Nadendla manohar
-
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్. -
టీచర్లు ఖాళీ.. మంత్రి కంగాళి!
సాక్షి, అమరావతి: నిబంధనలు తెలుసుకోకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్లో ఉన్న టీచర్లలో 50 శాతం వరకు సెలవు తీసుకొనే వెసులుబాటు ఉన్నా, అయినా తక్కువ మందే సెలవులో ఉన్నప్పటికీ, వారందరికీ మెమోలు జారీ చేయాలంటూ ఎంఈవోను ఆదేశించడంపై ఉపాధ్యాయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలను మంత్రి మనోహర్ సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. 24 మంది టీచర్లలో ఐదుగురు సాధారణ సెలవు, మరో ఇద్దరు హాఫ్డే సెలవు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ‘ఒకేసారి ఏడుగురు టీచర్లు ఎలా సెలవు తీసుకుంటారు? మీరెలా ఇచ్చారు’ అంటూ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్ఎం)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సెలవు పెట్టిన ఉపాధ్యాయులకు మెమోలు జారీచేయాలని ఎంఈవోను ఆదేశించారు. ఈ విషయంపై మంగళవారం డీఆర్సీ సమావేశంలో కలెక్టర్, డీఈవోలతో చర్చిస్తానన్నారు. మొత్తం 399 మంది విద్యార్థుల్లో 80 మంది హాజరు కాకపోవడంపై మంత్రి హెచ్ఎంని ప్రశ్నించారు. మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మంత్రి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశిస్తే తాము ఎలా పనిచేయగలమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు అడగకుండా మంత్రి హడావుడి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గం చూపాల్సిన మంత్రే టీచర్లను బెదిరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. వాస్తవానికి శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో 46 ఉపాధ్యాయ పోస్టులకు గాను, 36 మందే టీచర్లున్నారు. వీరిలో 12 మందిని ఇటీవల డెప్యుటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించారు. మిగిలిన 24 మందిలో సోమవారం ఐదుగురు సీఎల్ తీసుకోగా, ఇద్దరు మధ్యాహ్నం నుంచి హాఫ్ డే సెలవు పెట్టారు. అయితే, మంత్రి మనోహర్ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై మాట్లాడకుండా, బోధనాపరమైన సమస్యలు తెలుసుకోకుండా టీచర్ల సెలవుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఉపాధ్యాయుల్లో 50 శాతం తగ్గకుండా విధులకు హాజరు కావాలి. దీనిప్రకారం ఈ స్కూల్లో 11 మంది వరకు సెలవు తీసుకోవచ్చు. కానీ ఐదుగురే సెలవు పెట్టినా మంత్రి హడావుడి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
మంత్రి నాదెండ్లకు షాక్.. పోర్టులో బియ్యానికి క్లీన్ చిట్
సాక్షి, విశాఖ: ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్ పాలన హడావుడికి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైంది. మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్కు చుక్కెదురైంది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గత నెల 9న కంటైనర్ టెర్మినల్లో నాదెండ్ల తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల ప్రకటించారు.ఇదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి హడావిడి చేశారు. ఇక, నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్ ధృవీకరించారు. ఈ క్రమంలో వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలంటూ కలెక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
పీడీఎస్ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!
సాక్షి, విశాఖపట్నం: మంత్రి పట్టుకున్నప్పుడు రేషన్ బియ్యం నెల రోజుల్లోనే సాధారణ బియ్యంగా మారిపోవడం కూటమి నేతలు చేసిన మ్యాజిక్కే. మంత్రి అనుచరుల మంత్రాంగమే. చేతులు తడిపితే చాలు.. పేదోడి బియ్యం కూడా ‘మనోహర’మైన బియ్యంగా మారిపోతున్నాయి. రేషన్ బియ్యమే అయినా.. దర్జాగా షిప్ ఎక్కి దేశాలు దాటిపోతున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత నెల 9న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్కు వచ్చి పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లలో తనిఖీలంటూ హడావుడి చేశారు. బియ్యాన్ని నాలుగైదుసార్లు రెండు చేతుల్లో అటు ఇటూ తిప్పి.. ఇవి 100 శాతం పీడీఎస్ బియ్యం.. సీజ్ ది రైస్.. అంటూ ఆదేశాలు జారీ చేసి, అక్కడ ఉన్న రెండు సంస్థలకు చెందిన 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి బిబో ఇంటర్నేషనల్ సంస్థ తెచ్చిన 8 లారీల లోడు (259 టన్నులు) మొత్తం రేషన్ బియ్యమే అని మంత్రి, అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రకటించారు. 48 గంటల్లో సమగ్ర డాక్యుమెంట్లు తేకపోతే బియ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. 48 గంటలు గడిచినా ఏ చర్యా లేదు. ఇంతలో మంత్రి అనుచరులు రంగప్రవేశం చేసి, సీను మొత్తాన్ని మార్చేసినట్లు చెబుతున్నారు. మొత్తం బియ్యం వ్యాపారాన్ని నిలిపివేయిస్తామని ఆ ఎక్స్పోర్టు సంస్థని బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ సంస్థ వారు అడిగిన మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ బియ్యం రేషన్ బియ్యం కాదని క్లీన్చిట్ ఇచ్చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు. మంత్రి అనుచరులు ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆ బియ్యానికి క్లీన్ చిట్ ఇచ్చి, ఎగుమతికి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ బియ్యాన్ని రేపో మాపో నౌకలో చైనా పంపేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరో సంస్థ మాత్రం ఇంకా బేరం కుదుర్చుకోకపోవడంతో మిగతా బియ్యం అలాగే ఉండిపోయింది.విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్) నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశాం. కాకినాడ పోర్టులో నిఘా పెరగడం వల్ల వైజాగ్ పోర్టు నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకే తనిఖీ చేసి పట్టుకున్నాం. వారిపై కేసులు కూడా పెడుతున్నాం. ఇకపై ఒక్క గింజ పీడీఎస్ బియ్యం కూడా పోర్టు దాటి వెళ్లకుండా పేదలకు చేర్చడమే మా లక్ష్యం. – డిసెంబర్ 9న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనకట్ చేస్తే..: పోర్టులో మంత్రి నాదెండ్ల సమక్షంలో పట్టుకున్న 483 టన్నుల బియ్యంలో 259 టన్నులు రేషన్ బియ్యం కాదు. ఆ 8 లారీల్లో బిబో సంస్థ తెచ్చిన బియ్యాన్ని నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు.– ఈ నెల 2న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జారీ చేసిన సర్క్యులర్ -
నాదెండ్ల.. కొల్లిపర ఎక్కడో తెలుసా?: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పని తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పంట కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి ఏమైపోయారని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోళ్ళ పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో అంబటి ట్విట్టర్ వేదికగా..‘నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!. కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు. ధాన్యం దిగుబడి 31వేల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం కొన్న ధాన్యం 1500 మెట్రిక్ టన్నులు. ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర!’ అంటూ కామెంట్స్ చేశారు.నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!కొల్లిపర మండలం: వరి సాగు విస్తీర్ణం: 13,500 Acresధాన్యం దిగుబడి :31000 MTప్రభుత్వం కొన్న ధాన్యం : 1500 MTప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర !@ncbn @mnadendla— Ambati Rambabu (@AmbatiRambabu) December 10, 2024 -
సీజ్ ద పోర్ట్
ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నాము. మద్దతు ధర లభించక దారుణంగా నష్టపోతున్న రైతన్నల దుఃస్థితి ప్రతి గ్రామానా కనిపిస్తున్నది. ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నట్టున్నది. రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు.నిబంధనలకు తిలోదకాలిచ్చి తేమ శాతాన్ని అధికంగా చూపెట్టి బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు దళారులు లాగేస్తున్నారని సమాచారం. రైతుకు లభించవలసిన మద్దతు ధరలో టన్నుకు కనీసం 6 వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సంవత్సరం 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు పండించిన మొత్తం ధాన్యం 84 లక్షల టన్నులని అంచనా.ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ప్రకారం 37 లక్షల టన్నుల లెక్కనే తీసుకుందాం. టన్నుకు ఆరువేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారీల దోపిడీ విలువెంత? 2,200 కోట్లు! రైతు సేవా కేంద్రాల్లోనే తిష్ఠవేసిన గాదె కింది పందికొక్కులు అప్పనంగా 2,200 కోట్ల రూపాయల రైతుల శ్రమ ఫలాన్ని లాక్కుంటూ ఉంటే మన సర్కార్ వారు ఏం చేస్తున్నారో తెలుసా?ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అని గర్జిస్తున్నారు. ఇంతకూ ఆ మంత్రివర్యులు సీజ్ చేయమన్న షిప్పులో ఏమున్నది? 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్చేసి ఉన్నాయట! అందులో మన రేషన్ బియ్యం మాత్రం 640 టన్నులేనని తెలుస్తున్నది.ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు 40 రూపాయలు పడుతుందని ఓ లెక్క. టన్నుకు 40 వేలు. ‘సీజ్ ద షిప్’లో ఉన్న 640 టన్నుల విలువ దాదాపుగా రెండున్నర కోట్లు! పెద్ద లెక్కే. ఆ ఓడతోపాటు మరో ఓడలో ఇండోనీషియాకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని మరో మంత్రిగారి వియ్యంకుడు తరలించారనీ, దాని జోలికి మాత్రం మన డిప్యూటీ వెళ్లలేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రజాపంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమ మార్గం పడితే అరికట్టవలసినదే! అభ్యంతరం లేదు. అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద ఛేజింగ్ సినిమా అవసరం లేదు. ఒకపక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకోని ప్రభుత్వం కాకినాడ రేవుకాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మతలబు ఉందనిపించడం లేదా? నిజంగానే చాలా మతలబు ఉన్నది. కాకినాడ రేవు ఇతివృత్తంతో చాలా సన్నివేశాలను వరసగా నడిపించారు. ‘సీజ్ ద షిప్’ ఓ డైలాగ్ మాత్రమే! సినిమా టైటిల్ ‘సీజ్ ద పోర్ట్’ కావచ్చు!!నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన వియ్యంకుడి ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దాపురం వెళ్లారు. ఆ వెంటనే ఓ మంత్రిగారు కాకినాడ పోర్టుకు వెళ్లారనీ, అక్కడ పోర్టు అధినేత కేవీ రావునూ, సీఈఓ మురళీధరన్నూ కలిసి వచ్చారనీ విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ యాంకరేజి పోర్టులో లోడింగ్ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు. అందులో లోడ్ చేసిన బియ్యంతో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు.మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ఢిల్లీ నుంచి వచ్చీరావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్లారు. ‘సీజ్ ద షిప్’ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఈ పోర్టు ఎవరిది, ఇక్కడ అధికారులెవరంటూ పవన్ ప్రశ్నించారు. వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజీ పోర్టు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే! పోర్టు ప్రభుత్వానిదే, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే!మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు? ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కనబెట్టి హడావిడి చేశారు. ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్ మరో అడుగు ముందుకువేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో 41 శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని ‘అరబిందో’కు కట్టబెట్టారని ఆరోపించారు.ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజి పోర్టు వేరు. అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డీప్ వాటర్ పోర్టు వేరు. కాకినాడ పోర్టు అనే పేరుతో ఈ రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళ పరచడం ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ‘కాకినాడ సీపోర్ట్స్’ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారు. డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకూ, యాంకరేజీ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకూ లంకె బిగించే వ్యూహం కావచ్చు. చేతిలో మీడియా ఉన్నది కదా!నాదెండ్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీ రావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం, ఆ కేసును సీఐడీ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అరబిందో అనేది సుమారు పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ప్రతిష్ఠాత్మక సంస్థ. కాకినాడ సీపోర్ట్స్లో 495 కోట్ల రూపాయలు చెల్లించి 41 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలనేది మొదటి కామన్సెన్స్ ప్రశ్న. ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా! ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్సెన్స్ ప్రశ్న! భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చేసిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా, ఆయన నియమించుకున్న మనిషే సీఈవోగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగితజ్ఞానం వేసే ఇంకో ప్రశ్న. ఒక సాధారణ రైస్ మిల్లు యజమాని స్థాయి నుంచి ఎకాయెకిన ఓడరేవు యజమానిగా ఎదగగలిగిన నేర్పరి కేవీ రావు. అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంతటి అర్భకుడని ఎవరు నమ్మగలుగుతారు? ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురైవుంటే కేసు పెట్టలేనంత అమాయకుడేం కాదు కదా! సెబీకో, ఎన్సీఎల్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదుగదా? కనీసం యెల్లో మీడియా చెవిలో ఊదాలనీ, తనను పోర్టు యజమానిని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా? ఆ పని చేసివుంటే వాళ్లు అప్పుడే ఒక బడబానలాన్ని సృష్టించి ఉండేవారు కాదా? వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికే కేవీ రావు నిద్ర లేవడం వెనకనున్న రహస్యం గురించి విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోలేరా?వైసీపీలోని ప్రముఖులను ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలి. కాకినాడ సీపోర్టును మళ్లీ కాజెయ్యాలి, జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇంకొంచెం మసి పూయాలి. ఇదే కదా వ్యూహం? అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారి ఏకసూత్ర కార్యక్రమంగా ఈ వ్యూహం మారిపోయింది. అసలు కాకినాడ సీపోర్టు కూడా ప్రభుత్వానిదే! ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు. దీన్ని అప్పనంగా పప్పుబెల్లాలకు కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే! పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కారుచౌకగా ఆయనకు కట్టబెట్టారు. కేవీ రావు మీద ఎందుకింతటి అవ్యాజమైన ప్రేమ? రైస్ మిల్ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు? ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్లీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకూ కేవీ రావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. ‘సీజ్ ద పోర్ట్’ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావేమో!పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సెజ్ భూములపై కూడా యెల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి 2180 ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశారు. భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులపరం చేసిన ఏకైక సందర్భం ఇది. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్ భూముల్లో జగన్ హయాంలో గోల్మాల్ జరిగిందని యెల్లో మీడియా కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. ఈ వైఖరిని ఆ ప్రాంత రైతు ప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమక్షంలో నిర్ద్వంద్వంగా ఖండించారు. కాకినాడ సెజ్ భాగోతాన్ని 2003లో బాబే ప్రారంభించారు. లాభాల్లో ఉన్న పోర్టును 1999లో ఆయనే కేవీ రావుకు కట్టబెట్టారు. ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో, దొంగలెవరో వెల్లడి కాదని విజ్ఞుల అభిప్రాయం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మంత్రి నాదెండ్ల సమావేశానికి స్కూల్ విద్యార్ధులతో పనులు
-
నాదెండ్ల మనోహర్ కు అడుగడుగునా చేదు అనుభవం
-
మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్కు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రిని రైతులు నిలదీశారు. 10 రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు.ఈ క్రాప్ జరిగినప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. 1262 ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నించడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు కొనడం లేదంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాయంత్రానికల్లా ధాన్యం కొని.. రేపటికల్లా డబ్బులు పడేలా చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’ -
డైవర్షన్ క్లాప్.. ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్తా
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయ్యింది... ఎన్నికలు అయిపోయాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అయ్యాయి కదా..! మరి ఇంకేంమంటూ... ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమంగా చంద్రముఖిగా మారడం మొదలుపెట్టారు! ఆయనలోని మాయల మరాఠీ మళ్లీ నిద్ర లేచారు! తమ ప్రభుత్వ వైఫల్యాలు, అడ్డగోలు దోపిడీ బాగోతాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మంత్రదండాన్ని ప్రయోగించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో రాద్ధాంతంతో హడావుడి చేసిన చంద్రబాబు ఇక ఆ కథలు అట్టే సాగవని గుర్తించారు. టీడీపీ కూటమి పెద్దలు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దాంతో అంతకు మించిన డ్రామాతో కనికట్టు చేసేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే జనసేనలోని తన కోవర్టు నాదెండ్ల మనోహర్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కాకినాడ తీరంలో డైవర్షన్ సినిమాకు క్లాప్ కొట్టారు. అసత్య ఆరోపణలతో డైలాగులు.. సీన్కు సంబంధంలేని ఓవర్ యాక్షన్... కృతకంగా సాగిన రాజకీయ ఎపిసోడ్తో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కానీ చంద్రబాబు స్క్రిప్ట్ వర్క్ అవుట్ కాలేదు. డైవర్షన్ పాలిటిక్స్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. వైఫల్యాలపై ఏమార్చి... దోపిడీని దాచేందుకేఓ వైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం.. మరోవైపు మిల్లర్ల నుంచి తమ భారీ కమీషన్ల బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వ పెద్దలు ‘బియ్యం డ్రామా’కు తెరతీశారు. ధాన్యం కొనుగోలుపై కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిపోయినా ప్రభుత్వం కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేకపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. దాంతో ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు నష్టపోతున్నారు. మరోవైపు మిల్లర్లకు రూ.1,600 కోట్ల సీఎంఆర్ బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అందుకు మిల్లర్లు సమ్మతించడంతో మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ చేతగానితనం.. మరోవైపు మిల్లర్ల నుంచి కమీషన్ల దోపిడీ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ పెద్దలు కాకినాడ పోర్ట్ వద్ద బియ్యం డ్రామాకు తెరతీశారన్నది స్పష్టమవుతోంది.కూటమి ఎమ్మెల్యేల నేతృత్వంలోనే రేషన్ బియ్యం మాఫియాక్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోకుండా... కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉండే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ రాజకీయ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉంది. బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఎందుకంటే.. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలే మాఫియాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలి. అధికారుల సహకారంతో రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం చెక్ పోస్టుల వద్ద తలుపులు బార్లా తెరచి మరీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సింది రవాణా, హోం, పౌర సరఫరాలు, విజిలెన్స్ శాఖలే. అక్రమ రవాణా సాగుతోందంటే అందుకు ఆ శాఖల మంత్రులు బాధ్యత వహించాలి. రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోందంటే అందుకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ బాధ్యత వహించాలి. మరి పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్లను నిలదీయకుండా కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి హడావుడి చేయడం వెనుక లోగుట్టు ఏమిటి..? పోర్టులను కేంద్ర షిప్పింగ్ శాఖ, కస్టమ్స్ శాఖ పర్యవేక్షిస్తాయి. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్, మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు వెళ్లి ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక మతలబు ఏమిటి? ఇదంతా కేవలం ప్రజల దృష్టి మళ్లించే దిగజారుడు రాజకీయమే కదా! రేషన్ బియ్యమని ఎవరు చెప్పారు..?పరీక్షించకుండానే ఎందుకీ గగ్గోలు?కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి ఓ షిప్ ద్వారా ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన బియ్యంపై పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రెండు రోజులుగా చేస్తున్న రాద్దాంతం కేవలం రాజకీయ డ్రామాయేనని స్పష్టమవుతోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు రవాణా చేస్తున్నారని వారిద్దరూ మీడియా కెమెరాలను వెంటబెట్టుకుని వెళ్లి చేసిన రాద్ధాంతం హాస్యాస్పదంగా మారింది. ఆ షిప్లో రవాణా చేసేందుకు సిద్ధం చేసిన బియ్యం అసలు రేషన్ బియ్యమని ఎవరు చెప్పారు? మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, మనోహర్కు ఆమాత్రం అవగాహన లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంటనే వాటి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించాలి. అవి రేషన్ బియ్యమా..? మార్కెట్లో అందుబాటులో ఉన్న బియ్యమా? అన్నది పరీక్షించి నిర్ధారించాలి. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్గానీ జాయింట్ కలెక్టర్ రాజీవ్ మీనాగానీ ఆ బియ్యం శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం పంపించనే లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టర్ బుధవారం ఆ షిప్లోకి వెళ్లి బియ్యాన్ని చూసి వచ్చారు గానీ వాటి శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం పంపలేదు. షిప్లో ఉన్నవి రేషన్ బియ్యమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనూ లేదు. మరి రేషన్ బియ్యం అక్రమ స్మగ్లింగ్ అంటూ పవన్ కళ్యాణ్, మనోహర్ రాద్ధాంతం చేయడం ఏమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు చీప్ ట్రిక్స్సూపర్ సిక్స్ హామీల అమలు ఎగవేత, తమ అడ్డగోలు దోపిడీ బాగోతాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనిపై నిలదీస్తున్న ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. ఆరు నెలలుగా ఇదే ధోరణి. అయితే ఎల్లకాలం డైవర్షన్ పాలిటిక్స్తో మభ్యపెట్టలేమని గుర్తించడంతో తాజాగా బియ్యం డ్రామాకు తెర తీశారు. కూటమి పెద్దలు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి ప్రభుత్వమే రాచబాట వేసింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి మరీ టీడీపీ సిండికేట్ సభ్యులు ఏకపక్షంగా మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. అనంతరం వీధి వీధినా...వాడవాడలా బెల్ట్ దుకాణాలు నెలకొల్పి దోపిడీకి పాల్పడుతున్నారు. ఏకంగా దండోరా వేసి మరీ బెల్ట్ దుకాణాలకు వేలం పాటలు నిర్వహిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. మరోవైపు ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలోని ఇసుక రీచ్లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెరతీశారు. తద్వారా ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పోతోంది. రీచ్లను నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్ ఇసుక రేట్లు భారీగా పెంచేసి ప్రజలను దోపిడీ చేస్తోంది. ఇక వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తన అసలు స్వరూపం చూపించారు. వలంటీర్ల వ్యవస్థను తొలగించి వారిని రోడ్డున పడేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్లో నీటినిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలన్న ఎన్టీయే ప్రభుత్వ నిర్ణయానికి చంద్రబాబు వంత పాడడం ద్వారా రాష్ట్రానికి తీరని ద్రోహం తలపెట్టారు. మరోవైపు అందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలతో తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దీంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే బియ్యం డ్రామాకు టీడీపీ పెద్దలు తెర తీశారు. కాకినాడ పోర్టు వేరు.. యాంకరేజ్ పోర్ట్ వేరుపవన్, నాదెండ్ల నిలదీయాల్సింది చంద్రబాబునేమంత్రులుగా వారూ బాధ్యత వహించాలి..కాకినాడ పోర్టు స్మగ్లింగ్ డెన్గా మారిందంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేశారు. కాకినాడ పోర్టును అరబిందో సంస్థ దక్కించుకున్నప్పటి నుంచే రేషన్ బియ్యం అక్రమ రవాణా హెచ్చుమీరిందని అసత్య ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. వారిద్దరూ బాధ్యతాయుతమైన మంత్రులుగా ఉంటూ కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరేజ్ పోర్టుల మధ్య తేడాను గుర్తించలేని అజ్ఞానంలో ఉండటం విస్మయపరుస్తోంది. కాకినాడ పోర్ట్ వేరు... కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ యాంకరేజ్ పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. మరి ఆ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత కదా? మరి పవన్ కళ్యాణ్, మనోహర్ ఎవర్ని నిలదీయాలి? రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలి కదా! ఆ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిద్దరూ కూడా బాధ్యత వహించాలి. అందుకు విరుద్ధంగా కాకినాడ పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థను ప్రశ్నించడం వారి అజ్ఞానమా? లేక రాజకీయ కుట్ర అనుకోవాలా?ప్రైవేటు వ్యవహారంపై రాద్ధాంతం ఏమిటో..!కాకినాడ డీప్వాటర్ పోర్ట్ను ప్రమోటర్ కేవీ రావు నుంచి అరబిందో సంస్థ కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసింది. అది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన అమ్మకం–కొనుగోలు లావాదేవీ. కాకినాడ డీప్వాటర్ పోర్ట్ యాజమాన్య మార్పిడి చట్టబద్ధంగా సాగిన ప్రైవేటు వ్యవహారం. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ అంశాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి పెద్దలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విడ్డూరంగా ఉంది. కాకినాడ పోర్టును ప్రైవేటుపరం చేసింది బాబే కదా..కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమే. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీల పరం చేసేందుకు సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. -
Ambati Rambabu: సీజ్ చేసిన షిప్ నే మల్లి సీజ్
-
‘నాదెండ్ల వాస్తవాలు తెలుసుకో.. పీడీఎస్ బియ్యం మంత్రి వియ్యంకుడిదే’
సాక్షి, గుంటూరు: కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే.. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సీజ్ చేసిన షిప్నే మళ్లీ సీజ్ చేయడమేంటి?. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలివెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు.అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు హాయాంలోనే అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. చెక్పోస్టులు ఉండగా.. పీడీఎస్ బియ్యం ఎలా తరలిపోతుంది?. అధికారం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంది కదా?. వైఎస్ జగన్పై బురద జల్లడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా బియ్యం తరలి వెళ్తోంది. జనసేనకు చెందిన వారంతా పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారు. జనసేన నేతలు కుమ్మకైపోయి అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. -
మాయచేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా...! నాదెండ్లకు అనిల్ కుమార్ కౌంటర్
-
రైతులకు ప్రభుత్వం సహకరించడం లేదు
గుడ్లవల్లేరు/పామర్రు/గూడూరు(పెడన)/గుడివాడ రూరల్: ధాన్యం కొనుగోళ్లపై సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించగా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. తుపాను గండం నుంచి బయటపడాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే... అక్కడ గోనె సంచులు లేవని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, మిల్లర్లు తేమ శాతం ఎంత చెబితే... అంతమేరకు కట్ చేసి తమకు రావాల్సిన ధాన్యం సొమ్ములో కోత విధిస్తున్నారని గుడ్లవల్లేరు మండలంలోని రైతులు ఫిర్యాదు చేశారు. ఎంటీయూ 1262 రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని పామర్రు మండలంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లోని రైతులు ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించడంలో తమకు ప్రభుత్వం సహకరించడం లేదని గూడూరు మండలం, తరకటూరు రైతులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాట్రగడ్డ కృష్ణ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ప్రభుత్వం రైతులకు సహకరించడం లేదని, తాను కూడా బస్తా రూ.1400 చొప్పున మిల్లర్లకు విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు.ప్రభుత్వం తరఫున రైతుల దగ్గరకు ఏ అధికారీ రాలేదని, తనతో పాటుగా ఇక్కడి రైతులంతా బస్తా రూ.1300 నుంచి రూ.1400కు దళారులకు అమ్ముకున్నట్టు తెలిపారు. మరో రైతు అయ్యప్ప మాట్లాడుతూ.. తనకు 20 ఎకరాల పొలం ఉందని, పంట కోశాక రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ఆర్ఎస్కేలో సాంకేతిక సిబ్బంది లేరంటూ పంట వెనక్కి పంపారని, గత్యంతరం లేక పది ఎకరాల్లోని పంట దళారులకు బస్తా రూ.1400 చొప్పున అమ్మినట్టు మంత్రికి వివరించారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల దృష్ట్యా 40 రోజుల్లో చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 4 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని, 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్ మిల్లరను ఆదేశించినట్లు తెలిపారు. -
అన్నదాత ఆక్రందన
-
గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు
కంకిపాడు: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా రూ.1,600 ఉంటే రైతుకి రూ.1,550 వరకు గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు 75 కిలోల బస్తా రూ.1,720 ఉన్నా రైతుకి రూ.1,420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నారు. తుపాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితిలో మేముంటే 22 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణం. 1,262 విత్తనం ధాన్యాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నాం. ఇప్పుడు మాత్రం నూక అవుతుందని అధికారులు సాకు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మా పరిస్థితి ఏమిటి’ అని రైతులు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను నిలదీశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్ను, దావులూరుల్లో మంగళవారం మంత్రి మనోహర్ పర్యటించారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు, సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. పంట అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంచులు, రవాణా వాహనాలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటుందని రైతులు వాపోయారు. కోలవెన్నులో మనోహర్ను రైతులు, కౌలు రైతులు చుట్టుముట్టారు. నాలుగు రోజులుగా ధాన్యం రాశులుగా పోసి ఉంచామని, తుపాను భయంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు, లారీలు కావాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని.. రైతుగా పుట్టడమే తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రైతులకు నచ్చజెప్పిన మంత్రి మనోహర్ 48 గంటల్లో కల్లాలు, రోడ్లపైన పోసి ఉన్న ధాన్యాన్ని వేగంగా రైతులు కోరుకున్న మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంచులు, లారీలు సమకూర్చాలని సూచించారు. జీపీఎస్తో సంబంధం లేకుండా ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.1,100 కోట్లు రైతులకు అందించామన్నారు. -
కూటమి సర్కార్కు ఊపిరి సలపనివ్వని వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్పై వాడీవేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో, మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.ఇక, అంతకుముందు రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. -
2018లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టా?
తెనాలి: సోషల్ మీడియాలో పవన్కల్యాణ్, నాదెండ్ల మనోహర్లను 2018లో విమర్శిస్తూ పెట్టిన పోస్టును షేరింగ్ చేసిన కారణంతో వల్లభాపురానికి చెందిన రైతు ఆళ్ల జగదీష్రెడ్డిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయటం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. దాంతోపాటు తెనాలి పోలీసులు మరో కేసును నమోదు చేయడం తగదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు. జగదీష్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కొల్లిపర మండల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఆళ్ల జగదీష్రెడ్డిని విజయవాడ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులు విడుదల చేయటంతో ఇంటికొచ్చిన జగదీష్రెడ్డిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్మీడియా కార్యకర్తలపై కేసులతో భయభ్రాంతుల్ని చేయటాన్ని పెద్ద ఎత్తున ఇలా చేస్తున్నారని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే జగదీష్రెడ్డిని తెల్లవారుజామున ఇంటికొచ్చి మరీ తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎవరు తీసుకెళ్లిందీ తెలీక, ఆ కుటుంబంతోపాటు గ్రామస్తులంతా ఆందోళన చెందారని తెలిపారు. తీరా చూస్తే సైబర్క్రైం పోలీసులని తెలిసిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు... ఈ రోజు అధికారం వచ్చిందనే గర్వంతో తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. ‘మీరు చూపిస్తున్న కొత్తమార్గాన్ని భవిష్యత్లో మేమూ అనుసరిస్తాం’ అంటూ కూటమి నేతలను శివకుమార్ హెచ్చరించారు. వైఎస్సార్ సీపీని, క్యాడర్ను బెదిరించే ధోరణులను మానుకోవాలని, నాదెండ్ల మనోహర్ ఇప్పటికై నా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. పార్టీ కొల్లిపర మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి మాట్లాడుతూ.. జగదీష్రెడ్డిని ఎవరో తీసుకెళ్లారని తెలిసిన దగ్గర్నుంచి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మనోధైర్యం కల్పిస్తూ వచ్చారని చెప్పారు. పార్టీ క్యాడర్కు ఏ చిన్న ఆపద వచ్చినా పార్టీ యంత్రాంగం, లీగల్సెల్ సహకరిస్తుందని పేర్కొంటూ ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ధైర్యంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?
