breaking news
TDP
-
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
నువ్వూ ఆడదానివే కదా.. ప్రశాంతి రెడ్డిని ఏకిపారేసిన YSRCP మహిళా నేతలు
-
హెరిటేజ్ వాళ్లు మోసం చేశారు..
సాక్షి, అమరావతి: ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన హెరిటేజ్ సంస్థ ఆనక ముఖం చాటేసిందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాకు చెందిన టీడీపీ కార్యకర్త బాలునాయక్ ఆరోపించాడు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ ఏడాది ఫిబ్రవరి నెల 23న అనంతపురంలో పెళ్లి వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులతో ఇన్నోవా కారులో తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా కర్నూలు–వెల్దుర్తి మధ్య తాము ప్రయాణిస్తున్న కారుని హెరిటేజ్ కంటైనర్ ఢీ కొందని తెలిపాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన హెరిటేజ్ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తామని ఆరోజు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదని బాలునాయక్ వివరించాడు.న్యాయం చేయమని వెళితే గెంటేశారు..‘వైఎస్సార్ కడపలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లను కలిశా. విషయం చెప్పాను. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా హెరిటేజ్ యాజమాన్యం న్యాయం చేయలేదు. క్యాబినెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో లోకేశ్ చాంబర్ కి వెళ్లి మరోసారి విన్నవించా. అక్కడున్న సిబ్బంది మా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకొని ఆ పార్టీలో ఉన్నాం. కానీ నమ్ముకున్న పార్టీ, హెరిటేజ్ యాజమాన్యం మా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. ప్రమాదంలో గాయపడిన కుటుంబసభ్యుల చికిత్స కోసం ఇంటి స్థలం, ట్రాక్టర్ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’ అని బాలునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు హెరిటేజ్ యాజమాన్యం, టీడీపీ న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. -
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గుంపరమాన్దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందనూరు మోహన్రెడ్డి తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఝలక్ ఇచ్చారు. తులసమ్మ శిరివెళ్ల ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని ఎంపీడీఓ శివమల్లేశప్పకు రాజీనామా పత్రం అందజేశారు. ఆమె భర్త మోహన్రెడ్డి వాటర్ యూజర్స్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసేందుకు కేసీ కెనాల్ డీఈని సంప్రదించగా రాజీనామా పత్రం కలెక్టర్కు ఇవ్వాలని సూచించడంతో కలెక్టర్ను కలిసేందుకు వెళ్లారు.ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. భూమా అఖిలప్రియను వెన్నంటి ఉంటూ ఆమె ఏ పార్టీలోకి మారితే.. అనుచరులతో కలిసి తాము కూడా వారి వెంట నడుస్తూ వచ్చామన్నారు. అయినా కార్యకర్తలకు సరైన న్యాయం, తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి పార్టీలో ఉండటం ఇష్టంలేక పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశామన్నారు. ‘బి’ ట్యాక్స్ బాదుడు భరించలేకే.. అఖిలప్రియకు మోహన్రెడ్డి రూ.5 లక్షలు ‘బి’ ట్యాక్స్ చెల్లిస్తే తప్ప గుంప్రమాన్ దిన్నె వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల అంగన్వాడీ పోస్ట్ ఖాళీ అవడంతో గ్రామానికి చెందిన ఒకరికి ఆ పోస్ట్ ఇవ్వాలని మోహన్రెడ్డి సిఫారసు చేయగా.. ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదని, రూ.8 లక్షలు ‘బి’ ట్యాక్స్ కడితేనే ఇప్పిస్తామని చెప్పినట్టు టీడీపీలో చర్చ సాగుతోంది. అంత డబ్బు ఇవ్వలేరని చెప్పడంతో గ్రామంలో మరో వ్యక్తితో బేరం ఆడుతున్నట్టు తెలుసుకున్న మోహన్రెడ్డి రూ.8 లక్షలు కప్పం కట్టి అంగన్వాడీ పోస్ట్ ఇప్పించినట్టు సమాచారం. గుంప్రమాన్దిన్నె శివారు రాజనగరానికి సీసీ రోడ్లు వేసేందుకు మంజూరైన రూ.10 లక్షల నిధులను మోహన్రెడ్డికి తెలియకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కమీషన్ కింద అమ్ముకున్నట్టు తెలుస్తోంది. మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ కెనాల్ అభివృద్ధికి మంజూరైన పనులను సైతం ‘బి’ ట్యాక్స్ పేరుతో ఎవరో కొత్త వ్యక్తులకు అమ్ముకోవడంపైనా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ పదవులకు, టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు వారి పరిధిలో మంజూరయ్యే అభివృద్ధి పనులు చేపట్టడం పరిపాటి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా పని ఎక్కడైనా, పదవి ఏదైనా ‘బి’ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. కప్పం కడితే చాలు వారు ఏ పారీ్టకి ఎంత సేవ చేశారు అని చూసే పనిలేకుండా పనులు, పదవులు కట్టబెడుతున్నారు. చేసేదిలేక దశాబ్దాలుగా చక్రం తిప్పిన నాయకులు సైతం పదవులు, పనులకు కప్పం కట్టాల్సి వస్తోంది.కప్పం కట్టి పదవులు పొందినా.. వాటి పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను వారికి ఇవ్వకుండా 20 శాతం కమీషన్ తీసుకుంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా తిరగబడుతున్నారు. కొందరు తాము కమీషన్ ఇచ్చేది లేదని ఎదురు తిరుగుతుండగా.. మరికొందరు తాము చైర్మన్లుగా, అధ్యక్షులుగా ఉన్నా సంబంధిత పనులను తమతో మాట మాత్రమైన చెప్పకుండా ఇతరులకు కట్టబెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
మధ్యాహ్న భోజనం అధ్వానం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గిన్నిస్ రికార్డు కోసం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం గురువారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం (మెగా పీటీఎం 2.0) విఫలమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు, అధికారులకు చాలాచోట్ల తల్లిదండ్రులు షాకిచ్చారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉందని.. మీ పిల్లలకు ఇలాగే పెడతారా అంటూ నిలదీశారు. ‘గోరుముద్ద’గా పేరు మారిస్తే సరిపోదని.. అంతే గొప్పగా అందించాలన్నారు. పాఠశాలల్లో పెట్టే భోజనం తినలేక పిల్లలు ఇబ్బందిపడుతున్నారని, ఒక్కరోజు తింటే అరగక ఆస్పత్రి పాలవుతున్నారని విజయవాడలో తల్లులు అధికారులను ఘెరావ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ‘మెగా పీటీఎం’లో అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మొత్తం 61,135 విద్యా సంస్థల్లో తలపెట్టిన ఈ మెగా పీటీఎం కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకే పరిమితమైంది. 70 శాతానికి పైగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా తరగతులు నిర్వహించాయి. మెగా పీటీఎంలో 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు, దాతలు తదితరులు మరో 1,49,92,456 మంది కలిపి మొత్తం 2,28,21,454 మంది పాల్గొంటారని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, అందులో సగం మంది కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. ఇది గిన్నిస్ రికార్డుపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాల్లో ఎలా జరిగిందంటే..» వైఎస్సార్ కడప జిల్లాలోని చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరుకాలేదు. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చెన్నుపల్లె ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించిన పిల్లలను ఎస్. వెంకటాపురం పాఠశాలలో విలీనం చేశారు. తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపబోమంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. » చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. పేరెంట్స్–టీచర్స్ సమావేశం జరుగుతున్నా కూడా ఉడకని అన్నం, గుడ్లను పెట్టడంతో విద్యార్థులు పడేయగా దీనిపై తల్లిదండ్రులు ఎంఈఓ నటరాజరెడ్డికి ఫిర్యాదుచేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తేనే తమ పిల్లలను స్కూల్కు పంపుతామని.. లేదంటే టీసీలు ఇవ్వాలని డిమాండు చేశారు. » తిరుపతి జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని బంగారమ్మ కండ్రిగ, గురుకుల కండ్రిగ, అనంతపద్మనాభపురం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల విలీనంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలలకు తాళాలు వేసి ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఉపా«ద్యాయులను వెనక్కు పంపారు. »పల్నాడు జిల్లా నకరికల్లు పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని.. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనమే పెడతారా అంటూ తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. » ఈ సమావేశం రోజు కూడా విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం పెట్టడంతో ప్రకాశం జిల్లా మర్రిపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మండిపడ్డారు. పెద్దదోర్నాల కస్తూరిబా పాఠశాలలో పారిశుధ్యం లోపించిందని.. పిల్లలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఫిర్యాదుచేశారు. » ప్రభుత్వం అందించిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి తండ్రి ఆరోపించారు. » అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల మెగా పేరెంట్స్ మీటింగ్ రసాభాసగా సాగింది. జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో ఉపాధ్యాయుల్లేని సమావేశాలెందుకని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. -
Nallapareddy Prasannakumar: ఇది నల్లపరెడ్డి బ్లడ్.. భయపడే ప్రసక్తే లేదు
-
చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
బాబు.. 2,45,000 కోట్ల బడ్జెట్ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లోని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?. రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత గ్యాస్ సిలిండర్ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
రోడ్డేసి ఊళ్లోకి రండి..!
కాకినాడ జిల్లా: ‘ఏలేశ్వరం నుంచి వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించండి. ఆ రోడ్డు పూర్తి చేశాకనే మా ఊరిలోకి రండి. అంతవరకు దయచేయండి’ అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామస్తులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. గ్రామంలో బుధవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిమిత్తం టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. విషయం తెలుసుకున్న యువకులు, గ్రామస్తులు ఎంపీపీని, టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఏలేశ్వరం నుంచి తమ గ్రామంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారి అధ్వానంగా మారిందని, ఎన్నికల ముందు రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు నిర్మాణం ఎందుకు చేపట్టలేదంటూ నాయకులను నిలదీశారు. రహదారి నిరి్మంచిన తరువాతే గ్రామంలోకి రావాలని భీష్మించారు. గ్రామస్తులకు సమాధానం చేప్పేందుకు టీడీపీ నాయకులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఎలాగోలా గ్రామస్తులను శాంతింపజేసి తమ కార్యక్రమం కొనసాగించారు. -
‘ఏపీ జల్జీవన్’ ద్వారా రూ.10వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర జల్జీవన్ మిషన్ ఇచ్చే నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ వాటా కోసం స్వయంప్రతిపత్తి సంస్థగా ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతి మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చిస్తుందని తెలిపారు. ఈ సమీకరణ ఎందుకన్నదీ వివరించిన తర్వాత ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, దీంతో రాజధాని మలి విడత భూ సమీకరణకు ఆమోదం వాయిదా పడింది.ప్రస్తుత సీజన్లో రైతుల నుంచి 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి పంట సేకరణ, కిలోకు రూ.4 చొప్పున చెల్లింపునకు రూ.260 కోట్ల మంజూరుకు అంగీకారం. రూ. 286.20 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ముందుభాగంలో ఇసుక తొలగింపునకు పరిపాలన అనుమతి. దీనిని లంప్సమ్ కాంట్రాక్ట్ విధానంలో చేపట్టేలా టెండర్లకు ఆహా్వనం. అన్ని అనుమతులతో పాటు ఇసుక తొలగింపు పనులను జల వనరుల శాఖ బదులు సీఆర్డీఏకు అప్పగింత.కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్ధికి నిధుల కోసం, కుప్పం విమానాశ్రయానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్, అత్యవసర పెండింగ్ పనుల పూర్తికి హడ్కో నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం సమకూర్చుకునేందుకు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్కు అనుమతి. అమరావతిలోని నేలపాడులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సరీ్వసుల అధికారుల నివాస సముదాయం పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం. మిగిలిన పనుల పూర్తికి రూ.524.70 కోట్ల మంజూరుకు ఆమోదం. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు–2017 ప్రకారం సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను సమీక్షించే ప్రతిపాదనకు అంగీకారం. æ మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే అప్పు చేసిన రూ.6,700 కోట్లకు అదనంగా రూ.వెయ్యి కోట్లు అప్పు చేసేందుకు జారీ చేసిన జీవోకు ఆమోదం. రైతులకు ధాన్యం బకాయిల కోసం రూ.672 కోట్లు మంజూరు. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో జమ. కోకో గింజల సేకరణ కోసం రూ.14.88 కోట్లు మంజూరు. అమరావతిలో “వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్’ స్థాపనకు ఆమోదం. నీటి వనరుల శాఖలోని వివిధ చీఫ్ ఇంజనీర్ల ఆధీనంలో ఉన్న 71 పనుల కొనసాగింపు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు మధ్య తరహా ప్రాజెక్ట్ కింద కుడి ప్రధాన కాలువ స్లూయిస్ల అత్యవసర మరమ్మతులకు రూ.22.50 లక్షలు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దును మార్చడానికి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల తరలింపునకు పరిహారంగా అదనంగా 790 ఎకరాల సేకరణ, మొత్తం 2001.80 ఎకరాలు బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు బదిలీకి, స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయింపునకు అనుమతి. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–2025–30కు ఆమోదం. నెల్లూరు జిల్లాలో పెట్రోలియం రిఫైనరీ–పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్, రామాయపట్నం పోర్ట్ రెండవ దశ, సంబంధిత లాజిస్టిక్స్ పారిశ్రామిక టౌన్íÙప్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణను పూర్తి చేయడానికి రెండేళ్ల కాలానికి కందుకూరు–కావలిలో స్పెషల్ కలెక్టర్ యూనిట్, ఐదు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ల ఏర్పాటు రాజధాని పరిధిలో 1,575 మంది భూమి లేని పేదలకు పెన్షన్ల పునరుద్ధరణకు ఆమోదం. 2022 జనవరి 13న హింసాత్మక దాడిలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. -
అ'శాంతి'కి పోలీసుల ఆజ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మూకలు, రౌడీలు దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతూ.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా ఇక్కడి పోలీసులు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులు వస్తే మాత్రం ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడికి తెగబడి.. విధ్వంసం సృష్టించి 48 గంటలు గడిచినా కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారు. ప్రసన్నకుమార్రెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు అందిందే తడవుగా అక్రమ కేసు నమోదు చేయడం వారి ‘పచ్చ’పాత ధోరణికి అద్దం పడుతోంది. ఎమ్మెల్యే ప్రశాంతి పాత్ర ఉండటం వల్లే.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో సోమవారం రాత్రి టీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆయనను చంపేస్తామని కేకలు వేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అదే రోజు రాత్రి ప్రసన్నకుమార్రెడ్డి డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన వెనుక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పాత్ర ఉండటంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతోనే సరిపెట్టారు. దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసులు నల్లపరెడ్డి ఇంటికి చేరుకున్నారు. రౌడీమూకల ధ్వంసరచనను అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏమీ చేయకుండా వేడుక చూశారు. టీడీపీ మూకలు దర్జాగా వెళ్లిపోతున్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే ప్రశాంతి ముఖ్య అనుచరులు దగ్గరుండి దాడులకు పురిగొల్పుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా.. సాక్ష్యాధారాలను వైఎస్సార్సీసీ నేతలు బయటపెట్టినా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యా దు చేసిన వెంటనే ప్రసన్నకుమార్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం, మరికొందరు నేతలను కేసులో ఇరికించేందుకు పలు సెక్షన్లు పెట్టడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. దీని పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. -
వివేచన అవసరమైన కాలమిది!
రాష్ట్ర విభజన జరిగిన గత పదేళ్ళలో రెండు ప్రధాన పార్టీల చెరొక ఐదేళ్ల పాలన తర్వాత, మళ్ళీ బాబు పాలన అంటే, జగన్ సెట్ చేసి వెళ్ళిన వృత్తం పైన బాబు తన చతు రస్రం అయినా ఉంచాలి, లేదు జగన్ చతురస్రం మీద బాబు తన వృత్తం అయినా ఉంచాలి. కానీ ఇద్దరివీ కలవని మార్గాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే ఈ సారూప్యతను ఎన్నిసార్లు ఎటు తిప్పి చూసినా వాటి అంచులు బయటకు ఉంటున్నాయి. నిజానికి ఈ ఇద్దరివీ రెండు వేర్వేరు ‘పబ్లిక్ పాలసీలు’. పదేళ్లనాడు బాబు తనకు తాను పనిమాలా తెచ్చిపెట్టుకున్న సంకటం – ‘అమరావతి’ వీటికి అదనం. వైఎస్సార్సీపీ అనే ఒక యువ రాజకీయ పార్టీ వచ్చి, అది తన తొలి ఐదేళ్ల పాలనలో వేసిన ‘రన్ వే’ మీద టీడీపీ విమానం ‘టేకాఫ్’ అంటే, అందుకు బాబు నలభై ఏళ్ల అను భవం చాలడం లేదు. జగన్ ఇంజినీరింగ్ మారడంతో భవన నిర్మాణం కూడా మారింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు 1991లో మొదలైతే, ఆ తర్వాత మూడేళ్లకే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. తిరిగి 2004లో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి ‘సంస్కరణల కాలం’ సాగుబడి సమస్యల పరిశీలన బాధ్యతలను తాను మీద వేసుకోకుండా దాన్ని జేఎన్యూ ఎకనా మిక్స్ ప్రొఫెసర్ డా‘‘ జయతీ ఘోష్కు అప్పగించారు. ఆమె ఇచ్చిన ‘రిపోర్ట్’ను ప్రభుత్వ వ్యవసాయ విధా నంగా అమలు చేశారు. దాపరికం లేదు. నిపుణుల నైపుణ్యం వాడుకోవలసిన విధానమది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక మేధోమథనం ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరగాల్సింది. ఖైరతాబాద్ గవర్నర్ బంగళా పక్కనున్న ప్రతిష్టాత్మక పరిశోధన శిక్షణా సంస్థ ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ’ (ఆస్కీ) వంటి సంస్థను ఏపీ ప్రభుత్వానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఇవ్వ మని అడిగి ఉండాల్సింది. అది 46 దేశాలకు చెందిన వందకు పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న సంగతి గమనార్హం. దాని సహాయం తీసుకోలేదు. మొదటి ఐదేళ్లు అలా గడిస్తే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నీతి ఆయోగ్ ‘ పర్యవేక్షణలో 2030 లక్ష్యంగా ‘యూఎన్డీపీ’ జారీ చేసిన– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ ప్రాతిపదికన తన ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించుకుని; ‘కోవిడ్’ కాలంలో కూడా దాన్ని అమలు చేసింది. వివరం తెలియనివారు దాన్ని ‘సంక్షేమం’ అన్నారు. కొత్త రాష్ట్రంలో పరిపాలన ‘చివరి మైలు’కు చేరడానికి అవసరమైన గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ కాలంలో ఏర్పాటు అయింది. ఇలా జరిగిన ప్రతిదీ ఒక ప్రభుత్వ చట్రం పరిధిలో జరగడం వల్ల, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా గత ప్రభుత్వాన్ని ఇప్పటికీ ‘ఫైల్స్’లో తప్పు పట్టలేదు. పార్టీలు వేరైనా రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు, స్థూలంగా దాని పరిధిలో పనిచేయడం అనేది మౌలిక సూత్రం.ఈ ఇరువురి భిన్న వైఖరులు నేర్పుతున్న పాఠాలు ఏమిటో ఇప్పుడు గ్రహించవలసి ఉంది. టీడీపీ 2024 ఎన్నికల వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో – ‘విధ్వంసం’ జరిగిందని అనేది. కానీ అది ఎక్కడ జరిగిందో తెలియదు. విధ్వంసాన్ని ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలి కదా? వారంటున్న ‘విధ్వంసం’ వికేంద్రీకరణ అయ్యుండాలి. ఎందుకంటే బాబు అమరావతి కేంద్రంగా నేల తవ్వి పునాదులు వేస్తే, జగన్ గ్రామపాలనకు రాష్ట్ర మంతా పటిష్ఠమైన పునాదులు వేశారు. అందువల్ల అధికారిక అంచెలు (హైరార్కీ) తగ్గాయి. ‘ఆన్ లైన్’ సౌలభ్యంతో కొన్ని ప్రజా సమస్యలు గ్రామ సచివా లయాల్లోనే పరిష్కారం అయ్యాయి. ప్రజాప్రతినిధుల వరకు అవి రాలేదు. అన్ని పార్టీల నాయకులు ఈ కొత్త నొప్పిని మౌనంగా భరించారు. కానీ, ప్రభుత్వం మారాక జరిగింది ఏమిటి? బాబు తన ప్రభుత్వంలో దీన్ని మార్చలేదు సరికదా విస్తరించారు. అందుకు ఈ ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన ‘జీవో’ 57ని చూడాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో 08. తేదీ: 1.11.’23కి కొనసాగింపు. అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 ‘డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్’ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. అయితే గత నెలలో ఆ 77 మంది అధికారుల పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చి, వీరు డివిజన్ స్థాయిలో జరిగే పంచాతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన ‘జాబ్ చార్ట్’తో ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రంగా ఆ యా కార్యాలయాల పోస్టల్ అడ్రెస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రమంతా గ్రామ, వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనా పరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల, ఇప్పుడు వాటి పైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రత హామీ దొరికింది. పాత జిల్లాలు చిన్నవై పర్యవేక్షణ పెరిగింది. పంచాయతీరాజ్ స్థానిక పరిపాలనా వ్యవస్థలతో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ‘ఇంటిగ్రేట్’ అయ్యి రెండింటి మధ్య ఒక ‘ఆర్గానిక్ లింకు’ ఏర్పడింది. పార్టీలు ఏవైనా ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్టపరిధిలో ఉన్నప్పుడు, అది ఎవరి ప్రభుత్వం అనే దానితో పని లేకుండా మొక్కకు అంటు కట్టినట్టుగా రెండూ ఒక్కటిగా ఎదుగుతూ విస్తరిస్తుంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్బుక్ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ అయిన వారికి రిమాండ్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్ వేసింది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్ఎస్ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.జర్నలిస్టులను కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సైతం రెడ్బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ అనే ఐపీఎస్ ఈ రెడ్బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. రిమాండ్ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే, సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన అలా చేయగలుగుతారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్ రెడ్బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేశ్ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది. టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్లాన్ ప్రకారమే ప్రసన్న ఇంటిపై దాడి.. డైవర్షన్తో చిత్తూరుపై కుట్రలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో దాడి జరగడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ మూకల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి.ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడుగారు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి’ అని అన్నారు. .@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025 -
అర్ధరాత్రి 200 మందితో.. బయటపడ్డ సంచలన వీడియో
-
Magazine Story: రాక్షస మూకల రక్తదాహం
-
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు పక్కా స్కెచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు. అంతా కుట్ర ప్రకారమే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పోలీసులొచ్చినా బెదరని మూకలు ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ భారీ కుట్రటీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు మాజీ మంత్రి అనిల్కుమార్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూకలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్కుమార్రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి తల్లి షాక్కు గురయ్యారని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. ప్రనన్నకుమార్ ద్వారా ఇంకేమి నిజాలు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్రెడ్డి మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు. -
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు. -
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ పక్కా స్కెచ్
-
‘లోకేష్, భరత్లు అసలు నిందితుల్ని తప్పించారు’
