NDA government
-
బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.లోకసభ వాయిదామధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా #Loksabha adjourned till 12 noon. pic.twitter.com/OWiOwstBES— Lok Poll (@LokPoll) March 10, 2025 #WATCH | On the New Education Policy and three language row, Union Education Minister Dharmendra Pradhan says, "...They (DMK) are dishonest. They are not committed to the students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise… pic.twitter.com/LdBVqwH6le— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్ వ్యవహారంరాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలుప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం #WATCH | Delhi: Rajya Sabha MP Rekha Sharma says, "The opposition always obstructs the House and important issues are left behind...Today also they will do something similar and we are ready for that too...only those issues will come up in Parliament which are for the… pic.twitter.com/uWHQDiXooN— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలుఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు #WATCH | Delhi: On behalf of Rajya Sabha members, Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh congratulates the Indian team for clinching the Champions Trophy (Source: Sansad TV) pic.twitter.com/1HcsW5GgFb— ANI (@ANI) March 10, 2025 ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలువక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలుఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చనేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లుఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రంఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
అధిక నిధులతోనే రైతుకు మేలు
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను. నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది. చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి. ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది. భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
అహ్మద్నగర్ ఇక అహిల్యానగర్
ఔరంగాబాద్:మహారాష్ట్రలోని షిరిడీ సాయినాథుడు కొలువైన అహ్మద్నగర్ జిల్లా పేరు మారిపోయింది.అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్నగర్ను ఇక అహిల్యానగర్గా పిలవనున్నారు.18వ శతాబ్దంలో ఇండోర్ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్నగర్కు అహిల్యనగర్ అనే పేరు పెట్టారు.చాలా ఏళ్లుగా అహ్మద్నగర్ పేరు మార్చాలన్న డిమాండ్ ఉందని, ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి వీకే పాటిల్ చెప్పారు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీహోదాపై నిరసనలు -
వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదం
ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో రూ.మూడు లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్లకు ఆమోదం లభించింది. ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడం, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రాజెక్ట్లు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఓడరేవుల రంగంలో మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోర్ట్కు ఇటీవలే ఆమోదం లభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన - IV కింద 62,500 కి.మీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్లపై వంతెనల నిర్మాణం కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్లు ప్రారంభించనున్నారు. రూ.50,600 కోట్ల అంచనా వ్యయంతో 936 కి.మీ విస్తరించి ఉన్న ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లిష్టమైన భూభాగాల్లోనూ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లద్దాఖ్ను హిమాచల్ ప్రదేశ్తో కలుపుతూ షింఖున్ లా టన్నెల్ ఏర్పాటుకు ఇటీవల ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ‘డిపాజిట్’ వార్!రైల్వే ప్రయాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా మొదటి వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయం, బిహార్లోని బిహ్తాలో కొత్త సివిల్ ఎన్క్లేవ్లతో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించింది. -
మళ్లీ తెరపైకి పౌరస్మృతి
వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. నిరుడు జూన్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయి సెక్యులర్ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు. పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. కోల్కతాలో ఇటీవల మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
2029లోనూ ఎన్డీఏదే అధికారం: అమిత్ షా
చండీగఢ్: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం దిగ్విజయంగా మరో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవమే గాక 2029లోనూ అధికారంలోకి వస్తుందని ఆదివారం ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు మరోసారి అదే పాత్రకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఏమైనా చెప్పనీయండి. 2029లోనూ ఎన్డీఏదే అధికారం. మోదీయే ప్రధాని’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షాలు కాస్త విజయానికే ఎన్నికల్లో గెలిచేసినట్లు సంబరపడుతున్నాయి. కాంగ్రెస్ గత మూడు లోక్సభ ఎన్నికల్లో కలిపి సాధించిన సీట్లను బీజేపీ ఒక్క 2024 ఎన్నికల్లోనే సాధించింది!’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం కొనసాగదంటూ కావాలనే అయోమయం సృష్టించేందుకు మళ్లీమళ్లీ విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. -
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..కేంద్ర కేబినెట్ ఆమోదం?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టంలోని సవరణలకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఈ సవరణలతో ఇవి తమ ఆస్తులని వక్ఫ్ బోర్డ్ అంటే అందుకు తగిన ఆధారాలు చూపుతూ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది. -
రాజ్యసభలో ఎన్డీఏపై విజయసాయిరెడ్డి ఫైర్
-
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
అంబేడ్కర్ ఆలోచనల్ని ప్రతిఫలిస్తాయా?
నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ 3.0 ప్రభుత్వం 2024–25కి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది. దీనిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొని వుంది. అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచ వ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన జరగాలంటే, వారికి భూములను పంచే ముఖ్య విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా అంబేడ్కర్ సూచించారు. దానికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి. కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచేందుకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి.2024–25 సంవత్సరానికి కేంద్రంలోని నూతన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 22, 23 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా దళితుల్లోనూ, స్త్రీలలోనూ, ఆదివాసీలలోనూ కొత్త ఆశలు కలుగుతున్నాయి. మొత్తం పార్లమెంట్లో 111 మంది దళిత ఎంపీలు ఉన్నారు. అస్పృశ్యతా నిర్మూలనకు, కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచే అంశాల పట్ల దేశంలో ఎంతో ఆసక్తి నెలకొనివుంది. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీ సాధికారత భారతదేశంలో చాలా అవసరంగా కనిపిస్తుంది. పురుషుల సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్న స్త్రీలలో 20 కోట్ల మందికి పనిలేదు. ముఖ్యంగా దళిత స్త్రీలకు సొంత భూమి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. భూమి చరిత్ర చూస్తే భూస్వామ్య ఆధిపత్య కులాలకే భూమి ఉంది. భూమి ఉత్పాదకతపై వారికి పూర్తి అవగాహన ఉండేది. సమాజంలో వారు బలమైన వర్గంగా వ్యవహరించేవారు. అందుకే కేంద్ర పాలకులు వారిని విస్మరించడం కానీ, వారితో వైరం పెట్టుకోవడం కానీ జరిగేది కాదు. తరతరాలుగా పాలకవర్గాలు అగ్రకులాలకు భూ వసతిని కల్పించడంలోనూ, వాటికి నీటి వసతి కల్పించడంలోనూ జాగరూకతతో ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టాన్ని 1958లో అప్పటి ప్రభుత్వం తెచ్చింది. అది జూన్ 1961లో అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ దానికి తూట్లు పడుతూనే వున్నాయి. ప్రధానమైన విషయం ఆంధ్రప్రదేశ్ వ్యావసాయిక రాష్ట్రం. ఇందులో 69.7 శాతం మంది వ్యవసాయ కూలీలు. అందులో 90 శాతం మంది దళితులు. ఈ దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలంటే తప్పకుండా వీరికి భూమి ఇవ్వాలి. రాను రాను వ్యవసాయ కూలీపని మీద శిథిలమౌతున్న వృత్తులవారందరూ ఆధారపడుతున్నారు.పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి రేటు విపరీతంగా పెరగడం వల్ల ఏ వ్యవసాయ కూలీలైతే భూమిని చదును చేసి వ్యవసాయీకరించారో వారు భూమి కొనలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అలాగే కృష్ణా డెల్టాలో అసలు మిగులు భూమి లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. ఇటు వ్యవసాయ కూలి పని లేక, అటు ప్రభుత్వం భూమి ఇవ్వక, గ్రామాల్లో ఉండే పరిస్థితులు లేక తీవ్రమైన వలసలకు దళితులు గురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.1,000 కోట్లు అయినా భూమి కొనుగోలు పథకానికి కేటాయించవలసిన అవసరం ఉందని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మొదటి ప్రణాళిక సంఘంలోనే భూమి కొనుగోలు పథకానికి 20 కోట్ల కేటాయింపు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.