా ఎర్రమట్టిని అక్రమంగా తరలించకూడదని ఎస్ఐ రెడ్డప్ప వాహనాలను పోలీస్స్టేషన్కి తరలిస్తుంటే టీడీపీ కూటమి నాయకులు వారిపై గొడవకు దిగారు. అధికారులకు వేలు చూపిస్తూ హెచ్చరికలు..: ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు, చెన్నైకి చెందిన శరవణ అక్కడకు చేరుకున్నాడు. టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్ అరుణకుమారిని, ఎస్ఐ రెడ్డప్పను ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది. త్వరలో మిమ్మల్ని మండలంలో లేకుండా చేస్తా’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. ఇదే సమయంలో అక్కడ ఫొటోలు తీస్తున్న సాక్షి విలేకరిని ‘నువ్వెవరు ఫొటోలు తీయడానికి.. నీ అంతుచూస్తా’.. అంటూ బెదిరిస్తూ పైపైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు. తోటి విలేకరులు రావడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. -
కాడి వదిలి రోడ్డెక్కి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే ‘వ్యవసాయాన్ని దండగ’గా మార్చేస్తున్నారు! పొలం పనుల్లో కోలాహలంగా కనిపించాల్సిన రైతన్నలు రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నారు! పంట కాపాడుకునేందుకు నోరు విప్పి ఎరువులు అడుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు! టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. విత్తు నుంచి విక్రయం వరకు ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో కోత పెట్టి అందకుండా చేశారు. అదునులో యూరియా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక్క కట్ట కోసం తిండి తిప్పలు మానుకుని క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి కలి్పంచారు. ధాన్యం నుంచి టమాటా వరకు, మిరప నుంచి మామిడి, బత్తాయి వరకు కనీసం మద్దతు ధర దక్కకపోవడంతో అన్నదాతలు హతాశులయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక.. అప్పులు తీర్చే దారి లేక.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో.. యూరియా దొరక్క, మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలసి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్నదాత పోరు’లో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైయింది. ఆంక్షలతో ‘కట్ట’డి.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి మళ్లించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదునులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట.. అరకట్ట అంటూ రేషన్ సరుకుల మాదిరిగా విదిలిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడికీ గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కొరడా ఝళిపించాల్సిన సర్కారు కళ్లుమూసుకుంది.ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు..గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్లో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్తో వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మద్దతు ధర దక్కక పోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన 15 నెలల్లో దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులనూ కూటమి ప్రభుత్వం మంచేస్తోంది. ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటా రూ.11,781 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండిచేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో రూ.12 చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి రూ.4 సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్ రూ.1,200 చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసింది. తాజాగా మార్కెట్–మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో మూడో వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా రూ.100–600కి మించి వ్యాపారులు కొనడం లేదు. ఏలూరు డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు ఎటుచూసినా రైతుల ఆందోళనలు, ఆక్రందనలే..గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం అధఃపాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలం పాట నిర్వహించగా, గరిష్టంగా 5 శాతం కాయలకు టన్ను రూ.14,200 పలుకగా, నాణ్యత లేని కాయను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5–10 శాతం కాయలకు టన్ను రూ.16,500 లభించగా నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య లభించింది. గతంలో ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.కృష్ణా జిల్లా కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు 15 నెలల్లో రూ.23,584 కోట్లు ఎగ్గొట్టారు..! అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవంగా ఏటా రూ.10,716 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.21,432 కోట్లు జమ చేయాల్సి ఉండగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది తొలివిడతగా రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లతో సరిపెట్టారు. మరొక పక్క 2023–24 సీజన్కు సంబంధించి రూ.930 కోట్ల మేర రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో.. ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. ఇక 2024–25 ఖరీఫ్లో 833.92 కోట్లు, రబీలో రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయకపోవడంతో రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు ఇంకోవైపు కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద 4.50 లక్షల మంది రైతులకు మరో రూ.650 కోట్లు ఎగ్టొట్టారు. ఇలా ఏడాదిలో అన్నదాతా సుఖీభవ, పంటలబీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ బకాయిలు వెరసి మొత్తం దాదాపు రూ.23,584 కోట్లకుపైగా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది! అయితే.. మద్దతు ధర లేక రైతులు నష్టపోయిన మొత్తానికి అంతే లేదు. -
దివ్యాంగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
-
‘అసుర.. అసుర.. భూబకాసుర’..400కోట్ల విలువైన ఆలయ భూములపై కన్నేసిన చంద్రబాబు
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు భూబకాసురుడుగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్క్లబ్ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూసమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో, ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న ఈ దురాగతాన్ని న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, విలువైన ఆలయ భూములను పద్ధతి ప్రకారం తమ వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్ క్లబ్లకు ఎలా కేటాయిస్తారు? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శిధిలావస్థకు చేరిన ఈ ఈ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలు కేటాయించి వైయస్ జగన్ జీర్ణోద్దరణ చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మాత్రం విలువైన ఆ ఆలయ భూములు కబ్జా చేసేందుకు కలెక్టర్ని అడ్డం పెట్టుకుని పావులు కదుపుతోంది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కౌలుకిచ్చిన ఈ భూముల్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో రాత్రికిరాత్రే కంకర, మట్టి, ఇసుక తరలించి లెవలింగ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా చేసిన ఈ భూకేటాయింపులను హిందూ ధర్మపరిరక్షణ సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వం. ఈ భూముల వ్యవహారంపై అవసరమైతే న్యాయస్థానాల్లోనే వైఎస్సార్సీపీ పోరాడుతుంది. సనాతన ధర్మ పరిరక్షకులు దీనిపై స్పందించాలి:మచిలీపట్నంలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సుమారు 40 ఎకరాల భూమిని దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగా 35 ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరిట, మరో 5 ఎకరాలను గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు పేరిట భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించాలని సూచిస్తూ స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు అండతో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో కలెక్టరే ఈ భూపందేరం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. కూటమి నాయకులు ఆలయ భూములను కాజేస్తున్నారని మేం చేసే ఆరోపణలు కాదు.. టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా 'అయ్యో సామీ' పేరిట కథనం ప్రచురించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం దేవాదాయ శాఖ భూములిచ్చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకునే బీజేపీ నాయకులు, ఆలయ భూములను అప్పనంగా కట్టబెట్టేస్తుంటే చోద్యం చూడటం ఆశ్చర్యకరమైన విషయం. దీనికి బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురంధీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమాధానం చెప్పాలి. రిక్రియేషన్ ముసుగులో పేకాట ఆడుకోవడం కోసం భూములు కట్టబెట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఎన్నికల్లో ఓట్ల కోసమే దేవుడి పేరు వాడుకుంటారా? ఆలయ అభివృద్ధికి రూ.1.80 కోట్లు కేటాయించిన వైఎస్ జగన్:కలెక్టర్ లేఖ రాసిందే తడవుగా రాత్రికి రాత్రే ఈ ఆలయ భూములను చదును చేసేశారు. ఇప్పటికే ఆ భూములను వేలం ద్వారా పలువురు రైతులు కౌలుకు పొందారు. బొర్రా రవికి ఏడెకరాలు, అబ్బూరి శ్రీనివాసరావు, అనుముల రామారావుకి, ఈపూరు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తులకు వ్యవసాయం చేసుకోవడానికి మే 15న కౌలుకు అనుమతులు ఇచ్చారు. వారి కౌలు గడువు ముగియక ముందే ఆఘమేఘాల మీద ఈ భూములను స్వాధీనం చేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గోల్ప్కోర్ట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. 2017 లోనే ఈ ఆలయ భూములు కాజేయాలని టీడీపీ నాయకులు స్కెచ్ వేసుకున్నారు. అందులో భాగంగానే శ్రీ వేకంటేశ్వరస్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడికి అడాప్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఈ దోపిడీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత నాటి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం పరిధి నుంచి తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ భూములను తీసుకొచ్చారు. పాడుపడిపోయి, దూపదీప నైవేద్యాలకే కరువైన ఈ గుడికి నాటి సీఎం వైయస్ జగన్ రూ.1.80 కోట్లు కేటాయించి చినజీయర్ స్వామితో అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారు. ఒకపక్క మేం హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా ఆలయాల అభివృద్దికి నిధులు కేటాయిస్తుంటే, కూటమి నాయకులు మాత్రం ఆలయాల పేరిట ఉన్న విలువైన భూములపై కన్నేసి దోచుకునే పనిలో పడ్డారు.ఆలయ భూముల పరిరక్షణకు న్యాయపోరాటం:ఏదైనా భూకేటాయింపులు నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తామంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. బీజేపీ, వీహెచ్పీ మాతో కలిసొచ్చినా రాకోపోయినా పర్లేదు.. భూకేటాయింపులు ఆగేదాకా పోరాడతాం. జరగని తప్పులు జరిగినట్టుగా చూపించడానికి దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్, తాను భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చూస్తూ కూర్చోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై వైయస్సార్సీపీ తరఫున న్యాయపరంగా పోరాడతాం. భూమిని చదును చేయడానికి ఇసుక, కంకర, మట్టి తరలించిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒక్క గజం స్థలం అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదు. పనులను అడ్డుకుంటున్న దేవాదాయ శాఖ అధికారులను ఎంపీ కేసినేని చిన్ని మనషులు బెదిరిస్తున్నారు. పోలీసులు దీనిపై తక్షణం కలగజేసుకుని చదును చేసే పనులు ఇక్కడితే ఆపేయించాలి. -
ఆ పార్టీ అద్భుతాలు రేవంత్కే తెలియాలి!
రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినా పాత వాసనలు మాత్రం పోగొట్టుకోలేక పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఆత్మరక్షణలో పడిపోతున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏర్పడ్డ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన పదాలు ప్రయోగించడం, తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అదో అద్భుతమైన పార్టీ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకూ ఓకే. కానీ అందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని, అన్ని దుర్మార్గాలు చేసిన మీరు (బీఆర్ఎస్) మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని ప్రశ్నించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అంత గొప్ప పార్టీనే అయితే రేవంత్ ఎందుకు వదిలిపెట్టారు? దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా కాంగ్రెస్లో చేరారు ఎందుకు? ఇదిలా ఉంటే.. ఆయా సందర్భాల్లో రేవంత్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని ప్రశంసించడం కాంగ్రెస్ నేతలు చాలామందికి రుచించడం లేదు. సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్లో ఒకసారి విమర్శించడం మొదలైందంటే గోల, గోల అవుతుందన్న సంగతి రేవంత్కు తెలియనిది కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించిందన్నది వాస్తవం. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని ఏకంగా గాంధీభవన్కే వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ అంశం కూడా కలిసిరావడంతో రేవంత్ సీఎం కాగలిగారని చాలా మంది అభిప్రాయం. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఇలా మాట్లాడారా? స్థానిక ఎన్నికలలో కాని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాని వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా ? అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతుంటే నష్టం కదా? అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండే వారు. రహస్య సంబంధాలు పెట్టుకున్నా, బయటికి మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ ఆ పార్టీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు కాని, ఇలా వేరే పార్టీని బహిరంగంగా పొగడడమేమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయ పోరు కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగానే టీడీపీ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ల వల్ల కాదని కొందరి విశ్లేషణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నించడం, దానికి రేవంత్ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని కేసు పెట్టడం, రేవంత్ జైలుకు వెళ్లడం.. ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని ఏపీకి వెళ్లిపోయారు. పలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. బిఆర్ఎస్ను చచ్చిన పాముతో పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే, కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎలా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణలో 2014 నుంచి రెండుసార్లు ఓడిపోయింది. అయినా మూడోసారి విజయం సాధించింది. దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరమైంది. అంతమాత్రాన ఇక కాంగ్రెస్ దేశంలో ఉండదని చెప్పగలమా? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం రాకపోయినా, ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా? తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కేసీఆర్ కూడా అనేవారు.అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే, పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపాటి మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్ ఎన్టీఆర్దని అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవలసిన విషయం. నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించి ప్రచారం ఆరంభించగానే, ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంభై పైసలకే పేదలకు బియ్యం అందించే పథకాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ స్కీమ్ అని వ్యాఖ్యానించడం ఏ మాత్రం తెలివి అవుతుంది. అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ను మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే. కాని అంతకు ముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏమి చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే వంటివి నిర్మించారు. రేవంత్ వైఎస్ ప్రస్తావనను తెస్తున్నప్పటికి, చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. తదుపరి టీఆర్ఎస్లో క్రియాశీలం అయ్యారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. తదుపరి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. లోక్సభ ఎన్నికలలో టీడీపీ పక్షాన 2014లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి టీడీపీ టిక్కెట్ లభించినప్పుడు పార్టీపై, నాయకత్వంపై రేవంత్ చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతమైన పార్టీ అయితే సొంత అల్లుడు ఎన్టీఆర్ను ఎందుకు కూలదోశారో చెప్పాలి. కొన్నిసార్లు వామపక్షాలు, మరికొన్నిసార్లు బీజేపీ, ఇంకోసారి కాంగ్రెస్తో, మరోసారి టీఆర్ఎస్తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకున్నదో, అది ఏపాటి అద్భుతమో చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్కే తెలియాలి. బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేయడం తప్పుకాదు. కాని వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్ఎస్లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రయత్నం చేయడం తప్పుకాదు. కాని రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించడానికి, కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్కు ,రేవంత్ కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ రౌడీ మూకల దాడి
వెదురుకుప్పం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చమాఫియా రెచ్చిపోతోంది. ప్రజలకు జరిగే నష్టాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్డుపడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ కండకావరం ప్రదర్శిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ క్వారీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఈ క్వారీని అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసుల సహకారంతో యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అనంతరం క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో 20 మందికిపైగా రౌడీమూకలను దింపింది. వారు ఇనుపరాడ్లతో గ్రామస్తులపై దాడికి యతి్నంచారు. దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా ప్రతిఘటించారు. అసలేం జరిగిందంటే.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కొమరగుంట పంచాయతీ పరిధిలోని బందార్లపల్లె గ్రామానికి సమీపంలో సుమారు 7ఎకరాల విస్తీర్ణంలో ఎద్దల బండను క్వారీ నిర్వహణ కోసం అధికారులు అనుమతిచ్చారు. రెండు నెలలుగా టీడీపీకి చెందిన యుగంధర్ నాయుడు క్వారీ నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఎద్దల బండకు ఆనుకుని సుమారు 20 ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. అయితే అక్కడ క్వారీ పనులు చేపడితే అన్ని విధాలా నష్టం జరుగుతుందని భావించిన గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకున్నారు.గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో శనివారం కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య క్వారీ వద్దకు వెళ్లి పనులను అడ్డుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతారని గ్రామస్తులను బెదిరించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే రేషన్ కార్డులు, ఫింఛన్లు కట్ చేస్తామంటూ పోలీసులే బెదిరింపులకు దిగారు. అయినా క్వారీ నిర్వహణ సాగనివ్వబోమని గ్రామస్తులు చెప్పడంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆదివారం ఎద్దలబండ వద్దకు వెళ్లారు.గమనించిన క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో సుమారు 20 మంది అనుచరులను రంగంలోకి దింపింది. వారు ఇనుప రాడ్లతో వచ్చి గ్రామస్తులపై దాడి చేయడంతో బద్రి, ధనలక్షి్మ, ప్రమీలమ్మ, శాంతమ్మ, జయంత్రెడ్డి, వరప్రసాద్లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎమ్మెల్యే థామస్ అండ చూసుకుని క్వారీ యాజమాన్యం రెచ్చిపోతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ఇళ్లపైకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.గ్రామస్తులకు నారాయణస్వామి భరోసా గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ సుకుమార్ ఉన్నారు. -
కన్నీరుమున్నీ రైతుండే!
