TDP
-
కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్
-
కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి
-
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆక్వా రైతులకు అన్యాయం.. పచ్చ చొక్కాలకే లాభం! చంద్రబాబు పై కాకాని ఫైర్
-
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం చంద్రబాబు సర్కార్ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. -
రైతుల ఉసురు పోసుకుంటున్న... కూటమి ప్రభుత్వ పతనం తప్పదు
-
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
మీ కులమైతే చాలు.. ఏమైనా చేస్తారా..?
-
భగ్గుమన్న ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ఒంగోలు సబర్బన్: ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పుపెట్టారు. ధరల పెంపు అమల్లోకి వచ్చాక అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండా కంపెనీలు ఏకపక్షంగా ఫీడ్ ధరలు ఏ విధంగా పెంచుతాయని నిలదీశారు. మేత బస్తాలకు నిప్పుపెట్టి.. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేకుండానే ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.8,420 నుంచి రూ,10,530 వరకు పెంచడాన్ని నిరసించారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఫీడ్ ధరలు పెంచిన కంపెనీల ఏకపక్ష ధోరణిపై కన్నెర్రజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు కనీస గిట్టుబాటు ధరలు కల్పించకపోతే సాగు సమ్మెకు దిగుతామని నరసాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన రైతులు అల్టిమేటం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రొయ్య రైతులు ధర్నా చేశారు. ఫీడ్ కంపెనీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగలేదని.. సోయా మీల్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.35కు తగ్గాయని చెప్పారు. వేట నిషేధ వేళలో ఏటా పెరిగే ఫిష్మీల్ ధరలను సాకుగా చూపి ధరలు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వానికి చెప్పకుండా, పెద్దల అనుమతి లేకుండా ఏ విధంగా ఫీడ్ ధరలు పెంచుతాయని సంఘం నేతలు ప్రశ్చించారు. తక్షణం పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరించుకోవాలని, అప్సడా అనుమతి లేకుండా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం ఆక్వా ఫీడ్ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలిడే ప్రకటించాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘాధ్యక్షుడు గొట్టుముక్కల గాం«దీభగవాన్రాజు మాట్లాడుతూ.. వనామీ రొయ్య ఫీడ్పై కేజీకి రూ.8, టైగర్ రొయ్య ఫీడ్పై రూ.10 పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముడిసరుకు ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలకు, ఇప్పుడు పెంచాలనే ఆతృత ఎందుకని ప్రశ్చించారు. ప్రభుత్వం కూడా రైతుల కంటే కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కంపెనీలతోపాటు ప్రభుత్వంతోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తొలుత ధరలు పెంచిన కంపెనీలను బహిష్కరించాలని, ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆక్వా సంఘం కార్యదర్శి బోణం చినబాబు, రంగయ్య నాయుడు, జాన్రాజు పాల్గొన్నారు. నేడు ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో భేటీ ఆక్వా రైతుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు. అప్సడా చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా పెంచేశాయని ఆరోపించారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశమై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేత ధరల పెంపును అడ్డుకోవాలి మేత ధరల పెంపును అడ్డుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టైగర్ రొయ్యల మేతపై టన్నుకు రూ.10,530, వెనామీ రొయ్యల మేత ధర రూ.8,420 చొప్పున పెంచడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు. ఇప్పటికే వైరస్లతో దిగుబడులు రాక, కౌంట్ ధరలు పతనమై అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఈ ధరల పెంపు అశనిపాతంగా మారిందన్నారు. తక్షణమే అప్సడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మేత ధరలను పూర్తిస్థాయిలో ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఆక్వా రైతులతో సంప్రదించకుండా మేత ధరలు పెంచడాన్ని ఏపీæ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, కార్యదర్శి ఎం.హరిబాబు తప్పుబట్టారు. మూడు నెలల్లో రెండోసారి ధరలు పెంచడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా రొయ్య రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన ఫీడ్ ధరలతో పాటు ఫిబ్రవరిలో పెంచిన ధరలను కూడా పూర్తిగా ఉపసంహరింప చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ తండ్రీకొడుకులకు టైమ్ దగ్గర పడింది!
-
అసలు జరిగింది ఏంటంటే..?
-
మా నాన్న టీడీపీ ఎమ్మెల్యే.. నీ భర్తను నాకిచ్చేయ్!
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. .. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
బెంగళూరుకు క్యూ కడుతున్న ఏపీ ప్రజలు.. కారణం ఇదే
నంద్యాల జిల్లా: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
అమరావతిలో బాబు మ్యాజిక్ ఎవడి సొమ్ము ఎవడికి దానం
-
భాగ్యలక్ష్మి బంపర్ లాటరీలా.. అమరావతి లాటరీ మాయాజాలం
-
5 ఎకరాల్లో ఇల్లు ఇంటి ముందు అసెంబ్లీ, వెనుక హైకోర్టు
-
ఆక్వా గొంతు నులి‘మేత’
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’ వన్నె పులులు ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెత్తనమంతా..‘టీడీపీ’ ఫీడ్ కంపెనీలదే రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, వెనామి రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా రూ.15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతోపాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరుమెదపలేని దుస్థితి నెలకొందని సమాచారం. రైతులతో చర్చించకుండానే ధరల పెంపు.. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు.. ఆక్వారంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై, వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిరీ్వర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5–15 శాతానికి తగ్గించగా, కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తగ్గించాలి. కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. నాడు కంటి తుడుపు చర్యగా టన్నుకు ఎమ్మారీ్పపై రూ.4వేలు తగ్గించిన కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పా పెట్టకుండా టన్నుకు మళ్లీ రూ.4వేల చొప్పున పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్పై రూ.12వేలు, టైగర్ ఫీడ్పై రూ.14వేలు పెంపునకు అనుమతినివ్వాలంటూ గతనెల 30న మత్స్యశాఖ కమిషనర్కు రొయ్య మేత తయారీ దారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులిచ్చారు. కానీ స్టేక్ హోల్డర్లతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కలిగిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనమి ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్ పై రూ. 10,530 పెంచగా.. మిగిలిన కంపెనీలు వెనమి ఫీడ్పై రూ.8 వేలు, టైగర్ ఫీడ్పై రూ.10 వేలు చొప్పున పెంచాయి. పెట్టుబడిలో సగానికిపైగా మేతకే.. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు పైగా ఉంది. తాజా పెంపుతో మేతధ రలు పన్నులతో కలిపి రూ.1.15లక్షలకుపైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–24 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారూ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్గా మారి దోచేస్తున్నారు. ఏపీ అప్సడా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి లేదు. కంపెనీలన్నీ సిండికేట్గా మారి ధరలు ఒక్కసారిగా పెంచాయి. తక్షణమే ఈ పెంచిన ధరలను తగ్గించాలి. –దుగ్గినేని గోపినాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా కంపెనీలు ఏకపక్ష ధోరణి తగదు ఫీడ్ తయారీ కంపెనీలకు ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా పెట్టుబడి ధరలు పెరుగుతున్నాయే తప్ప రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్రం ద్వారా వివిధ రకాల రాయితీలు పొందుతున్న కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా ఫీడ్ ధరలు పెంచేస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఇది తగదు. – టి.నాగభూషణం, అధ్యక్షుడు, కోనసీమ రొయ్య రైతుల సంఘం -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ధనబలం ఉన్న నేతలు, లాబీయిస్టులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. తన తనయుడు లోకేశ్కి అనుకూలంగా పార్టీ యంత్రాంగాలను చంద్రబాబు రూపొందించినట్లు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగించినా వారి ప్రాధాన్యతను మాత్రం తగ్గించేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.గతంలో పొలిట్బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావులను పక్కకు తప్పించారు. సోమిరెడ్డిని అధికార ప్రతినిధిగా, బొండా ఉమాను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాజ్యసభ స్థానం అడుగుతున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు అది ఇవ్వకపోగా అవమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పొలిట్బ్యూరోలో ఆయన్ని కొనసాగించి పార్టీలో పదవే తప్ప ఇతర కీలక పదవులు ఇవ్వబోమని తేల్పిచెప్పారు. ఈసారైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణలకు అనూహ్యంగా పొలిట్బ్యూరోలో చోటిచ్చి సరిపెట్టారు. బుచ్చయ్య తాను ఎమ్మెల్యే కావడం ఇదే చివరిసారి కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఒక్కసారైనా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారిని పొలిట్బ్యూరో సభ్యులుగా నియమించారంటే ఇక మంత్రి పదవులు లేవని చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది. జిల్లాల్లో మారిన టీడీపీ నాయకత్వంపలు జిల్లాల్లోనూ ప్రాధాన్యతలు మారిపోయినట్లు టీడీపీ కమిటీల కూర్పును బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎప్పుడూ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. బీద రవిచంద్ర, పొంగూరు నారాయణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీరందరినీ పక్కనపెట్టి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని పొలిట్బ్యూరోకి తీసుకున్నారు. సోమిరెడ్డిని పొలిట్బ్యూరో నుంచి తప్పించి ప్రాధాన్యత తగ్గించి అధికార ప్రతినిధిగా నియమించారు. బీద, నారాయణలకైతే ఏ కమిటీలోను స్థానమే లేకుండాపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించారు.పల్లా శ్రీనివాసరావును మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. వంగలపూడి అనితకు పొలిట్బ్యూరో సభ్యురాలిగా అవకాశం ఇచ్చి సీనియర్లయిన గంటా శ్రీనివాసరావు వంటి నేతలను పక్కనపెట్టారు. విజయనగరంలో అశోక్గజపతిరాజు కుటుంబానికి ప్రాధాన్యత లేకుండానే కమిటీల నియామకం జరిగింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు ప్రాధాన్యత తగ్గించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని పక్కనపెట్టి నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజులను అందలం ఎక్కించారు. ఉమ్మడి కృష్ణాలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ల స్థానాన్ని కొల్లు రవీంద్ర సొంతం చేసుకున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ల కంటే గళ్లా మాధవి, అనగాని సత్యప్రసాద్కి పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురంలో జేసీ, పరిటాల కుటుంబాల స్థానంలో బీసీ జనార్ధన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు ప్రాధాన్యత పెంచారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. గత ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలకు 175 మంది పరిశీలకులను నియమించి 2024 ఎన్నికల విన్నింగ్ టీమ్గా వారితో పనిచేయించారు. వారిలో 150 మందికి ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తమకు అనుంగు అనుచరులుగా ఉన్న కిలారు రాజేష్, సానా సతీష్ వంటి పార్టీకి సంబంధం లేనివారిని అందలం ఎక్కించారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిలించాయి. -
మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధి
సాక్షి,విజయవాడ: మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం రూ.56.64లక్షలు లబ్ధి పొందేలా నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక పథకం వంటి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.56.64లక్షల నిధుల్ని కేటాయించారు. తద్వారా చంద్రబాబు తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒక్క వర్గానికి కూడా మేలు జరగడం లేదు
-
కాళహస్తిలో అధికారుల అరాచకం.. ప్రశ్నించిన పాపానికి మహిళపై...
-
విశాఖను కొత్తగా విశ్వనగరం చేయడం ఏంటి?
మనకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే.. విశాఖ విశ్వనగరి అవుతుంది. లేదంటే ఎందుకు కొరగానిది. సాగర ముప్పు ఎదుర్కుంటుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా వైఖరి. డేటా సెంటర్, లేదా ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ భూములు కేటాయిస్తే రాష్ట్రాన్ని అదానికి రాసిచ్చేస్తున్నట్లు... అదే చంద్రబాబు ఇస్తే... మాస్టర్స్ట్రోక్ అన్నమాట. అయితే ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వాటి పరువును మరింతగా బజారుకీడుస్తున్న సంగతి వాటికి అర్థం కావడం లేదని అనిపిస్తుంది. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి నారా లోకేశ్ల ప్రయోజనాలను కాపాడడమే తమ లక్ష్యంగా ఈ రెండు పత్రికలు పని చేస్తున్నాయి. తమ రాతల ద్వారా, ప్రసారాల ద్వారా ప్రజలను నిత్యం మోసం చేయాలని ప్రయత్నిస్తోంది.ఈనాడు పత్రిక కొద్ది రోజుల క్రితం విశ్వనగరి.. మన విశాఖ అని ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అదాని గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడానికి రెండు రోజుల ముందు రాసిన స్టోరీ ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి ఇటువైపే అని పేర్కొంది. అంతే... ఏయు శతాబ్ది ఉత్సవాల్లో, డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ బాబు కూడా అదే రాగం ఎత్తుకున్నారు. నిజానికి విశాఖ ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న నగరం. విశాఖపై దాడికి ప్రయత్నించి పాకిస్థాన్ జలాంతర్గామిని భారత నావికాదళం సముద్రంలో ముంచేసింది ఇక్కడే. ఆ జలాంతర్గామి ఇప్పటికీ అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది.అంతేకాదు. సుందరమైన సముద్రతీరం దాని సొంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ అంతటా జరిగిన పెద్ద ఉద్యమం దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దానిని నీరుకార్చి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం కూటమి పెద్దలు తాపత్రయపడుతున్నారు. అది వేరే విషయం. హెచ్పీసీఎల్తో పాటు హిందుస్తాన్ జింక్, అనేక భారీ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ ఏర్పాటయ్యాయి. రెండు పోర్టులు, షిప్ యార్డులు ఉన్నాయి. అందువల్లే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఏపీకి మంచి గ్రోత్ ఇంజన్ అవుతుందని భావించారు. దానిని అడ్డుకుంది ఇదే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ఎల్లో మీడియానే! ఎక్కడ జగన్కు పేరొచ్చేస్తుందో అనే దుగ్ధ. ఎలాగైనా దానిపై విషం చిమ్మాలన్న ఏకైక లక్ష్యంతో ఆ మీడియా పనిచేసింది. అందుకే అప్పట్లో ఈనాడు ‘‘తీరంలో చీలిక’’, ‘‘ఈ గాయం తీరనిది’’, ‘‘మరిగే ఎండ కరిగే మంచు, పొంగే సముద్రం ..ఆ నగరాలకు ముప్పు ..జాబితాలో మన విశాఖపట్నం కూడా ,భయపెడుతున్న నాసా అధ్యయనం అని వార్తలు వండి వార్చారు. సముద్రం కారణంగా విశాఖ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని రాశారంటే ఏమని అనుకోవాలి. అంతేకాదు.. తీర ప్రాంతం గుండా భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు విస్తరణ చేస్తుంటే ,ప్రజల ఇళ్లు పోతాయని రెచ్చగొడుతూ స్టోరీలు ఇచ్చారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి 'అదాని అడిగారని..2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం’ అని రాసింది. కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టారు..గంగవరం పోర్టును చుట్టబెట్టి ఇచ్చారు., ఇది అదాని పై సర్కార్ కు ఉన్న ప్రేమ అని విమర్శిస్తూ స్టోరీలు ఇచ్చారు. ఇప్పుడు ఇవే మీడియా సంస్థలు ఆహో, ఓహో అని తెగ పొగుడుతూ వార్తలు ఇస్తున్నాయి. అదాని డెటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ గా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. ఇక అది సాధ్యం కాదని అర్ధం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అదాని డేటా సెంటర్ కే ప్రభుత్వం భూములు కేటాయించవలసి వచ్చింది.ఈ కంపెనీ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ను గూగుల్ వాడుకుంటుంది.