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్కు క్యాపిటల్గా మార్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్కి అడ్డాగా మార్చేశారు ఇటీవల విశాఖలో కలకలం రేపిన కూటమి నేతల డ్రగ్స్ దందాపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో గంజాయి కొకైన్ ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతుంది. డ్రగ్స్కు క్యాపిటల్గా విశాఖను తయారు చేశారు. డ్రగ్స్ గంజాయిని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికింది. వెలగపూడి రామకృష్ణ బాబు సీపీ మీద ఒత్తిడి చేసి అసలు దోషులను తప్పించారు.ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పోలీసులు మీద ఒత్తిడి తెచ్చారు. డ్రగ్స్ కేసులో సీఎంవో కూడా ఇన్వాల్ అయింది. మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అసలు నిందితులను తప్పించారు. ఎప్పుడూ రాని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీపీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు. టీడీపీ నేతలు సీపీనీ కలిసిన సీసీ ఫుటేజీ బయట పెట్టే ధైర్యం ఉందా. వైఎస్ జగన్ పాలనలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్షయ్, థామస్, కృష్ణ చైతన్య వర్మను అరెస్టు చేసి మిగతా ఇద్దరిని ఎందుకు వదిలేశారు. అక్షయ్ కుమార్ అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీకి అత్యంత సన్నిహితుడు.వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను కూటమి ప్రభుత్వం దెబ్బ తీస్తోంది.వైఎస్ జగన్ పాలనలో 25 వేల కేజీల డ్రగ్స్ దొరికిందని తప్పుడు ప్రచారం చేశారు. తరువాత సీబీఐ విచారణలో అది ఈస్ట్ అని తేలింది. కొకైన్ డ్రగ్స్ వ్యవహారం ఎల్లోమీడియాకు కనిపించలేదా. వాస్తవాలను ఎందుకు ప్రజలకు చూపించడంలేదు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఈనాడు చంద్రబాబు భజన చేస్తుంది. డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి.అసలు నిందితులను అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
నెల్లూరు సాక్షిగా చెప్తున్నా.. అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్
-
ఎమ్మెల్యే అదితి పరువును ఫ్లెక్సీకి ఎక్కించి.. కార్యకర్త వినూత్న నిరసన
రాజా సాహెబ్ గారి బిడ్డ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఆమె దృష్టిలో పడడమే గొప్ప.. ఆమెతో ఫోటో దిగడమే మహా అదృష్టం.. ఆమెను ఏదైనా ప్రోగ్రాముకు పిలిస్తే ఆమె వచ్చి కొన్ని క్షణాలు అక్కడ నిలబడితే జీవితం ధన్యమైనట్లు భావిస్తున్న రోజులివి. అలాంటి కాలంలో ఒక చిన్న కార్యకర్త.. పేరు ఊరులేని సాధారణ క్యాడర్ ఏకంగా ఫ్లెక్సీ సాక్ష్యంగా ఎమ్మెల్యే పరువును నడిరోడ్డుమీద నిలబెట్టేశాడు.ఎమ్మెల్యే గారు.. మీరు గెలిచి ఏడాది దాటింది.. ఇంతకూ మీరు ప్రజలకు ఏం చేశారు చెప్పండి.. అసలు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల లిస్ట్ ఇదిగో చూడండి అంటూ ఎండగట్టేసాడు. మీ పనితీరు ఏం బాలేదు.. మీ ప్రోగ్రెస్ కార్డులో సున్నా మార్కులు వేస్తున్నా అంటూ బెత్తంతో కొట్టినట్లు చెప్పాడు. ఈ అంశం ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది.తెలుగుదేశం సీనియర్ నాయకుడు పాలిట్ బ్యూరో సభ్యుడు అయిన అశోక్ గజపతిరాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, విజయనగరం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవడం అయితే గెలిచారు కానీ ఆమెకు పట్టణం మీద గ్రామీణ నియోజకవర్గ మీద ఎలాంటి పట్టులేదు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్లడం ఫోటోలు దిగి రావడం మినహా పట్టణ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఆమెకు ఆమె తండ్రికి మంచి పలుకుబడి ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి కోసం ఆమె ఏమీ చేయడం లేదన్నది ప్రజలకు అర్థమైంది. దీంతోపాటు కార్యకర్తల విషయంలో కూడా ఆమె పెద్దగా ఆసక్తికరంగా లేరని వారి భావన.అయినా సరే అశోక్ గజపతిని, ఆయన కుమార్తె అదితి గజపతిని ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయలేరు. కానీ విజయనగరానికి చెందిన 28వ డివిజన్ కార్యకర్త తీగల ఆనందరావు అదితి గజపతి పరుగును ఫ్లెక్సీకి ఎక్కించాడు. రాజీవ్ నగర్ కాలనీలో మీరు చేయాల్సిన పనులు లిస్ట్ ఇది.. మీరు గెలిచి ఇన్నాళ్లు అయింది ఏ ఒక్క పని అయినా చేశారా?. దీని కోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ ఆయన పనుల జాబితాతో పాటు ప్రశ్నల పరంపరతో అదితిపై విరుచుకుపడ్డారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ తమ నాయకురాలు అసమర్థతను వీధిలో నిలబెట్టారు. అదితి విధేయులకు ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ప్రజలు.. ఇతర కార్యకర్తలకు మాత్రం ఆనందరావు హీరోలా కనిపించాడు. ఎవరు ప్రశ్నించకపోయినా ఆయన మాత్రం గొంతు ఎత్తాడు.. అదితి పరువు నడివీధిలో నిలబెట్టారు అంటూ లోలోన సంబరపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్
-
ఆగని ఆగడాలు.. నెల్లూరులో టీడీపీ నేతల అరాచకం (ఫొటోలు)
-
Nellore: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి
-
మా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు.. కలెక్టర్కు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు
సాక్షి, విజయనగరం అర్బన్: ఏపీలో కూటమి పాలనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై సొంతపార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు బిగ్ షాక్ తగిలింది. వారి పాలన బాగాలేదంటూ నగరంలోని 28వ వార్డు రాజీవ్నగర్ కాలనీ టీడీపీ సీనియర్ కార్యకర్త తీగల ఆనందరావు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ సమస్యలపై ఏడాదిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదన్నారు. కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు మరమ్మతులు చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, సచివాలయ కార్యాలయానికి ప్రభుత్వ భవనం నిర్మించాలని, ప్రభుత్వాసుపత్రి నిర్వహణపై దృష్టిసారించాలని, పార్కులు అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు అమర్చాలని, రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. అందుకే, తమ కాలనీ సమస్యలను బ్యానర్ రూపంలో ప్రదర్శిస్తూ కలెక్టర్కు విన్నవించినట్టు తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. -
నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడి..ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు.అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరో 2వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పిడుగు
-
పచ్చమూకల విధ్వంసకాండపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీæడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు. అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నకు వైఎస్ జగన్ ఫోన్..పచ్చమూకల దాడి సమాచారం తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. విమర్శలు జీర్ణించుకోలేకే దాడి..జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తే.. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజకీయంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నియోజకవర్గ కేంద్రం కోవూరులో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండ్రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలను ప్రసన్నకుమార్రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. దీనిని టీడీపీ మూకలు జీర్ణించుకోలేక ఈ దాడికి బరితెగించినట్లు తెలుస్తోంది.ప్రశాంతిరెడ్డి అనుచరుల పనే?కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రశాంతిరెడ్డి అవినీతిని ప్రసన్నకుమార్రెడ్డి నిలదీస్తూ వచ్చారు. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. ఆమె ప్రోద్బలంతోనే టీడీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం..నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే ప్రప్రథమం. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో నేతలు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తుండేవారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అణిచివేత ధోరణులకు బరితెగిస్తున్నారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టాలివైఎస్సార్సీపీ నేతల డిమాండ్ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శించిన నెల్లూరు జిల్లా నేతలునెల్లూరు (స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంపై దాడి ఘటనకు సంబంధించి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అనిల్కుమార్ యాదవ్ పోలీసులను డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలుసుకున్న అనిల్కుమార్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె పూజిత పలువురు వైఎస్సార్సీపీ నేతలు పొదలకూరు రోడ్డులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు బరి తెగిస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రోత్సాహంతోనే ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. డబ్బు ఉందన్న అహంకారంతో వేమిరెడ్డి దంపతులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి దంపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి తల్లిపై సైతం దౌర్జన్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో బిహార్ సంస్కృతిని తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. -
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడి
నెల్లూరు: జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. సోమవారం(జూలై 7) రాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రి నగర్లో ఉన్న ప్రసన్న కుమార్ ఇంటిపై ఎంపీ వేమిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ప్రసన్న కుమార్ ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న రెండు కార్లు ధ్వంసం చేశారు. -
YSRCP దళిత కార్యకర్తలపై ఎల్లో తాలిబన్లు దాడి
-
విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు
-
ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసిన టీడీపీ నేత
-
రూ.16 లక్షలు కొట్టేసిన టీడీపీ నేత
పెదకూరపాడు: ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత రూ.16 లక్షలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరప్లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపిని సంప్రదించింది. దీంతో హసీనా సోదరి జాన్బీకి అమరావతి మండలం నెమలికల్లులోని కుప్పా మల్లేశ్వరయ్యకి చెందిన భూమిని గోపి చూపెట్టాడు. ఆ భూమి వివరాలను ఆమె హసీనాకు వాట్సప్లో షేర్ చేసింది. భూమి నచ్చడంతో గోపికి రూ.లక్ష బయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్లను తీసుకుంది. భూమి రికార్డులన్నీ బాగానే ఉండటంతో 95 సెంట్ల పొలాన్ని రూ.75.52 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.హసీనా..తన సోదరి జాన్బీని పంపి రూ.16 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్బీకి అమరావతికి చెందిన టీడీపీ నేత జానీసైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు. అదే రూ.75.52 లక్షలకే తాను ఆ భూమిని అమ్ముతానని చెప్పాడు. దీంతో మే 15న రూ.16 లక్షలు జానీ సైదాకు చెల్లించి నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా జాన్బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 20న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీసైదాను కోరినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.దీంతో హసీనాకు అనుమానం వచ్చి భూ యజయాని మల్లేశ్వరయ్యను సంప్రదించింది. అతడు జానీసైదా ఎవరో తనకు తెలియదని, తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో హసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పట్టాభిపురం పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. హసీనా మాట్లాడుతూ తాను కూడా టీడీపీ తరఫున 3 సార్లు పోలింగ్ ఏజెంట్గా పనిచేశానని, తనకు జరిగిన మోసాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపింది. కాగా, ఇసుక ఆక్రమాలకు సంబంధించి జానీ సైదాపై పలు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యనేత కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. -
సర్కారు.. కంగారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా, ఆ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారికి అండగా నిలవడం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగటంతో కూటమి ప్రభుత్వానికి కునుకు కరువైంది. దీంతో వైఎస్ జగన్ బంగారుపాళెం పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, మామిడి దిగుబడులను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ.. వైఎస్ జగన్ పర్యటనలో రైతులెవ్వరూ పాల్గొనకుండా చూడటానికి నానా తంటాలు పడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్ది రోజులుగా ఓ వైపు మామిడి దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక, మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యాలు సమయానికి కొనుగోలు చేయక పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్లు, లారీల్లోనే మామిడి కుళ్లిపోతుండటంతో రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. మరికొందరు రైతులు ఏకంగా మామిడి చెట్లను కొట్టేసి, వేరే పంటలు సాగు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇది కూడా తప్పే అన్నట్లు ఆ రైతులపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోంది. వారిపై కేసులు పెట్టి, అపరాధ రుసుం అంటూ వసూళ్లకు బరితెగించింది. ఈ నేపథ్యంలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రైతుల వద్దకు అధికారులు పరుగులుకొద్ది రోజులుగా రైతులు గంగాధర నెల్లూరు, గుడిపాల, బంగారుపాళెం, తవణంపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద మామిడి దిగుబడులతో రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మొన్నటి వరకు ఫ్యాక్టరీలో మామిడి అన్లోడింగ్ కోసం రోజుకు కేవలం 60 నుంచి 70 ట్రాక్టర్లకు మాత్రమే టోకెన్లు ఇచ్చేవారు. అది కూడా రైతులు వెళ్లి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బతిమలాడాలి. ఈ పరిస్థితిలో మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో అధికారుల జోక్యంతో రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ వారు 300 టోకెన్లు ఇవ్వటం ప్రారంభించారు. టోకెన్లు పొందిన వారి ట్రాక్టర్లను నేరుగా ఫ్యాక్టరీలోనికి పంపిస్తున్నారు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాల్లో వేచి ఉండటం కంటే.. ఫ్యాక్టరీ లోపల ఉంటే పరిస్థితి తీవ్రత తెలియదనే ఉద్దేశంతో అధికారులు ఇలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయినా కి.మీ దూరం మామిడి దిగుబడులతో ట్రాక్టర్లు, లారీలు వేచి ఉండటం గమనార్హం.పర్యటన ఖరారవ్వగానే అంతా హడావుడిమామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఈనెల 2న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని మరుసటి రోజే టీడీపీకి చెందిన కొందరు మామిడి రైతులను పిలిపించుకుని మాట్లాడారు. రైతులను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమే అని ప్రకటించారు. ఆపై కిలో మామిడిని ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.8 చొప్పున కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ మరుసటి రోజు అధికారులు సమావేశమై కిలో మామిడి రూ.8తో కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు.అయితే వారు దాన్ని పట్టించుకోలేదు. ధర ఎంత అనేది చెప్పకుండానే రైతుల వద్ద అంగీకార పత్రంలో సంతకం తీసుకుని మామిడిని కొనుగోలు చేయటం చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు మరోసారి ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కిలో రూ.8 చొప్పున కాకుండా రూ.6తో కొనుగోలు చేస్తున్నట్లు అంగీకార పత్రంపై రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం ప్రారంభించారు. వైఎస్ జగన్ పర్యటన ఖరారు కానంత వరకు కూటమి నేతలకు మామిడి రైతుల ఘోషే వినిపించలేదు.వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలియటంతో సీఎం సూచన మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వెంటనే ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేయటం, ఫ్యాక్టరీల వద్దకు వెళ్లటం, రైతులతో మాట్లాడటం వంటి కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నారు. మరో వైపు చెట్లను కొట్టేసుకున్న రైతులు వైఎస్సార్సీపీ శ్రేణులంటూ వారిపై కేసులు పెట్టించటం ప్రారంభించారు. -
వైద్యుల మైండ్ ‘బ్లాక్’!
సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న జనరల్ సర్జరీ ప్రొఫెసర్ను తొలుత గుంటూరు వైద్య కళాశాలకు బదిలీ చేశారు. మళ్లీ రోజుల వ్యవధిలోనే ఆ ప్రొఫెసర్కు రాజమండ్రిలో రీపోస్టింగ్ ఇచ్చారు.గుంటూరు వైద్య కళాశాలలో పనిచేస్తున్న జనరల్ సర్జరీ ప్రొఫెసర్కు తొలుత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పోస్టింగ్ దక్కింది. ఆమెను రీపోస్టింగ్లో భాగంగా విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో నియమించారు. ఈమెకు విజయవాడలో రీపోస్టింగ్ కోసం అక్కడ పనిచేస్తున్న వైద్యుడిని గుంటూరుకు పంపారు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి వైద్యశాఖలో చేపట్టిన సాధారణ బదిలీల తీరును చూసి వైద్యుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పెద్దలే జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిబంధనలను సాకుగా చూపి కీలక ప్రాంతాల్లో పోస్టులను బ్లాక్ చేసి రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్మేశారని మండిపడుతున్నారు.ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఎన్ఎంసీ నిబంధనలను సాకుగా చూపి పాత వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేసి, తమతో డీల్ కుదుర్చుకున్న వారికి ఆ స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత నెల 19వ తేదీతో వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిశాక సీఎం ప్రత్యేక అనుమతితో కొందరికి రీపోస్టింగ్లు ఇచ్చారు. అంతకుముందు కౌన్సెలింగ్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వైద్యులు... రీపోస్టింగ్ కింద వారు ఇప్పటి వరకు పని చేసిన ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్లు తెచ్చుకున్నారు. బదిలీల్లో అక్రమాలపై ఆరోపణలను రీపోస్టింగ్లలో చోటుచేసుకున్న చిత్రాలు బలపరుస్తున్నాయి.‘బ్లాక్’ దందాను బలపరుస్తున్న కొన్ని విచిత్రాలు..⇒ సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్లో కర్నూల్లో పనిచేస్తున్న జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కింద కాకినాడ లేదా రాజమండ్రిలో పోస్టింగ్ కోరారు. అయితే, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఆ రెండు ప్రాంతాల్లో ఖాళీ లేదని ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. అనంతరం ఇచి్చన రీపోస్టింగ్లలో రాజమండ్రిలో పనిచేస్తున్న వైద్యురాలిని కాకినాడకు, గుంటూరులోని వైద్యుడిని రాజమండ్రికి పంపించారు. ⇒ రాజమండ్రిలో పనిచేస్తున్న జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాకినాడకు బదిలీ చేయాలని కోరారు. ఇతని అభ్యర్థనను ఎన్ఎంసీ పేరు చెప్పి తిరస్కరించారు. కానీ, కాకినాడలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ నెల్లూరులో పనిచేస్తున్న అనాటమీ ప్రొఫెసర్ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. అనంతరం సదరు ప్రొఫెసర్ను విజయనగరానికి, విజయనగరంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ను మ్యూచువల్ కింద విశాఖకు మార్చారు. ⇒ ఆర్థోపెడిక్ విభాగంలోని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను గుంటూరు, ఒంగోలుకు మ్యూచువల్ బదిలీలు చేశారు.⇒ అనంతపురంలో పనిచేస్తున్న పల్మనాలజీ ప్రొఫెసర్ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. రీపోస్టింగ్లో ఆయనను విశాఖ నుంచి ఒంగోలుకు పంపారు. కాకినాడలో పని చేస్తున్న వైద్యురాలిని విశాఖలో నియమించారు. కాకినాడలోనే ఆప్తమాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ డాక్టర్ విశాఖలో ఉన్న రెండు ఖాళీల్లో ఒక దానిలో తనను నియమించాలని అభ్యర్థించినా తిరస్కరించారు. ⇒ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్లో ఎన్ఎంసీ నిబంధనల పేరు చెప్పి కాకినాడ ఆర్థోపెడిక్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ కింద చూపించలేదు. అయినా విశాఖలో పనిచేస్తున్న వైద్యుడిని కాకినాడ ఆర్థోపెడిక్ విభాగానికి బదిలీ చేశారు. తొలుత ఖాళీ చూపకుండా, ఆ తర్వాత బదిలీల్లో ఆయన్ను ఎలా నియమించారనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో విశాఖలోనే పనిచేస్తున్న ఓ వైద్యుడు తనను కాకినాడకు పంపాలని కోరారు. కానీ, ఖాళీ లేదని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు.ఒక్కో పోస్టుకు రూ.20 లక్షలుబదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చాక, సీఎం ప్రత్యేక అనుమతులతో ఏకంగా 33 మంది వైద్యులు, ఇతర సిబ్బందికి రీపోస్టింగ్లు ఇవ్వడంతోపాటు మ్యూచువల్ బదిలీలు చేశారు. సాధారణ బదిలీల్లో అడ్డగోలుగా తాము అనుకున్న వారికి పోస్టింగ్లు ఇవ్వడానికి కుదరదనే ఎన్ఎంసీని సాకుగా చూపి పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేశారని వైద్యవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాస్తవానికి సాధారణ బదిలీల మార్గదర్శకాల్లో మ్యూచువల్ బదిలీలకు ఆస్కారం లేదు. బ్లాక్ చేసిన పోస్టుల్లో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర వసూలు చేసి పోస్టింగ్లు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. -
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్ను అర్ధ నగ్నంగా లాకప్లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్కుమార్, ఇమ్రాన్ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్కుమార్పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్కుమార్ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.పోసానిపై రెడ్బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ను హైదరాబాద్లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజధాని అప్పుల్లో రూ.991.06 కోట్లు మళ్లింపు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని.. వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని.. ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతులు విధించాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సీఆర్డీఏ ఖాతాలో జమచేయాలని కమిషనర్ కె. కన్నబాబును ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆరి్థక శాఖకు చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ విడతల వారీగా రూ.245.37 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంకా రూ.745.69 కోట్లను జమచేయలేదు. ‘పోలవరం’ నిధులు కూడా.. ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పుతెచ్చిన నిధులనే కాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను కూడా ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. ఇది తెలిసి కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో చివరికి జనవరి రెండో వారంలో వాటిని ఎస్ఎన్ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దాంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారం పంపిణీ చేశారు. అలాగే, మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులో రూ.2,704.81 కోట్లలో రూ.2,504.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్
సాక్షి,తాడేపల్లి: కూటమి నేతలకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్ విసిరారు. ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ, ప్రయివేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పించిన విషయాన్ని అంగీకరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, రాష్ట్ర ఆర్ధిక విధానాన్ని అస్తవ్యస్తం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై జాతీయ మీడియాలో సైతం వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒక జవాబుదారీతనం, పారదర్శకత అనేదే లేకుండా పరిపాలన చేయటం దారుణం. హైకోర్టులో ఈ విషయమై కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్ల నిధులు సమీకరించటానికి బాండ్లు జారీ చేయించింది. రూ.లక్షా 91 వేల కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు. ప్రభుత్వం అప్పు తీర్చకపోతే ప్రయివేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించటం రాజ్యాంగ విరుద్దమని సూచించారు. -
9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్లో అలజడి
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్ జగన్ ఈ నెల 9న బంగారుపాళెం మామిడి రైతులను పరామర్శించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి రేగుతోంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు పడుతున్నారు. రైతులను జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. కిలో 3 నుంచి 4 రూపాయలకు కొనుగోలు చేస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నాయి.ఈ నెల 9న వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో ఆరు రూపాయలకు కొనేందుకు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ హయాంలో కిలో 26 రూపాయలకు మామిడి అమ్మకాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామిడి ధర తగ్గిపోయింది. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద క్యూలైన్లో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే దోచుకుంటున్నాయి. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్నాయి. వైఎస్ జగన్ పర్యటన ఇలా..ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారు. -
ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకుడు సుందరప్ప
-
బాబు పాలనలో ఎన్ని విచిత్రాలో.. చనిపోయిన ఉద్యోగికి బదిలీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్లు ఇచ్చారు.కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. -
హవ్వ... బాబూ నవ్విపోతారు!
‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు.. దేశాద్యంతం ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయి ఉండవచ్చు. గాంధీజీ.. అంబేద్కర్లతో పోల్చుకోవడం ఎంతవరకూ సమజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే చంద్రబాబు తీరే అంత. ఏమైనా అనగలరు. చేయగలరు. పోల్చుకోగలరు కూడా. వాస్తవం ఏమిటంటే... గాంధీజీ, అంబేద్కర్లో సామాన్య కుటుంబాల్లో పుట్టిన మాట నిజం. అయితే వారెవరూ అవకాశాలను అందిపుచ్చుకోలేదు.సామాజిక పరిస్థితులను ఎదిరించి ప్రజలకు ఒక దారి చూపడం ద్వారా నేతలుగా ఎదిగారు! దేశ స్వాతంత్ర్య సాధనలో అందరికంటే ముందున్న గాంధీజీ జాతిపితగా ఎదిగితే... అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. ఇద్దరూ అసత్యాలు చెప్పడాన్ని నిరసించారు. తిరస్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు.చంద్రబాబు విషయానికి వస్తే... ఈయన కూడా సామాన్య కుటుంబంలో జన్మించారు. సీఎం స్థానానికి ఎదిగారు. వాస్తవమే. కానీ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే గాంధీజీ, అంబేద్కర్ల ఆలోచనలు, ఆదర్శాలకు ఎంతో దూరంగా.. విరుద్ధంగా ఎన్నో మరకలు కనిపిస్తాయి. కాంగ్రెస్(ఐ)తో రాజకీయ ఆరంగేట్రం చేసి గ్రూపులు కట్టి, పైరవీలతో మంత్రిపదవి సాధించిన చరిత్ర చంద్రబాబుది. తరువాతి కాలంలో పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పేరుతో పార్టీ పెడితే.. మామపైనా పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అక్కడ ఏకు మేకు అయినట్లు మామనే పదవి నుంచి లాగిపడేశారు. పదవుల కోసం ఆరాటపడకపోవడం గాంధీజీ, అంబేద్కర్ల నైజమైతే.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డ చరిత్ర బాబు గారిది!చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేష భావాన్ని వదిలించుకోవాలి. కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలి. అయితే... గాంధీజీ, అంబేద్కర్లలతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఎంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడారో చూడండి.ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పుల గురించి స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పేశారే. వెయ్యి రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం మంచినీళ్లలా లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే! కార్యకర్త కారు కింద పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై ఎంత దారుణమైన ఆరోపణ చేశారు! కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా! చంద్రబాబు ఈ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఈనాడు దినపత్రిక దాన్ని బ్యానర్గా వండి వార్చడం చూస్తే వారు సింగయ్య మృతి విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని తెలిసిపోతోంది. ఏపీ హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కవర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కుట్రల అమలుకు ఎల్లో మీడియాను ఒక టూల్గా వాడుతున్నారన్నమాట.నిజానికి ఈ కేసులో ఎన్నో సందేహాలున్నాయి. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్తునప్పుడు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న జగన్కు ఎందుకు తగిన భద్రత కల్పించలేదు? వాహనాల వెంట ఉండవలసిన రోప్ పార్టీ ఎందుకు లేదో తెలియదు. కారు తగిలి సింగయ్య అనే వ్యక్తి గాయపడినప్పుడు వచ్చిన వీడియోలు గమనించిన వారెవరికైనా ఆయనకేమీ ప్రమాదం లేదన్నట్టుగానే అనిపించింది. కాని అంబులెన్స్లోనే ఆయన మరణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.ఇవన్నీ ఒక ఎత్తైతే... ఏదో గుర్తు తెలియని వీడియో ఆధారంగా పోలీసులు జగన్తో పాటు కొందరు వైసీపీ నేతలను నిందితులుగా చేసేశారు. కారు ప్రమాదానికి డ్రైవర్ కాకుండా... అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టి కొత్త ట్రెండ్ సృష్టించారు. హైకోర్టు ఇదే ప్రశ్న లేవనెత్తడంతో సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన కలిగింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాధమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.అదే టైమ్ లో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరి చేసిన ప్రకటన మరింత సంచలనమైంది.తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతుందా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత దానిపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పై ఆమె ఏదైనా ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు. ఎల్లో మీడియా ఎంతగా ఇల్లెక్కి అరిచేది. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యేవారు! ఇప్పుడేమో ఆ ఆరోపణలపై విచారణ కాకుండా, ఆమె జగన్ను కలవడంపై విచారణ చేస్తారట. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్దతి?గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకునే వారు ఎంత నిజాయితీగా ఉండాలి? ఒక ప్రమాదాన్ని జగన్కు పులమడం ద్వారా కుటిల రాజకీయం చేయడం ఏ తరహా నీతి అవుతుంది. గతంలో గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీసేందుకు ఒక్కసారిగా గేట్లు తెరచి తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నారు? రోడ్డు ప్రమాదాలు జరగడం లేదా? పూరి జగన్నాథ ఉత్సవాలలో తొక్కిసలాటలు జరగడం లేదా? కొందరు మరణించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలలో పదకుండు మంది మరణిస్తే, అదంతా పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేయలేదా?జగన్ కాన్వాయ్లో ప్రమాదం జరిగితే మాత్రం ఆయనను నిందితుడుగా చేర్చుతారా? ఇది చిల్లర రాజకీయం కాదా? పైగా రాజకీయాలు, రౌడీలు, అంటూ నీతి సూత్రాలు వల్లిస్తే సరిపోతుందా? వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాలు, పేకాట క్లబ్లులు నడుపుతారు.. అంటూ గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరుకుతుందా?అదెందుకు అంగళ్లు వద్ద గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబే ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ను దగ్దం చేయడం, రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్ను పోవడం ఇటీవలి చరిత్రే కదా? ప్రతిపక్షంలో ఉంటే ఏ అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు ఇజమా! అని అంటే ఏమి చెబుతాం. ఏ నాయకుడైనా పదవుల కోసం సంకుచిత రాజకీయాలకు దిగకుండా ఉంటేనే మంచి పేరు వస్తుంది కానీ... రాజకీయ అవసరాలకు గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుని పోల్చుకుంటూ, స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పడకేసిన ఆరోగ్య రంగం!
ఆరోగ్యశ్రీ నిర్వీర్యమై పోయింది.. గత ప్రభుత్వం ప్రకటించిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం సాధ్యం కాదనీ, ‘పీపీపీ’ల ప్రాతిపదికనే వాటిని నిర్వహిస్తామంటూ చేతులెత్తేసింది.. మునుపు మండలానికి ఒక్కటి అంటూ కచ్చితంగా తిప్పిన అంబులెన్సుల్లో నేడు చాలా వరకు రిపేర్ల పేరుతో మూలనపెట్టింది.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అటకెక్కించింది.. కనీసం అత్యవసర మందులను సైతం అందుబాటులో ఉంచలేకపోతోంది.. వెరసి పేదోడికి పెద్ద రోగమొస్తే ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకోవద్దని తన చేతల ద్వారా స్పష్టం చేస్తోంది.కుయ్.. కుయ్.. కుయ్.. అలనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ ఎన్నికల సభలో 108 సేవల గురించి ప్రస్తావిస్తూ ఆయన వినిపించిన అంబులెన్స్ తాలూకు భరోసా శబ్దాలివి. రయ్.. రయ్.. రయ్.. ఆ తర్వాత తన తండ్రి వాగ్దానాలను పటిష్ట పరుస్తూ వైఎస్ జగన్ జెండా ఊపినప్పుడు ఒకేసారి పరుగెత్తిన 1024 అంబులెన్సుల హోరులవి. నై.. నై.. నై.. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు చక్కగా అందుతుండగా.. వాటిని మరింత మెరుగ్గా కొనసాగించాల్సింది పోయి, అసలు ఈ పథకానికే ఎసరు తెస్తూ.. ప్రభుత్వ వైద్యం నో.. నో.. నో.. అంటూ ప్రైవేట్/కార్పొరేట్ వైద్యానికి మేలు కలిగేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. యాసిన్ – గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కొన్ని కారణాల వల్ల చిలకలూరిపేటలో ఇటీవల ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. అతణ్ణి అర్జెంటుగా ఆసుపత్రికి తరలించాలి. కానీ ‘లెన్సు’ వేసి చూసినా ‘అంబులెన్సు’ అందుబాటులో లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు ఆంబులెన్సులు అందుబాటులో ఉండేవి. ఇందులో చిలకలూరిపేటలోని అంబులెన్సు కోసం వాకబు చేస్తుండగా ఇక్కడి వాహనం రిపేర్లో ఉందని, అందువల్ల నాదెండ్ల లేదా యడ్లపాడు వాహనం కోసం ప్రయత్నిoచాలంటూ అక్కడి సిబ్బంది చెప్పారు. అక్కడి నుంచి సదరు అంబులెన్సు వచ్చేలోపు ప్రాణాలే పోవచ్చనే అభిప్రాయంతో స్థానిక ప్రజలు సొంత డబ్బులతో బాధితుడిని ఆసుపత్రికి చేర్చారు. ‘‘గతంలో 108 అంబులెన్సు కోసం ఫోన్ చేస్తే గరిష్టంగా 10 నిమిషాల లోపే వచ్చేసేవి. బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడేవి. ఇప్పుడు వాటి ఆనూ పానూతో పాటు నడిపించేందుకు తగిన ప్లానూ లేకుండా పోయింది. నిరుటి వరకు చక్కగా తిరిగిన ప్రాణరక్షణ ఆంబులెన్సులు ఇప్పుడు కూడా అలాగే ఎందుకు పని చేయడం లేదు?’’ అనే ప్రశ్న ఇప్పుడు అక్కడి స్థానికుల నుంచి వినిపించింది. ఈ ప్రశ్నకు జవాబు లేదు. దొరికే దాఖలా కూడా లేదు. ఎంతలో ఎంత తేడా? వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరింత బలోపేతం చేసేందుకు పూనుకుంది. దానికి తోడు జగన్ ప్రభుత్వం అధికారానికి రావడంతోనే కరోనా వైరస్ విజృంభించడం, మరిన్ని వైద్య సేవలూ అవసరం కావడంతో ఈ పథకం పరిధిలోకి వచ్చే వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టి మరీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఆ పెండింగ్ బకాయిలను కూడా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ చెల్లించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి మళ్లీ ఊపిరిలూదారు. అంతకు ముందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ అనే నిబంధనను సవరించి, రూ.ఐదు లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను పథకం పరిధిలోకి తెస్తూ 2019 డిసెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. రూ.వెయ్యి ఖర్చు దాటే చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో 1,059 ప్రొసీజర్లను ఐదేళ్లలో 3,257కు పెంచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో కూడా చికిత్స చేయించుకునే అవకాశం కల్పించారు. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్ను అదనంగా పథకం పరిధిలోకి చేర్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సానంతరం రోగులకు అందించే ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలివేసింది. గత ప్రభుత్వంలో చికిత్సానంతరం రోగులకు నెలకు రూ.5 వేల మేర సాయం అందించేవారు. దీనిప్రకారం.. గత ఏడాదికి రూ.400 కోట్ల మేర సాయం అందించాల్సిన సాయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు అరకొరగా అందుతున్నాయనీ, పైగా హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేరున్న చాలా ఆసుపత్రుల్లో ఈ పథకం కింద రోగులను తీసుకోడానికి సుముఖంగా లేవంటూ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ‘పేదలు, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందించాలని వైఎస్ జగన్ పరితపించారు. మన ఇంట్లో వాళ్లు ఆస్పత్రికి వెళితే ఎలాంటి సేవలు అందాలని కోరుకుంటామో.. ఆస్పత్రుల్లో అందరికీ అలాంటి సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి పదే పదే సూచించడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. కూటమి నేతల మాటలు నమ్మి వాపును చూసి బలం అనుకున్నాం. ఏడాదిలోనే తెలిసొస్తోంది’ అని ఒంగోలుకు చెందిన ఓ చిరుద్యోగి వ్యాఖ్యానించారు. అది ఉండనే ఉందిగా... మళ్లీ ఇదీ ఎందుకు? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో చిత్రమైన వాదనను వినిపిస్తోందని ప్రజలు తెలిపారు. ఎలాగూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘‘ఆయుష్మాన్ భారత్’’ స్కీమ్ అమల్లో ఉన్నందున ప్రత్యేకంగా ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం లేదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందంటున్నారు. దాంతో మళ్లీ ఆరోగ్యశ్రీ కింద మరిన్ని చికిత్సల కవరేజీ అవసరం లేదనీ, అసలు ఈ పథకానికి ఇన్ని నిధులు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న దుర్మార్గ స్థితి నెలకొంది. ఎన్నికల హామీల్లో భాగంగా మునుపు అమలవుతున్న ఏ పథకాన్నీ తీసేయబోమనీ, కావాలంటే ఆ జాబితాకు మరికొన్ని చేరుస్తామంటూ వాగ్దానాలు చేసే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ‘గతంలో అమలైన అనేక పథకాలకు మంగళం పాడింది. ప్రాణాలు పోసే వైద్య రంగంలోని సేవలనూ మినహాయించక పోవడం దుర్మార్గం.. ముష్టిగా ఓ వెయ్యి ఎగస్ట్రా పడేసి.. రూ.వేలు విలువైన సేవలను అన్యాయంగా తీసేసింది’ అని ఓ వృద్ధుడు వాపోయాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలపై కక్ష! ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 వైద్య కళాశాలలను తెరవాలనే సంకల్పంతో గత సర్కారు అనుమతులను తెచ్చుకుంది. ఆ మేరకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి ఓ టీచింగ్ హాస్పిటల్ ఉండటం తప్పనిసరి కావడంతో.. రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఈ కళాశాలలు తెరిచే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించింది. మలి దశలో ఇంకొన్ని సిద్ధం చేసింది. అంతలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వాటికి కొర్రీ వేసింది. పులివెందుల కళాశాలకైతే మంజూరైన ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం క్షమార్హం కాదని గుంటూరులో ఓ మెడికల్ షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కళాశాలలన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి కట్టబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తోంది.అన్నింటా విఫలం.. అందరి నోటా అదే మాట గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ చాలా సమర్థవంతంగా జరిగింది. 2020 – 2022 మధ్యకాలంలో కరోనా వైరస్ విజృంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విరివిగా అందాలనే ఉద్దేశంతో పీహెచ్సీలను మరింత బలోపేతం చేయడం, డాక్టర్ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇచి్చంది. వైద్యుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసింది. ఒక పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించింది. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్ను సమర్థవంతంగా అమలు చేసింది. ఆ గ్రామాలకు వెళ్లే వైద్యుడు అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి మంచి వైద్యం అందించే వారు. మంచంలో ఉన్న రోగుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లేవారు. ఇప్పుడు ఇదంతా గతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు తగినన్ని ప్రణాళికలు ఎలాగూ రచించడం లేదు సరికదా... ఉన్నవే చెరిపేస్తున్నారన్న భావన ఈ ఏడాది కాలంలో ప్రజల్లో బలంగా వేళ్లూనుకుంది. ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో పురోగతి చాలా పరిమితమేనంటూ గతంలో నిరంతరం సెలైన్లా అందుతున్న సేవలు ఇప్పుడు కోమాకు వెళ్తున్న చందంగా ఉన్నాయని సామాన్యులు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద ఎటు చూసినా... గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్య రంగం నిర్వహణ చాలా పేలవంగా ఉందనే విమర్శ వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వంపై చాలా మంది చాలా ఆశలు పెట్టుకోగా, అన్ని రంగాల్లోనూ విఫలమైందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్యం దీనంగా మారడం, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం, కొత్త మెడికల్ కాలేజీలకు నో చెప్పడం, పీపీపీకి ప్రోత్సాహం, కార్పొరేటు ఆసుపత్రుల సంపద పెంచేలా చర్యలు తీసుకోవడం, గ్రామీణులకు వైద్య సదుపాయాలను మరింత మృగ్యం చేయడం మినహా వైద్య, ఆరోగ్య రంగంలో ఈ ప్రభుత్వం సాధించిందంటూ ఏమీ లేదని ప్రజలు ఊరూరా చెప్పుకుంటున్నారు. -
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: చందనోత్సవం ఘటన మరువకముందు సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. తొలిపావంచా వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూటమి ప్రభుత్వంలో ఆలయాల పట్ల, భక్తుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సింహాద్రి అప్పన్న సన్నిధిలో శనివారం(జులై 5న) తొలిపావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డూ కూలిపోయింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలిందని నిర్ధారణ అయ్యింది. షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ఏర్పాట్లపై భక్తులు ఆందోళన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీన ఈదురు గాలితో నాసిరకం గోడ కూలిపోయి క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద పడింది. ఆ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి కూడా. ఇది మరువకముందు అదే ఆలయ ప్రాంగణంలో మరో ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతకు ముందు.. ఈ ఏడాది తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం.. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మరి.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో శ్మశాన వాటికలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. మచిలీపట్నంలో క్రైస్తవుల స్మశాన వాటికను టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ కబ్జా చేసేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు టీడీపీ నేత తాళం వేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక నిర్వహణను నగరపాలక సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న స్మశాన వాటికను తన చేతుల్లోకి తీసుకున్న టీడీపీ నేత.. స్మశాన వాటికను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. స్మశాన వాటికకు తాళం వేసి.. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ తన గేదెలను పెంచుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతపై మున్సిపల్ కమిషనర్కు క్రైస్తవులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు. అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం రెండోది ప్రతి పక్షం, ప్రతి పక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం. ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతి పక్షం బాద్యత. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు.’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.‘‘పువ్వు పుట్టిగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్లు ఉంది. ఏడాది పుర్తి అయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది?. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి. వైద్య విద్యార్థులపై ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు. ఏమి చేసిన అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపురిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు...చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాద్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా?. ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా?. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడాని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా?. మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు’’ అంటూ బొత్స నిలదీశారు.కూటమి సర్కార్ నయ వంచన: కన్నబాబుమాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టి.. పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నయవంచన చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమయింది?. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా ఆనాడు చంద్రబాబు 89 వేల కోట్లు రుణ మాఫీ చేయ్యల్సి వస్తే 15వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0 లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు’’ అని కన్నబాబు చెప్పారు. -
గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు
-
‘పవన్.. నీదే టెంట్హౌజ్ పార్టీ.. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నినాని. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బాబు రావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా?. టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా?. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు.. ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ర్టంలో నరరూప రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన ఖాకీలు సైలెంట్ అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి గా అందరికీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయొద్దంటున్నారు. దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇలా చేయటం సబబేనా?. వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయండి, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయిపొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్లుగా ఆ గ్రామంలో సర్పంచ్గా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ కుటుంబమంతా రాక్షసులైతే జనం ఇన్నేళ్లుగా ఎలా గెలిపిస్తున్నారు?. ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వర రావుపై హత్యాయత్నం చేశారు. బాబూరావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవల వలనే నాగ మల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు. నిజానికి బాబూరావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగ మల్లేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారుమన్నవ గ్రామంలో వైఎస్సార్సీపీదే హవా. దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలకు కారకులెవరో అందరికీ తెలుసు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని ధూళిపాళ్ళ కోరుకుంటున్నారు?. రప్పా రప్పా అని పోస్టర్ పట్టుకున్నోడిపై కేసులు పెట్టినవాళ్లు మరి నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ చెబితేనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి ఆయన దగ్గరకు వెళ్దామంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు . చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు, చెల్లెలు కలుగులో నుండి వస్తారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పవన్ పార్టీ పెట్టారు.వైఎస్ జగన్ని అధికారంలోకి రానీయను అనటానికి పవన్ ఎవరు?. 2019లో కూడా జగన్ని అధికారంలోకి రానీయనని పవన్ అన్నారు. మరి ఏమైంది?. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు. సుగాలీ ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు. కనీసం కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. హెలికాఫ్టర్లో పిల్లల్ని తీసుకుని తిరగటం తప్ప పవన్కి ఇంకేం తెలుసు?. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్కి తెలియదు.పంచాయతీలకు రావాల్సిన రూ.2,800 కోట్లను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదు?. రేషన్ బియ్యం షిప్పుల కొద్దీ బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. తిరుమలలో రోజూ అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయటం లేదు?. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించటం లేదు?. హెలికాఫ్టర్లో ప్రకాశం జిల్లాకు వెళ్లిన పవన్కి కరేడులో రైతుల సమస్యలు కనపడటం లేదా?. మీ ప్రభుత్వం 8 వేల ఎకరాలను మీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు?.రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగ లేవంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు?. చంద్రబాబు, లోకేష్ లకు సిగ్గు లేదా?. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కల్తీ మద్యం వెనుక టీడీపీ నేత!
సాక్షి, అనకాపల్లి : పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లి జిల్లాను టీడీపీ కూటమి నేతలు కల్తీ మద్యానికి అడ్డాగా మార్చేస్తున్నారు. ఈనెల 2న పరవాడలో కల్తీ మద్యం స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడిచేసి ఇద్దరు నిందితులను అరెస్టుచేయడమే కాక వారి నుంచి 72 లీటర్ల స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రుల్లో ఉపయోగించే స్పిరిట్ను వీరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం తయారుచేస్తున్నారు.అరెస్టయిన ఇద్దరిలో టీడీపీ నేత రుత్తల రాము కీలకంగా ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంకు చెందిన రాము స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ప్రభుత్వ పాఠశాల పేరెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో రుత్తల రాము చైర్మన్గా గెలిచారు. గ్రామంలో ఈయన టీడీపీ తరఫున చురుగ్గా ఉంటారని తెలుస్తోంది. మరోవైపు.. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్తో కలిసి రాము నకిలీ మద్యం తయారుచేస్తూ బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. తొలుత వీరు గ్రామంలో ఒక హోటల్ నిర్వహించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.స్పీకర్ అయ్యన్నకు సన్నిహితుడు..ఇదిలా ఉంటే.. కల్తీ మద్యం కేసులో పట్టుబడిన నిందితుడు రుత్తల రాము టీడీపీ కండువాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యన్నకు అత్యంత సన్నిహితుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఈ కల్తీ మద్యం వ్యాపారం తెర వెనక ఎవరున్నారనే కోణంలో ఎౖMð్సజ్ పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. -
మూసేయడానికే కూటమి మొగ్గు!
సాక్షి, విశాఖపట్నం: పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బ్రతిమాలుతుంటే ఆ పాఠశాల ఉపాధ్యాయులకు వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) ఇచ్చి పంపేయాలని విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలు ఉక్కు యాజమాన్యానికి సిఫార్సు చేయడం పట్ల అందరూ నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉన్నవారు పాఠశాలను నిలబెట్టాల్సింది పోయి మూసివేయడానికి మద్దతివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు దశాబ్దాల క్రితం స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల కోసం ఉక్కునగరంలోని సెక్టార్–5లో విశాఖ విమల విద్యాలయం(వీవీవీ) తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన డయాసిస్ సంస్థకు పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అక్కడి ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు చెల్లించేవారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో 28 మంది పర్మినెంట్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, 60 మంది సిబ్బంది ఉన్నారు. పాఠశాల నిర్వహణకు ఏడాదికి రూ.5 కోట్లు వ్యయం అవుతోంది. ఫీజుల రూపేణా రూ.2 కోట్లు వసూలవుతుండగా, మిగిలినది ఉక్కు యాజమాన్యం సహాయంగా అందజేస్తూ వస్తోంది. గతేడాది ఉక్కు యాజమాన్యం పాఠశాల నిర్వహణకు తాము సహకరించలేమని, సొంత నిధులతో నిర్వహించుకోవాలని తేల్చింది. దీంతో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఆ ఒత్తిడికి లొంగి గతేడాది పాఠశాల నిర్వహణకు యాజమాన్యం ముందుకు వచ్చింది. ఈ ఏడాది కథ మళ్లీ మొదటికి రాగా.. మూడు నెలల క్రితం డయాసిస్ సంస్థ పాఠశాల కొనసాగించడానికి అనుమతి కోసం ఉక్కు యాజమాన్యానికి లేఖ రాసింది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన కనిపించలేదు. ఇతర పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలవుతున్నా వీవీవీ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై గత నెల 23న ఉక్కు యాజమాన్యం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో యాజమాన్యం పాఠశాలను తెరవడానికి సంబంధించిన అనుమతి పత్రం ఇస్తామని చెప్పినట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇది జరిగి రెండు వారాలు కావస్తున్నా పాఠశాల తెరవకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బట్టబయలైన కూటమి ప్రభుత్వ నైజం.. ఇదిలా ఉండగా ఈ అంశంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్లను కలిసి పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రయత్నిస్తున్నామని, ఉక్కు యాజమాన్యం వినటం లేదని ఎంపీ, ఎమ్మెల్యే పలుమార్లు వారికి చెబుతూ వచ్చారు. ఒకవైపు వారితో అలా చెబుతూ మరోవైపు యాజమాన్యానికి ఉపాధ్యాయుల వీఆర్ఎస్ కోసం సిఫార్సు చేయడం పట్ల కూటమి ప్రభుత్వం నైజం బయట పెట్టారు. -
కొనేది లేదు..! మామిడి ‘కోతలే’!
సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగుతోంది. ప్రాసెసింగ్ కంపెనీలతో కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేయిస్తున్నామని.. కిలోకు రూ.4 వంతున ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేస్తున్నామంటూ బుకాయిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ సీజన్లో 5.61 లక్షల టన్నుల నాణ్యమైన మామిడి దిగుబడులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కూటమి సర్కారు నిర్వాకంతో తోతాపురి మామిడి కిలో రూపాయికి కూడా కొనే నాథుడు లేకుండా పోయారు. దీంతో దిక్కుతోచక రైతన్నలు వేలాది టన్నుల మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూపాయికి అర్ధ రూపాయికి అడుగుతుండడంతో కూలి ఖర్చులు కూడా రావన్న ఆవేదనతో లక్షలాది ఎకరాల్లో పక్వానికి వచ్చిన మామిడిని కోయకుండా వదిలేస్తున్నారు. కళ్లెదుటే కుళ్లిపోయి రాలిపోతుండడంతో కుమిలిపోతున్నారు. వాస్తవాలకు ముసుగేసి మామిడి రైతులను తామేదో ఉద్ధరిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం నమ్మబలుకుతుండటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.కదిలించిన కుమారస్వామి..చేతులెత్తేసిన చంద్రబాబు.. ఏపీలో మాదిరిగానే కర్నాటకలో కూడా ధరలు లేక మామిడి రైతులు నష్టపోతున్నారు. దీనిపై స్పందించిన కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి కుమారస్వామి రైతులను ఆదుకోవాలంటూ గత నెల 24వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. తమ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవాలని, కేంద్రం కిలో రూ.16 చొప్పున కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని అభ్యర్థించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా క్వింటా రూ.1,616 (కిలో రూ.16) చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. కుమారస్వామి కోరిన విధంగా ఏకంగా 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు.కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రాణవాయువు అందిస్తున్నా...టీడీపీ, జనసేన మాదిరిగానే కర్నాటకలో జేడీఎస్ కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. టీడీపీ – జనసేన రైతులను ఆదుకోవడంలో విఫలం కాగా జేడీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క లేఖతో కదిలించింది. వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ, జనసేన అండదండలతోనే మనుగడ సాగిస్తున్నా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర సాధించిన పాపాన పోలేదు. మొన్న మిర్చి.. నేడు మామిడి రైతుల పట్ల అదే రీతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మద్దతు ధరల విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపిన దాఖలాలు లేవు. కేంద్రంలో తమకున్న పలుకుబడిని స్వప్రయోజనాలకు, స్వలాభాలకు మినహా రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు వినియోగించిన దాఖలాలు లేవు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేవలేక.. చేతకాక మామిడి రైతులను నట్టేట ముంచేసింది. మొన్నటికి మొన్న మిర్చి రైతుల విషయంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించింది. కేంద్రానికి లేఖ రాశామని, క్వింటా రూ.11,781 చొప్పున రైతుల వద్ద ఉన్న మిర్చినంతటిని కేంద్రమే కొనుగోలు చేస్తుందంటూ ప్రకటించారు. తీరా కేంద్రం కొనలేదు.. రాష్ట్ర ప్రభుత్వమూ కొనలేదు. 2023–24 సీజన్లో క్వింటా రూ.21–27 వేలు పలికిన మిర్చిని కూటమి సర్కారు అసమర్థతతో రూ.6–8 వేలకు తెగనమ్ముకొని రైతులు నష్టాలపాలయ్యారు.కంపెనీల గోడు పట్టదు.. రైతులను మభ్యపెడుతూ..ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో తమవద్ద పేరుకుపోయిన దాదాపు 1.50 లక్షల టన్నుల పల్ప్ నిల్వలను అమ్ముకునేందుకు ప్రభుత్వం చేయూతనివ్వకుంటే ఈ ఏడాది రైతుల నుంచి తోతాపురి మామిడిని కొనుగోలు చేయలేమని కంపెనీలు మొరపెట్టుకున్నాయి. అయితే ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పల్ప్ ఉత్పత్తులపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలు అభ్యర్థిస్తే.. కేంద్రానికి లేఖ రాశామంటూ పాతపాటే పాడింది. కంపెనీలు కిలో రూ.8 చొప్పున మామిడిని కొనుగోలు చేస్తాయని, మిగిలిన రూ.4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ తీరా కిలో రూ.2–4 మించి కొనేవారు లేక మామిడి రైతులు అల్లాడుతున్నారు. ర్యాంపుల వద్ద అయితే కిలో రూ.1–2కి మించి ఇవ్వని దుస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అయినా జమ చేసిందా అంటే ఏ ఒక్క రైతుకూ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆదుకోవాలన్న తపన లేదురాష్ట్రంలో రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, తపన కూటమి ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అప్పుల పాలై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చేష్టలుడిగి చూస్తుందే గానీ ఆదుకోవాలన్న తపన ఏ కోశానా లేదు. –జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంటన్నుల కొద్దీ పారబోస్తున్నారు..మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే రైతులకు ఎంతోకొంత ఉపయోగం జరుగుతుంది. కిలో రూ.12 చొప్పున ప్రకటించినప్పటికీ ఏ ఒక్క ఫ్యాక్టరీ కిలో రూ.8 కూడా ఇవ్వడం లేదు. మొదటిసారిగా టన్నుల కొద్దీ మామిడి రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి రైతులను కాపాడి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. –ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ అగ్రి మిషన్ మాజీ వైస్ చైర్మన్రూ.7,796 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన జగన్ సర్కార్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుఅన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విత్తనాల నుంచి పంట విక్రయాల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా నిలిచింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సీజన్కు ముందే పెట్టుబడి సాయాన్ని అందించింది. ఉచిత పంటల బీమాను అమలు చేసి రైతులపై భారం లేకుండా చేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే వ్యవసాయదారుల అన్ని అవసరాలను తీర్చింది. ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సాగుదారులకు భరోసా కల్పించింది. ధరలు పడిపోయిన ప్రతి సందర్భంలోనూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల పంట ఉత్పత్తులను (ధాన్యం కాకుండా ఇతర పంటలు) కొనుగోలు చేయడం గమనార్హం. -
ఏరాసు ప్రతాప రెడ్డి పై బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరుల దాడి
-
పరవాడ, యలమంచిలిలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు గుర్తింపు
-
ఫారెన్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ YSRCP డిమాండ్
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఏరాసుపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చే జరిగింది. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డా అనుచరులు రెచ్చిపోయారు.ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలను బుడ్డా వర్గీయులు ధ్వంసం చేశారు. బుడ్డా అనుచరులు.. ఏరాసుపై చేయి చేసుకున్నారు. ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. -
జగన్ పేరు చెప్తే.. కోటి రూపాయలు..! బట్టబయలైన లోకేష్ కుట్ర
-
యూజ్ లెస్ ఫెలో.. గెట్ ఔట్..! మంత్రి అచ్చెన్న అల్లుడికి ఘోర అవమానం
-
ఇనుప రాడ్డుతో టీడీపీ ఎటాక్.. వెంటిలేటర్ పై YSRCP సర్పంచ్..
-
మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్ ఎప్పుడిస్తారు!
సి.బెళగల్: ‘యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్ రాలేదు. పింఛన్ ఎప్పుడిస్తారు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్లో టీడీపీ నాయకులు గురువారం తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.అదే విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా, ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
YSRCP సర్పంచ్ పై కర్రలతో టీడీపీ గుండాలు దాడి.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
కూటమి పాలనపై జనసేన నేత తిరుగుబాటు
తిరువూరు: కూటమి ధర్మాన్ని విస్మరించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ కన్వినర్ మనుబోలు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తనను నిత్యం బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏమి చేసినా భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని, కూటమి గెలుపు కోసం కృషిచేసిన వారిని అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.తనపై భౌతికదాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు సొంత అజెండా రూపొందించుకోవడాన్ని ఖండించారు.నియోజకవర్గానికి మంజూరైన సీసీ రోడ్లలో కూటమి భాగస్వామ్య పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ నాయకులే కాంట్రాక్టు పనులు చేసుకుంటే పొత్తు ధర్మం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.చెరువుల్లో మట్టిని టీడీపీ నాయకులే పోటీపడి అమ్ముకోవడం, రేషన్ మాఫియా వద్ద నెలవారీ మామూళ్ళు వసూలు, జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్ళ పర్వం, విద్యుత్ సబ్స్టేషన్లలో కాంట్రాక్టు కార్మికుల నియామకానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం, తిరువూరులో గతంలో అక్రమ కట్టడంగా గుర్తించినది ఇప్పుడు సక్రమంగా ఎలా మారిందనే విషయాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మనుబోలు చెప్పారు. ఏ కొండూరు మండలం గోపాలపురంలో మట్టి అక్రమ క్వారీ నిర్వహణపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నం
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహరపేట అరుంధతీయ కాలనీకి చెందిన ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన మొండెం ఉదయ్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్రహరపేటకు చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయ్ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు చేరుకునేసరికి ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పులివెందుల పోలీసులకు చుక్కెదురు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరాలివీ..అప్పట్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ కమిషనర్తోపాటు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. వీరు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించారు. దీన్ని సాకుగా చూపి హోంమంత్రి ద్వారా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఆదేశాలతో ఓ టీడీపీ నాయకుడితో వారిపై ఫిర్యాదు చేయించారు. దీంతో.. టీడీపీ నేతపై దాడిచేసినట్లు వైఎస్సార్సీపీ వారిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారు.పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్సార్సీపీ నాయకులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్కు తెలిపారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ఆదేశించగా.. వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులతోపాటు టీడీపీ నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి దెబ్బలులేనట్లుగా రిపోర్టులు ఇప్పించారు. దీనిపై నిందితులు మళ్లీ హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని, నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.పులివెందుల పోలీసుల ఓవరాక్షన్..ఇక ఈ మెడికల్ టెస్టుల్లో తమకు వ్యతిరేకంగా నివేదిక వస్తుందనే అనుమానంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, అర్బన్ సీఐ చాంద్ బాషా, రూరల్ సీఐ వెంకటరమణ కర్నూలులో మకాంవేసి అధికార పార్టీ నేతల ద్వారా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాక.. కర్నూలు డీఎస్పీ కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రిపోర్టులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా.. కర్నూలు సూపరింటెండెంట్తో పాటు వీరంతా కలిసి ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ వీడియోలో మీడియా కంటపడకుండా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తన ముఖం చాటేయడం కనిపించింది. వీటి ఆధారంగా పిటిషనర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక.. తమకు తగిలిన గాయాలను ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయాలున్నట్లు తేలిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో.. హైకోర్టు ఈ వారంలోగా వారికి తిరుపతి స్విమ్స్ కేంద్రంగా మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్ బాషాను ఈనెల 1న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం ఆయనకు అందజేశారు. -
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
రోప్ పార్టీకి దిక్కులేదు.. జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నారంట!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఆయన పర్యటనల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చునన్నారు. ఓ వ్యక్తి భద్రత విషయంలో రోప్ పార్టీది కీలకపాత్ర అని ఆయన వివరించారు. భారీ సంఖ్యలో వచ్చే జనాలను రోప్ పార్టీ నియంత్రిస్తుందని, తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. జగన్కు అన్నిరకాల భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రోప్ పార్టీని ఎందుకు ఏర్పాటుచేయడం లేదో చెప్పడం లేదన్నారు.రోప్ పార్టీ విషయంలో ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందో అర్థంకావడంలేదన్నారు. అది లేకుంటే జగన్ భద్రతకు ముప్పు ఉన్నట్లేనని శ్రీరామ్ స్పష్టంచేశారు. జగన్ పర్యటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమన్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటునకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్రజాప్యం చేశారన్నారు. అడుగు కూడా వేయలేని ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చారని, ఈ ప్రాంతంలో చెట్లు, పొదలు తొలగించడానికే మూడ్రోజులు పడుతుందని శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో జగన్ తన నెల్లూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని తెలిపారు. జగన్కు రోప్ పార్టీతో సహా అన్నీ రకాలుగా భద్రత కల్పించే విషయాన్ని కేవలం నెల్లూరు పర్యటనకు మాత్రమే కాకుండా, ఆయన చేసే ప్రతీ పర్యటనకు సైతం వర్తింపజేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. జగన్కు సేఫ్ ట్రావెల్, సేఫ్ ల్యాండింగ్, సేఫ్ మూవ్మెంట్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే జగన్ భద్రత కోసం ప్రభుత్వ నిర్లక్ష్యంపై రెండు పిటిషన్లు దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, జగన్ పర్యటన వాయిదా నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ నిరర్థకమైందన్నారు. జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామన్నారు. జడ్ ప్లస్ వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పిటిషనర్లు అనుబంధ పిటిషన్ వేశారని, దీనికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆ రోజుకి కౌంటర్ దాఖలు చేయాలని, ఆ రోజునే వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ను పరిష్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెల్లూరు పర్యటనకు వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతనేని చంద్రశేఖర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మన్నవ సర్పంచ్పై విచక్షణారహితంగా దాడి
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం
-
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
చినబాబు దర్శనానికి రూ.40 లక్షలు..!
సాక్షి, అమరావతి: ముడుపులు ముట్టచెబితేనే ముఖ్యనేత, ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్లు తెలిసింది. మంత్రిగా ఉన్న చినబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లోమీడియా మాజీ ప్రతినిధి, మంత్రి చుట్టూ తిరిగే పీఏను సంప్రదించగా. వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షలు తీసుకుని అపాయిట్మెంట్ ఇప్పించారని సమాచారం.ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకుని అక్కడే పీఏలతో గొడ వకు దిగారని తెలిసింది. విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పీఏకు కబురుపెట్టారని, ఈలోపే విషయం మంత్రికి చేరడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పీఏనే పిలుస్తారా? తమాషాగా ఉందా? అంటూ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అక్రమ వసూ ళ్లకు చినబాబే అనుమతిచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఆయనకూ వాటాలు న్నాయని ప్రచారం. ముఖ్య నేతను కలవాలన్నా.. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది. -
క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగా!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ‘ఉన్నత విద్య’ అగమ్యగోచరంగా తయారైంది. విద్యా సంవత్సరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. వివిధ కోర్సుల ప్రవేశాల నిర్వహణలో తీవ్ర జాప్యంచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అవగాహన రాహిత్యం ఉన్నత విద్యాశాఖకు శాపంగా మారింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఈసెట్ ప్రవేశాలను బీటెక్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేయడం సర్కారు చేతగానితనానికి అద్దంపడుతోంది.అభాసుపాలవుతున్న మంత్రి..టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ మధ్య కోల్డ్వార్ నడుస్తున్నా మంత్రికి పట్టడంలేదు. అసలు ఉన్నత విద్యాశాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని దుస్థితిలో ఆయనున్నారు. ఫలితంగా విద్యా వ్యవస్థలోని కీలక అంశాలు మరుగునపడుతున్నాయి. పగలంతా సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకుని సాయంత్రం వేళల్లో సమీక్షల పేరుతో అధికారులతో టీ, బిస్కెట్ల మీటింగ్ పెట్టి మమ అనిపిస్తున్నారు. ఏడాది కాలంగా మంత్రి లోకేశ్ సమీక్షల్లో ప్రతిపాదించిన అంశాల్లో ఏ ఒక్కదానిలో పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య మంత్రి లోకేశ్ ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తట్టుకోలేక అభాసుపాలవుతున్నారు. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్ విషయంలోనూ మంత్రి ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడం ద్వారా ఆయన అవగాహన రాహిత్యం బయటపెట్టింది.సెకండియర్ క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగ్..ఇక ఏటా ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేస్తుంది. ఇందులో డిగ్రీ, ఇంజనీరంగ్, బీఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు, తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీల వంటి అంశాలను సమగ్రంగా పొందుపరుస్తుంది. ఈ క్రమంలోనే బీటెక్ రెండో ఏడాది తరగతులను జూన్ 30 నుంచి ప్రారంభించాలని పేర్కొంది. కానీ, బీటెక్లో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరే ఈసెట్ విద్యార్థులను మాత్రం విస్మరించింది. మే 15న ఈసెట్ ఫలితాలు విడుదలైతే.. నెలన్నర తర్వాత జూలై 4 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చింది. వాస్తవానికి.. ఈసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించకుండానే బీటెక్ రెండో ఏడాది తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించడంతో విద్యార్థులను ఆందోళనలో పడేసింది. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్కు జూలై 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి, 7 నుంచి ఆప్షన్ల ఎంపిక అనంతరం 14లోగా సీట్ల భర్తీని పూర్తిచేసేందుకు షెడ్యూల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది తొలిదశ కౌన్సెలింగ్ కాగా.. ఆ తర్వాత మరోదశ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి జూలై ముగిసిపోతుంది. ఫలితంగా విద్యార్థులకు ఒకనెల తరగతులు కోల్పోవాల్సి వస్తోంది. అసలు ఇంజినీరింగ్ సెకండియర్ తరగతులు మొదలయ్యే తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశాలను పూర్తిచేయాల్సి ఉండగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తూ విమర్శలపాలవుతోంది. -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
వీణ్ని అంతం చేస్తే వైఎస్సార్సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుండగా.. వారికి వంత పాడుతున్న పోలీసుల అచేతనానికి రాష్ట్రం సిగ్గుపడాల్సి వస్తోంది. మహిళా సర్పంచ్ కుటుంబంపై మంగళవారం టీడీపీ మూకలు దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే మరో ఘోరం జరిగింది. 11నెలల పసికందును చంకలో పెట్టుకుని తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చించి, పసికందుతో పాటు ఆ మహిళ గుండెలపై కాళ్లతో తొక్కి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన అమానుష ఘటన సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత మండలం తిరుపతి జిల్లా చంద్రగిరిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనపాకం దళితవాడకు చెందిన అజయ్ పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీకి చెందిన జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడి అనుచరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్ ఇంట్లో ఉండగా.. సుబ్రహ్మణ్యం అనుచరులు లోకేశ్, వామనమూర్తి, గురవయ్య, కిషోర్, చక్రవర్తి, నాగేష్, బుజ్జమ్మ, పద్మ, చంద్రకళ, మునిరాజమ్మలతో కలిసి ఇంటిపై గొడవకు వెళ్లారు. ‘వీడు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అజయ్ తల్లిదండ్రులు, చెల్లెలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి కళ్లలో కారం కొట్టి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మహిళ బట్టలు చించి.. గుండెలపై తొక్కి.! తన భర్త అజయ్పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడడంతో అతని భార్య 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని పరుగున బయటకు వచ్చారు. దాడిని అడ్డుకొని వారిని ప్రశ్నించగా.. టీడీపీ గూండాలు దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమె బట్టలు చించేసి దారుణంగా కొట్టారు. చంటి బిడ్డతో సహా ఆమెను కింద పడేసి, గుండెలపై కాళ్లతో తొక్కుతూ రాక్షసానందం పొందారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారని, లేకుంటే తమను చంపేసి ఉండేవారంటూ ఆ దళిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పథకం ప్రకారమే దాడి.. డీఎసీఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆదేశాలతో పక్కా పథకం ప్రకారమే తమపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్ వాపోయారు. ఏడాదిన్నరగా విడతల వారీగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి చొరవతో మాతమ్మ ఆలయాన్ని నిర్మించామని, ఏడాదిన్నరగా ఆలయంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. దాడిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితులు కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం టవర్క్లాక్ సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఘటనపై బాధితుడితో పాటు అతని భార్యను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళితులపై దాష్టికాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. -
కూటమి పాలనలో భ్రష్టుపట్టిన వైద్య రంగం: సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తి చేసి.. నిబంధనలు ప్రకారం ఇంటర్నషిప్ కూడా కంప్లీట్ చేసి.. దాదాపు ఏడాది కావస్తున్నా వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి పీఆర్ చేయకపోవడాన్ని సీదిరి అప్పలరాజు తప్పు పట్టారు.రాష్ట్రంలో తగినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోవడం.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ఖరీదు కావడం వల్లే చాలా మంది విదేశాల్లో మెడిసిన్ విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష కూడా క్లియర్ చేసి... ఆ తర్వాత ఏడాది ఇంటర్నెషిప్ పూర్తి చేసుకున్నా వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారన్న సాకుతో రిజిష్ట్రేషన్ నిరాకరస్తున్నారని... మన దేశంతో పాటు ప్రపంచమంతా కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకే హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు.తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగితే... వారి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించాల్సిన ప్రభుత్వం... నేరస్ధులు తరహాలో వారిని అత్యంత దుర్మార్గంగా కొట్టి పోలీసు స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని.. హక్కులు కోసం ఎవరూ గొంతెత్తి మాట్లేడే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్స్ డే రోజునే తమ న్యాయపరమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తుంటే వైద్య విద్యార్థులను కూడా జైల్లో పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచాలని ఉదయం ఆందోళనకు దిగితే సాయంత్రానికి అక్కడ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించిందని గుర్తు చేసారు. గతంలో కూడా చంద్రబాబు ఎంబీబీఎస్ పూర్తైన తర్వాత ఐదేళ్ల గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు చేయాలని నిబంధన పెట్టారని.. చంద్రబాబుకు వైద్య విద్యార్ధులను వేధించడం అలవాటేనని మండిపడ్డారు.తన నాలుగు దఫాలు పాలనలో చంద్రబాబు కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని తేల్చి చెప్పారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కేవలం తన ఐదేళ్ల పాలనలోనే నాలుగు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మించి రాష్ట్రానికి గొప్ప మేలు చేశారని కొనియాడారు. వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రయత్నం చేయలేదని.. కేవలం ప్రయివేటు మెడికల్ కాలేజీల నిర్మాణానికే మొగ్గు చూపారని స్పష్టం చేశారు.పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వాటి పనులు మొదలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డాక్టర్ అప్పలరాజు తేల్చి చెప్పారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023-24 లో ప్రారంభించి 750 సీట్లు అదనంగా సాధించారన్నారు.చంద్రబాబు సీఏం అయ్యేనాటికి 2024-25 సంవత్సరం నాటికి మరో ఐదు కాలేజీల్లో అరవై శాతం పనులు పూర్తయితే... వాటిని మొదలు పెట్టకుండా... మాకు మెడికల్ సీట్లు వద్దంటూ లెటర్ పెట్టిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను నిలిపివేయడం దారుణమని.. 17 మెడికల్ కాలేజీల కోసం రూ. 8,500 కోట్లు అవసరం కాగా.. జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారుగా రూ. 2300 కోట్లు ఖర్చు పెడితే.. మరో రూ. 6.500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 80 వేల కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం.. పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడానికి ముందుకు రాకపోవడం... వైద్య రంగం పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.పక్క రాష్ట్రాల్లో వీరితో పాటు చదువుకున్న వైద్య విద్యార్దులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు చేయడం లేదని నిలదీశారు. న్యాయం చేయమని అడిగితే వైద్యులపైకూడా పోలీసులతో దాడులు చేయించడం అత్యంత విచారకరమన్నారు. ప్రభుత్వం కచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకోని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వైద్యరంగంలో సమూలు మార్పులు వచ్చి ఉండేవని.. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ సహా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని తేల్చి చెప్పారు.ఈ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్ధితి లేదన్నారు. రూ.లక్షా అరవై ఐదువేల కోట్లు అప్పు చేసి ఎవరి సంక్షేమం చేశారని నిలదీశారు. తక్షణమే వైద్య విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించడంతోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్ఎంసీ (NMC) గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMG) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..@ncbn గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ (NMC) గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్(FMG) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్షిప్… pic.twitter.com/GKBsMr7e9J— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2025‘‘పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు."మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది: పేర్ని నాని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వంశీని జైల్లో ఉంచి కొందరు శునకానందం పొందారని, ఇందుకు రేపో.. మాపో.. మరో నాలుగేళ్లకో వాళ్లే అందుకు పశ్చాత్తాపం చెందుతారని అన్నారాయన. సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఇవాళ(జులై 2, బుధవారం) విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒకే కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతూ కుట్రలు చేశారు. ఐదేళ్లు, పదేళ్లు కింద జరిగినవాటికి కూడా కేసు పెట్టారు. లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారు. అడ్డగోలు జీతాలు తీసుకుని వాదించేవాళ్లు ఉన్నా కూడా.. వాదించడానికి ఢిల్లీ బాబాయి రావాలి అంటూ వాయిదాలు వేయించుకున్నారు. చివరకు ఇవాళ కూడా సుప్రీం కోర్టులో వంశీ బెయిల్ను రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఇంత చేసి సాధించింది ఏంటి?.. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమా? పోనీ..వంశీని రాజకీయాల నుంచి పారిపోయేలా చేశారా?.. గన్నవరం ప్రజల నుంచి దూరం చేయగలిగారా?. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతిని మూటగట్టి పెట్టారు. వంశీని జైల్లో ఉంచి మీ పార్టీకి(టీడీపీని ఉద్దేశించి..) మీరే గొయ్యి తవ్వుకున్నారు. కక్ష సాధింపు తప్ప కూటమి సాధించింది ఏమీ లేదు. కేవలం శునకానందం పొందారు. రేపో,, మాపో, మరో నాలుగేళ్లకైనా దీని వెనుక ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకుంటారు అని పేర్ని నాని అన్నారు. -