చల్లపల్లి/కొయ్యలగూడెం/చెరుకుపల్లి: యూరియా కొరత రైతులను వెన్నాడుతూనే ఉంది. డిమాండ్కు సరిపడా అందడం లేదు. ఫలితంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద అన్నదాతలు క్యూ కడుతున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా టీడీపీ తీరు మారడం లేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. తమ దుకాణాలకు యూరియా నిల్వలను తరలించుకుపోతున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా కోసం వచ్చిన రైతు వేముల నాగేశ్వరరావు ఆదివారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సహకార సంఘానికి ఆదివారం ఉదయం యూరియా లోడు రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. అయితే జిల్లా ట్రైనీ కలెక్టర్ పర్హీన్ జాహిద్ వస్తున్నారని అధికారులు యూరియా పంపిణీ ప్రారంభించలేదు. ఉదయం ఏడుగంటలకే బారులు తీరిన రైతులు దాదాపు రెండుగంటలపాటు వేచిచూశారు. ఈ సమయంలో నాగేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు సపర్యలు చేశారు. నాగేశ్వరరావు ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ తీరు వల్ల యూరియా దొరక్క అల్లాడుతున్నారు. ఎట్టకేలకు 10.30 గంటలకు యూరియా పంపిణీ చేపట్టినా ఓటీపీ చెప్పాలని అధికారులు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఫోన్లు తెచ్చుకోలేదని, ఓటీపీ అడగడమేమిటని కన్నెర్ర చేశారు. దీంతో అధికారులు ఓటీపీ లేకుండానే యూరియా పంపిణీ చేపట్టారు. – యూరియా కొరతపై ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వరిచేలో నిలబడి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో గవరవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు పలివెల దుర్గారావు, గ్రామ రైతు అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, రైతులు నరాల రామారావు, వేమ నాయుడు, యాకోబు మోషే, శ్రీను, చిన్న తాతారావు, మహేష్, కోనాల దివాకర్ తదితరులు పాల్గొన్నారు.టీడీపీ నేత దుకాణానికి దర్జాగా తరలింపు 07ఆర్పిఎల్77–ట్రాక్టర్లో యూరియా తరలించుకుపోతున్న టీడీపీ నాయకులు ఓవైపు యూరియా అందక పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు యూరియా నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెం గ్రామంలో ఆదివారం రైతులు చూస్తుండగానే ఓ టీడీపీ నాయకుడు ట్రాక్టర్లో 50 యూరియా బస్తాలు తన దుకాణానికి తరలించుకున్నాడు. బలుసులపాలెం రైతు సేవా కేంద్రం వద్ద శనివారం యూరియా పంపిణీ జరిగింది. అయితే రైతులకు ఒక్కొక్కరికి ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇచ్చిన అధికారులు ఆదివారం రైతులంతా చూస్తుండగానే అదే గ్రామంలోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడికి మాత్రం ఏకంగా 50 బస్తాలు ఇచ్చారు. అతను ట్రాక్టర్లో వాటిని తన దుకాణానికి తరలించాడు. రూ.270 ధర ఉన్న యూరియా బస్తాను ఏకంగా అతను రూ.450కి విక్రయిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏవో ఫరూక్ను వివరణ కోరగా తనకు ఆరోగ్యం సరిగా లేనందున రాలేదని, యూరియా పంపిణీ విషయం తెలియదని చెప్పారు. -
ఆంధ్రరాష్ట్రం.. స్కామ్లమయం.. ‘భూం’ చేద్దాం..!
వీటికి అదనంగా ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీతో పాటు 100 శాతం నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఏపీఐఐసీ నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి.సాక్షి, అమరావతి: సర్కారు భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకే ఆదాయం సమకూరుతుంది! భావి తరాలకు విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ‘ఏపీఐఐసీ’ లాంటి ప్రభుత్వ సంస్థలే భేషుగ్గా ఉన్నాయి! కానీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు తమకు కావాల్సిన వారికి భూములను పప్పు బెల్లాలు, శనక్కాయల మాదిరిగా పందేరం చేస్తోంది.. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు పంచి పెడుతోంది. రాష్ట్రంలో భూ కేటాయింపులను స్కామ్లమయంగా మార్చేసింది! నిన్న.. ఊరూ పేరు లేని ‘ఉర్సా’ నుంచి నేడు.. మూతబడ్డ కంపెనీలకు భూములను కట్టబెట్టడం దాకా ఇదే తంతు! ముడుపులు మూటగట్టే వారికి అప్పనంగా పంచిపెట్టడం కూటమి సర్కారు అవినీతి, దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏది చెబితే అది వేదవాక్కుగా భావించి అమలు చేస్తారని పేరున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీపార్థసారథి డైరెక్టర్గా ఉన్న ‘ఇఫ్కో కిసాన్ సెజ్’కు నెల్లూరులో ఏకంగా 2,776.23 ఎకరాలు కేటాయించడం భూ సంతర్పణలకు పరాకాష్ట!! అలాగే.. ‘స్కైరూట్’ కంపెనీకి చిత్తూరు జిల్లా రౌతుసురమాలలో 300 ఎకరాలను ధారాదత్తం చేశారు. సీఎం చంద్రబాబుతో లక్ష్మీ పార్థసారధి టెండర్లు లేకుండానే వేలాది ఎకరాలురాష్ట్రంలో ఏపీఐఐసీకి చెందిన వేలాది ఎకరాలు పచ్చ నేతలకు ఫలహారంగా మారుతున్నాయి! ప్రైవేట్ ఇండ్రస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే పేరిట ఇప్పటికే 5,221 ఎకరాలను కట్టబెట్టడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క అసలు ఎటువంటి టెండర్లే లేకుండా తమకు కావాల్సిన వారికి 4,246.30 ఎకరాలు కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ పరేఖ్ స్టాక్ స్కామ్లో భాగంగా హెచ్ఎఫ్సీఎల్కు సెబీ షోకాజు నోటీస్ జారీ చేసినట్టు తెలిపే భాగం అంతేకాదు.. ఈ భూములను అభివృద్ధి చేసినందుకుగాను ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీతో పాటు 100 శాతం నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇలా ఏపీఐఐసీ నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి.ఇఫ్కో కిసాన్ సెజ్కు 2,776.23 ఎకరాలునెల్లూరులో పలు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిన ఏపీఐఐసీని కాదని.. ఏకంగా 2,776.23 ఎకరాలను పారిశ్రామిక పార్కు అభివృద్ధి పేరుతో ఇఫ్కో కిసాన్ సెజ్కు కూటమి సర్కారు కేటాయించింది. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి దేవరకొండ లక్ష్మీపార్థసారధి భాస్కర్ ఈ కంపెనీ డైరెక్టర్లలో ఉన్నారు. 2014–19లోనూ, ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ సర్కారులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ డైరెక్టరుగా వ్యవహరించిన లక్ష్మీ పార్థసారధి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర అంటే.. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ స్థాపించిన ఆంధ్రా షుగర్స్లో కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తమ చేతిలో మనిషిలా ఉండే పార్థసారధి ఇఫ్కో కిసాన్ సెజ్లో డైరెక్టర్గా ఉండటంతో రూ.వేల కోట్ల విలువైన భూములను ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు ఇచ్చేశారు.కుంభకోణంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీకి..2001లో దేశ స్టాక్ మార్కెట్ను ఒక కుదుపు కుదిపిన కేతన్ ఫరేఖ్ కుంభకోణం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ స్కామ్లో ప్రధానంగా హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (హెచ్ఎఫ్సీఎల్) పేరు మారు మోగింది. 1998–2001 మధ్య మానిప్యులేషన్ చేయడం ద్వారా హెచ్ఎఫ్సీఎల్ ధరను భారీగా పెంచేసి కేతన్ పరేఖ్ భారీ లాభాలు గడించాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీ ప్రస్తుతం టెలికమ్యూనికేషన్స్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వరాహ ఆక్వా ఫామ్స్ మూసివేసినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కాపీ ఇప్పుడు అటువంటి కంపెనీ రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతుందంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో 1,000 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని చూస్తుంటే భూ కేటాయింపులపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా మడకశిర వద్ద షెల్స్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ తయారీ కోసం మీడియా మాట్రిక్స్ వరల్డ్వైడ్ లిమిటెడ్కు ఎకరా రూ.7 లక్షలు చొప్పున 671 ఎకరాలను కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము ఉత్పత్తి ప్రారంభించడానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఈ భూమిని హెచ్ఎఫ్సీఎల్కు బదలాయించాలంటూ ఆ కంపెనీ కోరింది. దీన్ని ఆమోదిస్తూ, మీడియా మాట్రిక్స్కు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసి వాటిని హెచ్ఎఫ్ఎసీఎల్కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పేరిట అడ్డగోలుగా కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. కనీసం కంపెనీల పుట్టు పూర్వోత్రాలు పరిశీలించకుండా, న్యాయ సలహాలు తీసుకోకుండా విలువైన భూములను అడ్డగోలుగా కేటాయించడం ఏమిటని విస్తుపోతున్నారు.రమాదేవికి 13.70 ఎకరాలుఇక మహిళా పారిశ్రామికవేత్తనంటూ టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రచారం చేసుకునే ‘ఎలీప్’ రమాదేవికి ఇప్పటికే అనకాపల్లిలో 31 ఎకరాల భూమి కేటాయించగా తాజాగా కుప్పంలో 13.70 ఎకరాలను అప్పగించారు.సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో రమాదేవి మూసేసిన కంపెనీకి 93 ఎకరాలు..విశాఖకు చెందిన వరాహ ఆక్వా ఫామ్స్ 1994లో ఏర్పాటు కాగా ఈ కంపెనీని ప్రస్తుతం మూసివేసినట్లు (స్ట్రైక్ ఆఫ్ ) కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. ఆక్వా రంగంలో ఉన్న కంపెనీ.. అందులోనూ మూతపడిన కంపెనీకి నక్కపల్లిలో బల్క్డ్రగ్ పార్కు పక్కనే ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి పేరుతో 93 ఎకరాలను కేటాయించడం గమనార్హం. ఈ కంపెనీ గురించి విశాఖతోపాటు ఆక్వా రంగ ప్రముఖలను ఆరా తీయగా ఇప్పటి వరకు ఆ పేరు ఎప్పుడూ వినలేదన్న సమాధానం వచ్చింది. అలాగే ముంబైకి చెందిన ‘జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్’కు పెందుర్తి వద్ద ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి పేరిటి 63.37 ఎకరాలను కేటాయించారు. -
‘చిన్న’ పథకంతో రూ.400 కోట్ల భూమికి ఎసరు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, నీకింత–నాకింత అని పంచుకు తినడాన్ని అలవరుచుకున్న టీడీపీ నేతలు దేవుడి ఆస్తులను కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. ‘చిన్న’ పథకంతో ఏకంగా రూ.400 కోట్ల విలువైన భూమిని గుప్పిట్లో పెట్టుకోవడానికి స్కెచ్ వేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో సర్వే నంబర్లు 454/2బీ, 3బీలో 39.99 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణ, కల్యాణం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా ఉత్సవాల కోసం భక్తులు ఎన్నో ఏళ్ల క్రితం దానంగా ఇచ్చారు.ఈ భూమిపై వచ్చే ఆదాయంతో దేవదాయ శాఖ ఆలయ నిర్వహణతోపాటు ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరం రూ.10 కోట్లకు పైగానే ఉంది. దీంతో రూ.400 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దల దన్నుతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్య నేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు.. విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జీ మేళా, అగ్రిటెక్ షోకేస్, టూరిజం ప్రమోషన్ తదితర ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహణకు శాశ్వత వేదిక అంటూ మరో 34.99 ఎకరాల భూమి లీజు మాటున తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరింది. కారు చౌకగా కొట్టేసే ఎత్తుగడ ⇒ మొత్తంగా 39.99 ఎకరాలను సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆ నేత పావులు కదుపుతున్నారు. గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్ కోసం ఈ భూమి కేటాయించాలని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి చేరాయి. ఎకరాకు ఏడాదికి రూ.500 చొప్పున, 99 సంవత్సరాలకు లీజు పొందేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ⇒ నిజానికి ఆ భూములకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మే 15వ తేదీన ఏడాదిపాటు కౌలుకు వేలం నిర్వహించారు. బొర్రా రవికి రూ.95,500తో ఏడు ఎకరాలు, అబ్బూరి శ్రీనివాసరావుకు రూ.1,00,500తో 6.50 ఎకరాలు, అనుమోలు రామారావుకు రూ.66,700తో 4.50 ఎకరాలు, ఈపూరి నాగమల్లేశ్వరరావుకు రూ.97,000తో 4.50 ఎకరాలు ఇచ్చారు. కె.