అంటే ఒక రకంగా అద్దెకు తీసుకుంటుందన్న మాట. తప్పులేదు. కాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆ భూమి ఎకరా విలువ రూ.20 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. ఎకరా కోటి రూపాయలకే ఇచ్చేస్తారా అని తప్పుపట్టింది. ఇప్పుడేమో 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతుంటే అబ్బ! ఎంత గొప్పదనం అని తెగ సంబర పడుతోంది. ఇలా ఉంటుంది ఎల్లో మీడియా ద్వంద్వ నీతి. అదాని డేటా సెంటర్ జగన్ టైమ్ లో వచ్చింది. దానిని మరికొంత పెంచి 490 ఎకరాల భూమిని ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఒకే. ఫర్వాలేదు.ఈ డేటా సెంటర్ వల్ల తక్కువ ఉద్యోగాలు వస్తాయనే కదా జగన్ ఆ రోజుల్లో పలు షరతులు పెట్టి 25 వేల ఉద్యోగాలు కల్పించాలని జి.ఓ.లో పేర్కొన్నారు. ఇప్పుడేమో కేవలం 200 ఉద్యోగాలే వస్తాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది. ఆ తర్వాత ఫ్లెక్సీలలో మాత్రం లక్ష ఎనభైవేల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. ఈ డేటా సెంటర్లపై అమెరికా, మరికొన్ని దేశాలలో ఎందుకు వ్యతిరేకత వస్తుందో కూడా గమనించాలి. విశాఖ నగరానికి సరఫరా చేసే విద్యుత్ పరిణామం అంత ఈ డేటా సెంటర్ కు నిత్యం అవసరం అవుతుందట.అలాగే నీరు కూడా భారీగా వాడుకుంటుంది. ఇవి ఒక ఎత్తు అయితే ఏకంగా ఈ కంపెనీకి 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై సీనియర్ రిటైర్డ్ అధికారి ఈఎఎస్ శర్మ వంటివారు ఆక్షేపిస్తున్నారు. ఒకవైపు ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని లోకేశ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా ఆ కంపెనీలు భూమి కొనుగోలు చేసి యూనిట్లను స్థాపించి ఉండేవి కదా అన్నదానికి జవాబు ఉండదు. భూములు 99 పైసలకే ఇవ్వడం ద్వారా విశ్వనగరం విశాఖ బ్రాండ్ను చంద్రబాబు సర్కార్ పాడు చేస్తున్నదా అన్న సందేహం కలుగుతుంది. జగన్ టైమ్లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని డెవలప్మెంట్ సెంటర్ ను ఆరంభించింది.దానివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడలేదు. కాని ఇప్పుడు అదే కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు రూ.8500 కోట్ల లాభాలు ఆర్జిస్తుంటుంది. అలాంటి సంస్థకు దాదాపు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరముందా? అలాగే ఐటి ముసుగులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ప్రభుత్వ భూములను ఉదారంగా పందేరం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇలాగైతే విశాఖ విశ్వనగరం ఎలా అవుతుంది? భవిష్యత్తులో ప్రభుత్వ భూములే లేకుండా పోతాయి. ఈ స్థితిలో గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ అంతర్జాతీయ గేట్ వేగా ఏపీ అవుతుందని, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇకపై బ్రేక్ పడుతుందని చంద్రబాబు చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టడం కాకుండా మరొకటి అవుతుందా? గేమ్ ఛేంజర్ వంటి పడికట్టు పదాలను వాడవచ్చు కాని, కేవలం వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ఈ సంస్థ ద్వారా ఎలా వలసలు ఆగుతాయో తెలియదు.ఈ కంపెనీ తొలుత 85వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని అన్నారు.అది తర్వాత 135000 కోట్లు అని చెప్పారు.ఇప్పుడు మీడియాలో లక్షన్నర కోట్ల పెట్టుబడి అంటున్నారు.నిజంగా ఈ స్థాయిలో పెట్టబుడులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించుకోవచ్చు.నిజంగానే భారి పెట్టుబడులు పెట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే సంతోషించవచ్చు.అలా కాకుండా వైజాగ్ కు ఈ డేటా సెంటర్ లు భారం కాకుండా ఉంటే చాలు అదే పదివేలు అనుకునే పరిస్థితి రాకూడదని చెప్పాలి. కేంద్ర రైల్వే,ఐటిల శాఖల మంత్రి అశ్వనీ వైభవ్ మరింత ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చి వెళ్లారు.ఎల్లో మీడియాలో మంచి హెడింగ్ కోసం చెప్పారేమో తెలియదు కాని,అమరావతికి బుల్లెట్ రైలు వచ్చేసిందన్న చందంగా మాట్లాడడడం విడ్డూరం. ఆంధ్ర ప్రజలు అమాయకులని,వారికి ప్రపంచంలో జరిగే విషయాలేవి తెలియదని అనుకుంటున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లు వేలాడే ముంతను చూపుతూ ప్రజలను ఊరిస్తారా? లేక ఏమైనా వాస్తవరూపం దాల్చేలా చేస్తారా అన్నది కాలమే తేల్చుతుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ డేటా సెంటర్ నిమిత్తం తర్లుపాడు గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నా, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదట. వారు నిరసన చెబుతారని ఊరును దిగ్బందం చేసి కార్యక్రమం నిర్వహించారట. దీనిని బట్టే ప్రభుత్వం చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చేమో! ఇంతకాలం సైబరాబాద్, హైదరాబాద్ తామే నిర్మించామని చంద్రబాబు చెబుతుండేవారు.ఇకపై విశాఖను తామే విశ్వనగరం చేశామని, తామే నిర్మించామని ప్రచారం చేసుకుంటారేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుపతిలో భూ వివాదం
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి నగర నడిబొడ్డులోని ఎర్రమిట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భూమిలోకి టీడీపీ గూండాలు ప్రవేశించారు. దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి గందరగోళం సృష్టించారు. మహిళలు, స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం, అక్కారంపల్లి సర్వే నం.101/3లో రూ.కోట్ల విలువచేసే 1.05 ఎకరరాల భూమి ఉంది. ఈ భూమి తమదేనని వృద్ధురాలు తులశమ్మ, మరి కొందరు కొంత కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితం కొందరు యత్నించి విఫలమయ్యారు. అసలే ఆదివారం, కోర్టులకూ సెలవులు ఉండడంతో పథకం ప్రకారం ఆ భూమిలో ఉదయం రెండు జేసీబీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ వృద్ధురాలు తులశమ్మ నిరి్మంచుకున్న రేకుల షెడ్డును, దాని చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో తులశమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత సమయానికి మరికొందరు మహిళలు అక్కడికి చేరుకుని జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు పథకం ప్రకారం అక్కడే ఉన్న టీడీపీ గూండాలు మహిళలను అడ్డుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి.. టీడీపీ సానుభూతి పరులైన కొందరు మహిళలను పిలిపించారు. ఎంతకూ పనులు ఆపకపోవడంతో బాధిత మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మరి కొందరు జేసీబీలకు అడ్డుపడ్డారు. తిరుపతి ఎర్రమిట్టలో టీడీపీ దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల ముసుగులో టీడీపీ చేస్తున్న భూ కబ్జా అని మండిపడ్డారు. తిరుపతి నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులతో కలిసి సీపీఐ నేతలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. -
సీఎం సన్నిహితులకేనా జాక్పాట్?
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనూషకు వెస్ట్ బైపాస్ పక్కనే నివాస, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్పాట్ తగిలిందా.. మాకు తగలదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలుతోపాటు.. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఎకరానికి జరీబు భూమైతే 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు.. మెట్ట భూమైతే 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లే అవుట్లలో సీఆర్డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. బెజవాడ రమేషా.. మజాకా! తుళ్లూరు మండలం మందడంకు చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబరు 496/4, 387/2, 143, 22/2, 40, 21/1, 88, 2బీ/4, 139/ఏ, 512/2, 3బీ–0, 6బీ, 455/1ఏ, 131/1, 272బీ, 54బీ/4, 59/ఏ, 57/బీ, 73/2, 29/1, 59/బీ, 136, 135/2, 33/4లలో బెజవాడ రమేష్, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రాహ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చింది. ఇందుకుగానూ ఏటా వారి కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియా(ప్ర«దాన రాజధాని ప్రాంతం)లో సచివాలయానికి ఎదురుగా నాలుగు రోడ్ల జంక్షన్ (కూడలి)లో బెజవాడ రమేష్, మధులకు లాటరీ ద్వారా 2,500 గజాల వాణిజ్య ప్లాటును సీఆర్డీఏ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్సార్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకు ఇచ్చారు.బెజవాడ రమేష్, మధుకు కేటాయించిన 2500 గజాల వాణిజ్య ప్లాట్లు బిట్స్ పిలానీ విద్యా సంస్థకు కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించింది. సచివాలయానికి కూతవేటు దూరంలో 25 మీటర్లు, 17 మీటర్ల రెండు రోడ్ల కూడలిలలో 4,500 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్కు లాటరీ ద్వారా ఇచ్చింది. ఎన్–6 ప్రధాన రహదారికి ఆనుకుని 5,940 గజాల చొప్పున పక్కపక్కనే రెండు వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే రెండు రోడ్ల కూడలిలో 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాటును, సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకుని 2,400 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్పాట్ తగిలిందని.. అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.కీలక ప్రాంతాల్లో రాధాకృష్ణ కొడుకు, కూతురుకు ఆరు ప్లాట్లు రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలు మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని నీరుకొండలో సర్వే నెంబరు 71, 72, 73లో 5.39 ఎకరాలు కొనుగోలు చేసి.. 2016 అక్టోబర్ 30న రిజి్రస్టేషన్ చేయించుకుని.. భూ సమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించారు. ఇందుకుగాను ఇతర రైతులలానే వారికి సీఆర్డీఏ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్కు పక్కనే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు.. కూతురు అనూషకూ అక్కడే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు దక్కాయి. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరికీ 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ ఆరు ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం. కోరుకున్న చోట ధనేకులకు ప్లాట్లుధనేకుల సుబ్బారావు తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెంలో సర్వే నెంబరు 66/1ఏలో 0.47, నేలపాడులో సర్వే నెంబరు 95/ఏలో 0.50, 9/ఏలో 0.86, 93/1సీలో ఎకరం, 66/2లో 0.53, 93/1ఏలో 5.53, 93/1బీ 0.60, 98లో 0.10 వెరసి 9.59 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకుగాను వారికి సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటుచేసుకుంది. «కొత్తగా నిర్మింస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్ సర్కిల్ దగ్గర ఎన్10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల నివాస ప్లాటు, సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మింస్తున్న ప్యాలెస్కు సమీపంలో ఎన్11 ప్రధాన రహదారికి ఆనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాటును, హైకోర్టుకు కూతవేటు దూరంలో ఎన్9 రోడ్డు పక్కనే 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటును ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ లాటరీ ద్వారా కేటాయించింది. ఇదిగో ప్లాట్ల మాయాజాలం! రైతుల్లో ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాల(217 చదరపు కిలోమీటర్లు)ను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో 34,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో.. నాలుగు రోడ్ల కూడలి.. ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ ప్రజా ప్రతినిధుల మద్దతు ఉన్న వారికే దక్కుతున్నాయని.. తమకు పల్లపు ప్రాంతం, చెరువులు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురుతోపాటు బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ నేతల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో వేలంలో దక్కిన ప్లాట్లను వారు ఎత్తిచూపుతున్నారు. -
31 మంది టీడీపీ నాయకులపై కేసు
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలోని రైతుల గొడౌన్పై జరిగిన దాడి ఘటనలో 31 మంది టీడీపీ నేతలపై శనివారం కేసు నమోదు చేశారు. రబీలో మొక్కజొన్న సాగు చేసి మద్దతు ధర లేక... ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులైన దళారుల దోపిడీతో నష్టపోతున్న రైతులకు వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. రైతులకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష చేశారు. మురళీకృష్ణపై బురద జల్లాలనే తలంపుతో రైతులు మొక్కజొన్న నిల్వ చేసుకున్న గోదామును మురళీకృష్ణకు చెందినదిగా చిత్రీకరించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర ప్రోత్సాహంతో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలు నిల్వ చేసుకున్న రైతు సుదా సముద్రయ్య, త్రివేణికి చెందిన గొడౌన్పై దాడి చేశారు. షట్టరు పగలగొట్టి అడ్డు వచి్చన రైతులపై విరుచుకుపడ్డారు. సముద్రయ్యపై దాడి చేసి గాయపరిచారు.అధికారులకు సమాచారమిచ్చి అక్రమ నిల్వలని తేల్చాలని ఒత్తిడి చేశారు. గొడౌన్ను సీజ్ చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జరిగిన నష్టం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు, రూరల్ పోలీసు స్టేషన్లో రైతు సముద్రయ్య ఫిర్యాదు చేయడంతో... టీడీపీ పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల అధ్యక్షులు బండ్లమూడి బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, మైలా వెంకటరాజుతోపాటు ముఖ్య నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రు రామారావు, ఆరె వరప్రసాద్, షేక్.బాజి సాహెబ్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, ఫైజుల్లా ఖాన్, బోయపాటి రామ్మోహన్, దర్శి భాస్కరరావుతోపాటు మరో 22 మందిపై రూరల్ ఎస్సై శ్రీహరి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
జగన్ పథకాలు ఆపేశారు.. పనికొచ్చే పథకం ఒక్కటీ లేదు
-
హైదరాబాద్ ఆస్తులు అమ్మిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలు వదులుతాడా?: పేర్ని నాని
-
కూటమి అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారు
-
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
రాజకీయ స్వలాభం కోసమే.. బాబు చెప్పు చేతుల్లో ఏపీ పోలీసులు
-
"చంపేస్తా.. జాతి తక్కువ నా కొడకల్లారా".. మంత్రి బినామీ బూతులు!
-
ఏపీలో దిక్కుమాలిన మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎన్బీ సుధాకర్రెడ్డి విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిపరులైతే తాము ఏం చేయాలని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఎల్లో మీడియాకు చెందిన ఒక టీవీ చానల్ చర్చలోనే ఆయన సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముదామా? ఎర్రమట్టి అమ్ముదామా? గ్రానైట్ అమ్ముదామా? అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మడం కుదరక ఊరుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రుల్ని తయారు చేశారని మండిపడ్డారు.కొంతమంది మంత్రులు సరదాగా తిరుగుతున్నారని, కొందరు మంత్రులు వారికి సంబంధించిన అంశాలనూ పరిష్కరించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. దున్నపోతు మీద వానపడినట్టు ఉంటున్నా రని విమర్శించారు. ఎన్నికల్లో కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టామని, మళ్లీ అదే పని చేసి గెలుస్తామని చెబుతున్నారని ధ్వజమెత్తారు. కానీ వాళ్లు తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూడాలని సూచించారు. టీవీకే జీరో బడ్జెట్ పాలిటిక్స్తో గెలిచిందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోవడం ఒక్కటే కాదని, పార్టీ కూడా పోతుందని చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని అధిష్టానం కట్టడి చేయాలన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, అమ్మాయిలతో సంబంధాలు బయటకు వచ్చాయని విమర్శించారు. చంద్రబాబుకు ముందే చెప్పా ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని చంద్రబాబుకు ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పానని సుధాకర్రెడ్డి తెలిపారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని, చంద్రబాబూ గతంలో మూడుసార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా అవినీతి ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాల్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని, తమ కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ సుధాకర్రెడ్డి ఫైర్ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతికి వచ్చి విలాసాలు, జల్సాలు చేస్తున్నారని సుధాకర్రెడ్డి గతంలోనే బాంబు పేల్చారు. ఆ మంత్రి వ్యవహారాలు బయటపెట్టడంతో అప్పట్లో టీడీపీ అధిష్టానం ఆయనపై కన్నెర్ర చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి వివరణ కోరగా ఆయన సమాధానం ఇచ్చారు. తాజాగా మళ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై అధికార పార్టీ అనుకూల మీడియా చానల్లో జరిగిన చర్చలోనే సుధాకర్రెడ్డి మండిపడడం గమనార్హం. -
‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’
సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్ నిలదీశారు. -
రామ్ ప్రసాద్ రెడ్డి రౌడీయిజం. చేస్తాడనే మంత్రి పదవి ఇచ్చారు
-
గడ్డి తినమంటే తింటావా..!? కేశినేని చిన్ని వర్గీయులు దందా... కొలికి పూడి ఫైర్
-
బాబు గారి కళ్లలో తృప్తి కోసం...