సాక్షి టాస్క్ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది. అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు. -
మంత్రి నాదెండ్ల టూర్.. కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు -
ఇంటింటికీ రేషన్ మూర్ఖపు నిర్ణయం
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ పంపిణీ మూర్ఖపు నిర్ణయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ పంపిణీ చేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) వల్ల పౌర సరఫరాల సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పౌర సరఫరాల సంస్థకు రూ.1,500 కోట్లు నష్టం కలిగేలా 9,260 ఎండీయూ వాహనాలు కొన్నారని, ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.27 వేలు వెచ్చిస్తున్నామని, ఇంతకన్నా అన్యాయం ఉండదని చెప్పారు. 2027 వరకు వీటితో కాంట్రాక్టు కుదుర్చుకొని కార్పొరేషన్కు నష్టం కలిగించేలా మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రేషన్ డోర్ డెలివరీపై త్వరలో స్టేక్ హోల్డర్లతో విస్తృతంగా చర్చించి, నివేదిక రూపొందిస్తామని, కేబినెట్లోనూ చర్చిస్తామని చెప్పారు. పౌర సరఫరాల సంస్థను రూ.36,300 కోట్ల అప్పుల పాలు చేశారన్నారు. రూ. 2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇటీవలే చెల్లించామన్నారు. బియ్యం స్థానంలో నగదు పంపిణీపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రభుత్వంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ సూచనలతో ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ఓ మాజీ ఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. -
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ బంద్!
ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన. -
సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలికి సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా గెలిచిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ చైతన్యానికి నిలయమైన తెనాలి నుంచి ఎందరో రాజకీయ ఉద్దంఢులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా సమర్థత నిరూపించుకున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి మంత్రి పదవులను చేపట్టినవారు కొందరే. నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కేవలం నలుగురు మాత్రమే మంత్రి పదవులను చేపట్టారు. అందులో ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించగా, మరొకరు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నల్లారి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో అప్పటి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. 2004, 2009 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాదెండ్ల మనోహర్ ఆ రెండు ఎన్నికల్లోనూ తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాదెండ్ల మనోహర్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లైబ్రరీ కమిటీ చైర్మన్ పదవి వరించింది. తర్వాత క్యాబినెట్ హోదాతో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. నల్లారి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిని నిర్వర్తించారు. అనంతర రాజకీయ పరిణామాలతో వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో జనసేన అభ్యరి్ధగా తెనాలి నుంచి పోటీచేసిన నాదెండ్ల మనోహర్, ఆ రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 వచ్చేసరికి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. జనసేన పీఏసీ చైర్మన్గా జనసేన, టీడీపీల మధ్య పొత్తులో మనోహర్ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. బీజేపీతో కూడా పొత్తు కుదరటంతో జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేసి, అధికారాన్ని చేపట్టాయి. జనసేనలో నెంబర్ టూ అయిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కు సహజంగానే మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. ఆ ప్రకారంగానే గన్నవరం ఐటీ పార్కులో బుధవారం అట్టహాసంగా జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మనోహర్కు కీలక మంత్రిత్వ శాఖ లభిస్తుందనేది కూడా వాస్తవమే. 2009–14 మధ్య అసెంబ్లీ స్పీకర్గా చేసిన నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత విభజిత ఆంధ్రపదేశ్కు తెనాలి నుంచి తొలిగా మంత్రి పదవిని చేపట్టిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కావటం మరో విశేషం! 1952 ఎన్నికల్నుంచి తెనాలిలో మూడుసార్లు పోటీచేసి గెలిచిన ఆలపాటి వెంకట్రామయ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా మూడు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 1989లో తెనాలి నుంచి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి విజయం సాధించినా, డాక్టర్ చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. 2009లోనూ మళ్లీ విజయాన్ని నమోదు చేసింది. ఆ రెండుసార్లు తెనాలి నుంచి కాంగ్రెస్ తరçపున ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ స్పీకర్గా చేశారు. మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా నియమితులయ్యారు. -
డిప్యూటీ సీఎంగా పవన్కళ్యాణ్..!
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా సభలో అడుగు పెడతామని చెప్పడంతో పలు ఊహాగానాలు సాగాయి. అయితే తాజాగా పవన్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చలో దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనతోపాటు జనసేన నుంచి గెలిచిన మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కోరగా చంద్రబాబు అందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో ఒకటి నాదెండ్ల మనోహర్కి దక్కడం ఖాయమని చెబుతున్నారు. మిగిలిన పదవులకు కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.ఉమ్మడి జిల్లాల వారీగా పదవులు చంద్రబాబు ఉమ్మడి జిల్లాల వారీగానే మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నారా లోకేష్ మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, కూన రవికుమార్, కొండ్రు మురళి రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినందున అచ్చెన్నాయుడికి ఇవ్వటంపై సందిగ్దం నెలకొంది. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పితాని సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర పేర్లను పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణల్లో ఒకరిద్దరికి అవకాశం లభించనుంది. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, బాల వీరాంజనేయస్వామి పోటీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, కిశోర్ కుమార్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వర్రెడ్డిలో ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.నేడు టీడీపీ శాసన సభాపక్ష సమావేశంటీడీపీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరగనుంది. సమావేశంలో చంద్రబాబును తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. -
పవన్ కళ్యాణ్ పై మాకినీడి శేషు కుమారి ఫైర్
-
పవన్ అప్పగింతలు–కుప్పిగంతులు
పవన్ కల్యాణ్ పార్టీ వ్యవ హారం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ పరిశీలిస్తే బహుశా ఇలాంటి పార్టీ భారతదేశంలోనే ఎక్కడా మనకు కనిపించదేమో అని పిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పార్టీని పదేళ్లు నడిపాను అంటూ తరచు మాట్లాడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు అయి ఉండొచ్చు కానీ పట్టుమని చెప్పుకోదగిన స్థాయిలో పది కార్యక్రమాలైనా ఉన్నాయా అంటే చెప్ప డానికి ఆ పార్టీ కార్యకర్తలే తడబడతారు. ఎందుకంటే పదేళ్లు పూర్తిగా నడిపింది పార్ట్ టైం పాలిటిక్స్. పార్ట్ టైం ఉద్యోగాల గురించి విన్నాంగానీ పార్ట్ టైం రాజకీయాలను పరిచ యం చేసింది మాత్రం పవన్ అనే చెప్పాలి. పోనీ ఆ పార్ట్ టైం కార్య కలాపాలైనా ఆయన నిర్వహించారా అంటే అదీ లేదు. తను జస్ట్ గెస్ట్ ఫాకల్టీ మాత్రమే! సినిమాల్లో ఒక మాస్ హీరోలా ఎలా నటి స్తారో... అదే సంస్కృతి (ప్రక్రియ)ని రాజకీయల్లో కూడా చొప్పించి తన ఘనత చాటుకున్నారు. సినిమాలో హీరో చేసే ఫైట్లు, ఫీట్లూ అన్నీ డూప్. పాడే పాటలూ ఆయన పాడరు. కానీ ప్రేక్షకులకు హీరోనే ఇవన్నీ చేస్తాడని అనిపిస్తుంది. ఇదే ఫార్ములా రాజకీయాలకి అప్లై చేశారు పవన్ కల్యాణ్. పార్టీని ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యత నాదెండ్ల మనోహర్కి అప్పజెప్పారు. ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడాలన్నా, విలేకరులు అడిగిన ప్రశ్న లకు జవాబు చెప్పాలన్నా నాదెండ్ల మనోహర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప జవాబు చెప్పలేని పరిస్థితి. ఉపన్యాసాలు ఇవ్వాలంటే ఎవరో రాసిచ్చిన ఉప న్యాసాలకు హావభావాలు జోడించడం మాత్రమే పవన్ చేసే పని. ఫైనల్గా సినిమాను డిస్ట్రిబ్యూటర్కు అమ్మే సినట్టు పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. పార్టీ కార్యకర్తల చేతుల్లో తెలుగుదేశం జెండాలు పెట్టారు. చెప్పులేసుకుని తిరిగే వాళ్ళను చట్ట సభలకు పంపిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో చివరగా చిప్ప పెట్టి కోటీశ్వరులకు టిక్కెట్లు ఇచ్చేసు కున్నారు. పైగా తన పార్టీలో ఎవరెవరు నించో వాలి అనే నిర్ణయాధికారాన్ని కూడా చంద్రబాబుకే అప్ప జెప్పే శారు. అచ్చంగా డిస్ట్రిబ్యూటర్ ఏ ఏ థియేటర్స్కు సినిమా రిలీజ్ చేయాలో నిర్ణయించినట్టు! సాక్షాత్తు తను పిఠాపురంలో పోటీ చేసే చోట పట్టుమని నాలుగు రోజులు తిరిగే ఓపిక కూడా లేక ఆ బాధ్యతనూ వర్మ చేతిలో పెట్టేశారు. వాలంటీర్లను నోటికొచ్చినట్టు తిట్టి, అవ్వ తాతల్ని మండుటెండలో అష్ట కష్టాలు పెడుతూ తను మాత్రం గంట కూడా ఎండలో తిరగలేక స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ఈ విచిత్ర విన్యా సాలు, విపరీత పోకడలకు జన సైనికులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీర మహిళ లైతే ఒక అడుగు ముందుకు వేసి, ‘‘మాటలు కోటలు దాటిస్తున్నాడు. మానాభిమానాల్ని మాత్రం ‘కోట’లో దాచి పెడు తున్నాడు’’ అంటూ నర్మగర్భంగా టీవీ చర్చల్లోనే వ్యాఖ్యా నించటం గమనార్హం! పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారు.
-
జనసేనకు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా
-
టీడీపీలో ట్విస్ట్: అభ్యర్థులకు షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు షాకిచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తానని బాబు చెప్పుకొచ్చారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చని సంకేతాలిచ్చారు. కాగా, టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం ఎప్పటకీ ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులకు షాకిచ్చారు. టిక్కెట్ దక్కిందని సంబురపడకండి. రానున్న 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం చోటుచేసుకుంది. మరోవైపు, జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి. ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం అని అన్నారు. దీంతో, నాందెడ్ల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నాకేంది ఇది
-
నాదెండ్ల మనోహర్పై నీళ్ల బాటిల్తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్ను నాదెండ్ల మనోహర్పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు
సాక్షి, అమరావతి: మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు (యాడ్స్)లో పవన్ ఫొటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం, ధనబలం లేదని పవన్తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కాదని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిరీ్వర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని తెలిపింది. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడపాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశమిదీ.. ‘కాపు సామాజికవర్గానికి చంద్రబాబుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు లేకపోవచ్చు గానీ, చైతన్యం మెండుగా ఉంది. చంద్రబాబు తీరుతో టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలను చేజేతులారా పాడుచేసుకున్నారు. జనసేన అండ లేకుండా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోరాటం చేయలేదు. కేవలం 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్తో యుద్ధం చేయించి కాపు సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించదు. 2014లోనే జనసేనకు కనీసం 24 సీట్లు ఇచ్చినా పవన్కు ప్యాకేజీ స్టార్ అనే అప్రతిష్ట వచ్చేది కాదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే మాటలను బాబు ఇప్పటివరకు ఖండించలేదు. 2014లో చతికిలపడిపోయిన టీడీపీని జనసేన, బీజేపీ నిలబెట్టాయి. బాబు సహజగుణానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదిలేసి ఫలితాన్ని చవిచూశారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్న పవన్ రెండు చోట్లా తనను ఓడించారని పదే పదే ప్రజలను నిందించడం సరికాదు. పవన్ ఓటమిలో టీడీపీ పాత్ర, వ్యక్తిగత వైఫల్యం ఏమిటో ప్రజలకు తెలుసు.’ 2019లో మీ స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు? ‘బుధవారంనాటి జెండా సభలో పవన్ మాట్లాడుతూ స్నేహమంటే చివరి వరకు అని స్వయంగా ప్రకటించారు. మరి 2019లో మీ ఇరువురి స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు చంద్రబాబూ? ఆ రోజు మీ డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేశారా? పవన్ ఓటమిలో మీ పాత్ర లేదా? ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించిందా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని, సడెన్గా యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో కేంద్రంపై ఉద్యమాలు చేయించారు. ప్రధాని మోదీని తిట్టారు, తిట్టించారు. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి పవన్ మీకు మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాడుకుని పవన్ను మడత పెట్టేస్తే.. ఆయన అభిమానులు, కాపులు కలిసి మిమ్మల్ని మడత పెట్టేస్తారని గమనించండి.’ త్యాగాలు ఇతరులే చేయాలా? మీరు చేయరా? ‘24 ఎమ్మెల్యే సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 151 సీట్ల కోసం టీడీపీ వాళ్లే యుద్ధం చేసుకుంటార్లే అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. పవన్ను లోక్సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపేస్తారని, బాబుకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలవడానికి పవన్ ఇష్టపడినప్పటికీ ఆయన్ని అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్విర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోంది. ఇలా నమ్మించి మోసం చేయడాన్ని కాపులు ఏమాత్రం జీర్ణించుకోరన్న నగ్న సత్యాన్ని గత అనుభవాల దృష్ట్యా మీరు గ్రహించాల్సి ఉంది. త్యాగాలు చేయాలని తమరు ఇతరులకు చెప్పడమేనా? మీరు త్యాగాలు చేయరా? పవన్ను మోసం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే నగ్న సత్యాన్ని గ్రహించాలి’ అని ఆ లేఖలో కాపు ఐక్య వేదిక నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. -
నాదెండ్లకు చుక్కలు చూపించి.. దాడికి యత్నం!
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్హౌజ్ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్ను బూతులు తిడుతూ కనిపించారు. వారాహి యాత్రలో స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్ టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు. -
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
సై అంటే సై.. టీడీపీ, జనసేనల పొత్తు కుంపట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలో నువ్వా నేనా? ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు సీటు తమదంటే తమదంటూ పోటీపడుతూ గొడవలకు దిగడంతో జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఉదా.. అనకాపల్లి ఎంపీ సీటు కోసం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తుండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. తన కొడుక్కి ఎంపీ సీటు నిరాకరిస్తుండడంతో అయ్యన్న కస్సుమంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజమండ్రి రూరల్లో రాజుకున్న విభేదాలు.. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రాజేసింది. అక్కడి నుంచి మళ్లీ తానే పోటీచేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా సీటు తనదేనని జనసేన నేత కందుల దుర్గేష్ తొడకొడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఇప్పటికే బహిరంగంగా గొడవలు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా.. బుచ్చయ్య చౌదరి స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సీటును ఆపడానికి దుర్గేష్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై దుర్గేష్ వర్గం మండిపడుతూ ప్రతి విమర్శలు చేసింది. ఇలా.. నిత్యం రెండు పార్టీల నేతలు సీటు కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. పిఠాపురంలో పోటాపోటీ.. ► కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సీటు తనదేనని చెబుతూ ఒకసారి ఓడిపోయిన వారికి సీటు ఎలా ఇస్తారని వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి ప్రతిగా పార్టీ అధినేతలే ఓడిపోయిన పరిస్థితి ఉందంటూ పవన్ విషయాన్ని వర్మ గుర్తుచేశారు. దీంతో గొడవ జరిగి ఇరు వర్గాలు కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ► అలాగే, కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కారాలు నూరుతున్నారు. సీటు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ► అమలాపురం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ► రాజోలు సీటును పవన్ తమదేనని ప్రకటించినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ► ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరం సీటు జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ► నర్సాపురం సీటు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ► అలాగే, కృష్ణా జిల్లాలోనూ రెండు, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీచేస్తున్నట్లు జనసేన నేత పోతిన మహేష్ హడావుడి చేస్తుండగా టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్ధా వెంకన్నలు అతనికి అంత సీన్లేదని ఎద్దేవా చేస్తున్నారు. తెనాలిపై మనోహర్, రాజా పట్టు.. ఇక తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీపడుతుండడం రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేయగా, రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూ తానే పోటీచేస్తానని చెబుతున్నారు. రాజాకు సీటు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో రాజా అనుచరులు తొడలు కొడుతున్నారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు తమదేనని జనసేన నేతలు ప్రకటించుకోవడంతో అక్కడి టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడుతున్నారు. ► అనంతపురం అర్బన్ సీటు కోసం రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ► ధర్మవరం సీటుపైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సీటుపైనా సిగపట్లు.. ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్కళ్యాణ్ బలపరుస్తున్నా ఆ పార్టీ నేతలు, కేడర్ మాత్రం అంగీకరించడంలేదు. పైగా పవనే సీఎం అభ్యర్థని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
నువ్వొక పనికిమాలిన వాడివి..నాదెండ్ల పై వెల్లంపల్లి ఫైర్
-
పొత్తుల పాలిటిక్స్: జనసేనకు షాకులిస్తున్న టీడీపీ నేతలు!
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల కత్తులు వేళ్లాడుతున్నాయి. అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటారు. కానీ, నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటారు. ప్యాకేజీ స్టార్ పార్టీని అన్ని చోట్లా సైకిల్ పార్టీ నేతలు చితక్కొడుతున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టూ నేతకే దిక్కులేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తులు పేరుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అప్పటినుంచి తరచూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అటు పవన్ను కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి సీట్లు పంచుకుని ముందుకెళ్లడమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని మూడు నెలల ముందే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్నికూడా ఆయన ప్రారంభించారు. తెనాలి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, జనసేన నేత నాదెండ్ల కార్యక్రమాల గురించి పట్టించుకోని తెనాలి టీడీపీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా స్పీడ్ పెంచారు. ఇక్కడనుంచి జనసేన పోటీ చేస్తుంది కదా.. మనకు సీటు లేదని కొన్నిరోజులపాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లను కలిశారు. వారిద్దరితో భేటీ తర్వాత ఆలపాటికి ఏం క్లారిటీ వచ్చిందో బయటకు రాలేదుకానీ.. అప్పటినుంచి తెనాలిలో దూకుడు పెంచారు. టీడీపీ కార్యకర్తలకు మన పని మనదే.. జనసేన పని జనసేనదే.. వారికి మనకు సంబంధం లేదు. ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ది ఎన్నికల బరిలో ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా నేనే అని పార్టీ నాయకులకు తేల్చిచెప్పేశారట. ఆలపాటి రాజా వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది కదా.. పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు నాదే అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ అడ్డం తిరగడమేంటి అంటూ షాక్కు గురయ్యారట. అయినా.. సరే మేం కూడా మా పని చేసుకుంటాం.. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే వస్తుంది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చెయ్యదని తన క్యాడర్కు చెబుతున్నారట. రెండు పార్టీల నేతల ప్రకటనలతో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేద్దామని బయల్దేరారు. ఇది చూసి నాదెండ్ల మనోహర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఒక వైపు సీటు మాదే అంటుంటే.. రాజా పాదయాత్ర ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా పై స్థాయిలో నిర్ణయం జరిగినపుడు టీడీపీ మనకు సపోర్ట్ చెయ్యాలి కదా అని సన్నిహితుల వద్ద వాపోయారట. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకెళ్దామని అనుకున్నాం.. మేనిఫెస్టోపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ తొండాట ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నేత ఆలపాటి రాజా తీరుపై అమీ తుమీ తేల్చుకునేందుకు పవన్ వద్ద పంచాయితీ పెట్టాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెనాలిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజా మాత్రం పొత్తు ఉన్నా.. లేకపోయినా తెనాలిలో పోటీ చేసేదీ నేనే అంటూ ముందుకుసాగుతున్నారు. తెనాలిలో టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న సీట్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. -
అభిమానులపై ‘పంజా’!
సాక్షి, అమరావతి: పదేళ్ల కిందట పెట్టిన పార్టీ. కానీ... ఇప్పటిక్కూడా వేదిక ఎక్కి మాట్లాడే నాయకుడు ఒక్కడే!!. మరీ ముఖ్యమైన సందర్భాల్లో అయితే అటుపక్క సోదరుడు... ఇటుపక్క తన వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఓ కార్యదర్శి స్థాయి నాయకుడు. ఏ జిల్లాకెళ్లినా అంతా అభిమానులే తప్ప వాళ్లలో ఒక్కరూ నాయకులుండరు. అసలు జనసేన రాజకీయ పార్టీయేనా? అలాగైతే పదేళ్లుగా ఎక్కడా ఒక్క బలమైన నాయకుడూ ఎందుకు తయారు కాలేదంటారు? ఎందుకంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమే అది. తనకు అధికారం అక్కర్లేదని పదేపదే ఆవేశాన్ని అభినయిస్తూ చెప్పే పవన్ కళ్యాణ్ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన చంద్రబాబుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గెలిచారు. కానీ 2019 వచ్చేసరికి బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోవటంతో... ఆ వ్యతిరేక ఓట్లన్నీ వైఎస్సార్ సీపీకి గంపగుత్తగా పడకుండా చీల్చాలని చంద్రబాబు ఆదేశించటంతో... కొత్త పాత్ర పోషిస్తూ బాబు స్నేహితుడి నుంచి బాబు ప్రతినాయకుడి పాత్రలోకి మారిపోయారు. లేని ఆవేశాన్ని తెచ్చుకుని, చంద్రబాబును చెడామడా తిట్టేస్తూ... ఆగ్రహంతో ఊగిపోయారు. రక్తి కట్టించాననుకున్నారు. కానీ సినిమా ఫ్లాపయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అఖండమైన మెజారిటీతో గెలిచారు. మరి ఇప్పుడూ అదే చంద్రబాబు కదా? అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏం మారింది? ఏం మారిందంటే చంద్రబాబు పాత్ర మారింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఒంటరిగా అయితే జగన్ను ఎదుర్కోలేనన్నది చంద్రబాబు ఉద్దేశం. పవన్ కళ్యాణ్ తనతో ఉంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తాయనే ఆశ. కాబట్టి పొత్తు పెట్టుకోవటం ద్వారా వాటన్నిటినీ తనకు బదిలీ చేయాలని పవన్కు ఆదేశించారు. మళ్లీ పవన్ వేషం మారింది. కాకపోతే రెండుసార్లు ఈయన్ను నమ్మి మోసపోయిన ఆ సామాజికవర్గం మళ్లీ నమ్ముతుందా? అది కూడా తమను పదేపదే మోసం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేయమంటే వేసేస్తారా? అందుకే పవన్ రకరకాల అభినయాలకు దిగుతున్నారు. ‘నేను ఎవరినీ ముఖ్యమంత్రిని చేయడానికి లేను’. ‘సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం’ సీఎం పదవి ఇస్తే ఎవరైనా వద్దంటారా?’ ‘జనసేన గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తరవాత తేలుతుంది’. ‘మనకు తగిన బలం లేనప్పుడు ఒక మెట్టు దిగటంలో తప్పులేదు’ అనే పంచ్ డైలాగ్లు విసిరివిసిరి.. ఇప్పుడు దార్లోకి వచ్చారు. తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించేవారు తనకు అక్కర్లేదని, పొత్తుకు కట్టుబడ్డవారే తనతో ఉండాలని, తెలుగుదేశం కోసం జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని కుండబద్దలుగొట్టేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకే కోట్లకు కోట్లు ఖర్చుచేసిన సినిమా రిలీజయ్యాక డిజాస్టరని తెలిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా తయారయింది జనసేన అభిమానుల పరిస్థితి. బాంబు పేల్చిన ‘తమ్ముడు’ లోకేశ్ సీఎం ఎవరన్నదీ అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ– జనసేన చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయని పవన్ కళ్యాణ్ చెబుతుంటే... అసలే గందరగోళంలో ఉన్న జనసేన అభిమానులపై చంద్రబాబు తనయుడు లోకేశ్ ఓ పిడుగు వేశాడు. ఇన్నాళ్లు పవన్ చెబుతున్న మాట పచ్చి అబద్ధమని తేల్చేశారు. ఓ టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ... ‘‘పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి. దీన్లో రెండో ఆలోచనే లేదు’’ అని తెగేసి చెప్పారు. అంతేకాదు. 150 సీట్లలో తమ అభ్యర్థులు ఖరారైపోయారని మరో బాంబు పేల్చారు. ఈ ఇంటర్వ్యూ చూసి జనసేన అభిమానులు హతాశులయ్యారు. ఇన్నాళ్లూ తమ ‘బ్రో’ చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ చర్చించుకుంటున్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా అనుమానాస్పదంగానే మాట్లాడారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 15 మందితో కలిసి నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘నా దృష్టిలో లేదు, తెలియదు’ అని తప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పారు. నిజానికి పొత్తుపై టీడీపీతో ఏ చర్చ జరిగినా, జనసేన తరుఫున పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉంటారు. సీఎం అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య నిర్ణయం జరగకుండా ఉంటే లోకేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించే వారు. కానీ, సీఎం అభ్యర్థి చంద్రబాబు అని పవన్ కూడా చాలాసార్లు చెప్పారని లోకేశ్ స్పష్టంగా చెప్పారు. దీన్ని మనోహర్ ఖండించలేదు. మనోహర్ ఇలా మాట్లాడటంతో... పవన్ ఉద్దేశపూర్వకంగానే సీఎం అభ్యర్థిత్వంపై అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 2014లో జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ పవన్ రాజకీయ కార్యక్రమాలన్నీ చంద్రబాబు ప్రయోజనాల చుట్టూనే తిరుగుతున్నాయనే వాదనకు మరింత బలాన్నిచ్చేలా పవన్ తీరు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ సారి కూడా చంద్రబాబు కోసమే తమ నాయకుడు పనిచేస్తున్నారని, చంద్రబాబు సీఎం అభ్యర్థిగా అంతర్గతంగా అంగీకరించి ఉంటారని, అయినా నిండా 20 సీట్లు కూడా ఇవ్వలేమని లోకేశ్ చెబుతుండగా ఇక సీఎం వంటి పదాలను పలకడం వృథా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులో సీఎం అభ్యర్థిపై లోకేశ్ ఏమన్నారంటే.. విలేకరి ప్రశ్న: ఓట్లను పంచుకుంటున్నారు. సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? లోకేశ్: చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెంకడ్ థాట్ (రెండో మాటే లేదు). పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు. సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. అనుభవం ఉన్న నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. దేర్ ఈజ్ నో యాంబిగ్యుటీ (ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు) లోకేశ్ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ స్పందన.. విలేకరి ప్రశ్న: టీడీపీ – జనసేన పొత్తులో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పవన్ ఇన్నాళ్లుగా ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చించి నిర్ణయం ఉంటుందంటున్నారు కదా? నాదెండ్ల : నేను పర్టిక్యులర్గా వినలేదు. మీరు అనేది నిజమే అయితే, పొత్తులో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలి. కొన్ని ఆలోచనలు సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చోని, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని ఆ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నా దృష్టిలో అయితే, (దీనిపై నిర్ణయం జరిగినట్టు) లేదు. -
పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ, జనసేన విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని. నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ -
పిచ్చి కూతలకు ఇచ్చిపడేసిన మంత్రి గుడివాడ
-
‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘పవన్తో పాటు, నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప. టీడీపీ పాలనలో జీఎస్డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్డీపీ ఒకటో స్థానంలో ఉంది. జీఎస్డీపీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయి. ఈజ్ ఆఫ్ డుయింగ్లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంఎస్ఎంఈకి పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్ఎంఈ రంగంలో 650 శాతం అభివృద్ధి సాధించింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నాము. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ను నిర్మిస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతోనే మా పొత్తు: సీఎం జగన్ -
టీడీపీ-జనసేనలో సీట్ల పంచాయితీ
-
పవన్ కల్యాణ్ చుట్టూ 'రుక్మిణి' కోట.. ఇంతకూ ఎవరీమె..?
జనసేన పార్టీలో కీలక నాయకుల పేర్లు చెప్పమని ఎవరినైనా అడిగితే పట్టుమని ఇదు పేర్లు కూడా తెరపై కనిపించవు. పవన్ పల్లకీ మోస్తున్న ఆయన అభిమానులకు కూడా ఈ విషయం తెలుసు. పవన్ తర్వాత పార్టీలో ఎక్కువగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్ కానీ ఆ జాబితాలో రుక్మిణి కోట అనే యువతి కూడా చేరారు. నిన్న మొన్నటి వరకు నాదెండ్ల ఏది చెబితే అదే జనసేనలో నడిచేది.. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. తాజాగా రాయలసీమ జిల్లాల మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖలో 140 రోజుల పాటు రుక్మిణి ఎలా ఆడుకున్నారో క్లియర్గా వివరించారు. ఇలా బయటికి చెప్పుకోలేని వాళ్లు చాలా మంది జనసేనలో ఉన్నారని రుక్మిణి పేరు చెబుతూనే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. రుక్మిణి కోట ఎవరు..? కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్లో ఉండేవారు. అక్కడ ఆమె ప్రముఖ బ్రాండెడ్ బట్టల షాపును రన్ చేసేవారట. పవన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు దగ్గరుండి సౌకర్యాలు కల్పించేవారని జనసేన నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో 2020లో ఆమెను జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా పవన్ నియమించారు. వాస్తవానికి జనసేన నియామకాలను పరిశీలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. పార్టీ కోసం ఫండ్స్ పేరుతో పవన్,నాగబాబు కూడా ఇప్పటికే పలు పర్యటనలు కూడా చేసిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి) జనసేన వీరమహిళ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి దిశానిర్దేశం చేస్తున్నది కూడా రుక్మిణినే అని వారు చెబుతుంటారు. 2020 నుంచే రుక్మిణి పార్టీలో ఉన్నప్పటికీ 2022లో ఆమె లండన్ నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. ఇక్కడి వచ్చాక ఆమెకు హైదరాబాద్లోని జనసేన కార్యాలయ బాధ్యతల్ని మొదటగా రుక్మిణికి పవన్ అప్పగించారు. ఆమె టాలెంట్తో పవన్ను మెప్పించడంతో పార్టీలో ఆమె కీలకంగా మారిపోయారని టాక్. ఈ నేపథ్యంలో ఆప్పటికే జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసే 30 మందిని ఒక్కసారిగా తొలగించేశారని సమాచారం. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను రుక్మిణి ఏర్పాటుచేసుకున్నారని తెలుస్తోంది. పవన్ను కలవాలంటే జనసేనలో ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని దాటుకుని మాత్రమే వెళ్లాలట. ఎంతటివాడైనా డోంట్ కేర్ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పవన్ వద్దకు ఎంట్రీ దొరుకుందట. లేదంటే జనసేన కార్యాలయం గేటు కూడా తాకలేరట. ఇదే విషయాన్ని జనసేనకు రాజీనామ చేసిన పసుపులేటి పద్మావతి తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలో ఎంతపెద్ద తోపు నాయకుడు అయినా పవన్ను కలవాలంటే రుక్మిణి... రుక్మిణి.. అంటూ ప్రదక్షణలు చేసుకోవాల్సిందేనట. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) అలా జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ దేవుడైతే.. భక్తులకు , ఆయనకు మధ్య అనుసంధానకర్తగా రుక్మిణి అని జనసేన నాయకులు సరదాగా చెబుతున్న మాట. ఆమె అనుమతి లేకుండా పార్టీలో ఏ ఒక్క చిన్న పని కూడా జరగదట. రుక్మిణి స్పీడ్ ముందు నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆ పార్టీలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి -
పెళ్లిళ్ల విషయంలో అంతే... రాజకీయంలో అంతే
-
పవన్ ఏం చెబుతాడోనని అందరూ ఎదురుచూశారు
-
నాగబాబు, నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందంటే..