ధర్మారావుకు 2023–24 నుంచి 2025–26 వరకు ఐదెకరాల భూమిని రూ.52,500కు, కె.అయ్యప్పకు 2.50 ఎకరాలను రూ.23,500తో కౌలుకు ఇచ్చారు. కౌలు గడువు పూర్తి కాకముందే ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ⇒ అయితే కౌలు పొందిన రైతుల నుంచే సబ్ లీజుకు తీసుకొని, ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిని అప్పగించాలంటే వేలం పాట నిర్వహించాలన్న నిబంధనలు తుంగలో తొక్కారు. ఉత్తర్వులు రాక ముందే భూమి స్వాధీనం⇒ దేవదాయ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక ముందే ఈ భూములను పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ముఖ్య నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టి తోలించి భూమిని చదును చేయించారు. విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వీటి నిర్వహణకు అయ్యే రూ.కోట్ల ఖర్చును వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ⇒ మరో వైపు ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు కట్టబెట్టేందుకు సంబంధించిన ఫైల్ సచివాలయంలో శరవేగంగా ముందుకు కదులుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాల సమాచారం. ⇒ ఈ భూమిని 2017లోనే కాజేసేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ నుంచి తప్పించి, విజయవాడ దుర్గామల్లే«శ్వర స్వామి పరిధిలోకి తెచ్చారు. అయితే గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గత ప్రభుత్వంలో ఆలయానికి పూర్వ వైభవం ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలిపోయే దశలో ఉన్న గొడుగుపేట ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. అప్పటి మంత్రి పేర్ని నాని ప్రతిపాదన మేరకు 2020 మార్చిలో ఈ ఆలయాన్ని దుర్గామల్లేశ్వర స్వామి పరిధిలోంచి తప్పించి దేవదాయ శాఖ పరిధిలోకి తెచ్చి ఈవోను కూడా నియమించారు. ⇒ 2020 అక్టోబర్లో పేర్ని నాని సీజీఎఫ్ నిధులు రూ.1.80 కోట్లు, భక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.20 లక్షలు వెరసి రూ.2 కోట్లు వెచ్చించి, ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేయించారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా పునఃప్రారం¿ోత్సవం జరిపించారు. 2023 జూలైలో ఈ ఆలయ భూములకు వేలం నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భూములకు వేలం పాట నిర్వహించి, రైతులకు లీజుకు ఇస్తున్నారు. 2024 మే వరకు ధూప దీప నైవేద్యాలు, ఘనంగా ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేశారు.గోల్ఫ్ కోర్టుకు వెంకన్న స్వామి స్థలమే కనిపించిందా?⇒ప్రపంచ స్థాయి అమరావతిలో స్థలమే దొరకలేదా?⇒ ఆలయ భూముల్నీ పప్పు బెల్లాల్లా పంచుకుంటారా?⇒ ఆ భూమిపై మోజు ఉంటే విక్రయించి ఆలయానికి డబ్బు జమ చేయాలి ⇒ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజంమచిలీపట్నం టౌన్: ప్రపంచ స్థాయి రాజధానిగా చెబుతున్న వేలాది ఎకరాల భూమి ఉన్న అమరావతిలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుకు స్థలమే కనిపించ లేదా.. అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని గోల్ఫ్ కోర్టు సంస్థకు కేటాయించనుండటం దారుణం అన్నారు.విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని చదును చేసే పనులు చేస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆలయ భక్త బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఆలయం జీర్ణావస్థకు చేరిందని, కూలేందుకు సిద్ధంగా ఉంటే సరుగుబాదుల సపోర్టుతో ఆలయాన్ని భక్తులు కాపాడుతూ వచ్చారన్నారు. ఆ సమయంలోనే ఈ భూమిపై కూటమి పాలకులు కన్ను వేసి.. ఆలయాన్ని విజయవాడ దుర్గ గుడి ఆధీనంలోకి తీసుకెళ్లారన్నారు.దీంతో ఈ ఆలయ ధూప, దీప నైవేద్యాలకు కూడా నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ఆలయాన్ని దుర్గ గుడి నుంచి మళ్లీ దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణకు దాదాపు రూ.1.80 కోట్లు సీజీఎఫ్ నిధులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. భక్తుల వద్ద నుంచి రూ.20 లక్షలు సేకరించి.. మొత్తం రూ.2 కోట్ల నిధులతో ఆలయ పునరుద్ధరణ గావించామని చెప్పారు. ఈ భూమిని రైతులకు బహిరంగ వేలంలో కౌలుకు ఇచ్చి, వచ్చే ఆదాయాన్ని ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారని వివరించారు. మళ్లీ కూటమి నేతల కన్నుకూటమి అధికారంలోకి వచ్చాక ఈ 40 ఎకరాల భూమిపై మళ్లీ కన్నేసి కౌలు దారులను, అధికారులను బెదిరించి పంట వేయకుండా అడ్డగిస్తూ గోల్ఫ్ కోర్టు నిర్మాణం పేరుతో ఆ భూమిని కాజేయడానికి యత్నిస్తున్నారు. వందలాది టిప్పర్లతో మట్టి తోలుతూ, దేవుడి ఆస్తి అనే భయం లేకుండా మెరక పనులు చేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతం అండగా ఉండటం పాపం కాదా..? ఇదే కలెక్టర్ ఈ భూమిని గోల్ఫ్ కోర్సుకు, ఎగ్జిబిషన్కు కేటాయించాలని జూలైలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాశారు.దేవదాయ భూమిని లీజుకు తీసుకోవాలంటే బహిరంగ వేలం ద్వారానే తీసుకోవాలని, వేరే ఏ పద్ధతుల్లోనూ తీసుకోకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. దేవుడి భూమిని కూటమి పాలకులు పప్పు బెల్లాల్లా పంచుకోవాలని చూస్తుండడం ఎంతవరకు సబబు?’ అని నాని నిలదీశారు. స్వామి వారి భూమిపై మీకు మోజు ఉంటే బహిరంగ వేలం వేసి విక్రయించగా వచ్చే మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ భూమి ఆక్రమణపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన ఈ దోపిడీని నిలిపివేస్తే సరి అని, లేదంటే కోర్టును ఆశ్రయించాలని సమావేశానికి హాజరైన భక్తులు, పలు రాజకీయ పక్షాల నాయకులు తీర్మానించారు. ఈ సమావేశంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను చంపేస్తారు.. టీడీపీ నుంచి ప్రాణహాని ఉంది
-
మహిళలపై మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఇదేనా పాలనంటే?.. చంద్రబాబు సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు...చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు....స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్రెడ్డి తేల్చి చెప్పారు.మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్రెడ్డి చెప్పారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు. -
Kethireddy: నన్ను ఎవడు తొక్కలేడు పోరాటం నా బ్లడ్ లోనే ఉంది
-
ఈ-క్రాప్ నమోదు జాప్యం.. రైతుల పాలిట శాపం!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలన ఈ –క్రాప్ నమోదు మొక్కుబడి తంతుగా మారిపోయింది. ఈ –క్రాప్ నమోదులో జరుగుతున్న జాప్యం..రైతుల పాలిట శాపంగా మారుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30వ తేదీతో క్షేత్ర స్థాయిలో ఈ –పంట నమోదు పూర్తి చేయాలి. అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ వరకు సోషల్ ఆడిట్లో భాగంగా ఆర్ఎస్కేల్లో ఈ– క్రాప్ జాబితాలను ప్రదర్శించి గ్రామసభలు నిర్వహించాలి. 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 15వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలి. నమోదు అవసరం ఏమిటి? అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్తో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఫలాలకు ఈ–పంట నమోదు ప్రామాణికం. ఓ వైపు వర్షాభావ పరిస్థితులతో లక్షలాది ఎకరాలు బీడువారగా, మరొక వైపు అధిక వర్షాలు, ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆ మేరకు రైతులకు పరిహారం ఇవ్వాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరిట రైతుకు ప్రభుత్వం ఇప్పటికే బీమా దన్ను లేకుండా చేసింది. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు జాప్యంతో పంట నష్ట పరిహారం కూడా అందని పరిస్థితి నెలకొంది. ఆర్ఎస్కే సిబ్బందిపై పని భారం వ్యవసాయేతర అవసరాలకు ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్న తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఇప్పటికే ఆర్ఎస్కే సిబ్బంది వాపోతున్నారు. సవాలక్ష నిబంధనలతో ఈ–పంట నమోదు నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. వ్యవసాయేతర పనుల నుంచి తమను పూర్తిగా మినహాయించి, షెడ్యూల్ ప్రకారం ఈ– క్రాప్ నమోదుకు అవకాశం కల్పిస్తే గడువులోగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. నిర్లక్ష్యం తీరిది.. » ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది నెల రోజులే. సీజన్లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 55.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. » మరొక వైపు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 47 లక్షల ఎకరాలు. » ఈ రెండు పంటలు కలిపి కోటి ఎకరాలకు పైగా సాగులో ఉంటే. ఇప్పటి వరకు కేవలం 30 లక్షల ఎకరాల్లో పంటలు మాత్రమే నమోదు చేశారు. » సాగుదారులు దాదాపు 60 లక్షల మందికి పైగా ఉంటే కేవలం 10.05 లక్షల మంది రైతులకు చెందిన పంటలను మాత్రమే నమోదు చేశారు. » ల్యాండ్ పార్సిల్స్ పరంగా చూస్తే 2.61 కోట్లు ఉండగా, కేవలం 13 శాతం అంటే 25 లక్షల ల్యాండ్ పార్సిల్స్లో పంటలను మాత్రమే నమోదు చేశారు. -
చంద్రబాబు అనుకున్నంత పనీ చేశారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా?. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు?. ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది?. అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025‘‘మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?. రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా?. కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా?. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబూ?. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబూ?..ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా?ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబూ?. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు...చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా?. మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?...ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?. ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా?. అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా?. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం...ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా?. లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా?. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?. చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?..కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
Palnadu: కర్రలతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూకల దాడి
-
సోషల్ మీడియా దెబ్బ.. చంద్రబాబు అబ్బా..
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.-సిమ్మాదిరప్పన్న -
YSRCP కార్యకర్త సురేష్ పై కత్తులతో TDP గూండాల దాడి
-
కర్నూలులో ఆటో డ్రైవర్ల భారీ నిరసన..