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట చేసిన ఆరోపణ ఏమిటి? ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో నానా ప్రయత్నాలూ చేసింది. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే మాదిరి తాను ఆశించిన రీతిలో నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది. వారు టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కీలకమైన పలు అంశాలు మిస్ అయినట్లు అనిపిస్తుంది. 2019-2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్సీపీ హయాంలోనూ నెయ్యి ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే, 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన ప్రతిపాదన చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న సంబంధం మొదలైన అంశాలపై కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా? అధికారిక హోదాలో చంద్రబాబు పలు ఆదేశాలు ఇస్తుంటారు. వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో తెలియదా! అలాగే మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే. కూటమి హయాంలో కల్తీ జరిగితే సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, పదో తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలిచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా తమకు రావాల్సిన బకాయిలపై ఉద్యోగులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ, డీఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జగన్పై విషం చిమ్మారు2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్రధానంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పేద విద్యార్థులకు ఖరీదైన చదువులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎంతోమంది కూటమి నాయకులు వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు.ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాషకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. కూటమి అధికారంలోకి వస్తే సర్కారు బడుల్లో ఆనాడు అమలవుతున్న ఐబీ, టోఫెల్ విధానాలపై కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అమ్మ భాషను వైఎస్సార్సీపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీ మాతృ భాషకి వ్యతిరేకి అని మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రచారం చేశారు. తెలుగుభాషను విచ్చిన్నం చేస్తున్నామని అన్నారు. మాతృభాషకు ముప్పు ఉందని, మాతృ భాషలోనే బోధన కొనసాగాలని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయడానికి చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతుంటే చూసి ఓర్వలేని కూటమి నాయకులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయని కుట్రలు లేవు.ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందించాలని ముందుచూపుతో వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేడు హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఉన్నతంగా ఎదగాలంటే, నేటి సమాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిచేస్తూ 202-21లో ఆరో తరగతి వరకు మాత్రమే మొదటిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.ఆ తర్వాత ఒక్కో ఏడాది పదో తరగతి వరకు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులంతా వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నవాళ్లంతా ఇప్పుడు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి.జగన్ పాలనలో విద్యారంగంలో సంస్కరణలుపదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సర్కారు బడుల్లో వచ్చిన మార్కులతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఈ పిల్లలు ఇంతటి విజయాలు సాధించడానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన కష్టానికి ఫలితమేనని కూటమి నాయకులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు.తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్వీ వాటర్ ప్లాంట్లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్బీ ప్యానల్ బోర్డును లక్ష రూపాయలతో కొనుగోలు చేసి 62 వేల బోర్డులను ప్రతి క్లాసులోనూ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు లెక్కలు బాగా రావాలని పాల్ ల్యాబ్స్ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ను ప్రవేశ పెట్టడంతోపాటు 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లతో పాఠాలు చెప్పించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్యక్రమానికి వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచింగ్ మొదలు పెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది.కార్పొరేట్ స్కూళ్లకు చంద్రబాబు దాసోహంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వో ప్లాంట్ల నిర్వహణ గాలికొదిలేశారు. ట్యాబ్లు పాడైనా పట్టించుకోలేదు. ఆఖరుకి టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేదు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు. ప్రభుత్వ స్కూల్స్, విద్యారంగం గురించి కూటమి ప్రభుత్వంలో ఒక్క గొప్ప నిర్ణయం తీసుకున్న పాపానపోలేదు. ఇవేమీ చేయకుండానే కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు.వైఎస్ జగన్ అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైయస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్న చంద్రబాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమై వారి కోసం పనిచేస్తున్నాడే కానీ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.హామీలపై ప్రశ్నిస్తే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారుఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏలు ఇచ్చినా చంద్రబాబు మాత్రం 4 డీఏలు పెండింగ్లో పెట్టాడు. ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషనర్ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై యుద్ధం చేస్తే తప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు.పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో శాలరీ కోతలంటూ కూటమి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతోంది. ఏపీ హెచ్పీ అంటూ హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా ఉద్యోగాల జీతాలకు కోతలు విధిస్తామన్న హెచ్చరికలకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదు. అందరూ సంఘటితపై ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులను వైయస్సార్సీపీ ఆదుకుంటుంది. కూటమి పాలనపై సర్వేలు చేయించుకున్న చంద్రబాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని తెలిసి షాకయ్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మహానాడును నెల్లూరు జిల్లాకు చంద్రబాబు మార్చేశాడని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. -
జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్
-
‘జావా డిస్కవర్’ పరువు పాయే.. ఆ డాక్యుమెంటరీ తొలగింపు
సాక్షి, తాడేపల్లి: తప్పుడు కథనం ప్రసారం చేసి పరువు పోగొట్టుకున్న జావా డిస్కవర్.. వెనక్కి తగ్గింది. ఆ ఛానల్.. ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించింది. డాక్యుమెంటరీలో జగన్ ఫోటోని ఆ ఛానల్ తప్పుగా చూపించగా.. దీనిపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్సార్సీపీ నోటీసులు పంపింది. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే, జర్నలిస్ట్ సుధాకర్రెడ్డి రాయని అంశాన్ని జావా డిస్కవర్ ఛానల్ ప్రస్తావించింది. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుధాకర్రెడ్డి.. లీగల్ చర్యలకు దిగారు. తప్పు తెలుసుకున్న ఆ ఛానల్ డాక్యుమెంటరీని తొలగించింది. వైఎస్ జగన్ పై తప్పుడు ట్రోల్స్ చేసి టీడీపీ అభాసుపాలైంది.ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ను ఇరికించేందుకు పచ్చ పార్టీ కుట్రలు పారలేదు. తప్పుడు కథనాలు చేసిన జావా డిస్కవర్ ఛానల్.. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చడంతో పాటు వక్రీకరించింది. 2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ఉడుముల సుధాకర్ రెడ్డి పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే తాను చెప్పని.. పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?
-
నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు
-
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై టీడీపీ గుండాల దాడి
-
ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశం చేసి.. MLA బండారు శ్రావణిపై TDP నేత సంచలన వీడియో
-
ప్రభుత్వ స్థలంలో టీడీపీ ఆఫీసు భూమి పూజ బాబుపై SV మోహన్ రెడ్డి ఫైర్
-
ఎస్ఐఆర్పై అలర్ట్గా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ(మే 6, బుధవారం) జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని.. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ను పెంచుకోవాలని సూచించారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా(బెంగాల్, తమిళనాడు)లో తొలగించడం జరిగింది. మనం వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరం’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీ ఓటర్లపై చంద్రబాబు, ఆయన టీమ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కావున మన తరుపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్థుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలి. మనం ఎస్ఐఆర్ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలి. బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్ చేశారు.. కావున మనం ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలి. ఎస్ఐఆర్ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలి. బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్పర్ట్ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్దంగా ఉంటుంది. బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇద్దాం. మనం నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చు. అంతేకాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం విజయం సాధించవచ్చు. ఎస్ఐఆర్ పై చర్చ అనంతరం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ వారంలో వచ్చేవారం ఆసుపత్రుల సందర్శన, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి కార్యక్రమాలను మనం షెడ్యూల్ చేసుకున్నాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.కమిటీల వెరిఫికేషన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తోంది, మీరు మరింత వేగవంతం చేయాలి. అందుకు అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ, ఉన్మాదం, అవినీతి, రెడ్ బుక్ పాలనపై కూడా నియోజకవర్గాల్లో మీరు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఈ సమావేశంలో మాట్లాడిన కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వరికూటి అశోక్ బాబు, అబ్బయ్య చౌదరి, కొరుముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు ఎస్ఐఆర్పై తమకు ఉన్న అవగాహన, అనుమానాలపై చర్చించి పార్టీ క్యాడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్ఐఆర్ పూర్తయ్యేవరకు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. -
తమిళనాడు పరిస్థితే ఏపీ లో రిపీట్... TVK విజయ్ విజయంపై చింతా మోహన్ రియాక్షన్
-
వికటించిన పచ్చపార్టీ కుట్రలు
సాక్షి,విజయవాడ: పచ్చపార్టీ కుట్రలు విఫలమయ్యాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. జావా డిస్కవర్ ఛానల్లో తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయి. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చి, వక్రీకరించి జావా డిస్కవరీ ప్రసారం చేసింది.2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది. అయితే తాను చెప్పని, పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ వెనుక ఎల్లో బ్యాచ్ ఉన్నట్లు బయటపడింది. అసలు రచయితే డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీడీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి. Misleading Pictures and false linkage used in ‘tweaked’ edition of Planet Killers documentaryI want to clarify a few important points regarding the planet killers documentary which extensively used the contents in my book ‘Blood Sanders’.First English documentary version…— Sudhakar Udumula (@sudhakarudumula) May 6, 2026 -
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
నా కూతురు కోసం నువ్వు మాట్లాడావు కాబట్టి చెప్తున్నా..
-
KSR Debate: ఏపీలో రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు..!
-
ఎంత చెప్పినా వినలేదు టీడీపీ నేతల దాడి పై రైతుల రియాక్షన్
-
బరితెగించిన టీడీపీ MLA ధూళిపాళ్ల అనుచరులు.. రైతుల గోడౌన్ పై దాడి
-
ఎంకి పెళ్లి... సుబ్బి చావుకొచ్చినట్టు....
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాలలో సొంతంగా ఎదిగి తన ప్రత్యేకతను చాటుకోవడంతో తనను తాను రుజువు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండిపోవడమా? లేక స్వయంగా ప్రకాశించడమా?అన్నది తేల్చుకోవడానికి సిద్దమవుతారా?లేదా? అన్నదే ఇప్పుడు చర్చ. టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినంత వరకు ఓకే గాని, అచ్చంగా టీడీపీని మోయడానికే జనసేన ఉన్నట్లు రాజకీయాలు సాగిస్తున్న తీరు ఆ పార్టీ క్యాడర్ కు మింగుడుపడని వైనమే. విజయ్, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చినవారు. కాని వీరిద్దరి మధ్య చాలా వత్యాసం ఉంది. విజయ్ ఇంతవరకు చిత్తశుద్దితో, ధైర్యంగా రాజకీయాలు చేస్తే, మొదటి నుంచి పవన్లో ఆ లక్షణాలు లోపించాయి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాక తెలుగుదేశం, బీజేపీలకు మద్దతిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, నిలదీస్తానని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది మాత్రం సున్నా. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా పూటకో చందంగా మాట్లాడిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒకసారేమో 1800 ఎకరాలలో రాజధాని నిర్మించవచ్చని అన్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాల భూమి సేకరిస్తోందని రైతుల్లో వ్యతిరేకత వస్తే... వారికి మద్దతు పలికారు. ఆ వెంటనే హైదరాబాద్లో చంద్రబాబును కలవడమే తడవు మనసు మార్చుకున్నారు. మరో సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో విజయవాడ తీసుకు వెళ్లి చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేయడంతో ఆయన కరిగిపోయారు. విశాఖ వెళితే అదే రాజధాని, కర్నూలు వెళ్లి ఇదే తన మనసుకు రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడారు.చివరికి తెలుగుదేశం పార్టీ అమరావతిని ఒక సామాజికవర్గ రాజధానిగా మార్చుతోందని, గేటెడ్ కమ్యూనిటీ అయిందని కూడా విమర్శించారు. కాని 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుని అదికారంలోకి వచ్చాక అన్ని మర్చిపోయి, చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊ కొడుతున్నారు.పైగా వేల ఎకరాల అమరావతి రాజధానికి తన మద్దతు ఎప్పుడూ ఉందని అసెంబ్లీలోనే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. 2018లో టీడీపీతో బహిరంగంగా విడిపోయినప్పటికీ, రహస్య సంబంధాలు కొనసాగించారన్న ఆరోపణలు పవన్ పై ఉన్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు సహాయ సహకారాలతోనే కొన్ని చోట్ల అభ్యర్ధులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజయ్ అలా చీకటి బంధాలకు తావివ్వలేదు. ఉన్నదేదో నేరుగా చెబుతూ వచ్చారు.ఆయా పార్టీలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు.అనూహ్యంగా 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ భయపడిపోయారు. వెంటనే చెగువేరా నుంచి ప్రధాని మోడీ వైపునకు మళ్లారు. చంద్రబాబు సూచనల మేరకు బీజేపీని బతిమలాడుకుని మళ్లీ పొత్తు పెట్టుకున్నారు.తదుపరి టీడీపీని జత చేసేందుకు తాను తిట్లు తిన్నానని ఆయనే చెప్పారు.తన తల్లిని దూషించిన టీడీపీ వారిని క్షమించబోనని బీకర ప్రతిజ్ఞ చేసిన పవన్ తదుపరికాలంలో ఆ విషయాన్ని విస్మరించి, అదే టీడీపీ నేతలను తెగ పొగడడం ఆరంభించారు. విజయ్ మాత్రం బీజేపీని తన సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ చేసిన ప్రకటనలకు కట్టుబడి రాజకీయం సాగించారు. బీజేపీ విజయ్ను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాని విజయ్ ఎక్కడా తన విధానాన్ని వీడలేదు. పవన్ కళ్యాణ్ అలాకాదు. వైఎస్సార్సీపీతో జతకలవలేదు కాని, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలు అన్నిటితో అవకాశాన్ని బట్టి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ అంతటి అవినీతి పార్టీ లేదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆ పార్టీని, చంద్రబాబును గొప్పగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సమయంలో చాలామంది ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఏభై సీట్లు అడగాలని, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోరాలని సూచించారు. కాని తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలని, జనసేనకు 21 సీట్లు ఇస్తే హాపీ అని ఆయన సరిపెట్టుకున్నారు. అందులో కూడా పది సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇవ్వడం మరో విశేషం. విజయ్ అలాకాదు.తాను ఏది చెబితే దానికే కట్టుబడి మొత్తం అన్ని సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టారు. తన కారు డ్రైవర్ కుమారుడికి కూడా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తను గెలిచినా, ఓడినా, ఇలాగే ఉంటానని విజయ్ స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులకు ముఖ్యమంత్రి పదవి గురించి పలుమార్లు రెచ్చగొట్టారు.కనీసం కులభావన రావాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.ఆ తర్వాత తనకు కులం ఏమిటని ఆయనే ప్రశ్నించారు. పైగా 15 ఏళ్లపాటు టీడీపీని మోయాలన్నది తన నిర్ణయం అన్నట్లుగా ప్రసంగాలు చేస్తూ, జనసేన క్యాడర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు. కాపు సామాజిక వర్గంలో అనేకమంది ఇప్పుడు ఈయన తమను ముంచేశారని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు తనకు ఎంతో బలం ఉందని చెప్పుకున్న పవన్ , ఆ తర్వాత కాలంలో టీడీపీకి ఉన్న శక్తి తమకు ఎక్కడ ఉందని క్యాడర్ ను ప్రశ్నించి ఆశ్చర్యపరచారు. విజయ్ మాత్రం ఎక్కడా కులాలు, మతాల జోలికి వెళ్లకుండా తన విధానాలపైనే ప్రసంగాలు చేసేవారని చెబుతారు.విజయ్ ఏ మీడియాపైన ఆధారపడలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా ను నమ్ముకుని చంద్రబాబు చెప్పినట్లు రాజకీయం చేస్తున్నారన్న భావన ఉంది. సమీప భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేశ్ను సీఎంగా చేయడానికి కూడా పవన్ అంగీకరించినట్లే ఉందన్న అభిప్రాయం పార్టీలో ఉంది.పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత విధేయుడుగా చేసుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విజయ్ తన పార్టీ టీవీకే కార్యకర్తల ఆత్మాభిమానం నిలబెట్టేలా వ్యవహరిస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ వారు అవమానించినా పడి ఉండాల్సిందేనన్న చందంగా ప్రవర్తిస్తున్నారని జనసేన నేతలే మీడియా ముందు వాపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన స్వార్దం కోసం, టీడీపీని మోయడం కోసం రాజకీయాలు చేస్తుంటే, విజయ్ మాత్రం సూత్రబద్దమైన రాజకీయాలు చేసేందుకు యత్నిస్తుంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్లే రజనీకాంత్, కమల్ హసన్ వంటి పెద్ద నటులు సాధించలేని ఘనతను విజయ్ సాధిస్తే, మంచి పాలోయింగ్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లో చిత్తశుద్ది లోపం,స్థిరత్వం లేకపోవడం వల్ల టీడీపీపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్నారన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మొక్కజొన్న గోడౌన్పై టీడీపీ గూండాల దాడి
పొన్నూరు: మొక్కజొన్నకు ధర లేకపోవడంతో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో రైతులు పంట నిల్వ చేసుకున్న గోదాముపై టీడీపీ గూండాలు మంగళవారం దాడికి తెగబడ్డారు. ఇనుప రాడ్లతో గోడౌన్ షట్టర్ను పగులగొట్టి అడ్డొచ్చిన గోడౌన్ యజమాని సుదా సముద్రయ్యను దుర్భాషలాడుతూ అతడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్లే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఈ దుర్మార్గం చేయించారని దుమ్మెత్తి పోసిన రైతులు మొక్కజొన్నను మద్దతు ధరకు కొనిపించాల్సింది పోయి గోడౌన్పై దాడి చేయించడం ఏమిటని నిలదీశారు. టీడీపీ నేతల హైడ్రామా పొన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. ఈ పంటనంతా కొనిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మొక్కజొన్న రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వారితో కలిసి వివిధ రూపాల్లో ఆందోళనలు జరిపారు. దీంతో టీడీపీ నేతలు కుట్రపన్ని మురళీకృష్ణ ఇంటికి సమీపంలోని గోడౌన్లో రైతులు దాచుకున్న మొక్కజొన్న నిల్వలన్నీ మురళీకృష్ణ కొనుగోలు చేసినవేనంటూ హైడ్రామాకు తెరతీశారు.సుమారు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గూండాలను వెంటబెట్టుకుని మంగళవారం మామిళ్లపల్లికి చేరుకుని గోడౌన్పై దాడి చేయడమే కాకుండా తాళాలు పగులగొట్టి పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. మొక్కజొన్న బస్తాలపై వైఎస్సార్సీపీ జెండాలను వేసి పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు చెందిన గోదాముగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకుల హంగామా చూసి పంటను గోడౌన్లో నిల్వ చేసుకున్న రైతులు అక్కడికి చేరుకోగా.. వారిపైనా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. టీడీపీ చర్యలపై రైతులతోపాటు గ్రామ ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా.. ఘటనపై బాధిత రైతులు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లోను, తహశీల్దార్ కార్యాలయంలోను ఫిర్యాదు చేశారు. అద్దె తీసుకుంటున్నాం అంబటి మురళీకృష్ణపై నింద మోపాలనే ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ప్రోత్సాహంతోనే టీడీపీ నాయ కులు ఈ అరాచకానికి పాల్పడ్డారు. 30 ఏళ్లు టీడీపీకి సేవలందించిన నాకు ఎమ్మెల్యే తగిన బుద్ధి చెప్పారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులొచ్చి మా గోడౌన్లో మొక్కజొన్న నిల్వ చేసుకుంటామని అడిగారు. రైతుల కోరిక మేరకు బస్తాకు రూ.20 చొప్పున తీసుకొని నిల్వ చేస్తున్నాను. – సుదా సముద్రయ్య, గోదాము యజమాని, మామిళ్లపల్లి -
ఐపీఎల్ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు
కందుకూరు: హైదరాబాద్లో ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.పలుకూరుకు చెందిన అశోక్చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడి అంతా అశోక్చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతోపాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీన్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్లో మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.దీనికిగాను గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవారు. అలా పొందిన టికెట్లను బ్లాక్మార్కెట్లో ఒక్కొక్కటి రూ.22 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వీఐపీ లెటర్హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్చౌదరి, దినేష్, వేణుమాధవ్లను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందినవారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్లతో హంగామా చేయడం పరిపాటి అని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫొటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలతో తననుతాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్మార్కెట్ ముఠా నడిపిస్తున్నాడు. -
ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
-
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు భారీ అవినీతి
-
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
దశరథరామిరెడ్డిపై దాడి.. మిథున్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!