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
బాబు మాటలు రాష్ట్రానికి చేటు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూత వైద్యుడి అవతారమెత్తారు. సొంత ఆలోచనో.. ఎవరైనా సలహా ఇస్తున్నారో తెలియదు కానీ.. భూతాల భాష మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిష్టనూ మసకబారుస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలోనే భూతాలు, దెయ్యాలు అంటూ మాట్లాడటం ఆయనకు, రాష్ట్రానికీ గౌరవం పెంచే పనైతే కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ద్వేషం, కోపం ఏమైనా ఉండవచ్చు. కానీ, అందుకోసం ఇలా తనను తాను భూత వైద్యుడిగా పోల్చుకుంటూ భూస్థాపితం చేస్తానంటూ ఉపన్యాసాలు చెబితే ఎవరికి నష్టం?. ఆధునిక సమాజంలో భూత వైద్యులను ఎవరైనా విశ్వసిస్తారా? అలా నమ్మేవారు ఎవరైనా ఉంటే వారు అమాయకులు, అంధ విశ్వాసాలను అనుసరించేవారై ఉంటారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళతారనో, లేక తాము చేసిన హామీలను నెరవేర్చుతారనో ప్రజలు ఓట్లు వేస్తే, వారికి భేతాళ మాంత్రికుడి కబుర్లు చెబితే ఎలా?. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, గత ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్ ఎన్నడైనా ఈ భూతాల భాష వాడారా?. ఆయన హయాంలో రిలయన్స్ అంబానీ, అదానీ, జిందాల్, ఆదిత్య బిర్లా వంటి పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలు విశాఖలో సదస్సులో పాల్గొని ఏపీ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు!. వైఎస్ జగన్ దార్శనికతను ఎంతగానో మెచ్చుకున్నారు. వారిలో ఇప్పుడు ఎవరైనా జగన్ను భూతంగా చెప్పారా?. మళ్లీ అ భూతం వస్తుందా అని ఎవరైనా అడిగారా?. అది నిజంగా జరిగి ఉంటే వారి పేర్లు చెబుతారా?. అదేమీ లేకపోయినా చంద్రబాబు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నట్లు?. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం బాగుండాలి. వారికి అవసరమైన వసతులు, రాయితీలు కల్పించాలి. వైఎస్ జగన్ ఏమని చెప్పేవారు.. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే.. తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అనేవారు. అంతే తప్ప అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అలాంటి సమావేశాలలో కానీ, ఇతరత్రా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు గానీ.. జగన్ ఒక్కమాటైనా అన్నట్లు లేదు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చింది. సంబంధిత పరిశ్రమలు ఆచరణలోకి రావడం ఆరంభమైందీ జగన్ టైమ్లోనే కాదా?. కర్నూలు వద్ద వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ కో ప్లాంట్ వచ్చింది జగన్ హయాంలోనే.. అప్పుడు వచ్చిన పరిశ్రమలు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి తమ ఘనతేనని కూటమి పెద్దలు చెప్పుకోవడం లేదా?. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ, గత ప్రభుత్వంపై నిత్యం నిందారోపణలు చేస్తూ పెట్టుబడిదారులలో అనుమానాలు కల్గించేలా చేస్తే ఎవరైనా ధైర్యంగా పరిశ్రమలు పెడతారా?. అసలే కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా, శాంతిభద్రతల రీత్యా అంత అనుకూల వాతావరణం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను కూటమి బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల నిర్వాకాల వల్ల పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి విద్యుత్ ప్లాంట్ల బూడిద గురించి కూడా కూటమి నేతలు గొడవలు పడ్డారే!.. అంతెందుకు! ఒక మాజీ ఎమ్మెల్యే తన ప్రాంతమైన తాడిపత్రిలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేత ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా అనంతపురం తరలించారే. ప్రభుత్వ పెద్దలకు తెలియదా! ఇది మంచి వాతావరణమా?.సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై కక్ష కట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటాయా?. ఏదో ఒక సాకుతో సాక్షి మీడియా సంస్థలపై ఏపీ వ్యాప్తంగా దాడులు చేయిస్తే, దాడులకు తెగబడిన మూకలపై సరైన చర్య తీసుకోకపోతే శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా?. ఈ వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియవా?. పారిశ్రామికవేత్తలు గమనించరా?. ఒక పారిశ్రామికవేత్తను సైతం ఒక మోసకారి నటి కేసులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించగా, ఆయన ఏపీలో కాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదించింది వాస్తవం కాదా?. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా భూతాల కబుర్లు చెబుతున్నారని పారిశ్రామికవేత్తలు ఊహించలేరా!. వైఎస్ జగన్ ఏపీలో ఎక్కడకు వెళుతున్నా ప్రజలలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి మాటలు అంటున్నారని వారికి తెలియకుండా ఉంటుందా?. జగన్ టైమ్లో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ మీడియా చేయని ప్రయత్నం ఉందా?. ఆదానికి భూమి కేటాయిస్తే మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేశారే? ఇన్ని ఉదాహరణలు ఎదురుగా పెట్టుకుని జగన్ టైంలో విధ్వంసం జరిగిందని, భూతమని, మరొకటని డైలాగులు చెబితే పారిశ్రామిక వేత్తలు అంత అమాయకులా? నమ్మడానికి!. వారు అమాయకులైన సాధారణ ప్రజల మాదిరి కాదు కదా!. సాధారణ ప్రజలు ఎన్నికల సమయంలో బహుషా భూత వైద్యులను నమ్మి ఉండవచ్చు. ఇష్టారీతిన చేసిన వాగ్ధానాలకు ఆకర్షితులై ఉండవచ్చు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం అనుకుని ఓట్లు వేసి ఉండవచ్చు. లేదా ఈవీఎంల మహిమ ఉండవచ్చన్న భావన కూడా లేకపోలేదు.కూటమి అధికారంలోకి వచ్చాక కానీ.. వారికి భూత వైద్యులను నమ్మడం వల్ల లాభం లేదని తెలిసి ఉండవచ్చు. అందుకే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను తట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భూతం కబుర్లు చెప్పి ప్రజలను డైవర్ట్ చేయాలని తలపెట్టినట్లు కనిపిస్తుంది. ఆ భూతం రాదని తనది హామీ అని చంద్రబాబు అంటున్నారు. ఈసారి ఏమర పాటుగా లేనని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపించదా!. భూత వైద్యులను విశ్వసిస్తే ఉన్న వ్యాధులు పోకపోగా కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో భూత వైద్యుల పాలనలో అదే పరిస్థితి ఏర్పడుతోందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు
-
ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)
-
స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకివ్వాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ప్రతీసారి వాళ్లది 80 శాతం. ఇంకొకళ్లది 15 శాతం. మనది 5 శాతమే అంటున్నారు. ఏందయ్యా 5 శాతం. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోండి. పేరుకే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. అసలు కూటమి పాలనలో బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం, గుర్తింపు రెండూ లేవు. ఇప్పటివరకు ఎన్ని నామినేటెడ్ లిస్టులు ఇచ్చినా కొన్ని పోస్టులు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఏడాదిలోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లే ఇస్తామంటే కుదరదు. మా వాటా మాకు ఇవ్వాల్సిందే..’ అంటూ టీడీపీ తీరును పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైనట్లు ప్రకటించే కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని ఒక ఫంక్షన్ హాలులో నిర్వహించారు. పీవీఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటకకు చెందిన ఎంపీ పీసీ మోహన్ అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. తొలుత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ‘కూటమిలో మన పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవం. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎన్నిలిస్టులు వచ్చినా బీజేపీకి కొన్ని పోస్టులు కూడా ఇవ్వలేదు’ అని ధ్వజమెత్తారు. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్రాజు మాట్లడుతూ ‘బీజేపీకి ఉన్నది ఐదు శాతమే అంటున్నారు. ఏందయ్యా ఐదు శాతం. రెడిక్యూలెస్’ అంటూ తీవ్రంగా స్పందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లు ఇస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. కూటమితో కలిసి ఉండాలని, అయితే, బీజేపీ వాటాను తప్పకుండా పొందాల్సిందేనని చెప్పారు. బీజేపీలో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు 15 నుంచి 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారికి న్యాయం చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. ‘బీజేపీ కనుక కూటమిలో కలవకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉండేవో తెలుసుకోవాలి..’ అంటూ పరోక్షంగా టీడీపీ నేతలను హెచ్చరించారు. ఒకచేతిలో బీజేపీ జెండా... ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా: మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలను సమన్వయం చేసుకుంటూ ‘ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా’ అన్నట్టు ముందుకు సాగుతానని చెప్పారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గౌరవం దక్కేలా, గర్వపడేలా పని చేస్తానని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సమయంలో తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు. జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్రం సహకారంతోనే రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా నా తండ్రి పని చేశారు. మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదన్నట్లు మా తండ్రి వ్యవహరించారు. మా అక్కల పేర్లు కూడా ముఖర్జీ, ఉపాధ్యాయ అని వచ్చేలా పెట్టారు. తొలి పుస్తెను పార్టీకి కట్టాను. ఆ తర్వాత నీకు కట్టాను అని మా నాన్న అమ్మకు చెప్పారంట. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాపై నమ్మకంతో పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తా’ అని మాధవ్ చెప్పారు. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల తన పదవీకాలంలో ప్రోత్సహించిన, విభేదించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదలు అని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ మాధవ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
బాబు సర్కార్ మళ్లీ వెనుకబాటే.. జూన్లోనూ ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా
సాక్షి, విజయవాడ: జూన్లోను ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా నమోదైంది. జీఎస్టీ ఆదాయంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వెనుకపడింది. గత ఏడాది జూన్ కంటే ఈ ఏడాది జూన్ నెలలో ఆదాయం పెరగలేదు. గత ఏడాది జూన్ కంటే రూ.16 కోట్లు జీఎస్టీ ఆదాయం తగ్గింది. 2024 జూన్లో రూ.3,651 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా.. ఈ ఏడాది జూన్లో 3,634 కోట్లకు మాత్రమే జీఎస్టీ ఆదాయం పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలోనూ నెగటివ్ గ్రోత్ నమోదైంది. ఇప్పుడు జూన్ నెలలోనూ జీఎస్టీ వృద్ధి సున్నా.. చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి అత్యధిక నెలలు జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది.కాగా, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోగా రోజురోజుకీ క్షీణిస్తోంది. ప్రజల వద్ద డబ్బుల్లేక వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు నేలచూపులు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తుంటే.. మన రాష్ట్రంలో ఏ నెలకానెల క్షీణిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం మే నెలలోనూ జీఎస్టీ వసూళ్లు 2 శాతానికి పైగా క్షీణించాయి.2024–25 ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.3,890 కోట్లు (ఎస్జీఎస్టీ సెటిల్మెంట్కు ముందు) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మే నెలలో 2.23 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు 13.166 శాతం పెరిగి.. రూ.1.31 లక్షల కోట్ల నుంచి రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి.ఏపీ జీఎస్టీ వసూళ్లు క్షీణిస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. సంక్షేమ పథకాలు ఆపేయడం, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం కబుర్లతో కాలక్షేపం చేయడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం వంటి అనేక కారణాలు రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మందగించడానికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం ప్రతిసారీ యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు.చివరికి మెగా డీఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన ఏపీలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వైఎస్సార్సీపీ యువజన విభాగంతో ఇవాళ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై గొంతెత్తాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో వైఎస్సార్సీపీ యువజన విభాగం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. వైఎస్ జగన్ని సీఎం చేసే దాకా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యేలా చూస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఆయన సీఎం కావాలి. ప్రభుత్వం కుట్రలు చేయడం మాని ఇకనైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వమిదివైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రకటించిన టీచర్ పోస్టులను భర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఏడాది పూర్తయినా దానికి దిక్కుమొక్కు లేకుండా చేశాడు. 2014లో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, 2024 లోనూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటే గత ఏడాది వారందరికీ ఒక్కొక్కరికి రూ. 36 వేలు చొప్పున చంద్రబాబు బకాయి పడ్డాడు. ఒక్క నిరుద్యోగ భృతి పేరుతోనే రూ.56 వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం బకాయిపడింది.కొత్త ఉద్యోగాల భర్తీ లేదు.. ఉన్న ఉద్యోగాల తొలగింపుకూటమి మేనిఫెస్టోలో ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఒక్కో వ్యవస్థనూ ఎత్తివేస్తూ ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు.వలంటీర్ల గౌరవం వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన ఈ కూటమి పెద్దలు, చివరికి వారిని రోడ్డుపాలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 33 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా రేషనలైజేషన్ పేరుతో ఉన్న ఉద్యోగులే ఎక్కువని తేల్చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను తీసేసి 15 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగులను తొలగించారు.ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి దాదాపు 2,360 మందికి ఉపాధి లేకుండా చేశారు. ఏపీఎండీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే దాదాపు 400 మంది ఉద్యోగులను, ఉద్యోగుల జీతాన్ని దళారులు దోచుకోకుండా కోతల్లేకుండా శాశ్వత ఉద్యోగులకు దక్కే అన్ని సౌకర్యాలు కల్పించిన ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ జగన్ పాలనలో 6.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలువైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు అండగా నిలిచారు. ఉద్యోగాల భర్తీ నుంచి, ఉపాధి కల్పన వరకు చక్కని ప్రణాళికతో పాలనను సాగించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఒకేసారి దాదాపు 1.36 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి సంక్షేమ పథకాలను ఇంటికే అందించారు.ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఐదేళ్లలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 48 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. ఏపీయస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ఎండ్ కార్డ్ వేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 33,82,242 మందికి ఉపాధి లభించింది. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులో పొందుపర్చడం జరిగింది. -
అయ్య బాబోయ్ ఇంటింటికీనా..!
అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..తర్వాత వాటిని గాలికొదలడంతో ఐదేళ్ల వ్యతిరేకతను ఏడాదిలోనే మూటగట్టుకున్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కదిలించినా కూటమి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క పల్లెకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏడాదిలో చేసిన ‘సుపరిపాలన’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఏం చేశామని చెప్పాలంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఓవైపు రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాం.. మరోవైపు పెన్షన్ మినహా అన్ని పథకాలకూ మంగళం పాడాం.. ‘అమ్మ ఒడి’ సగం కోతలు, సగం వాతలు తరహాలో ఇచ్చాం.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వెళితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లడం అంత మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.కబ్జాలు, ఆక్రమణలతో వణుకు జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అనుచరులు భూ ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. దీంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరకు వెళ్తే నిలదీసి కడిగిపారేస్తారన్న భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు తమ కార్యకర్తలు ఏం చేసినా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి విడిపించుకుంటున్నారు. బాధితులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ‘తమ్ముళ్లు’ దాడులు చేసినా బాధితులకు న్యాయం లేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ వార్డుల్లోకి వస్తే నిలదీసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.మహిళలు ‘బెల్టు’ తీస్తారు..! ఉమ్మడి జిల్లాలో 230 వైన్ షాపులుండగా.. 2,100 బెల్టుషాపులు ఉన్నాయి. ఈ క్రమంలో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో పేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. దీంతో మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. ఇలాంటి సమయంలో పల్లెలకు ఎమ్మెల్యేలు వెళితే ‘బెల్టు’ తీస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఉద్యోగులు నిజం తెలుసుకున్నారు.. ఉద్యోగులందరూ ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేశారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నాయి. బదిలీల్లో నాయకుల పాత్రపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సిఫార్సు లేఖలు, లంచాలతో తమకు కావాల్సిన వారిని దగ్గరకు చేర్చుకోవడంతో వేలాది మంది సామాన్య ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విభాగం బదిలీలోనూ అవినీతి అక్రమాలే. ఈ సమయంలో ఎమ్మెల్యేలకు అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆగ్రహంలో రైతన్నలుప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది వచ్చినా పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా రూపాయి అందించలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ‘ఎమ్మెల్యేలైతే మాకేంటి..ఊర్లోకి వస్తే చూస్తాం’ అంటూ మండిపడుతున్నారు. -
Gadapa Gadapaku Meeting: పార్టీ సమావేశానికి 56 మంది పరిశీలకులు డుమ్మా
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
-
జేసీ కాళ్లపై పడి క్షమాపణ చెప్పు.. లేకుంటే చంపేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వద్దకు వెళ్లిన వారందరినీ ‘రప్పా రప్పాలాడిస్తాం’ అంటూ బెదిరించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి.. ఆ మాటలను నిజం చేస్తూ తాడిపత్రిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారని తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లారు. పాతకోటకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త క్రిష్ణయ్య కూడా అందులో ఉన్నారు.జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడు సుబ్బుతో పాటు మరో ఆరుగురు సోమవారం పట్టపగలు క్రిష్ణయ్య జనరల్ స్టోర్పై దాడి చేశారు. ఆ సమయంలో క్రిష్ణయ్య స్టోర్లో లేకపోవడంతో.. అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు జగదీష్, శ్రీనాథ్లను బెదిరించారు. ‘వాడొచి్చ.. జేసీ ప్రభాకర్రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. లేకుంటే చంపేస్తాం’ అంటూ షాపులోని వస్తువులను, ఫ్రిజ్లను ధ్వంసం చేసి బయట పడేశారు. ఈ ఘటనపై బాధితులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్రెడ్డి.. క్రిష్ణయ్య జనరల్ స్టోర్ను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
ధాన్యం రైతుకు దగా.. రొక్కం లేదు.. దుఃఖమే!
సాక్షి, అమరావతి: పొలం పనుల సీజన్ మొదలైంది..! కూలీలతో కలసి కోలాహలంగా పంట చేలో తిరగాల్సిన రైతన్న.. కాడి, మేడి వదిలేసి కుమిలిపోతున్నాడు! విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి వాటికోసం పెట్టుబడి సాయం అందించి ఆదుకోవడం దేవుడెరుగు.. తన కష్టార్జితాన్ని సైతం ఈ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని రగిలిపోతున్నాడు! ధాన్యం రైతులకు 24 గంటల్లో చెల్లిస్తామన్న డబ్బులకు రెండు నెలలుగా దిక్కు లేకుండా పోయిందని.. దళారీల పాలు చేసి దగా చేసిందని ఆక్రోశిస్తున్నాడు! పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. దళారీలు, మిల్లర్లను అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను అడ్డంగా దోచేస్తోంది! నెలలు తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా.. ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా వేధిస్తోంది. ఇప్పటివరకు రబీలో రెండు లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు రూ.1,250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. రెండు నెలలకుపైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి ధాన్యాగారం లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఖరీఫ్ సాగుకు విత్తనాలు వేసుకునేందుకు డబ్బులు లేక దిక్కు తోచని పరిస్థితిలో కూరుకుపోయారు. రెండో ఏడాదీ అన్నదాతా సుఖీభవ ఇంతవరకు అందకపోవడంతో ‘సాగు కాడి’ని మోయలేకపోతున్నారు. ‘మద్దతు’.. ఓ మోసం!కేంద్ర ప్రభుత్వం 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1,725, ఏ–గ్రేడ్కు రూ.1,740 చొప్పున గిట్టుబాటు ధర నిర్ణయించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తేమ శాతం, ధాన్యం బాగా లేదనే సాకుతో రైతులను నిలువు దోపిడీకి గురి చేసింది. దీంతో ఒక్కో రైతు బస్తాకు రూ.300 – రూ.450కి పైగా నష్టపోయారు. టన్నుకు ఏకంగా రూ.6 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఇక ప్రభుత్వం చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా దళారులు, ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోయింది. దళారీ చెబితేనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దుస్థితి నెలకొంది. నేరుగా ధాన్యం సేకరించాలని అన్నదాతలు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే.. ఆ ధాన్యం ఇక కళ్లాల వద్ద, రాశుల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ ఇదే తీరు! ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం సెంటర్లో ఇటీవల అధికారులకు దండం పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్) రెండు నెలలుగా పడిగాపులు..ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. తాము ఘనంగా చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రచారం చేసుకున్నారు. కానీ రెండు నెలలుగా వేలాది మంది ధాన్యం రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు రేటే లేదు..నాణ్యమైన సన్న రకాలకు సైతం గిట్టుబాటు ధర కంటే తక్కువ పలకడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 75 కిలోల బస్తా రూ.2 వేలకుపైగా పలుకగా ఈసారి రూ.1,400 లోపే ఆగిపోవడం గమనార్హం. తెలంగాణలో సన్న రకాలకు రూ.500 బోనస్ ఇవ్వడంతో రైతులు అధికంగా సాగు చేశారు. ఫలితంగా ఏపీకి వచ్చి కొనేవారు తగ్గిపోయారు. పైగా ఎక్కడికక్కడ దళారులు, మిల్లర్లు తమ పరిధిలోకి వేరే ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా అడ్డుకుని స్థానిక రైతులను నిలువునా దోచేశారు. మరోవైపు కాకినాడలో ‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్ హడావుడితో బియ్యం వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా మార్కెట్లో పోటీ తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ‘కౌలు’కోలేని దెబ్బ..కౌలు రైతులను కూటమి సర్కార్ కోలుకోలేని దెబ్బతీసింది. కౌలు రైతు కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించుకోలేక నానా తిప్పలు పడ్డారు. దళారులు, మిల్లర్లు సిండికేట్గా మారడంతో నష్టానికి పంట అమ్ముకున్నారు. ఆరబెట్టినా, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నప్పటికీ అదనపు ఖర్చులు మినహా.. మంచి రేటు వస్తుందన్న నమ్మకం లేక పంటలను దళారీలకే అప్పగించేశారు.నాడు రైతన్న ఖాతాకు ‘జీఎల్టీ’ డబ్బులు..నేడు ట్రాన్స్పోర్ట్ టెండర్లకూ దిక్కులేదుధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు రవాణా, హమాలీలు, గోనె సంచులు సమకూర్చింది. రైతులే ఈ సదుపాయాలను సమకూర్చుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్టు (జీఎల్టీ) చార్జీలను వారి ఖాతాల్లో జమ చేసేది. ఇలా రైతులపై అదనపు భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మొత్తం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు దళారీలు ఇస్తేనే గోనె సంచులు వస్తాయి..! హమాలీలు లోడ్ చేస్తారు.. లారీ కదులుతుంది! ఇక జీఎల్టీ మొత్తం వాళ్లే తీసుకుంటున్నారు. ఒకవేళ రైతే ఇవన్నీ భరిస్తే రూపాయి కూడా వారి ఖాతాల్లో జమకావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎక్కడా ట్రాన్స్పోర్ట్ టెండర్లు పిలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్ జగన్ పాలన: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్ జగన్ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్ జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. -
బదిలీల పేరుతో ఉద్యోగులకు కూటమి సర్కార్ వేధింపులు: చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: బదిలీల పేరుతో కూటమి సర్కార్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలను సైతం కూటమి ఎమ్మెల్యేలు తమ అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న దారుణమైన పరిస్థితి ఏపీలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయికి పాలనను అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ, అందులోని సిబ్బంది సంఖ్యను కుట్రపూరితంగా తగ్గించివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఎవరు డబ్బులిస్తే వారికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వేగంగా బదిలీలు జరిగిపోతున్నాయి. అనధికారికంగా బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తప్పనిసరి చేస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు 95 శాతం బదిలీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగుల బదిలీల కోసం జీవోఎంస్ నెంబర్ 5 ని విడుదల చేశారు. వైయస్సార్సీపీ హయాంలో చివరి ఏడాది నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బదిలీల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు.సచివాలయ వ్యవస్థపై కక్షసాధింపువైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు మంచి పేరు రావడంతో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇప్పుడు సచివాలయాల్లో బదిలీల పేరుతో ఉద్యోగులను వేరే మండలాలకు బలవంతంగా పంపించి వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రూల్, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో పనిచేసేవారికి వేరే రూల్ వర్తింపజేస్తున్నారు. బదిలీల పేరుతో చిన్నస్థాయి ఉద్యోగులను డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రభుత్వమే ఉద్యోగుల చేత తప్పులు చేయించే కార్యక్రమానిక ఉసిగొల్పుతున్నట్టుంది.పనివేళల్లోనే బదిలీలు పూర్తిచేయాలిభర్త చనిపోయి వితంతువులుగా ఉన్న ఉద్యోగులకు, కేన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడేవారికి, స్పౌస్ కేస్ల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నా, వారి అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు. గ్రామ సచివాలయాల బదిలీలకు జూన్ 30తో గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 12 రోజుల కిందట డెలివరీ అయిన ఒక బాలింతరాలు, ఒక మహిళా ఉద్యోగిని కౌన్సిలింగ్ పేరుతో ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకూ కుర్చోబెట్టి వేధించడంతో ఆమె అస్వస్థతకు గురై ఇంటికెళుతూ మార్గమధ్యలో చనిపోయింది. ఆమె కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నిబంధనల ప్రకారమే ఆఫీసు వేళల్లోనే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలి. రాత్రింబవళ్లు తిప్పించుకుని వేధించడం ఆపాలి. -
ఈ - స్టాంపింగ్ కేసు లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు!