-
టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం.. బూట్లతో స్వామివారికి పట్టువస్త్రాలు
సాక్షి, టాస్క్ఫోర్స్: శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వ్రస్తాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగరాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరం నిర్మించారు.ఆలయంలో గురువారం కుంభాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు వేసుకునే పట్టువ్రస్తాలు తీసుకొచ్చారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన బూట్లు ధరించే పూర్ణకుంభానికి అక్షింతలు వేశారు. ఎమ్మెల్యే తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగదని, సెలక్షన్ మాత్రమేనని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ వివాదాస్పద వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. గురువారం జిల్లాలోని పెనుమూరులో నిర్వహించిన మార్కెటింగ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే అభ్యర్థులను సెలక్షన్ చేద్దాం. ఎలక్షన్ ఉండదు. ఎన్నికలు జరిపించాలన్న చోట అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయకుండా చూడండి. అప్పుడు ఏకగ్రీవంగా మనవాళ్లే ఎన్నికవుతారు. ఏం జరిగినా మీ వెనుక మేమున్నాం. టీడీపీ అభ్యర్థులను భయపెడితే కాళ్లు, చేతులు తీసేందుకు సిద్ధంగా ఉండాలి. టీడీపీలో కొందరు వైఎస్సార్సీపీకి కోవర్టులుగా ఉన్నారు. వారిని ఒకచోట చేరిస్తే ఎండ్రకాయల్లా కొట్టుకుంటారు. అందుకే ఒక్కొక్కరిని ఏరి ఒక్కొక్క బొక్కలో పెడుతున్నా’ అని వ్యాఖ్యానించారు. -
మురళీకృష్ణంరాజును ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
AP: నంద్యాలలో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు
-
బాబు సర్కార్కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
ఎద్దు ఈనిందనగానే.. జున్నుపాలు అడిగాడంట!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది. ఓ కార్యకర్త నారా లోకేష్ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు. Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5— Lokesh Nara (@naralokesh) September 4, 2025ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే... ‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!. సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు. మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు. నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు. కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.:::ఎం. రాజేశ్వరి -
ఏ1 నుండి ఏ5 వరకు టీడీపీ నేతలే: సుప్రీంకోర్టు
ఢిల్లీ: పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు ఉన్నది టీడీపీ వారే అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరుల తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ..‘రాజకీయ కక్షతో పెట్టిన కేసు ఇది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే ఫిర్యాదుదారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్లే జరిగిన హత్య ఇది. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించింది అని తెలిపారు.అనంతరం, ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నిందితులంతా హత్యకు గురైన వ్యక్తి పార్టీ వారే కావడం విచిత్రం. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు టీడీపీవారే ఉన్నారు అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలపై TDP ఎంపీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
బాబూ.. ఈ ఫొటో నకిలీ అని నిరూపించే దమ్ముందా?: వైఎస్సార్సీపీ సవాల్
సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సహా ఎరువులను సరఫరా చేయలేని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరిన ఫొటోలను పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి నకిలీవని నిరూపించగలరా? అని సవాల్ విసిరింది.‘రైతులకు ఎరువుల సరఫరా విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం ఆక్రోశం! రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంట! ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫస్ట్రేషన్! మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోల సర్క్యులేషన్! మరి ఈ ఫోటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోనే కాదు.. రైతులు క్యూలు కట్టిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు ఇక్కడ పెడుతున్నాం. చంద్రబాబు నిజాలకు పాతర వేసి, బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఇవాళ్టి దృశ్యాలివీ! చేతనైతే వీటిని నకిలీవని నిరూపించండి..!’ అని సవాల్ విసిరింది. రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం @ncbn ఆక్రోశం. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంట. ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫ్రస్టేషన్. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు చేసిన ట్వీట్ ఫొటో ఫేక్ అంటూ పచ్చసైకోల సర్క్యులేషన్. ఈ ఫొటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోయే… https://t.co/dkFKyEEYAv pic.twitter.com/HILCefZooJ— YSR Congress Party (@YSRCParty) September 3, 2025 -
కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవు
కూర్మన్నపాలెం/గాజువాక/ఉక్కునగరం: విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలపై టీడీపీ ఎంపీ ఎం.శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవు. కాంట్రాక్ట్ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకున్నారు. మళ్లీ ఆ నాయకులే కూటమి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు’ అంటూ శ్రీభరత్ ఆరోపించారు. జీవీఎంసీ 87వ వార్డులో రూ.6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం వీరు శంకుస్థాపన చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ మాట్లాడుతూ.. కార్మిక నాయకులది రాజకీయ ఎత్తుగడ అని, ప్రజలే అలాంటి వారిపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ‘కార్మిక నేతలు రూ.లక్షలు తీసుకుని వేలాది మందిని కాంట్రాక్టు కార్మికులుగా నియమించుకున్నారు. ప్యాకేజీ ఇచ్చినా ఉనికి కాపాడుకోవడం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో అర్థం లేదు. కాలక్షేపం చేస్తామంటే ప్రజల్లో చులకన అవుతారు’ అని వ్యాఖ్యానించారు. స్టీల్ప్లాంట్లో అనర్హులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లు, కార్మిక నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కవడంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. నాయకులు స్వార్థం విడనాడి కర్మాగారంలో ఉత్పత్తి సాధనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా, కాంట్రాక్ట్ పోస్టులు అమ్ముకున్నామంటూ ఎంపీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ బాగుంటే లబ్ధి పొందలేమనే ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు.డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ప్రస్తుతం వ్యవహారాలను పక్కదోవ పట్టించడానికి కూటమి ప్రజాప్రతినిధులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనుల కేటాయింపు గురించి అడగని ఈ ప్రజాప్రతినిధులు.. ప్రారంభమే కాని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడుగుతున్నారు. నిర్వాసితుల మధ్య చిచ్చు పెట్టేలా విమర్శలు చేస్తున్నారు. –మంత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్టీయూసీ సీబీఐ విచారణకైనా సిద్ధం కాంట్రాక్ట్ కార్మికుల పోస్టులను అమ్ముకున్న కార్మిక నేతల పేర్లను ప్రజాప్రతినిధులు బయటపెట్టాలి. ఈ అంశంపై అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలి. దీనికి మా యూనియన్ కట్టుబడి ఉంది. – కేఎస్ఎఎన్ రావు, అధ్యక్షుడు, స్టీల్ ఏఐటీయూసీఆ విషయాన్ని తేల్చాలి..ఇటీవల తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు డబ్బులు కట్టి చేరినవారా? లేక నిర్వాసితులా? అనేది తేల్చి చెప్పాలి. ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. – జె.అయోధ్యరామ్, గౌరవ అధ్యక్షుడు, స్టీల్ సీఐటీయూ -
యూరియా ‘కట్ట’డిపై ముట్టడి!
సాక్షి, అమరావతి /సాక్షి నెట్వర్క్: యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తోంది. సొసైటీల ద్వారా సరఫరా చేయకుండా పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతల ఆగడాలకు రైతన్నలే చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ రైతన్నలే విజిలెన్స్ అధికారుల అవతారమెత్తి అడ్డుకుంటున్నారు. చరిత్రలోఎన్నడూ లేనివిధంగా డిమాండ్ మేరకు యూరియా సరఫరా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం నిరసనలు భగ్గుమంటున్నాయి. దారి మళ్లుతున్న యూరియా.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సీజన్లో 6.22 లక్షల టన్నుల యూరియా అవసరం. ఈ ఏడాది 5.70 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయని చెబుతోంది. అదే నిజమైతే మరి రైతన్నలు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తోందన్న ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం కరువైంది. రైతులకు అందాల్సిన యూరియా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్లు స్పష్టమవుతోంది. పలు జిల్లాల్లో టీడీపీ నేతలే యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నా వారిని కాపాడే యత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు గుడివాడలో గంటల కొద్దీ పడిగాపులు.. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో యూరియా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించడంతో పీఏసీఎస్ల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. విన్నకోట, నందివాడ, రామనపూడి పీఎసీఎస్ వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడితే అరకొరగా మాత్రమే యూరియా అందజేశారని రైతులు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే ఎరువులు దక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో భారీ క్యూలైన్లో బారులు తీరిన అన్నదాతలు ఘంటశాలలో గందరగోళం కృష్ణా జిల్లా ఘంటశాల మండలంలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మండలంలోని లంకపల్లి పీఏసీఏస్కు 445 యూరియా కట్టలు రాగా ఘంటశాల గ్రోమోర్కు 555 యూరియా కట్టలు వచ్చాయి. లంకపల్లి పీఏసీఏస్ వద్దకు రైతులు భారీగా చేరుకోగా అధికారులు గేట్లు మూసి వేయడంతో ఎండలో బారులు తీరారు. రైతులను అదుపు చేయలేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వలేదు. రైతుల ఆధార్, పాస్ బుక్ జిరాక్సులు తీసుకుని స్లిప్లు పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తున్నారని క్యూలో నిలబడ్డ వారు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రోమోర్, లంకపల్లి పీఏసీఏస్ల వద్ద రైతులు కనీసం సేదతీరడానికి కూడా అవకాశం లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఘంటశాలలో అరుగులపై తమ వంతు వచ్చే వరకు కూలబడిపోయారు. యూరియా దొరకని రైతులు ప్రభుత్వ అసమర్థతను తిట్టుకుంటూ వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా గజ్జరంలో యూరియా కోసం రైతుల పాట్లు చిత్తూరులో రైతుల నిరసన టోకెన్లు ఉన్నా యూరియా పంపిణీ చేయడం లేదని చిత్తూరు జిల్లా సదుం మండలంలో రైతులు నిరసన తెలిపారు. మూడు రోజులుగా దుకాణం వద్దకు టోకెన్లతో వచ్చినా యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్టాకు లేదంటూ దుకాణం మూసి వేశారని, నాయకులు ఫోన్ చేస్తే పదుల సంఖ్యలో బస్తాలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె యార్డులో ఆందోళన యూరియా కోసం రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా మార్కెట్ యార్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా యూరియా అందించే నాథుడు లేడని వాపోయారు. స్టాక్ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని, గంటల కొద్దీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరిలో తిరుగుముఖం.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని గజ్జరం, అన్నదేవరపేట సొసైటీల వద్ద బుధవారం యూరియా విక్రయాల వద్ద గందరగోళం నెలకొంది. ఈ సొసైటీలకు 1,600 బస్తాల యూరియా వచ్చింది. 500 మంది రైతులకు యూరియా అందజేశారు. మరో 50 మంది రైతులకు అందకపోవడంతో వెనుదిరిగారు. తాళ్లపూడి, వీరభద్రపురం, కుకునూరు, పైడిమెట్ట గ్రామాల రైతులకు యూరియా అందకపోవడంతో తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా సదుంలో నిరసన తెలుపుతున్న కర్షకులు అనకాపల్లిలో కిక్కిరిసిన కేంద్రం.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో యూరియా పంపిణీ గురించి తెలియడంతో ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో చేరుకున్నారు. యూరియా నిల్వల కంటే రెట్టింపు సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షించి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని, ఆధార్, 1 బీ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయశాఖ సిబ్బంది చెప్పడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలో పడిగాపులు.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. బుధవారం సొసైటీ కార్యాలయం వద్దకు స్టాక్ రావడంతో రైతులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఒక బస్తా మాత్రమే సరఫరా చేస్తుండటంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే యూరియా ఖాళీ కావడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా..! ఏలూరు డీసీఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో రావడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చినా పంపిణీ చేయకుండా అధికారులు మోకాలడ్డారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని డిపో నిర్వాహకులు మెలిక పెట్టారు. కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, అంత డబ్బు తమ వద్ద లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారపార్టీ నాయకుల సిఫార్సు ఉన్న వారికి ఎన్ని కట్టలైనా ఇస్తున్నారంటూ వాపోయారు. గుంటూరు జిల్లా రేపల్లె మార్కెట్యార్డు వద్ద రైతుల ఆందోళన అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపంఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 55.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం వరి చిరు పొట్ట దశకు చేరుకుంది. ఈ సమయంలో నత్రజని (యూరియా) చాలా అవసరం. యూరియాకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇలాంటి తరుణంలో సెప్టెంబర్లో అంచనా డిమాండ్ 1.55 లక్షల టన్నులైతే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా కేవలం 94 వేల టన్నులు మాత్రమే. యూరియా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది.. అంటూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఊరిస్తున్నా రాష్ట్రానికి వారు చెబుతున్నట్లుగా నిల్వలు రావడం లేదు. దీంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతులకు సరఫరా చేయాల్సిన యూరియా పక్కదారి పడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అసలు తమకు కట్ట కూడా దొరకడం లేదంటూ ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే మితిమీరి వాడేస్తున్నారంటూ వారిని నిందిస్తోంది. అర్ధరాత్రి రోడ్డెక్కి లారీని అడ్డుకున్న రైతులు..కొరత తీవ్రంగా ఉండడంతో కృష్ణా జిల్లా చినముత్తేవి గ్రామ రైతులు మంగళవారం అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీని అడ్డుకున్నారు. అందులో ఉన్న సరుకు తమకు పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎరువులతో వచ్చిన లారీ (ఏపీ 29 టీబీ 3974) డోకిపర్రులో కొన్ని బస్తాలు, చినముత్తేవిలోని ఓ ఎరువుల దుకాణంలో మరికొన్ని బస్తాలను దింపింది. చినముత్తేవి రైతులు దీన్ని గమనించి లారీని అడ్డుకున్నారు. ఏలూరు డీసీఎంఎస్ ఎరువుల కౌంటర్ వద్ద తోపులాట లారీ డ్రైవర్ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవటంతో ఆగ్రహించిన రైతన్నలు యూరియా కోసం అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న కూచిపూడి ఎస్సై రైతులతో మాట్లాడి లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి బుధవారం కూచిపూడి పోలీస్స్టేషన్కు వచ్చి లారీలోని ఎరువులకు బిల్లులు ఉన్నాయని చెప్పారు. ఆ లోడ్ను నిడుమోలులోని గంగా ఫెర్టిలైజర్స్కు పంపించి ఎకరాకు అరకట్ట వంతున ఏవో ఆధ్వర్యంలో పంపిణీ చేయించారు. గుడివాడలోని వ్యాగన్ నుంచి యూరియా 325 బస్తాలు, ఎంవోపీ (పొటాష్) 200 బస్తాలు, 16–16–16 రకం 80 బస్తాలు పంపామని, నిడుమోలు వెళుతుండగా రైతులు లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారని జేడీఏ పేర్కొన్నారు. -
తప్పుడు ట్వీట్ చేసి అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి, అమరావతి: దగుల్భాజీ పోస్ట్తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై లోకేష్ పైశాచిక ప్రచారానికి తెరతీశారు. తల్లి విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ ఫేక్ ప్రచారం చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే, విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ లోకేష్ దుష్ప్రచారానికి ఒడిగట్టారు.తప్పుడు ట్వీట్ చేసి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పబోయిన నారా లోకేష్.. గోతిలో పడ్డారు. లోకేష్ది సైకో మనస్తత్వం అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల మండిపడతున్నాయి. -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఎంపీ మిథున్రెడ్డి కుటుంబానికి మేం అండగా ఉంటాం: ధర్మాన
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ప్రభుత్వం ఎంపీ మిథున్రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్రావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్రెడ్డితో వైఎస్సార్సీపీ నేతలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మిధున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుంది.కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు.ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు. న్యాయ వ్యవస్థ నిర్ధారించనంత వరకూ వ్యక్తిగానే చూడాలి.వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటాం.చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. సహజంగానే ప్రత్యర్ధులకు కోపం ఉంటుంది. చార్జిషీటు వేయనివ్వడం లేదని మండిపడ్డారు. -
మిమ్మల్ని రాష్ట్రాన్ని దాటించే వరకు వదిలిపెట్టం కాసు మహేష్ రెడ్డి స్వీట్ వార్నింగ్
-
నీ సవాల్ కి నేను రెడీ.. మైక్ ఇచ్చే దమ్ముందా..?
