ఇప్పటికే కూటమిలో విభేదాలు.. | Minister Narayana Sensational Comments Over Varam On Pithapuram Politics In Teleconference, Watch Audio Inside | Sakshi
Sakshi News home page

ఇప్పటికే కూటమిలో విభేదాలు.. వర్మ, పవన్‌ ప్రస్తావన తెచ్చిన మంత్రి నారాయణ

Oct 15 2025 10:36 PM | Updated on Oct 16 2025 10:38 AM

Minister Narayana sensational comments in teleconference

పది, ఇరవై రోజులకోసారి పవన్‌ కల్యాణ్‌తో చర్చించాల్సి వస్తోంది

పిఠాపురంలో జీరో చేశారని వర్మ అసహనంగా ఉన్నారు

పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు

టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్

నెల్లూరు టాస్క్‌ఫోర్స్‌: కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని  రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ ఆదేశిస్తేనే ఇకపై ఎవరైనా మాట్లాడా­లని స్పష్టం చేశారు. నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసు­లు­రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెడు­తు­న్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాల­యం నుంచి ఆదేశాలు రాకుండా ఎవరూ స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదని హెచ్చరించారు. 

ఇక నుంచి ఎవరు మాట్లాడాలో తామే నిర్ణయిస్తామ న్నారు. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదా­లున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అస­హ­నంగా ఉన్నారన్నారు. తనను నియోజక­వర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచు­కోకపోతే సహించేదిలే­ద­న్నారు. 

నీ నియోజకవర్గంలో పార్టీ నేత­లను ఎందుకు కంట్రోల్‌ చేయలేక­పోతు­న్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు.   ప్రతి పది, ఇరవై రో­జు­లకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌­కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లా­డు­కుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొ­న్నారు. మనోహర్‌ తనకు ఫోన్‌ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా..  అంటూ అడి­గా­ర­న్నారు. మీ నియోజకవర్గంలో నాయ­కులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. 

తన డిపార్ట్‌మెంట్‌ను డీగ్రే­డ్‌ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడ­టంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా?  అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ  తిట్టడం వచ్చు.. కేకలే­యడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫ­రెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement