-
పవన్ కళ్యాణ్ పై మాకినీడి శేషు కుమారి ఫైర్
-
పవన్ అప్పగింతలు–కుప్పిగంతులు
పవన్ కల్యాణ్ పార్టీ వ్యవ హారం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ పరిశీలిస్తే బహుశా ఇలాంటి పార్టీ భారతదేశంలోనే ఎక్కడా మనకు కనిపించదేమో అని పిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పార్టీని పదేళ్లు నడిపాను అంటూ తరచు మాట్లాడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు అయి ఉండొచ్చు కానీ పట్టుమని చెప్పుకోదగిన స్థాయిలో పది కార్యక్రమాలైనా ఉన్నాయా అంటే చెప్ప డానికి ఆ పార్టీ కార్యకర్తలే తడబడతారు. ఎందుకంటే పదేళ్లు పూర్తిగా నడిపింది పార్ట్ టైం పాలిటిక్స్. పార్ట్ టైం ఉద్యోగాల గురించి విన్నాంగానీ పార్ట్ టైం రాజకీయాలను పరిచ యం చేసింది మాత్రం పవన్ అనే చెప్పాలి. పోనీ ఆ పార్ట్ టైం కార్య కలాపాలైనా ఆయన నిర్వహించారా అంటే అదీ లేదు. తను జస్ట్ గెస్ట్ ఫాకల్టీ మాత్రమే! సినిమాల్లో ఒక మాస్ హీరోలా ఎలా నటి స్తారో... అదే సంస్కృతి (ప్రక్రియ)ని రాజకీయల్లో కూడా చొప్పించి తన ఘనత చాటుకున్నారు. సినిమాలో హీరో చేసే ఫైట్లు, ఫీట్లూ అన్నీ డూప్. పాడే పాటలూ ఆయన పాడరు. కానీ ప్రేక్షకులకు హీరోనే ఇవన్నీ చేస్తాడని అనిపిస్తుంది. ఇదే ఫార్ములా రాజకీయాలకి అప్లై చేశారు పవన్ కల్యాణ్. పార్టీని ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యత నాదెండ్ల మనోహర్కి అప్పజెప్పారు. ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడాలన్నా, విలేకరులు అడిగిన ప్రశ్న లకు జవాబు చెప్పాలన్నా నాదెండ్ల మనోహర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప జవాబు చెప్పలేని పరిస్థితి. ఉపన్యాసాలు ఇవ్వాలంటే ఎవరో రాసిచ్చిన ఉప న్యాసాలకు హావభావాలు జోడించడం మాత్రమే పవన్ చేసే పని. ఫైనల్గా సినిమాను డిస్ట్రిబ్యూటర్కు అమ్మే సినట్టు పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. పార్టీ కార్యకర్తల చేతుల్లో తెలుగుదేశం జెండాలు పెట్టారు. చెప్పులేసుకుని తిరిగే వాళ్ళను చట్ట సభలకు పంపిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో చివరగా చిప్ప పెట్టి కోటీశ్వరులకు టిక్కెట్లు ఇచ్చేసు కున్నారు. పైగా తన పార్టీలో ఎవరెవరు నించో వాలి అనే నిర్ణయాధికారాన్ని కూడా చంద్రబాబుకే అప్ప జెప్పే శారు. అచ్చంగా డిస్ట్రిబ్యూటర్ ఏ ఏ థియేటర్స్కు సినిమా రిలీజ్ చేయాలో నిర్ణయించినట్టు! సాక్షాత్తు తను పిఠాపురంలో పోటీ చేసే చోట పట్టుమని నాలుగు రోజులు తిరిగే ఓపిక కూడా లేక ఆ బాధ్యతనూ వర్మ చేతిలో పెట్టేశారు. వాలంటీర్లను నోటికొచ్చినట్టు తిట్టి, అవ్వ తాతల్ని మండుటెండలో అష్ట కష్టాలు పెడుతూ తను మాత్రం గంట కూడా ఎండలో తిరగలేక స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ఈ విచిత్ర విన్యా సాలు, విపరీత పోకడలకు జన సైనికులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీర మహిళ లైతే ఒక అడుగు ముందుకు వేసి, ‘‘మాటలు కోటలు దాటిస్తున్నాడు. మానాభిమానాల్ని మాత్రం ‘కోట’లో దాచి పెడు తున్నాడు’’ అంటూ నర్మగర్భంగా టీవీ చర్చల్లోనే వ్యాఖ్యా నించటం గమనార్హం! పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారు.