-
కూటమి వేధింపులకు టీడీపీ కార్యకర్త సూసైడ్ సెల్ఫీ వీడియో
-
ఇదొక పిరికిపంద చర్య.. నువ్వు నిజంగా మగాడివి అయితే.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వార్నింగ్
-
దళిత యువకుడిని బలిగొన్న టీడీపీ
కర్నూలు/కర్నూలు (టౌన్): ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరుడి వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు శ్రీరామ్నగర్లో ఆదివారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన బీసీ సతీష్ (27) ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తనపై అక్రమంగా కేసు పెట్టించి వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు ఆ యువకుడు సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపింది. ‘నా ప్రేమ వ్యవహారంలో మెయిన్ విలన్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరుడు గట్టు తిలక్. మంత్రి టీజీ భరత్ నన్ను వేధించాడు. టీడీపీ పవర్ను ఉపయోగించి నీ జీవితం నాశనం చేస్తా.. నీ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేస్తా.. ఎస్సీవైన నీకే అంత ఉంటే.. నాకెంత ఉండాలి’ అని వేధించి బెదిరించాడు. ‘నువ్వు, నీ కుటుంబం ఊరొదిలి వెళ్లాలని పోలీసులతో ఒత్తిడి చేయించాడు. చివరకు అమ్మాయి తండ్రితో నాపై అక్రమంగా కేసు పెట్టించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తుండటాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని మృతుడు సతీష్ సూసైడ్ నోట్ వివరించాడు. ప్రేమ వ్యవహారంలో వేధింపులే కారణం కర్నూలు శ్రీరామ్నగర్లో ఉంటున్న బీసీ బాలన్న, శోభారాణి దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన సతీష్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. కాగా.. అదే కాలనీకి చెందిన ఓ యువతి, సతీష్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీష్ కుటుంబం చాలాకాలంగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటోంది. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు సతీష్ ప్రేమ వ్యవహారాన్ని బజారుకీడ్చి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ వ్యవహారాలు చక్కబెడుతున్న ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ను వారంతా సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రేమ జంటను విడదీసేందుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఐదు రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా మంత్రి టీజీ భరత్కు చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్లో డాక్టర్లను కలవడానికి సతీష్ వెళ్లగా.. ఆ ఆస్పత్రి పాలనా వ్యవహారాలు చూస్తున్న గట్టు తిలక్ ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి అతడిని బెదిరించాలని ఆదేశించాడు. దీంతో అతడి సెల్ఫోన్ లాక్కున్న కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రాత్రి 10 గంటల వరకు కూర్చొబెట్టి వదిలేశారు. ఇంటికి చేరుకున్న సతీష్ జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు తన సెల్ఫోన్ను ఇవ్వకపోవడంతో సతీష్ తీవ్ర మనస్తాపం చెందాడు.ఆదివారం రెండు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. తన చావుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కారణమంటూ కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నిటినీ ఆ లేఖలో వివరించాడు. అనంతరం ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. ఫ్యాన్కు వేలాడుతున్న సతీష్ను చూసిన తల్లి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి మార్చురీ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని తండ్రి బీసీ బాలన్న ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గట్టు తిలక్పై కేసు నమోదు చేయాలి: ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ ప్రేమ వ్యవహరంలో తలదూర్చి కర్నూలులోని శ్రీరామనగర్కు చెందిన సతీష్ ఆత్మహత్యకు కారకులైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్పై వెంటనే కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద మృతుడి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సతీష్ మరణానికి కారణమైన గట్టు తిలక్పై చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
నా చావుకు కారణం మీ అనుచరులే..
నిడదవోలు రూరల్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనుచరుల టార్చర్ వల్లే నేను చనిపోతున్నాను.. అకారణంగా ఓ కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్టా మణికంఠ సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో మణికంఠ ఆచూకీ తెలపాలని టీడీపీ నాయకులు నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మరో వైపు మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సెల్ఫీ వీడియో సారాంశం ఇదీ.. ‘నా పేరు కట్టా మణికంఠ. మాది నిడదవోలు మండలం సింగవరం. నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నాను. మంత్రి కందుల దుర్గేష్ గారూ.. నేను తెలుగుదేశం కార్యకర్తను. మా నాన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 1989 నుంచి అదే టీడీపీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజ్, స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దానిపై మా నాన్న 14 నెలలుగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ బూత్ ఇన్చార్జినైన నా మీద కేసులు పెడితే ఇంకా ఎందుకు సార్ పార్టీ. మీ నియోజకవర్గంలో బీసీలంటే అంత చులకనా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నా ఫోన్ సీజ్ చేశారు. ఎస్సై, సీఐ పట్టించుకోవడం లేదు. నేను పనిచేసిన చోటుకు వచ్చి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నాకు గుండె దడగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి, పెన్మత్స చందు వర్మ, అచ్యుత్ పవన్, సాయిలక్ష్మణ్ అడ్డాల, ఎస్సై జగన్మోహన్రావు, సీఐ తిలక్లే. నేను చనిపోతున్నాను.. నా వల్ల కావడం లేదు.’ అని పోస్టు చేశాడు. -
మనోడైతే ఇచ్చేద్దాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగులైనా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థ ఉద్యోగులైనా పదోన్నతి కల్పించడానికి, వేతనాలు పెంచడానికి వారి అర్హత, పనితీరే కొలమానం. కానీ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్)లో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది. అధికార పార్టీకి సానుభూతిపరులైతే చాలు.. అర్హత లేకున్నా పనితీరు తీసికట్టుగా ఉన్నా.. ప్రతిభ లేకపోయినాసరే పదోన్నతి ఇచ్చేస్తున్నారు. వేతనాలు భారీగా పెంచేస్తున్నారు.అర్హత ఉండి.. మెరుగైన పనితీరు కనబరుస్తూ.. లక్ష్యాల సాధనలో ప్రతిభ చాటుతున్న ఉద్యోగులకు పదోన్నతి, వేతనాలు పెంచడానికి ముడుపులు వసూలు చేస్తున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై సీఈవో, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి సస్పెండ్ చేయిస్తున్నారు. పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధింపులకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టిల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షించడం.. వాటిని నిర్వహించడమే లక్ష్యంగా 2016లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏపీయూఐఏఎంఎల్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 49 శాతం కాగా.. ఐఎల్అండ్ ఎఫ్ఎస్ వాటా 51 శాతం. నష్టాలు వచ్చిన విభాగాల్లో పదోన్నతులు, వేతనాల పెంపు రాష్ట్రంలో 8 విభాగాల్లో ఏపీయూఐఏఎంఎల్ సేవలందిస్తోంది. 243 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సంస్థలో కొత్త పదవి సృష్టించి.. అందులో టీడీపీ సానుభూతిపరుడిని నియమించారు. నెలకు వేతనం రూ.3,94,240 చెల్లిస్తున్నారు. ఐఏఎస్ అధికారికి కూడా ఈ స్థాయి వేతనం ఉండదు. దీంతోపాటు టీడీపీ సానుభూతిపరులైన ముగ్గురు ఉద్యోగులకు సీఈవో కార్యాలయం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. వారికి వరుసగా నెలకు రూ.2,46,400, రూ.1.90 లక్షలు, రూ.1.75 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు.ఈ నలుగురు కలిసి ఉద్యోగులు టీడీపీ సానుభూతిపరులైతే అర్హత లేకున్నా.. పనితీరు సక్రమంగా లేకున్నా పదోన్నతి కల్పించి, వేతనాలు పెంచేలా చక్రం తిప్పుతున్నారు. ఎకనమిక్ డెవలప్మెంట్ (ఈడీ), అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ (యూఐడీ), పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విభాగాల్లో మాత్రమే ఈ సంస్థలకు లాభాలు వస్తున్నాయి. మిగతా 5 విభాగాల్లోనూ నష్టాలే. 2025–26లో ఈ సంస్థకు రూ.19.99 కోట్ల ఆదా యం వస్తే.. ఖర్చులు రూ.12.48 కోట్లు పోగా రూ.7.51 కోట్లు లాభాలు వచ్చాయి.ఈడీ విభాగంలో రూ.7.81 కోట్ల లాభం రాగా.. యూఐడీలో రూ.1.29 కోట్లు, పీపీపీ విభాగంలో రూ.61.65 లక్షల లాభాలు వచ్చాయి. ఇందులో తక్కువ లాభం వచ్చిన పీపీపీ విభాగంలో ఓ ఉద్యోగికి వేతనాలు పెంచి నెలకు రూ.4,63,050 చొప్పున ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుడనే ఏకైక కారణంతో ఇటీవల బీడీడీ విభాగంలో ఓ ఉద్యోగిని తీసుకుని నెలకు రూ.3,85,714 చొప్పున వేతనం ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులైన ఉద్యోగులకు లేదా ముడుపులు ఇచ్చిన వారికి నెలకు గరిష్టంగా రూ.4.63 లక్షల నుంచి కనిష్టంగా రూ.1.42 లక్షల చొప్పున వేతనాలు ఇస్తున్నారు.అన్యాయాన్ని ప్రశ్నిస్తే సస్పెన్షన్ నజరానా తమకు అప్పగించిన విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. తమ ప్రతిభ ఆధారంగా లాభాలు తెచ్చిన ఉద్యోగులకు పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే... సీఈవోకు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి వారిపై సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. లేదంటే మెమోలు ఇప్పించి వేధిస్తున్నారు. కన్సల్టెంట్గా పనిచేస్తున్న షేక్ అజీమ్ అహ్మద్పై ఇదే రీతిలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి సస్పెన్షన్ వేటు వేయించారని ఉద్యోగులు తెలిపారు.తమ మాట వినకుండా ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వకుండా, వేతనాలు పెంచకుండా ఆ నలుగురూ మోకాలడ్డుతున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ సంస్థ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కానీ.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ అయిన ఏపీయూఐఏఎంఎల్ సిబ్బందికి మాత్రం ప్రభుత్వ నిధులతో ప్రతినెలా ఠంఛనుగా జీతాలు ఇస్తుండటం గమనార్హం. -
మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి
-
YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి
-
‘కట్టుకథలతో నాపై అట్రాసిటీ కేసు పెట్టారు’
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్లను కూడా రెడ్బుక్ వదల్లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు...ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదు’
సాక్షి, నెల్లూరు: ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ.. గుణపం పోటు పార్టీ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన వారిని మీ వెనుక వేసుకొని.. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడం కాదన్నారు. చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదని కాకాణి ఎద్దేవా చేశారు.గుణపం చంద్రబాబు చేతిలో పెడితే సింబాలిక్గా వుంటుంది. అమరావతిని గుణపంతో తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. దోపిడీ విజనరీతో అవినీతితో రాజ్యం ఏలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాలు పేరిట కాంట్రాక్టుల మాటున కొల్లగొడుతున్నారు’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి ధ్వజమెత్తారు. -
కొండపై సొరంగాలు..