-
ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..!
ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధిష్టానం చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. గతం కన్నా మిన్నగా పాలన సాగిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు షాక్కు గురి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్వానపు పనితీరుతో ప్రజాప్రతినిధులు ఆదరణ కోల్పోయిన విషయం స్పష్టమైంది. సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రజాప్రతినిధులు ఏడాదికే ప్రజలకు బేజారయ్యారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏడాది పాలనలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఏ ప్రభుత్వానికైనా కనీసం మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ప్రజలు విసుగు చెందడం గమనార్హం. ఆ నలుగురిపైనే ఎక్కువగా.. జిల్లాలో సగం మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. పుట్టపర్తిలో పల్లె సింధూరరెడ్డి బదులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెత్తనం చెలాయిస్తుంటారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బదులు మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామిదే హవా సాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత బదులు ఆమె భర్త వెంకటేశ్వర్లు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎంపీగా పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించాల్సిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడ్రెస్ లేకున్నా.. అడగరా? సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు. ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా గుర్తించలేరని చెబుతుంటారు. అంతేకాకుండా తన పీఏలు హిందూపురం వ్యాప్తంగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎంకు బావమరిది కావడంతో ఆయన పనితీరుపై ఎలాంటి సర్వేలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అరాచకాలను అడ్డుకోరా? ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో అరాచకాలు వెలుగు చూశాయి. ఆమె పనితీరుపై ఎలాంటి సర్వే చేయకపోవడంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి రేగింది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగు చూసినా పరిటాల కుటుంబానికి అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని కూటమి నేతలు వాపోతున్నారు. కదిరిలో వన్మ్యాన్ షో కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వన్మ్యాన్ షో చేస్తున్నారు. కిందిస్థాయి నాయకులను ఎదగనీయకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులను దగ్గరకు కూడా రానీయడం లేదని వాపోతున్నారు. అయినా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఎలా వచ్చాయని నాయకులు ఆలోచనలో పడ్డారు. జిల్లా కేంద్రానికి రాని మంత్రి శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఓ మంత్రి రావడమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యవహారం నచ్చలేదా? లేక అధికారులు తనకు నచ్చిన వారు లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఫస్ట్ నీది చూసుకో.. బాబుకు టీడీపీ ఎమ్మెల్యేలు మాస్ కౌంటర్
-
రాష్ట్రాన్ని కకావికలం చేస్తున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా
-
తాడిపత్రిలో పోలీసు రాజ్యం
సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంతింటికి చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవడానికి బయలుదేరారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. కేతిరెడ్డి ఇంటిచుట్టూ వలయాకారంలో బారికేడ్లు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కేతిరెడ్డి ఇంటి పరిసరాల్లోకి సైతం ఎవరూ వెళ్లకుండా నిలువరించారు. బలవంతంగా తరలింపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ధరణి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆయనను బయటకు రావాలని కోరారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్తానని ఎన్నిసార్లు ఎస్పీకి విన్నవించుకున్నా ఏదో ఒక సాకు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎవడు పడితే వాడితో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వం అంటూ కారుకూతలు కూయిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? చేతనైతే పోలీసులు లేకుండా వాడు (జేసీ ప్రభాకర్రెడ్డి), అతడి కార్యకర్తలు నన్ను ఆపమనండి’ అంటూ సవాల్ విసిరారు. ఏఎస్పీతో మాట్లాడాలని సీఐ సాయిప్రసాద్ సూచించడంతో ఆయనతో మాట్లాడేందుకు పెద్దారెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆయనను కార్యకర్తల తోపులాట మధ్య బలవంతంగా పోలీస్ జీపులో అనంతపురం తరలించారు. జేసీ ప్రభాకర్ ఓవరాక్షన్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారన్న సమాచారంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఓవరాక్షన్ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో ఇంటికి పిలిపించుకున్నారు. ట్రాక్టర్లలో రాళ్లను తీసుకొచ్చి.. రాళ్ల దాడి చేసేందుకు కేతిరెడ్డి ఇంటివైపు బయలుదేరారు. వారిని సీఐ శివగంగాధర్రెడ్డి, సిబ్బంది జేసీ ఇంటివద్దే నిలువరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారన్న సమాచారంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కోర్టు ఉత్తర్వులిచ్చినా.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. రాళ్ల దాడులకు దిగారు. పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. స్వయానా హైకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయినా అనంతపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం పేరుతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వడంలేదు.ఏదో సాకుతో వాయిదా వేస్తూనే ఉన్నారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి విసిగిపోయారు. పదే పదే ఎస్పీకి లేఖలు రాసినా స్పందించలేదు. పోలీసులు తనకు రక్షణ కల్పించే విషయంలో సహకరించబోరన్న విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. మాజీ ఎమ్మెల్యేకు జిల్లా పోలీసులు రక్షణ కల్పించలేక ఆయన్ను బలవంతంగా అనంతపురం తీసుకురావడం విమర్శలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేక జిల్లా ఎస్పీ సైతం తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ‘రప్పా.. రప్పాలాడిస్తాం’ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’అని జేసీ అన్నారు. -
వారసులకు చేయూతనిస్తా
సాక్షి, అమరావతి: టీడీపీలోనే వారసత్వం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. వారసులకు చేయూతనిస్తామని, దాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వారసులైనా పని చేస్తేనే పదవులు వస్తాయని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు గురించి చాలా రకాలుగా సర్వేలు చేయిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలతో నేతలు ఎలా వ్యవహరిస్తారనేది ముఖ్యమని చెప్పారు.ఏడాది ముందు ఎన్నికల కోసం పని చేస్తే ప్రజలు నమ్మరని, మొదటి నుంచే పొరపాట్లు సరిదిద్దుకుని, పాలనలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని, తప్పులుంటే చెప్పి సరిచేసుకోవడానికి సమయం ఇస్తానని, మారకపోతే వారినే మార్చేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పు చేసినా పక్కనపెడతానని చెప్పారు. డబ్బులుంటే గెలుస్తామని భావించవద్దని సూచించారు. వైకుఠపాళి అభివృద్ధి వద్దని, సుస్థిర ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. 2004, 2019లో టీడీపీ మళ్లీ గెలిచి ఉంటే రాష్ట్ర రూపురేఖలు మారేవని చెప్పారు. జూలై 2 నుంచి ఇంటింటికీ కార్యక్రమం వచ్చే నెల 2 నుంచి అందరూ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటి ప్రచారం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు డబ్బు ఇచ్చామని పేర్కొన్నారు. వచ్చేనెల కేంద్రం పీఎం కిసాన్ ఇస్తుందని, అదే రోజున రాష్ట్రం తరఫున అన్నదాత సుఖీభవ పథకం డబ్బులూ ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. 2029లో గెలుపే తన ప్రణాళికని, ఆ దిశగా పని చేస్తున్నానని చెప్పారు.ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం విందు ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదివారం తన నివాసంలో డిన్నర్ ఇచ్చారు. అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్షాప్లో పాల్గొనేందుకు వీరు విచ్చేశారు. హాజరైన ప్రముఖుల్లో టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ తదితరులు ఉన్నారు. -
దమ్ మారో దమ్.. కోరలు చాపిన గంజాయి మాఫియా
రాష్ట్రంలో ఊరూరా.. వీధి వీధినా.. బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, అది చాలదు.. అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తోంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిలిలో బంధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య, స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోళ్లుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ స్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపైకి విడిచి పెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ గుప్పుమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్ మారో దమ్.. గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్కు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరసి ఆ ముఠా, రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్గా.. యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్చగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి, గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్వర్క్ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది.తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచి పెట్టిన మాఫియా.. గత ఏడాది అల్లూరు సీతారామరాజు(ఏఎస్ఆర్) జిల్లాలో దర్జాగా అడుగు పెట్టింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఊరూ వాడా రిటైల్ విక్రయాలతోపాటు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు హోల్సేల్గా భారీగా స్మగ్లింగ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.25 వేల కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా రూ.17 వేల కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున రూ.2 వేల కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది. ఏవోబీలో తలుపులు బార్లా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా మార్చేసింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99 శాతం తగ్గిపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది. ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి.. ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది.జవసత్వాలు లేని ఈగల్⇒ గంజాయి, డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెబ్ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్కు పూర్తి స్థాయి చీఫ్గా నిబద్దుడైన వినీత్ బ్రిజ్లాల్ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ అంతగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలిచ్చిన సెబ్ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.⇒ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనే లేదు. ఈగల్ చీఫ్గా ఆకే రవి కృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్బుక్ కుట్రలకు పావుగా వాడుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ⇒ ఈగల్ చీఫ్గా ఉన్న ఆయన్ను కాకికాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంటూ నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం సిట్ ఇన్చార్జ్గా నియమించింది. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట తిరుపతికి చెందిన మదన్ అనే కానిస్టేబుల్పై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్ మదన్ ఫిర్యాదుపై విచారణ అధికారిగా కూడా ఆకే రవి కృష్ణనే ప్రభుత్వం నియమించడం గమనార్హం. ⇒ అంటే ఆయనపై ఇతరత్రా పని భారాన్ని పెంచడం ద్వారా గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై దృష్టి సారించకుండా అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఇప్పటికే గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సమాచారం.డీ అడిక్షన్ కేంద్రాలకు గ్రహణంగంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డీ అడిక్షన్ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్ కేంద్రాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటయించగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం అరకొరగానే నిధులు విదిల్చడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలకు 2021–22లో రూ.3.12 కోట్లు, 2022–23లో రూ.3.99 కోట్లు, 2023–24లో రూ.6.33 కోట్లు చొప్పున వెచ్చించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో కేవలం రూ.1.10 కోట్లే కేటాయించడం గమనార్హం. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.మూడు రూట్లు.. ఆరు లారీలు...టీడీపీ మాఫియా తమ ఏజెంట్లను అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోకి పంపించింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిని ఎంపిక చేసుకుని మరీ ఏజెన్సీ ప్రాంతంలో తిష్టవేసేట్టు చేసింది. వారికి ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలను టీడీపీ నేతలే సమకూర్చారు. ఆ ఏజంట్లు ఏఎస్ఆర్ జిల్లాతోపాటు సరిహద్దులకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లోని గంజాయి సాగు చేసేవారితో సంప్రదింపులు జరుపుతూ భారీగా గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని యావత్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, కర్ణాటకలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై తెలంగాణ, కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా ఏఎస్ఆర్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి భారీగా అక్రమ రవాణా చేస్తున్న మూడు ప్రధాన మార్గాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలే లక్ష్యంగా పచ్చ నెట్వర్క్అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమ రవాణానే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా రంగంలోకి దిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని టీడీపీ ద్వీతీయ శ్రేణి నేతలతో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలనే గంజాయి విక్రయ మార్కెట్గా చేసుకున్నారు. అందుకోసం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా వెండర్లను సైతం ఎంపిక చేసుకున్నారు. పాన్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకులు.. ఇలా పలువురిని తమ నెట్వర్క్లో భాగస్వాములుగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి విక్రేతలను స్థానిక పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తుండటం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి వరకు ప్రతి చోటా గంజాయి ప్యాకెట్లను చాకెట్ల మాదిరిగా విక్రయిస్తుండటం విస్మయ పరుస్తోంది.టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులురాష్ట్రంలో టీడీపీ గంజాయి మాఫియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు బరితెగిస్తోంది. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావడం విస్మయ పరుస్తోంది. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం లేని ఆరుగురు యువకులను అక్రమ కేసులో ఇరికించడం ద్వారా టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసుల పన్నాగం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీఐ, బొమ్మూరు ఎస్సై మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తద్వారా టీడీపీ గంజాయి బ్యాచ్ను కాపాడేందుకే పోలీసులు ఇంతగా బరితెగిస్తున్నారన్నది స్పష్టమైంది.టీడీపీ గంజాయి మాఫియాలో చిన్న మొక్కలివి..⇒ రాయదుర్గంలో ఓ టీడీపీ నేత తన మామిడి తోటలోనే దర్జాగా గంజాయి సాగు చేశారు.⇒ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలైంది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు.⇒ మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో మిత్ అనే పేరుతో చలామణి అయ్యే రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.⇒ మొక్కల లోడ్ ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు. ⇒ సూళ్లూరుపేటలో రూ.3.50 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. -
టీడీపీ నేతలు రాక్షసత్వంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్
-
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
చెత్త లోనూ కమీషన్ల కంపు
-
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి,గుంతకల్లు: ‘ఎవరేమనుకున్నా..నాకేంటి! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంతకల్లులోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్ యూనిట్, బూత్ కార్యకర్తల సమావేశంతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ రోజు గుత్తిలో నిర్వహించిన సమావేశంలో అన్న మాటలు (వైఎస్సార్సీపీ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా టీడీపీలో చేరితే సరి.. లేదంటే తోకలు కత్తిరించి సున్నం అంటిస్తాం) రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా గుంతకల్లు వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. నేనేమన్నా దౌర్జన్యాలు చేస్తానని చెప్పలేదే! ఉన్న మాట అంటే ఉలుకు అన్న చందంగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు. సరే.. వారు, ఎవరేమనుకున్నా నాకేంటి?! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అని వ్యాఖ్యానించారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు టీడీపీ నేతల అడ్డంకులు
-
మంగళగిరిలో కొకైన్ ఎలా దొరికింది?
సాక్షి, అమరావతి: ‘నగరాల్లో డ్రగ్స్ మాఫియా విక్రయించే కొకైన్ మంగళగిరిలాంటి పట్టణంలో ఎలా దొరికింది? దీని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు?’ అని కూటమి ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్కుమార్ నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని... గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీ–అడిక్షన్ సెంటర్ కూడా లేదని, సీఎం నియోజకవర్గం కుప్పంలో గంజాయి మత్తులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. రాయదుర్గం టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. లిక్కర్ స్కామ్ అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో గంజాయి దందా జరుగుతుంటే ఏం చేస్తోందని ప్రశి్నంచారు. కూటమి సర్కారు వచ్చాక నెలకు రూ.2 వేల కోట్ల గంజాయి వ్యాపారం జరిగిందని దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలోని కొన్ని కలుపు మొక్కల కారణంగా డ్రగ్స్, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో తాడేపల్లి ప్రేమ్ కుమార్, దాసరి సురేష్ కుమార్ (ఎస్సీ), లంకా పవన్, పట్నాల చిన్న సత్యనారాయణ (బీసీ), దారపు దుర్గ, తమ్మకట్ల అశోక్ కుమార్ ను గంజాయి అక్రమ కేసులో ఇరికించారని, బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి, రాజానగరం సీఐ సుభాష్ మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోందని విజయ్కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచి్చన వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం.. అమాయకులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. కొత్త కొత్త దారుల్లో గంజాయి సరఫరా అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కట్టడికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో తెస్తే.. ఈ సర్కారు ఈగల్ ను తీసుకొచి్చందని, ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఈవెంట్లు, స్టేట్ మెంట్లకే పరిమితవుతోంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. గంజాయి మాఫియా కమీషన్ల కోసమే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కమీషన్లలో 30 శాతం పోలీసులకు.. మిగిలింది అధికారంలో ఉన్నవారికి వెళ్తోందన్నారు. గంజాయి స్మగ్లింగ్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందని పేర్నొన్నారు. పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచి్చన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాలను పటిష్ఠంగా నిర్వహించాలని విజయ్కుమార్ డిమాండ్ చేశారు. యువత కోసం, వారి భవిష్యత్తు నిరీ్వర్యం కాకుండా పోరాటం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచి యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తామని తేలి్చచెప్పారు. -
అహోబిలం క్షేత్రంలోనూ ‘బి’ ట్యాక్స్
సాక్షి టాస్క్ ఫోర్స్ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన ప్రసిద్ధ క్షేత్రంలో గ్రామ పంచాయతీ ప్రధాన ఆదాయ వనరు అయిన టోల్గేట్ వేలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్రామ్ జోక్యం మితిమీరింది. దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోగా.. భూమా ట్యాక్స్ (‘బి’ ట్యాక్స్) భారీగా పెరిగింది. పంచాయతీకి, అహోబిలం క్షేత్ర అభివృద్ధికి చేరాల్సిన ఆదాయం అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి చేరుతోందనే చర్చ జరుగుతోంది. డీఎల్పీఓ రాంబాబు అధ్యక్షతన అహోబిలం టోల్గేట్ (అహోబిలం క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల నుంచి రుసుము వసూలుకు) శనివారం వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొనేందుకు ఇతరులెవరూ రాకుండా చక్రం తిప్పిన టీడీపీ నేత రూ.20.31 లక్షలకే దక్కించుకున్నారు. రూ.కోటి వస్తుందనుకుంటే.. వేలం సమయంలో పాటదారులంతా ఎంత రింగ్ అయినా టీడీపీలోని మూడు వర్గాలతో పాటు వైఎస్సార్సీపీ వర్గీయులు పోటాపోటీగా పాడుతారనే చర్చ జరిగింది. గత ఏడాది ‘బి’ ట్యాక్స్ రూ.40 లక్షలు, అధికారులకు రూ.10 లక్షలు, పంచాయతీకి రూ.19.30 లక్షలు చెల్లించినా రూ.కోటి వరకు కాంట్రాక్టర్కు మిగిలిందని అంచనా. దీంతో ఈ ఏడాది టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా ఏర్పడి వేలంలో పాల్గొనేందుకు పోటీపడ్డారు. ఇది చూసిన గ్రామస్తులు ఈ ఏడాది రూ.కోటి వరకు ఆదాయం వస్తుందని భావించారు. అయితే వేలంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు, అక్కడి అధికారులకు ఫోన్లు రావడంతో ‘అన్న ఎంత చెబితే అంతే’ అని నిమిషాల్లో వేలం ముగించారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. దశాబ్దాలుగా అహోబిలం టోల్గేట్ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారంతా వేలంలో బహిరంగంగా పాల్గొనడం ఆనవాయితీ. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించిన వేలంలో సుమారు రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఏటా వచ్చే ఆదాయం కంటే కనీసం 20 శాతం అదనంగా పెంచి పాట పెట్టడం ఆనవాయితీ. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.40 లక్షలు ఉన్న వేలం పాటను రూ.19 లక్షల పైగా తగ్గించి.. అధికారులు టీడీపీ నాయకులకు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాదైనా ఆదాయం పెరుగుతుందనుకుంటే రూ.లక్ష పెంచి మమ అనిపించారు. ‘బి’ ట్యాక్స్ రూ.60 లక్షలకు పైనే! పంచాయతీకి వచ్చే ఆదాయం ఎంత వీలైతే అంత తగ్గించాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో రూ.20 లక్షలతో మొదలు పెట్టి రూ.21 లక్షలకు వేలం ముగించారు. ఇందుకు వేలంలో పెద్దఎత్తున పాటదారులు పాల్గొంటున్నట్టు షో చేసి మొత్తం మీద గత ఏడాది కంటే రూ.లక్ష వరకు పెంచి మమ అనిపించారు. కాగా.. వేలంలో పాల్గొన్న మూడు గ్రూపులకు చెందిన నాయకులను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకుని ‘ఇప్పుడు చెప్పండి. ఎవరు ఎంతిస్తారో’ అని ఇంటివద్దే వేలం పెట్టడంతో ‘బి’ ట్యాక్స్ కింద రూ.62 లక్షలు ఇచ్చేందుకు ఓ వర్గం ఒప్పందం చేసుకోగా.. మరో వర్గం ఒక రోజు అవకాశం ఇస్తే ఆలోచించుకుని అంతకంటే ఎక్కువే ఇస్తామని చెప్పుకుని ఇంటికి వచి్చనట్టు సమాచారం. కాగా.. ఇదంతా సంబంధిత అధికారులతో పాటు పోలీసులకు అందరికీ తెలిసినా చేష్టలుడిగి చూడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయం రాకుండా అడ్డుకున్నారు గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా అధికారుల సాక్షిగా అడ్డుకున్నారు. అధికార పార్టీ కి చెందిన వారిని 15 మందిని వేలం కేంద్రానికి పంపించారు. వేరే వారిని ఇద్దరినే లోపలకు పంపించారు. వేలంలో పోటాపోటీగా పాల్గొనేందుకు వచ్చిన వారిని మాత్రం లోనికి అనుమతించకుండా వెనక్కి పంపడం ఎంతవరకు సబబు. ఈ ఏడాదిలో జరిగిన రెండు వేలం పాటల్లో సుమారు రూ.80 లక్షలు పంచాయతీకి చెందిన ఆదాయాన్ని దోచుకోవడం జరిగింది. సంబంధిత అధికారులు, పోలీసులు ఆలోచించాలి. – గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ -
సింగిల్గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న -
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నారా లోకేష్ కి బిగ్ షాక్.. రెడ్ బుక్ పై కూటమిలో వ్యతిరేకత
-
‘రప్పా రప్పా శ్రీకాంత్’కు రిమాండ్
సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న టీడీపీ సానుభూతిపరుడు బొల్లెద్దు రవితేజ వైఎస్సార్సీపీ అభిమానిగా మారి రప్పా రప్పా అంటూ ఓ పోస్టర్ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4గా ఉన్న ప్రకాశం జిల్లా మిన్నెకల్లుకు చెందిన ఆరేటి వెంకట మల్లికార్జునరావు అలియాస్ మల్లిఖార్జున్ అలియాస్ మల్లి సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో నివసిస్తున్నాడు. మల్లిని పట్టణ పోలీసులు ఈ నెల 23న కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏ–3గా ఉన్న సత్తెనపల్లి రాజులకాలనీకి చెందిన నాగ శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం సత్తెనపల్లి మొదటి అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4 ఆరేటి వెంకటమల్లిఖార్జునరావుల బెయిల్కు దరఖాస్తు చేయగా న్యాయమూర్తి బెయిల్ తిరస్కరించి న్యాయవాది సమక్షంలో విచారణకు కస్టడికి ఇచ్చారు. -
కూటమి నేతల వర్గ విభేదాలతో కేజీబీవీ ప్రిన్సిపాల్కు గుండెపోటు
(అనకాపల్లి జిల్లా)బుచ్చెయ్యపేట: కూటమి నేతల పంతాలు, పట్టింపులు అధికారుల ప్రాణం మీదకు తెస్తున్నాయి. ఎమ్మెల్యే తన వర్గీయులకు సీటు ఇవ్వలేదని ప్రిన్సిపాల్ను తన కార్యాలయానికి పిలిపించి బెదిరించగా.. ప్రిన్సిపాల్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో శుక్రవారం జరిగింది. బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు వర్గం, రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు(టీడీపీ నేత) వర్గం పోటీ పడ్డాయి. ఇరువర్గీయులు ప్రిన్సిపాల్ కె.అన్నపూర్ణపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే చివరికి ప్రిన్సిపాల్ తాతయ్యబాబు వర్గం సూచించిన బాలికకు సీటు కేటాయించారు. తమ మాట చెల్లకపోవడంతో ఎమ్మెల్యే రాజు వర్గీయుడు గురువారం కేజీబీవీకి వెళ్లి ప్రిన్సిపాల్ను బెదిరించాడు. ‘ఎమ్మెల్యే చెప్పిన వారికి సీటు ఇవ్వవా.. నీవు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాం. స్కూల్ గేటు ఎలా దాటతావో చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే కార్యాలయానికి రప్పించారు. ‘ఎవరి ప్రోద్బలంతో ఆ సీటును కేటాయించారు? ఎమ్మెల్యే అంటే లెక్కలేదా’ అంటూ ఎమ్మెల్యేతో సహా కూటమి నాయకులు బెదిరించడంతో ఆమె ప్రాణభయంతో గుండెపోటు, ఫిట్స్తో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ భర్త కామేశ్వరరావు ఆస్పత్రికి చేరుకుని కూటమి నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు
కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్బుక్ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో డ్రగ్స్ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఎక్కువమంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
సిండి‘కేటు’ కాంట్రాక్టర్లుకు దాసోహం!