-
జనసేనకు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా
-
టీడీపీలో ట్విస్ట్: అభ్యర్థులకు షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు షాకిచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తానని బాబు చెప్పుకొచ్చారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చని సంకేతాలిచ్చారు. కాగా, టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం ఎప్పటకీ ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులకు షాకిచ్చారు. టిక్కెట్ దక్కిందని సంబురపడకండి. రానున్న 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం చోటుచేసుకుంది. మరోవైపు, జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి. ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం అని అన్నారు. దీంతో, నాందెడ్ల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నాకేంది ఇది
-
నాదెండ్ల మనోహర్పై నీళ్ల బాటిల్తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్ను నాదెండ్ల మనోహర్పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు
సాక్షి, అమరావతి: మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు (యాడ్స్)లో పవన్ ఫొటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం, ధనబలం లేదని పవన్తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కాదని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిరీ్వర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని తెలిపింది. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడపాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశమిదీ.. ‘కాపు సామాజికవర్గానికి చంద్రబాబుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు లేకపోవచ్చు గానీ, చైతన్యం మెండుగా ఉంది. చంద్రబాబు తీరుతో టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలను చేజేతులారా పాడుచేసుకున్నారు. జనసేన అండ లేకుండా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోరాటం చేయలేదు. కేవలం 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్తో యుద్ధం చేయించి కాపు సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించదు. 2014లోనే జనసేనకు కనీసం 24 సీట్లు ఇచ్చినా పవన్కు ప్యాకేజీ స్టార్ అనే అప్రతిష్ట వచ్చేది కాదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే మాటలను బాబు ఇప్పటివరకు ఖండించలేదు. 2014లో చతికిలపడిపోయిన టీడీపీని జనసేన, బీజేపీ నిలబెట్టాయి. బాబు సహజగుణానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదిలేసి ఫలితాన్ని చవిచూశారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్న పవన్ రెండు చోట్లా తనను ఓడించారని పదే పదే ప్రజలను నిందించడం సరికాదు. పవన్ ఓటమిలో టీడీపీ పాత్ర, వ్యక్తిగత వైఫల్యం ఏమిటో ప్రజలకు తెలుసు.’ 2019లో మీ స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు? ‘బుధవారంనాటి జెండా సభలో పవన్ మాట్లాడుతూ స్నేహమంటే చివరి వరకు అని స్వయంగా ప్రకటించారు. మరి 2019లో మీ ఇరువురి స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు చంద్రబాబూ? ఆ రోజు మీ డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేశారా? పవన్ ఓటమిలో మీ పాత్ర లేదా? ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించిందా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని, సడెన్గా యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో కేంద్రంపై ఉద్యమాలు చేయించారు. ప్రధాని మోదీని తిట్టారు, తిట్టించారు. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి పవన్ మీకు మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాడుకుని పవన్ను మడత పెట్టేస్తే.. ఆయన అభిమానులు, కాపులు కలిసి మిమ్మల్ని మడత పెట్టేస్తారని గమనించండి.’ త్యాగాలు ఇతరులే చేయాలా? మీరు చేయరా? ‘24 ఎమ్మెల్యే సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 151 సీట్ల కోసం టీడీపీ వాళ్లే యుద్ధం చేసుకుంటార్లే అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. పవన్ను లోక్సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపేస్తారని, బాబుకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలవడానికి పవన్ ఇష్టపడినప్పటికీ ఆయన్ని అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్విర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోంది. ఇలా నమ్మించి మోసం చేయడాన్ని కాపులు ఏమాత్రం జీర్ణించుకోరన్న నగ్న సత్యాన్ని గత అనుభవాల దృష్ట్యా మీరు గ్రహించాల్సి ఉంది. త్యాగాలు చేయాలని తమరు ఇతరులకు చెప్పడమేనా? మీరు త్యాగాలు చేయరా? పవన్ను మోసం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే నగ్న సత్యాన్ని గ్రహించాలి’ అని ఆ లేఖలో కాపు ఐక్య వేదిక నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. -
నాదెండ్లకు చుక్కలు చూపించి.. దాడికి యత్నం!