సాక్షి, టాస్క్ఫోర్స్: అటవీ భూముల్లో లభించే సహజ సంపదను కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు దోచేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో రంగురాళ్లు (క్రిస్టల్, క్వార్ట్జ్) కోసం కొండను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి రంగురాళ్లు తీసి హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్, పుణే, ముంబయి తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల సహాయ సహకారాలు, టీడీపీ ముఖ్య నేతల అండదండలతో ఆ పార్టీ స్థానిక నాయకులు రంగురాళ్ల అక్రమ వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తారన్నది జగమెరిగిన సత్యం. పచ్చని కొండను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. కొండపై సొరంగాలు తవ్వి రంగురాళ్ల సేకరణ దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో శంకరపురం అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా సుగాలీలు నివసిస్తుంటారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో రంగురాళ్లు నిక్షిప్తమైన కొండ ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండకు కన్నం వేయాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు రచించారు. ముఖ్యనేతలు రంగంలోకి దిగి కొండపై అక్రమంగా తవ్వకాలు జరిపేలా స్కేచ్ వేశారు. శంకరపురంతోపాటుగా భట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు, దాచేపల్లి గ్రామాల్లో ఎంపిక చేసుకున్న కూలీలను కొండపైకి తరలిస్తున్నారు.కొండ లోపలికి దిగి తవ్వకాలు జరిపేందుకు వీలుగా జనరేటర్లు, టార్చిలైట్లు కూడా ఏర్పాటు చేశారు. రోజూ కొండపై రంగురాళ్ల కోసం కూలీలతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండకు కన్నం వేసి వందల కిలోల రంగురాళ్లను బయటకు తీస్తున్నారు. కొండపై సుమారుగా 100 అడుగుల లోతులో కూడా సొరంగాలు తవ్వారంటే ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. సొరంగాల్లోకి వెళ్లిన కూలీలకు బ్లోయర్స్ ద్వారా కొండపై నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. లోపలి భాగంలో దాగి ఉన్న రంగురాళ్లు కనిపించేలా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదభరితంగా సొరంగాలు శంకరపురం కొండపై ఉన్న సొరంగాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ కూలీలు తీసిన సొరంగాల్లోకి వెళ్లిన పలువురు గాయాలపాలయ్యారు కూడా. కొందరు కూలీలు ఊపిరాడక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇవేవీ బయటకు రాకుండా చేస్తున్నారు. సొరంగాల్లో తవ్వకాలు జరిపే కూలీల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కూలీలను బెదిరించి... దోచుకుంటున్న టీడీపీ నేతలు శంకరపురం కొండను కొల్లగొట్టి రంగురాళ్లు తవ్వుకుని టీడీపీ నాయకులు భారీగా సంపాదిస్తున్నారు. కొండలో లభించే రంగురాళ్లలో నాణ్యతను బట్టి కేజీ రూ.1,000 నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. రూ.10 వేలు విలువ చేసే రాయి దొరికితే... టీడీపీ నాయకులు కూలీలను భయపెట్టి నామమాత్రపు డబ్బులు ఇచ్చి వారి శ్రమను దోచుకుంటున్నారు. వచ్చిందంతా మాదే అంటూ భయపెడుతున్నారు. మాకు తెలియకుండా రంగురాళ్లను అమ్మితే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక పొట్టకూటి కోసం కూలీలు టీడీపీ నాయకులు ఇచ్చింది తీసుకుంటున్నారు. ఆ నాయకులేమో హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, పుణే, గుజరాత్ తదితర ప్రాంతాలకు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులపాటు రంగురాళ్ల అమ్మకాలు జోరుగా జరుగుతుంటాయని కూలీలు చెబుతున్నారు. దాచేపల్లిలోని ఓ గొడౌన్లో టీడీపీ నేతలు భద్రపరచిన రంగురాళ్లను శుక్రవారం రాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన రంగురాళ్ల విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు కొండకు కన్నం వేసి కోట్లకు పడగలెత్తుతున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనమని పలువురు అంటున్నారు.అక్రమార్కులతో అటవీశాఖ సిబ్బంది చెట్టాపట్టాల్ శంకరపురం కొండపై టీడీపీ నాయకుల పర్యవేక్షణలో రేయింబవళ్లు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండపై తవ్వకాలు జరుపుతుంటే ఆ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. కొండ కింద తనిఖీల కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ బాక్స్ ఎప్పుడూ తాళం వేసినట్లుగానే కనిపిస్తుంది.కొండపైన తవ్వకాలు జరుగుతున్నా ఇక్కడి సిబ్బంది తనిఖీలు కూడా చేయకుండా వదిలేశారు. టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని అటవీశాఖ సిబ్బంది తిరుగుతుండటం వల్లే కొండపై తవ్వకాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. తనిఖీలు చేసినా... నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. రంగురాళ్ల తవ్వకాల్లో అటవీశాఖ సిబ్బందికీ వాటాలున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొండపై అక్రమ తవ్వకాలను అటవీశాఖ అధికారులు అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
అర్హులపై వేటు.. అనర్హులకు చోటు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు గంగపుత్రుల నోట్లో మట్టికొడుతోంది. సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలను టీడీపీ కార్యకర్తలకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోంది. అధికారంలోకి రాగానే చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి వేట విరామం వేళ ఏటా రూ.20 వేల చొప్పున నిషేధ భృతి చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది తుంగలో తొక్కింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. ఈ ఏడాది మాత్రం అడ్డగోలుగా పార్టీ కార్యకర్తలను వేటకు వెళ్లే మత్స్యకారులుగా నమోదు చేసి వేట నిషేధ భృతిని కాజేసేలా కుట్రలకు తెరతీశారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతోనే టీడీపీ నేతలు దోపిడీకి తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అర్హుల సంఖ్యను భారీగా పెంచి రాష్ట్రంలోని 555 సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలుండగా.. 1.60 లక్షల కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడ్డాయి. 2023–24లో వేటకు వెళ్లే మత్స్యకార బోట్లు 23,209 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 29,252కు చేరింది. వాస్తవంగా మెకనైజ్డ్ బోట్లకు 18 మీటర్లకు పైబడి పొడవు ఉంటే 10 మంది, 18 మీటర్ల కంటే తక్కువ ఉంటే 8 మంది, మోటార్ బోట్లపై ఆరుగురు, ఇంజిన్లేని సంప్రదాయ బోట్లపై ముగ్గురు చొప్పున సిబ్బందికి వేట నిషేధ భృతి ఇవ్వాల్సిఉంది. ఈ పథకం మెకనైజ్డ్ బోటు యజమానులకు వర్తించదు.రిజిస్ట్రేషన్ కలిగిన బోట్లపై మార్చి 31 నాటికి 18–60 ఏళ్ల మధ్య వయసున్న వారికి వర్తిస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేట నిషేధ భృతిని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 1.29 లక్షల మంది అర్హత పొందగా.. వారి ఖాతాల్లో అరకొరగా జమ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అర్హుల జాబితాలో భారీగా అనర్హులను చేర్చి 29,252 బోట్లపై 1.57 లక్షల మంది ఆధారపడినట్టుగా లెక్కేశారు.క్షేత్రస్థాయి పరిశీలనలో 28,677 బోట్లపై 1.52 లక్షల మంది అర్హులున్నట్టుగా లెక్కతేల్చారు. అయితే, సోషల్ ఆడిట్ సందర్భంగా అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో జాబితాల్లోని పేర్లపై పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. నిజమైన లబ్ధిదారులను కాదని మైదాన ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కాని టీడీపీ అభిమానులు, కార్యకర్తలను జాలర్లుగా చిత్రీకరిస్తూ జాబితాల్లో నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.లేని బోట్లను ఉన్నట్టుగా చిత్రీకరించి..ఫిషింగ్ బోటు రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి, మరమ్మతుల అనుమతులు వంటి ప్రక్రియల్లో బ్రోకర్ల దందా సాగింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల సిఫార్సుల మేరకు ఇసుక బోట్లను సైతం చేపల బోట్లుగా నమోదు చేయడమే కాకుండా మూలన పడిన, వినియోగంలో లేని బోట్లను మనుగడలో ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారని చెబుతున్నారు. లేని బోట్లను సైతం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ వాటిపై మత్స్యకారులు ఆధారపడినట్టుగా నమోదు చేయించారని చెబుతున్నారు.ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వేట బోట్ల రిజిస్ట్రేషన్లలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 3 వేలకు పైగా బోట్లను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ బోట్లపై నిబంధనల మేరకు 6నుంచి 20 మంది వరకు నమోదు చేయాల్సి ఉండగా.. మైదాన ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తల పేర్లను ఈ జాబితాల్లో చేర్చి అర్హులుగా చిత్రీకరిస్తున్నారు.రూ.60 వేల బోటుపై.. రూ.1.20 లక్షలు కొట్టేసేలా..సంప్రదాయ బోట్ల పేరిట కూడా నిధులు కొట్టేసేందుకు సైతం టీడీపీ నేతలు కుట్ర పన్నినట్టు చెబుతున్నారు. వాస్తవానికి సంప్రదాయ బోటు తయారీకి రూ.60 వేలు ఖర్చవుతుందని అంచనా. ఆ బోటును ఇంజిన్ బోటుగా చిత్రీకరించి.. ఒక్కో బోటుపై ఆరుగురు చొప్పున చేపల వేటకు వెళ్తున్నట్టు లెక్కలు చూపి ఏకంగా ఒక్కో బోటుపై రూ.1.20 లక్షల నిషేధ భృతిని దోచేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు.‘మీకింత.. మాకింత’ అనే ఒప్పందాలతో స్థానిక మత్స్యశాఖ అధికారులతో టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తూ అనర్హులతో జాబితాలు తయారు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అర్హత పొందిన వారికి రూ.300 కోట్లకు పైగా జమ చేయనుండగా.. కనీసం రూ.50 నుంచి రూ.60 కోట్లు అనధికారిక బోట్లు, మత్స్యకారేతరుల పేరిట దారి మళ్లించేందుకు పథక రచన చేసినట్టు చెబుతున్నారు. ఈ భారీ కుంభకోణంపై ఇటీవల విశాఖలోని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని మత్స్యకారులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.విజిలెన్స్ విచారణ జరపాలిఅర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయి. బోట్ల రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలోనే అనర్హులను పెద్దఎత్తున అర్హుల జాబితాల్లో చేర్చారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపి.. వాస్తవంగా వేటకు వెళ్లే వారికి మాత్రమే నిషేధ భృతిని చెల్లించాలి.– వంకా గురుమూర్తి, అధ్యక్షుడు, రాష్ట్ర మత్స్యకార కార్మిక సంఘం -
మైనర్పై థర్డ్ డిగ్రీ!
తాడేపల్లి రూరల్: టీడీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మైనర్ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. పక్కదారి పట్టించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిలోని ప్రకాష్నగర్కు చెందిన 14 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు గతంలో మరణించారు. దీంతో ఆ బాలుడు కూలి పనులకు వెళుతూ నాయనమ్మ, తమ్ముడిని పోషిస్తున్నాడు.కాగా.. ఇటీవల అతడి బాబాయ్తో టీడీపీకి చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో బాలుడి బాబాయ్ తల పగిలింది. ఆ బాలుడు 108 వాహనంలో బాబాయ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలుడు కేసు పెడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నులకపేటకు చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు, ఇతర నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. స్టేషన్కు పిలిపించి.. కర్కశత్వానికి ఒడిగట్టి.. టీడీపీ నేతల మెప్పుకోసం తాడేపల్లి పోలీసులు ఆ బాలుడిని స్టేషన్కు పిలిపించారు. కెమెరాలు లేని గదిలో అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బెదిరింపులకు దిగారు. హంటర్ (చెక్కపిడికి రబ్బరు తొడిగి ఉన్న చెర్నకోలా)తో ఎస్ఐ సాయి తనను కొట్టారని, మరో కానిస్టేబుల్ తన మోకాళ్లపై బూటుకాలు వేసి తొక్కారని, అరచేతులపై దారుణంగా కొట్టారని బాలుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీఎస్పీ విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులు బాలుడి ఇంటికి వెళ్లి బెదిరించారని, బాలుడి బంధువులు, నాయనమ్మతో డీఎస్పీ ఎదుట తప్పుడు సమాధానం ఇప్పించారని సమాచారం. -
దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ
-
పబ్లిసిటీ ఫుల్, సంక్షేమం నిల్ అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల పెన్షన్ పై లేదు
-
చంద్రబాబు ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారు: విడదల రజిని
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు. -
నాకు భయం లేదు, బాధ కూడా లేదు కేవలం ఆవేదన మాత్రమే
-
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.. పాత పింఛన్లు సైతం తొలగించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.నమ్మించి చంద్రబాబు మోసం చేశారు: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం తొలగించింది. దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందచేశాం. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదు. మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. చంద్రబాబు వారిని మోసం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ఈనాడు పేపర్లోనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది?.పింఛన్లు తీసివేస్తే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏమి చేస్తున్నాడు? వైఎస్సార్సీపీ హయాంలో ఏమి జరగక పోయిన గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు కళ్ళు కనపడటం లేదా?. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. షో చేయటానికి చంద్రబాబు.. పింఛన్లు లబ్ధిదారులకు స్వయంగా ఇస్తున్నారుప్రచార ఆర్భాటాలు తప్ప.. అమలు లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్కూటమి హయాంలో అన్ని రకాల పింఛన్లు తొలగించారు. వైఎస్ జగన్ హయాంలో పింఛన్ల సంఖ్య పెంచారు. పింఛన్లు పెంచి ఇస్తున్నామని ప్రచార ఆర్భాటాలు తప్ప అమలు లేదు. దివ్యాంగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తాం అని మాట ఇచ్చి తప్పారు. కొత్తగా ఎవరికీ శాంక్షన్ చేయటం లేదు. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అనేది అబద్ధం. మహిళలను నమ్మించి చంద్రబాబు మోసం చేశారు. ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు.అయినా చంద్రబాబుకి చలనం లేదు: మల్లాది విష్ణు విజయవాడలో తొలగించిన పింఛన్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తుంది. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేసే వాస్తవాలు చెప్పేవారు. 33 లక్షల నూతన పింఛన్లు వైఎస్ జగన్ నాలుగేళ్లలో ఇచ్చారు. అర్హత ఉన్న వారు అందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి. మీ పత్రికలే వాస్తవాలు చెబుతున్నాయి అయినా చంద్రబాబుకి చలనం లేదు. విజయవాడలో ఉన్న అన్ని శాఖలు ప్రజల ఆదరణ కోల్పోయాయి. ఇసుక, బూడిద, మట్టి ప్రసాదం లాగా కూటమి నేతలు తినేస్తున్నారు. -
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
తేనె పూసిన ఎల్లో కత్తులు
-
లోకేశ్ తీరు... ఏపీకి చేటే!