-
బాబు విజన్.. ఒక్క రోజే రూ.5వేల కోట్ల అప్పు
సాక్షి,అమరావతి: తొలి అడుగు అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ, దీనికి విరుద్ధంగా ‘అప్పుల పాలనలో సర్కార్ అడుగులు’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కారు తీరు. మంగళవారం మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పుల సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2లక్షల వేల కోట్లకు చేరాయి.చంద్రబాబు సర్కార్ మంగళవారం మరో రూ.5వేల కోట్లు అప్పుగా తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులను సమీకరించింది. ఇలా 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.2 లక్షల 9 వేల కోట్ల అప్పు చేసింది. తద్వారా ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా అప్పులు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది.సూపర్ సిక్స్ ప్రధాన హామీలు అమలు చేయని చంద్రబాబు..రికార్డ్ స్థాయిలో అప్పులు తీసుకొస్తుంది. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్గా చంద్రబాబు ప్రభుత్వం నిలిచింది. -
అనంతపురం జిల్లా గుంతకల్లులో TDP MLA గుమ్మనూరు జయరాం వర్గీయుల దాష్టీకం
-
దెందులూరులో టీడీపీ నేతల గూండా గిరి
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండా గిరికి తెగబడ్డారు. వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం శ్రీరామవరం వెళ్లిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరీ నాని, కొందరు టీడీపీ కార్యకర్తలు.. కామిరెడ్డి నానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు రెచ్చిపోయి.. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్లపై హైకోర్టు విస్మయం
-
చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
సంబరాల బాబూ.. బుడమేరు ప్రక్షాళన ఏమైంది?
సాక్షి, తాడేపల్లి: విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఏడాది గడిచినా నష్ట పరిహారం ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీశారన్న వెలంపల్లి, పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం సీఆర్డీఏకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సంబరాలు దేనికి చంద్రబాబూ..? చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు తాను తొలిసారి సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయిపోయిందని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు.గతేడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీట మునిగినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు నగరంలో తిరిగి ఫొటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గానీ ఏడాది పూర్తయినా బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదు.సీఎం అయ్యి 30 ఏళ్లయిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలి. గతేడాది వరదలొచ్చినప్పుడు బుడమేరు ఆధునికీకరణ పనులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. రాత్రింబవళ్లు అక్కడే నిద్ర చేసి వరద ముంపు సమస్యను పరిష్కరించానని ప్రచారం చేసుకున్న మంత్రి రామానాయుడు, బుడమేరు ఆధునికీకరణ పనులపై ఆ తర్వాత కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. బుడమేరు ప్రక్షాళన ఏమైందో ఆయన సమాధానం చెప్పాలి.రూ.6800 కోట్ల నష్టం జరిగితే.. ఏ మేరకు సాయం చేశారు..? వరదల కారణంగా నష్టపోయిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడామని, ఇంట్లో పాడైపోయిన ఎలక్రిక్ వస్తువుల కోసం ఎలక్ట్రిసిటీ కంపెనీలను సంప్రదించామని వారితో మీటింగ్లు పెట్టిన సీఎం చంద్రబాబు.. బాధితులకు మాత్రం పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. స్కూటర్లు, ఆటోలు కొత్తవి ఇవ్వలేదు సరికదా కనీసం ఉచితంగా రిపేర్ కూడా చేయలేదు. ఇంట్లో బురద కడగడానికి ప్రభుత్వమే మనుషులను పంపిస్తుందని చెప్పినా సొంతంగానే ఎవరికి వారే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సర్వే పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులను వదిలేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు డోర్ లాక్ అని రాసుకుని వెళ్లారు. మీ ఇళ్లలో వారం రోజులు నీళ్లు నిలవలేదు కాబట్టి సాయం ఇవ్వలేమని అడ్డగోలు కండిషన్లు పెట్టి వరద బాధితులను ఈ ప్రభుత్వం హేళన చేసింది.ప్రచారంలో మాత్రం డ్రోన్లతో ఇంటింటికీ సాయం అందించామని చెప్పుకున్నారు. సుమారు 2.68 లక్షల కుటుంబాలను వరద ముంచేసిందని దాదాపు రూ.6800 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. వరద బాధితుల సహాయార్థం దేశవిదేశాల నుంచి దాతలు స్పందించి దాదాపు రూ. 400 కోట్లకుపైగా విరాళాలు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. మరీ దారుణంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పెరుగన్నం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపించి కూటమి ఎమ్మెల్యే భారీగా దొచుకుతున్నారు. కుమ్మరిపాలెంలో వరద సాయం కోసం మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే దారుణంగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.విజయవాడను గాలికొదిలేశారు:పేరుకేమో అమరావతి రాజధాని, కానీ ఎక్కడా కాలవల్లో కనీసం పూడికలు తీయడం లేదు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్క సీఆర్డీఏకి మాత్రమే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థల సమస్యల మీద ఆయన ఇంతవరకు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పేరు చెబితే లిక్కర్ షాపులు తప్ప ఏ ఒక్క పథకం కూడా గుర్తురాదు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందని వినాయకుడి మండపంలో నిలబడి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. విజయవాడ వరదల పాపం చంద్రబాబుదే. ఆయన నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ మునిగిపోయింది. తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేశాడు. ఇప్పటికైనా బుడమేరు వాగును ప్రక్షాళన చేసి ఆధునికీకరణ పనులను తక్షణం పూర్తి చేయాలి. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. -
రెచ్చిపోయి కొట్టుకున్న టీడీపీ జనసేన శ్రేణులు
సాక్షి, అన్నమయ్య: గణేష్ నిమజ్జనం సాక్షిగా.. కూటమి పార్టీల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డెక్కి కొట్టుకున్నాయి. దీంతో తీవ్ర గాయాలతో పలువురు ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. పీలేరులో గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి ప్రవర్తించాయి. ఈ క్రమంలో జనసేన వర్గాలతో వాగ్వాదానికి దిగారు. అది ముదిరి రోడ్డునపడి కొట్టుకున్నారు. దీంతో పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కూటమి పార్టీల మధ్య పీలేరుతో ఇలాంటి ఘర్షణలు కొత్తేం కాదు. తాజా ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి! -
దేవుడి ముందూ రాజకీయమేనా బాబు!
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భం ఏదైనా రాజకీయం మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించకుండానూ ఉండలేరు. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. వినాయక చవితి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా భక్తి పూర్వకంగా నేతలు పూజలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన ఇంట్లో పూజలు చేశారో లేదో తెలియదు కానీ.. విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. తప్పేమీ లేదు కానీ.. ‘దొంగ దండాలు పెట్టిన వారిని వినాయకుడు క్షమించడు. వాళ్ల సంగతి చూస్తాడు’ అన్నారట. ఎవరు దొంగ దండాలు పెడతారు?. జనాన్ని మోసం చేసేవారు కదా!. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని నేరవేర్చకుండా ప్రజలను ఆయన మోసం చేస్తుంటారని జగన్ తరచుగా చెబుతుంటారు.కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్ల కోతపై ఒక కామెంట్ చేస్తూ చంద్రబాబు జీవితం అంతా మోసాల మయం అని, మాట మీద నిలబడని వ్యక్తి అని ధ్వజమెత్తారు. బహుశా వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇలా విమర్శించి ఉండవచ్చు. ఎల్లో మీడియా ఈ కథనాన్ని కాస్తా చాలా ప్రముఖంగా ప్రచురించింది. వెళ్లిందేమో దైవ దర్శనానికి.. మాట్లాడిందేమో ఇలాంటి మాటలు! ఆయన ధోరణే అంత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తూంటారు. అందుకే సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎక్కడపడితే అక్కడ జగన్ నామ జపం చేస్తుంటారు. అవి అభ్యంతరకరమైన పదాలతో ఉండకపోతే ఆయనకు తృప్తిగా అనిపించదేమో మరి. పారిశ్రామికవేత్తల వద్ద కూడా జగన్ను భూతం అనడం చూస్తుంటే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం చంద్రబాబును పీడిస్తున్నట్లు ఉంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. సీఎం హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టమని తెలిసినా ఆయన పట్టించుకోకపోవడం!.గత ఏడాది ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినప్పటికీ.. చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే జగన్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఏకంగా 49 లక్షల ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంలతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడకుండా.. కేవలం జగన్పై విమర్శలకు మాత్రమే పరిమితం కావడాన్ని చూస్తే.. ఆ వ్యవహారాలన్నీ నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉండదేమో అన్న ఆందోళనతో జగన్ను బద్నాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. వైఎస్ జగన్ ఎప్పుడూ తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్తో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 150 హామీలు ఇచ్చినప్పుడు వాటి అమలు సాధ్యం కాదని జగన్ కుండబద్ధలు కొట్టారు. అలాంటి హామీలు తాను ఇవ్వలేనని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు వంద శాతం నెరవేర్చిన ఘనత జగన్ది. అందువల్ల ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్లు ఎప్పుడూ మేనిఫెస్టో ఊసే తీసుకురారు. పైగా హామీలు నెరవేర్చుతున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ మహిళలను ఊరించారు. తీరా చూస్తే కేవలం ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేశారు.అదే టైమ్లో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనలకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి, దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండీషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధులలోకి వచ్చి పోరాడారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. వీటిని ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగ దండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. జగన్కు దొంగ దండాలు పెట్టవలసిన అవసరం ఏముంది?. ఆయన ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఎక్కడకు వెళ్లినా పవిత్ర భావంతోనే ఉంటారు. చివరికి ఎవరి నుంచైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు.అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాన్ని దెబ్బతీశారు. అందువల్ల దైవ దర్శనానికి ఎవరు వెళ్లినప్పుడు చిత్తశుద్దితో నమస్కారాలు చేస్తారు? ఎవరు దొంగ దండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా జగన్ ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరు.చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలు ఉన్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారా అంటే అదీ అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండానే పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. చర్చికి వెళ్లి ఏసును నమ్మితే విజయమే అని అనగలరు. మళ్లీ ఆ మతాచారాలను పాటించే వారిలో కొంతమందిని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మతం పేరు పెట్టి విమర్శించగలరు. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని కామెంట్ చేశారు. ఇక జగన్ పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైమ్లో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటివారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతమనే కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.. -
వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవ.. తాడిపత్రిలో తన్నుకున్న టీడీపీ తమ్ముళ్లు
-
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనితో మాకు ప్రాణ హాని
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఏలూరు జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ సర్పంచ్ సునీత భర్త పలగాని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము కాలువ పోరంబోకు ఐదెకరాలను ఐదేళ్లుగా సాగు చేసుకుంటున్నామని, తహసీల్దార్ పొజిషన్ సర్టీఫికెట్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే చింతమనేని, ఆయన గన్మేన్, మరో వ్యక్తి.. పొలంలోకి వచ్చి బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టినట్టు చెప్పారు.ఈ దాడిలో తన భార్య, సర్పంచ్ సునీత స్పృహ కోల్పోయిందన్నారు. తాను సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకునే కుట్ర పన్నుతున్నారని చెప్పారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్ఐ, వీఆర్వోలను తనపై కేసు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తూ వారినీ బూతులు తిట్టినట్టు తెలిపారు. తమ పొలంలోకి వచ్చి తమను కొట్టి తమపైనే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణహాని ఉందని, తమకు ఏం జరిగినా ఎమ్మెల్యే చింతమనేనిదే బాధ్యతని స్పష్టం చేశారు. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం
సుద్దపల్లి(చేబ్రోలు): వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా మూడు రోజుల కిందట రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తూ పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వడ్డెర కాలనీకి చెందిన మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో వడ్డెర కింగ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు.రెండు వర్గాల మధ్య వివాదం జరగడంతో పది మందికి గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాలకు చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓ వర్గం అధికార టీడీపీకి చెందిన వారు. అయితే, పోలీసులు తమ పిల్లలను మాత్రమే స్టేషన్కు తీసుకువెళ్లి హింసిస్తున్నారని వడ్డెర కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి వర్గీయులు రాత్రి సమయంలో తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలకుంట శ్రీను, వీరమ్మ దంపతులకు చెందిన ఇంటిపై దాడి చేశారని, రేకులు పగలకొట్టారని వాపోయారు. పల్లపు రాజాకు చేయి విరిగిందని, కొవ్వూరు శివశంకర్కు తల పగిలిందని, మరో ఐదుగురికి గాయాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల స్పందించి న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. -
టీడీపీ నేతల డిష్యుం..డిష్యుం..