-
పవన్ కళ్యాణ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమంచిపల్లిలో పవన్ను పోలీసులు అడ్డుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు నేపద్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు పవన్ను నందిగామ హైవే మీదుగా విజయవాడ తీసుకెళ్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ని కూడా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో పలువురు కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
సీఎం రేసులో లేను.. ఆ మాట టీడీపీ ఎలా చెబుతుంది?: పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసలు ముఖ్యమంత్రి పదవి రేసులోనే లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పరోక్షంగా తేల్చి చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమంటూ సంకేతాలిస్తూ, పొత్తుల్లో జనసేన పార్టీకే ముఖ్యమంత్రి పదవి కావాలని అడగడానికి ఓ స్థాయి ఉంటుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి కదా, అవి ఎంతవరకు వచ్చాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం. మాట్లాడతాం. (బీజేపీని ఉద్దేశించి) కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఒప్పిస్తాం. వాస్తవాలు, గణాంకాలు చూపి ఒప్పిస్తాం’.. అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు–పవన్ భేటీ తర్వాత కొంతమంది జనసేన నేతలు మీరు తగ్గడం ఏమిటని, మీరు ముఖ్యమంత్రిగా అయితే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని, మీరు సీఎం అభ్యర్థిగా ఉండాలి కదా అని మాట్లాడడాన్ని పవన్ తప్పుబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 30–40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి అడిగే వాళ్లమేమో.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని అనేవాళ్లు ఎవరైనా సరే, అలాంటి ఆలోచనతో ఉంటే వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. జనసేన గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసింది. ఎన్ని గెలిచాం? పొత్తుల్లో ఇతర పార్టీలను సీఎం స్థానం కోసం డిమాండ్ చేయాలంటే కనీసం 30–40 స్థానాలు ఉండాలి. అప్పుడే ఆ వాదనకు బలం ఉండేది. ఇక తాను ఇప్పటివరకూ ఎవరికైనా పెద్దన్న పాత్ర వహించాలని చెప్పానంటే అది బాధ్యత వహించడం అని అర్ధం. అంతేగానీ, ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమది. సీఎం పదవి కావాలని కండిషన్లు పెడితే జరగవు.. ఒక మాట చెబుతున్నా.. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అలాంటప్పుడు మన వాదన (సీఎం పదవి కావాలనే)కు పస ఉండదు. సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్స్టార్ చేయలేదు. నేను సాధించుకున్నదే. రాజకీయాల్లో కూడా టీడీపీ కావొచ్చు. బీజేపీ కావొచ్చు.. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు. నేను టీడీపీ అధ్యక్షుడిని అయినా ఆ మాటలు అనను. మనం బలం చూపించి, సత్తా చూపించి పదవి తీసుకోవాలి. కండిషన్లు పెడితే, అవి జరగవు. సీఎం పదవి అన్నది తానై వరించాలి తప్ప నేను దాని కోసం వెంపర్లాడను. పొత్తులకు జనసేన పార్టీ పెట్టే కండిషను వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలి అంతే. అలాగే, పొత్తులతో ప్రభుత్వం ఏర్పడాలి. నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలపై ఎవరైనా అనుచితంగా మాట్లాడితే వాటిని ఉపసంహరించుకోవాలి. ఓటు చీలనివ్వను అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయో ఆ పార్టీలు కలవాలన్నది నా ఉద్దేశం. ప్రధాన పార్టీలకు సంబంధించే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇక ఎన్నికలు ముందే వస్తాయని అనిపిస్తోంది. అందుకని జూన్ నుంచి రాష్ట్రంలోనే ఉండి పర్యటిస్తా. నాతో నడిచే వాళ్లే నా వాళ్లు.. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమోనని ఒక విలేకరి (సాక్షి కాదు) అన్నప్పుడు.. ‘విమర్శలు వస్తాయని నాకు భయాలు లేవు. అభిమానులు నిరాశ పడడానికి ఇదేమి సినిమా కాదు. కార్యకర్తలైనా సరే.. నాతో నడిచేవారే నా వాళ్లు. అర్ధంచేసుకునే వాళ్లు అర్ధంచేసుకుంటారు’.. అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆఖరి గింజ కొనేవరకు పోరాటం మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలోనూ పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి ధాన్యం గింజ కొనేంత వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయన్నారు. అలాగే, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడంలేదన్నారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్ పరిశీలించడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్తే రైతుల్ని అరెస్టుచేస్తున్నారని, ఇలా అయితే తీవ్ర పరిణామాలుంటాయని పవన్ హెచ్చరించారు. అంతకుముందు.. పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. -
టీడీపీని కలుపుకుందామని బీజేపీని కోరాం
సాక్షి, అమరావతి: టీడీపీని కూడా పొత్తులో కలుపుకుపోదామని బీజేపీ పెద్దలను కోరినట్లు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పరోక్షంగా వెల్లడించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు గురించి బీజేపీ నాయకులతో మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా.. నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ‘రాజకీయాలు అన్నాక అన్ని అంశాలూ చర్చకు వస్తాయి’ అని జవాబిచ్చారు. ‘బీజేపీ పెద్దలతో పవన్కళ్యాణ్ భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మేము తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించాం. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మా నిర్ణయాన్ని స్వాగతించి ముందుకొస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే అన్ని పార్టీలూ కలిసి వైఎస్సార్సీపీ విముక్త ఏపీ కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్తాం’ అని మనోహర్ చెప్పారు. పొత్తులపై తమ పార్టీ అధినేత పవన్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అంతకంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నామో అందరికీ వివరించాలి్సన బాధ్యత ఉందని.. అది నెరవేర్చామని చెప్పారు. కాగా, టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలు అంగీకరించడం లేదని వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా.. ‘అది మీడియా ఎవరో ఒకరు చెబుతున్న మాటే’ అని బదులిచ్చారు. బీజేపీ వాళ్ల అవగాహన లోపం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా జనసేన మద్దతు తెలపలేదన్న బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యలను నాదెండ్ల వద్ద ప్రస్తావించగా.. ‘అది వాళ్ల అవగాహన లోపం’ అని బదులిచ్చారు. ‘మేం(జనసేన) సంస్థాగతంగా బలపడుతున్నాం. వాళ్లు(బీజేపీ) కూడా సంస్థాగతంగా బలపడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. మా పార్టీ స్టాండ్ను ముందుగానే ప్రకటించాం’ అని నాదెండ్ల చెప్పారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని తెలిపారు. -
అది డైవర్ట్ చేయడానికే చిలక, గోరింక రుషికొండ వెళ్లాయి: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాలకు ఆస్కారం లేదనే సీఎం జగన్ చెప్పిన మాట చాలా గొప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలో నిర్వహించిన ప్రధాని మోదీ సభ ద్వారా రాష్ట్ర అవసరాలను, రావాల్సిన ప్రాజెక్ట్ల గురించి అడిగే అవకాశం లభించదన్నారు. ఉదయం 9 గంటలకే రెండున్నర లక్షల మందికి పైగా సభకు తరలిరావడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ వ్యాఖ్యలు సంతాప సభలో మాట్లాడినట్లున్నాయని వ్యాఖ్యానించారు. సినిమా నటుడిగా హావభావాలు ప్రదర్శించే పవన్ ఎందుకు పేలవంగా మారారని ప్రశ్నించారు. పవన్కు రాజకీయ పొత్తుల్లో టీడీపీనే శాశ్వతం. మిగిలిన పార్టీలన్నీ స్టెపినీలే అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని సభ విజయవంత కావడంతో దానిని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి చిలక గోరింక రుషికొండకు వెళ్లాయి. జనసేన రాజకీయ పార్టీ కాదు సినిమా పార్టీ అని అన్నారు. నాదెండ్ల మనోహరే పవన్ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. చదవండి: (సీఎం జగన్కు హ్యాట్సాఫ్: మంత్రి బొత్స) -
పవన్కళ్యాణ్ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుసరిస్తున్నవారు అభిమానులు కాదని పేర్కొన్నారు. మూడు రోజులుగా ద్విచక్ర వాహనాలపైన, కారులోను పవన్కళ్యాణ్ను వెంబడించారని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్కళ్యాణ్ ఇంటివద్దకు వచ్చి గొడవ చేశారని, సెక్యూరిటీ సిబ్బంది నివారిం చబోగా దుర్భాషలాడుతూ గొడవకు దిగారని పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే !
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. అనంతరం అరగంటకుపైగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్కళ్యాణ్ వేదికపై మౌనంగా కూర్చోగా, పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఒక దశలో పవన్ను మాట్లాడాలంటూ నాదెండ్ల సైగ చేస్తూ మైక్ జరిపినా స్పందించేందుకు నిరాకరించారు. 3 రోజులు జనసేన సోషల్ ఆడిట్.. నవంబరు 12, 13, 14వతేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో జనసేన తరఫున సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నేతలు మూడు రోజుల పాటు జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణంపై నివేదిక ఇస్తారని చెప్పారు. పవన్కళ్యాణ్ ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 26 జిల్లా కేంద్రాల్లోనూ ‘జనవాణి’ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
పవన్ కల్యాణ్పై మానవహక్కుల కమిషన్లో కేసు
గుంతకల్లు రూరల్: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై జాతీయ మానవహక్కుల కమిషన్లో కేసు నమోదు అయినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో వివరాలు వెల్లడించారు. విశాఖ ఘటన ద్వారా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ స్పందించి తమ ఫిర్యాదును విచారణకు స్వీకరించిందని తెలిపారు. -
జనసేన పీఏసీ చైర్మన్, నాయకులపై కేసు నమోదు
సిద్దవటం (కడప జిల్లా): కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్పై ఈ నెల 19న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోమర్ సమక్షంలో జరిగిన దాడికి సంబంధించి.. నాదెండ్ల మనోమర్ సహా తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్తోపాటు నాగేంద్ర అనుచరులైన మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 19న సిద్దవటంలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేసి చొక్కా చింపి చెప్పుతో కొట్టి అవమాన పరిచారన్నారు. బా«ధితుడి ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్, తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం) -
జనసేనలో విభేదాలు.. పార్టీ నేత నాదెండ్ల ఎదుటే రచ్చ రచ్చ
సాక్షి, అమలాపురం టౌన్: నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్న సమావేశంలోనే ఈ విభేదాలు బయట పడటం గమనార్హం. ఇందుపల్లి ఎ కన్వెన్షన్ హాలులో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. సమావేశం జరుగుతున్న సమయంలో సమనస, ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తీవ్రమై, సమావేశం ముగిసిన అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగే స్థాయికి చేరింది. చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి) కేకలు, అరుపులతో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. రాజబాబుకు, నియోజకవర్గంలోని కొంత మంది మధ్య ఇటీవల దూరం పెరిగింది. పార్టీ రెండు వర్గాలుగా మారింది. మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నాయకుడు యాళ్ల నాగ సతీష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు కొన్ని నెలల కిందటే రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చేరికను రాజబాబు అడ్డుకుంటున్నారని సతీష్తో పాటు పార్టీలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల అమలాపురం రావడంతో పార్టీ ఇన్చార్జి రాజబాబు ప్రమేయం లేకుండానే మరో వర్గంగా ఉంటున్న పార్టీ నాయకులతో కలిసి సతీష్ జనసేనలో చేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అప్పటికే నియోజకవర్గ పార్టీలో నాయకులు రెండుగా చీలిపోవడంతో ఇన్నాళ్లూ చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం చర్చనీయాంశమైంది. -
ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్కల్యాణే: నాదెండ్ల
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ పవన్కల్యాణే అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఉదయం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఆయన ప్రమాద బీమా, సభ్యత్వ కిట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి జరిగిన జనసేన, బీజేపీ సమన్వయ సమావేశంలో పవన్కల్యాణ్ నాయకత్వాన్ని ప్రధాని మోడీ, అమిత్షా ధ్రువీకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్న మాటలను స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అంతరించిపోయిందని, రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ కలసి ప్రజాసమస్యల మీద పోరాటం చేస్తాయని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చేవారం తిరుపతిలో పవన్కల్యాణ్ రోడ్ షో ఉంటుందని తెలిపారు. పీఏసీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. -
కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందంటూ బీజేపీ, జనసేన పార్టీల సంయుక్త సమావేశంలో నేతలు అభిప్రాయపడినట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఇరు పార్టీల నేతల వీడియో కాన్ఫరెన్స్ జరిగినట్టు నాదెండ్ల మనోహర్ పేరిట జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదని తీర్మానించినట్టు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణ విషయంలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడినట్టు వెల్లడించారు. కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కొత్తగా 1,088.. 108, 104 అంబులెన్సులను ప్రారంభించడం.. అలాగే కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ పదిరోజుల క్రితం ప్రశంసించడం తెలిసిందే. -
యురేనియం అన్వేషణ ఆపేయాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, నిపుణులతో కూడిన అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతివ్వాలని పేర్కొంది. పలు డిమాండ్లను అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయోమయానికి గురిచేస్తున్నారు.. సోమవారం దస్పల్లా హోటల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ‘యురేనియం ఆపాలి.. నల్లమలను పరిరక్షించాలి’అంశంపై ఈ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. యురేనియం పరిశోధన, అన్వేషణ, వెలికితీత ఏ రూపంలో ఉన్నా వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంద న్నారు. యురేనియం అన్వేషణ నల్లమలపై ఎక్కుపెట్టిన తుపాకీ అని, దాన్ని తప్పక దించాలని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, యురేనియం అన్వేషణకు అనుమతించబోమని చెప్పా లని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. యురేనియం తవ్వకాలు, అన్వేషణ ఆపేస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అనంతరం మాజీ న్యాయమూర్తి గోపాల్గౌడ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నిపుణులు, పర్యావరణవేత్తలు బాబూరావు, కె.పురుషోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి, ప్రొ.జయధీర్ తిరుమలరావు, కొండవీటి సత్యవతి, వి.సంధ్య, అరవింద్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నేత వీహెచ్, మూమెంట్ అగెన్ట్ యూరోనియం ప్రతినిధి కె.సజయ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ తీరు మారలేదు
-
ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!
ఎన్నికల ముందు అసమ్మతి స్వరాలు. ఎన్నికల తర్వాత అంతకన్నా ఎక్కువ శృతిలో బీభత్సమైన విమర్శలు. ఒక పక్క దారుణమైన ఓటమి. రెండుచోట్ల పోటీ చేసినా ఫలితం లేదు. ఇంత జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతోంది? అంతర్మథనం జరగలేదా? మేధోమథనం పనికిరావడం లేదా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారని ప్రజలు అనుకున్నారో.. లేక ఆయన చెప్పినదాంట్లో అర్థంపర్థం లేదని భావించారో మొత్తం మీద ఓ రేంజ్లో తీర్పునిచ్చారు. ఆయన రెండుచోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు. చివరాఖరికి ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన పార్టీ. ఇంత పెద్ద ఓటమి నుంచి కోలుకోవాలంటే అంత తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే పవన్ చాలాకాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు. రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ఓటమి బాధనుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.. గత కొన్ని రోజులుగా జనసేనపార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులోకి వస్తున్నారు. పార్టీ నాయకులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడుగా పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో చాలామందికి రుచించడం లేదని సమాచారం. అంతేకాదు వారిలో కొందరు పవన్ కళ్యాణ్ తీరును బాహటంగానే విమర్శిస్తున్నారు. మరికొంతమంది నేతలైతే ఇక ఈయన మారేలా లేరని తమ దారి తాము చూసుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మంట్లవారీగా పేరున్న నేతలు పలువురు పక్క చూపులు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ సెగ్మంట్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పసుపులేటి రామారావు.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ రాజీనామా చేయడం గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతోంది. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అధ్యక్షుని తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన చుట్టూ ఒక కోటరీని తయారు చేసుకొని పవన్ పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ను కలవాలంటే అంత ఈజీ కాదని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినవారే ఆవేదన చెందుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించకోవచ్చు. పవన్ దర్శనం కావాలంటే ముందు కోటరీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోందని, వారికి డబ్బుయావ తప్ప మరొకటి లేదని పార్టీని విడిచిపెడుతున్న వారు పబ్లిగ్గానే ధ్వజమెత్తుతున్నారు. ఈ మధ్య పవన్ తీసుకుంటున్న నిర్ణయాలతో చాలాచోట్ల నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తణుకు నుంచి జనసేన పార్టీ రెబెల్ గా పోటీ చేసిన రామచంద్రరావు అనే వ్యక్తిని ఈ మధ్యనే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ రాజీనామా చేసిన పసుపులేటి రామారావు ఫైరవుతున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన పార్టీ ఏం చేస్తుంది? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసుకొని.. తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న కమిటీలపట్ల సీనియర్ నేతలు సైతం అసంతృప్తిలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలనుంచి అందుతున్న సమాచారం. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్ను నియమించడం ఆ పార్టీలోని పలువురు నేతలకు రుచించడం లేదట. ఎప్పటినుంచో ఉన్న నేతలను కాదని, ఎన్నికలకు ముందు వచ్చిన నాదెండ్ల మనోహర్ను ఎలా నియమిస్తారంటూ వారు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు వినూత్నంగా, ఆచరణీయంగా, ఆలోచనాత్మకంగా ఉంటాయని జనసేన కార్యకర్తలు, అభిమానులు భావించారు. ఆ దిశగా అడుగులు పడకపోగా.. మరింత నష్టం కలిగించేవిధంగా పవన్ వ్యవహరిస్తున్నారని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పలువురు బలమైన నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లడానికి పవన్ వైఖరియే కారణమని చెప్పుకుంటున్నారు. అద్దెపల్లి శ్రీధర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు, కోశాధికారిగా సేవలందించిన రాఘవయ్య జనసేనను వీడడం దీనికి నిదర్శనమని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మేలుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేదంటే పార్టీ మరింత పాతాళంలోకి పడిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. -
చిరును కలిసిన పవన్, మనోహర్
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం తన సోదరుడు చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు. చాలారోజుల తర్వాత అన్నయ్యతో తమ్ముడి భేటీ జరిగింది. మరోవైపు చిరు, పవన్ కలిసి ఉన్న ఫోటో ట్వీటర్లో షేర్ చేయడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ ఓటమిపై ఈ సందర్భంగా పవన్ సమీక్షలు కూడా నిర్వహించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్పై రామ్చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఆ ప్రచారాన్ని ఖండించిన నాదెండ్ల మనోహర్
సాక్షి, అమరావతి: జనసేనను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఖండించారు. తాను పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను విదేశాల్లో ఉండటం వల్ల పార్టీ సమీక్షా సమావేశాలకు హాజరు కాలేకపోయినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా ఇప్పటికే రావెల కిషోర్ బాబు వ్యక్తిగత కారణాలతో జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సమీక్ష సమావేశాలకు నాదెండ్ల హాజరు కాకపోవడంతో ఆయన కూడా పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలను నాదెండ్ల మనోహర్ ఖండించారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్...పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై ఆయా జిల్లాల నేతలతో సమీక్ష జరుపుతున్నారు. -
టీడీపీ ఎఫెక్ట్; కాంగ్రెస్కు వరుస దెబ్బలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీతో దోస్తీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. తమ పార్టీని దుమ్మెత్తిపోసిన టీడీపీతో చేతులు కలపడాన్ని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షాత్తు సోనియా గాంధీని ‘ఇటలీ దెయ్యం’ అంటూ నోరుపారేసుకున్న చంద్రబాబుతో రాహుల్ గాంధీ జట్టు కట్టడాన్ని కాంగ్రెస్లో చాలా మంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోనియాను అవినీతి అనకొండ అంటూ దుయ్యబట్టిన చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ‘చేయి’ చాశారని చెబుతున్నారు. రాజీనామాల పరంపర టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ గురువారం రాజీనామా ప్రకటించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేశామని.. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం ఇష్టంలేకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. మరో సీనియర్ నేత మాజీ మంత్రి సి రామచంద్రయ్య తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ను వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందే తెలిసి వెళ్లిపోయారు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. టీడీపీతో కాంగ్రెస్ కలుస్తుందన్న విషయం ముందే తెలుసుకుని ఆయన వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా తమ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న ‘సైకిల్’ పార్టీతో జట్టు కట్టడాన్ని ఆత్మహత్యాసదృశ్యంగా కాంగ్రెస్ నేతలు వర్ణిస్తున్నారు. (మాజీ మంత్రి వట్టి కాంగ్రెస్కు గుడ్బై) తొందరపడొద్దు: రఘువీరా సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండటంతో పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి స్పందించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, కాంగ్రెస్ మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. పార్టీలో భిన్న అభిప్రాయాలు సహజమన్నారు. పొత్తులపై నిర్ణయాధికారాన్ని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. -
నాదెండ్ల చేరికతో పార్టీకి అదనపు శక్తి
సాక్షి, అమరావతి: జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరడంతో పార్టీకి అదనపు శక్తి వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారు. ఆయనకు పవన్ కల్యాణ్ పూలమాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘జనసేనలో చేరమని గతంలో ఒకసారి నాదెండ్లను కోరాను తప్ప ఒత్తిడి చేయలేదు. ఇటీవల నాలుగు రోజులు మా మధ్య చర్చలు జరిగాయి. ఆయనతో నా ఆలోచనలు కలిశాయి.’ అని అన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..‘అయిదు విషయాల్లో ఎక్కడ రాజీ ధోరణి లేకుండా ముందుకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాం. ఏ రాజకీయ నాయకుడిలో కనిపించని ఎమోషనల్ ఫీలింగ్స్ పవన్ కల్యాణ్లో ఉన్నాయి. కాగా, అంతకుముందు పవన్ కల్యాణ్,నాదెండ్ల మనోహర్, ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు
- రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా..? - మంత్రుల బృందం కరువు గ్రామాల్లో పర్యటించాలి - మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నార్పల (శింగనమల) : ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి శైలజానాథ్లు విమర్శించారు. ఆదివారం నార్పల మండలంలోని బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, కరువు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. స్థానిక రచ్చకట్ట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం అప్పటి కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమక్షంలో బండ్లపల్లిలో ప్రారంభించారని గుర్తు చేశారు. రాయల సీమ జిల్లాల్లో ఉన్న కరువును గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తొమ్మిది వారాలు గడుస్తున్నా, కూలీ డబ్బులు అందలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు కరువు గ్రామాల్లో పర్యటించి వారిని ఆదుకోవాలన్నారు. రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, ఉపాధి పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కనీసం రూ.200 కూలీ గిట్టుబాటు కాక గ్రామాల నుంచి కూలీలు వలస వెళ్తున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. -
రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
కర్నూలు(ఓల్డ్సిటీ): ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం స్థానిక కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. జిల్లాలోని 36 మండలాల కరువు ప్రాంతాలుగా ప్రకటించి నేటికీ స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే పనులే తప్ప శాశ్వత అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. ఓర్వకల్లు వద్ద ఎయిర్పోర్టు నిర్మాణానికి 638 ఎకరాలు భూమి సేకరించి..ఎకరాకు రూ. 8 లక్షలు పరిహారం ఇవ్వాలని కలెక్టర్ ప్రతిపాదిస్తే, ప్రభుత్వం రూ. లక్ష ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ఈనెల 25న అనంతపురంలో రైతుల కోసం సత్యాగ్రహం చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, మైనారిటీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అహ్మద్ అలీఖాన్, నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి తిప్పన్న, ఉపాధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరపాలి’
అమరావతి: వైఎస్సార్ జిల్లా రెండు, ప్రకాశం జిల్లాలో ఒక ఇల్లు మాత్రమే నిర్మించడం దారుణమని ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కడతామని చెప్పిన చంద్రబాబు 1846 ఇండ్లను స్లాబ్ల వరకు మాత్రమే నిర్మంచారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఎస్సీలకు రూ.1646 కోట్లకు గత బడ్జెట్ లో కేటాయించి 839 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని, అలాగే ఎస్టీ లకు రూ. 573 కోట్లు కేటాయించి రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మైనార్టీలకు రూ.370 కోట్ల కేటాయించి రూ.200 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల గత బడ్జెట్ లో చెప్పిన లెక్కలకు కేటాయించిన నిధులకు పోంతనలేదనని పేర్కొన్నారు. సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో 50శాతం కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టడంలేదని అన్నారు. బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా 30 రోజులు జరపాలని డిమాండ్ చేశారు. -
'పర్యటనలతో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి'
విజయవాడ : ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దావోస్ పర్యటనపై వస్తున్న ఆరోపణలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఏపీలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ లేఖ రాశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. ► 2015లో కూడా దావోస్ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్, సత్యనాదెళ్లను కలిసినట్టు తెలిపారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు, హీరో మోటార్స్ కార్పొరేషన్, పెప్సీ, వాల్ మార్ట్, విప్రో లాంటి సంస్థలు త్వరలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వస్తాయని ప్రకటించారు. ► చంద్రబాబు మూడవసారి కూడా దావోస్ పర్యటించిన సందర్భంగా అనేక మంది వ్యాపార దిగ్గజాలను కలిసి భారీ ఒప్పందాలను చేసుకున్నట్టు అధికార యంత్రాంగం పదే పదే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ► 2016 దావోస్ పర్యటనలో పాల్గొని రూ. 2000 కోట్ల పెట్టుబడితో ఘెర్జి టెక్స్ టైల్ మెగా పార్క్ను ఏపీలో స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. ► 'స్మార్ట్ సిటీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్' ఇదేనా అభివృద్ధి మంత్రం అంటూ 2016లో మీరు స్విట్జర్లాండ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఆయా సంస్థల గురించి ఇప్పుడు ఎందుకు కృషి చేయడం లేదో ప్రజలకు వివరించాలి. ► పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రుల బృందం పర్యటనలకు అయిన ఖర్చులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, లభించిన ఉపాధి వివరాలు వెల్లడించాలి. ► 12 జవవరి 2016న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ను నిర్వహించింది. అప్పుడు జరిగిన ఒప్పందాల ద్వారా 4 లక్షల 78 వేల కోట్ల పెట్టబడులు రాష్ట్రానికి వస్తాయని, 6 లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని ఊదరగొట్టారు. కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి ఉపాధి లభించిందో వాస్తవాలు తెలియజేయాలి. ► 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రజలలో ప్రత్యేకంగా యువతలో మీరు భారీ ప్రకటనల ద్వారా ఆశలను రేకెత్తించారు. ఆర్భాటాలతో ప్రచారం కోసం ప్రజాధనం వృధాచేస్తుందన్న అనుమానాలకు ప్రభుత్వం వాస్తవాలు వివరించాలని లేఖలో పేర్కొన్నారు. -
విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శ సాక్షి, అమరావతి: ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు బోగస్ అని మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సమ్మిట్లో జరిగిన 361 ఎంఓయూల ద్వారా రూ. 4,76,878 కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే పది నెలలు దాటినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పగా.. ఒక్క ఉద్యోగం కూడా రాలేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా బహిర్గతమైందన్నారు. ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఆర్టీఐ చైర్మన్ లక్ష్మినారాయణ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీతో కలిసి ఆయన మాట్లాడారు. -
విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్ :నాదేండ్ల
ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు బోగస్ అని మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సమ్మిట్లో జరిగిన 361 ఎంఓయూల ద్వారా రూ. 4,76,878 కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే పది నెలలు దాటినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పగా.. ఒక్క ఉద్యోగం కూడా రాలేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా బహిర్గతమైందన్నారు. ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఆర్టీఐ చైర్మన్ లక్ష్మినారాయణ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీతో కలిసి ఆయన మాట్లాడారు. సమ్మిట్ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మనోహర్ ఆరోపించారు. ఇంత మొత్తాన్ని ఖర్చు చేసినట్లు జీవోలు విడుదల చేస్తే వారి బండారం బయపడుతుందనే ఉద్ధేశంతో కేవలం మెమోల ద్వారా రూ. 28 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. సీఎం తాత్కాలిక కార్యాలయం కోసమే రూ.7.74 కోట్లు విశాఖలో సీఎం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయానికి రూ. 7.74 కోట్లు ఖర్చు చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మనోహర్ తెలిపారు. అలాగే సమ్మిట్ నిర్వహణ సందర్భంగా నాట్య కార్యక్రమానికి ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేసినా కచ్చితంగా జీవో విడుదల చేయాలన్న విషయాన్ని పక్కనపెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని దుయ్యబట్టారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా రాష్ట్రానికి ఒరిగింది శూన్యమన్నారు. సమ్మిట్కు 41 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించగా.. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెలగ పూడిలోని సచివాలయంలో మాట్లాడుతూ సమ్మిట్కు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకు, ఆర్థిక మంత్రి వెల్లడించిన ప్రకటనలకు చాలా తేడా ఉందన్నారు. సుపరిపాలన, పారదర్శకత, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. స్వయానా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖపై సేకరించిన వివరాలు ఇలా ఉంటే మిగిలిన శాఖల అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తన అవినీతి బయటపడుతుందనే ఉద్ధేశంతోనే సదస్సు వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని, ప్రజాధనం దుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. -
'పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్'
-
'పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్'
విజయవాడ: విశాఖ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన పార్టనర్షిప్ సమ్మిట్ ఒక బోగస్' అని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సమ్మిట్ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సమ్మిట్ ద్వారా 361 ఎంవోయిలు, రూ. 4 లక్షల 76 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని టీడీపీ సర్కార్ చెప్పిందన్నారు. ఆర్టీఐ కింద సమాచారం సేకరిస్తే ఇంతవరకు ఏపీకి, ఒక పరిశ్రమ, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వం తమ అవినీతిని బయటపెడుతుందనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోందని విమర్శించారు. ప్రజాదుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. -
రెండేళ్లలో రూ.80వేల కోట్ల అప్పులా?
అప్పులు చేసి పప్పుబెల్లాలు తింటున్న చందంగా ప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడి వ్యయం చేస్తూ వేలాది కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల పదవీకాలంలో మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులోని మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెబుతూనే రూ.80 వేల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చినట్టు అమిత్షా ప్రకటించిన రూ.1.40 లక్షల కోట్ల డబ్బు ఏమైందనే ప్రశ్నలను తేటతెల్లం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం చేసిన ఆదాయ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలిలోని స్వగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పులు రూ.1.78 లక్షల కోట్లు కాగా, విభజన సమయంలో మన వాటా రూ.1,04,189 కోట్లుగా తేల్చినట్టు గుర్తుచేశారు. రెండేళ్లలో ఆ అప్పులు రూ.1,90,513 కోట్లకు పెరిగాయంటే రూ.80 వేల కోట్ల అప్పులు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. వడ్డీ కిందనే రూ.11 వేల కోట్లను వెచ్చించాల్సి ఉందన్నారు. రుణమాఫీ అన్నారు...రైతులకు అన్యాయం చేశారంటూ, మాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను వంచించారని, కొత్తగా అర్జీలు పెట్టుకున్న ఏ ఒక్క పేదవాడి కోసం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. భాగస్వామ్య ఒప్పంద సదస్సు, ఎంఓయూలతో వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఆర్భాటాల్లోనూ పస లేదని వెల్లడైందన్నారు. అప్పులు తెచ్చిన అనవసర కార్యక్రమాలకు వెచ్చిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం చేయటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, ఎం.దశరథరామిరెడ్డి, షేక్ రహిమాన్, దొడ్డక ఆదినారాయణ, నల్లగొర్ల నాగేశ్వరరావు. పిల్లి సుధాకర్ పాల్గొన్నారు. -
ఆదాయం వస్తున్నా బీద అరుపులేల
► ఇందిరమ్మ’ లబ్ధిదారులగోడు పట్టదా ► ప్రభుత్వంపై పీసీసీ ఉపాధ్యక్షుడు ► నాదెండ్ల మనోహర్ ధ్వజం తెనాలి : రాష్ట్ర విభజనతో ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటును అధిగమించి, ఆదాయం పెరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం, ప్రజల అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాయం పెరిగినా సంక్షేమానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. తెనాలిలోని స్వగృహంలో గురువారం విలేకర్లతో మనోహర్ మాట్లాడారు. సేల్స్టాక్సు రూపేణా రూ.31,120 కోట్లు, వివిధ పన్నుల రూపంలో రూ.44, 423 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణకు రూ.40 వేల కోట్ల పన్ను ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్కు అదనంగా మరో 4,423 కోట్లు వచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులు మరో 21,200 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,300 కోట్లు సమకూరాయని, రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ అయి రూ.1573 కోట్లు అదనంగా వచ్చినట్టు వివరించారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద పదేళ్లలో 64 లక్షల గృహాలను నిర్మించినట్టు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అవకతవకలంటూ విచారణకు ఆదేశించి బిల్లులు నిలుపుదల చేసిందన్నారు. మరోవైపు కొత్తగా రూ.16,300 కోట్లతో ఆరు లక్షల గృహాలను నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పటివరకు కేటాయించింది కేవలం రూ.1132 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టును అరకొర నిధులతో ఎలా పూర్తిచేస్తారన్నారు. వైఎస్ హయాంలో పార్టీల కతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందిస్తే, ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కార్యకర్తల సిఫార్సు చేయాలనే నిబంధనలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. -
కేంద్రం వివక్షపై మౌనం ఎందుకు?
పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తెనాలి : పునర్విభజన చట్టం అమలు చేయకుండా, తగిన ఆర్థిక సహకారం అందించకుండా కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై మౌనం ఎందుకు వహిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పైగా బీజేపీ అగ్రనేతలు భారీ మొత్తంలో నిధులు ఇచ్చామని చేస్తున్న ప్రకటనలను ఎందుకు ఖండించటం లేదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే రాష్ట్రం కోసం ఐక్యంగా పోరాడదామని ఆయన సూచించారు. తెనాలిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధరను 50 శాతం పెంచి రైతును ఆదుకుంటామని ప్రధాని మోదీ చెప్పినా, కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదన్నారు. ఇటీవల రాజమండ్రి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చామని చెపారని, అది అవాస్తవమని టీడీపీ మంత్రులు ఖండించలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. ఆయనతోపాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.దశరధరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ఉన్నారు. -
‘బీజేపీలో దళితులకు స్వేచ్ఛ లేదు’
తెనాలి (గుంటూరు జిల్లా) : బిజెపిలో ఆ పార్టీ దళిత ఎంపీలకు స్వేచ్చ లేదని, దేశవ్యాప్తంగా ఆ పార్టీలో 46 మంది దళిత ఎంపీలు ఉంటే ఒక్కరికి కూడా కేబినెట్ మంత్రి పదవి ఇవ్వలేదని ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెనాలి నియోజకవర్గ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ సంస్థల చేతుల్లో నడుస్తుందన్నారు. ఎన్డిఎ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని, విశ్వవిద్యాలయాల్లో కుల,మత ఘర్షణలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో అరాచక, దోపిడీ పాలన జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుందని, కాంట్రాక్టర్లు, సొంత మనుషులకు ప్రజాప్రతినిధులు పనులు చేస్తూ ప్రజలకు పనులు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు మనోదైర్యం కలిగించే విధంగా పరిపాలన చేయాలని, సమాజంలో అసమానతలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్రమోదీ మోసగాడని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిరికివాడని అభివర్ణించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకిగా పనిచేస్తున్నారని, దళితుల ఓట్లుతో అధికారంలోని వచ్చి వారిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. -
'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
-
'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం మోసపూరితమైందని ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో ఓ హోటల్ జరిగిన కార్యక్రమంలో బాక్సైట్ తవ్వకాలపై వాస్తవ పత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ...ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 97 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై బహిరంగ చర్చకు రావాలని సీఎంకు ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమానికి మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఆదివాసీల హక్కుల దినోత్సవం రోజున చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేయడం విచిత్రమైన పరిస్థితికి నిదర్శనమని నాదెండ్ల వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో తనకు ప్రయోజనం చేకూర్చే కంపెనీల కోసం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను సైతం సవరణ చేసేందుకు చంద్రబాబు గతంలో ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని గతంలో నాలుగు సార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారని నాదెండ్ల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పెద్దకే ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. -
వన సంపదను కాపాడుకోవాలి..
జన్నారం/కడెం : కవ్వాల అభయారణ్యంలోని వన సంపదను కాపాడుకోవాలని.. అది అందరి బాధ్యత అని శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం అటవీ డివిజన్లోని మైసంపేట, మల్యాల, పాండవాపూర్ తదితర అడవుల్లో పర్యటించారు. ఉద యం 5.30 గంటలకే ఆయన అడవులకు చేరుకున్నారు. అటవీ జంతువులైన దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పి తదితర వాటిని చూసి ఆనందించారు. అనంతరం అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వన్యప్రాణుల విభాగాన్ని అభివృద్ధి చేయాల్సినా అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలకతీతంగా బాధ్యత తీసుకుని.. ఇక్కడ పలువురికి ఉపాధి దొరికేలా చూడాలన్నారు. కవ్వాల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిందన్నారు. గ్రామాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పరిస్థితిని వివరించి అవగాహన కల్పిస్తే వారంతట వారే అడవులు వదిలి బయటకు వస్తారని, ప్రభుత్వం నుంచి ఫలాలు వారికి అందేలా కృషి చేయాలని కోరారు. తాను గతంలోనూ ఇక్కడ పర్యటించానని, కవ్వాల్ అభయారణ్యాన్ని మరింత అభివృద్ధి చేసేలా సీఎంకు వివరిస్తానని చెప్పారు. ఆయన వెంట డీఎఫ్వో దామోదర్రెడ్డి, టైగర్కన్జర్వేషన్ అథారిటీ సభ్యుడు ఇమ్రాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ హరినాయక్, కడెం ఎఫ్ఎస్వోలు నజీర్ఖాన్, కింగ్ఫిషర్, ఎఫ్బీవోలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం జిల్లా కో కన్వీనర్ రియాజోద్దీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముజాఫర్అలీఖాన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్నాయక్, తదితరులు సన్మానించారు. అలాగే.. కడెం అటవీ క్షేత్రంలోని గంగాపూర్, లక్ష్మీపూర్ సెక్షన్ అడవుల్లోనూ ఆయన పర్యటించారు. -
'మెట్రో ప్రాజెక్ట్ విజయవాడకే పరిమితం చేయొద్దు'
గుంటూరు: మెట్రో రైలు ప్రాజెక్ట్ విజయవాడ నగరానికే పరిమితం చేయడకూడదని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ మెట్రోరైలు నిర్మిస్తే... ఆ ప్రాజెక్ట్తో మంచి రాజధాని ఏర్పాడుతుందని అన్నారు. ఓ అధికారి మెట్రో ప్రాజెక్ట్ కేవలం ఓ నగరానికే పరిమితం చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో 12వ ప్రతిపాదనగా వీజీటీఎం పరిధిలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ నిర్మించాల్సి ఉందన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మాజీ స్పీకర్ నాదెండ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ రూపశిల్పి శ్రీధరన్... మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్కు విజయవాడనే ఆయన ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్పై విధంగా స్పందించారు. -
సమస్యలతో నిద్రలేని రాత్రులెన్నో గడిపా: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరూ ఊహించని ఎన్నో సమస్యలను 13వ శాసనసభ చవిచూసిందని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వీటిని అధిగమించడం కోసం తాను నిద్రలేని రాత్రులెన్నో గడిపానని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం అసెంబ్లీ సచివాలయ సిబ్బంది స్పీకర్కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ‘ఎక్కడాలేని, ఎవరూ ఊహించని సమస్యలెన్నో 13వ శాసనసభకు ఎదురయ్యాయి. వీటిని అధిగమించేందుకు చాలా రోజులు నిద్రపట్టలేదు. అర్ధరాత్రివరకు ఆయా సమస్యలపై చర్చించేవాడిని. ఒక్కోసారి సమస్యలను పరిష్కరించగలుగుతామా? అనే భావన కూడా వచ్చేది. అంతిమంగా స్పీకర్ కుర్చీలో కూర్చొనే సమయానికి ఏ చిన్నపొరపాటు కూడా జరగకూడదని భావించేవాడిని. అందరి సహకారంతో వాటన్నింటినీ అధిగమించాను’అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను సభలో ప్రవేశపెట్టగలగడం తనకు గర్వకారణమన్నారు. శాసనసభ సంక్షేమ, శాఖల వారీ కమిటీల ద్వారా ప్రజలకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యేలకు జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలని అసెంబ్లీ సచివాలయ సిబ్బందిని ఆయన కోరారు. శాసనసభ కమిటీలు చాలా వరకు ఢిల్లీ, ముంబయి వంటి చోట్ల అనవసరంగా పర్యటనలు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా జిల్లాల్లో పర్యటిస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని, తద్వారా పరిష్కారమార్గాలు కనుగొనడం సులువు అవుతుందన్నారు. ఈ ఉద్దేశంతోనే కొన్ని కమిటీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తామని ప్రతిపాదనలు పంపితే వాటి ని అనుమతించలేదన్నారు. -
వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్
తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని మంగళవారం తెల్లవారుజామున శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీనటి సిమ్రాన్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రెండో కుమారుడి పుట్టు వెంట్రుకలు తీయిచేందుకు సిమ్రాన్ ...భర్త ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. మరోవైపు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండలంలో నాదెండ్లకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి, స్వామివారి ప్రసాదాలు అందచేశారు. -
కిరణ్ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్
-
కిరణ్ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్రావు విమర్శించారు. పదవుల్లో కొనసాగే నైతిక అర్హత వారికిలేదని ఆయన అన్నారు. సీఎం, స్పీకర్ సీమాంధ్ర నేతల్లా నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు అసెంబ్లీలో తీవ్రమైన నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా గుర్తించడం లేదన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంటే చంద్రబాబు అన్యాయమనడాన్ని హరీష్రావు తప్పుబట్టారు. విపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర బడ్జెట్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. -
ఓటింగ్పై స్పీకర్ మీనమేషాలు
-
ఓటింగ్పై స్పీకర్ మీనమేషాలు
మీనమేషాలు లెక్కించకుండా శాసన సభలో విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... విభజన బిల్లుపై మెజార్టీ నిర్ణయం తెలియాలంటే శాసనసభలో ఓటింగ్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం తక్షణమే సభలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన స్పీకర్ను డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాథ్యమని పేర్కొన్నారు. విభజన బిల్లుపై చర్చకు ఈ రోజు ఆఖరి రోజు కావున సమైక్యవాదాన్ని ఎట్టి పరిస్థితులలోనైన గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లు రూపొందించిందని ఆరోపించారు. టి.బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని, అందుకోసం గడువు పెంచమంటే రాష్ట్రపతి మౌనం ముద్ర దాల్చారన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అలాగే విభజన వాదాన్ని తరిమికొట్టాలని తొమ్మిది కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్ర ప్రజల హక్కులు, అధికారాలను తాము పణంగా పెట్టలేమని దేవినేని ఉమ పేర్కొన్నారు. -
అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశాం: స్పీకర్
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్ చేశామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు. సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. అనధికార తీర్మానాలను అడ్మిట్ చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. కాగా, ఎలాంటి తీర్మానాలను అనుమంతిచేది లేదని టి.ప్రాంత ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది.. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది. కాగా, విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మాన నోటీసును ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం, టి.టిడిపి, టి.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు తప్పుబట్టాయి. సీఎం ఇచ్చిన నోటీసును పరిశీలించవద్దని టి.కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని టి.నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కిరణ్ రాజీనామా చేయాలి: దామోదర
కిరణ్ నోటీసుపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ‘‘దాన్ని సభలో లేవనెత్తేందుకు కూడా మేం అనువుతించబోం. దానిపై ఎవరు వూట్లాడజూసినా అడ్డుకుని తీరతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘సీఎంపై సభలో ఎవరికీ విశ్వాసం లేదని తేటతెల్లమైంది. ఆత్మాభివూనమున్న నేతే అరుుతే కిరణ్ తక్షణం రాజీనావూ చేయూలి’’ అని డివూండ్ చేశారు. తెలంగాణ మంత్రులు దామోదర, వుంత్రి కె.జానారెడ్డిల చాంబర్లలో వారు వేర్వేరుగా సవూవేశమై చర్చించారు. స్పీకర్ నాదెండ్ల వునోహర్తో దామోదర, జానా పలువూర్లు భేటీ అరుు, కిరణ్ నోటీసును తిరస్కరించాలని కోరారు. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయూకర్రావు కూడా దామోదరతో కాసేపు భేటీ అయ్యూరు. కేబినెట్తో సంబంధం లేకుండా ఇచ్చిన ఆ నోటీసు కిరణ్ వ్యక్తిగతమే తప్ప దానితో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలంగాణ మంత్రులన్నారు. -
సీఎం నోటీస్ తిర్కసరించాలని మాజీ స్పీకర్ లేఖ
-
సీఎం నోటీస్ తిర్కసరించాలని మాజీ స్పీకర్ లేఖ
హైదరాబాద్ : శాసనసభాపతి నాదెండ్ల మనోహర్కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును అనుమతించరాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. విభజన బిల్లును తిప్పి పంపాలంటూ కిరణ్కుమార్రెడ్డితో పాటు పలువురు సభ్యులు శాసనసభ నిబంధన 77 కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్కు నోటీసులివ్వడం తెలిసిందే. తిరస్కార నోటీసు విషయంలో రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నిబంధనలు లోతుగా పరిశీలించి వ్యవహరించాలని దీనిపై సురేష్ రెడ్డి....స్పీకర్ నాదెండ్లకు లేఖ సూచించారు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో తాను అలాగే వ్యవహించానని ఆయన గుర్తు చేశారు. మరోవైపు బిల్లు సభలో చర్చకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి తనకందిన మొత్తం నోటీసులపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 77, 78 నిబంధనల కింద ఇప్పటిదాకా వచ్చిన అన్ని నోటీసులపై ఏం చేయాలన్న దానిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలని స్పీకర్ నాదెండ్ల భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి నేడు ఆయన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కాగా సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దాంతో సమైక్య తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. మరోవైపు సీఎం ఇచ్చిన నోటీసు తిరస్కరించాలని, ఓటింగ్ నిర్వహించరాదని తెలంగాణ ప్రాంత సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు. -
'సీఎం కిరణ్ నోటిస్ తో సంబంధం లేదు'
-
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ డౌటే
-
ఖమ్మం బరిలో స్పీకర్ నాదెండ్ల ?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రూపు గొడవలు, అంతర్గత కుమ్ములాటలకు నెలవైన జిల్లా కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి అనుచరులు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు మనోహర్ సామాజిక వర్గ నేపథ్యంతో పాటు జిల్లా పార్టీలోని రెండు గ్రూపుల నడుమ మధ్యేమార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమనే భావనకు అధిష్టానం రావడమే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కష్టమని భావించడంతో పాటు, ఖమ్మంలో స్థానికేతరులకు విజయావకాశాలు ఎక్కువ అని కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆంతర్యం ఇలా.. గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ను ఖమ్మం పంపే విషయంలో అధిష్టానం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దల ఆలోచన ప్రకారం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అసెంబ్లీ స్పీకర్గా నిర్వర్తించాల్సిన బాధ్యతను రూల్ పొజిషన్ ప్రకారం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా మనోహర్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాల సమావేశాలను ప్రోరోగ్ చేసే అంశంలో కూడా ఆయన అధిష్టానానికి పూర్తిగా సహకరించారు. ఎక్కడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న భావన రానీయలేదు. దీంతో పాటు తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానంపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ అంతర్గతంగా సహకరిస్తున్న సీఎం కిరణ్కుమార్రెడ్డికి భిన్నంగా తన రాజ్యాంగపరమైన బాధ్యతలను సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. ఎన్నికల బరిలో దింపినా తాను సభాపతిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చించి పార్లమెంటుకు పంపానని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడైనప్పటికీ తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. రేణుకాచౌదరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినంత సులువుగా రాంరెడ్డి వర్గం కూడా స్పీకర్ పట్ల వ్యవహరించలేదు. దీనికి తోడు గతంలో ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా ఎంపీగా ఖమ్మం పార్లమెంటుకు ప్రాతిని ధ్యం వహించారు. ఆయనకు కూడా ఇక్క డి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. మనోహర్ సామాజికవర్గం కూడా ఇక్కడ ఆయనకు ఉపకరిస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధిష్టానం మనోహర్ పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నదనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. కొట్టుకున్నా... మాకే! ఇదిలా ఉంటే మంత్రి, ఎంపీ గ్రూపులు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానంపై కూడా కన్నేశారు. తన సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు ఢిల్లీ పెద్దల అనుమతి కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. సర్వోత్తమ్రెడ్డికి కూడా వ్యక్తిగతంగా రాహుల్గాంధీ వద్ద పలుకుబడి బాగానే ఉంది. ఆయన ఆధ్వర్యంలోని మైనార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడయిన సర్వోత్తమ్ రాహుల్కు సన్నిహితుడుగానే పేరొందారు. ఒకవేళ పరిస్థితి మారితే తానే స్వయంగా ఖమ్మం ఎంపీగా పోటీచేయాలనే యోచనలో కూడా మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హస్తినలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫైర్బ్రాండ్ రేణుక కూడా తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో పట్టు జారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగూ తనూ ఎంపీగానే ఉన్నందున సీటు తనకిచ్చే విషయంలో కొంత పట్టువిడుపు ప్రదర్శించినా, పూర్తిగా తన వర్గానికి దక్కకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. తనకు కాకపోతే తన భర్త శ్రీధర్చౌదరి, లేదంటే కుమార్తె తేజస్విని పేర్లను ఆమె ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తన కుటుంబానికి కాదన్నా ఆమె మరో ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రముఖ కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు (జీవీఆర్) పేరును పరిశీలించాలని ఆమె ఢిల్లీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
టీ నేతలంతా ఒకేతాటిపై..!
77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుల తిరస్కరణకు డిమాండ్ ఉభయ సభల్లో ఐకమత్యంతో వ్యహరించాలని నిర్ణయం మంత్రి పొన్నాల నివాసంలో ప్రజా ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపేందుకు సభలో తీర్మానం చేసేలా రూల్ 77 కింద స్పీకర్కు అందిన నోటీసులను తిరస్కరించాలని పార్టీలకతీతంగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉభయ సభల్లోనూ అందరూ ఐకమత్యంతో వ్యవహరించాలని, ఆ నోటీసుల తిరస్కరణకు గట్టిగా పట్టుబట్టాలని నిర్ణరుుంచారు. శాసనసభ నియమావళి 76, 77 కింద ఉభయ సభల్లో సభా నాయకులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆదివారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యూరు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్రెడ్డి, శ్రీధర్బాబు, ప్రసాద్కుమార్, ఉత్తమకుమార్రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, భూపాల్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు (టీడీపీ), నాగం జనార్దన్రెడ్డి (బీజేపీ)లు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి పొన్నాల ఫోనులో ఇతర తెలంగాణ ప్రాంత నేతలతోనూ చర్చించారు. సోమవారం ఉభయ సభల్లోనూ ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి చర్చలు జరుపుతూ ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రి, మండలి సభా నాయకుడు ఇచ్చిన నోటీసులు తమకు ఆమోదయోగ్యం కాదనే విషయం స్పీకర్, మండలి చైర్మన్లను మరోసారి కలిసి తెలియజేయాలని మంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమావేశానంతరం అందుబాటులో ఉన్న మంత్రులందరూ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో భేటీ అయ్యూరు. ప్రభుత్వం తరఫున అందజేసిన తీర్మానం నోటీసులను తిరస్కరించాలని కోరారు. నోటీసులు వ్యతిరేకిస్తున్నాం: మంత్రి పొన్నాల ముఖ్యమంత్రి అందజేసిన నోటీసులను తాము వ్యతిరేకిస్తున్నట్టు పొన్నాల విలేకరులతో చెప్పారు. మంత్రివర్గ సభ్యులమైన తమను సంప్రదించకుండా ప్రభుత్వ పక్షాన నోటీసులివ్వడం అప్రజాస్వామిక, నిరంకుశ చర్యగా భావిస్తున్నామన్నారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం సభలో తెలంగాణ కోరుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే వ్యూహంతో ముందుకు సాగుతారని చెప్పారు. ముఖ్యమంత్రి చర్యలకు ప్రజలే న్యాయనిర్ణేతలని, ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెబుతారని గండ్ర, పొంగులేటి వ్యాఖ్యానించారు. -
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ డౌటే
‘తిప్పి పంపే’ తీర్మానంపై స్పీకర్ నిర్ణయమే కీలకం కిరణ్ తదితరుల నోటీసులపై నేడు బీఏసీ జరిగే అవకాశం ఇందరి అభిప్రాయాలు చెప్పాక తిప్పిపంపడం సాధ్యమా? అడ్డుకోవడానికి సిద్ధమైన తెలంగాణ ప్రజాప్రతినిధులు గణతంత్ర వేడుకల్లో నాదెండ్లతో కిరణ్ మాటామంతీ కిరణ్ నోటీసును తిరస్కరించాలంటూ దామోదర లేఖ ఒక్క వ్యక్తి ఇస్తే ప్రభుత్వ నోటీసుగా పరిగణించొద్దని విజ్ఞప్తి ఓటింగ్ను తప్పించేందుకే ‘తిప్పి పంపే’ ఎత్తు వేశారేమో! కిరణ్, బాబు తీరుపై సీమాంధ్ర నేతల్లో అనుమానాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపుతూ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఆ తర్వాత జరిగేదేమిటి? ఇప్పుడు అందరి దృష్టీ ఈ అంశంపైనే నిలిచింది. బిల్లుపై చర్చ కోసం రాష్ట్రపతి పొడిగించిన గడువు మరో నాలుగు రోజుల్లో (జనవరి 30తో) ముగుస్తోంది. ఈ తరుణంలో బిల్లును తిప్పి పంపడం సాధ్యమేనా? ఒకవేళ పంపితే ఏమవుతుంది? అసలు అలా తిప్పి పంపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి అవకాశాలున్నాయా? ఇలాంటి పలు అంశాలపై నేతల్లో చర్చ సాగుతోంది. ఇన్ని రోజుల చర్చ తర్వాత, సాంకేతిక లోపాలను కారణంగా చూపుతూ బిల్లును కేంద్రానికి తిప్పిపంపాలని సభ ఒకవేళ తీర్మానిస్తే దానిపై ఓటింగ్ అవకాశాన్ని కోల్పోతామా అన్న మీమాంస కూడా నెలకొంది. అసలు బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఇంతకాలం పట్టుబట్టిన ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత తదితరులు ఇలా చివర్లో సాంకేతిక సాకులను తెరపైకి తేవడం బిల్లుపై ఓటింగ్ జరగకుండా చేసే ఎత్తుగడలో భాగమే అయి ఉంటుందన్న అనుమానాలు కూడా సీమాంధ్ర నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అన్ని తీర్మానాలపైనా ఒకే నిర్ణయం! విభజన బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో పాటు పలువురు సభ్యులు శాసనసభ నిబంధన 77 కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్కు నోటీసులివ్వడం తెలిసిందే. వాటి భవితవ్యం సోమవారం తేలనుంది. బిల్లు సభలో చర్చకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి తనకందిన మొత్తం నోటీసులపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 77, 78 నిబంధనల కింద ఇప్పటిదాకా వచ్చిన అన్ని నోటీసులపై ఏం చేయాలన్న దానిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలని స్పీకర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సోమవారం ఆయన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. నిజానికి ఈ నోటీసులపై నిర్ణయం తీసుకునే విషయంలో సభాపతిగా స్పీకర్కు సర్వాధికారాలున్నాయి. 77, 78 నిబంధనల కింద వచ్చే నోటీసులపై 10 రోజుల్లోగా నిర్ణయం వెలువరించే అవకాశం ఆయనకు ఉంటుంది. అయితే విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చాక మొట్టమొదటగా గత డిసెంబర్ 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూల్ 77, 78 కింద ఇచ్చిన నోటీసులు ఇప్పటికీ స్పీకర్ వద్దే పెండింగ్లో ఉన్నాయి. శనివారం కిరణ్ ఇచ్చిన నోటీసుతో పాటు వీటన్నింటిపైనా ఒక నిర్ణయానికి రావాలని ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు. బీఏసీని సోమ, లేదా మంగళవారాల్లో నిర్వహిస్తారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నా, అసాధారణ పరిస్థితి తలెత్తిందని భావిస్తే ఇలాంటి నోటీసులపై సభలోనే ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలను స్పీకర్ కోరడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే సభలో ప్రవేశపెట్టిన బిల్లులో ‘ముసాయిదా బిల్లు’ అని ఎక్కడా పేర్కొనలేదని, కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్న ముసాయిదా అన్న పదానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుతో ఏ సంబంధమూ లేదని అంటున్నారు. ఈ దశలో సభలో ఏం చేసినా దాన్నే అభిప్రాయం కింద పరిగణించాలన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు వినిపిస్తోంది. స్పీకర్కు డిప్యూటీ లేఖాస్త్రం మరోవైపు 77వ నిబంధన కింద సీఎం ఇచ్చిన నోటీసులను తిరస్కరించాలని స్పీకర్కు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ లేఖ ఇచ్చారు. మంత్రిమండలి మొత్తం కలిస్తేనే ప్రభుత్వమవుతుందని, అలాంటప్పుడు ఒక వ్యక్తి ఇచ్చే నోటీసును ప్రభుత్వ నోటీసుగా పరిగణించరాదని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆదివారం పార్టీలకతీతంగా సమావేశమై చర్చించారు. నోటీసులను తిరస్కరించాలంటూ సోమవారం వారంతా సభలో పట్టుబట్టే అవకాశాలున్నాయి. తిప్పిపంపితే ఏమవుతుంది? చివరి దశలో విభజన బిల్లును తిప్పిపంపితే ఏమవుతుందన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. పార్టీలవారీగా చూస్తే బిల్లుపై ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. సభా నాయకుడైన కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు మినహా అన్ని పార్టీకు చెందిన మిగిలిన సభ్యులందరూ బిల్లుపై లిఖితపూర్వకంగా సవరణలు ప్రతిపాదించడం, అభిప్రాయాలు తెలపడం పూర్తయింది. కిరణ్ కూడా రెండు దఫాలుగా బిల్లుపై మాట్లాడారు. బిల్లుపై చర్చ సందర్భంగా మధ్యమధ్య జోక్యం చేసుకున్న సభ్యుల అభిప్రాయాలను మినహాయించినా ఇప్పటికే 87 మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రపతి పొడగించిన గడువు సైతం మరో నాలుగు రోజుల్లో ముగుస్తోంది. ఇలాంటి సమయంలో బిల్లును తిప్పిపంపుతూ సభ తీర్మానం చేయడం వల్ల ఏం జరుగుతుందన్న అంశంపై నేతల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ దశలో బిల్లును తిప్పిపంపుతూ శాసనసభ తీర్మానం చేసే ఆస్కారమే లేదని తెలంగాణ నేతలు చెబుతున్నారు. ఇంత జరిగిన తర్వాత బిల్లును తిప్పి పంపాలంటే ఆ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుందని, ఒకవేళ సాంకేతికాంశాలే ప్రాతిపదిక అని పేర్కొంటే, ఆ విషయాన్ని మొదట్లోనే ఎత్తిచూపకుండా, సభలో అన్ని పార్టీల అభిప్రాయాలూ వ్యక్తమయ్యాక ఇలా చివర్లో సందేహాలు లేవనెత్తితే ప్రయోజనాలేముంటాయన్న అంశంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. నోటీసుపై నాదెండ్లతో కిరణ్ చర్చ! ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో కిరణ్, స్పీకర్ నాదెండ్ల పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు చాలాసేపు మాట్లాడుకోవడం కనిపించింది. కిరణ్ నోటీసుపైనే చర్చ జరిగి ఉంటుందంటున్నారు. సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు సందర్భంగానూ వారు మాట్లాడుకోవడం కనిపించింది. -
'సీఎం కిరణ్ నోటిస్ తో సంబంధం లేదు'
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్కుమార్రెడ్డి 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరారు. ఈ మేరకు ఒక లేఖను ఆయనకు అందజేశారు. ఆర్టికల్ 208 ప్రకారం శాసనసభ నిర్వహణ నిబంధనావళి శాసనసభకు సంబంధించిన అంశాలకు మాత్రమే వర్తిస్తుందని, పార్లమెంట్ వ్యవహారాలకు వర్తించేది కాదని అందులో పేర్కొన్నారు. ప్రస్తుత బిల్లు కేవలం పార్లమెంటు నిర్ణయించడానికి ఉద్దేశించింది మాత్రమేనని, శాసనసభకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సమావేశానంతరం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు స్పీకర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యూరు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా నోటీసు ఇచ్చినట్టు పత్రికల్లో చూశానని, మంత్రిమండలి సమష్టిగా తీసుకున్నదే ప్రభుత్వ నిర్ణయమవుతుందని, ఏ ఒక్క మంత్రి లేదా ముఖ్యమంత్రి తనకు తాను ప్రభుత్వం అని అనుకోవడానికి వీల్లేదని దామోదర పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులెవరినీ సంప్రదించకుండా నోటీసు ప్రతిపాదించడం తీవ్ర అభ్యంతరకరమని, సమష్టి బాధ్యత అన్న స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడును అడ్డుకోవడమే అవుతుందని, అందువల్ల స్పీకర్ బిజినెస్ రూల్స్ 81 ప్రకారం సీఎం నోటీసును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఓటింగ్పై ఎటూ తేల్చని బీఏసీ
సమావేశానికి సీఎం, చంద్రబాబు డుమ్మా ఓటింగ్, తీర్మానం కోసం వైఎస్సార్ సీపీ పట్టు ఓటింగ్పైనా రెండు కళ్ల సిద్ధాంతాన్ని విన్పించిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు బీఏసీ ఆమోదం తెలిపాకే ఓటింగ్, తీర్మానం నిర్ణయాలు తీసుకోవాలన్న టీఆర్ఎస్.. సానుకూలంగా స్పందించిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉంటుందా? లేదా? అనే అంశంపై గురువారం సాయంత్రం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలోనూ స్పష్టత రాలేదు. ఓటింగ్పై స్పష్టతనివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా పలువురు నేతలు కోరినా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూటిగా ఏ విషయం తేల్చలేదు. గతంలో శాసనసభలో అనుసరించిన సంప్రదాయాలు, నిబంధనలను ఇప్పుడూ అనుసరిస్తానని, ఈ విషయంపై ఇటీవల తాను పంపిన నోట్ను చదువుకోవాలని సూచించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు రాష్ట్రపతి మరో వారం గడువు ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశంపైన చర్చ జరిగింది. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం (ఆదివారం) మినహా మిగిలిన ఆరు రోజుల్లోనూ సభను కొనసాగించాలని బీఏసీలో తీర్మానించారు. వీలైనంత మేరకు సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని, అవసరమైతే వర్కింగ్ లంచ్ను ఏర్పాటు చేసి సాయంత్రం వరకు సభను కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశానికి కూడా సీఎం కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు హాజరు కాలేదు. ఆ సమయంలో ఇరువురు నేతలు అసెంబ్లీ లాబీల్లోని తమ కార్యాలయాల్లో ఉన్నారు. అయితే, సమావేశానికి ఇరు ప్రాంతాల నాయకులను పంపి, ఎవరికి అనుకూలమైన వాదనలు వారు వినిపించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి అధికార పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, అనిల్కుమార్, ద్రోణంరాజు శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్ హాజరయ్యారు. విపక్షాల తరపున అశోక్గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల, ఎర్రబెల్లి దయాకర్రావు, కొత్తకోట దయాకర్రావు(టీడీపీ), వైఎస్.విజయమ్మ, శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్ కాంగ్రెస్), ఈటెల రాజేందర్, హరీష్రావు(టీఆర్ఎస్), అక్బరుద్దీన్(ఎంఐఎం), గుండా మల్లేష్(సీపీఐ), లక్ష్మీనారాయణ(బీజేపీ), జూలకంటి(సీపీఎం), జయప్రకాష్ నారాయణ్(లోక్సత్తా) పాల్గొన్నారు. ప్రతి సభ్యుడికీ మాట్లాడే అవకాశం ముందుగా స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ.. బిల్లుపై ఇప్పటివరకు సభలో 43 గంటలు చర్చ జరిగిందని, 65 మంది సభ్యులు మాట్లాడారని వివరించారు. మరో ఆరు రోజులు ఉన్నందున అందరికీ మాట్లాడే అవకాశమివ్వాలని అన్ని పార్టీల సభ్యులు కోరారు. ఏ సభ్యుడు ఎంతసేపు మాట్లాడతారో పార్టీలవారీగా ఇవ్వాలని స్పీకర్ కోరారు. ప్రతి సభ్యుడికీ 3 నుంచి 5 నిమిషాల సమయమిస్తానని, ఆ తరువాత సమయాన్నిబట్టి ఎక్కువ సేపు మాట్లాడే వారికి ప్రాధాన్యతనిస్తానని వివరించారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందో లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు విజయమ్మ, శోభానాగిరెడ్డి పట్టుపట్టారు. సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 77, 78 నిబంధన కింద గతంలోనే నోటీస్ ఇచ్చామని, దానికి అనుగుణంగానే సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలని కోరారు. మిగతా పార్టీలు ద్వంద్వ వాదనలు వినిపించాయి. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కోరగా, అవసరంలేదని తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు చెప్పారు. బిల్లుపై ఓటింగ్, తీర్మానం వంటి అంశాలను చేపట్టేముందు తప్పనిసరిగా బీఏసీ ఆమోదం తీసుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు కోరగా, స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన వారం గడువు సరిపోదని, మరింత సమయం కోరుతూ ఈసారి అసెంబ్లీయే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. దీనిని ఆ పార్టీ తెలంగాణ సభ్యుడు ఎర్రబెల్లితోపాటు టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు తోసిపుచ్చారు. ఏ ప్రాంత నేతల అభిప్రాయాన్ని టీడీపీ అభిప్రాయంగా తీసుకుంటున్నారని హరీష్రావు అడిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. టీడీపీ అధినేత హాజరుకాకపోవడం వల్ల బీఏసీ సభ్యుడైన అశోక్గజపతిరాజు అభిప్రాయాన్నే ఆ పార్టీ అభిప్రాయంగా భావిస్తున్నానన్నారు. దీనికి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘అశోక్ మా నాయకుడు కాదు. బిల్లుపై ఓటింగ్ జరపాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. బీఏసీ సమావేశానికి సీఎం హాజరుకాకపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రస్తావించారు. దీంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుంటూ ‘మీకు ఒక ప్రాంతంలో పార్టీనే లేదు’ అని అనడంతో శోభానాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ప్రాంతంలో నష్టపోతామని తెలిసీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము గట్టిగా పోరాడుతున్నామని, మీరు మాత్రం రాష్ట్రం సంగతి వదిలేసి పార్టీ బాగుండాలనే కోరుకుంటున్నారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని అదనపు గడువు కోరుతూ ఎవరు లేఖ రాశారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ స్పీకర్ని ప్రశ్నించారు. సీఎం లేఖ రాశారని స్పీకర్ చెప్పారు. తననే లేఖ రాయమని సీఎం కోరినప్పటికీ, సభా నిబంధనల మేరకు రాయనని చెప్పడంతో ఆయనే రాశారని తెలిపారు. చాంబర్కే పరిమితమైన బాబు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో కీలకమైన చర్చ జరుగుతున్న క్రమం.. ఈ సమయంలో స్పీకర్ నిర్వహించిన బీఏసీ సమావేశాలు వేటికీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు. విభజన బిల్లుపై చర్చకు రాష్ట్రపతి గడువును మరో వారం రోజులు పెంచగా.. ఆ అంశంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ గురువారం బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనికి చంద్రబాబు హాజరుకాలేదు. బీఏసీ సమావేశం నిర్వహించిన హాలుకు నాలుగడుగుల దూరంలో ఉన్న తన చాంబర్లోనే నేతలతో గడిపారు. శాసనసభ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు చేయడానికి డిసెంబర్ 11న స్పీకర్ బీఏసీ నిర్వహించారు. ఆ తర్వాత విభజన బిల్లు, దానిపై తలెత్తిన వివిధ సందేహాలపై స్పీకర్ డిసెంబర్ 17న, ఆ తర్వాత జనవరి 6న మరోసారి బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా వీటిలో దేనికీ చంద్రబాబు హాజరుకాలేదు. -
‘విధివిధానాలపై గందరగోళం లేదు ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుకు సంబంధించి సభలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎలాంటి తికమక లేదని, సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం ఈ బిల్లుకు సంబంధించి ఓటింగ్ ఉండాలని కొందరు, ఓటింగ్ పెట్టరాదని కొందరు, బిల్లుపై ఏ విధానం పాటిస్తారో సభాపతి స్పష్టత ఇవ్వాలని ఇంకొందరు వాదనలు వినిపించిన నేపథ్యంలో స్పీకర్ వివరణ ఇచ్చారు. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానం ఉంది. సంప్రదాయాలను పాటిస్తాం. ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకుంటాం. బిల్లుపై ప్రతి సభ్యుని అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పించాలని రాష్ట్రపతి పంపిన నోట్లో కూడా సూచించారు. సభ పాటించనున్న విధానంపై అపోహలు అవసరం లేదు’’ అని ప్రకటిస్తూ సభను గురువారానికి వాయిదా వేశారు. అంతకుముందు సభ్యుల అభిప్రాయాలివీ.. మంత్రి జానారెడ్డి: ఆర్టికల్ -3 ప్రకారం బిల్లుపై అసెంబ్లీలో తీర్మానంకానీ, ఓటింగ్కు వీలులేదు. బాబూలాల్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసింది. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును వ్యతిరేకించే అధికారం ఎవరికీ లేదు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ: బిల్లుపై గడువు వారం పొడిగించినట్లు సమాచారం వస్తోంది. బిల్లుపై ఏ విధానం అనుసరించాలనే విషయంలో తుది నిర్ణయం స్పీకర్దే. అయితే బీఏసీలో చర్చించి స్పష్టంగా ప్రకటించాలి. టీడీపీ సభ్యుడు అశోక్ గజపతిరాజు: ఏ బిల్లు అయినా ప్రవేశపెట్టిన సమయంలో ఎవరూ వ్యతిరేకించరు. తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సమయంలో కౌంటింగ్ జరపకుంటే సభ అభిప్రాయం ఎలా తెలుస్తుంది? -
ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేసిన నాదెండ్ల?