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్హౌజ్ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్ను బూతులు తిడుతూ కనిపించారు. వారాహి యాత్రలో స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్ టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు. -
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
సై అంటే సై.. టీడీపీ, జనసేనల పొత్తు కుంపట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలో నువ్వా నేనా? ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు సీటు తమదంటే తమదంటూ పోటీపడుతూ గొడవలకు దిగడంతో జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఉదా.. అనకాపల్లి ఎంపీ సీటు కోసం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తుండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. తన కొడుక్కి ఎంపీ సీటు నిరాకరిస్తుండడంతో అయ్యన్న కస్సుమంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజమండ్రి రూరల్లో రాజుకున్న విభేదాలు.. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రాజేసింది. అక్కడి నుంచి మళ్లీ తానే పోటీచేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా సీటు తనదేనని జనసేన నేత కందుల దుర్గేష్ తొడకొడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఇప్పటికే బహిరంగంగా గొడవలు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా.. బుచ్చయ్య చౌదరి స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సీటును ఆపడానికి దుర్గేష్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై దుర్గేష్ వర్గం మండిపడుతూ ప్రతి విమర్శలు చేసింది. ఇలా.. నిత్యం రెండు పార్టీల నేతలు సీటు కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. పిఠాపురంలో పోటాపోటీ.. ► కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సీటు తనదేనని చెబుతూ ఒకసారి ఓడిపోయిన వారికి సీటు ఎలా ఇస్తారని వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి ప్రతిగా పార్టీ అధినేతలే ఓడిపోయిన పరిస్థితి ఉందంటూ పవన్ విషయాన్ని వర్మ గుర్తుచేశారు. దీంతో గొడవ జరిగి ఇరు వర్గాలు కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ► అలాగే, కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కారాలు నూరుతున్నారు. సీటు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ► అమలాపురం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ► రాజోలు సీటును పవన్ తమదేనని ప్రకటించినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ► ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరం సీటు జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ► నర్సాపురం సీటు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ► అలాగే, కృష్ణా జిల్లాలోనూ రెండు, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీచేస్తున్నట్లు జనసేన నేత పోతిన మహేష్ హడావుడి చేస్తుండగా టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్ధా వెంకన్నలు అతనికి అంత సీన్లేదని ఎద్దేవా చేస్తున్నారు. తెనాలిపై మనోహర్, రాజా పట్టు.. ఇక తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీపడుతుండడం రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేయగా, రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూ తానే పోటీచేస్తానని చెబుతున్నారు. రాజాకు సీటు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో రాజా అనుచరులు తొడలు కొడుతున్నారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు తమదేనని జనసేన నేతలు ప్రకటించుకోవడంతో అక్కడి టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడుతున్నారు. ► అనంతపురం అర్బన్ సీటు కోసం రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ► ధర్మవరం సీటుపైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సీటుపైనా సిగపట్లు.. ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్కళ్యాణ్ బలపరుస్తున్నా ఆ పార్టీ నేతలు, కేడర్ మాత్రం అంగీకరించడంలేదు. పైగా పవనే సీఎం అభ్యర్థని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
నువ్వొక పనికిమాలిన వాడివి..నాదెండ్ల పై వెల్లంపల్లి ఫైర్
-
పొత్తుల పాలిటిక్స్: జనసేనకు షాకులిస్తున్న టీడీపీ నేతలు!