అసందర్భమైన మాటలు ఎప్పుడైనా పరువు తక్కువే. రాజకీయ నేతలైతే మరీ ఎక్కువ. నోరు జారారో అంతే సంగతులు. ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఏపీ కీలక మంత్రి లోకేశ్ ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు వేదికపై ఉండగానే లోకేశ్ అసత్యాలు, అతిశయోక్తులతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసి నగుబాటుకు గురయ్యారు. కొద్దోగొప్పో విషయ పరిజ్ఞానమున్న వీరు సభ నుంచి వెళ్లిపోయాకైనా మంత్రి హోదాలో లోకేశ్ వైఖరిపై చర్చించకుండా ఉంటారా? ‘‘జి అంటే తమకు గూగుల్ అని.. వారికి గొడ్డలి’’ అన్న లోకేశ్ వ్యాఖ్య ఎంత అనుచితమైందో చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. పైగా ఒక ఐటీ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి విమర్శలు చేశారంటే లోకేశ్ ఆ పార్టీకి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని లోకేశ్ అన్నారు. ఎవరేం చేసిందీ ప్రజలకు తెలియదనుకోవాలా? ఈయన చెప్పే ప్రతిమాటనూ అతిథులు నమ్మేస్తారని అనుకోవాలా? గతంలో అదాని డేటా సెంటర్కు జగన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు రాలేదా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య వచ్చిన ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉండి, పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండాల్సిన కమిట్మెంట్. లోకేశ్ మాత్రం అసందర్భ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. అందువల్లే లోకేశ్కు సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు కనుక. సామాజిక మాధ్యమాలు బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాలలోని పొంతన లేని సంగతులు, గతంలో ఏమి మాట్లాడింది, ఇప్పుడు ఏమి చెబుతున్నది వెల్లడించే వీడియోలను ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబును లోకేశ్ ఫాలో అవ్వదలిస్తే ఆయన ఇష్టం. హుందాతనం లేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజలలో పరపతి కోల్పోతారు. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని లోకేశ్ అనగానే టీడీపీ కేడర్ చేసిన పలు అరాచకాలను ఎత్తి చూపుతూ... అసలు గొడ్డలి పార్టీ మీది కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నలు వేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందా అని అడిగారు. ఈ కూటమి ప్రభుత్వంలో లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలపై నిలదీస్తున్నారు.ఈ రెండేళ్లలో హత్యలకు గురైన వారి వివరాలు వెల్లడిస్తున్నారు.ఉదాహరణకు వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడిరరోడ్డుపై నరికి హత్య చేశారు.పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.వైఎస్ ఆర్ కడప జిల్లా వేంపల్లె వద్ద కొందరు టిడిపి వర్గీయులు గొడ్డళ్లతో వైఎస్సార్సీపీ నేత నాగభూషణరెడ్డిని నరికి చంపారు. ఇలా ఒకటి కాదు.ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలలో పలుచోట్ల అరాచకశక్తులుగా మారిన టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. వీటికి సంబంధించిన వార్తలన్నిటిని ఒకచోటకు తెచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే కదా!ఈ అరాచకాలన్నిటికి తెలుగుదేశం పార్టీ జవాబుదారి అవుతుందా? లోకేశ్ వీటిని విస్మరించి తన తండ్రి మాదిరే దబాయించి మాట్లాడితే జనం నమ్ముతారా?చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలానే మాట్లాడతానని నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. అందులోను అదాని,గూగుల్,తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఇలా ప్రసంగిస్తే, ఈ గొడ్డలి గొడవ ఏమిటని వారు అడిగితే ఏమి చెబుతారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేశ్ జవాబు ఇస్తారా?ఎంత ఇతర రాష్ట్రాలలో ఉన్నా,రెడ్ బుక్ గురించి వారికి మాత్రం తెలియకుండా ఉంటుందా?గతంలో జిందాల్ అనే ఊరిశ్రామికవేత్తను ఒక మోసకారి నటి కేసులో ఇరికించడానికి యత్నించిన ఘటన ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియదా?అదే జిందాల్ కు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడే అవార్డు అందించారే.ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న వార్తలకు, జనం చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేక చంద్రబాబు కూడా పలు సభలలో గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీపై మీద అర్థం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఇప్పుడు అదే గాత్రాన్ని లోకేశ్ అందుకున్నట్లుగా ఉంది.విశాఖపట్నంలో అన్న ఆంగ్ల పదం అక్షరాలలో జి ఉందని, జి అంటే గూగుల్ అని ఆయన అనగానే అంతా ఆశ్చర్యపోయారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉంటుంది కాని విశాఖలో ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉన్నట్లే ఎ అనే లెటర్ కూడా ఉందని,అంటే అదాని గా తీసుకోవచ్చని,అదాని డేటా సెంటర్ ను జగన్ తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందోకాని, ఏపీ మాత్రం తీరని అప్రతిష్టే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు అది చాలదన్నట్లుగా ఆ భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చజెండా ఊపింది! ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా రూ.2,540 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టు ఇచ్చేందుకు కేబినెట్ పరిపాలన ఆమోదం ఇచ్చింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో రూ.798 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టుకు పరిపాలన ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బుల్లేవంటూ పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తి అయ్యేవని, వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా రూ.3,338 కోట్ల వ్యయానికి పరిపాలన ఆమోదం ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు. ⇒ అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. మూడు ప్యాకేజీలుగా లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిడెట్ ఎండీకి అనుమతి. ⇒ శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ అండ్ అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్ పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం. లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి. ⇒ రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు రద్దు. ఆ భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయం. ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు ఆమోదం. ⇒ అమరావతిలో కృష్ణా కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం కోసం రూ.443.26 కోట్లతో కరకట్ట బలోపేతం, విస్తరణకు ఆమోదం. రూ.149.82 కోట్లు, రూ.146.47 కోట్లు, రూ.146.97 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పరిపాలన అనుమతి మంజూరు. గతంలో కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ.1304.89 కోట్లతో ఇచ్చిన పరిపాలన అనుమతి రద్దు. ⇒ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ రెండు టవర్లు నిర్మాణానికి రూ.1,208 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో జోన్––11 పరిధిలో ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ స్కీము కింద మౌలిక సదుపాయాల పనులకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో కొన్ని కూడళ్లలో మిగిలిన పనులకు గతంలో ఇచ్చిన రూ.1082 కోట్ల పరిపాలన అనుమతి వ్యయాన్ని రూ.1180 కోట్లకు పెంచేందుకు ఆమోదం. ⇒ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీములో సవరణలకు ఆమోదం. యాన్యుటీ పెంపు, అప్పు మాఫీ కట్ ఆఫ్ తేదీ సరళీకరణకు సవరణలు. సీఆర్డీఏలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం. ⇒ రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యత్యాస పనులకు ఆమోదం. అదనంగా రూ.354 కోట్ల వ్యయానికి ఆమోదం. ⇒ ఢిల్లీలో 11.536 ఎకరాల భూమిలో కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి ఆమోదం. రూ.124.50 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, నిర్మాణ పనులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీ)కు అప్పగించేందుకు అనుమతి. ⇒ పోలవరం నిర్వాసిత కుటుంబాలకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఇళ్లు నిర్మాణానికి యూనిట్ ధర రూ.2.85 లక్షల నుండి రూ.3.57 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ సహాయ పునరావాస కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ల స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో 525 మీటర్లు పొడవున ఎస్కేప్ చానల్ తవ్వకం అదనపు పనులు నామినేషన్పై అప్పగించేందుకు ఆమోదం. ⇒ శ్రీసత్యసాయి జిల్లా హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్–11 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా రూ.309 కోట్లకు పరిపాలన ఆమోదం. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి తాజాగా రూ.1586.69 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. -
కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ
-
టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా
-
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంఅమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్లో వైఎస్ జగన్ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపుఏపీలో టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి 1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది. -
అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు
-
‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయం.. స్థానిక ఎన్నికల్లో TDP భూస్థాపితమే
-
నీతి కబుర్లు చెప్పే అధికారులు.. హనీ ట్రాప్ పై నోరు మెదపడం లేదు
-
నేను అనుభవించినదానికి కంటే 10రేట్లు ఎక్కువ అనుభవించేలా చేయకపోతే
-
ఎరువు మొత్తం.. డీజిల్లో కాలిపోయిందిగా!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను పోస్టింగ్లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్ను వారికి ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం. సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్ను బల్క్లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే. తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు -
అరాచకం, అస్తవ్యస్త పరిస్థితులే బాబు సుపరిపాలన!
ఆంద్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి? పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి. రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫ్రీ బస్సు ఉత్తుత్తిదే..!
అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణమంటూ పథకాన్ని ఘనంగా ప్రారంభించినా..దానిలో చాలా కోతలు, నిబంధనలు పెట్టి దగా చేశారు. ఇప్పుడు ఉన్న బస్సులు కూడా మహిళలను ఎక్కించుకోకుండానే వెళ్లిపోతున్నాయి. మహిళలు ఉన్నచోట బస్సులు సరిగా ఆపడం లేదు. ఇందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనే తార్కాణం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడుకు చెందిన మహిళలు బుధవారం అనంతపురం వెళ్లడానికి గుత్తి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. బస్సులు పాయింట్లో ఆపలేదు. ఎదురు చూసిన మహిళలు ఆరా తీయగా బస్టాండ్ వెనుక వైపు నుంచే వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. మహిళలు ఉన్న చోట బస్సులు ఆపడం లేదని వరలక్ష్మి, లక్ష్మి తదితర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఫ్రీ బస్సు ప్రచారానికే పరిమితం కాకుండా.. మహిళలకు ప్రయోజనకరంఉండే విధంగా నడపాలని కోరారు. లేని పక్షంలో ఫ్రీ బస్సు ఎత్తేయండి అని మహిళలు వాపోయిన విషయాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
‘బాబు రాజకీయ జీవితామంతా కుట్ర, వెన్నుపోటు’
సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. -
అధికారం ఉందని అహం చూపిస్తే.. పిఠాపురం వర్మకు చంద్రబాబు వార్నింగ్
-
పిఠాపురం వర్మపై దాడి సీఎం చంద్రబాబు రియాక్షన్
-
ఎవర్నీ వదలా.. YSRCP Ex MLAపై అయ్యన్న పాత్రుడి అనుచరుల దాడి
-
కూటమి సర్కార్కు వైఎస్సార్సీపీ అల్టిమేటం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.డీజిల్ కొరత కారణంగా మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించిన కేటాయింపుల పట్టిలో రైతులకు, వ్యవసాయ రంగానికి స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రెస్మీట్లో వడ్డీ రఘురాం ఏమన్నారంటే..వ్యవసాయ రంగం అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపురాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాదేళ్ల మనోహర్కు రైతులకు కనిపించలేదా?గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఆక్వా రంగం ఎలా బాగుపడుంది?ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?చేపలను కార్గో విమానాల్లో పంపాలా?గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.కూటమి ప్రభుత్వానికి 24 గంటలే డేట్లైన్రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి తక్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు. -
‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
‘కు’ సంస్కరణలే బాబు మార్కు!
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి. వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు. ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం. 1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు. ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది. చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది? అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు. ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్కెచ్ ప్రకారమే దాడి.. వడ్డీతో చెల్లిస్తాం: ఉమాశంకర్
సాక్షి, విశాఖపట్నం: పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. స్పీకర్గా అయ్యన్న అనర్హుడు.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారని ఆరోపణలు చేశారు.మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘యువ నాయకుడి పేరు చెప్పుకుని అయ్యన్న వందల కోట్లు దోచుకుంటున్నారు. చోడవరం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడికి ఏం పని? అని ప్రశ్నించారు. స్పీకర్గా ఉన్నాననే అయ్యన్న వన్సైడ్గా వెళ్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆర్డర్ను కూడా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాదాయ భూములను కూడా అయ్యన్న వదలడం లేదు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారు. తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి వందల కోట్లు దోచుకుంటున్నారు.నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?. రైతులకు అన్యాయం జరుగుతుంటే కోర్టుకు వెళ్తే నేను హిందూ వ్యతిరేకినా?. కోర్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్తే మా పై దాడి చేశారు. ల్యాటిరైట్ మీద ఇప్పటి వరకు 400 కోట్లు సంపాదించారు. కొడుకుకు రాజ్యసభ సీటుకోసం అమరావతి నాయకుడుకు కోట్లాది రూపాయలు ఇస్తామని చెపుతున్నారు. రోలుగుంటలో క్వారీల దగ్గర అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. 100 ఎకరాల దేవాలయ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు. కొడుకు ప్రమోషన్ కోసం ప్రభుత్వ చెరువులో సృష్టి క్షేత్రం కడుతున్నారు. దానికి నిధులు GMR నుంచి తీసుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా.. సృష్టి క్షేత్రంలో పనులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో అయ్యన్నకు తిరిగి ఇస్తాము. అయ్యన్న, కలెక్టర్, పోలీసుల మీద కోర్టుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.మరోవైపు.. నాయకులు కేకే రాజు మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్న పాత్రుడు విష సంస్కృతిని తీసుకువచ్చారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేశారు. రౌడీలు గుండాలతో భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా పని చేయడం మానుకోవాలి. కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని తెలిపారు. -
ఎంత మందిని కొడతారో కొట్టండి.. సమయం వచ్చినప్పుడు మాత్రం
-
టీడీపీ నేతలు, సీఐ వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు రూరల్: దాయాదితో ఉన్న స్థల వివాదంలో టీడీపీ నేతల ప్రోద్బలంతో సీఐ తనను వేధిస్తున్నాడంటూ మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన యల్లా మణికంఠ (35) మంగళవారం పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మరణానికి సమీప బంధువులు యల్లా శ్రీనివాసులు, యల్లా రమేష్, గోపీ వారికి మద్దతుగా ఉన్న టీడీపీ నేతలు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, దిలీప్కుమార్తో పాటుగా సీఐ సురేష్ కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.సెల్ఫీ వీడియోలో బాధితుని కథనం మేరకు.. ‘నాకు, నా దాయాది అయిన యల్లా శ్రీనివాసులుకు మధ్య స్థానిక గర్రెవారి వీధిలో ఉన్న 3 సెంట్ల స్థలం విషయంలో ఉన్న వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. నా బంధువులు టీడీపీ నేత చిన్న శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి అతడి ద్వారా దిలీప్కుమార్, మరికొంతమంది ఇటీవల ఆ స్థలంలో రెండుసార్లు కట్టడాలు దౌర్జన్యంగా నిర్మించేందుకు చూశారు. వారిని ఆ స్థలంలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చాను. ఈనెల 23న దిలీప్కుమార్, మరికొందరు నాపై దాడికి పాల్పడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా ఇద్దరిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ విషయమై న్యాయం చేయమని ఎస్పీ హర్షవర్ధన్రాజును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎస్పీని కలిసినా.. తిరిగి నీకు న్యాయం చేయాల్సింది నేనే అంటూ సీఐ సురేష్ నన్ను కించపరిచి మాట్లాడుతున్నాడు.ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగుతున్నాను’ అంటూ వీడియో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు మణికంఠను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ విషయమై సీఐ సురేష్ను వివరణ కోరగా గర్రెవారి వీధిలో స్థలం డాక్యుమెంట్లు మణికంఠ పేరుపై లేవని, కోర్టు ఎలా చెప్తే అలా వెళ్లామే తప్ప అతడిపై దురుసుగా ప్రవర్తించలేదన్నారు. కాగా, మణికంఠ (35)కు ఏడాది క్రితం వివాహమైంది. భార్య ప్రస్తుతం గర్భవతి. -
టీడీపీ హనీ ట్రాప్ సీక్రెట్స్ మొత్తం చెప్పేసిన రంగమ్మ
-
తుఫాన్ ను అరచేత్తో ఆపే సత్తా ఉన్న నువ్వు... డీజిల్ కొరతను నివారించలేవా?
-
టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి దారుణం:తలారి రంగయ్య
-
బాబు చేతకాని పాలన.. ఇంధన కొరతపై జగన్ ఆగ్రహం
-
నకిలీ విజనరీ నిర్లక్ష్యం.. ఏపీలో ఇంధన కష్టాలు
-
పెట్రోల్ కొరతకు జగన్ కారణమంట చంద్రబాబుపై వెంకటరెడ్డి సెటైర్లు
-
టీడీపీ గూండాల దాడిలో ఉమాశంకర్ వాహనం ధ్వంసం
-
‘అనంత’ హనీట్రాప్ పచ్చముఠాల పనే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అనంత’ హనీట్రాప్ గలీజు దందా మొత్తం పచ్చముఠా ఆధ్వర్యంలోనే జరిగినట్లు తేలింది. పోలీసులు రిమాండ్కు పంపిన వారిలో ముగ్గురు టీడీపీ నేతలు ఉండగా ఆ పార్టీ నేతలకు భారీగా వాటాలు అందినట్లు తెలుస్తోంది. హనీట్రాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నిందితురాలు, లేడీడాన్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు సన్నిహితురాలు కావడం గమనార్హం. డాన్ రంగమ్మను పోలీసులు రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకుని కీలక వ్యక్తుల పాత్ర, బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణలో రంగమ్మ కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి అమాయకులను పరువు పేరుతో భయపెట్టి ప్రామిసరీ నోట్లు రాయించుకుని రూ.కోట్లలో దోపిడీ చేసిన ‘అనంత’ హనీట్రాప్ దందాను పోలీసులు ఛేదిస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న 9 మంది పోలీసులపై వేటు వేశారు. వీరిలో ముగ్గురు సీఐలు, ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ స్థాయిలో పోలీసులపై వేటు పడటం ‘అనంత’ పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. మరి కొందరి పాత్రపై కూపీ లాగుతున్నారు. ఈ ముఠాకు సహకరించిన వారు, బ్యాంకు లావాదేవీలు జరిపిన వారిని విచారించి చర్యలు తీసుకోనున్నారు. కాల్డేటా ఆధారంగా ఆడియో రికార్డులు సేకరించి విచారణ చేస్తున్నారు. నాలుగు ముఠాలు.. హనీట్రాప్ వ్యవహారంలో మరో ఇద్దరు నిందితులు రాజేశ్, నరేంద్రరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు. మరో నిందితురాలు చంద్రకళ మంత్రి సత్యకుమార్కు అత్యంత సన్నిహితురాలు. మొత్తం నాలుగు ముఠాలు ‘అనంత’లో దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ధర్మవరంలో ఓ చేనేత వ్యాపారి నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. దీన్నిబట్టి దందా ఏ స్థాయిలో సాగిందో స్పష్టమవుతోంది. నాలుగు ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో దందా బహిర్గతమైంది. కాగా ఉదయభాస్కర్రెడ్డిని బాధితుడిగా పేర్కొని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు అతడిని కూడా నిందితుడిగా చేర్చి రిమాండ్కు పంపారు. ఇద్దరు ఉరవకొండ టీడీపీ నేతలు..! ఈ ముఠా సభ్యులతో సంబంధాలున్న వారిలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలున్నారు. వీరిలో ఒకరు టీడీపీ జిల్లా కమిటీలో కీలక పోస్టులో కొనసాగుతుండగా మరొకరు రంగమ్మకు సన్నిహితుడు. హనీట్రాప్ బాధితులు కేసు నమోదు కోసం కూడేరు సీఐను ఆశ్రయించగా అదే మండలానికి చెందిన టీడీపీ నేత అడ్డుపడినట్లు తెలుస్తోంది. ‘అనంత’కు చెందిన ఓ బీజేపీ నేత ఈ వ్యవహారంపై నిత్యం పోలీసుస్టేషన్లలో పంచాయితీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. రంగమ్మ ఖాతా నుంచి ఆయన ఖాతాకు రూ.15 లక్షలు బదిలీ అయినట్లు తెలిసింది. ‘అనంత’ హనీట్రాప్పై ‘సాక్షి’ ఈ నెల 19 నుంచి వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో డీఐజీ షిమోíÙ, ఎస్పీ జగదీశ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్, ఎస్పీ జగదీశ్ కేసును పరిశోధిస్తున్నారు. వారం రోజుల్లోనే 8 మందిని రిమాండ్కు పంపడంతో పాటు 9 మంది పోలీసులపై వేటు వేశారు. -
ABN రాధాకృష్ణకు నడి రోడ్డు మీద శిక్ష తప్పదు జగన్ వచ్చాక ఎవర్నీ వదలం
-
పెట్రోల్ బంక్ డీలర్లతో బాబు కుమ్మక్కు..! బ్లాక్ అమ్మకాలు..!