తాడిపత్రిటౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకల్లో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన రెండు వర్గాల వారు నువ్వెంతంటే నువ్వెంత అంటూ రాళ్లు రువ్వుకోవడంతో వినాయక శోభాయాత్రకు వచ్చిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విగ్రహాలను చూసేందుకు వచ్చిన మహిళలు, పిల్లలు, ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డికి, అదే పార్టీకి చెందిన కాకర్ల రంగనాథ్కు మధ్య వైరం కొనసాగుతోంది.వినాయక చవితి సందర్భంగా రెండు వర్గాల వారు పోటాపోటీగా గణేశ్ మండపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నిమజ్జన వేడుకల్లో భాగంగా పట్టణంలోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులు స్థానిక సీబీ రోడ్డుపై శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ప్రజలు, మహిళలు, పిల్లలు పెద్దసంఖ్యలో పాల్గొని డ్యాన్స్లు చేస్తూ సందడి చేశారు. అయితే.. పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి కాకర్ల రంగనాథ్కు చెందిన శోభాయాత్ర వాహనం ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్రెడ్డి పలుమార్లు తన అనుచరులతో కలసి వచ్చి.. త్వరగా ముందుకు వెళ్లాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.అశోక్ పిల్లర్ సమీపంలోకి రాగానే జేసీ, కాకర్ల వర్గీయుల మధ్య గొడవ మొదలైంది. రెండు వర్గాల వారు కర్రలు, ఇనుపరాడ్లు, పిడి గుద్దులతో తెగబడ్డారు. కొందరు అక్కడే ఉన్న నాపరాళ్ల బండలను పగులగొట్టి వాహనాలపైకి రాళ్లు రువ్వారు. దీంతో మహిళలు, పిల్లలు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. పోలీసులు వారించినా వినలేదు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరికి గాయాలు కూడా అయినట్టు సమాచారం. దీంతో శోభాయాత్రకు బయలుదేరిన వినాయక విగ్రహాలు గంట పాటు రోడ్డుపైనే నిలిచిపోయాయి. చివరికి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు రెండువర్గాల వారిని చెదరగొట్టి..పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జేసీ, కాకర్ల ఇళ్ల వైపు ఎవ్వరూ వెళ్లకుండా బందోబస్తు నిర్వహించారు. -
కాసుల కోసం కాంట్రాక్టు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలంలో ఉన్న యూబీ బీర్ల కంపెనీ కాంట్రాక్టులపై అధికార కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే కన్ను పడింది. బీర్ల రవాణా కాంట్రాక్ట్లు అన్నీ తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కాదంటే కంపెనీ నుంచి లారీలు వెళ్లవంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో బయట ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు బయటకు చెప్పుకోలేక... నష్టాలు భరించలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని డిపోల కాంట్రాక్టులు కావాలంటూ..రణస్థలంలోని యూబీ కంపెనీ నుంచి 29 డిపోలకు బీర్లు రవాణా అవుతుంటాయి. వీటిలో ఏడు డిపోలకు రవాణా కాంట్రాక్టును ఇప్పటికే ఒక ప్రజాప్రతినిధి తీసుకున్నారు. మిగతా 22 డిపోలకు బీర్ల రవాణా కాంట్రాక్టును నలుగురు కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు దక్కించుకున్నారు. ఇప్పుడా 22 డిపోల రవాణా కాంట్రాక్ట్ కూడా తనకు వదిలేయాలని ఓ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు నలుగురు కాంట్రాక్టర్లను నేరుగా అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.వారు అంగీకరించకపోవడంతో సదరు ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో, రవాణా కోసం వచ్చే లారీలను కంపెనీ గేటు వద్ద వారు అడ్డుకుంటున్నారు. తమ ఎమ్మెల్యే చెప్పినట్లు చేసేవరకు లారీలను లోపలికి పంపించబోమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రవాణా కోసం వచ్చే లారీలు రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. డ్రైవర్లు, సిబ్బంది పడిగాపులు పడుతున్నారు. కొద్దిరోజులుగా కంపెనీ నుంచి డిపోలకు సరుకు వెళ్లడం లేదని సమాచారం. మరోవైపు లారీల కిరాయి భారం కాంట్రాక్టర్లపై పడుతోంది. సమస్య పరిష్కారానికి కంపెనీ ప్రతినిధులు ప్రయతి్నంచినా... సమస్యను పరిష్కరించేందుకు యూబీ పరిశ్రమ హెడ్ ఆఫీస్ నుంచి రెండు రోజుల కిందట ఇద్దరు ప్రతినిధులు వచ్చినా ఫలితం లేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు యూబీ రణస్థలం పరిశ్రమలో ఉన్న ట్రాన్స్పోర్ట్ అండ్ కమర్షియల్ విభాగంలోని ఒక ముఖ్య అధికారి ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలో జరిగేదంతా ఆయన ఎప్పటికప్పుడు సదరు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఏ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్కు ఎంత లాభం వస్తుందనే వివరాలను ఆయన చెప్పడం వల్లే కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే గట్టిగా పట్టుపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూబీ పరిశ్రమలో కొంతమంది ఉద్యోగులు కూడా ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా చక్కదిద్దకపోతే పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందనే చర్చ సాగుతోంది. -
విధానాలకు వెన్నుపోటు
తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో 1995 ఆగస్టు సంక్షోభాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు చంద్రబాబు చేసిన ద్రోహం అనే కోణం నుంచి చర్చించడం జరుగుతూ వస్తున్నదే. ఆ పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇందులో రెండవ కోణం కూడా ఉంది. అది ఎందువల్లనో చర్చలోకి రావటం లేదు. ఢిల్లీ స్థాయిలో గానీ, దేశవ్యాప్తంగా పరిశీలకుల దృష్టిలో గానీ ఎన్టీఆర్ ఒక సాధారణ ప్రాంతీయ పార్టీ నాయకునిగా మిగలలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పలుకుబడిలో ఉండిన ఒక రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని మొదటి సారిగా సృష్టించి స్థిరపరచటం, తద్వారా రెండు పార్టీల వ్యవస్థను సుస్థిరపరచటం వాటిలో మొదటిది. 1980ల నాటికి కాంగ్రెస్ గణనీయంగా బలహీనపడుతూ దేశమంతటా ప్రాంతీయ శక్తులు బలపడు తున్న దశలో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ని ఆ వరసలోకి తేవటం అందరి దృషినీ ఆకర్షించింది. తర్వాత, ఒక సినిమా నాయకుని పరిపాలన ఏ విధంగా ఉండగలదనే సందేహాలు కలుగుతుండగా ఆయన సంక్షేమ రాజ్యం, అప్పటికి 30 ఏళ్లకు పైగా సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నట్లు చెప్పుకునే కాంగ్రెస్ను మించి ప్రజల ఆమోదాన్ని పొందటం, అందుకు ఆధారప్రాయమైన పథకాలు, అవి లోపరహితంగా అమలు కావటం, పేదలు చిరకాలపు దారిద్య్ర రేఖ నుంచి క్రమంగా బయటపడుతుండిన సూచనలు పరిశీలకుల దృష్టిని ఆకర్షించాయి. మరో అంశం రాష్ట్రాల హక్కులకు సంబంధించిన ఫెడరలిస్ట్ వైఖరి. బలమైన ఫెడరలిస్ట్ వైఖరి తీసుకుంటూ ‘కేంద్రం మిథ్య’ అనే సాహసోపేత మైన ప్రకటనతో దేశంలోని ఫెడరలిస్టులందరినీ ఉలికిపడజేశారు. కాంగ్రెస్ అయితే ఆయనపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేసేవరకు వెళ్లింది. అయినా జంకలేదు. ఆయన రాజ కీయాలలో కొనసాగి ఉంటే కాంగ్రెస్ అనుసరిస్తుండిన యూనిటరిజానికి వ్యతిరేకంగా ఫెడరలిస్టు రాజకీయాలు మరెంతో బలపడి ఉండేవి. కాకతాళీయంగా ఇందుకు కొనసాగింపుగా ఎన్టీఆర్ అధ్యక్షునిగా, వీపీ సింగ్ కన్వీనర్గా 1989లో ‘నేషనల్ ఫ్రంట్’ ఏర్పడి కేంద్రంలో అధికారానికి కూడా వచ్చింది. ఫ్రంట్ మేనిఫెస్టోలో రాష్ట్రాల హక్కుల అంశాలు అనేకం ఉన్నాయి. అదే క్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం... పరమ సాంప్రదాయికుడు కావటమే గాక కాషాయ వస్త్రధారిగా మారి విమర్శలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, అప్పటి ‘జనసంఘ్’ పట్ల వీపీ సింగ్తో పాటు పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకుని తనను తాను సెక్యులర్ వాడిగా ప్రకటించుకోవటం! ఇవన్నీ ఎన్టీఆర్ వారసత్వంగా మిగిలి తెలుగువారి చరిత్రలోనే గాక దేశ చరిత్రలోనే మిగిలిపోయాయి. కాగా, ఈయనను దారుణమైన రీతిలో పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు విధానాలు ఏ విధంగా ఉండ వచ్చునని అందరూ ఉత్సుకతతో ఎదురుచూశారు. చంద్రబాబు అధికార గ్రహణ చేయడానికి మించి ఎన్టీఆర్ ఘనమైన వారసత్వానికి గ్రహణం కూడా పట్టిస్తున్నట్లు అందరికీ త్వరలోనే అర్థమైంది. ఇండియా వంటి వర్ధమాన దేశంలో సామాన్య ప్రజల కన్నా ధనిక వర్గాల ప్రయోజనాలు ముఖ్యమని భావించిన చంద్రబాబు, మొదటి నుంచే ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేశారు. కనీసం ఆ సిద్ధాంతం చెప్పే పెర్కొలేషన్ థియరీని అయినా పాటించక, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఒక్కటొక్కటిగా మంగళం పాడారు. సెక్యులరిజాన్ని వదిలేసి, అధికారం కోసం అవసరమైనప్పుడల్లా బీజేపీతో చేరుతూ అవకాశవాదిగా మారారు. ఫెడరలిస్ట్ శక్తులతో మైత్రి కూడా అదే విధమైన అవకాశవాదంగా మారింది. ఈ విషయాలన్నింటినీ గమనించినపుడు, చరిత్రలో ఎన్టీఆర్, చంద్రబాబుల స్థానాలు ఏ విధంగా మిగిలేదీ ఎవరైనా ఊహించగలరు. ఈ విధంగా 1995 నాటి సంక్షోభమన్నది కేవలం అధికార రాజకీయాల సంక్షోభ చరిత్రగా కాక, అంతకు మించి విధానపరమైన సంక్షోభంగా కూడా మిగులు తున్నది. దేశ రాజకీయాలకు చంద్రబాబు కాంట్రిబ్యూషన్ అది. ఒక మహానుభావుని ఆదర్శ రాజకీయాలు గాలిలో కలిసి, మరొక తరహా మహానుభావుని అధికార రాజకీయం రాజ్యమేలటం ఆ విధంగా మొదలైంది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జగన్ ది ఒకటే మాట.. కూటమి నేతలది దొంగ బుద్ధి
-
కూటమి ప్రభుత్వంలో మహిళా వ్యతిరేక పాలన : వరుదు కల్యాణి
వైయస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో మహిళా వ్యతిరేక, ప్రజాకంటక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. కడప వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహిళలతో సమావేశమైన ఆమె తొలుత వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. రాష్ట్రంలో పార్టీ మహిళా విభాగం చేపట్టాల్సిన అంశాలు, మహిళా సమస్యలపై జిల్లా కమిటీలతో వరుదు కల్యాణి చర్చించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరినీ కలుపుకుని మహిళలకు రక్షణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్ హయాంలో మహిళా సానుకూల ప్రభుత్వం నడిచిందని, అన్ని విధాలా మహిళలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారన్నారు. జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. ఇచిన హామీలు తుంగలో తొక్కారని, అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మహిళలకు రూ. 1500 ఎప్పుడిచ్చారని ప్రశ్నించారు. స్త్రీ శక్తి పేరుతో ఐదు బస్సులకే పరిమితం చేశారని ఆమె ప్రశ్నించారు.నిరుద్యోగ భృతి ఎక్కడకు పోయిందని, రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో బాబు టోపీ పెట్టారని కల్యాణి అన్నారు. వికలాంగుల పింఛన్లులో కోత కోయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనుకాడలేదని, తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా అనగలుగుతున్నారని ఆమె నిలదీశారు.ఏ ఒక్క మహిళపై చేయి వేసినా, అదే వారికి చివరి రోజు అని చంద్రబాబు అన్నారని, అయితే ఆయన సొంత ఎమ్మెల్యేలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే నోరు మెదపడం లేదని కల్యాణి ఎద్దేవా చేశారు.మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో బాహుబలి పాలన అని ఇప్పుడు నరబలి చూపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా వారు నోరు మెదపరన్నారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వినియోగిస్తున్నారన్నారు. మాట్లాడితే రుషికొండ బీచ్ భవనాలు సందర్శించే బదులు సుగాలి ప్రీతి కి న్యాయం చేయవచ్చు కదా? అని ఆమె నిలదీశారు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని, తప్పకుండా మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగుతూనే ఉంటాయన్నారు. మళ్ళీ వైఎస్ జగన్ సీఎం కావాలంటే మహిళలందరూ కంకణం కట్టుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. -
ఖరీఫ్.. ఉఫ్..