సాక్షి, అమరావతి: అస్మదీయ కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో పనులు కట్టబెట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వతేదీన బిడ్ కెపాసిటీని 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా శుక్రవారం మరోసారి పెంచేసింది. ఇప్పటివరకూ ఐదేళ్ల పరిధిలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన సివిల్ పనుల విలువను ‘ఏ’గా పరిగణించగా ఇప్పుడు పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన సివిల్ పనుల విలువను ‘ఏ’గా లెక్కించేలా బిడ్ కెపాసిటీ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు (జీఎం ఎంఎస్ నెం 37) జారీ చేసింది. సన్నిహిత కాంట్రాక్టర్లతో ముఖ్యనేత ఏర్పాటు చేసిన సిండి‘కేటు’ సంస్థలకు పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతోపాటు– రాజధాని, తాగునీటి పథకాలు తదితరాలలో రూ.వేల కోట్ల విలువైన పనులు కట్టబెట్టేందుకే బిడ్ కెపాసిటీని మళ్లీ పెంచారని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. సిండికేటు కాంట్రాక్టర్ల చేతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఉన్నాయని.. మళ్లీ కొత్తగా భారీ మొత్తంలో అప్పగించే పనులు గడువులోగా పూర్తి చేయకుంటే అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నిహిత కాంట్రాక్టర్లకు అప్పగించేందుకే..రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల కింద చేపట్టే సివిల్ పనులకు 2003 జూలై 1న జలవనరుల శాఖ జారీ చేసిన జీవో 94 ఆధారంగా టెండర్లు పిలుస్తోంది. ఆ జీవో ప్రకారం టెండర్లో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత 2 ఏఎన్–బీగా నిర్ణయించారు. ఇందులో ఏ– అంటే ఐదేళ్ల పరిధిలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల మొత్తం! ఎన్– అంటే కొత్తగా టెండర్ పిలిచిన పనిని పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు (సంవత్సరాలు). బీ– అంటే ఆ కాంట్రాక్టర్ చేతిలో ఉన్న మిగిలిన పనుల విలువ. కోవిడ్–19 మహమ్మారి ప్రబలిన సమయంలో గత ఐదేళ్లలో పనులు జరగలేదనే సాకుతో అడిగినంత కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో పనులు అప్పగించేందుకు బిడ్ కెపాసిటీని 2ఏఎన్–బీ నుంచి 3ఏఎన్–బీకి ఇప్పటికే ప్రభుత్వం పెంచేసింది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి.. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కు పనులు కట్టబెడుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించి.. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి 8 శాతం తొలి విడత కమీషన్గా వసూలు చేసుకుంటున్నారు. తాజాగా బిడ్ కెపాసిటీని మరోసారి పెంచి పదేళ్ల వ్యవధిలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల విలువను పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించారు. సన్నిహిత కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో పనులు అప్పగించడానికే బిడ్ కెపాసిటీని మరోసారి సవరించినట్లు స్పష్టమవుతోంది. -
బాబు బురిడీ ‘రీకాలింగ్’
సాక్షి నెట్వర్క్: ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి, అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ...) కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన మేరకు తొలి దశలో జిల్లా స్థాయిల్లో ఏర్పాటుచేసిన సమావేశాలకు విశేష స్పందన లభించింది. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమం పోస్టర్లను, క్యూఆర్ కోడ్లను నాయకులు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి, చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం సాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐదు వారాలపాటు జరిగే ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని గ్రామ, గ్రామాన విజయంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబుతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: సజ్జల రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం, ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దుర్మార్గం, మోసాలు, అన్యాయాలు, దౌర్జన్యాలతో రికార్డు సాధించారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏడాది పాలనను గిన్నిస్బుక్ రికార్డుల్లో ఎక్కించవచ్చన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు పెడితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ అనుకూల సర్వే సంస్థలే చెబుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు బాండ్లు చూపించి ఏం చేశారో అడుగుతాం: బొత్స ‘ఇదిగో చంద్రబాబు మేనిఫెస్టో. ఇవిగో ఆయనిచ్చిన బాండ్లు అని ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అడుగుతాం. చంద్రబాబు టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు.’ అని శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ చెప్పారు. కాకినాడలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం క్యూఆర్ కోడ్ను బొత్స, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విడుదల చేశారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఐదు వారాలపాటు నిర్వహించనున్న ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్ కంతేరులో బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు: పెద్దిరెడ్డి‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎన్ని అబద్ధపు హామీలైనా గుప్పిస్తారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడానికి సైతం వెనకాడరు.’ అని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా ఇస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న ప్రజాద్రోహి అని మండిపడ్డారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత చంద్రబాబు, పవన్కళ్యాణ్ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లైవ్ లో అనిత వీడియో వేసి ఏకిపారేసిన తాటిపర్తి చంద్రశేఖర్
-
విశాఖ భీమిలిలో కూటమి నాయకుల మధ్య వివాదం
-
క్యూఆర్ స్కాన్ ద్వారా బాబు మోసాలు బయటపెడతాం: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని.. హమీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రిజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీతా, దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.బొత్స మాట్లాడుతూ.. ‘‘నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ఉద్యమిస్తాం. ఇదిగో చంద్రబాబు.. ఇదిగో పవన్ అంటూ మీ మ్యానిఫెస్టో.. బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం, తోకలు కట్ చేస్తాం అంటున్నారు...అక్రమ కేసులు పెట్టి.. చట్టాన్ని చేతిలో తీసుకుంటే వైఎస్సార్సీపీ పని అయిపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం ఎంత డ్రామా ఆడింది. సింగయ్య ప్రమాదంపై ఒక ఎస్సీ రెండు సార్లు మాట్లాడటం రాజకీయాల్లో ఎప్పుడైనా చూశామా?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కురసాల కన్నబాబుమాట్లాడుతూ.. వైఎస్ జగన్ను ఓడించండం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టాడు. అందమైన అబద్దాలను హమీలుగా ఇచ్చాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధమే గెలిచింది. ప్రజలు.. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అందుకే "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" పేరుతో వైఎస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్తుంది...క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మ్యానిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మ్యానిఫెస్టో వస్తుంది. మొట్టమెదటి సారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకుడు వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముక వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హమీలు ఇచ్చాయి. 50 ఏళ్లు నిండినా ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానని.. నోటికొచ్చిన హమీలను చంద్రబాబు ఇచ్చారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేశాడు’’అని కన్నబాబు మండిపడ్డారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముక వ్యూహం హమీ అమలు చేయాలి. కుమారస్వామీ పేరు మీద విడుదల చేసిన మేనిఫెస్టోలో హమీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు. వైఎస్ జగన్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఖాజనా ఎప్పుడు నిండుగా ఉండేది. కాలర్ పట్టుకుని హమీలు అమలు చేయమని అడుగుతాం. చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ -
శానిటేషన్ టెండర్లలో రా'బంధువు'
సాధారణంగా ఎక్కడైనా టెండర్లు పిలుస్తున్నారంటే ప్రజాప్రయోజనాలు, నాణ్యమైన సేవల కల్పనకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తారు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో అలా కాదు. ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యం. ప్రతి కాంట్రాక్టును బంధువులు, అస్మదీయులకు కట్టబెట్టి తద్వారా కోట్లాది రూపాయలు దండుకోవాలన్నదే వ్యూహం. ఇందుకు తగ్గట్లుగానే టెండరు నిబంధనలూ రూపొందుతాయి. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్టు ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ విషయంలో సీఎం బంధువు చెప్పిందే రూల్ అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ (ఏపీ వైద్య విధాన పరిషత్), బోధనాస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణకు కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక కోసం గత నెలలో వైద్యశాఖ టెండర్లు పిలిచింది. ఈ టెండరు నిబంధనల్లో 2019–20 నుంచి 2023–24 మధ్య సేవలు అందించిన అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్నే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలు పెట్టడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం పిలిచిన టెండర్లలో 2024–25 అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని, అలా తీసుకుంటే వచ్చే నష్టం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. – సాక్షి, అమరావతిససేమిరా అంటున్న ప్రభుత్వం..ఇందుకు సంబంధించి గతనెల 22న ఏపీఎంఎస్ఐడీసీ శానిటేషన్ టెండర్లను ఆహ్వానించింది. ప్రీ బిడ్ మీటింగ్లో 2024–25 అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్ను పరిగణనలోకి తీసుకోవాలని చాలా సంస్థలు కోరాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం కుదరదని తేల్చేసింది. సాధారణంగా టెండరు ఆహ్వానించిన సమయానికి ముందు మూడు, నాలుగు, ఐదేళ్ల అనుభవం.. ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే అంశాన్ని ప్రీ బిడ్ మీటింగ్లో కొందరు కాంట్రాక్టర్లు ప్రస్తావించారు. మరోవైపు.. శానిటేషన్ టెండర్లు పిలవడానికి రెండ్రోజుల ముందు వైద్య కళాశాలల్లో యూజీ, పీజీ సీట్ల పెంపు కోసం ఎక్విప్మెంట్ కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండరు నిబంధనల్లో గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వార్షిక టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుంటామని నిబంధన పెట్టారు. అనంతరం పిలిచిన చిన్నచిన్న టెండర్లలోనూ అదే నిబంధనను కొనసాగించారు. సీఎం బంధువుకు నష్టం జరుగుతుందనే..ఆస్పత్రుల నిర్వహణలో అత్యంత కీలకమైన, రూ. వందల కోట్లు విలువచేసే శానిటేషన్ టెండర్లలో మాత్రం సీఎం బంధువు సంస్థకు నష్టం జరుగుతుందనే 2024–25 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదని సమాచారం. 2019–20 నుంచి 2023–24 మధ్య అత్యధిక టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుని పనులను అవార్డు చేసేలా ప్రస్తుత టెండరు నిబంధన ఉంది. 2024–25లో సీఎం బంధువు సంస్థకు పెద్ద టర్నోవర్ లేదని సమాచారం. ఈ క్రమంలో టెండర్లు పిలిచిన నాటికి ఐదేళ్ల ముందు అనుభవం, టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుంటే సదరు సంస్థకు పనులు దక్కవని, అసలు పోటీలోనే లేకుండాపోతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిబంధనల్లో మెలికపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు.. 2019–24 మధ్య టెండర్లలో పాల్గొన్న సంస్థలపై బ్లాక్ లిస్టింగ్/పోలీస్ కేసులు ఉండకూడదని నిబంధన ఉంచారు. ఈ నిబంధన ప్రకారం 2024–25లో బ్లాక్ లిస్టింగ్/పోలీస్ కేసులున్న సంస్థలు టెండర్లలో పాల్గొనడానికి వీలుంది. ఇప్పటికే సెక్యూరిటీ టెండర్ల మార్గదర్శకాల్లో ఏపీఎంఎస్ఐడీసీ చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని అర్హతలేని సంస్థలు రాజకీయ పలుకుబడితో కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. శానిటేషన్ టెండర్లలోనూ అలా జరిగేందుకు అధికారులే అవకాశాలిస్తున్నట్లు కనిపిస్తోంది.చివరి దశలో టెండర్ల రద్దు..వాస్తవానికి.. కొద్దినెలల క్రితమే శానిటేషన్ నిర్వహణ టెండర్లను పిలిచారు. ఆ సమయంలో సీఎం బంధువు సంస్థ తప్పులతడకగా బిడ్ దాఖలు చేసింది. దీంతో పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. ఈ సంస్థకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పనులు అవార్డుచేసే సమయంలో మొత్తం టెండర్లనే ప్రభుత్వం రద్దుచేసేసింది. అప్పట్లో కోర్టు కేసులు, ఎల్1గా నిలిచిన సంస్థలపై ఫిర్యాదులను సాకుగా చూపినట్లు ఆరోపణలున్నాయి. ఇక 2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్యశాఖల్లో పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లింగ్ చేసేశారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఈ సంస్థ అడ్రస్ లేకుండాపోయింది. గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ తెరపైకి వచ్చింది. -
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కారు రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేయించి 9.30 శాతం వడ్డీకి రూ.5,526 కోట్లు అప్పు చేసిందని ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థి క క్రమశిక్షణ లేకపోవడం, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇదే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందన్నారు. ఈమేరకు ‘ఎక్స్’లో కేంద్ర ఆర్థి క శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ గురువారం తన ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి.. రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇది మరో తార్కాణం. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీఎండీసీ రెండో దశలో 9.30 శాతం వడ్డీతో రూ.5,526 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పు రూ.9 వేల కోట్లకు చేరుకుంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ రెండో దఫా అప్పులు చేశారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి.. ఆర్బీఐలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేటు వ్యక్తులకు కల్పించింది. ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293(1) ఆరి్టకల్స్ను ఉల్లంఘించడమే. అంతేకాదు.. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు కనీవినీ ఎరుగని విధంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టింది.అది కూడా కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం! రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై అజమాయిషీ కల్పించి.. అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టడానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు... ఎస్డీఎల్ (రాష్ట్ర అభివృద్ధి రుణాలు) కంటే మరింత సురక్షితమైనవని ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ 9.30 శాతం వడ్డీకి ఏపీఎండీసీ ఎన్సీడీ బాండ్లు జారీ చేసింది.ఇది ప్రస్తుతం ఎస్డీఎల్ వడ్డీ రేటు కంటే 2.60 శాతం ఎక్కువ. అధిక వడ్డీ రేటు కారణంగా ఏపీఎండీసీపై ఏడాదికి అదనంగా రూ.235 కోట్ల భారం పడుతుంది. ఎన్సీడీ బాండ్ల వ్యవధి పదేళ్లు. అంటే.. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చెప్పగలరా చంద్రబాబూ? ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ రుణాలు.. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన రుణంలో 50 శాతాన్ని దాటిపోయాయి’ -
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు
వైఎస్సార్ జిల్లా: జిల్లాలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. బద్వేల్ మండలం బయనపల్లిలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నిస్తున్నారు. రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు ల్యాండ్లో ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ.. ఆ ఇంటిని కూలగొట్టేందుకు రాత్రి సమయంలో అధికారులు రావడంతో ఇది సరైన చర్య కాదని వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటీసు ఇవ్వకుండా ఇల్లును ఎలా కూలుస్తారంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. -
చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తాం: గుడివాడ అమర్నాథ్
-
ఇది ఎమ్మెల్యే గారి అసలు కథ.. బయటపెట్టిన తలారి రంగయ్య
-
సంబంధం లేకుండానే కలిసి మెలిసి తిరిగారా?: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: బ్యాంక్ రుణాల కోసం ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.తన అనుచరుడిని దళారిగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే, ఫోర్జరీతో వందల కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే, తన దళారి ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ప్రెస్మీట్లో మాజీ ఎంపీ ఇంకా ఏం మాట్లాడారంటే..:‘మీసేవ’ నిర్వాహకుడికి అది సాధ్యమా?:కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ–స్టాంప్ డ్యూటీ కుంభకోణం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు తన కన్సట్రక్షన్ కంపెనీకి బ్యాంక్ రుణాలు పొందేందుకు, తన అనుచరుడిని దళారిగా మార్చి ఈ స్కామ్ చేశారు. గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ స్టాంప్ల స్కామ్లో, రాష్ట్రంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి ప్రమేయం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్ వెలుగు చూసింది.ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దాన్ని ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. నిజానికి ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’. ఎమ్మెల్యే అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?ఎమ్మెల్యే పదవికి సురేంద్రబాబు రాజీనామా చేయాలి:42 ఏళ్ల అనుభవం ఉందని ఆడిటర్, మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చెబుతోంది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో తెలుసుకోలేనప్పుడు ఆ అనుభవం ఉండి ఏం ప్రయోజనం?ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద ఆధారపడి 20 వేల కుటుంబాలున్నాయని, అందువల్ల బురద జల్లొద్దని నీతులు చెబుతున్నారు. మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది?. ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి.‘మీ–సేవ’ బాబుతో తనకేం సంబంధం లేదని ఎస్సార్సీ కంపెనీ యజమాని, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు చెబుతున్నారు. ఏం సంబంధం లేకుండానే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మీతో తిరుగుతారా? ఆయన కొడుకు పుట్టినరోజున మీరు వెళ్లి కేకు తినిపించి వస్తారా? అలాగే మీ పుట్టినరోజుకి మీసేవ బాబు వచ్చి కేకు ఎందుకు తినిపించారు? అంతే కాకుండా మీరిద్దరూ కలిసి నారా లోకేష్ను ఎందుకు కలిశారు? మీ బంధాన్ని ధృవపర్చేలా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలన్నింటికీ ఏం సమాధానం చెబుతారు?.ఆ అరెస్టులు ఎందుకు చూపడం లేదు?:స్టాంప్ డ్యూటీ స్కామ్కు సంబంధించి ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబుతో పాటు, గొల్ల భువనేశ్వర్, మంజు, మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అయిదు రోజులవుతున్నా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు వెంటనే ఒక ప్రకటన చేయాలి.‘సిట్’ కాదు. సీబీఐ దర్యాప్తు చేయాలి:కళ్యాణదుర్గంలో స్టాంప్ డ్యూటీ స్కామ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ‘సిట్’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఈ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలి.హైకోర్టు తలుపు తడుతా:పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబు ఎక్కడున్నాడో చెప్పకుండా ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, రూ.2 కోట్ల నగదు దొరికిందని.. ఆయన, ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో భారీ లావాదేవీలున్నాయని లీక్లు ఇస్తున్నారు. కానీ, ఆయన ఎక్కడున్నాడో మాత్రం చెప్పడం లేదు. అందుకే బాబుతో సహా, మిగిలిన వారందరినీ వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. లేకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వస్తుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. -
‘చంద్రబాబు ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రవచనాలు’
సాక్షి, తాడేపల్లి: ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడుగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు.. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పని చేశారు. అప్పట్లోని ఎమర్జెన్సీలాగే ఏపీలో ఇప్పటి పరిస్థితి ఉంది. అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించలేదు.. అంతే తేడా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక పిచ్చి మంత్రి మాట్లాడుతున్నాడు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?. పోలీసులు పోలీసు చట్టాన్ని అనుసరిస్తున్నారా?. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో వేలాది తప్పుడు కేసులు, చిత్రహింసలకు పాల్పడుతున్నారు’’ అని అప్పలరాజు మండిపడ్డారు.‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టటం ఎమర్జన్సీ కిందకు రాదా?. లోకేష్ చేతిలో అధికారాన్ని పెట్టి, నీఇష్టం వచ్చినట్టు చేయమని సలహా ఇచ్చారు, అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. జగన్ని భూతం అంటూ ఫిక్కీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. అసలు పారిశ్రామిక వేత్తలను భయపెట్టి పారిపోయేలా చేసిందెవరు?. తమ పరిశ్రమకు రక్షణ కల్పించమని హైకోర్టుకు వెళ్లారంటే ఎవరి పాలనలో అరాచకం జరుగుతున్నట్టు?...జిందాల్ను రాష్ట్రం నుండి తరిమేసిందెవరు?. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆదినారాయణ రెడ్డి దాడులు చేయిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది?. పల్నాడులో భవ్య సిమెంట్స్పై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని దాడి చేయిస్తే ఫ్యాక్టరీకి తాళం వేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ మీద లంచాల కోసం వేధించలేదా?. మై హోం సిమెంట్స్ గనులపై ఆంక్షలు పెట్టి వేధించిందెవరు?. చికెన్ టాక్స్ వేసి, కేజీకి రూ.10లు వసూలు చేస్తున్నదెవరు?, కృష్ణపట్నం పోర్టు మీద దాడులకు దిగింది టీడీపీ నేతలు కాదా?’’ అంటూ అప్పలరాజు ప్రశ్నలు సంధించారు...ఇలాంటి దాడులు చేస్తూ పారిశ్రామిక వేత్తలను తరిమేస్తున్నది చంద్రబాబు ముఠానే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ని భూతం అంటూ ఎలా మాట్లాడతారు?. యోగాంధ్ర విఫలం కావడంతో జగన్ పల్నాడు పర్యటనపై ఆరోపణలు చేశారు. ఒక మార్ఫింగ్ వీడియోని తెర మీదకు తెచ్చి ఏకంగా జగన్పై కేసు నమోదు చేశారు. చివరికి కారులో కూర్చున్నారంటూ మిగతా వారి మీద కూడా కేసు పెట్టటం ఏంటి?. జగన్ స్పీడుగా వెళ్లి జనాన్ని గుద్దించమని డ్రైవర్కి చెప్పినట్టు దిక్కుమాలిన రిపోర్టు రాశారు. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కారు ఢీకొని వృద్దుడు చనిపోతే డ్రైవర్ మీదనే ఎందుకు కేసు పెట్టారు?. టీడీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు కేసు పెట్టలేదు?..2015లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఒక మహిళ చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. 2016లో విజయవాడలో మళ్లీ చంద్రబాబు కారు ఢీకొని ఒక యువకుడు చనిపోతే చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదు?. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కారు ఢీకొని ఒకరు చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వారి సొంత సర్వేలో ఈ వ్యతిరేకత తెలియడంతో డైవర్షన్ రాజకీయాలు మొదలు పెట్టారు. మేధావులు సైతం ఈ పాలనను మెచ్చుకోవటం లేదు. పెద్ద పెద్ద నియంతలే రాజ్యాలను కోల్పోయిన సంగతి తెలుసుకుంటే మంచిది’’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. -
దెందులూరు YSR విగ్రహం ధ్వంసంపై YSRCP నేతలు వార్నింగ్..
-
బీటెక్ రవి బంధువు వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ఏదో ఒక రకంగా భయపెట్టి పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అండగా ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పెట్రేగి పోతున్నారు. ఎక్కడ చూసినా గొడవలు, బెదిరింపులతో ప్రత్యర్థులను బెదరగొట్టి పని కానిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. వేంపల్లె మండలం ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్ పరిధిలో ఉన్న జైస్వాల్ కంపెనీకి చెందిన క్యాంటీన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి బంధువు, వేంపల్లె మండల ఇన్చార్జి అయిన రఘునాథరెడ్డి రెచ్చిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మేము నడుపుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతోపాటు ఏకంగా అక్కడ ఉన్న జైస్వాల్ కంపెనీ మేనేజర్ ఖాన్పై దాడులకు తెగబడ్డారు. ప్రత్యేకంగా రెండు వాహనాలతోపాటు బైకుల్లో వచ్చిన రఘునాథరెడ్డి, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
నాన్న ఏమైనా దొంగ నక్సలైటా.. టీడీపీపై కాకాణి పూజిత ఫైర్..
-
అరెరె.. తమ్ముడి పనేనా!