-
రండి రండి..వద్దు రావొద్దు : చంద్రబాబు
బి.కొత్తకోట: చంద్రబాబు తంబళ్లపల్లె టీడీపీ నేతలతో చెడుగుడు ఆడుతున్నారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం రండి రండి అని పలుకుతూనే.. వద్దు వద్దు అంటూ సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితిపై తంబళ్లపల్లె టీడీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో అప్పటి టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.గత ఏడాది అక్టోబర్ నుంచి పార్టీకి ఇన్చార్జి లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రెండు నెలల క్రితం అమరావతికి శంకర్ను, పార్టీ మండల అధ్యక్షులను చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన నివాసంలో సమావేశం నిర్ణయించారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కాదు, వెళ్లిపోండి అని సమాచారం అందడంతో వెళ్లిన వారంతా నిరుత్సాహంగా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది.శనివారం సాయంత్రం శంకర్, నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఆదివారం ఉదయం అమరావతి రావాల్సిందిగా పార్టీ నుంచి సమాచారం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆహ్వానం వస్తుందా అని కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు ఈ పిలుపు ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. అప్పటికప్పుడు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా అంతలోనే మళ్లీ కబురొచ్చింది. వద్దు వద్దు మీరు రాకండి.. మళ్లీ ఎప్పుడు వచ్చేది చెబుతామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో నాయకుల్లో ఉత్సాహం గంటల్లోనే నీరుగారిపోయింది -
కత్తితో వీరంగం సృష్టించిన టీడీపీ నేత ప్రదీప్
-
తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?: కేతిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. కూటమి సర్కార్ పాలనపై మండిపడ్డారు.తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యకు గురైన అబ్దుల్లా మృతదేహాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. అనంతరం, పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘గడిచిన 24 గంటల వ్యవధిలో తాడిపత్రిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. గంజాయి, మట్కా, పేకాట క్లబ్బులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేస్తున్నారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?’ అని ప్రశ్నించారు. -
టీడీపీ నేత ఇంట్లో పెళ్లి రగడ.. ఇరు కుటుంబాలపై కేసులు
హైదరాబాద్: పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన వివాదంలో రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ పెండ్యాల, అతని కుమారుడు సాయి అక్షయ్ కుమార్ దివీస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయ నిర్మల కుమార్తెతో సాయి అక్షయ్ కుమార్కు వివాహం కుదిరింది. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో రూ.1 కోటి వరకట్నంతో పాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు ఇచ్చారు. భారీగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని ఆరోపించారు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలంటూ కోరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం ప్రారంభం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయ నిర్మలతో పాటు సుమారు 70 మంది పెండ్యాల సుధాకర్ ఇంటివద్దకు వచ్చి హల్చల్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పెళ్లి కూతురి తల్లి డా. విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విజయనిర్మల కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
జనసేన ఘంటసాల వెంకటలక్ష్మిపై TDP నేతల దాడి.. కూతురు సీరియస్ వార్నింగ్
-
స్టాండప్ కమెడియన్ పై రెచ్చిపోయిన పచ్చ మూకలు
-
లోకేశ్ ఏంటిది?.. ఆరు నెలలకు నిద్ర లేచిన మంత్రి టీమ్..
సాక్షి, అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్... ఈ పదాన్ని చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో బాగా ప్రచారం చేస్తోంది. ఎటువంటి సమస్యకైనా మిల్లీ సెకన్లలో పరిష్కారం చూపించే సత్తా ఉందంటూ ఊదరగొడుతోంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ను పర్యవేక్షించే మంత్రి నారా లోకేశ్ శాఖ మాత్రం తప్పుడు జీవోలు జారీ చేసే శాఖగా మారిపోయింది. ఏకంగా జీవోల్లో కంపెనీల పేర్లనే మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. తీరా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. తప్పు జరిగిన ఆరు నెలల తర్వాత నిదానంగా నిద్రలేచిన లోకేశ్ టీం తప్పులను సరిదిద్దుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో చంద్రబాబు బడాయి మాటల బండారం ప్రపంచానికి తెలిసిపోయింది. అసలేం జరిగిందంటే... కంపెనీల పేర్లనే పూర్తిగా మార్చేసి జీవోలు.. గతేడాది నవంబర్ నెలలో ఐటీ శాఖ ఎస్సీఐసీబీ వెంచర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ.550 కోట్లతో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో ఎంఎస్ నెంబర్ 49.., క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లతో ఐటీ ఎన్క్లౌంజర్స్, పీసీబీ బేరబోర్డు యూనిట్ ఏర్పాటును ఆమోదిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 60ను ప్రభుత్వం విడుదల చేసింది.అయితే జీవోల్లో కంపెనీల పేర్లను ఒకదానికి బదులు ఇంకో కంపెనీ పేరును పేర్కొంటూ అధికారులు కళ్లు మూసుకొని ఉత్తర్వులు జారీ చేసేశారు. ఒక జీవో జారీ చేసే ముందు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, ఫైనాన్స్, సీఎస్, సీఎంవో ఇలా అనేక మందిని దాటుకొని రావాల్సి ఉంటుంది. అలాంటిది... ఎక్కడా కూడా జరిగిన పొరపాటును గుర్తించలేదంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల తర్వాత పేర్లు మార్చి... జీవోలు బయటకు రాగానే కంపెనీల యాజమాన్యాలు జరిగిన తప్పును వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దడానికి ఏకంగా ఆరు నెలల సమయం తీసుకొంది. చివరకు జనవరిలో విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ పెట్టుబడుల సమావేశంలో ఈ రెండు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడూ కూడా ఆ కంపెనీల ప్రతినిధులు జరిగిన తప్పిదాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నవంబర్ 2025లో జారీ చేసిన తప్పుడు జీవోలను సవరిస్తూ ఏప్రిల్ 2026లో జీవోలను జారీ చేశారు.జీవో జారీ అయ్యే సమయంలో వివిధ దశల్లో ఒక గుమస్తా అనుకోకుండా చేసిన తప్పు వల్ల కంపెనీల పేర్లు మారాయంటూ చేతులు దులిపేసుకున్నారు. తప్పుడు జీవోల్లోని పేర్లు మార్చేందుకే ఆరు నెలల సమయం తీసుకున్నారని.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనా అని పలువురు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఏయూపై టీడీపీ ఎంపీ పెత్తనమా!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భూములిచ్చిన దాతల్ని శతాబ్ది ఉత్సవాల్లో విస్మరించడం దుర్మార్గమని మేధావుల వర్గం, ఏయూ పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల విద్యా ప్రదాయిని, చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. ‘ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్తు బాధ్యత’ పేరుతో విశాఖలో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించారు. వర్సిటీలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మేధావులను విస్మరించి, చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా ఉత్సవాలు నిర్వహించడం వారి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.\గీతం ప్రైవేట్ వర్సిటీ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ భరత్ ఏయూని ఎలా సమీక్షిస్తారని నిలదీశారు. వర్సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాంధ్ర మేధావులను, న్యాయమూర్తులను, ఉన్నతాధికారులను ఆహ్వనించకపోవడం వారిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణలో వర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ముక్తకంఠంతో తప్పుబట్టారు. ఏయూ ప్రతిష్టను దిగజార్చి.. ప్రైవేటు వర్సిటీ విలువ పెంచాలని కుట్ర ఈ సదస్సులో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ.. గీతం ప్రైవేట్ వర్సిటీ అధ్యక్షుడు భరత్ ఏయూ ఉత్సవాలను సమీక్షించడం దారుణమని మండిపడ్డారు. ఇది వందేళ్ల ఏయూ ప్రతిష్టను దిగజార్చి, ప్రైవేటు వర్సిటీ విలువ పెంచాలనే కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. వర్సిటీ అభివృద్ధి ఈ ప్రాంత ప్రగతికి తోడ్పడాలే తప్ప, బయటి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం కాదని యూపీఎస్సీ పూర్వ మెంబర్ ప్రొ.కేఎస్ చలం పెదవి విరిచారు. వర్సిటీ ఏర్పాటుకు వందల ఎకరాలు ఇచ్చిన వారి కుటుంబాలకూ ఆహ్వనం లేకపోవడం అత్యంత హేయమని తెలిపారు.ఏయూ నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు, జడ్జిలు రాజ్యాంగపరమైన పదవులు చేపట్టిన వారిని కూడా చంద్రబాబు ప్రభుత్వం, ఏయూ అధికారులు గుర్తించలేదని నన్నయ యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్లర్ ప్రొ.ముత్యాలనాయుడు దుయ్యబట్టారు. వందేళ్ల వర్సిటీ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన తరుణంలో ఉత్సవాల్ని పేలవంగా నిర్వహించడం టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. డా.అంబేడ్కర్ వర్సిటీ పూర్వ వైస్ చాన్స్లర్ ప్రొ.నిమ్మ వెంకటరావుతో పాటు కళింగసీమ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కత్తితో టీడీపీ నేత హల్చల్
సాక్షి, టాస్క్ఫోర్స్: సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నివాసానికి అతికొద్ది దూరంలో, మంత్రి లోకేశ్ నియోజకవర్గమైన మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పెనుమాకలో శనివారం అర్ధరాత్రి టీడీపీ నేత మద్యం మత్తులో హల్చల్ చేసిన ఘటన వెలుగుచూసింది. టీడీపీ కార్యకర్త కూనపురెడ్డి ప్రదీప్ కత్తితో వీరంగం సృష్టించాడు. నేనెవరినైనా చంపుతా, ఇది నా అడ్డా అంటూ అక్కడున్న టీడీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను సుమారు గంటపాటు భయభ్రాంతులకు గురిచేశాడు. ‘మీరెవరూ లోకేశ్ను కలవలేరు. నేను మా శేషన్నతో కలసి డైరెక్ట్గా లోకేశ్ను కలుస్తా.మీరు వీడియోలు తీసుకున్నా ఎవరూ ఏమీ చేయలేరు. కనీసం ఏ పేపరు, టీవీల్లో కూడా వార్త రాదు. శేషన్న చూసుకుంటాడు. శేషన్నకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా చంపేస్తా’అంటూ బెదిరించాడు. అక్కడున్న వారు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో విషయం బయటపడింది. ఇతను గతంలోనూ ఉండవల్లిలో కత్తులతో వీరంగం చేసినట్లు టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎవరైనా కత్తులు, కర్రలు పట్టుకుని తిరిగితే వారి తాట తీస్తాం అంటూ బీరాలు పలుకుతున్న హోం మంత్రి అనిత ఇటువంటి ఘటనలపై నోరెత్తకపోవడం కొసమెరుపు. -
వలపు వల.. నలుగురికి ఊస్టింగ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం/రాప్తాడు రూరల్ : అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ‘టీడీపీ గ్యాంగ్ హనీట్రాప్’ కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డబ్బున్న వ్యాపారులు, ఉద్యోగులు, రిటైర్ట్ ఉద్యోగులను గుర్తించి.. అమ్మాయిలతో తీయటి మాటలు మాట్లాడించి.. ఒంటరిగా రప్పించి దుస్తులిప్పి ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రధాన అనుచరురాలు రంగమ్మ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు రాజేనాయుడు నేతృత్వంలోని ముఠా కొందరు పోలీసు అధికారులను లోబరుచుకుని సాగించిన ఈ యవ్వారాన్ని బట్టబయలు చేసింది.బెదిరించి, పంచాయితీలు చేసి బాధితుల నుంచి రూ.కోట్ల రూపాయలు దండుకున్న ఈ వ్యవహారంలో పలువురు సీఐ స్థాయి అధికారులే ముఠా సభ్యులకు నిస్సిగ్గుగా సహకరించడం దిగ్భ్రాంతి పరిచింది. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసు శాఖ పరువు తీసింది. ఈ దందాకు సంబంధించి డీఐజీ, ఎస్పీలు తీవ్రంగా స్పందించి విచారణ జరిపించారు. సాక్షి కథనాలన్నీ నిజాలేనని తేలడంతో ఎట్టకేలకు పలువురు పోలీసులపై కఠిన చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలో రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి పీఎస్ కానిస్టేబుల్ దేవ్లానాయక్ను ఏకంగా సర్వీసు నుంచి (డిస్మిస్) తొలగించారు. ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు జయరామ్నాయక్, దేవేంద్రపై సస్సెన్షన్ వేటు వేశారు. అనంతపురం రూరల్ పీఎస్ సీఐ శేఖర్ను కర్నూలు రేంజ్కు సరెండర్ చేశారు. త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ను ఇప్పటికే వీఆర్కు పంపారు. విచారణలో మరింత మంది పేర్లు! ఈ కేసులో తొలుత ఐదుగురు నిందితులు రంగమ్మ, రాజేనాయుడు, జయలక్ష్మీ , చంద్రకళ, అనంతకుమారిని రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. వీరిలో మల్లీశ్వరి, ఉమా, ఉదయ్భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసి ఆదివారం జడ్జి ఎదుట హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. అయితే వీరిలో ఉదయ్భాస్కర్రెడ్డి తొలుత బాధితుడిగా ఉన్నాడు. ఆయన ఫిర్యాదు మేరకే పోలీసులు తొలుత ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ దందాలో ఉదయ్ భాస్కర్రెడ్డి పాత్ర కూడా ఉందని దర్యాప్తులో తేలింది.మరో నిందితుడు రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాకు సంబంధించి పోలీసుల విచారణలో మరింత మంది పేర్లు బయట పడినట్లు సమాచారం. అయితే వారందరిపై చర్యలు తీసుకుంటారా.. లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, రాప్తాడు సీఐ డ్రైవర్, హోంగార్డు శ్రీనివాసులును వీఆర్కు పంపించేశారు. ఈ దందాలో మరికొందరు సీఐలు, ఎస్ఐల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాధితుల సంఖ్య వందల్లోనే ఉందని సమాచారం. ఇదిలా ఉండగా పై స్థాయిలో ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో ఇంతటితో ఈ కేసును ముగిస్తారా.. లేక పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి, పోలీసు శాఖ పరువు నిలుపుకుంటారా అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. -
‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు...టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు...తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్ రూమ్లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు. -
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్ జగన్ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ బాంబుల పార్టీనా..గునపం పార్టీనా ?
-
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. -
గుమ్మడి సంధ్యారాణికి బిగ్ షాక్
-
టోల్ సిబ్బంది పొట్టుపొట్టు కొట్టారు టీడీపీ ఎమ్మెల్యేతో మాములుగా ఉండదు
-
హనీట్రాప్ కేసులో TDP కీలక నేత సస్పెండ్
-
చేసేవన్నీ వాళ్ళ మంత్రులు, MLAలే.... కొంచెంకూడా సిగ్గుండదా..
-
డబ్బు కోసం బరితెగింపు బయటపడ్డ TDP హానీ ట్రాప్ బండారం!