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా ఉన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలైనా ఓడిపోవడం ఖాయం. దీంతో తెనాలి ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడం అసాధ్యమని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సరిహద్దులోని నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారట. ఈసందర్భంగా మనోహర్కు ముందుగా ఖమ్మం జిల్లా గుర్తొచ్చిందట. ఎందుకంటే అక్కడి నుంచే గతంలో ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి గెలుపొందారు. పాత పరిచయాలతోపాటు.. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్తో పొత్తులు కూడా కలిసొస్తాయని భావించే మనోహర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దాంతో పాటు ఖమ్మంలోని సామాజికవర్గాల పొందిక కూడా తనకు అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నారట. తెలంగాణ ప్రాంత నేతలు కూడా మనోహర్ను గెలిపించుకుంటామంటూ అధిష్ఠానానికి చెప్పారని సమాచారం. అంతేకాదు.. మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావును తెలంగాణకు తొలి గవర్నర్గా నియమించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ బిల్లుకు 9 వేల సవరణ ప్రతిపాదనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)కు 9,024 సవరణ ప్రతిపాదనలు అందాయని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సవరణ ప్రతిపాదనలను సోమవారం సభ్యులందరికీ అందిస్తామన్నారు. బిల్లుపై శాసనసభలో ఆందోళనలు - చర్చలు - అభిప్రాయాలు - సవరణ ప్రతిపాదనలు - వాకౌట్లు - సభ్యుల సస్పెస్షన్లు.... జరుగుతున్న విషయం తెలిసిందే. శాసనసభ అభిప్రాయం తెలియజేయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లును ఇక్కడకు పంపారు. ఈ బిల్లుకు అనేక సవరణలు చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సభలో సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయడంతోపాటు సవరణలు ప్రతిపాదిస్తూ వినతి పత్రాలను స్పీకర్కు సమర్పించారు. పార్టీలు, సభ్యులు ప్రతిపాదించిన సవరణలలో అన్ని అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్, ఉద్యోగుల పెన్షన్, ఉమ్మడి రాజధాని, హైకోర్టు, ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ ఒప్పందాలు, కొత్త ప్లాంట్లు, విద్యా సంస్థల్లో కామన్ అడ్మిషన్, ఎన్టీపీసీలు, విశ్వవిద్యాలయాలు, నియోజకవర్గాలు...ఇలా సమగ్రంగా అనేక అంశాలను ఆ సవరణ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. -
బిల్లును వ్యతిరేకించని సీమాంధ్ర టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై క్లాజుల వారీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తెలుగుదేశం సీమాంధ్ర నేతలు స్పీకర్ నాదెండ్ల మనోహర్కు లేఖలను అందజేశారు. అయితే వాటిలో ఎక్కడా విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు వారు పేర్కొనకపోవడం గమనార్హం. బిల్లులోని 108 క్లాజులపైనా అభిప్రాయాలు వ్యక్తీకరిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మినహా 43 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు ప్రతిపాదనలను అందించారు. క్లాజ్ 1 మొదటి ఎస్సార్సీకి భిన్నంగా ఉందని, క్లాజ్ 3 భాషాప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకమని తమ అభిప్రాయాలను పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఎక్కడా చెప్పకపోగా, బిల్లులోని 90, 93 క్లాజులను అంగీకరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు పది సూచన లు చేస్తూ గురువారమే స్పీకర్కు లేఖలు అందచేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా శుక్రవారం శాసనసమండలిలో ఛైర్మన్కు లేఖలు అందచేశారు. వీటికి అదనంగా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండేందుకు అనువుగా తెలంగాణ రాష్ట్రంలో 119కి బదులు 150 మంది శాసనసభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలకు బదులు 50 మంది ఉండాలని సూచించారు. -
విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరణ
-
విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరణ
హైదరాబాద్ : శాసనసభలో వైఎస్ విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరాకరిస్తున్నారు. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా విజయమ్మ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతినివ్వడంలేదు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. వైఎస్ఆర్సీపీ గతంలో ఇచ్చిన సమైక్య తీర్మానం నోటీసు, బుధవారం విజయమ్మ రాసిన లేఖపై సభలో ప్రకటన మాత్రమే చేయగలనని.. వాటిని అనుమతించలేనని.. స్పీకర్ స్పష్టం చేశారు. విభజన బిల్లుపై సభలో ఓటింగ్ ఉంటుందో లేదోకూడా ఇప్పుడే చెప్పలేనని.. తనతో భేటీ అయిన వైఎస్ఆర్ సీపీ సభ్యులతో స్పీకర్ తెలిపారు. బిల్లుపై క్లాజులవారీగా లేదా మొత్తం బిల్లుపైన ఓటింగ్ ఉంటుందో లేదో కూడా ఇప్పుడు చెప్పలేనని స్పీకర్ అన్నారు. -
ఓటింగ్ లేకుండా చర్చ ఎలా సాధ్యం?
టీ-నేతల అభ్యంతరంపై సీమాంధ్ర మంత్రుల ధ్వజం ఓటింగ్ హక్కు ఉంటుందని సీఎం, స్పీకర్ చెప్తేనే చర్చకు సిద్ధమయ్యాం అందుకు మీరూ అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటూ మోకాలడ్డితే ఎలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు ప్రతిపాదిత సవరణలపై ఓటింగ్ను అంగీకరించబోమంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడాన్ని సీమాంధ్ర నేతలు తప్పుపట్టారు. విభజనపై చర్చ జరగాలని, ఎవరెన్ని అభిప్రాయా లు చెప్పుకున్నా, సవరణలను ప్రతిపాదించినా అభ్యంతరం లేదని చెప్పిన నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటని సీమాంధ్ర మంత్రులు ప్రశ్నించారు. విభజనకు తాము వ్యతిరేకమైనప్పటికీ సవరణల పేరుతో ఓటింగ్ కోరే హక్కు సభ్యులకు ఉంటుందని సీఎం కిరణ్కుమార్రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పినందనే తాము చర్చకు సిద్ధమయ్యామని మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. సవరణలపై ఓటింగ్ పేరుతో విభజన బిల్లును వ్యతిరేకించవచ్చన్నదే తమ లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ మినహా సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల సభ్యులంతా ఇదే అభిప్రాయంతో చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ నేతలు సవరణలే వద్దంటూ మోకాలడ్డితే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ నేతల తీరు చూస్తుంటే సభలో చర్చ జరగకూడదనే భావనతో ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. చర్చ జరిగితే సభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకమని తేలిపోతుం దని, తద్వారా రాష్ట్రపతి విభజన బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో పునరాలోచించే అవకాశముందని తెలిసే చర్చకు అడ్డుపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. మరోవైపు సీఎం కిరణ్ సైతం మంగళవారం తన చాంబర్లో కొందరు సీమాంధ్ర మంత్రులతో మాట్లాడుతూ అందరూ చర్చకు సహకరించాలని కోరినట్లు తెలిసిం ది. చర్చ కొనసాగితే విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడంతో పాటు బిల్లులోని అంశాలపై పలు సవరణలను ప్రతిపాదించి ఓటింగ్ కోరదామని ప్రతిపాదించారు. విభజనపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, సవరణలు, ఓటింగ్ వద్దని చెప్తున్న తెలంగాణ నేతల వ్యాఖ్యలపై స్పంది స్తూ.. ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయమంటే అర్థమేమిటి? వాటిని ఏ రూపంలో తీసుకుంటారు? ఓటింగ్ ద్వారానే కదా! అదే వద్దంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడిన అనంతరం సీఎం వెళుతూ వెళుతూ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం చర్చకు నూటికి నూరుశాతం సిద్ధంగా ఉన్నాం. ఇకపై ప్రతి నిమిషాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు చర్చకు అంగీకరించి శాసనసభ స్పీకర్కు పూర్తిగా సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. -
‘సవరణ’లకు ఒప్పుకోం
ఓటింగ్ పెడితే అడ్డుకుంటాం స్పీకర్కు తెలంగాణ నేతల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులోని అంశాలపై శాసనసభ్యులు ఈ నెల 10 లోపు సవరణలను ప్రతిపాదించాలంటూ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై శాసనసభలో ఏకాభిప్రాయమే లేనప్పుడు సవరణలను ప్రతిపాదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహించడం ద్వారా శాసనసభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలను కేంద్రానికి పంపేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణ ప్రతిపాదన ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తమ ప్రతిపాదనను పక్కనపెట్టి ఓటింగ్కు వెళితే సభను అడ్డుకుని తీరుతామన్నారు. ‘ఓటింగ్’పై టీ-నేతల చర్చోపచర్చలు: టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ శాసనసభ్యులు మంగళవారం అసెంబ్లీ లాబీల్లోని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిల చాంబర్లలో సమావేశమై స్పీకర్ పంపిన సవరణల ఫార్మాట్పై చర్చించారు. తొలుత జానారెడ్డి చాంబర్లో టీడీపీ సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ సభ్యులు ఈటెల రాజేందర్, టి.హరీష్రావు సమావేశమయ్యారు. ఆ తరువాత ఈటెల, హరీష్లతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమన్వయకర్త దుద్దిళ్ల శ్రీధర్బాబుతో చర్చించారు. బీజేపీ సభ్యులు నాగం, యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వచ్చి సవరణ ప్రతిపాదనపై చర్చించారు. అక్కడి నుంచి అందరూ కలిసి దామోదర రాజనర్సింహ చాంబర్కు వెళ్లారు. ‘విభజన’పై తీవ్ర ప్రభావమనే ఆందోళన: విభజన బిల్లులోని అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ సవరణలు కోరితే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై టీ-నేతలు ఈ భేటీల్లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న విభజన నిర్ణయంపై శాసనసభలో భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఓటింగ్ నిర్వహిస్తే మెజారిటీ అభిప్రాయాలు విభజనకు వ్యతిరేకంగా వెల్లడయ్యే అవకాశముందని అభిప్రాయానికి వచ్చారు. వాటిని కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని ఈ భేటీలో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్ర అసెంబ్లీ అనుకూల అభిప్రాయాల్లేకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని, శాసనసభ అభిప్రాయాలు భిన్నంగా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశముందని కొందరు నేతలు సందేహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోకుండా విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్న నేపథ్యంలో, విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయం కీలకం కానుందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు సవరణల పేరుతో ఓటింగ్కు అంగీకరిస్తే విభజనపై ప్రభావం చూపుతుందన్నారు. అభిప్రాయాలకే పరిమితం కావాలి: ఇదంతా ముందుగా ఊహించిన సీమాంధ్ర నేతలు వ్యూహాత్మకంగా సవరణల పేరుతో ఓటింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారనే అభిప్రాయం పలువురు నేతలు వ్యక్తం చేశారు. వారి వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే సవరణ ప్రతిపాదన పేరుతో ఓటింగ్ నిర్వహించడానికి అవకాశం లేకుండా చేయడమొక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై తక్షణమే చర్చను కొనసాగించడంతో పాటు బిల్లులోని అంశాలపై శాసన సభ్యులంతా తమ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే పరిమితం చేయాలని శాసనసభ స్పీకర్పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. దీంతో వెంటనే నేతలంతా స్పీకర్ను కలసి ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే అంశంపై స్పీకర్కు రాతపూర్వకంగా లేఖ ఇచ్చేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. ఉదయానికల్లా టీ-నేతల వైఖరిలో మార్పు: సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలోనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సవరణల ప్రతిపాదన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు సంబంధిత ఫార్మాట్ను కూడా పంపిణీ చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలంతా స్పీకర్ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ ఆ తరువాత సభలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం శాసనసభ్యులందరికీ ఆయా ఫార్మాట్ పత్రాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా తెలంగాణ మంత్రులంతా నిన్నటి వరకు సభలో చర్చ జరగడమే తమకు ముఖ్యమని, అందులో భాగంగా ఎవరు ఎన్ని సవరణలైనా ప్రతిపాదించుకోవచ్చని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే మంగళవారం ఉదయానికల్లా ఆయా నేతల అభిప్రాయాల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జానారెడ్డి దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్బాబు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ-నేతలంతా సమావేశమై చర్చించి స్పీకర్ను కలిశారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రజాప్రతినిధులంతా.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సీపీఐ నుంచి తెలంగాణకు అనుకూలమైన పార్టీల ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీలో బిల్లుకు సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహించటంవల్ల విభజన ప్రక్రియపై ఏ మేరకు ప్రభావం చూపుతుందని, భవిష్యత్తులో న్యాయపరంగా ఏ విధమైన అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయనే విషయంపై చర్చించారు. -
సమగ్రంగా లేని బిల్లుపై ఎలా చర్చిస్తాం?
స్పీకర్తో టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: సమగ్రసమాచారం లేని విభజన బిల్లుపై సభలో ఎలా చర్చిస్తామంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ మనోహర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పి.అశోక్ గజపతిరాజు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కేఈ ప్రభాకర్ తదితరులు ఆయన్ను కలిశారు. తాము రూపొందించిన బిల్లు అసమగ్రంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలతో మరో బిల్లు పంపుతామని కేంద్రం రాష్ట్ర సీఎస్కు సమాచారమిచ్చినట్లు వార్తలొచ్చాయని, అందు వల్ల బిల్లును వెనక్కు పంపాలని కోరారు. ఒకవేళ చర్చకు చేపడితే సమగ్రత లోపంపై రూలింగ్ కోరతామన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని స్పీకర్ చెప్పారు. కాగా కేంద్రం రూపొందించిన బిల్లుకు సవరణలు చేసే అధికారం సీఎంకు లేదని, తాను సమైక్యవాదినని చెప్పుకునేందుకు సవరణల పేరిట సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్.ప్రకాశ్రెడ్డి, రేవంత్రెడ్డి తదితరులు స్పీకర్కు లేఖ రాశారు. టీఆర్ ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలూ ఇదే విషయమై స్పీకర్కు లేఖలు రాశారు. -
'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు'
విభజన బిల్లు అంకాన్ని త్వరగా పూర్తి చేసి సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరాటపడుతున్నారని శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర నేతలైయుండి ఆ ముగ్గురి నేతలకు ఎందుకింత ఆత్రుత అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టే విషయంలో మాత్రం ఆ ముగ్గురు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వారంతా సమైక్య ముసుగు తొడిగిన సమైక్యవాదని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్లోర్ లీడర్లు మాత్రమే బీఏసీకి రావాలనేది తమ డిమాండ్ అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఏసీలో పార్టీ విధానం చెప్పాలి, కానీ.. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకుండా స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని శోభానాగిరెడ్డి అన్నారు. -
'ఆ ముగ్గురు సమైక్య ముసుగు తొడిగిన సమైక్యవాదులు'
-
సవరణలపై మాత్రమే ఓటింగ్
ఇతర రాష్ట్రాల విభజన పద్ధతులపై బీఏసీకి స్పీకర్ నోట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో ఓటింగ్కు అవకాశం లేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బిల్లుపై ఓటి ంగ్ జరగలేదని తెలిపారు. అయితే సవరణలపై ఓటింగ్ జరపవచ్చన్నారు. సోమవారం బీఏసీ సమావేశంలో విభజన బిల్లుపై యూపీ, బీహార్ శాసనసభల్లో అనురించిన విధానాలపై సభ్యులకు అందజేసిన నోట్లో ఈ మేరకు పేర్కొన్నారు. నోట్లోని ముఖ్యాంశాలు... యుూపీ విభజన బిల్లులో సవరణలకు అవకాశమివ్వగా ప్రభుత్వపక్షం 29, ప్రతిపక్షం 4 సవరణలను ప్రతిపాదించాయి. వీటిపై తవు అభిప్రాయూలు చెప్పేందుకు సభ్యులకు అవకాశమిచ్చారు. వుూజువాణి ఓటును నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించగా ప్రతిపక్షం సవరణలను తిరస్కరించింది. ఈ సవరణలతో కలిపి బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపారు. బిల్లుపై ఒక్కరోజే చర్చ జరగ్గా 30 వుంది పాల్గొన్నారు. బీహార్లో విభజన బిల్లుపై ఓటింగ్ కోరుతూ కొందరు సభ్యులు ఒక తీర్మానం ప్రతిపాదించగా మూజువాణి ఓటుతో స్పీకర్ తిరస్కరించారు. అయితే బిల్లుపై అభిప్రాయూలు తీసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర వుుఖ్యవుంత్రే స్వయుంగా స్పీకర్కు నోటీసు అందించారు. ఆ రాష్ట్ర బీఏసీ నిర్ణయుం మేరకు చర్చను రెండు విభాగాలుగా చేపట్టారు. బిల్లుపై సాధారణ చర్చ ఒకటికాగా, అంశాల (క్లాజస్) వారీ చర్చ రెండోది. క్లాజ్లకు సవరణలను స్వీకరించడమే కాకుండా వాటిని అసెంబ్లీ ప్రోసీడింగ్స్లో ఒక ప్రత్యేక భాగంగా చేర్చారు. బీఏసీలో ఆరుగంటల సవుయుమే అనుకున్నా చర్చ 10 గంటల సేపు సాగి 42 వుంది పాల్గొన్నారు. మొత్తం 371 సవరణలను సభ్యులు ప్రతిపాదించగా, వాటిపై సభ్యుల అభిప్రాయూలు తీసుకున్నారు. సవరణలపైనా వుూజువాణి ఓటింగ్ నిర్వహించగా కొన్ని ఆమోదం, కొన్ని తిరస్కరణకు గురయ్యూరుు. బీహార్కు *1.79 లక్షల కోట్ల కేంద్ర గ్రాంట్ ఇవ్వాలన ్న సవరణను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరణలపై చర్చరూపంలో సభ్యులు అభిప్రాయుం చెప్పడమే తప్ప లిఖితపూర్వక అభిప్రాయూలు ఎవరూ ఇవ్వలేదు. -
వైఎస్సార్సీపీని సస్పెండ్ చేసైనా చర్చను కొనసాగిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ బిల్లుపై వెంటనే చర్చ ప్రారంభించండి... సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తిచేరుుంచండి... అందుకు మ వంతు పూర్తి సహాయుసహకారాలు అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ మినహా శాసనసభలోని అధికార, విపక్ష పార్టీలన్నీ స్పీకర్ నాదెండ్ల వునోహర్కు స్పష్టంచేశారుు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసీ సమైక్యాంధ్రప్రదేశ్ తీర్మానం చేయూలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకొనే ప్రయుత్నం చేస్తే ఆ పార్టీ సభ్యులందరినీ సభనుంచి సస్పెండ్ చేసైనా చర్చను వుుందుకు సాగిద్దావుని వివరించారు. సభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో సోమవారం రెండు దఫాలుగా బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వం తరఫున ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్, గండ్ర వెంకట రమణారెడ్డి, ఈరావత్రి అనిల్, ఆరేపల్లి మోహన్, ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ పక్షాన వైఎస్ విజయమ్మ, భూమా శోభా నాగి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, టీడీపీ తరఫున పి. అశోక్ గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, టీఆర్ఎస్ పక్షాన ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్రావు, బీజేపీ పక్షాన యెం డల లక్ష్మీనారాయణ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్షాన గుండా మల్లేష్; సీపీఎం, లోక్సత్తా తరఫున జూలకంటి రంగారెడ్డి, జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వుుందు ఉదయుం పది గంటలనుంచి వుధ్యాహ్నం ఒంటిగంటవరకు బీఏసీ జరిగింది. ఏకాభిప్రాయుం కుదరకపోవడం, తవు పార్టీ నేతలతో వుళ్లీ వూట్లాడి వస్తావుని టీడీపీ నేతలు చెప్పడంతో సవూవేశాన్ని స్పీకర్ వుధ్యాహ్నం రెండు గంటలకు వారుుదా వేశారు. ఆ తరువాత అరగంటసేపు సవూవేశం జరిగింది. సమైక్యాంధ్రప్రదేశ్ తీర్మానాన్ని అమోదించాలని, ఆ తరువాత చర్చ వంటి సభాకార్యక్రవూలన్నిటికీ పూర్తిగా సహకరిస్తావుని ఈ రెండు దఫాల సవూవేశాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ తేల్చిచెప్పింది. కాం గ్రెస్, ఇతర పార్టీలు చర్చను ప్రారంభించాలని సూచించగా... టీడీపీ రెండు నాలుకల ధోర ణిని ప్రదర్శించింది. టీడీపీది రెండు కళ్ల సిద్ధాంతమే: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ గురించి వుుందుగా స్పీకర్ సభ్యులకు తెలిపారు. బిల్లుపై సభ అభిప్రాయూలు తీసుకొని రాష్ట్రపతికి పంపించాల్సి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం ‘‘బిల్లును వెంటనే చర్చకు పెట్టండి. వూ పార్టీలో ప్రాంతాల వారీ భిన్నాభిప్రాయూలు ఉన్నా చర్చ చేయూలన్నదే వూ అందరి భావన. విభజనవల్ల తలెత్తే నష్టాలను వివరించి కేంద్రానికి విన్నవిద్దాం’’ అని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, అసమగ్రంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని టీడీ పీ నేత అశోక్గజపతి చెప్పారు. బిల్లుపై వురింత సవూచారం కావాలని సభ్యులు అడిగిన మేరకు స్పీకర్ ఆదేశాలతో కేంద్రానికి గతనెల 21నే లేఖ రాసినా స్పందన రాలేదని ఆనం తెలిపారు. ఈ సవుయుంలో టీడీపీ సభ్యుడు వుు ద్దు కృష్ణవునాయుుడు జోక్యం చేసుకుంటూ రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై చర్చించడానికి వీల్లేదని, వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. అయితే ముద్దుకృష్ణమ చెప్పేది టీడీపీ విధానం కాదని, చర్చ జరగాలనే టీడీపీ కోరుకుంటోందని ఆ పక్కనే ఉన్న వురో టీడీపీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టంచేశారు. అడ్డు వచ్చేవారిని సస్పెండ్ చేసైనా చర్చను కొనసాగించాలని ఎర్రబెల్లి దయూకర్రావు చెప్పారు. సమైక్య తీర్మానం చేయాల్సిందే: విజయమ్మ రాష్ట్ర సమైక్యతకోసం శాసనసభ తీర్మానం చేయూల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత విజయువ్ము డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం ద్వారానే వైఎస్ రాజశేఖరరెడ్డికి అసలైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. సమైక్యతీర్మానం చేశాకే ఏదైనా చర్చ జరగాలని ఆ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కృష్ణదాస్ స్పష్టంచేశారు. సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, లోక్సత్తా పార్టీల ప్రతినిధులు బిల్లుపై చర్చించాలని సూచించారు. అయితే బిల్లుపై చర్చకు వుుందుగానే సమాచారం ఇవ్వాలని జయుప్రకాశ్ నారాయుణ్ అడిగారు. అంశాల వారీగా చర్చ, ఓటింగ్ జరగాలని, తద్వారా ఏ ప్రాంతానికి ఏం నష్టం జరుగుతుందో చెప్పవచ్చని సూచించారు. చర్చ ప్రారంభమైందని దయూకర్రావు చెప్పడం సరికాదని, అందుకు ఆధారాలు ఎక్కడున్నాయుని శాసనసభావ్యవహారాల వుంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. తావుు ఇదే అంశాన్ని ఇంతకువుుందే ప్రశ్నించినా ప్రభుత్వం కావాలనే దాటవేస్తోందని అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తపరిచారు. చర్చ ప్రారంభంపై సాంకేతిక అంశాల్లోకి పోరుు సవుయుం వృధా చేసుకోరాదని, చర్చను వెంటనే ప్రారంభిద్దావుని గత బీఏసీలోనే సీఎం చెప్పారని, ఇంకా చర్చ ప్రారంభంపై సంశయూలు అవసరం లేదని ఆనం స్పష్టంచేశారు. ఉదయుం సవూవేశం సుదీర్ఘంగా సాగాక... తావుు పార్టీలోని ఇతర నేతలతో వూట్లాడాల్సి ఉందని టీడీపీ నేతలు పేర్కొనడంతో స్పీకర్తో సహా ఇతర పార్టీల నేతలంతా విస్మయూనికి గురయ్యూరు. పార్టీలో చర్చించుకోకుండానే ఇంతసేపూ మాట్లాడారా అని కాంగ్రెస్నేతలు ప్రశ్నించారు. రెండోసారి సవూవేశంలో కూడా టీ డీపీ నేతలు రెండు రకాల అభిప్రాయూలే వినిపించారు. బీఏసీకి టీడీపీ తరఫున అశోక్ గజపతిరాజు అధికారిక సభ్యుడైనందున, ఆయన అభిప్రాయాన్నే రికార్డు చేస్తామని ఆనం స్పష్టంచేశారు. 16న సభ లేదు: సంక్రాంతి సెలవులు 15వ తేదీవరకు ఉంటాయుని, ఆరోజున కూడా పండుగ ఉంటుంది కనుక వురునాడు 16వ తేదీ సవూవే శానికి ఎక్కువవుంది సభ్యులు హాజరుకాలేరని ఆయూ పార్టీల నేతలు వివరించారు. దీంతో 16న కూడా సవూవేశాన్ని జరపరాదని, ఆ రోజుకు బదులు 18వ తేదీ శనివారంనాటి సెలవు దినాన్ని పనిదినంగా వూర్చాలని బీఏసీలో నిర్ణరుుంచారు. -
బిల్లు క్లాజులపై సవరణలివ్వండి