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల కత్తులు వేళ్లాడుతున్నాయి. అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటారు. కానీ, నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటారు. ప్యాకేజీ స్టార్ పార్టీని అన్ని చోట్లా సైకిల్ పార్టీ నేతలు చితక్కొడుతున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టూ నేతకే దిక్కులేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తులు పేరుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అప్పటినుంచి తరచూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అటు పవన్ను కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి సీట్లు పంచుకుని ముందుకెళ్లడమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని మూడు నెలల ముందే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్నికూడా ఆయన ప్రారంభించారు. తెనాలి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, జనసేన నేత నాదెండ్ల కార్యక్రమాల గురించి పట్టించుకోని తెనాలి టీడీపీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా స్పీడ్ పెంచారు. ఇక్కడనుంచి జనసేన పోటీ చేస్తుంది కదా.. మనకు సీటు లేదని కొన్నిరోజులపాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లను కలిశారు. వారిద్దరితో భేటీ తర్వాత ఆలపాటికి ఏం క్లారిటీ వచ్చిందో బయటకు రాలేదుకానీ.. అప్పటినుంచి తెనాలిలో దూకుడు పెంచారు. టీడీపీ కార్యకర్తలకు మన పని మనదే.. జనసేన పని జనసేనదే.. వారికి మనకు సంబంధం లేదు. ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ది ఎన్నికల బరిలో ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా నేనే అని పార్టీ నాయకులకు తేల్చిచెప్పేశారట. ఆలపాటి రాజా వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది కదా.. పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు నాదే అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ అడ్డం తిరగడమేంటి అంటూ షాక్కు గురయ్యారట. అయినా.. సరే మేం కూడా మా పని చేసుకుంటాం.. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే వస్తుంది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చెయ్యదని తన క్యాడర్కు చెబుతున్నారట. రెండు పార్టీల నేతల ప్రకటనలతో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేద్దామని బయల్దేరారు. ఇది చూసి నాదెండ్ల మనోహర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఒక వైపు సీటు మాదే అంటుంటే.. రాజా పాదయాత్ర ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా పై స్థాయిలో నిర్ణయం జరిగినపుడు టీడీపీ మనకు సపోర్ట్ చెయ్యాలి కదా అని సన్నిహితుల వద్ద వాపోయారట. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకెళ్దామని అనుకున్నాం.. మేనిఫెస్టోపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ తొండాట ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నేత ఆలపాటి రాజా తీరుపై అమీ తుమీ తేల్చుకునేందుకు పవన్ వద్ద పంచాయితీ పెట్టాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెనాలిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజా మాత్రం పొత్తు ఉన్నా.. లేకపోయినా తెనాలిలో పోటీ చేసేదీ నేనే అంటూ ముందుకుసాగుతున్నారు. తెనాలిలో టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న సీట్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. -
అభిమానులపై ‘పంజా’!
సాక్షి, అమరావతి: పదేళ్ల కిందట పెట్టిన పార్టీ. కానీ... ఇప్పటిక్కూడా వేదిక ఎక్కి మాట్లాడే నాయకుడు ఒక్కడే!!. మరీ ముఖ్యమైన సందర్భాల్లో అయితే అటుపక్క సోదరుడు... ఇటుపక్క తన వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఓ కార్యదర్శి స్థాయి నాయకుడు. ఏ జిల్లాకెళ్లినా అంతా అభిమానులే తప్ప వాళ్లలో ఒక్కరూ నాయకులుండరు. అసలు జనసేన రాజకీయ పార్టీయేనా? అలాగైతే పదేళ్లుగా ఎక్కడా ఒక్క బలమైన నాయకుడూ ఎందుకు తయారు కాలేదంటారు? ఎందుకంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమే అది. తనకు అధికారం అక్కర్లేదని పదేపదే ఆవేశాన్ని అభినయిస్తూ చెప్పే పవన్ కళ్యాణ్ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన చంద్రబాబుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గెలిచారు. కానీ 2019 వచ్చేసరికి బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోవటంతో... ఆ వ్యతిరేక ఓట్లన్నీ వైఎస్సార్ సీపీకి గంపగుత్తగా పడకుండా చీల్చాలని చంద్రబాబు ఆదేశించటంతో... కొత్త