-
కోవూరులో కొట్టుకున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముందే బాహాబాహీ
-
జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి
-
మీకు గొడవలే కావాలనుకుంటే నేను రెడీ.. జక్కంపూడి మాస్ వార్నింగ్
-
రూ.150 కోట్ల ప్రభుత్వ భూమికి ఎమ్మెల్యే 'వరద' స్కెచ్
సాక్షి టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు అతిపెద్ద పట్టణంగా ఉంది. ఈ మున్సిపాలిటీకి 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడున్న భూములు, స్థలాలు ఎక్కువ ధర పలుకుతుండడంతో రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి స్కెచ్ వేశారు. వివరాలివీ.. మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుక ఈ ప్రభుత్వ భూమి ఉంది. పట్టణంలోని బొల్లవరానికి చెందిన రైతు బద్వేలు సత్యనారాయణరెడ్డికి పెద్దమొత్తంలో భూములు ఉండడంతో అప్పట్లో ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్తో నిబంధనల కన్నా ఎక్కువున్న భూమిని ప్రభుత్వం సేకరించింది. 1968లో సత్యనారాయణరెడ్డి కొనుగోలు చేసిన భూమిని 1975లో స్వాధీనం చేసుకుని 1979లో ఎస్సీలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రామేశ్వరం, చౌటపల్లె, దొరసానిపల్లె గ్రామాలకు చెందిన తొమ్మిది మంది ఎస్సీలకు 497/1, 497/2, 467/6, 497/7, 497/8, 172/1, 172/3, 172/4, 491/1, 490/5, 490/6, 196/4 సర్వే నంబర్లలోని 9.68 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 2007 జనవరి 6న ఎస్సీ రైతులకు ఫాం–1 నోటీసు ఇచ్చిన తహసీల్దార్ , 1985 జనవరి 10న భూములను నడిపి సుబ్బన్నకు అమ్మిన ఎస్సీ రైతులు రిజిస్ట్రేషన్ పత్రం ఎస్సీలైన పబ్బతి పుల్లయ్య, పబ్బతి చిన్న పుల్లయ్య, పబ్బతిæ బాలపుల్లయ్య, పొట్టిగాళ్ల సత్యరాజు, కడియం లక్ష్మీనరసమ్మ, చింతాకు వెంకటసుబ్బమ్మ, ఉక్కిసాల చిన్నక్క, రామేశ్వరం లలితమ్మ, మేకల శిలాసు, ఎర్రమాసు శిరోమణమ్మలకు తాత్కాలిక డీకేటీ పట్టాలను పంపిణీ చేశారు. వీరు పంట సాగు చేయడంతోపాటు ఏడాదికి రూ.470 పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ, వీరు పంటలు సాగుచేయకపోవడం, ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పాటు 1985 జనవరి 10న ఈ భూమిని రామేశ్వరానికి చెందిన నడిపి సుబ్బన్న (అగ్గిరాముడు), పెద్దసుబ్బన్న తదితరులకు అమ్ముకున్నారు. అప్పట్లోనే ఈ భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీరు సాగుచేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని కొంతమంది అప్పట్లోనే ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణ జరిపించారు. పట్టాలు పొందిన రైతులకు 2007 జూన్ 1న ఫాం–1 నోటీసు జారీచేశారు. భూములు తీసుకున్న తర్వాత ఎందుకు సాగుచేయలేదని, ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించలేదని, దీనికి 15 రోజుల్లోపు సమాధానం చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పంటలు సాగు చేయకపోవడంతోపాటు పన్ను చెల్లించకపోవడం, పైగా చట్ట విరుద్ధంగా భూమిని అమ్మి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో అప్పట్లోనే కలెక్టర్ వీరి పట్టాలను రద్దుచేశారు. ఏపీ అసైన్మెంట్ ల్యాండ్స్–1977లోని సెక్షన్–3 సబ్సెక్షన్ క్లాజ్(2) ప్రకారం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. కోర్టును ఆశ్రయించిన ఎస్సీలు.. ఈ నేపథ్యంలో.. కొంతమంది ఎస్సీలు కోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక డీకేటీ పట్టాలు కాకుండా తమకు శాశ్వత పట్టాలు పంపిణీ చేయాలని, పాస్పుస్తకాలూ ఇవ్వాలని కోరారు. ఏళ్ల తరబడి ఈ విచారణ సాగింది. మరోవైపు.. విలువైన ఈ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకోవాలనే లక్ష్యంతో బద్వేలు సత్యనారాయణరెడ్డి వ్యూహం పన్నినట్లు సమాచారం. భావితరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరం వరకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయకూడదని 2012 జూన్ 18న ప్రభుత్వం జీఓ జారీచేసింది. నగరాలు, మున్సిపాలిటీలతోపాటు మేజర్ పంచాయతీ హెడ్క్వార్టర్ పరిధిలో కూడా ఈ నిబంధనలను పాటించాలని అందులో పేర్కొన్నారు. పరిశ్రమలతోపాటు వాణిజ్య అవసరాలకు కూడా భూములను పంపిణీ చెయ్యొద్దని తెలిపారు. ఈ నిబంధనల ఆధారంగా 2020 జూన్ 24న కలెక్టర్ హరికిరణ్ నివేదికను కోర్టుకు సమర్పించడంతో కోర్టులో రైతుల వ్యాజ్యాన్ని కొట్టేశారు. రైతులను మభ్యపెట్టి...సర్వే నంబర్ 497తోపాటు మిగిలిన భూమలున్నీ బొల్లవరం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి. ఈ భూమి అంతా మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. చుట్టూ ప్లాట్లు వేసి వెంచర్లు వేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో.. సుమారు రూ.150 కోట్ల విలువైన 9.68 ఎకరాల భూమిని తిరిగి హస్తగతం చేసుకునేందుకు వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే చౌటపల్లె, దొరసానిపల్లె గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు లక్ష్మిరెడ్డి, అరవ మునివరలను ముందుపెట్టి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వ్యూహం ప్రకారం 1985లో ఈ భూమి కొనుగోలు చేసిన నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న కుమారులకు రూ.60 లక్షలు ఇచ్చి ఇటీవల లోక్ అదాలత్లో కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అంతేకాక.. పూర్వం తాత్కాలిక డీకేటీ పట్టాలు పొందిన ఒక్కో రైతుకు కూడా రూ.10 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. రైతులు తిరిగి తహసీల్దార్ను సంప్రదించి తమకు శాశ్వత డీకేటీ పట్టాలు ఇవ్వడంతోపాటు పాస్పుస్తకాలు ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించాలని భావిస్తున్నారు. అధికారుల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే కోర్టును ఆశ్రయించి తద్వారా ఈ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుని అమ్ముకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేతోపాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ప్రభుత్వంలోని కీలక యువనేతను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ భూములన్నీ ప్రస్తుతం డీకేటీ జాబితాలో ఉన్నాయి. మాజీ సర్పంచ్లు లక్ష్మిరెడ్డి, అరవ మునివరలను ముందుపెట్టి ఎమ్మెల్యే, ఆయన తనయుడు ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జగన్ జగన్ అంటూ జపం నిద్రలో తండ్రీకొడుకు కలవరింతలు..!?
-
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ భర్త నిర్బంధం?.. ఉద్రిక్తత
సాక్షి, రంగంపేట: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ భర్త నిర్బంధాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త ఎక్కడున్నాడో తెలపాలంటూ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీటీసీ భర్తని పోలీసులే నిర్బంధించారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే అతను తమ వద్ద లేడని, తాము ఎవర్నీ నిర్బంధించలేదని పోలీసులు వాదిస్తున్నారు. దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కాకినాడ రాజమండ్రి ఏడిపి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోటీగా రంగంపేట స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. -
‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?’
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?.. ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏది చూసినా గిట్టుబాటు ధరల్లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా?. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే నేతలు కేంద్రం నుండి ఏం సహాయం పొందారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజా సమస్యలు పక్కన పెట్టి, తిరుమల లడ్డూపై సంవత్సరన్నర పాటు అనవసర వివాదం చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనపడటం లేదు’’ అంటూ సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ప్రజల ఆస్తుల్ని దోచుకోవటమే సంపద సృష్టా?. మావిగన్ ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా దూషణలు ఎందుకు?. రాయలసీమలో రైతులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కానీ అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు రాయలసీమలో ఖర్చు పెడితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే పెట్టటం అన్యాయం. అమరావతి అప్పులు రాయలసీమ వాసుల మీద పడుతున్నాయి. రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. దేవాదాయ భూములను కూడా పరిశ్రమలకు ఎలా ఇస్తారు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు. -
వర్మ ప్యూజ్ పీకేసిన బాబు.. అయ్యో వర్మ.. ఏంటీ కర్మ
-
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత చూపుతున్నారంటూ జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు చేశారు. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా? అంటూ ప్రశ్నించారు. మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందన్న థామస్.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉండకూడదు.. తొక్కేయాలా? ఇదెక్కడి న్యాయం. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎస్సీలు కాళ్లు పట్టాలి.. వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు’’ అంటూ థామస్ వ్యాఖ్యానించారు. -
హానీ ట్రాప్ కేసులో మరో టీడీపీ నేత అరెస్ట్
-
నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...
-
చంద్రబాబు, పవన్ కు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు
-
టీడీపీ గ్యాంగ్ హనీట్రాప్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని అవినీతి, అక్రమాలు, మైనింగ్ మాఫియా, ఇతరత్రా దందాలతో టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండ శ్రుతిమించింది. ఇవన్నీ చాలవన్నట్లు డబ్బున్న వారికి అమ్మాయిలను ఎర వేసి, హనీ ట్రాప్ (వలపు వల)లో ఇరికించి, డబ్బు గుంజి, ఆర్థికంగా దివాలా తీయిస్తోంది. ఈ దందాలో ఏకంగా పలువురు పోలీసు అధికారులను భాగస్వాములుగా చేసుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వెనుక అసలు దోషి తెలుగుదేశం పార్టీ అని తేలింది. హనీట్రాప్ ముఠా లీడర్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలు. రంగమ్మకు అండగా ఉంటూ బాధితులపై దాడి చేసి, వీడియోలు తీసిన మరో కీలక వ్యక్తి రాజేశ్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మదమంచి స్వరూపకు కీలక అనుచరుడు. వీరిద్దరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు టీడీపీ నేతలు అండదండలు అందించడం వల్లే వందలాది మందిని వీరు వలపువలలో ఇరికించి ఆర్థికంగా దివాలా తీయించారని స్పష్టమైంది. ఈ దందాలో రాప్తాడు సీఐ శ్రీహర్షది కీలక పాత్ర. ఈ వలపువల దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. టీడీపీ నేతలు రంగమ్మ, రాజేశ్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరు సీఐలను వీఆర్కు పంపారు. మరికొందరు పోలీసు అధికారులు, పోలీసులకు కూడా ఈ దందాతో సంబంధం ఉందని తేలింది. వీరిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రంగమ్మను బుధవారమే అరెస్టు చూపిస్తే, మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు. ఎవరెవరి పాత్ర ఏంటంటే.. డబ్బున్న వ్యక్తులు, వ్యాపారులు, రియల్టర్లను గుర్తించడం, వారి ఫోన్ నంబర్లు సంపాదించి వారిని హనీ ట్రాప్ చేయడం, ఇంకొందరిని పని ఉన్నట్లు ఏకాంతంగా గదికి పిలిపించేలా చేయడం రంగమ్మ ఆధ్వర్యంలోని అమ్మాయిల బృందం పని. వ్యక్తులు వచ్చిన తర్వాత వారిపై దాడి చేసి, బట్టలు విప్పించి వీడియోలు తీయడం రాజేశ్ పని. వీడియోలు తీసిన తర్వాత వారివద్ద ఉన్న బంగారం దోచుకోవడంతో పాటు స్థాయిని బట్టి ముఠా సభ్యుల నుంచి అప్పు తీసుకున్నట్లు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రామిసరీ నోట్లు రాయించుకుంటారు. బాధితులతో పాత తేదీలతో బాండ్లు రాయించుకున్న తర్వాత రంగమ్మ సీఐ శ్రీహర్షను కలిసి ఫిర్యాదు చేస్తుంది. శ్రీ హర్ష బాధితులను పిలిపించి ప్రామిసరీ నోట్లో పేర్కొన్న డబ్బును బెదిరించి, పంచాయితీ చేసి ఇప్పిస్తారు. ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు.. వందల మంది బాధితులు ఈ వలపు వలలో చిక్కుకుని ఆర్థికంగా చితికిపోయారు. రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వీరి ఒత్తిడి భరించలేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా కన్నీటిని దిగమింగి వేదన పడుతున్నారు. మరో నలుగురు సీఐల పాత్ర!హనీట్రాప్ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి వరుస కథనాలను ప్రచురించింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ జగదీశ్ రూరల్ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో రంగమ్మ, రాజేశ్తో పాటు మరో ఏడుగురు నిందితులను ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్కు పంపారు. మరో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో మరో నలుగురు సీఐలు, 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం వీఆర్కు పంపడం కాకుండా హనీట్రాప్ ముఠా సభ్యుల తరహాలోనే పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చార్జిషీట్లో వారి పేర్లు ఎందుకు చేర్చలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి!హనీట్రాప్ వ్యవహారంలో మరికొంత మంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హంపాపురం సమీపంలోని 7 హిల్స్ హోటల్ను రంగమ్మ నిర్వహించేది. హనీట్రాప్కు సంబంధించిన పంచాయితీలన్నీ ఈ హోటల్లోనే జరిగేవని తెలుస్తోంది. సీఐ శ్రీహర్ష కూడా హోటల్ వద్దకు తరుచూ వచ్చేవారని తెలుస్తోంది. అలాగే ఈ హోటల్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు ధర్మవరం మురళి, పరిటాల మహీంద్ర, బైటీఎన్ ప్రసాద్ కూడా రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు రెగ్యులర్గా కూర్చునే వారని పోలీసు, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయం, ఆదేశాలతోనే సీఐ శ్రీహర్ష హనీట్రాప్ ముఠా పంచాయతీలను చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా వెళితే పలువురు టీడీపీ నేతల బాగోతం బట్టబయలు అవుతోందని గ్రహించిన టీడీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై ఈ వ్యవహారాన్ని ఇంతటితోనే ముగించాలని ఆదేశించినట్లు సమాచారం. హోం మంత్రి ఆ మేరకు పోలీసు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చిన్నదిగా చూపేందుకు పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.రూ.13 లక్షలు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనంహనీట్రాప్ వ్యవహారంపై డీఎస్పీ శ్రీనివాసులు గురువారం ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ‘గార్లదిన్నె వాసి కుంచం ఉదయ్భాస్కర్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. ఐదు నెలల కిందట ఉదయభాస్కర్రెడ్డికి మంగలి జయలక్ష్మి ఫోన్ చేసింది. డ్రోన్ ద్వారా వెంచర్ను సర్వే చేయాలని భాగ్యనగర్కు పిలిచింది. ఇంట్లోకి రాగానే సర్వే కొటేషన్ వివరాలు ఆరా తీస్తుండగా, దబ్బర రాజేష్ అక్కడికి వచ్చి తాను జయలక్ష్మి భర్తను అని, తన భార్యతో ఏం చేస్తున్నావ్ అని ఉదయ్ భాస్కర్రెడ్డిపై దాడి చేసి దుస్తులు విప్పించాడు. అంతలో జయలక్ష్మీ కూడా దుస్తులు తీసేసింది. ఇద్దరూ నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఇంతలో రంగమ్మ అక్కడికి చేరుకుని.. ‘ఎందుకు ఇలా చేశావు. మీ ఊరిలో, మీ కుటుంబంలో ఈ విషయం తెలిస్తే నీ పరువు పోతుంది.. వాళ్లు ఏమైనా చేసుకుని చనిపోతారు.. ఇది బయటకు రాకుండా ఉండాలంటే రూ.4 లక్షలు ఇవ్వు’ అని ఉదయ్భాస్కర్ను ఆదేశించింది. డబ్బులు ఇవ్వకపోతే కత్తి చూపించి చంపుతామని బెదిరించారు. రూ.4 లక్షలు సమర్పించుకుని వారి నుంచి ఉదయ్ బయటపడ్డాడు’ అని డీఎస్పీ తెలిపారు. దీనిపై బాధితుడు రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐ విచారణ చేపట్టారు. ఎస్పీ జగదీష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించామన్నారు.వీరిలో మామిళ్లపల్లి రంగమ్మ అలియాస్ రంగమ్మనాయుడు అలియాస్ చిన్నీని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. తాజాగా దబ్బర రాజేష్, మంగలి జయలక్ష్మీ, చంద్రకళ, అనంతకుమారిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి ఇప్పటి దాకా రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 20 మందిని హనీట్రాప్కు గురిచేసినట్లు ఇప్పటి వరకు తేలిందన్నారు. వారిని బెదిరించి భారీగా వసూళ్లు చేశారన్నారు. రంగమ్మ అలియాస్ చిన్నీపై సుమారు 10 కేసులున్నాయన్నారు. మిగిలిన వారిపై తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలు కేసులున్నాయని తెలిపారు.పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు హనీట్రాప్ వ్యవహారంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరుడు, రుద్రంపేట మాజీ సర్పంచ్ నరేంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. -
నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు
-
ఎలాగైనా దీన్ని ఆపేయాలి అని చంద్రబాబు కక్ష కట్టుకుని ఉన్నాడు
-
పరువు పోగొట్టుకున్న డ్రగ్స్ ఎంపీకి ఘన స్వాగతం.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
పరువు పోగొట్టుకున్న డ్రగ్స్ ఎంపీకి ఘన స్వాగతం.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపు.. తీసేయమన్నందుకు ఇనుప రాడ్డుతో TDP నేత దాడి
-
జనసేన జోలికి వస్తే.. ఖబర్దార్.. TDPకి జనసేన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్