ఎమ్మెల్యేలకు స్పీకర్ స్పష్టీకరణ 10వ తేదీ మధ్యాహ్నం దాకా గడువు మూడో రోజూ సభ వాయిదానే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013లోని క్లాజులపై ఏవైనా సవరణ నోటీసులు ఇవ్వాలనుకునే ఎమ్మెల్యేలు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు తన కార్యాలయంలో అందించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇందుకోసం స్పీకర్ కార్యాలయం రూపొందించిన ఫార్మాట్లోనే సవరణలను పొందుపరచాలని సోమవారం శాసనసభలో ఆయన స్పష్టం చేశారు. సోమవారం శాసనసభ వ్యవహారాల కమిటీ సుదీర్ఘ సమావేశం అనంతరం సభ ప్రారంభమైన తరువాత సభ్యులు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల మధ్యలోనే ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ‘నేను ప్రకటన చేయాల్సి ఉంది. మీరంతా సహకరించండి. విభజన బిల్లుపై చర్చించండి. మీ అభిప్రాయాలు చెప్పండి. సభా సమయాన్ని ఇలా వృథా చేయడం సరి కాదు. శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 10వ తేదీ లోపు సవరణ నోటీసులివ్వండి’ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం తొమ్మిదింటికి సభ ప్రారంభం కాగానే పలు పార్టీల సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అంతకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్ర నినాదాలతో పోడియంలోకి వెళ్లారు. టీడీపీ సభ్యులు కూడా అలాగే చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ కూడా వెల్లోకి వెళ్లడానికి ముందుకొచ్చారు. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు కూడా సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దాంతో సభ వాయిదా పడింది. బీఏసీ అనంతరం మధ్యాహ్నం 1.46కు తిరిగి ప్రారంభమైనా అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. మండలిదీ అదే తీరు శాసనమండలి సోమవారం పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. ఉదయం 10.02కు సభ ఆరంభం కాగానే వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలువురు తెలంగాణ సభ్యులు తమ స్థానాల్లోంచే తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో సభను చైర్మన్ చక్రపాణి వాయిదా వేశారు. 1.30కు తిరిగి సమావేశమైనా అదే పరిస్థితి కొనసాగడంతో రెండు నిమిషాలకే సభ మంగళవారానికి వాయిదా పడింది. -
బిల్లుపై చర్చ ప్రారంభమైందా? లేదా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందా? లేదా? అని శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ)లో చర్చకు వచ్చింది. సభలో పాల్గొన్న సభ్యులే ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ ప్రారంభమయిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అజెండాలో కూడా ఆ అంశం ఉందని ఆయన తెలిపారు. టీడీపీకి విభజనపై ఎటువంటి స్పష్టతలేదు. తెలంగాణ టిడిపి నేతలు విభజనకు ఆమోదిస్తుంటే, సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ మాత్రం శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని పట్టుబట్టింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ బిఏసి సమావేశానికి హాజరుకాలేదు. ఏ నిర్ణయం తీసుకోకుండానే బిఏసి సమావేశం ముగిసింది. -
సభ నిర్వహణపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్ : మలివిడత సమావేశాలను సాఫీగా నడిపే అంశ ంపై మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చ క్రపాణి, స్పీకర్ మనోహర్ మల్లగుల్లాలు పడుతున్నారు. విభజన బిల్లుపై చర్చకు అధికార, విపక్షాల నుంచి సహకారం ఏ మేరకు ఉంటుందన్న సంశయుం వారిలో నెలకొంది. రాష్ట్రపతి ప్రణబ్వుుఖర్జీ విధించిన జనవరి 23 గడువు లోగా చర్చను వుుగించాల్సి ఉంది. కానీ ఇరుప్రాంతాల సభ్యులు, పార్టీలు వేర్వేరు వాదాలు వినిపిస్తుండడంతో సభ నిర్వహణపై చక్రపాణితో మనోహర్ చర్చించారు. అసెంబ్లీ తొలి విడత సమావేశాల్లో బిల్లుపై చర్చ ప్రారంభమైందని సభా వ్యవహారాల వుంత్రిగా శ్రీధర్బాబు, సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ వుల్లుభట్టి విక్రవూర్క ప్రకటించడం.. సీఎం కిరణ్తో సహా సీత్రులు, ఇతర నేతలు అభ్యంతర పెట్టడం తెలిసిందే. విధివిధానాలను ఖరారు చేశాకే చర్చను ప్రారంభించాలని, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీల్లోఅనుసరించిన విధానాల పుస్తకాలను పంపుతానని సభాపతులిద్దరికీ కిరణ్ సూచించారు. వునోహర్ కూడా ఇటీవల లక్నో, పాట్నా వెళ్లి అక్కడి విభజన చర్చల తీరును అధ్యయునం చేసి వచ్చారు. పార్లమెంటు అధికారులతోనూ సవూవేశవుయ్యూరు. ఇందుకు సంబంధించిన నోట్లను సభల్లో సభ్యులకు అందించాలని ఆయున భావిస్తున్నారు. బీఏసీలో ఒక విధానాన్ని రూపొందించాకే చర్చను ప్రారంభిస్తానని స్పీకర్ గతంలో ప్రకటించడం తెలిసిందే. శుక్రవారం నుంచి సభలో సభ్యుల స్పందనను బట్టి బీఏసీని పెట్టాలని ఆయున భావిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో సభ సజావుగా జరగని పక్షంలో సోవువారం బీఏసీ నిర్వహించి బిల్లుపై చర్చను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. వులివిడత సవూవేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమై 10వ తేదీవరకు సాగి, ఐదు రోజుల సంక్రాంతి సెలవుల అనంతరం 16 నుంచి 23వ తేదీ దాకా కొనసాగుతారుు. అసెంబ్లీ అధికారులు ప్రశ్నోత్తరాలతో సహా సాధారణ అజెండాను వూత్రమే రూపొందించారు. బిల్లుపై చర్చ కొనసాగింపు అంశాన్నీ అందులోనే చేర్చారుు. ఈ చర్చకు పార్టీలు ఏ మేరకు అంగీకరిస్తారుు, చర్చ సాగుతుందా లేదా అన్నది సభలోనే తేలనుంది. -
టీ బిల్లు చర్చపై విధివిధానాలు
కసరత్తు చేపట్టిన స్పీకర్ బీఏసీ వుుందు పెట్టి ఆపై చర్చ గడువులోగా ముగించాలన్న యోచనలో నాదెండ్ల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చను కొనసాగించేందుకు అవసరమైన విధివిధానాలపై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కసరత్తు చేపట్టారు. జనవరి మూడో తేదీనుంచి అసెంబ్లీ శీతాకాల మలివిడత సమావేశాలు ప్రారంభం కానుండడంతో అంతకు ముందే ఈ విధివిధానాలను ఖరారుచేసి సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) ముందు పెట్టాలని ఆయున భావిస్తున్నారు. బీఏసీలో చర్చించిన పిదప అవసరమైన మార్పులు చేపట్టి చర్చను పూర్తిచేరుుంచాలన్న ఆలోచనతో స్పీకర్ ఉన్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈనెల 12న రాష్ట్రానికి రావడం, అది 13వ తేదీనే అసెంబ్లీకి, శాసన మండలికి చేరడం తెలిసిందే. ఆ తరువాత సభ జనవరి 3 వరకు వాయిదా పడటంతో.. స్పీకర్ విభజన బిల్లులపై ఆయా అసెంబ్లీల్లో జరిగిన చర్చల వివరాలను తెలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీలో లోక్సభ ప్రస్తుత, వూజీ అధికారులతో కూడా స్పీకర్ భేటీ అయ్యూరు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయున ఇచ్చిన గడువులోగా చర్చను వుుగించాలన్న అభిప్రాయూనికి స్పీకర్ వచ్చారని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నారుు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రత్యేకమైనది కావడం వల్ల విధివిధానాలపై ఆయున ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ అసంతృప్తి! స్పీకర్ వునోహర్ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పర్యటనల్లో తన భాగస్వామ్యం లేకపోవడంపై డిప్యూటీ స్పీకర్ వుల్లు భట్టివిక్రవూర్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సవూచారం. ఉపసభాపతిగా ఉన్న తాను కూడ సభానిర్వహణలో పాలుపంచుకోవలసి ఉంటుందని, చర్చల సరళిని తాను కూడా తెలుసుకునేందుకు వీలుగా పర్యటన సమాచారాన్ని తనకు చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయూన్ని ఆయున సన్నిహితుల వద్ద వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈనెల 16వ తేదీన సభలో జరిగిన కొన్ని ఘటనలు ఇరువురి వుధ్య భేదాభిప్రాయూలకు దారితీసినట్లు సమాచారం. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై బీఏసీ పెట్టి అందరితో వూట్లాడాక సభలో చర్చను చేపడతానని స్పీకర్ వునోహర్ అంతకు వుుందు జరిగిన బీఏసీలో సభ్యులకు హామీ ఇచ్చారు. 16వ తేదీన బీఏసీ జరగలేదు. ఆరోజు టీడీపీ సభ్యులు అడ్డుకోవడంతో సభాపతి వునోహర్ సభ లోపలకు వెళ్లలేకపోయూరు. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రవూర్క సభాపతి స్థానంలోకి వెళ్లి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించావుని భట్టి ప్రకటించడం, బీఏసీ పెట్టకుండానే చర్చ ఎలా అంటూ సీఎంతో సహా సీవూంధ్రనేతలు అభ్యంతరం వ్యక్తంచేయుడంతో అది వివాదాస్పదమైంది. ఈ ఘటన స్పీకర్ను ఇరకాటంలోకి నెట్టడంతో ఆయున సభ జరిగిన తీరుపై అసంతృప్తికి లోనయ్యూరని చెబుతున్నారు. -
సవరణలపై ఓటింగ్ జరిగింది
* బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై స్పీకర్ మనోహర్కు వివరించిన ఆ రాష్ట్ర అధికారులు * పాట్నాలో బీహార్ అసెంబ్లీ స్పీకర్, వుంత్రులతో నాదెండ్ల భేటీ * అసెంబ్లీలో చర్చ తీరుతెన్నులపై అధ్యయనం * అక్కడినుంచి ఢిల్లీకి చేరుకుని పార్లమెంటు అధికారులతో భేటీలు సాక్షి, హైదరాబాద్: బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చల సరళిని రాష్ట్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర స్పీకర్, అసెంబ్లీ అధికారులతో గురువారం చర్చలు జరిపిన మనోహర్ బృందం అదే రోజు రాత్రి పాట్నాకు చేరుకుంది. శుక్రవారం పాట్నాలో బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్నారాయణ్ చౌదరి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి విజయేంద్ర ప్రసాద్యాదవ్, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీకే షాహిలతో వునోహర్ భేటీ అయ్యూరు. రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం, ఇతర అధికారులు, బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి, శాసనసభ కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు అనుసరించిన విధానాన్ని, చర్చలు సాగిన తీరును ఆ రాష్ట్ర అధికారులు వునోహర్ బృందానికి వివరించారు. బిల్లుపై సభ్యులు అనేక సవరణలు ప్రతిపాదించారని, మూజువాణీ ఓటింగ్కూడా జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ రికార్డులనుకూడా సమావేశంలో పెట్టారు. అనంతరం స్పీకర్ వునోహర్, అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంలు అక్కడినుంచి సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ పార్లమెంటు వూజీ సెక్రటరీ జనరల్ విశ్వనాధన్తో సవూవేశవుయ్యూరు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన పద్ధతులపై పార్లమెంటరీ నిబంధనలపై ఆయనతో చర్చించారు. సభలో చర్చ జరిగితేనే అందరి అభిప్రాయాలు ప్రభుత్వానికి, ప్రజలకు తెలుస్తాయని, తద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని విశ్వనాధన్ అభిప్రాయపడ్డారని అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం తెలిపారు. బీహార్లో ఒక్కరోజులో ముగిసిన చర్చ బీహార్నుంచి 18 జిల్లాలతో కూడిన జార్ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ 2000 సంవత్సరంలో బీహార్ అసెంబ్లీకి రాష్ట్రపతి బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పంపించారు. ఏప్రిల్ 25న రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. అప్పటి ఆ రాష్ట్ర వుుఖ్యవుంత్రి లాలూప్రసాద్ యూదవ్ రాష్ట్ర విభజనను మొదట వ్యతిరేకించినా తరువాత అంగీకారం తెలపడంతో అసెంబ్లీలో చర్చ దాదాపు సాఫీగానే సాగిందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. బిల్లుపై చర్చ ఒక్కరోజులోనే వుుగిసిందని, మొత్తం 29 వుంది పాల్గొన్నారని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అనేక సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. రాతపూర్వక అఫిడవిట్లు ఇవ్వడం వంటివి చోటుచేసుకోలేదు. పైగా సవరణలపై సభ్యులు ఓటింగ్కు పట్టుబడితే స్పీకర్ వెంటనే అందుకు సరేనని అవకాశమూ ఇచ్చారు. సవరణల్లో ముఖ్యమైనది బీహార్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. బీహార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆయుువుపట్టుగా ఉన్న గనులు, భూగర్భ వనరులు, అడవులతోకూడిన కీలకమైన ప్రాంతం జార్ఖండ్లోకి చేరుతున్నందున రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుందని అధికార రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ సభ్యులు, వుంత్రులు వాదించారు. రాష్ట్రానికి ఆర్థిక ఆదాయమిచ్చే ప్రాంతం కోల్పోతున్నందున అందుకు పరిహారంగా బీహార్కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని డివూండ్ చేశారు. రూ.1,79,900 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని కోరుతూ సవరణ ప్రతిపాదించారు. దీంతో పాటు వురో 60 సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. వీటిపై ఓటింగ్ కూడా నిర్వహించారు. కేవలం మూజువాణి ఓటింగ్ మాత్రమే జరిగిందని, స్పష్టమైన డివిజన్కు ఆస్కారమివ్వలేదని వివరించారు. ఆర్థిక ప్యాకేజీ సవరణకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తిరస్కరించడం గమనార్హం. -
ఏపీ భవన్కు చేరుకున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఏపీ భవన్ కు చేరుకున్నారు.శాసనసభను జనవరి 3 వ తేదీ వరకూ వాయిదా వేసిన స్పీకర్.. గతంలో జరిగిన విభజన ప్రక్రియ విధి విధానాలను తెల్సుకోనేందుకు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వెళ్లారు. -
‘ఉత్తరాఖండ్’ చర్చ ఒక్కరోజే!
యుూపీ విభజనపై అక్కడి స్పీకర్, అధికారులతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల భేటీ సాక్షి, ైెహ దరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ, అనుసరించిన విధి విధానాలను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల వునోహర్ గురువారం పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ నుంచి విడదీసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సవుయుంలో సంబంధిత బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ ఎలా జరిగిందో అధ్యయునం చేసేందుకు బుధవారం స్పీకర్ నాదెండ్ల వునోహర్, శాసనసభ సచివాలయు అధికారులు లక్నో వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వూతా ప్రసాద్ పాండే, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ అధికారులతో మనోహర్ బృందం సవూవేశమైంది. యుూపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు దాదాపు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ చర్చ ఒకే ఒక్కరోజులో వుుగిసిందని, చర్చలో 30 మంది సభ్యులు వూత్రమే పాల్గొన్నారని అక్కడి అసెంబ్లీ అధికారులు తెలిపారు. ఆ రికార్డులను స్పీకర్ వునోహర్ పరిశీలించారు. ‘బిల్లుపై చర్చ సందర్భంగా ప్రవుుఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉద్ధంసింగ్నగర్ జిల్లాలను ఉత్తరప్రదేశ్లోనే ఉంచాలని ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. భౌగోళికంగా ఆ రెండు జిల్లాలు ఉత్తరాఖండ్లోనే ఉన్నందున వాటిని విడదీయురాదని ఆ ప్రాంత ప్రతినిధులు వాదించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు సవరణలు ప్రతిపాదించారు. కేంద్రం వాటిని ఆమోదించలేదు. అసెంబ్లీలో చర్చకు సవుయుం కేటారుుంపు ఎలా జరిగిందన్న అంశాన్ని కూడా వునోహర్ ఆరా తీశారు. బిల్లుపై ఓటింగ్కు అవకాశం ఇచ్చారా? లేదా? అని యుూపీ స్పీకర్ను మనోహర్ ప్రశ్నించారు. సభలో అభిప్రాయూలు తెలుసుకొని బిల్లును తిరిగి పంపావుని ఓటింగ్ జరగలేదని అక్కడి స్పీకర్ స్పష్టంచేశారు. అనంతరం వునోహర్, ఏపీ అసెంబ్లీ అధికారులు బీహార్ రాజధాని పాట్నాకు వెళ్లారు. జార్ఖండ్ ఏర్పాటు సందర్భంగా రూపొందించిన బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు అనుసరించిన విధానాన్ని శుక్రవారం పరిశీలించనున్నారు. -
యూపీ, బీహార్లను ఎలా విభజించారు?
-
యూపీ, బీహార్లను ఎలా విభజించారు?
* విభజన ప్రక్రియను తెలుసుకునేందుకు ఆ రాష్ట్రాలకు వెళ్లిన స్పీకర్ నాదెండ్ల * అక్కడి స్పీకర్, ఉన్నతాధికారులతో భేటీలు.. నేడు యూపీలో, రేపు బీహార్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనలో పాల్గొంటోంది. బుధవారం సాయుంత్రం వారు ఉత్తరప్రదేశ్ రాజ ధాని లక్నోకు చేరుకున్నారు. యుూపీ స్పీకర్ వూతాప్రసాద్ పాండేతో గురువారం వునోహర్ భేటీ కానున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయు అధికారులతో ఇక్కడి నుంచి వెళ్లిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సందర్భంగా యూపీ పునర్య్వవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చించిన తీరు, అనుసరించిన విధానాలను వునోహర్ అధ్యయునం చేయునున్నారు. అనంతరం స్పీకర్ నేతృత్వంలోని బృందం శుక్రవారం బీహార్ వెళ్తుంది. అక్కడ ఆ రాష్ట్ర స్పీకర్ ఉదయ్ నారాయుణ్ చౌదరి, ఆ రాష్ట్ర అసెంబ్లీ అధికారులతో సమావేశమై.. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన రాజ్యాంగ ప్రక్రియను పరిశీలిస్తారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈనెల 12న అసెంబ్లీకి రావడం, దానిపై చర్చ విషయుంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా సంబంధిత బిల్లుపై అసెంబ్లీల్లో చర్చలు సాగిన తీరు, అనుసరించిన విధానాలకు సంబంధించిన కొన్ని పుస్తకాలను ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్పీకర్, శాసనవుండలి ఛైర్మన్లకు పంపించారు. వాటిని అధ్యయునం చేసి విభజన బిల్లు చర్చపై దిశానిర్దేశం చేయూలని ఆయున వారిని కోరారు. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న వులివిడత శీతాకాల సవూవేశాల్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను కొనసాగించాల్సి ఉండటంతో... ఈలోగానే వేరే రాష్ట్రాల్లో జరిగిన విభజన బిల్లులపై చర్చల సరళిని అధ్యయునం చేసేందుకు స్పీకర్ వునోహర్ యుూపీ, బీహార్ రాష్ట్రాల పర్యటనలను చేపట్టారు. పునర్వ్యవస్థీకరణ బిల్లులపై ఆయూ అసెంబ్లీల్లో ఎంతెంత సవుయుం కేటారుుంచారు? పార్టీల వారీగా సవుయుం ఇచ్చారా? లేక సభలోని సభ్యులందరి అభిప్రాయూలు సేకరించారా? సవరణల తీరుతెన్నులు, ఓటింగ్కు అవకాశవుుందా? అనే అంశాలను వారు పరిశీలిస్తున్నారు. సభ్యుల అభిప్రాయూలను తెలుసుకున్న అనంతరం వాటిని క్రోడీకరించి తిరిగి రాష్ట్రపతికి పంపించడానికి నివేదికలు ఎలా రూపొందించారన్న విషయం పైనా స్పీకర్ దృష్టి సారించనున్నారు. -
‘బాల పంచాయత్’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
తెనాలిటౌన్,న్యూస్లైన్: బాలల రక్షణ, హక్కుల గురించి మాట్లాడానికి వేదిక ‘బాలపంచాయత్’ అని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పిల్లలను పంచాయతీలలో భాగస్వామ్యులను చేసి వారి ఆలోచనలను తెలుసుకోవాలన్నారు. కొలకలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం ‘బాలపంచాయత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ మనోహర్, బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మేక్లెన్, యునిసెఫ్ ప్రతినిధి రోఫ్ లియోనో, ఏపీ ఆలయన్స్ చైల్డ్ రైట్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్లు తొలుత లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షత వహించారు. తొలుత స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అమలులో వున్న ‘బాల పంచాయత్’ను మోడల్ ప్రాజెక్టుగా తెనాలిలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సమాజ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి 26 ప్రభుత్వ శాఖల ప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. బ్రిటీష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మేక్లెన్ మాట్లాడుతూ బాల పంచాయత్లో పిల్లల ఆలోచనలు తెలుసుకున్నట్లయితే వారికి కావలసినవి గుర్తించవచ్చన్నారు. యునిసెఫ్ ప్రతినిధి రోఫ్ లియోనో మాట్లాడుతూ పిల్లల్లో నిర్ణయాత్మక ఆలోచనలు పెరగడానికి బాల పంచాయత్ ఉపయోగపడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ తొలిసారిగా రాష్ర్టంలో బాలపంచాయత్ను తెనాలి నియోజకవర్గంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. చైల్డ్ రైట్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి బాల పంచాయత్ ద్వారా జరుగుతుందన్నారు. సీడ్స్ ప్రతినిధి, ప్రాజెక్టు నిర్వాహకులు రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు బాల పంచాయత్లో చర్చించి అధికారులు దృష్టికి తీసుకువెళతామన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి, డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఆర్వీఎం శ్రీనివాసరావు, సర్పంచ్ కాలిశెట్టి లక్ష్మీ నాంచారమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, సీడీపీఓ సులోచన, తహశీల్దార్ ఆర్.వెంకటరమణనాయక్, స్పెషల్ ఆఫీసర్ జివి.నారాయణ, ఏఓ అమలకుమారి, ఏడీఈ ఆర్మ్స్ట్రాంగ్, ఏఈ కృష్ణారావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులతో ‘బాల పంచాయత్’ కార్యక్రమం అనంతరం స్పీకర్ మనోహర్ పాఠశాల విద్యార్థులతో పంచాయతీ సభను ఏర్పాటు చేయించారు. విద్యార్థులను సర్పంచ్, సభ్యులుగా ఏర్పాటు చేసి సమస్యలను చెప్పించారు. రోడ్ల పై జీబ్రా క్రాసింగ్ లైన్ ఏర్పాటు చేయాలని, రోడ్లపై చెత్త చెదారం వేస్తున్నారని, మందుబాబులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, సీసీఎల్ ఫ్యాక్టరీ రసాయన పదార్థాల వల్ల తాగునీరు కలుషితమైందని వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వాణి, భార్గవ్, ప్రదీప్, శిరీష్, మస్తాన్ వలీ, తదితరులు కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రోడ్ల మీద చెత్తాచెదారం శుభ్రం చేయించాలని సర్పంచ్ నాంచార మ్మకు సూచించారు. రూ. 1.25 కోట్లతో పాఠశాల భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. సీసీఎల్ నుంచి వచ్చే కలుషిత నీటిని పరిశీలించి దానిపై నివేదిక అందజేయాని ఆర్డీవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
స్పీకర్, సీఎంల మధ్య విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మలివిడత సమావేశాలకు సంబంధించి గురువారం సీఎం పేరిట బులెటిన్ విడుదలకాగా, దానితో తనకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో వారిద్దరి మధ్య పొసగటం లేదని స్పష్టమైంది. విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైనట్టా... కానట్టా... అన్న వివాదం తలెత్తినప్పుడు వీరిద్దరూ ఒకే మాటగా దానికి ఫుల్స్టాప్ పెట్టారు. ఈ నెల 17న బీఏసీ సమావేశంలో చర్చ మొదలైనట్టేనని, దాన్ని వివాదం చేయడం సరికాదని సీఎంతో పాటు స్పీకర్ కూడా అంగీకరించారు. అయితే గురువారం మండలిలో, ఆ తర్వాత విలేకరులతో కిరణ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విభజన బిల్లుపై అసలు చర్చే మొదలుకాలేదని మాట మార్చారు. స్పీకర్ను ఇరకాటంలో నెట్టడానికే సీఎం అలా మాట్లాడారని చర్చ జరిగింది. అలాగే బీఏసీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి సభ్యుడు తన అభిప్రాయాన్ని చెప్పాలని భావిస్తున్నందున, రాష్ట్రపతి గడువిచ్చిన జనవరి 23 వరకు సమావేశాలు జరగాలని కోరారు. ఆ మేరకు స్పీకర్ 23 వరకు సమావేశాలను నిర్వహించడానికి నిర్ణయించి వివరాలను సీఎం పేరుతో బులెటిన్ జారీ చేశారు. ఆ బులెటిన్ను గురువారం శాసనసభ వాయిదా పడే సమయానికి ఎమ్మెల్యేలందరికీ పంపిణీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో బులెటిన్ విషయం ప్రస్తావించగా... ఆ విషయం తనకు తెలియదని, దాంతో తనకసలు సంబంధమే లేదని చెప్పారు. జనవరి 23 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో చెప్పిన మాట నుంచి తప్పించుకోవడానికే సీఎం ఈ రకంగా మాటమార్చుతున్నారని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. బీఏసీలో ఖరారైన ఎజెండా శాసనసభ కార్యదర్శి పేరుతోనే బులెటిన్ జారీ అవుతుందని, ముఖ్యమంత్రి పేరుతో విడుదల కావడమేమిటన్న చర్చ జరిగింది. అయితే ఎజెండా ఖరారు చేసేది సభా నాయకుడే అయినందున ఆయన పేరుతో బులెటిన్ జారీ అయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమావేశాలకు ముందు కూడా అసెంబ్లీని ప్రొరోగ్ చేసే అంశంలోనూ స్పీకర్, సీఎంల మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. సభాపతులే స్పష్టత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సభల్లో ఏ విధంగా చర్చించాలనే అంశంపై శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మండలిలో మాట్లాడారు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశం మన సభల్లో ఇప్పటిదాకా చర్చకు రాలేదు. ఈ బిల్లుపై చర్చించేప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరు ప్రాంతాల వారిని నొప్పించని రీతిలో భాష విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు రావు. ఉద్రేకాలకు లోనవకుండా మాట్లాడాలి. సంప్రదాయాల ప్రకారం చర్చ ఎలా జరగాలో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ప్రధానంగా రెండు అంశాలపై చైర్మన్, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగానికి, చట్టానికి, సంప్రదాయాలకు లోబడి చర్చలు కొనసాగించాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆయా రాష్ట్రాల చట్ట సభల్లో చర్చలకు ఎలాంటి విధానం అనుసరించారో, అక్కడేం జరిగిందో తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2000, బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మన ముందున్నాయి. ఈ రెండు పెద్ద రాష్ట్రాల విభజనకు ఆయా రాష్ట్రాల చట్టసభల్లో ఏం చేశారనే అంశాలను తర్జుమా చేసి కాపీలు మీకు పంపుతున్నాను (ఉత్తరాంచల్ ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ సభలో అసెంబ్లీలో అనుసరించిన విధానంలో ఒక అంశాన్ని ఈ సందర్భంగా కోట్ చేశారు). వీటిని అధ్యయనం చేసి, మరోసారి మండలి సలహా కమిటీలో చర్చించి బిల్లుపై చర్చకు సంబంధించి స్పష్టత ఇవ్వండి. అందుకోసమే మీకు (చైర్మన్కు) ఈ కాపీలు పంపుతున్నాను’’ అని పేర్కొన్నారు. చర్చకు స్పష్టత ఇవ్వాలి: యనమల కిరణ్ ప్రసంగిస్తుండగా, సభను ఎలా జరపాలనే అంశంపై చైర్మన్కు సీఎం అప్పీల్ చేయరాదంటూ విపక్ష నేత యనమల రామకృష్ణుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. చర్చ చాలా సున్నితమైనదేనని, కాబట్టి దానిపై ఎలా వ్యవహరించాలో సీఎం స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు. -
పాపిష్టి పనులకు కేరాఫ్ చంద్రబాబే!
హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంట నీరు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘ స్పీకర్ రాజ్యాంగ బద్ధుడు. రాష్ట్రపతి, గవర్నర్ తరహాలో స్పీకర్ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తారు. రాష్ట్రపతి పంపిన నోట్ను స్పీకర్గా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆయన విధి. అసలు ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్ను ఉపయోగించారు’ అని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు సమన్యాయం అంటున్నాడని.. సమన్యాయం అంటే కృష్ణా నదిని ఆ పక్కనుంచి ఈ పక్కకు రెండుగా చీల్చి సమంగా పంచుతారా? అని ప్రశ్నించారు. -
జనవరి 3వరకు శాసనసభ వాయిదా
హైదరాబాద్ : గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు జనవరి 3వ తేదీకి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో సమావేశమైన సభ...ఒక్క నిమిషంలోనే ముగిసింది. స్పీకర్ సభలోకి వచ్చేసరికే సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు. జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. ఈ దశలో సభను వచ్చేనెల మూడు వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరో వైపు జనవరిలో జరిగే సమావేశాలను అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. జనవరి మూడు నుంచి 10 వరకు, తర్వాత జనవరి 16 నుంచి 23 వరకూ మలిదఫా సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. ఆదివారాలు, సంక్రాంతి సెలవు దినాలను మినహాయిస్తే సభ మొత్తం మలివిడతలో 13 రోజులు సాగనుంది. కాగా ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. సరిగ్గా నిమిషం పాటు సభ సాగింది. స్పీకర్ సభలోకి వచ్చేటప్పటికీ సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు. జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. విభజనకు సంబంధించి ఆవేదన ఉంటుందని... దాన్ని వ్యక్తం చేసేందుకు సమయం ఇస్తామని స్పీకర్ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. దయచేసి సభ సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాని సభ్యులెవ్వరూ శాంతించకపోవడంతో... స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. -
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
-
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని టీడీపీ , తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా శాసనసభ సమావేశాలు నేటితో నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
‘విభజన’ సమాచారాన్ని సిద్ధం చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చల రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి బుధవారం సచివాలయంలో 20 ప్రధాన శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని షెడ్యూళ్లను లోతుగా పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అధికారులను ఆదేశించారు. విభజన చేయాల్సి వస్తే బిల్లులోని అంశాల వారీగా ఏయే శాఖలు ఏ చర్యలు చేపట్టాల్సి వస్తుందనే వివరాలను రూపొందించాలని సూచించారు. బిల్లులో పేర్కొన్నట్లుగా ఆస్తులు, అప్పులతో పాటు అన్ని అంశాల్లో జిల్లాల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా పేర్కొన్నారు. విభజన బిల్లులోని షెడ్యూళ్లలో ఏవైనా తప్పులు, లోపాలుంటే వాటిని గుర్తించి.. శాఖల వారీగా నోట్లను సిద్ధం చేయాలని మహంతి అధికారులకు సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపిన సమాచారం ఏమిటి? బిల్లులో పేర్కొన్న సమాచారం ఏమిటి? అనే అంశాలను పరిశీలించి ఏవైనా వ్యత్యాసాలుంటే వాటిని పొందుపరుస్తూ నోట్ను రూపొందించాలని సూచించారు. ఈ మేరకు 20 ప్రధాన శాఖల ఉన్నతాధికారులకు విభజన బిల్లు ప్రతులను సీఎస్ అందజేశారు. బిల్లులోని షెడ్యూళ్లను లోతుగా అధ్యయనం చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. కేంద్ర హోంశాఖ పంపిన విభజన బిల్లులో అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించడం సాధ్యం కాదని.. అలా చేస్తే ప్రివిలేజ్ మోషన్ కిందకు వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తిస్తే సీఎం, మంత్రులు సభలో చెబుతారని.. అలాగే కేంద్ర ప్రభుత్వానికి విడిగా నోట్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. కాగా.. బిల్లులోని పలు అంశాలు అసమగ్రంగా ఉన్నాయని.. వాటిని అమలు చేస్తే ఉత్పన్నమయ్యే పర్యవసానాల సమాచారం ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరారు. దాంతో ఆ అంశాలపై వివరాలను సిద్ధం చేయాల్సిందిగా స్పీకర్ మనోహర్ సీఎస్కు సూచించారు. మొత్తం సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోగా అన్ని శాఖలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
పాపిష్టి పనులకు కేరాఫ్ బాబే! :నాదెండ్ల భాస్కరరావు
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరోజు ఓ జడ్జి నా దగ్గరికి వచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. టీడీపీ ఎన్టీఆర్దేనని ఇంటికొచ్చి జడ్జిమెంటు రాయించుకున్నారని, అంతకంతా తాను అనుభవిస్తున్నట్లుగా చెప్పి ఏడ్చాడు. నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్దని తీర్పు చెప్పినందుకు 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆ జడ్జికి ఎమ్మెల్యే టికెట్టు, మంత్రి పదవి ఇచ్చి మాజీ సీఎం జలగం వెంగళరావు ఇంటి ముందు నివాసం పెట్టించారు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టిన పార్టీకి ఇప్పుడు అధినేతగా ఉన్న చంద్రబాబు తనపై మతిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడూ సత్యం చెప్పకుండా పాపిష్టి పనులు చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. బుధవారం తన నివాసంలో భాస్కరరావు విలేకరులతో మాట్లాడారు. డీల్ కుదుర్చుకున్నారని స్పీకర్ను విమర్శిస్తున్న బాబుకే డీల్స్ వ్యవహారం బాగా తెలుసునన్నారు. చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్, తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘రాష్ట్రపతి పంపిన నోట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం స్పీకర్ విధి. ఆర్టికల్ 365 గురించి నీకు తెలుసా? రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్ను ఉపయోగించారు’ అని చెప్పారు. ‘ఎన్టీఆర్తో విభేదాలు వచ్చినప్పుడు 95 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిస్తే నేను సీఎం అయ్యాను. వారిని నేను బలవంతపెట్టలేదు. ఎమ్మెల్యేలను దాచింది నువ్వు’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ బిల్లులో పస లేదని, విభజన జరగదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో ఉందన్నారు. విభజనను అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జాతీయ స్థాయిలో నేతలను కలవడం మంచి పరిణామమని భేటీ అనంతరం విలేకరులతో ఇష్టాగోష్టిలో భాస్కరరావు వ్యాఖ్యానించారు. -
.. చర్చ మొదలైనట్లే: మనోహర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో సోమవారం చర్చ ప్రారంభమైనట్లా? కాదా? అనే సందేహాలకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెరదించారు. విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లేనని, దీనిపై సాంకేతిక అంశాల జోలికి వెళ్లాల్సిన పనిలేదని వివరణ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన బీఏసీ సమావేశంలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ‘‘సోమవారం సభలో జరిగిన గందరగోళం మధ్య ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే బిల్లుపై చర్చను ప్రారంభించామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు ప్రకటించారు. సీమాంధ్ర మంత్రులు మాత్రం చర్చ ప్రారంభం కాలేదని చెప్తున్నారు. పరస్పరం పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు వివరణ ఇవ్వండి. నిబంధనల ప్రకారం చెప్పండి’’ అని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. ‘‘బిల్లుపై చర్చ మొదలైనట్లే. ఈ విషయంలో సాంకేతిక అంశాల జోలికి వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే చర్చ జరిపేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. నేను కూడా సాఫీగా చర్చ జరగాలని, సభ్యులందరూ తమ అభిప్రాయాలను విన్పించాలని కోరుకుంటున్నా’’అని బదులిచ్చారు. ఇదిలావుంటే.. సోమవారం శాసనసభలో విభజన బిల్లుపై చర్చ ప్రారంభిస్తున్న సందర్భంగా సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క విషయంలో జరిగిన సంఘటనలను బీఏసీ ఏకగ్రీవంగా ఖండించింది. జరిగిన ఘటన దురదృష్టకరమైనదిగా పేర్కొంటూ.. ఇలాంటి సందర్భాల్లో సభ్యులు సభ మర్యాద, గౌరవాన్ని కాపాడాల్సి ఉందని బీఏసీ భావించినట్టు శాసనసభ కార్యదర్శి ఎస్.రాజాసదారాం ఒక ప్రకటనలో తెలిపారు. -
నేడు బీఏసీ సమావేశం
భేటీలో తేదీ ఖరారయ్యాకే విభజన బిల్లుపై చర్చ సీమాంధ్ర నేతలకు స్పీకర్ నాదెండ్ల స్పష్టీకరణ .. సభ తీరు నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ.. సాయంత్రం మండలి బీఏసీ చర్చ మొదలైందన్న శ్రీధర్ తీరుపై సీమాంధ్ర నేతల అసంతృప్తి ప్రసంగాన్ని పరిశీలించిన సీఎం, మంత్రులు తెలంగాణ ముసాయిదా బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందా, లేదా అన్న అంశంపై పార్టీలకు అతీతంగా సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు, నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం సాగుతున్న నేపథ్యంలో... సభలో చర్చ ఇంకా ప్రారంభం కాలేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో తేదీని నిర్ణయించాకే దానిపై చర్చను చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారని తెలిసింది. ఈ వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు తదితర నేతలు స్పీకర్ను సంప్రదించారు. దాంతో ఆయన అధికారులతో సభ రికార్డులు పరిశీలింపజేశారని, చర్చ ప్రారంభం కాలేదని తేల్చారని సమాచారం. ‘‘బీఏసీ సమావేశంలో తేదీని నిర్ణయించాకే చర్చ ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బీఏసీని నిర్వహిస్తున్నాం’’ అని వారికి స్పీకర్ వివరించినట్టు సమాచారం. అంతేగాక సోమవారం మధ్యాహ్నం సభలో జరిగినవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని కూడా ఆయన అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ మల్లు భటి ్ట విక్రమార్క సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించినప్పుడు ఆయన, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు చేసిన ప్రసంగాలను కూడా కిరణ్, మంత్రులు పరిశీలించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభిస్తున్నట్టుగా కాకుండా, ‘బిల్లుపై చర్చను ప్రారంభించాలా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు తెలుసుకొనే రీతిలోనే’ సభ సాగిందని తేల్చారు. అంతేగాక బీఏసీని సమావేశపరచకుండానే చర్చను ఎలా చేపడతారని కూడా మంత్రులు ప్రశ్న లేవనెత్తారు. దీనిపై శ్రీధర్బాబు తీరును పలువురు సీమాంధ్ర మంత్రులు తప్పుబట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ‘‘ముసాయిదా బిల్లుపై చర్చను చేపట్టే అంశంలో సభ్యులను డిప్యుటీ స్పీకర్ అభిప్రాయాలు అడిగారు. అందులో భాగంగానే శ్రీధర్బాబు మాట్లాడారు. బీఏసీ పెట్టి బిల్లుపై చర్చ తేదీని ఖరారు చేయాలని కూడా శ్రీధర్బాబే తన ప్రసంగంలో చెప్పారు. దీన్ని బిల్లుపై చర్చగా ఎలా భావిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. మంత్రి శైలజానాథ్ కూడా బిల్లుపై చర్చ జరిగిందనడాన్ని ఖండించారు. ‘‘చర్చ ఎక్కడ జరిగింది? కనీసం బిల్లును టేబుల్ చేయకుండానే చర్చను ఎలా ప్రారంభిస్తారు? బిల్లును ఈ రోజే ఇచ్చి, సభ్యులు చదవకుండానే చర్చను ప్రారంభిస్తారా? ఇదేం పద్ధతి?’’ అంటూ మండిపడ్డారు. మరోవైపు మంగళవారం సాయంత్రం శాసనమండలి బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
సభలో బిల్లు
గందరగోళం మధ్యే సభ ముందుకు బిల్లు స్పీకర్ అనుమతితో ప్రవేశపెట్టిన కార్యదర్శి బిల్లును చర్చకు చేపట్టాల్సిందిగా కోరిన శ్రీధర్బాబు చర్చ మొదలెట్టాలంటూ బాబును ఆహ్వానించిన మల్లు నిరసనలు మిన్నంటడంతో అసెంబ్లీ నేటికి వాయిదా చర్చ మొదలైందా, లేదా అన్నదానిపై సందిగ్ధం మొదలైందన్న సభా మంత్రి, డిప్యూటీ స్పీకర్ కాలేదంటున్న సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా చెరోవైపు మోహరించిన ఎమ్మెల్యేలు బిల్లు చించేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. వారిపై దాడికి యత్నం.. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల హోరు సభ లోపల, వెలుపల, మీడియా పాయింట్ వద్దా ఘర్షణ స్పీకర్ను చాంబర్లో దిగ్బంధించిన సీమాంధ్ర సభ్యులు సభలో డిప్యూటీపైకి బిల్లు ప్రతులు విసిరేసిన వైనం ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లును శాసనసభ్యుల తీవ్ర నిరసనల మధ్య సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉదయం సభ సమావేశమైనప్పటి నుంచి సాయంత్రం వాయిదా పడేదాకా ప్రాంతాలవారీగా సభ్యుల మధ్య ఆద్యంతం తీవ్ర గందర గోళం, అంతకుమించిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతటి కీలక సమయంలో సభా నాయకుడైన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, విపక్ష నేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ముగ్గురూ సభకు గైర్హాజరు కావడం విస్మయం కలిగించింది. మరోవైపు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా విభజన బిల్లుపై ముందుకెళ్లడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. సభ్యుల తీవ్ర గందరగోళం మధ్యే బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ ముందుంచారు. దానిపై సభలో చర్చ మొదలైందని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బిల్లుపై చర్చ చేపట్టారు. దానిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా విపక్ష నేత బాబును మల్లు ఆహ్వానించారు. కానీ బాబు స్పందించకపోవడం, సభ్యుల నిరసనలు, గందరగోళం మిన్నంటుతుండటంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. బిల్లుపై చర్చ మొదలైందని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, అదేమీ లేదని, దాన్ని తాము గుర్తించడం లేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎవరి వాదన వారు విన్పించారు. సభా వ్యవహారాల సలహా సంఘాన్ని (బీఏసీ) సమావేశపరిచి చర్చకు తేదీని నిర్ణయించాలని సీమాంధ్ర సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు సోమవారం రాత్రి కిరణ్తో సమావేశమైన అనంతరం సీమాంధ్ర ప్రాంత మంత్రులు కూడా బిల్లుపై సభలో చర్చ మొదలు కానే లేదని ప్రకటించారు. దాంతో అసలు బిల్లుపై చర్చ మొదలైనట్టా, లేదా అన్న విషయంలో తీవ్ర సందిగ్ధం, అయోమయం నెలకొన్నాయి. ఇంకోవైపు సభ వాయిదా పడ్డాక కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీమాంధ్రకు చెందిన టీడీపీ సభ్యులు అర్ధరాత్రి దాకా సభలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, సోమవారం ఈ మొత్తం ఎడిసోడ్లో టీడీపీ ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి ఒక్కటే మరో ఎత్తుగా నిలిచింది. రోజంతా టీడీపీకి చెందిన తెలంగాణ సభ్యులతో ఒకలా, సీమాంధ్ర సభ్యులతో మరోలా చంద్రబాబు వ్యవహరిస్తూ తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి ప్రదర్శించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు సోవువారం శాసనసభను తీవ్రంగా కుదిపేసింది. సభ లోపల, వెలుపల పరిస్థితి అచ్చం రణరంగాన్నే తలపించింది. ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా, ప్రాంతాలవారీగా చెరోవైపు మోహరించారు. అసెంబ్లీ లోపలా, బయుటా వారి మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం గంటల తరబడి కొనసాగింది. సభ లోపలే గాక మీడియూ పారుుంట్ వద్ద కూడా సభ్యుల నడువు తోపులాట, వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. ప్రాంతాల వారీగా చీలిపోరుున ప్రజాప్రతినిధులు ఒక దశలో కొట్లాడుకుంటారేమో అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఉదయుం తొమ్మిది గంటలకు సభ ఆరంభం కాగానే మొదలైన నిరసనలు, బైఠారుుంపులు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగారుు. బిల్లుపై చర్చ జరగకుండా చూడాలని సీవూంధ్ర సభ్యులు, ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ మొదలయ్యేలా చేయుటానికి తెలంగాణ సభ్యులు ఎత్తుగడలకు పదును పెట్టారు. సభ ప్రారంభం కాగానే రోజులాగే సీవూంధ్ర సభ్యులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేయుడం మొదలు పెట్టారు. తమ వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టగా వాటిని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆ వెంటనే, బిల్లుపై తక్షణం చర్చ ప్రారంభించాలంటూ తెలంగాణ సభ్యులు సభను హోరెత్తించారు. కార్యక్రవూలు జరిగే పరిస్థితి లేకపోవడంతో సభను స్పీకర్ వారుుదా వేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ ఆరేపల్లి మోహన్ నాదెండ్లతో సమావేశమయ్యారు. వెంటనే బీఏసీ నిర్వహించి బిల్లుపై చర్చ ఆరంభించాలని డిమాండ్ చేశారు. మొదలవుతూనే గందరగోళం ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. ఈసారి సభలో పోడియుం వైపు సీవూంధ్ర సభ్యులు దూసుకురాకుండా ఉండేందుకా అన్నట్టుగా తెలంగాణ సభ్యులు స్పీకర్ చుట్టూ నిలబడ్డారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై సభ అభిప్రాయుం కోరుతూ రాష్ట్రపతి పంపిన లేఖను స్పీకర్ చదివారు. బిల్లును సభ వుుందుంచుతున్నట్టు ప్రకటించారు. బిల్లు తాలూకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ ప్రతులు సభ కౌంటర్ వద్ద ఉన్నాయని సభ్యులకు సూచించారు. అనంతరం స్పీకర్ ఆదేశం మేరకు బిల్లులోని ప్రధానాంశాలను అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం సభలో చదివి వినిపించారు. ఇదంతా జరుగుతున్నంతసేపూ సభ్యులంతా ఆందోళన చేస్తూనే ఉన్నా రు. బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన నినాదాలతో సీవూంధ్ర సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లారు. ఈలోపు స్పీకర్ ప్రకటన, అసెంబ్లీ కార్యదర్శి సంక్షిప్త ప్రస్తావన వుుగిశాయి. బిల్లు ప్రతులను సభ్యులకు అందుబాటులో ఉంచుతున్నావునీ, సాధారణంగా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు దీనికి వర్తించబోవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈలోపు గొడవ వురీ పెరిగిపోరుు సభ్యులు ప్లకార్డులను చించేదాకా వెళ్లడంతో సభ వారుుదా పడింది. రణరంగంగా మీడియా పాయింట్ బిల్లును సభ వుుందుంచుతున్న విషయూన్ని వుుందే ఎలా లీక్ చేశారంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ను ఆయన చాంబర్ లో ప్రశ్నించారు. సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తరవాత సభ వ్యవహారాలపై మంత్రులు ఆనం, రఘువీరా, పితాని, పార్థసారథి తదితరులు స్పీకర్తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు సభ బయుట పరిస్థితి వురింతగా దిగజారింది. మీడియూ పారుుంట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లు ప్రతుల్ని చింపేసి దహనం చేసి తవు నిరసన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ గండ్ర, టీఆర్ఎస్ సభ్యుడు గంగుల కవులాకర్ ఒక దశలో వైఎస్సార్సీపీ సభ్యులపై దౌర్జన్యానికి పూనుకున్నారు. అంతలో టీడీపీ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని బిల్లు ప్రతుల్ని చింపేశారు. టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో రెండు పక్షాల నడువు వాగ్వాదాలు, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. వురోవైపు శాసనవుండలిలోనూ సభ్యులు ఇలాగే ప్రాంతాలవారీగా చీలిపోరుు వాగ్వాదాలకు దిగారు. అక్కడ కూడా మీడియూ భేటీలో టీడీపీ, టీఆర్ఎస్ సభ్యుల నడువు తోపులాట జరిగింది. దాంతో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకువూరి కిందపడిపోయూరు. జర్నలిస్టులు సైతం... అసెంబ్లీ మీడియూ పారుుంట్ వద్ద కొన్ని చానళ్లు, పత్రికల జర్నలిస్టులు సైతం నాయుకులతో వాగ్వాదాలకు దిగారు. కొందరు టీవీ జర్నలిస్టులు దాడి చేశారని, వారిపై చర్య తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, గుర్నాథరెడ్డి, తెల్లం బాలరాజు, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు దాదాపు ఐదు గంటల విరామం తర్వాత చివరికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు స్పీకర్ కార్యాలయుంలో బైఠారుుంచి, నాదెండ్లను సభలోకి వెళ్లనీయకుండా దిగ్బంధించారు. దాంతో సభలోకి వెళ్లాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ మల్లుకు ఆయన సూచించారు. ఆ మేరకు సభలోకి వెళ్లబోయిన మల్లును టీడీపీ ఎమ్మెల్యే రామారావు అడ్డుకున్నారు. ఆయనను మల్లు తోసేశారు. అడ్డుకోబోయిన మిగతా సభ్యులను మార్షల్స్ పక్కకు తప్పించి మల్లును సభలో స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లారు. సభ ప్రారంభవుయ్యూక వుళ్లీ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. సీవూంధ్ర ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. బిల్లు ప్రతులు చించి పోడియుం వైపు వెదజల్లారు. మల్లుపైకీ విసిరేశారు. పోడియం టేబుల్పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. స్పీకర్ స్థానం ముందున్న మైకులను లాగేశారు. జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు కూడా ప్లకార్డులతో పోడియాన్ని చుట్టుముట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పెకైక్కి నినాదాలు మొదలుపెట్టారు. శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి సహా మరికొందరు వైఎస్సార్సీపీ సభ్యులు బిల్లు ప్రతులను చించి స్పీకర్ స్థానంలో ఉన్న మల్లుపైకి విసరసాగారు. కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్ గుప్తా స్పీకర్ పోడియం టేబుల్పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆయనను పక్కకు తోసేశారు. స్పీకర్ ముందున్న మైకులను లాగేసిన కాపును టీఆర్ఎస్ సభ్యులు పక్కకు తోసేశారు. దాంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులను, బిల్లు ప్రతులను చించి మల్లుపైకి విసిరారు. అదే సమయంలో సభలోకి ప్రవేశించిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో స్పీకర్ స్థానంపైకి ప్లకార్డులు విసిరారు. దాంతో తెలంగాణ, సీమాంధ్ర సభ్యుల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గంగుల కమలాకర్ అసెంబ్లీ సిబ్బంది బల్లలపై నుంచి సీమాంధ్ర ఎమ్మెల్యేల మధ్యలోకి వెళ్లి వారిని తోసేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు: శ్రీధర్బాబు ఈ దశలోనే సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు కల్పించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయుం తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మన్మోహన్, సోనియాకు, రాహుల్గాంధీకి, కేంద్ర మంత్రుల బృందానికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలూ అంగీకరించాయి. ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చాక బీఏసీని పిలవాలని, బిల్లును సభలో ప్రవేశపెట్టాలని కోరుతూనే ఉన్నాం. ఇప్పుడు బిల్లును సభ ముందుంచి, దాన్ని చర్చకు చేపట్టే సమయంలో సభ్యులు ఇలా స్పీకర్ను అడ్డుకోవడం, గలభా సృష్టించడం విచారకరం. తెలంగాణ ఏర్పాటు కోసం 60 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. బిల్లును తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, సభ్యుల అభిప్రాయాలు తెలియజేయడానికి బిల్లుపై చర్చ ప్రారంభించాలని మల్లును కోరారు. ఆయన అందుకు సమ్మతించి, చర్చ ప్రారంభించాలని విపక్ష నేత బాబును ఆహ్వానించారు. కానీ బాబు తన స్థానం నుంచి లేవకపోవడం, సభ్యుల నిరసనలతో గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొనడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ, సీమాంధ్రకు చెందిన టీడీపీ సభ్యులు సోమవారం అర్ధరాత్రి వరకూ అసెంబ్లీలోనే బైఠాయించారు. -
దాడిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
-
దాడిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సభాపతి నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారు. టీ.కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు మీడియా ప్రతినిధులు కూడా తమపై దాడికి పాల్పడినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్.... మీడియా ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ .... పోలీసు ఉన్నతాధికారులను తన ఛాంబర్కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. తక్షణమే బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. -
అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్
హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ మరోసారి అరగంటపాటు వాయిదా పడింది. అంతకు ముందు వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ కార్యదర్శి సదారాం బిల్లులోని అంశాలను చదివి వినిపించారు. శాసనసభ వెబ్సైట్లో బిల్లు ప్రతిని ఉంచామని, తెలుగు, ఉర్దూ అనువాద ప్రతులను సభ్యులకు అందుబాటులో ఉంచినట్లు స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. తమ నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. దాంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. ఇక శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో మండలి ఛైర్మన్ చక్రపాణి సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో గంట పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ పోడియం వద్ద ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సీమాంధ్ర సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా గళం విప్పారు. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. చేసేదిలే్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను గంటపాటు వాయిదా వేశారు. కాగా, విపక్షాల వాయిదా తీర్మానాలన్నింటిని స్పీకర్ తిరస్కరించారు. -
ఏం చేద్దాం? ఎలా చేద్దాం?! :నాదెండ్లమనోహర్
విభజన బిల్లుపై స్పీకర్ నాదెండ్ల ఎడతెరపిలేని మంతనాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చేరడంతో తదుపరి చర్యలపై స్పీకర్ నాదెండ్లమనోహర్ తీవ్ర తర్జనభర్జనలు సాగిస్తున్నారు. అసెంబ్లీలో దీనిపై చర్చను ఏరీతి న చేపట్టాలో న్యాయనిపుణులు, రాజ్యాంగ కోవిదులతో సంప్రదింపులు ప్రారంభించారు. శాసనసభకు బిల్లు ప్రతులు రాకముందునుంచే ఆయన దీనిపై ఆయా వర్గాలకు చెందిన ముఖ్యులతో మంతనాలు ప్రారంభించినా.. శుక్రవారం ప్రభుత్వం నుంచి అధికారికంగా బిల్లు తనకు చేరడంతో శనివారం దీనిపైనే దృష్టి పెట్టారు. బిల్లును సభలో ఎలా చర్చకు చేపట్టాలి? సభలో తలెత్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి? తాను ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉం టుందన్న అంశాలపై రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ విధివిధానాలను పరిశీలించారు. విభజన బిల్లుపై శాసనసభ్యులు రెండుగా చీలిన తరుణంలో అసెంబ్లీలో దీనిపై చర్చ కత్తిమీద సామేనన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను అనుసరించి మెజార్టీ సభ్యుల సూచనల మేరకు సభలో బిల్లును చర్చకు చేపట్టాల్సి ఉంటుందని స్పీకర్ అభిప్రాయపడుతున్నారు. అంతుచిక్కని సర్కారు వైఖరి తెలంగాణ బిల్లుపై చర్చ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందన్నది అంతుచిక్కడంలేదు. ఈ విషయంలో అసెంబ్లీ వర్గాలకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య సమన్వయం లేమి స్పష్టంగా కనిపిస్తోంది. సభలో కీలకాంశాలపై చర్చకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించే కార్యకలాపాలు దాదాపుగా ఖరారవుతుంటాయని, కానీ విభజన బిల్లు కావడంతో ఆయా పార్టీలనుంచి వచ్చే అభిప్రాయాలను అనుసరించి నడవాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత శాసనసభ సమావేశాలను ఏడు రోజులపాటు నిర్వహించాలని సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) లో నిర్ణయించారు. అందులో 7 రోజుల పని దినాలని తెలంగాణ నేతలు చెబుతుండగా మొత్తంగా 7 రోజులని, ఆ లెక్కన మరో 5 రోజులే పనిదినాలుంటాయని ఈ నెల 20తో సమావేశాలు ముగుస్తాయని అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 (2) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ నుంచి ఏదైనా బిల్లు లేదా సందేశం వచ్చినప్పుడు దాన్ని యథాతథంగా సభ ముందు పెట్టాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విభజన బిల్లు ‘రహస్యం’ (కాన్ఫిడెన్షియల్) అని పేర్కొన్నందున దాన్ని సభ ముందు పెట్టేంతవరకు ఎలాంటి మార్పుచేర్పులు, త ర్జుమాలు చేయడానికి వీలులేదు. ఒకసారి సభ ముందు పెట్టిన తర్వాతే అది పబ్లిక్ డాక్యుమెంట్గా పరిగణించాలి. సభ ముందుంచిన తర్వాత సభ్యుల అభిప్రాయం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు ఆంగ్లంలో ఉండగా, తెలుగు, ఉర్దూలో తర్జుమా కావాలని సభ్యులు కోరినా దానిపై స్పీకర్ మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలగుతారు. విపక్షాలను ఒప్పించాల్సిన బాధ్యత సీఎందే సభలో చర్చను ఎప్పుడు చేపట్టించాలన్న అంశంపై ప్రభుత్వానికి నిర్దిష్టంగా ఏమైనా అభిప్రాయాలు ఉంటే వాటికి అనుకూలంగా ఇతర పక్షాలను ఒప్పిం చుకోవాల్సిన బాధ్యత సభా నాయకుడిగా సీఎం కిరణ్పైనే ఉంటుందని అసెంబ్లీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు సీఎం నుంచి కానీ ప్రభుత్వంలోని ఇతర ప్రముఖులు కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేపట్టలేదు. ఇతర విపక్షాల మాట అటుంచి ప్రభుత్వంలోనే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. బీఏసీలోని తెలంగాణ మంత్రులు తక్షణమే చర్చకు చేపట్టాలని డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం ఉద్దేశం ఏమేరకు నెరవేరుతుందో అనుమానమేనంటున్నారు. బీఏసీలో ఎక్కువమంది సభ్యులనుంచి వచ్చే అభిప్రాయాలను అనుసరించి తాను నడచుకోవాలని స్పీకర్ భావిస్తున్నారు. బిల్లుపై చర్చ ఎప్పుడు, ఎన్ని రోజులు చేపట్టాలి? పార్టీల వారీగా ఎంత సమయం కేటాయించాలి? అనే అంశాలపై సభ్యులను అడిగి తెలుసుకొని మెజార్టీ సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటారని స్పీకర్ సన్నిహిత వర్గాలంటున్నాయి. వాటితో పాటు గతంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో విభజన బిల్లులపై ఆయా శాసనసభల్లో చర్చ జరిగిన తీరును, అనుసరించిన విధానాలను కూడా స్పీకర్ పరిశీలిస్తున్నారు. వీటినీ దృష్టిలో పెట్టుకొని చర్చపై ఆయన తుది నిర్ణయం తీసుకోవచ్చని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు కనుక దీనిపై జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్పీకర్ స్థానంపై ఎలాంటి విమర్శలూ ఉండకుండా చూసుకోవాలి. బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకొని రాష్ర్టపతికి పంపడమే సభాపతి విధి. సభ అభిప్రాయం ఎలా ఉన్నా, బిల్లుపై చర్చ సాగకున్నా, చివరకు ఆ బిల్లు తనకు చేరకపోయినా రాష్ట్రపతి దాన్ని శాసనసభ చర్చించినట్లుగానే భావించి కేంద్రానికి పంపిస్తారు. ఈ తరుణంలో బిల్లును సభలో ప్రవేశపెట్టడం, చర్చను సాఫీగా ముందుకు తీసుకువెళ్లడమన్నదే కీలకం. ఇదే విషయం బీఏసీలో కూడా స్పీకర్ స్పష్టంచేయనున్నారు’’అని అసెంబ్లీ వర్గాలు వివరించాయి. -
ఖద్దరు దుస్తుల్లో మార్షల్స్ మోహరింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలోనేగాక సమావేశం మందిరంలోనూ ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపుకానీ, ఇతరుల సీట్లవైపు కానీ వెళ్లకుండా అడ్డుకునేలా మార్షల్స్ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ లాబీల్లోనేగాక సమావేశ మందిరంలోపలా భారీఎత్తున మార్షల్స్ను మోహరించారు. గతంలో మార్షల్స్ను గుర్తుపట్టేందుకు వీలుగా ప్రత్యేక డ్రెస్సు, చేతులకు బ్యాడ్జీలను ధరించేలా చూసేవారు. ఈసారి అలా గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఏకంగా ఎమ్మెల్యేల్లో కలిసిపోయేలా ఖద్దరు దుస్తుల్లోనే వారిని సమావేశ మందిరంలోకి ప్రవేశపెడుతుండడం విశేషం. -
ముందుకు పడని అడుగు
చౌటుప్పల్, న్యూస్లైన్ :ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి ముహూర్తం కుదరడం లేదు. ఈ నెల రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని స్పీకర్ ప్రకటించినా ఆ దిశగా పనులేమీ జరగడం లేదు. అసలు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 8లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులున్నారు. సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్రావు 17మంది ఎమ్మెల్యేల బృం దంతో కలిసి గత ఏడాది జూలై 7, 8 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిం చారు. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, చలించిపోయారు. ఫ్లోరైడ్ శాశ్వత నివారణకు పాటుపడాలని తలంచారు. అందుకు ఫ్లోరైడ్పై మరిన్ని పరి శోధనలు అవసరమని భావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలిం చింది. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం మంజూరైంది. దీనిని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అవసరమయ్యే 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇక్కడే ఫ్లోరోసిస్ బాధితుల కోసం 75పడకల ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. రెండేళ్ల కాలంలో నిర్మాణాలన్నీ పూర్తయి సేవలు అందుబాటులోకి రావాలి. స్థల వివాదం.. మల్కాపురం శివారులోని సర్వే నంబర్ 486లో 10ఎకరాల ప్రభుత్వ భూమిని వాహనాల సామర్థ్య కేంద్రానికి, దీని పక్కనే మరో 5ఎకరాల భూమిని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించారు. సర్వేనంబరు 486, 399లలో 8క్రషర్ మిల్లులకు 88ఎకరాల భూమిని మైనింగ్ కోసం ప్రభుత్వం లీజుకిచ్చింది. మైనింగ్ నిబంధన ప్రకారం.. మిల్లులకు లీజుకు ఇచ్చిన భూమికి 500మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలకూ అనుమతించకూడదు. కాగా, ఓ క్రషర్ మిల్లుకు, వాహన సామర్థ్య కేంద్రానికి కేటాయించిన భూమి 500మీటర్ల లోపు ఉండడంతో ఆ క్రషర్ యజమాని రెండు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు వెహికిల్ ఫిట్నెస్ సెంటర్ పనులను నిలిపివేసింది. భూమి కేటాయింపుపై పునఃపరిశీలన చేస్తూ, నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అయితే ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించిన భూమి కూడా 500మీటర్ల లోపే ఉండడంతో పనులు ప్రారంభిస్తే క్రషర్ యజమానులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉన్నందున అధికారులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు వేరే స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నట్టు సమాచారం. రెండు నెలలవుతున్నా స్థల వివాదం పరిష్కారం కాకపోవడంతో ఈ నెల రెండో వారంలోనే ప్రారంభం కావాల్సి ఉన్న ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పనులు ప్రశ్నార్థకంగా మారాయి. స్పీకరు గారూ.. మీరే పట్టించుకోవాలి 70 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్రావు కృషితో జిల్లాలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటవుతోంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అత్యంత అవసరం. రెండు నెలలుగా స్థల వివాదం నెలకొన్నా, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థల వివాదాన్ని పరిష్కరింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.. -
అసెంబ్లీ భేటీకి భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు రానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు శాసనసభలో విభజన బిల్లుపై సభ్యులు మాట్లాడే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నందున సభా ప్రాంగణంలో మార్షల్స్ సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. తాజాగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, డీజీపీ ప్రసాదరావు, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్శర్మ, అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారు గంటపాటు కొనసాగిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేపడుతున్న చర్యలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఈసారి గత సమావేశాలకు భిన్నమైన వాతావరణంలో సమావేశాలు జరగనున్నందున బందోబస్తును పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గత సమావేశాల సందర్భంగా 25 ప్లటూన్ల పోలీసులను బందోబస్తుకు వినియోగించిన అధికారులు ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇక మార్షల్స్ను గతంతో పోలిస్తే రెండింతలు అధికంగా నియమించనున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాస్లున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లు మినహా మరే ఇతర సిబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. సమావేశానంతరం అనురాగ్శర్మ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థారుులో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. గతంతో పోలిస్తే ఈసారి బలగాలను పెంచుతున్నామని తెలిపారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, జూబ్లీహాల్ వ ంటి ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బీఏసీ సమావేశం రేపు: అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేసేందుకు శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సీఎం కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు, మంత్రులను డి.శ్రీధర్బాబు, ఆనం రామనారాయణరెడ్డిసహా అన్ని పార్టీల ఫ్లోర్లీడర్లు హాజరు కానున్నారు. శాసనసభను ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలోనే స్పష్టత రానుంది. సీఎం అతి తక్కువ రోజులు సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఒకవేళ సమావేశాలు జరుగుతున్న సమయంలో విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి వస్తే సమావేశాలు పొడిగించాలని యోచిస్తున్నారు. ఏదేమైనా వారం రోజుల్లోపే శాసనసభ సమావేశాలను ముగించాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. బీఏసీ భేటీ నాటికి విభజన బిల్లు రాష్ట్రానికి రాని పక్షంలో శాసనసభ సమావేశాల తొలిరోజు ఇటీవల కురిసిన వర్షాలవల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చ జరపాలని అధికారపక్షం భావిస్తోంది. చంద్రబాబు సైతం అందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి బీఏసీ సమావేశం కూడా బుధవారం సాయంత్రం 5.30 గంటలకు చైర్మన్ చక్రపాణి అధ్యక్షత జరగనుంది. -
అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ భద్రత: సీపీ
హైదరాబాద్ : శాసనసభ భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్తో డీజీపీ ప్రసాదరావు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరిస్తామని ఆయన తెలిపారు. సమావేశాల సమయంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు మించి నిర్వహించకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఈ నెల 12న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 15న (శనివారం) ముగించాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. విపక్షాలు గట్టిగా పట్టుపడితే మరో రోజు (అవసరమైతే ఆదివారం కూడా సభను కొనసాగించేలా) పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాల వ్యవధిలోనే విభజన బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది -
తెలంగాణ బిల్లు చర్చ తేదీపై బీఏసీదే తుది నిర్ణయం
బీఏసీని సమావేశపర్చనున్న స్పీకర్ నాదెండ్ల టీ బిల్లుపై చర్చకు ప్రభుత్వం రాష్ట్రపతిని అదనపు సమయం కోరే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన వ్యవహారం నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి జరుగనున్న శాసనసభ సమావేశాలు ఎన్నడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ అభిప్రాయానికి వస్తుందా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు మూడు నుంచి అయిదురోజుల పాటు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందులో వచ్చే సూచనలను అనుసరించే అసెంబ్లీ సమావేశపు రోజులుంటాయని శాసనసభ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే సభలోపల చర్చించాల్సిన అంశాలపై కూడా బీఏసీనే తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే ఇదంతా నిబంధనలను అనుసరించి బయటకు చెబుతున్న విధివిధానాలు మాత్రమే. అంతర్గతంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలను అనుసరించే అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. అసెంబ్లీ భేటీ అయిదు రోజులకే పరిమితమైతే ప్రస్తుత సమావేశాల్లో తెలంగాణ బిల్లు చర్చకు రావడం కష్టమన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. అయితే అంతిమంగా కేంద్రం కాంగ్రెస్ పార్టీ వేసే అడుగులపైనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రావడం, దానిపై చర్చ జరిగే తీరు ఆధారపడనుంది. కాగా రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే... స్పీకర్ సభావ్యవహారాల సలహా సంఘాన్ని సమావేశపరుస్తారని, ఆ భేటీలో తీసుకొనే తేదీలో బిల్లును అసెంబ్లీలో చర్చకు పెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుత సమావేశాల్లోపు రాష్ట్రపతినుంచి ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేదీ ఆసక్తికరంగానే మారుతోంది. కీలకమైన విభజన బిల్లుపై కూలంకషంగా చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున సభలో అభిప్రాయసేకరణకు తగినంత గడువు కావాలని రాష్ట్రపతికి విన్నవించాలని సీఎం కిరణ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులంటున్నారు. ప్రభుత్వ వినతిపై రాష్ట్రపతినుంచి వచ్చే స్పందనను అనుసరించి టీ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ ఆధారపడనుందని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారవ్వడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విభజన అంశం ఇరుపా్రంతాల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పరి స్థితి ఉండడం, దాని ప్రభావం అసెంబ్లీపై పడే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. -
ప్రొరోగ్ వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసనమండలి ప్రొరోగ్ వివాదం ముగిసింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాసిన లేఖకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ సంబంధిత పత్రాలను శనివారం ప్రభుత్వానికి పంపారు. మండలిని కూడా ప్రొరోగ్ చేస్తూ చైర్మన్ చక్రపాణి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రొరోగ్ అంశం సీఎం-స్పీకర్ వివాదంగా మారి తీవ్ర చర్చకు దారి తీయడం తెలిసిందే. చివరికి కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆర్డినెన్సుల జారీకి అడ్డంగా ఉందనే కారణంతోనే అసెంబ్లీని పొరోగ్ చేయాలంటూ లేఖ రాసినట్టు వివరించాయి. వివాదం సద్దుమణగడంతో ప్రొరోగ్ లేఖలను చైర్మన్, స్పీకర్ శనివారం ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. అయితే స్పీకర్ పంపిన ప్రొరోగ్ లేఖ శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ద్వారా సీఎంఓకు, అక్కడి నుంచి గవర్నర్కు చేరాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రొరోగ్తో అనుమానాలు: శ్రీధర్బాబు శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున సభను ప్రొరోగ్ చేయడం వల్ల అనేక సందేహాలు నెలకొనే అవకాశాలున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్పీకర్ సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడం వల్ల అపోహలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయవద్దని గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. సబ్సిడీ గ్యాస్కు ఆధార్ను అనుసంధానించే విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఆధార్ పొందటం వల్ల అన్ని విధాలా ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు. -
సీఎం కిరణ్ ఎత్తుగడ వికటించిందా?