పాత్ర పోషిస్తూ బాబు స్నేహితుడి నుంచి బాబు ప్రతినాయకుడి పాత్రలోకి మారిపోయారు. లేని ఆవేశాన్ని తెచ్చుకుని, చంద్రబాబును చెడామడా తిట్టేస్తూ... ఆగ్రహంతో ఊగిపోయారు. రక్తి కట్టించాననుకున్నారు. కానీ సినిమా ఫ్లాపయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అఖండమైన మెజారిటీతో గెలిచారు. మరి ఇప్పుడూ అదే చంద్రబాబు కదా? అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏం మారింది? ఏం మారిందంటే చంద్రబాబు పాత్ర మారింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఒంటరిగా అయితే జగన్ను ఎదుర్కోలేనన్నది చంద్రబాబు ఉద్దేశం. పవన్ కళ్యాణ్ తనతో ఉంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తాయనే ఆశ. కాబట్టి పొత్తు పెట్టుకోవటం ద్వారా వాటన్నిటినీ తనకు బదిలీ చేయాలని పవన్కు ఆదేశించారు. మళ్లీ పవన్ వేషం మారింది. కాకపోతే రెండుసార్లు ఈయన్ను నమ్మి మోసపోయిన ఆ సామాజికవర్గం మళ్లీ నమ్ముతుందా? అది కూడా తమను పదేపదే మోసం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేయమంటే వేసేస్తారా? అందుకే పవన్ రకరకాల అభినయాలకు దిగుతున్నారు. ‘నేను ఎవరినీ ముఖ్యమంత్రిని చేయడానికి లేను’. ‘సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం’ సీఎం పదవి ఇస్తే ఎవరైనా వద్దంటారా?’ ‘జనసేన గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తరవాత తేలుతుంది’. ‘మనకు తగిన బలం లేనప్పుడు ఒక మెట్టు దిగటంలో తప్పులేదు’ అనే పంచ్ డైలాగ్లు విసిరివిసిరి.. ఇప్పుడు దార్లోకి వచ్చారు. తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించేవారు తనకు అక్కర్లేదని, పొత్తుకు కట్టుబడ్డవారే తనతో ఉండాలని, తెలుగుదేశం కోసం జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని కుండబద్దలుగొట్టేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకే కోట్లకు కోట్లు ఖర్చుచేసిన సినిమా రిలీజయ్యాక డిజాస్టరని తెలిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా తయారయింది జనసేన అభిమానుల పరిస్థితి. బాంబు పేల్చిన ‘తమ్ముడు’ లోకేశ్ సీఎం ఎవరన్నదీ అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ– జనసేన చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయని పవన్ కళ్యాణ్ చెబుతుంటే... అసలే గందరగోళంలో ఉన్న జనసేన అభిమానులపై చంద్రబాబు తనయుడు లోకేశ్ ఓ పిడుగు వేశాడు. ఇన్నాళ్లు పవన్ చెబుతున్న మాట పచ్చి అబద్ధమని తేల్చేశారు. ఓ టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ... ‘‘పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి. దీన్లో రెండో ఆలోచనే లేదు’’ అని తెగేసి చెప్పారు. అంతేకాదు. 150 సీట్లలో తమ అభ్యర్థులు ఖరారైపోయారని మరో బాంబు పేల్చారు. ఈ ఇంటర్వ్యూ చూసి జనసేన అభిమానులు హతాశులయ్యారు. ఇన్నాళ్లూ తమ ‘బ్రో’ చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ చర్చించుకుంటున్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా అనుమానాస్పదంగానే మాట్లాడారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 15 మందితో కలిసి నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘నా దృష్టిలో లేదు, తెలియదు’ అని తప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పారు. నిజానికి పొత్తుపై టీడీపీతో ఏ చర్చ జరిగినా, జనసేన తరుఫున పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉంటారు. సీఎం అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య నిర్ణయం జరగకుండా ఉంటే లోకేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించే వారు. కానీ, సీఎం అభ్యర్థి చంద్రబాబు అని పవన్ కూడా చాలాసార్లు చెప్పారని లోకేశ్ స్పష్టంగా చెప్పారు. దీన్ని మనోహర్ ఖండించలేదు. మనోహర్ ఇలా మాట్లాడటంతో... పవన్ ఉద్దేశపూర్వకంగానే సీఎం అభ్యర్థిత్వంపై అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 2014లో జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ పవన్ రాజకీయ కార్యక్రమాలన్నీ చంద్రబాబు ప్రయోజనాల చుట్టూనే తిరుగుతున్నాయనే వాదనకు మరింత బలాన్నిచ్చేలా పవన్ తీరు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ సారి కూడా చంద్రబాబు కోసమే తమ నాయకుడు పనిచేస్తున్నారని, చంద్రబాబు సీఎం అభ్యర్థిగా అంతర్గతంగా అంగీకరించి ఉంటారని, అయినా నిండా 20 సీట్లు కూడా ఇవ్వలేమని లోకేశ్ చెబుతుండగా ఇక సీఎం వంటి పదాలను పలకడం వృథా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులో సీఎం అభ్యర్థిపై లోకేశ్ ఏమన్నారంటే.. విలేకరి ప్రశ్న: ఓట్లను