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్ వద్ద గత సోమవారం బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు కూటమి నాయకులు రాజకీయాలు అద్దేందుకు విఫలయత్నం చేస్తున్నారు. తమ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయవద్దని జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పిల్లలను బడులకు కూడా తల్లిదండ్రులు పంపడం లేదు. వారి సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందిలేదు. ఇప్పటికే దఫదఫాలుగా ఆందోళన చేస్తున్న వారు ఈ నెల 23న పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. వాస్తవంగా జరిగింది ఇదీ.. దీన్ని రాజకీయం చేసి, మాజీ ఎమ్మెల్యే జోగారావునే పిల్లలను ధర్నాకు తీసుకొచ్చినట్లు కూటమి నాయకులు ప్రచారానికి ఎత్తుకున్నారు. మంత్రి లోకేశ్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది ఎవరు? జరిగిన ఘటనను పూర్తిగా వక్రీకరిస్తూ.. మాజీ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేస్తూ.. పాఠశాల సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్ఎం, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని శ్యామ్ అనే వ్యక్తి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ఈ శ్యామ్ అనే వ్యక్తి పక్కా టీడీపీ కార్యకర్త. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడు. సోషల్ మీడియా ఖాతాలనూ అతనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు.. మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ పలు సందర్భాల్లో ఫొటోలు దిగాడు. ఒక టీడీపీ కార్యకర్త.. వాస్తవాలను వక్రీకరిస్తూ, పోస్టులు పెట్టగానే చర్యలకు ఆదేశాలివ్వడం, నిర్ధారణ చేసేయడం గమనార్హం. టీడీపీ వారు ఏది చెబితే అదే రాజ్యాంగమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ రాజకీయమే అందామా?ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.దయచేసి రాజకీయాలు చేయొద్దు.. మా పిల్లల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగానే గత సోమవారం ధర్నాకు వచ్చాం. ఇందులో ఎవరి ప్రమేయమూ, ఒత్తిడి లేదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు. వీలైతే పాఠశాలను తరలించకుండా చూడండి. – సంతో‹Ù, విద్యార్థి తండ్రిమంత్రిని మభ్యపెట్టిన ఎమ్మెల్యే? తమను ఎవరూ పిలవలేదని.. పిల్లల పాఠశాల సమస్యపై తామే స్వచ్ఛందంగా వచ్చామని ఇప్పటికీ సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆటో ప్రమాద ఘటన దురదృష్టవశాత్తు జరిగిందే గానీ.. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహానికి పోయి, స్వయానా మంత్రి లోకేశ్ను మభ్యపెట్టి, సామాజిక మాధ్యమాల్లో తమ అనుచరునితో పోస్టులు పెట్టించి, డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీయడం విమర్శలకు తావిస్తోంది. తన అనుచరుని నిర్వాకాన్ని దాచిపెట్టి.. హడావిడిగా స్థానిక ఎమ్మెల్యే సైతం.. మాజీ ఎమ్మెల్యేనే నిందిస్తూ, ప్రకటన జారీ చేయడం గమనార్హం.ఏం జరుగుతోంది... ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత బుధవారం పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అంటే.. ఈ ఘటనపై ఇప్పటి వరకూ పోలీసులు వివరాలేవీ సేకరించలేదా, లేకుంటే ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రోజు కూడా పాఠశాలకు వెళ్లిన అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల భవిష్యత్తుపైనా రాజకీయాలకు ముడిపెట్టి, తమ స్వప్రయోజనాల కోసం కూటమి నాయ కులు చేస్తున్న ప్రయత్నాలపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన
చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి(పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని నిలదీయండి.ఏడాది గడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకొనిపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వాటిపై పోరాడాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. అప్పుడే మనం సత్తా చూపగలం. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో కలిసి వారి కోసం పని చేయాలి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఇంటింటికీ ఆ హామీలను అమలు చేస్తానంటూ సంతకాలతో పంపించిన బాండ్లు గుర్తు చేస్తూ.. వాటిని ఏ మాత్రం అమలు చేయని చంద్రబాబు మోసాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. దాని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయింది? ఇంకా ఎంత నష్టపోతోంది? అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పించేలా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమానికి సంబంధించి సమావేశంలో క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించి.. రాష్ట్రంలో ఇంటింటికీ దాన్ని చేర్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్. ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదురాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం పూర్తయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్బుక్ పాలన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించాం. ఎవరు, ఏ పార్టీ అని చూడకుండా మంచి చేశాం. కానీ, కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కనిపిస్తోంది ఏమిటంటే.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మాత్రమే. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చేసి చూపాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయండి ఈ సంవత్సరంలో చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతుంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అందేవి అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇంటింటికీ బాండ్లు పంపించి ఎలా నమ్మించాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? వీటన్నింటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది.చంద్రబాబు పచ్చి మోసాలను వివరించడమే లక్ష్యంచంద్రబాబు పచ్చి మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది బాకీ వడ్డీతో సహా.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలో.. అది ఎప్పుడు ఇస్తారో అడగండి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారన్నది పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రస్తావించాలి. ఇంకా రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు అమలు కాకపోవడంపై ఇటీవల నా ప్రెస్ కాన్ఫరెన్స్లోని మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబు దగా, మోసాలపై ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని మీరంతా బాగా పని చేసి విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వారికి కూడా నా అభినందనలు. జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నాడుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా.. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ కూడా ఇప్పించారు. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? ఐదేళ్లలో మొత్తం ఎంత వస్తుంది? అన్న పూర్తి గణాంకాలతో కూడిన బాండ్ కూడా ఇప్పించారు. ఆ బాండ్పై ఏమని ఉందంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను..’ అని ఉంది. ఇంకా వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ ఆ కుటుంబంలో సభ్యులు, పథకాల వల్ల వారికి ఏడాదికి, అయిదేళ్లకు అందే నగదు వివరాలను కూడా వివరించారు.సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రలోభాలు.. పచ్చి మోసంపై నిలదీయండి⇒ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.. అంటూ బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మీరు చెప్పినదాని ప్రకారమే మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు?అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి.⇒ అలా బాండ్లు ఇచ్చి కూడా అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు, మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పటికి ఆరు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరో వైపు వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్. ⇒ ఇంకా ఆరోగ్యశ్రీ. ఈ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు అవసరం. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం మొత్తం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. అదే తెలుగులో ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ స్కాన్ ఎలా చేయాలో వారు చూపుతారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్. నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి పూర్తి కాకపోయి ఉంటే.. దాన్నీ పూర్తి చేయాలి.అందమైన అబద్ధంతో దగా– కురసాల కన్నబాబు, మాజీ మంత్రిక్యూఆర్ కోడ్, ఆ స్కానింగ్.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం తదితర అంశాలను వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించడం ద్వారా, ఇంటింటా ఈ కార్యక్రమం చేయాలన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ కార్యక్రమం ఐదు వారాల్లోగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. అంటూ ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ప్రజలను పచ్చి దగా చేస్తూ, అందంగా మోసగించిన విధానాన్ని ఇంటింటా వివరించాలన్నారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ పై అక్రమ కేసు కోసం కుతంత్రం
-
ఆ ముగ్గురు చేతులెత్తేశారు: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: హామీల అమలుపై ప్రజలు కూటమి నేతల చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. లేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ మాటలను ఇప్పుడు ఆచరణలో చూపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారన్నారు.వారికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. నిత్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కుట్ర రాజకీయాలు చేయడం తప్ప ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ఒక్క మంచిపని కూడా లేదని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. ప్రజలను నమ్మించేందుకు బాండ్లు తయారు చేసి, వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రజలకు అందించారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఎలా చేయాలో తమ వద్ద ప్రణాళిక ఉందని, సూపర్ సిక్స్ అమలు చేయకలేకపోతే తన కాలర్ పట్టుకోవాలని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సవాల్ విసిరాడు. కానీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే ఈ ముగ్గురూ చేతులెత్తేశారు.ఈ చేతకాని చంద్రబాబు పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దేశంలోనే అధ్వాన్నంగా తయారైంది. ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు చూస్తే నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి మదనపల్లె ఫైల్స్, తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని, ప్రకాశం బ్యారేజ్కి బోట్లు అడ్డం పెట్టారని, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమ సరఫరా అని.. డైవర్షన్ పాలిటిక్స్తోనే సరిపోయింది. కూటమి నాయకుల దుష్ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ గురించి ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చేసింది. వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే ప్రజాస్పందనే దీనికి నిదర్శనం.రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే తత్వం చంద్రబాబుదిరాజకీయ మనుగడ కోసం ఎంతకైనా దిగజారే మనిషి చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు చెబుతున్నదే నిజమైతే, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇచ్చి ఉంటే, రోప్ పార్టీ ఉంటే ఇటువంటి ప్రమాదం జరుగుతుందా? వైఎస్ జగన్ ఏ పర్యటన వీడియోలు చూసినా పోలీసు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిందిపోయి ఆయన పర్యటనలకు ప్రజలు రాకుండా అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపిస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చంద్రబాబు కుట్రలు చేయడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట. దివంగత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా బాలకృష్ణ ఇంట్లో నిర్మాత బెల్లకొండ సురేష్ పై కాల్పులు జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలి. నందమూరి కుటుంబం పట్ల ఆరోజు సీఎంగా ఉన్న వఘెస్సార్ హుందాగా వ్యవహరించారే కానీ అవకాశాన్ని చౌకబారు రాజకీయాలకు వాడుకోవాలని చూడలేదు. కానీ చంద్రబాబు మాత్రం సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా నేరంగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం.రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమలేదుబనకచర్ల ప్రాజెక్టును కడతామంటే రాయలసీమ వాసులుగా మేమంతా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాది కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? ఒక్క పిడికెడు మట్టయినా తీసుంటే చూపించాలి. చంద్రబాబుకి నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద బాధ్యత ఉంటే జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్టుకి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేకపోయారు.రూ.వెయ్యి కోట్లతో అయిపోయే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రూ.40 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను చేపడతానని చెబితే గుడ్డిగా నమ్మడానికి రాయలసీమ వాసులు సిద్ధంగా లేరు. పూర్తయ్యే స్థితిలో ఉన్న ప్రాజెక్టుల్లో భారీగా కమీషన్లు రావు కనుక, కొత్త ప్రాజెక్టులైతే దోచుకోవచ్చనేది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు సీఎం అయ్యాక కూటమి పాలనలో అన్ని వ్యవస్థల్లో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారు కాబట్టే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పిపోయాయి.అన్ని వ్యవస్థల్లో వేళ్లూనుకునిపోయిన అవినీతి కారణంగా, కమీషన్లు ఇచ్చుకోలేక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో కట్టబెట్టిన టెండర్లన్నీ సమీక్ష చేస్తే భారీగా అవినీతి బయటపడుతుంది. ఆయన పిలిచిన టెండర్లను 20 శాతం తక్కువకి ఇస్తే ఆ పనులు చేసేదానికి ఎంతో మంది సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్త వరకు అవినీతి అజెండా పాలన సాగుతోంది. విజయవాడకి వరదలొస్తే ఆ సందర్భాన్ని కూడా అవినీతికి వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.30 కోట్లు కేటాయించారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీని మెప్పించడం కోసం ఒక పూట చేసిన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి రూ. 300 కోట్లు ప్రజాధనం వృథా చేశాడు. -
చిలకలూరిపేటలో టీడిపి మహిళా నేత శిరీషాబాయి ఆత్మహత్యాయత్నం
-
అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్కు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అక్రమ కేసులపై మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై రెండు హత్యాయత్నం కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్తో పాటు 18 మందిపై తప్పుడు కేసులను నమోదు చేశారు.వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగిస్తే.. హత్యాయత్నం చేసినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు.. ఆ తర్వాత రిమాండ్కు పంపించారు. తాజాగా ముగ్గురు బాలురుతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా టీడీపీ వారిపై హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు.బాలురుపై హత్యాయత్నం కేసు పెట్టి జువైనల్ హోమ్కు పోలీసులు తరలించారు. ఈ రెండు కేసులపై హైకోర్టుకు వెళ్లిన బాధితులు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు నివేదించారు. రెండు కేసుల్లో విచారణను వెంటనే నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురిచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. -
YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత
-
నేనే కనిపెట్టానని చెప్పుకునే టెక్నాలజీ తోనే.. బాబు బండారం ప్రజలకు అర్థమయ్యేలా...
-
టీడీపీ రప్పా రప్పా రాజకీయంపై తానేటి వనిత అదిరిపోయే కౌంటర్
-
Rachamallu Siva Prasad: రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. కోటి ఇరవై లక్షల భూమిని లాక్కుని
-
మాట నిలబెట్టుకొని మంత్రి గుమ్మడి సంధ్యారాణి
-
Lakshmi Parvathi: దరిద్రపు పరిపాలన.. తండ్రికొడుకుని ఒక్కటే అడుగుతున్న
-
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు భారీ స్కామ్
-
సిక్కోలు వాకిట్లో సిండికేట్ల రాజ్యం
తాగు నీరు దొరకని గ్రామాలు ఉన్నాయేమో గానీ మద్యం దొరకని చోటు లేదు... వేల సంఖ్యలో బెల్టు షాప్లు... దర్జాగా లిక్కర్ దందా... ఎవరికి అందాల్సిన మొత్తం వారికి... వాటాలు కుదరనిచోట నెలవారీ ముడుపులు..! సిక్కోలు వాకిట్లో ఇదీ మద్యం సిండికేట్ల రాజ్యం..! మద్యం ద్వారా ఆదాయం ముంచెత్తాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు గేట్లు ఎత్తారు...!శ్రీకాకుళం జిల్లాలో మద్యం షాపుల నిర్వాహకులు, సిండికేట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షాప్ పరిధిలోని గ్రామాల్లో 10 నుంచి 40 బెల్ట్ షాప్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 10 వేలపైనే అని అంచనా. ఇవన్నీ బార్లను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల నివాస గృహాలు, చిన్న చిన్న దుకాణాల్లోనూ మద్యం దొరుకుతోంది. క్వార్టర్ బాటిల్పై రూ.30 నుంచి రూ.50 అదనంగా అమ్ముతున్నారు. కొన్నిచోట్ల లైసెన్స్ దుకాణాల కౌంటర్లలోనే రూ.10 నుంచి రూ.20 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. వైన్ షాప్లు, బార్లలో నిర్దేశిత వేళల్లో మద్యం దొరుకుతుంటే బెల్ట్షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఇక బార్లలో మాదిరిగా బెల్ట్షాప్లలో ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం⇒ బెల్ట్ షాప్లు, లైసెన్స్ దుకాణాల వద్ద అనధికారికంగా పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు, ఎంఆర్పీకి మించి అమ్మకాలకు నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తమవంతు సాయం చేసినందుకు షాప్ల యజమానులు, సిండికేట్ల నుంచి ముడుపులు, వాటా తీసుకుంటున్నారు. సిండికేట్ ఏర్పాటైనచోట నేతలు అదనపు వాటా పొందగా, అది లేనిచోట లైసెన్స్ షాప్నకు నెలకు రూ.లక్ష చొప్పున తీసుకుంటున్నారు.రాజాంలో మొదలై జిల్లా అంతటికి విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటే రాజాం నియోజకవర్గంలో లిక్కర్ దందా మొదలైంది. లైసెన్స్ షాపుల యజమానులందరినీ సిండికేట్ చేశారు. ఇందులో సభ్యుడిగా నియోజకవర్గ కీలక నేతను చేర్చారు. లాభాల్లో వాటాను కీలక నేతకు ఇస్తున్నారు. అంతా ఏకం కావడంతో ఎంఆర్పీకి మించి విక్రయాలే కాదు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులూ నడుపుతున్నారు.నెలకి షాపునకు రూ.లక్ష శ్రీకాకుళం నియోజకవర్గంలోనైతే సిండికేట్ లేదు కానీ బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, ఎంఆర్పీకి మించి విక్రయాలు జరుగుతున్నాయి. చూసీ చూడనట్టున్నందుకు నియోజకవర్గ నేతకు ఒక్కో షాపు నుంచి నెలకు రూ.లక్ష ముట్టజెబుతున్నారు. అధికారులే సూత్రధారులై ఆ ఒప్పందం అమలు చేస్తుండడం గమనార్హం. టెక్కలి, ఆమదాలవలసలో సోదరుల పెత్తనం టెక్కలి, ఆమదాలవలసల్లో కీలక నేతల సోదరులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలసలో కొన్ని షాపులు సిండికేట్లో కలవలేదు. వాటి యజమానులు నెలవారీ ముడుపులిస్తున్నారు. పాతపట్నంలో కూడా వ్యాపారులంతా సిండికేటై, అక్కడున్న నేతకు వాటా ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్పై రూ.30 అదనంగా పిండుకుంటున్నారు. ఇచ్ఛాపురంలో నెల వారీ మామూళ్లు కొనసాగుతున్నాయి.నరసన్నపేటలో మొత్తమంతా కీలక నేతకేనరసన్నపేటలో కీలక నేత పంట పండింది. కలిసి మద్యం వ్యాపారం చేసుకుందామని నమ్మబలికి అనుచరులు, నాయకుల దగ్గరి నుంచి రూ.20 కోట్లకు పైగా సేకరించారు. వారికి వ్యాపారంలో వాటా ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాలకు దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. తీరా తన కుటుంబ సభ్యుల పేరునే ఎక్కువగా దరఖాస్తులు చేశారు. వారి కుటుంబసభ్యులకే లాటరీలో ఎక్కువ దుకాణాలు వచ్చాయి. రూ.20 కోట్లు ఇచి్చన నాయకులు, అనుచరులను దూరంపెట్టారు. వారి డబ్బూ తిరిగివ్వలేదు. వాటాలూ ఇవ్వలేదు. దీంతో ఆగకుండా.. నియోజకవర్గంలో మిగతావారికి దక్కిన షాపులను సైతం బెదిరించి సిండికేట్లో కలిపారు. పైసా పెట్టుబడి లేకుండా తానొక వాటా తీసుకుంటున్నారు.పలాసలో అల్లుడి దందా పలాసలో సీనియర్ నేత అల్లుడే చక్రం తిప్పుతున్నారు. వ్యాపారులందరినీ సిండికేట్గా చేయడమే కాక లైసెన్స్ షాపుల కౌంటర్లలోనే క్వార్టర్ బాటిల్పై రూ.20 అదనంగా అమ్మేలా దారి చూపించారు. ప్రతిఫలంగా సిండికేట్లో వాటాతో పాటు షాపుల నుంచి నెల వారీ ముడుపులు తీసుకుంటున్నారు. జిల్లాలో లైసెన్స్ షాప్ల కౌంటర్లలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టడం పలాసలోనే మొదలవడం గమనార్హం.మద్యం మత్తులో గ్రామాలు ప్రభుత్వం తీసుకొచి్చన విధానంతో పాటు బెల్ట్షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి సిక్కోలు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలు, గొడవలు జరుగుతున్నాయి. జనవరి 19న శ్రీకాకుళం న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను అతి కిరాతకంగా ఓ యువకుడు చంపేశాడు. ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీ కాలనీలో మద్యం మత్తులో సాహుకారి ఢిల్లీశ్వరరావు భార్యను హత్య చేశాడు. మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను భర్త అప్పలరెడ్డి దారుణంగా నరికి చంపాడు. కాశీబుగ్గలో మద్యం మత్తులో ఇద్దరు బాలికలపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం బలగ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బీరు సీసాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. -
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్ను తాడేపల్లి స్టేషన్కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్గా డ్రైవ్ చేసిన మాట నిజమేనని, వైఎస్ జగన్ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్చేసి, డ్రైవర్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కథ మార్చేశారు మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు.డ్రైవర్ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహనం యాక్సిడెంట్కు కారణం కానప్పుడు.. ఆ వాహనాన్ని వదిలేయకుండా స్టేషన్ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది. -
చంద్రబాబే యమకింకరుడు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి...! టీడీపీ అధినేత సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరీ...! బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి ముగ్గురు మృత్యువాత... చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు.. సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘పాద’ఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం..! గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొనిఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాలతో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో..! కానీ అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలు కావు. పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలే!! అందుకు బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసులు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే చాలు... యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్టుగా సామాన్యులు హడలిపోయే పరిస్థితులు కల్పించిన ఆ ఉదంతాలు ఇవిగో..పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్)గోదావరి పుష్కరాలు... బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కు ఈ ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన 2015 జూలై 15 ముందు రోజు అంటే 14వతేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్లో పడిగాపులు కాశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్టుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు.రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే! మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు పెట్టారా...? దీనిపై విచారణకు నియమించిన కమిటీ కాలయాపన చేయడం మినహా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుడిని చేసిందా? కందుకూరులో తొక్కిసలాట క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్) ఎన్నికల ప్రచార ఆర్భాటానికి ఎనిమిది ప్రాణాలు హరీ..! పోలీసులు వారించినా కందుకూరు ఇరుకు రోడ్డులో సభతన సభలకు జనం రావడం లేదన్న వాస్తవం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కొందరి ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. తన కార్యక్రమాలకు జనం భారీగా వచ్చినట్టుగా నమ్మించాలని ఆయన ఎత్తుగడ వేశారు. దీని ఫలితం.. కందుకూరులో 8 మంది సామాన్యుల మృత్యువాత! 2022 డిసెంబరు 29న చంద్రబాబు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. తన కార్యక్రమానికి భారీగా జనం వచ్చినట్లు చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఓ ఇరుకైన రోడ్డులో సభ నిర్వహించారు. ఆ రోడ్డులో సభ నిర్వహించవద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు.ఆ రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని అయినా ఆ రోడ్డు వద్ద వెడల్పుగా ఉన్న జంక్షన్లో నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఆ ఇరుకైన రోడ్డులోకే చంద్రబాబు వాహనాన్ని హఠాత్తుగా తీసుకెళ్లారు. దాంతో అలజడి రేగి తొక్కిసలాట జరిగింది. జనం పక్కన ఉన్న కాలువలో ఒకరిపై ఒకరు పడిపోయారు. అమాయకులు మృత్యువాత పడ్డారు. చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చినట్టు చూపించేందుకు వేసిన ఎత్తుగడ 8 మందిని బలితీసుకుంది. మరి దీన్ని దుర్ఘటన అంటారా...? చంద్రబాబు చేసిన హత్యలే కదా!! మరి అందుకు ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా? అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాటలో కింద పడిన భక్తులు తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణంచంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9వతేదీ తెల్లవారు జామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు.వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ⇒ 2018 మార్చి 31న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రాముల వారి కల్యాణం సందర్భంగా టెంపరరీ షెడ్ గాలికి కుప్ప కూలిన ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తొక్కిసలాటలో మరణించిన మహిళ (ఫైల్) గుంటూరులో చీరలు పంపిణీ... ముగ్గురు మహిళలు మృత్యువాతచంద్రబాబు తన ప్రచారార్భాటంతో మహిళలనూ వదిలిపెట్టలేదు. 2023 జనవరి 1న గుంటూరులో ఆయన సభ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున చీరలు పంచుతామంటూ మహిళలను తరలించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఆ కార్యక్రమం ముగిస్తున్నట్టు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. దాంతో ఉన్న కొద్ది చీరలు తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించింది. చంద్రబాబు ప్రచారార్భాటం కోసం వేసిన చీప్ ట్రిక్తో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరి ఆ రోజు ముగ్గురు మహిళల మృతికి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ ఆయనపై హత్యానేరం నమోదు చేయాలి కదా? అని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు. అప్పన్న చందనోత్సవంలో తీవ్ర నిర్లక్ష్యం... ఏడుగురు భక్తుల దుర్మరణంపవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా... దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిరి్మంచిన గోడ కుప్ప కూలడంతో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాబు గద్దింపు ఇదీ..!ఏం కుంభమేళాలో చనిపోవడం లేదా..? జగన్నాధ రథ యాత్రలో చనిపోవడం లేదా..? యాక్సిడెంట్లలో చనిపోవడం లేదా...? బాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతిగతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని పోలవరం పంచాయతీ యడ్లగూడెంకు చెందిన యడ్లపాటి మంగమ్మ (70) మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు కాన్వాయ్ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమలకుదురుకు చెందిన ఆయన సైకిల్పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్ర బాబు కాన్వాయ్ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. -
స్వీపర్ పోస్టుకు కమిషన్ డిమాండ్.. మహిళపై టీడీపీ నేత వేధింపులు
సాక్షి,కృష్ణాజిల్లా : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు మరింత బరితెగిస్తున్నారు. స్కూల్లో స్వీపర్ ఉద్యోగం ఇప్పించినందుకు కమిషన్ ఇవ్వాలంటూ మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ నీలం రమేష్ వేధింపులకు పాల్పడ్డాడు. అదేంటని ప్రశ్నించినందుకు దాడికి దిగాడు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరంలోని స్కూల్లో ఓ మహిళకు రమేష్ స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. స్వీపర్ ఉద్యోగం చేసినందుకు గాను సదరు మహిళకు వచ్చే జీతం రూ.6వేలు. అందులోనే తన కమిషన్ రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఖాతాలో ఆరు నెలల వేతనం జమైంది.ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రమేష్ తన కమిషన్ ఇవ్వాలని మహిళను వేధించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలి భర్త బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై బాధితురాలి భర్తపై రమేష్ దాడికి దిగాడు. టీడీపీ నేత రమేష్ నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు. -
టీడీపీ మహిళా నేతకు అవమానం