-
స్పీకర్ ఆఫీస్కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
-
‘అసెంబ్లీ’ని అడ్డుకోవడం అసాధ్యం
ప్రొరోగ్ చేసినా సమావేశాలకు అడ్డంకేమీ కాదు రాష్ట్రపతి ఆదేశిస్తే వెంటనే సమావేశపరచాల్సిందే ఆ మేరకు నేరుగా గవర్నరే నోటిఫికేషన్ ఇవ్వొచ్చు స్పీకర్గా పని చేసిన కిరణ్కు ఇవన్నీ తెలుసు అయినా నాదెండ్లే లక్ష్యంగా ఉద్దేశపూర్వక లీకులు? {పొరోగ్ చేయడం లేదంటూ ముమ్మర ప్రచారం ‘సమైక్య’ ముసుగును కాపాడుకోవడమే లక్ష్యం మంగళవారమే ఫైల్ను ప్రభుత్వానికి పంపిన నాదెండ్ల అవిశ్వాసం’ వార్తలపై నాదెండ్ల వర్గం కన్నెర్ర స్పీకర్ ప్రతిష్టనే దిగజార్చే కుట్రంటూ ధ్వజం తీవ్రంగా తప్పుబడుతున్న మంత్రులు, నేతలు అవిశ్వాసం పెడితే స్పీకర్కు అండగా ఉంటాం: అనిల్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణను జాప్యం చేయడం ద్వారా తెలంగాణ బిల్లుపై కేంద్రం అభిప్రాయం కోరడాన్ని ఆలస్యం చేయడం సాధ్యమేనా? అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తే తిరిగి సమావేశపరచడానికి చాలా సమయం పడుతుందా? తెలంగాణ బిల్లుపై అభిప్రాయం కావాలని దేశ అత్యున్నత హోదాలో రాష్ట్రపతే కోరినా అసెంబ్లీని సమావేశపరచకుండా సాగదీయడానికి వీలవుతుందా? అంటే ఇవేవీ సాధ్యం కానే కావంటున్నారు నిపుణులు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ స్పీకర్ కార్యాలయానికి సీఎం కార్యాలయం పంపిన లేఖను ఉత్తుత్తి డ్రామాగా అభివర్ణిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను జాప్యం చేయించడం ద్వారా తెలంగాణ బిల్లుపై సభ అభిప్రాయాన్ని వాయిదా వేయించి, తద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్న రీతిలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తాజాగా చేసిన లీకులు ప్రస్తుతం రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయంగా మారాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్ను లక్ష్యంగా చేసుకునే ఈ లీకులు బయటకు వచ్చాయన్నది స్పష్టంగా అర్థమవుతూనే ఉందని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి! అసెంబ్లీని నిరవధిక వాయిదా (ప్రొరోగ్) చేయకపోవడం ద్వారా విభజన బిల్లుకు నాదెండ్ల సహకరిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడమే దీని వెనక కిరణ్ ఉద్దేశంగా కనబడుతోంది. విభజన వ్యవహారంలో అసెంబ్లీని వివాదంలోకి లాగిన కిరణ్, తాజాగా స్పీకర్ స్థానాన్ని కూడా వదలకపోవడంపై కాంగ్రెస్లోనే పెద్దపెట్టున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర విభజనపై అధిష్టానానికి సహకరిస్తూనే బయటకు సమైక్యవాదిగా ముద్రపడే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త ప్రచారానికి కిరణ్ తెర తీసినట్టుచెబుతున్నారు. తనకు దురుద్దేశాలను ఆపాదించేలా ఉద్దేశపూర్వకంగానే కిరణ్ శిబిరం ఇలా లీకులిస్తోందని నాదెండ్ల భావిస్తున్నారని సమాచారం. దాన్ని తిప్పికొట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సంబంధిత ఫైలును స్పీకర్ ఆగమేఘాలపై ప్రభుత్వానికి పంపేశారు. సభను ప్రొరోగ్ చేయాలంటూ మంగళవారమే ఫైలును ప్రభుత్వానికి పంపినట్టు అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. విస్తుపోతున్న కాంగీయులు: వాస్తవానికి అసెంబ్లీ ప్రొరోగ్ అయినా, కాకపోయినా సభను సమావేశపరచడానికి ఎలాంటి ఆటంకమూ ఉండదని అధికారులు చెబుతున్నారు. అందులోనూ స్వయానా రాష్ట్రపతి నుంచే ఆదేశాలు వస్తే, రాష్ట్ర కేబినెట్కు సిఫారసు ఉన్నా, లేకున్నా గవర్నరే నేరుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాదు.. అసెంబ్లీ సమావే శమై బిల్లుపై తన అభిప్రాయం చెప్పినా, చెప్పకపోయినా రాష్ట్రపతి నిర్ణీత గడువు వరకు ఎదురు చూసి, శాసనసభ అభిప్రాయం చెప్పినట్టుగానే భావిస్తూ విభజన బిల్లును కేంద్రానికి పంపవచ్చు. ఆయనకు ఆ అధికారం కూడా ఉంది. అనంతరం అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండానే కేంద్రం పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవచ్చు. స్పీకర్గా పని చేసిన కిరణ్కు ఈ విషయాలన్నీ తెలిసి కూడా ప్రొరోగ్ వివాదాన్ని రేపిన తీరుపై కాంగ్రెస్ నేతలే విస్తుపోతున్నారు. ప్రభుత్వం సిఫార్సు చేస్తేనే ప్రొరోగ్: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జూన్ పదో తేదీతో ముగిశాయి. సమావేశాలు ముగిసిన వారం, పది రోజుల్లో ప్రభుత్వ సూచన మేరకు స్పీకర్ ప్రొరోగ్ ఉత్తర్వులు ఇస్తారు. ఆ మేరకు ప్రభుత్వం గవర్నర్కు నివేదిస్తుంది. ప్రభుత్వ సిఫార్సు మేరకు అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడుతున్నట్టుగా గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇవీ నిబంధనలు. అసెంబ్లీ ప్రొరోగ్ అయినట్టు గవర్నర్ ప్రకటించాక సభను తిరిగి సమావేశపరచాలంటే మామూలుగా అయితే కేబినెట్ సూచన మేరకు మళ్లీ గవర్నరే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రొరోగ్ కాకుండా ఉంటే ప్రభుత్వ సిఫార్సు మేరకు ఏ సమయంలోనైనా అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ నేరుగా ప్రారంభించవచ్చు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ ప్రొరోగ్ కావాలంటే ప్రభుత్వ సిఫార్సు తప్పనిసరి. స్పీకర్ తనంతట తాను నేరుగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయినా కిరణ్ మాత్రం ‘స్పీకర్ ప్రొరోగ్ చేయడం లే’దంటూ నింద తనపైనే పడేలా లీకులివ్వడంపై నాదెండ్ల తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఇన్ని నెలలూ ఏం చేశారు: ప్రొరోగ్ చేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి 15 రోజుల క్రితం మాత్రమే లేఖ వచ్చిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అది వచ్చిన రెండో రోజు నుంచీ రచ్చబండ తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్పీకర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సోమవారమే హైదరాబాద్కు వచ్చారని పేర్కొంటున్నాయి. ఈ లోగానే, అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కిరణ్ లీకులిచ్చారని నాదెండ్ల వర్గీయులు మండిపడుతున్నారు. ‘‘చూస్తుంటే నాదెండ్లపై కిరణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. ప్రొరోగ్కు నిర్ణయం తీసుకోవాల్సింది నిజానికి ప్రభుత్వమే. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడి ఐదు నెలలు కావస్తున్నాయి. మరింతకాలం సీఎం ఎందుకు నోరు మెదపలేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు. ముదురుపాకానికి విభేదాలు తాజా వివాదంతో స్పీకర్ మనోహర్, సీఎం కిరణ్ల మధ్య విభేదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. కిరణ్ స్పీకర్గా, మనోహర్ డిప్యూటీ స్పీకర్గా ఉండగా కూడా ఇద్దరి మధ్యా ఉప్పు నిప్పుగానే ఉండేదని నేతలు గుర్తు చేస్తున్నారు. మనోహర్ స్పీకర్ అయ్యాక సీఎం కిరణ్తో ఆయనకు దూరం మరింత పెరిగింది. అసెంబ్లీకి సంబంధించిన పలు అంశాల్లో అవి బయటపడుతూనే వస్తున్నాయి. ఇక అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం అంశం వాటిని మరింతగా పెంచింది. బిల్లును సభలో అడ్డుకోవడం ద్వారా విభజనను నిలువరిస్తామని కిరణ్ పలుమార్లు చెబుతూ సమైక్యవాదాన్ని వినిపించే ప్రయత్నం చేయగా స్పీకర్ దాన్ని పరోక్షంగా ఖండించారు. ‘విభజన బిల్లుపై అసెంబ్లీ పాత్రేమీ ఉండబోదు. బిల్లుపై అభిప్రాయాలు సేకరించి పంపడమే తప్ప ఓటింగ్ వంటి ప్రక్రియలకు తావే లేదు’ అని స్పష్టం చేశారు. దాంతో నాదెండ్ల-కిరణ్ విభేదాలు తారస్థాయికి చేరాయి. సభా నాయకుడినైన తనతో సంబంధం లేకుండానే బిల్లుపై చర్చ అంశాన్ని స్పీకర్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని గ్రహించిన కిరణ్, ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రొరోగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి వివాదం రేపారని మనోహర్ సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇది స్పీకర్ను బెదిరించి లొంగదీసుకోవాలన్న దుర్బుద్ధితో చేసినదేనంటూ మండిపడుతున్నారు. ‘‘స్పీకర్ పంపిన ప్రొరోగ్ ఫైలును ప్రభుత్వం గవర్నర్కు పంపుతుంది. కానీ ఆయన ప్రొరోగ్ చేయకుండా ఆలస్యం చేస్తే ఏం చేయగలుగుతుంది? స్పీకర్గా ఉన్నందున మనోహర్పై బురదజల్లాలని చూస్తున్నారు. కానీ గవర్నర్ను ఏమనగలరు?’’ అని మనోహర్ అనుయాయులు ప్రశ్నిస్తున్నారు. ‘అయినా ప్రొరోగ్ ఫైల్ను స్పీకర్ ఆమోదించి పంపలేదంటూ కిరణ్ లీకులివ్వడం ఒకరకంగా బెదిరించడమే. అయినా కిరణ్ ఎన్ని వందల ఫైళ్లను పెండింగ్లో ఉంచడం లేదు’’ అంటూ వారు మండిపడుతున్నారు. అవిశ్వాసం పెట్టినా ఆగదు స్పీకర్పై అవిశ్వాసం పెట్టేం దుకు కిరణ్ వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా మనోహర్వర్గం మండిపడుతోంది. ఇది పూర్తిగా స్పీకర్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చే కుట్రేనని ఆరోపిస్తోంది. అసలు అవిశ్వాసానికి ప్రాతిపదిక ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘నిజంగా అవిశ్వాసం పెట్టినా మహా అయితే సభాధ్యక్ష స్థానంలో స్పీకర్ ఉండరంతే. సభను విధిగా సమావేశ పరచాల్సి ఆ బాధ్యతలను వస్తే డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క చేపడతారు. ఆయన కాకపోతే ప్యానెల్ స్పీకర్ల ద్వారానైనా సభను ముందుకు నడిపించే అవకాశముంటుంది’’ అని గుర్తు చేస్తున్నారు. ‘అంతిమంగా సభ అభిప్రాయం వచ్చినా రాకున్నా రాష్ట్రపతి ముసాయిదా విభజన బిల్లును ఆమోదించి కేంద్రానికి తిరిగి పంపించే ఆస్కారముంది. అలాంటప్పుడు అసెంబ్లీలో ఏదో చేస్తేస్తామని కిరణ్ చెప్పడం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే’ అని విమర్శిస్తున్నారు. విభజనను సుగమం చేసే ఎత్తుగడ? అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదంటూ స్పీకర్ను తప్పుబట్టేలా కిరణ్ వర్గీయులు చేస్తున్న ప్రచారం వెనక నాదెండ్లను అప్రతిష్టపాలు చేయడంతో పాటు విభజన వ్యవహారాన్ని సాఫీగా ముందుకు తీసుకుపోయే ఎత్తుగడ కూడా దాగుందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయా ప్రాంతాల నేతలు వినిపించే వాదనలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి అవకాశం ఎవరికీ దక్కకుండా గందరగోళ పరిస్థితులు సృష్టించి, తద్వారా అసలు బిల్లుపై అభిప్రాయ సమావేశమే జరగకుండా నేరుగా రాష్ట్రపతి పార్లమెంట్కు సిఫార్సు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది. కిరణ్ రాజీనామా చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గవర్నర్కు అధికారముంది ప్రొరోగ్ అయిన అసెంబ్లీని తిరిగి సమావేశపరచాలని గవర్నర్ తనంతట తానుగా కూడా స్పీకర్ను కోరవచ్చు. ఆయనకు ఎవరూ సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో గవర్నర్కు రాజ్యాంగం పలు అధికారాలను కల్పించింది. అసెంబ్లీని సమావేశపరిచే విషయంలో ఆయన తన విచక్షణాధికారాల ఆధారంగా ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు - ఎల్.రవిచందర్, సీనియర్ న్యాయవాది మంత్రివర్గం పాత్రేమీ ఉండదు అసెంబ్లీ ప్రొరోగ్ అయి ఉన్నప్పుడు తెలంగాణ బిల్లుపై చర్చ కోసం సభను సమావేశపరచాలని గవర్నర్ను కోరే విశిష్ట, ప్రత్యేక అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. ఆ మేరకు గవర్నర్ నేరుగా నోటిఫికేషన్ జారీ చేయొచ్చు. అందుకోసం మంత్రిమండలిలో చర్చించాల్సిన అవసరం లేదు. మంత్రిమండలికి ఏ పాత్రా ఉండదు. పైగా ఆ సమావేశాల్లో కేవలం ఎజెండాలోని విషయంపై చర్చకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. పైగా కావాలనుకుంటే అసెంబ్లీ తీర్మానం లేకుండానే బిల్లును పార్లమెంట్కు రాష్ట్రపతి పంపవచ్చు. ఈ విషయంలో అధికరణ 3 ఎంతో స్పష్టతనిచ్చింది. - పి.గంగయ్యనాయుడు, సీనియర్ న్యాయవాది -
రైతులకిచ్చే సబ్సిడీ అభివృద్ధి ఖర్చే
ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగింపు సమావేశంలో స్పీకర్ మనోహర్ సదస్సు సిఫారసుల అమలుకు కృషి: మంత్రి కన్నా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సబ్సిడీలను సంక్షేమ పథకాల వ్యయంలో భాగంగా చూడటం తగదని, ఈ ఖర్చును దేశాభివృద్ధికి చేస్తున్న ఖర్చుగా పరిగణించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐసీసీలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగింపు సమావేశంలో గురువారం స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తరిగిపోతున్న ప్రకృతి వనరులు, కూలీల కొరత, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సంసిద్ధత లోపించడం వంటి సమస్యలతో వ్యవసాయ రంగం సతమతమవుతోందన్నారు. రాష్ట్ర వ్యవసాయ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధికి సదస్సు చేసిన సిఫారసుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విలువల రాజకీయాలు కావాలి: జేమ్స్ బోల్గర్ ప్రపంచంలో కోట్లాది మంది ఆకలి తీర్చడానికి, సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటుగా మార్చడానికి చిత్తశుద్ధి కల్గిన రాజకీయ నాయకత్వం కావాలని ప్రపంచ వ్యవసాయ ఫోరం (డబ్ల్యూఏఎఫ్) సలహా మండలి చైర్మన్ జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. చిన్న కమతాలకు అనువుగా వ్యవసాయ యాంత్రీకరణ జరగాలన్నారు. డబ్ల్యూఏఎఫ్ నేత బెకర్ మాట్లాడుతూ సదస్సు అనుకున్న దానికన్నా బాగా విజయవంతమయ్యిందన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికే మహంతి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ చంద పునేఠ తదితరులు మాట్లాడారు. నిరసనల మధ్య ముగిసిన సదస్సు రైతు సంఘాల నిరసనల మధ్య మూడు రోజుల ప్రపంచ వ్యవసాయ సదస్సు గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని పలు రైతు సంఘాలు బహిష్కరించాయి. సదస్సులో పాల్గొని చర్చల తీరును ఎండగట్టాలని భావించిన కొందరు రైతు నేతలను పోలీసులు లోపలికి అనుమతించలేదు. సదస్సు చివరి రోజు కూడా నిరసన తెలిపిన పలువురు రైతు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చర్చల్లో బహుళజాతి కంపెనీల వ్యాపార విస్తరణ ధోరణిని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన రీతిలో ఎండగట్టడం విశేషం. విదేశీ కంపెనీల ప్రతినిథులు కొత్త టెక్నాలజీ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ ఉండాల్సిన అవసరాన్ని మన శాస్త్రవేత్తలు గట్టిగా చెప్పారు. కర్ణాటక వ్యవసాయ యూనివర్సిటీ మాజీ వీసీ పాటిల్, ఐసీఏఆర్ ఇంజనీరింగ్ మాజీ డీడీజీ ఎంఎం పాండే, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ వీసీ రాజ్కుమార్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న ముల్కనూర్ సొసైటీ విజయ గాథ! కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సొసైటీ సాధించిన ఘన విజయం ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రతినిధులను అమితంగా ఆకట్టుకుంది. 1956లో కేవలం రూ.2,300 మూలధనంతో ఈ సొసైటీ ప్రారంభమైంది. ప్రస్తుతం 7,300 మంది రైతుల భాగస్వామ్యంతో రూ.10 కోట్ల షేర్ కేపిటల్తో రూ.180 కోట్ల టర్నోవర్ సాధించిన వైనంపై సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రధానంగా విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంది. బయటి వ్యక్తుల ప్రమేయాన్ని అంగీకరించకపోవడం.. నిబద్ధత, నిజాయితీ కలిగిన స్థానిక నాయకత్వం.. సకాలంలో రైతులకు రుణాలివ్వడం.. రుణ వసూళ్లను మార్కెటింగ్తో అనుసంధానించడం వల్లే తమ సొసైటీ ఇంత అభివృద్ధి సాధించిందని ప్రవీణ్ రెడ్డి వివరించడంతో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు.... స్పీకర్ నాదెండ్ల మనోహర్తో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్....వీరికి అపాయింట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా అసెంబ్లీని తక్షణమే సమావేశపర్చాలని కోరనున్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు స్పీకర్కు విజ్ఞప్తి చేయనున్నారు. -
రాజీనామాలు ఆమోదించండి: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
నేడు స్పీకర్ను కలసి కోరనున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాము తమ పదవులకు చేసిన రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలవనున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం లో రాజకీయ వ్యవహారాల కమిటీ, అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజా సమస్యలు వంటి అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించారు. 56 రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీరుతెన్నులపై విపులంగా చర్చించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాల అంశం చర్చకు వచ్చినపుడు.. రాజీనామాలను ఆమోదించుకోవటానికి గురువారం మరోసారి స్పీకర్ను కలవాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణ యం తీసుకోవటానికి ముందు 25వ తేదీనే ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తూ స్పీకర్కు లేఖలు పంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అవి పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి... అలాగే విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరులు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపైనా జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో చర్చ జరిగింది. రాజీనామాలంటూ ఆ రెండు పార్టీల నేతలు డ్రామాలాడటం తప్ప అందుకు సిద్ధపడటం లేదని, ఈ రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు సైతం రాజీనామాలకు సిద్ధపడితే విభజన ప్రక్రియ నిలిచిపోతుందని సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు ముందుకు రావడం లేదని నేతలు పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. కాంగ్రెస్ నేతలు రోజుకో రకమైన మాటలతో పరిస్థితిని మరింత అయోమయంలో పడేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. బాబు ఏ వైఖరీ సూటిగా చెప్పలేదు: తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇటీవలి కాలంలో ఢిల్లీలో పర్యటించిన అంశం చర్చకు రాగా.. ఢిల్లీలో ఆయన విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్న విషయంలో ఒక్క మాట మాట్లాడలేదని, సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర సందర్భంలో కూడా ఎక్కడా విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒక వైఖరి సూటిగా చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ పోయారని సమావేశంలో నేతలు గుర్తుచేశారు. ప్రజా సమస్యలను వదిలేశారు: సీమాంధ్రలో గడిచిన 56 రోజులుగా ఉద్యమం తీవ్ర రూపంలో కొనసాగుతున్నా ఈ నేతలకు చీమకుట్టినట్టయినా లేదనీ.. ఇదే అదనుగా ప్రభుత్వం ప్రజల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వం ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసిందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అసలు ప్రభుత్వమేనేది ఒకటుందా? అన్న అనుమానాలు ఉన్నాయని సమావేశంలో చర్చకు వచ్చింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవని, ఇలాంటి సమయంలో ప్రజల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో పార్టీ నేతలు భాగస్వాములవుతూ మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని సమావేశాలు నిర్ణయించాయి. ఢిల్లీలో ఉద్యోగుల ధర్నాకు విజయమ్మ... షరతులతో కూడిన బెయిల్ కారణంగా తాను హైదరాబాద్ వీడివెళ్లటానికి అవకాశం లేదని, అందుకే సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి స్వయంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హాజరుకావాలని కోరానని ఈ సందర్భంగా జగన్ వివరించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల చేసే ఉద్యమంగానీ, ఇతరత్రా నిరసనల కార్యక్రమాలకు పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూనే విభజన ప్రక్రియను నిలిపివేయాలంటే ఉద్యోగ సంఘాలు మరింత చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల సంతకాలతో కేంద్రానికి లేఖ రాయాలని, దానివల్ల మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరులు కూడా బయటపడుతాయని, వారు చేస్తున్న డ్రామాలకు బ్రేక్ పడుతుందన్నారు. ఇదిలావుంటే.. పార్టీ సంస్థాగత అంశాలపైన కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. -
దిగ్విజయ్తో నాదెండ్ల మనోహర్ భేటీ