సమయానికి వర్షాలు లేవు... అదునుకు విత్తనమూ దొరకలేదు... పెట్టుబడికి ప్రభుత్వం పైసా సాయం అందించలేదు... అయినా పుడమి తల్లిని నమ్ముకుని... పుట్టెడు కష్టాలను దాటుకుని... అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు రాష్ట్ర రైతులు..!ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుంటూ... ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలకు టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి కనీస తోడ్పాటు కరువైంది..! ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ‘నేనున్నాను’ అనే భరోసా కల్పించలేకపోతోంది..! డిమాండ్కు సరిపడా యూరియా ఇతర ఎరువులు సరఫరా చేయడంలో సర్కారు చేతులెత్తేసింది..! ఫలితంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ముందే మురిపించిన వరుణుడు... ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు... దాదాపు రెండు నెలల పాటు మొహం చాటేశాడు...! ఇప్పుడేమో 20 రోజులుగా అధిక వర్షాల ప్రభావంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఇంతటి తీవ్ర ఒడిదుడుకుల మధ్య అన్నదాతలను... ఆదిలోనే పతనమైన ఉల్లి ధరలు కలవరపెడుతున్నాయి. పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేని దుస్థితిలో ఉన్న రాష్ట్ర సర్కారు తీరు ఆందోళనకు గురిచేస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి దినదిన గండంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంతో మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. గత ఏడాది మాదిరిగానే అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదట్లో వర్షాభావం నెలకొన్నా, ఆశాభావంతో పెట్టుబడులకు అప్పులు తెచ్చి మరీ పంటలు వేసిన రైతులు ఇప్పుడు యూరియా, ఇతర ఎరువులు దొరక్క అగచాట్లు పడుతున్నారు. మరీ ముఖ్యంగా డిమాండ్కు తగ్గట్లు యూరియా అందడం లేదు. ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది అంటూ కబుర్లతో కాలక్షేపమే తప్ప ప్రభుత్వం అదునుకు అందించలేకపోతోంది.అన్నదాత సుఖీభవ అరకొరఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అన్నదాత సుఖీభవ కింద అరకొరగా పెట్టుబడి సాయం చేసింది కూటమి ప్రభుత్వం. పెట్టుబడికి అవసరమైన రుణాలను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.ఖరీఫ్లో రూ.3.06 లక్షల కోట్ల రుణ లక్ష్యం కాగా సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిన తర్వాత కూడా రూ.94 వేల కోట్లకు మించి ఇవ్వని దుస్థితి నెలకొంది. కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. రూ.8 వేల కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.985 కోట్లకు మించి ఇవ్వలేదు. అదికూడా జేఎల్జీ గ్రూపులకు మాత్రమే ఇచ్చారు.ఎరువులనూ మేస్తున్న పచ్చముఠాలు!వ్యవసాయం కోసం సరఫరా చేస్తున్న యూరియాను క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా పక్కదారి పట్టిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.75 లక్షల టన్నుల ఎరువులుండగా, ఇందులో యూరియా 1.15 లక్షల టన్నులు, డీఏపీ 80 వేల టన్నులే కావడం గమనార్హం. ఇక రాష్ట్రానికి కేటాయించే ఎరువుల్లో 70–80 శాతం వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వాళ్లు ఇష్టమొచ్చినట్టు ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రైతు సేవా కేంద్రాలు కాదు కదా కనీసం సహకార సంఘాల్లో కూడా ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది.జాడలేని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికఖరీఫ్లో రాయితీయేతర (నాన్ సబ్సిడీ) విత్తనాల పంపిణీని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం కనీసం సబ్సిడీ విత్తనాన్ని కూడా పూర్తిగా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. ఈ సీజన్కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం. కానీ, దాదాపు 1.10 లక్షల క్వింటాళ్ల మేర కోత పెట్టారు. 5.22 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కేటాయింపులు జరపగా, 4 లక్షల క్వింటాళ్లను నిల్వ చేసి, 3.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇండెంట్ ప్రకారం... 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరం కాగా, లక్ష క్వింటాళ్లకు పైగా కోతపెట్టి 1.80 లక్షల క్వింటాళ్లనే అందజేశారు. 2.27 లక్షల క్వింటాళ్లకు 1.60 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాన్ని పొజిషన్ చేయగా, 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే అందించారు.⇒ వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ సాగవని రాయలసీమ జిల్లాల్లో కనీసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. లక్షలాది ఎకరాలు సాగుకు దూరంగా బీడువారి పోతున్నా సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేసిన పాపాన పోలేదు. ⇒ 20 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు తోడు కృష్ణ, గోదావరికి పోటెత్తిన వరదతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 2 లక్షల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఇలాంటి సందర్భాల్లో 80 శాతం సబ్సిడీపై శాస్త్రవేత్తల సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను పంపిణీ చేయాలి. కానీ, ఆ ఆలోచన కూడా చేయడం లేదు.ఇలాగైతే అనగనగా వేరుశనగనే..రాయలసీమ జిల్లాల్లో మాత్రమే సాగయ్యే వేరుశనగ లక్ష్యం మాట దేవుడెరుగు... సాధారణ విస్తీర్ణంలో నాలుగో వంతు కూడా సాగవని దుస్థితి నెలకొంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 12.97 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 14.30 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. సాగైంది 4.20 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే సాధారణ విస్తీర్ణంలో 34 శాతం. నిర్దేశించిన లక్ష్యంలో 29.37 శాతం దాటలేదు. ఈ పంటకు అదును దాటిపోయింది. జాతీయ స్థాయిలో 1.13 కోట్ల ఎకరాల సాగు అంచనా కాగా, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో లక్ష్యానికి మించడం గమనార్హం.మళ్లీ వలసలే గతి...⇒ హెక్టార్లో వేరుశనగ సాగు జరిగితే కనీసం 75–100 పనిదినాలు లభిస్తాయి. నూనె గింజల సాగు తగ్గిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 5 లక్షలకు పైగా పనిదినాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు, రైతు కూలీలు మళ్లీ వలస బాట పట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు వేరుశనగ, మినుము కొంత అనావృష్టి, కొంత అతివృష్టితో దెబ్బతిన్నాయి. దిగుబడులు కూడా సగానికి పడిపోతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆ మేరకు రాష్ట్రానికి సంబంధించిన జాతీయ స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.⇒ ఖరీఫ్ సాగులో గడిచిన సమయం 12 వారాలు⇒ జాతీయ స్థాయిలో అన్ని పంటల సాగు అంచనా 27.42 కోట్ల ఎకరాలు⇒ఇంకా మిగిలిన వ్యవధి 4 వారాలు⇒ పంటలు సాగైన విస్తీర్ణం 26.85 కోట్ల ఎకరాలు(దాదాపు 97.93 శాతం)⇒గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సాగు విస్తీర్ణం: 88.5 లక్షల ఎకరాలు⇒తెలంగాణలో సాగు అంచనా: 1.32 కోట్ల ఎకరాలుఇప్పటికే సాగైన విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు (సుమారు 94 శాతం):⇒ ఏపీలో సాధారణ సాగు విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు⇒ ఈ ఖరీఫ్ సాగు లక్ష్యం: 86.32 లక్షల ఎకరాలు⇒ ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 55 లక్షల ఎకరాలు (సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 71% నిర్దేశించిన లక్ష్యంలో 64% మించి సాగవని పరిస్థితి)⇒నేటికీ 1550 శాతం మధ్యే పంటలు సాగైన జిల్లాలు: 10ప్రధాన పంటల తీరు ఇలా (లక్షల ఎకరాల్లో..)రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం: 36.37ఈ ఏడాది సాగు లక్ష్యం: 38.87ఇప్పటికి సాగైనది: 29.97 (వరి జాతీయ స్థాయిలో 104.26 శాతం సాగైతే.. ఏపీలో 72% కూడా లేదు)వరితో సహా ఇతర ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం: 50 లక్షల ఎకరాలుసాగు లక్ష్యం: 54.32 లక్షల ఎకరాలుఇప్పటివరకు సాగైన విస్తీర్ణం: 40 లక్షల ఎకరాలునూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 13.87 లక్షల ఎకరాలుఈ ఏడాది లక్ష్యం: 16.65 లక్షల ఎకరాలు సాగైనది కేవలం 5.20 లక్షల ఎకరాలు మాత్రమే పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 13.20 లక్షల ఎకరాలు నిర్దేశించిన సాగు లక్ష్యం 14 లక్షల ఎకరాలుఇప్పటివరకు సాగైనది 9.67 లక్షల ఎకరాలువరుసగా అతివృష్టి.. అనావృష్టిఆగస్టు 30 నాటికి కురవాల్సిన వర్షపాతం 415.11 మి.మీ. కురిసినది 394.46 మి.మీ. లోటు 4.97 శాతం. కానీ 8 జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం అధికంగా, మిగిలిన జిల్లాల్లో 19 శాతం తక్కువగా నమోదైంది.⇒ సాధారణ విస్తీర్ణం వరకు చూసుకున్నా రాయలసీమలోని అనంతపురంలో 64, శ్రీ సత్యసాయిలో 37, వైఎస్సార్ కడపలో 24, చిత్తూరులో 19, అన్నమయ్యలో 15 శాతం మేర పంటలు సాగయ్యాయి. ప్రకాశంలో 31, అనకాపల్లిలో 39, పల్నాడు, విశాఖలో 51, బాపట్లలో 56 శాతం మేర పంటలు సాగయ్యాయి.⇒ రాయలసీమ జిల్లాల వరకు చూస్తే సాధారణ విస్తీర్ణం 28.18 లక్షల ఎకరాలు కాగా, సాగైంది 8.77 లక్షల ఎకరాలే. కర్నూలు, నంద్యాలలో కాస్త మెరుగైన వర్షపాతం నమోదు కావడంతో ఈ మాత్రమైనా సాగైంది.మద్దతు ధర కోసం ఆదిలోనే అగచాట్లు⇒ రాష్ట్రంలో గత 2024–25 సీజన్లో ధాన్యంతో సహా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కలేదు. కనీసం ఈ దిశగా అయినా కూటమి ప్రభుత్వం ప్రయత్నించలేదు. కొనే నాథుడు లేకుండాపోయారు.⇒ మిరప, పొగాకు, కోకో, మామిడి తదితర ప్రధాన పంటలు సాగు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెద్దఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మిరపతో పాటు తోతాపురి మామిడికి మద్దతు ధర విషయంలో ప్రభుత్వ పెద్దలు ఆడిన దొంగ నాటకాలను చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.⇒ ఈ సీజన్లో అయినా పంటలకు మద్దతు ధర దక్కుతుందన్న నమ్మకం అన్నదాతల్లో కలగడం లేదు. ఆదిలోనే పతనమైన ధరలతో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను చూవిచూస్తున్నారు. దిగుమతి సుంకం ఎత్తివేతతో పత్తికి కనీస మద్దతు ధర దక్కే అవకాశాల్లేవనే కథనాలు భయపెడుతున్నాయి.⇒ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ధాన్యం సహా సాగైన పంట ఉత్పత్తులు మార్కెట్కు వచ్చే సమయానికి కనీస మద్దతు ధరలు దక్కుతాయో లేదో అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. -
ఆదేశాలు సరే... విధివిధానాలేవి?
కర్నూలు (అగ్రికల్చర్): ఇదుగో ఉల్లి రైతులను ఆదుకుంటున్నాం.. వెంటనే క్వింటా రూ.1,200కు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఈనెల 28న మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇది జరిగి మూడ్రోజులైనా ఉల్లి కొనుగోలుపై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలుగానీ, విధి విధానాలుగానీ రాలేదు. దీంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో ఉల్లి పంట భారీగా దెబ్బతింది. ఫలితంగా నాణ్యతలేదనే కారణంతో వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. దీంతో.. రైతులు ఉల్లిగడ్డలను పొలాల్లోనే పశువులు, గొర్రెలు, మేకలకు వదిలేస్తున్నారు. ఇలా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజూ 150 క్వింటాళ్లపైనే ఉల్లి కుళ్లిపోతోంది.మిర్చి, పొగాకుపైనా సీఎం ఇదే హంగామానాలుగైదు నెలల క్రితం కూడా మిర్చిని కొంటామని ముఖ్యమంత్రి హంగామా చేశారు. మిర్చి రైతులు, వ్యాపారులతో గంటల తరబడి సమీక్ష నిర్వహించారు. మిర్చి కొనుగోలుపై కేంద్ర మంత్రితోనూ చర్చించామన్నారు. అనంతరం క్వింటాకు రూ.12వేల మద్దతు ధరతో కొంటామన్నారు. కానీ, ఇందుకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు, జీఓలు రాలేదు. ఫలితంగా ఒక్క మిర్చి రైతుకు కూడా న్యాయం జరగని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో రైతులు అతితక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయారు.అలాగే, మొన్నటికి మొన్న పొగాకు రైతులను ఆదుకుంటామని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని హడావుడి చేశారు. అయినా ఒక్క క్వింటా పొగాకు కూడా కొనలేదు. దీంతో.. 2024–25లో పండించిన పొగాకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 46 వేల క్వింటాళ్లు రైతుల దగ్గర ఉండిపోయింది. మరోవైపు.. రైతుల కోసం సీఎం కష్టపడుతున్నారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటారు. కానీ, విధి విధానాలు, జీవోలు మాత్రం రావడంలేదు. ఇప్పుడు ఉల్లి రైతుల వంతు వచ్చింది. వచ్చే వారం పదిరోజుల్లో దాదాపు 6 వేల టన్నుల ఉల్లి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి చెప్పారు కదా.. రెండు, మూడ్రోజులు చూద్దాం అని కొందరు రైతులు కోతలు వాయిదా వేస్తున్నారు. కనీసం రూ.2 వేల ధరతోనైనా కొంటేనే రైతులకు పెట్టుబడి దక్కుతుందని వారంటున్నారు. కానీ క్వింటాకు రూ.1200పైనే అని ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇది కూడా బాబు డ్రామానే అని రైతులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం మార్కెట్కు 38 మంది రైతులు 1,289 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు తెచ్చారు. ఇలా అతి తక్కువగా వచ్చిన ఉల్లిని కూడా నాణ్యత బాగోలేదని వ్యాపారులు కొనకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు.క్వింటాకు రూ.708 వచ్చింది.. ఈసారి ఒకటిన్నర ఎకరాల్లో ఉల్లి సాగుచేశాం. పెట్టుబడి రూ.1.20 లక్షల వరకు పెట్టాం. అర ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి అయింది. బస్తా ఎరువు ధర రూ.1,900. ప్రస్తుతం అర ఎకరాలో ఉల్లి గడ్డలు తెంపుకుని మార్కెట్కు వచ్చాం. 31.50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్కు తీసుకొస్తే క్వింటాకు రూ.708 మాత్రమే లభించింది. పంటను అమ్మగా రూ.22,302 వచ్చింది. ఇందులో హమాలీ ఖర్చులు, కమీషన్ ఏజెంటు కమీషన్ మినహాయిస్తే రూ.20 వేల వరకు మాత్రమే మిగులుతోంది. అంటే.. రూ.20 వేల వరకు నష్టం. – చంద్రయ్య, పెనుమాడ, క్రిష్ణగిరి మండలం -
దళితులపై టీడీపీ నేత దౌర్జన్యం
శ్రీరంగరాజపురం: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం ఎర్రికొంట వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్ల స్థలాలపై కూటమి నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కన్నుపడింది. స్థానికుల కథనం మేరకు.. దళితులకు ఇంటి స్థలాలు లేకపోవడంతో 10 కుటుంబాలు ఎర్రికొంట వద్ద గుడిసెలు వేసుకుని 20 ఏళ్లుగా జీవిస్తున్నాయి. ఈ భూమిపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దీనవతి, టీడీపీ నేత ఎత్తిరాజులునాయుడు కన్నుపడింది. వీరు జేసీబీతో 20 మంది కూటమి నాయకులతో కలిసి శుక్రవారం రాత్రి దళితులు నిర్మించుకున్న ఇళ్లను ధ్వంసం చేయడానికి యత్నించారు.దళితులు అడ్డుకోవడంతో వారిపై దాడులకు దిగారు. కులం పేరుతో దూషించారు. రేపటిలోగా ఇళ్లు ఖాళీ చేయకుంటే నిద్రలోనే చంపేస్తామని బెదిరించారు. తమకు వారి నుంచి ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని స్థానిక పోలీసు స్టేషన్, తహశీల్దార్కు దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అగ్రవర్ణానికి చెందిన కూటమి నాయకులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యలే గతి అని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ బీసీ నాయకురాలిపై టీడీపీ మూకల దాడి
గంగవరం: చిత్తూరు జిల్లాలో ఓ వైఎస్సార్సీపీ మండల బీసీ నాయకురాలిపై టీడీపీ మూకలు శనివారం విచక్షణారహితంగా దాడి చేశాయి. గంగవరం మండలం ఆలకుప్పం గ్రామంలో బోయ సామాజికవర్గానికి చెందిన కవిత ఇటీవలే వైఎస్సార్సీపీ మండల బీసీ మహిళాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బాధితురాలి సోదరి నందినిపై గతంలో తేజ అనే యువకుడు ఈవ్టీజింగ్కు పాల్పడ్డాడు.దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు గంగవరం పీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసును రాజీ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు నందిని, కవితలను తేజ బెదిరించాడు. ఈక్రమంలో వినాయక చవితి పండుగ కోసం సోదరి ఇంటికి నందిని వచ్చింది. అయితే తేజ ఆలకుప్పం గ్రామం టీడీపీ నేత రాజన్నకు విషయం చెప్పాడు.ఆయన ప్రోద్బలంతో పండగ రోజు నందిని, ఆమె సోదరి కవిత, తల్లి తిమ్ములమ్మపై తేజ, ఇతర నేతలు దాడి చేసి గాయపరిచారు. పాత కేసును రాజీ చేసుకోకుంటే ప్రాణం తీయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు పలమనేరులోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా టీడీపీ నేతల దాడిపై బాధితులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
‘కోటంరెడ్డి.. శ్రీకాంత్ పెరోల్ డైవర్షన్ కోసం మాస్టర్ ప్లాన్’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్ జగన్. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?.నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.మరోవైపు.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది. రైతు ప్రయోజనాలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది. దళారీలు, వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉల్లి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అన్నదాతా సుఖీభవా పేరుకే పరిమితం అయింది. ఒకటిన్నర ఏడాది తరువాత ఉచిత బస్సు పెట్టి మహిళలు లక్షాధికారులు అయిపోతారు అనడం సిగ్గు చేటు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు పారదర్శకమైన లబ్ధి పొందారు. వైఎస్సార్సీపీ రైతాంగానికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తుంది. అండగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. -
YSR విగ్రహానికి పసుపురంగు పులిమిన టీడీపీ మూకలు
-
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత -
మద్యం బార్లకు లక్కీ డ్రా.. టీడీపీ సిండికేట్ కుట్రలు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ కుట్రలు చేస్తోంది. మద్యం బార్లకు నేడు లక్కీ డ్రా ఉన్న నేపథ్యంలో దరఖాస్తులు రాకుండా టీడీపీ సిండికేట్ ప్లాన్ రచిస్తోంది. ఈ క్రమంలో మార్జిన్ పెంచుకునేందుకు బార్ల సిండికేట్ కొత్త ఎత్తుగడ చేసింది.వివరాల ప్రకారం.. ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ కుట్రలు చేస్తోంది. దరఖాస్తులు రాకుండా టీడీపీ సిండికేట్ కొత్త ప్లాన్కు దిగింది. బార్లకు దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంటోంది. కాగా, నిన్న రాత్రితో బార్ దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో, నేడు 840 బార్లలో 465 బార్లకు లక్కీ డీప్ తీయనున్నారు. 465 బార్లకు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తులను తగ్గించే ప్రయత్నం చేసి.. మార్జిన్ను పెంచుకునేందుకు పచ్చ నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇక, ఇప్పటికే సిండికేట్ కోసం ఒకసారి లాటరీని ఎక్సైజ్ శాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
టీడీపీ సిండికేట్ లక్కీ‘డ్రాప్’!
సాక్షి, అమరావతి: బార్ల ముసుగులో దోపిడీకి టీడీపీ సిండికేట్ పన్నాగం పన్నుతోంది. ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయకుండా కుట్రపన్నుతోంది. దశలవారీగా బార్లను లాటరీ విధానంలో దక్కించుకోవడంతోపాటు ఆ గడువులోగా దరఖాస్తులు రాలేదనే సాకుతో అదనపు 15శాతం లాభాల మార్జిన్ పెంచి కొల్లగొట్టేలా కథ నడిపిస్తోంది. ఆ ఎత్తుగడలో భాగంగానే రాష్ట్రంలో నోటిఫికేషన్ జారీ చేసిన అన్ని బార్లకు పూర్తిగా దరఖాస్తులు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వక తాత్సార వైఖరి ప్రదర్శించింది. వేరే వాళ్లను దరఖాస్తులు దాఖలు చేయనివ్వడం లేదు. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేయగా... దరఖాస్తుల దాఖలుకు మొదట ఈ నెల 27ను గడువుగా నిర్ణయించారు. ఆ తరువాత ఆ గడువును శుక్రవారం వరకు పొడిగించారు. శుక్రవారంతో గడువు ముగిసేసరికి దాదాపు 300 బార్లకు మాత్రమే కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి.నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. మిగిలిన 540 బార్లకు మరికొన్ని దశల్లో నోటిఫికేషన్ జారీ చేసి... వాటిని కూడా ఏకపక్షంగా టీడీపీ సిండికేట్కు కేటాయించేలా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. శుక్రవారంనాటికి దాఖలైన 300 బార్లకు శనివారం లాటరీ విధానంలో ఎక్సైజ్ శాఖ లైసెన్సులు కేటాయించనుంది. -
సర్కారుకు ‘సుప్రీం’ షాక్! తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు..?
సాక్షి, అమరావతి: అధికార దుర్వినియోగం, కక్షపూరిత రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్నిచ్చింది. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చి ఉండేందుకు వీలుగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై పోలీసులు దాఖలు చేసిన అప్పీల్ను తేల్చాలని ధర్మాసనానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన పెద్దారెడ్డి... తన నియోజకవర్గమైన తాడిపత్రిలోకి వెళ్లేందుకు, అలాగే తన ఇంటిలో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్.. తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి నివసించే నిమిత్తం పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. అయితే వీటిని పోలీసులు బేఖాతరు చేయడంతో కోర్టు ధిక్కార పిటిషన్ను పెద్దారెడ్డి దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్... తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి ఉండేందుకు వీలుగా పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పోలీసులు పదే పదే అడ్డుకున్నారుపెద్దారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఓ పౌరుడి ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారమని నివేదించారు. పిటిషనర్ను తన సొంత నియోజకవర్గానికి, సొంత ఇంటికి రాకుండా పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని, ఆయన్నే పోలీసులు అడ్డుకుంటున్నారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యరి్థంచారు. ఓ వ్యక్తి తనకు నచ్చిన విధంగా, స్వేచ్ఛగా సంచరించే హక్కును రాజ్యాంగం ఇచ్చిందన్నారు. పెద్దారెడ్డి తన ఇంటికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్నారని, వాస్తవానికి వాటి పరిరక్షణ బాధ్యత పోలీసులదేనన్నారు. భద్రత ఖర్చును భరించేందుకు సిద్ధంపెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం పోలీసులు అమలు చేయలేదని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో పోలీసులపై పిటిషనర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ ధిక్కార పిటిషన్లో సైతం సింగిల్ జడ్జి పిటిషనర్ పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు ఇచ్చారన్నారు. పోలీసులు ఈ ఉత్తర్వులు మొత్తాన్ని సవాలు చేయకుండా, కొంత భాగాన్నే ఎంపిక చేసుకుని అప్పీల్ దాఖలు చేశారని దవే, సుధాకర్రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ అప్పీల్కు ఎలాంటి విచారణార్హత లేదన్నారు. తన భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాసనానికి దవే తెలిపారు. తాడిపత్రిలోని ఇంటికి వచ్చేందుకు పెద్దారెడ్డికి అనుమతినివ్వాలని కోర్టును కోరారు. సొంత భద్రత లేకుంటే అందుకయ్యే వ్యయాన్ని ఆయనే భరించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయినా ప్రభుత్వం పెద్దారెడ్డికి భద్రత కల్పిస్తుందనుకోవడం లేదని దవే నివేదించారు. అధికార పార్టీ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచించింది.ఏపీలో దారుణ పరిస్థితులు...!» ఓ పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారు» పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గానికి, ఇంటికి రాకుండా పదే పదే అడ్డుకుంటున్నారు» న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు అమలు చేయలేదు..» మాజీ ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించండి..» అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది» సుప్రీంకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు -
మాపై పవన్ ఆరోపణలు సరికాదు: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్న తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు.‘‘తమకు న్యాయం చేయక పోగా పవన్.. తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ రెండు ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు. డీఎన్ఏ రిపోర్టులు మార్చారని.. పవన్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించేవరకు పోరాడతా’’ అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
Nellore: YSRCP కార్యకర్త శ్రీనివాసులుపై TDP గుండాల దాడి
-
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని పరామర్శించిన YSRCP లీడర్ మక్బూల్
-
ఎమ్మెల్యే శ్రావణి మాకొద్దు.. టీడీపీలో తిరుగుబాటు
-
మా ఇంటి దగ్గర బస్సు ఆపవా..!
చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలోతన ఇంటి వద్ద బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ జంపాన వెంకటేశ్వరరావు దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్ సీటు నుంచి అతడిని కిందకు లాగేందుకు యతి్నంచాడు. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపబోమని, రిక్వెస్ట్ స్టాప్లు ఎక్కడ ఉంటే అక్కడే ఆపుతామని డ్రైవర్ ఆ నాయకుడికి చెబుతున్నా వినిపించుకోకుండా డ్రైవర్పై దాడి చేశాడు. ఈ ఘటనను వీడియో తీస్తున్న కండక్టర్పై కూడా దాడి చేసేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించాడు.టీడీపీ నేత దౌర్జన్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్కు టీడీపీ నేత క్షమాపణ చెప్పాలని, లేకపోతే తమ సంఘాల తరఫున క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమిస్తామని ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై పామర్రు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తారా, లేదా కూటమి నాయకుల సిఫార్సులకు తలొగ్గి రాజీ ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. -
శింగనమలలో ఉద్రిక్తత.. బండారు శ్రావణికి బిగ్ షాక్
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. సేవ్ టీడీపీ పేరుతో పచ్చ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దంటూ పచ్చ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సేవ్ టీడీపీ పేరుతో శింగనమల టూమెన్ కమిటీ వర్గీయులు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
మా నాన్నను చంపొద్దు..!
-
మీ జాతకాలు నా దగ్గరున్నాయి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ జాతకాలు అన్నీ నా వద్ద ఉన్నాయి. ఎవరెవరు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. పదవి అనేది మనకు సేవ చేసేందుకు లభించిన అవకాశం. కానీ కొంత మంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. కనీసం మనల్ని నిలబెట్టిన కేడర్ను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది సరికాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కూడా ప్రకటిస్తా మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే నా తరహాలో నేను సరిదిద్దాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు విశాఖలో తలపెట్టిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తానని తెలపడంతో పాటు ప్రతీ ఒక్కరి పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక మెకానిజం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని.. వీటిని వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీ తీరు మారకపోతే నేను నా పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా చంద్రబాబు తరహాలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నామని తెలపడంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పడం గమనార్హం. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న సమావేశాల్లో మొదటిరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలే టాప్..!ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిపై భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. మైనింగ్ నుంచి పోస్టింగుల వరకూ.. ప్రతీ పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై నేరుగా కొంత మంది చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కేబినెట్ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిదిద్దుకోవాలని సూచించినట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పూర్తిస్థాయిలో అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మండలానికి ఒకరిని నియమించి వసూళ్లు చేపడుతుండగా.. మరో ఎమ్మెల్యే సోదరుడు మొత్తం పెత్తనమంతా చేస్తున్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే అందినకాడికి దండుకుంటున్నారని కూడా పక్కా సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేపై నేరుగా ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఆయన అల్లుడిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా పవన్ పేర్కొన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలుగురి ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిని వెలిబుచ్చినట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.చంద్రబాబు ఆదేశాలతోనే...!వాస్తవానికి గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమిలోని ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మందలించి పంపుతున్నానని.. బీజేపీ, జనసేన అధ్యక్షులు కూడా వారి ఎమ్మెల్యేలను పిలిచి తప్పులుంటే సరిచేసుకోవాలని చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ పీకారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలకు పనితీరు ఆధారంగా చంద్రబాబు తరహాలో రేటింగ్ కూడా ఇస్తానని చెప్పడం పట్ల జనసేన నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రతీ పార్టీ పనితీరుకు ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మరో పార్టీ స్టైల్ను ఫాలో కావడం మంచిది కాదు. చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆదేశించారంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఈ తరహాలో క్లాస్ పీకడం సరికాదు’ అని సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీ అధినేత నిరంతరం ఈ విధంగా సమావేశం కావడం మంచిదేనని.. కార్యకర్తలు చెప్పే సమస్యలు వింటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.