పంచుకుంటున్నారు. సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? లోకేశ్: చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెంకడ్ థాట్ (రెండో మాటే లేదు). పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు. సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. అనుభవం ఉన్న నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. దేర్ ఈజ్ నో యాంబిగ్యుటీ (ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు) లోకేశ్ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ స్పందన.. విలేకరి ప్రశ్న: టీడీపీ – జనసేన పొత్తులో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పవన్ ఇన్నాళ్లుగా ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చించి నిర్ణయం ఉంటుందంటున్నారు కదా? నాదెండ్ల : నేను పర్టిక్యులర్గా వినలేదు. మీరు అనేది నిజమే అయితే, పొత్తులో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలి. కొన్ని ఆలోచనలు సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చోని, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని ఆ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నా దృష్టిలో అయితే, (దీనిపై నిర్ణయం జరిగినట్టు) లేదు. -
పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ, జనసేన విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని. నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ -
పిచ్చి కూతలకు ఇచ్చిపడేసిన మంత్రి గుడివాడ
-
‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘పవన్తో పాటు, నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప. టీడీపీ పాలనలో జీఎస్డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్డీపీ ఒకటో స్థానంలో ఉంది. జీఎస్డీపీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయి. ఈజ్ ఆఫ్ డుయింగ్లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంఎస్ఎంఈకి పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్ఎంఈ రంగంలో 650 శాతం అభివృద్ధి సాధించింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నాము. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ను నిర్మిస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతోనే మా పొత్తు: సీఎం జగన్ -
టీడీపీ-జనసేనలో సీట్ల పంచాయితీ
-
పవన్ కల్యాణ్ చుట్టూ 'రుక్మిణి' కోట.. ఇంతకూ ఎవరీమె..?
జనసేన పార్టీలో కీలక నాయకుల పేర్లు చెప్పమని ఎవరినైనా అడిగితే పట్టుమని ఇదు పేర్లు కూడా తెరపై కనిపించవు. పవన్ పల్లకీ మోస్తున్న ఆయన అభిమానులకు కూడా ఈ విషయం తెలుసు. పవన్ తర్వాత పార్టీలో ఎక్కువగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్ కానీ ఆ జాబితాలో రుక్మిణి కోట అనే యువతి కూడా చేరారు. నిన్న మొన్నటి వరకు నాదెండ్ల ఏది చెబితే అదే జనసేనలో నడిచేది.. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. తాజాగా రాయలసీమ జిల్లాల మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖలో 140 రోజుల పాటు రుక్మిణి ఎలా ఆడుకున్నారో క్లియర్గా వివరించారు. ఇలా బయటికి చెప్పుకోలేని వాళ్లు చాలా మంది జనసేనలో ఉన్నారని రుక్మిణి పేరు చెబుతూనే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. రుక్మిణి కోట ఎవరు..? కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్లో ఉండేవారు. అక్కడ ఆమె ప్రముఖ బ్రాండెడ్ బట్టల షాపును రన్ చేసేవారట. పవన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు దగ్గరుండి సౌకర్యాలు కల్పించేవారని జనసేన నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో 2020లో ఆమెను జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా పవన్ నియమించారు. వాస్తవానికి జనసేన నియామకాలను పరిశీలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. పార్టీ కోసం ఫండ్స్ పేరుతో పవన్,నాగబాబు కూడా ఇప్పటికే పలు పర్యటనలు కూడా చేసిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి) జనసేన వీరమహిళ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి దిశానిర్దేశం చేస్తున్నది కూడా రుక్మిణినే అని వారు చెబుతుంటారు. 2020 నుంచే రుక్మిణి పార్టీలో ఉన్నప్పటికీ 2022లో ఆమె లండన్ నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. ఇక్కడి వచ్చాక ఆమెకు హైదరాబాద్లోని జనసేన కార్యాలయ బాధ్యతల్ని మొదటగా రుక్మిణికి పవన్ అప్పగించారు. ఆమె టాలెంట్తో పవన్ను మెప్పించడంతో పార్టీలో ఆమె కీలకంగా మారిపోయారని టాక్. ఈ నేపథ్యంలో ఆప్పటికే జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసే 30 మందిని ఒక్కసారిగా తొలగించేశారని సమాచారం. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను రుక్మిణి ఏర్పాటుచేసుకున్నారని తెలుస్తోంది. పవన్ను కలవాలంటే జనసేనలో ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని దాటుకుని మాత్రమే వెళ్లాలట. ఎంతటివాడైనా డోంట్ కేర్ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పవన్ వద్దకు ఎంట్రీ దొరుకుందట. లేదంటే జనసేన కార్యాలయం గేటు కూడా తాకలేరట. ఇదే విషయాన్ని జనసేనకు రాజీనామ చేసిన పసుపులేటి పద్మావతి తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలో ఎంతపెద్ద తోపు నాయకుడు అయినా పవన్ను కలవాలంటే రుక్మిణి... రుక్మిణి.. అంటూ ప్రదక్షణలు చేసుకోవాల్సిందేనట. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) అలా జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ దేవుడైతే.. భక్తులకు , ఆయనకు మధ్య అనుసంధానకర్తగా రుక్మిణి అని జనసేన నాయకులు సరదాగా చెబుతున్న మాట. ఆమె అనుమతి లేకుండా పార్టీలో ఏ ఒక్క చిన్న పని కూడా జరగదట. రుక్మిణి స్పీడ్ ముందు నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆ పార్టీలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి -
పెళ్లిళ్ల విషయంలో అంతే... రాజకీయంలో అంతే
-
పవన్ ఏం చెబుతాడోనని అందరూ ఎదురుచూశారు
-
నాగబాబు, నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందంటే..
-
పవన్ కళ్యాణ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమంచిపల్లిలో పవన్ను పోలీసులు అడ్డుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు నేపద్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు పవన్ను నందిగామ హైవే మీదుగా విజయవాడ తీసుకెళ్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ని కూడా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో పలువురు కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
సీఎం రేసులో లేను.. ఆ మాట టీడీపీ ఎలా చెబుతుంది?: పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసలు ముఖ్యమంత్రి పదవి రేసులోనే లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పరోక్షంగా తేల్చి చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమంటూ సంకేతాలిస్తూ, పొత్తుల్లో జనసేన పార్టీకే ముఖ్యమంత్రి పదవి కావాలని అడగడానికి ఓ స్థాయి ఉంటుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి కదా, అవి ఎంతవరకు వచ్చాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం. మాట్లాడతాం. (బీజేపీని ఉద్దేశించి) కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఒప్పిస్తాం. వాస్తవాలు, గణాంకాలు చూపి ఒప్పిస్తాం’.. అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు–పవన్ భేటీ తర్వాత కొంతమంది జనసేన నేతలు మీరు తగ్గడం ఏమిటని, మీరు ముఖ్యమంత్రిగా అయితే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని, మీరు సీఎం అభ్యర్థిగా ఉండాలి కదా అని మాట్లాడడాన్ని పవన్ తప్పుబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 30–40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి అడిగే వాళ్లమేమో.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని అనేవాళ్లు ఎవరైనా సరే, అలాంటి ఆలోచనతో ఉంటే వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. జనసేన గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసింది. ఎన్ని గెలిచాం? పొత్తుల్లో ఇతర పార్టీలను సీఎం స్థానం కోసం డిమాండ్ చేయాలంటే కనీసం 30–40 స్థానాలు ఉండాలి. అప్పుడే ఆ వాదనకు బలం ఉండేది. ఇక తాను ఇప్పటివరకూ ఎవరికైనా పెద్దన్న పాత్ర వహించాలని చెప్పానంటే అది బాధ్యత వహించడం అని అర్ధం. అంతేగానీ, ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమది. సీఎం పదవి కావాలని కండిషన్లు పెడితే జరగవు.. ఒక మాట చెబుతున్నా.. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అలాంటప్పుడు మన వాదన (సీఎం పదవి కావాలనే)కు పస ఉండదు. సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్స్టార్ చేయలేదు. నేను సాధించుకున్నదే. రాజకీయాల్లో కూడా టీడీపీ కావొచ్చు. బీజేపీ కావొచ్చు.. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు. నేను టీడీపీ అధ్యక్షుడిని అయినా ఆ మాటలు అనను. మనం బలం చూపించి, సత్తా చూపించి పదవి తీసుకోవాలి. కండిషన్లు పెడితే, అవి జరగవు. సీఎం పదవి అన్నది తానై వరించాలి తప్ప నేను దాని కోసం వెంపర్లాడను. పొత్తులకు జనసేన పార్టీ పెట్టే కండిషను వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలి అంతే. అలాగే, పొత్తులతో ప్రభుత్వం ఏర్పడాలి. నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలపై ఎవరైనా అనుచితంగా మాట్లాడితే వాటిని ఉపసంహరించుకోవాలి. ఓటు చీలనివ్వను అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయో ఆ పార్టీలు కలవాలన్నది నా ఉద్దేశం. ప్రధాన పార్టీలకు సంబంధించే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇక ఎన్నికలు ముందే వస్తాయని అనిపిస్తోంది. అందుకని జూన్ నుంచి రాష్ట్రంలోనే ఉండి పర్యటిస్తా. నాతో నడిచే వాళ్లే నా వాళ్లు.. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమోనని ఒక విలేకరి (సాక్షి కాదు) అన్నప్పుడు.. ‘విమర్శలు వస్తాయని నాకు భయాలు లేవు. అభిమానులు నిరాశ పడడానికి ఇదేమి సినిమా కాదు. కార్యకర్తలైనా సరే.. నాతో నడిచేవారే నా వాళ్లు. అర్ధంచేసుకునే వాళ్లు అర్ధంచేసుకుంటారు’.. అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆఖరి గింజ కొనేవరకు పోరాటం మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలోనూ పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి ధాన్యం గింజ కొనేంత వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయన్నారు. అలాగే, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడంలేదన్నారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్ పరిశీలించడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్తే రైతుల్ని అరెస్టుచేస్తున్నారని, ఇలా అయితే తీవ్ర పరిణామాలుంటాయని పవన్ హెచ్చరించారు. అంతకుముందు.. పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. -
టీడీపీని కలుపుకుందామని బీజేపీని కోరాం
సాక్షి, అమరావతి: టీడీపీని కూడా పొత్తులో కలుపుకుపోదామని బీజేపీ పెద్దలను కోరినట్లు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పరోక్షంగా వెల్లడించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు గురించి బీజేపీ నాయకులతో మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా.. నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ‘రాజకీయాలు అన్నాక అన్ని అంశాలూ చర్చకు వస్తాయి’ అని జవాబిచ్చారు. ‘బీజేపీ పెద్దలతో పవన్కళ్యాణ్ భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మేము తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించాం. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మా నిర్ణయాన్ని స్వాగతించి ముందుకొస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే అన్ని పార్టీలూ కలిసి వైఎస్సార్సీపీ విముక్త ఏపీ కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్తాం’ అని మనోహర్ చెప్పారు. పొత్తులపై తమ పార్టీ అధినేత పవన్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అంతకంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నామో అందరికీ వివరించాలి్సన బాధ్యత ఉందని.. అది నెరవేర్చామని చెప్పారు. కాగా, టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలు అంగీకరించడం లేదని వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా.. ‘అది మీడియా ఎవరో ఒకరు చెబుతున్న మాటే’ అని బదులిచ్చారు. బీజేపీ వాళ్ల అవగాహన లోపం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా జనసేన మద్దతు తెలపలేదన్న బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యలను నాదెండ్ల వద్ద ప్రస్తావించగా.. ‘అది వాళ్ల అవగాహన లోపం’ అని బదులిచ్చారు. ‘మేం(జనసేన) సంస్థాగతంగా బలపడుతున్నాం. వాళ్లు(బీజేపీ) కూడా సంస్థాగతంగా బలపడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. మా పార్టీ స్టాండ్ను ముందుగానే ప్రకటించాం’ అని నాదెండ్ల చెప్పారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని తెలిపారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్-3 వేలంలో వాళ్లు సైతం!
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్పై సజ్జల కీలక వ్యాఖ్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (01-06-2024)
బ్రిటీష్ కాలేజ్లో.. భారతీయ ఆయుర్వేదం
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
T20 WC: బంగ్లాతో మ్యాచ్.. కోహ్లి లేకుండానే! ఓపెనర్గా సంజూ విఫలం
వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్బీఐ
డూప్ లేకుండా కాజల్ యాక్షన్.. భయపడ్డాం: దర్శకుడు సుమన్
Advertisement