అంబేడ్కర్ 1954 సెప్టెంబర్ 6వ తేదీన రాజ్యసభలోని చర్చల్లో ఇలా నివేదించారు: ‘‘ఆర్యా! నేనిప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన సమస్యను ప్రస్తావిస్తున్నాను. చదువుతో పాటుగా ఉద్యోగాలు కూడా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఎక్కువ ప్రాధాన్యమైనవి. అయితే ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఏమి అవకాశాలున్నాయి? షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన లాభదాయకమైన వృత్తులలో ప్రవేశం పొందే అవకాశం మీదనే ఆధారపడి ఉందని స్పష్టమైంది. లాభదాయకమైన వృత్తుల్లోకి ద్వారాలు తెరవబడనంత వరకు, వారి ఆర్థిక విమోచన జరిగే వీలు లేదు. వారు బానిసలుగానే మిగిలి పోతారు. బానిసలు కాకపోయినా, గ్రామాలలో భూస్వాముల సేవకులుగా మిగిలిపోతారు. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆర్యా! నిస్సందేహంగా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వంవారు భూమిని పంచే ముఖ్యమైన విషయంపై దృష్టి ఉంచాలి. భూస్వాముల పొలాలపై పరిమితిని విధించి, అంతకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని షెడ్యూల్డ్ కులాల వారికి ఇవ్వాలి. రెండవదేమిటంటే అమ్మకానికి వచ్చిన భూమిని కొనుక్కోవటం కోసం వారికి ఋణాలివ్వాలి.’’ఇకపోతే స్త్రీలకు భారతదేశ వ్యాప్తంగా కుటీర పరిశ్రమలు రూపొందించి వాటిని వస్తూత్పత్తి కేంద్రాలుగా రూపొందించాలి. అక్కడ తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్లో స్థానం ఏర్పాటు చేయగలిగితే మన స్త్రీలు చైనాను మించిపోతారు. నిజానికి గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగ రేటు 42 శాతానికి పెరిగింది. దీని వల్ల నిరుద్యోగులలో నిరాసక్తత, సోమరితనం పెరుగుతున్నాయి. మత్తు మందుల వాడకం పెరగడానికి కూడ నిరుద్యోగితే కారణం. ఈ నిరుద్యోగుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. స్త్రీల విద్య, ఉపాధి విషయాల గురించి అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లులోనూ, ఆ తరువాత పార్లమెంట్ చర్చల్లోనూ ఎన్నో సలహాలు ఇచ్చారు. వాటిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజున స్త్రీలు చదువుకొని కూడా అటు వ్యవసాయపని చేయలేకా, ఇటు ఉద్యోగం దొరక్కా సంక్షోభంలో ఉండిపోయారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి. దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను దేశం మొత్తంగా మండలానికి ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి గురుకుల పాఠశాలల్లోనే దళితులకు సరైన విద్య, ఆహారం లభిస్తాయి. ఈ బడ్జెట్లో కుల నిర్మూలన కోసం, కులాంతర వివాహితుల రక్షణ కోసం కూడా కేటాయింపులు తప్పకుండా అవసరం. కుల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టడం వల్ల సమాజంలో విస్తృతమైన మార్పులు వస్తాయనీ, సామాజిక సమతుల్యత ఏర్పడుతుందనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అందుకే సాంఘిక స్వాతంత్య్రాన్ని, మేధా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ స్వాతంత్య్రాన్ని ప్రజలకు కలిగించాలంటే దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సూచించారు. దేశ బడ్జెట్ అనేది ఉత్పత్తి శక్తుల మానసిక, శారీరక సౌష్టవాన్ని పెంచే దిశగా ఉండాలన్నారు. తాగుడు, సిగరెట్, ఇతర వ్యసనాల నుండి దూరం చేసే నైతిక అధ్యయన కేంద్రాలు పెంచడం వల్ల సంపద మిగులు ఏర్పడుతుందని చెప్పారు. యువకుల నైపుణ్యాలను పెంచే కేంద్రాలను పెంచడం వల్ల వాళ్లు ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందగలుగుతారనీ, ఆధీనత భావాన్ని తగ్గించే దిశగా బడ్జెట్ ఉండాలనీ సామాజిక, ఆర్థికవేత్తలు కోరుతున్నారు. శ్రమ నుండే మానవాళి అభివృద్ధి జరుగుతుంది. శ్రమ నుండే చైతన్యం వస్తుంది. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు కల్పించినా ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందరు. వారిలో ఉత్సాహాన్ని, జీవన భద్రతని కల్పించాలంటే వారు చేసే పనికి ప్రతిఫలం లభించాలి. ‘ప్రభుత్వం ఏదైనా ఇస్తే బతుకుదాం’ అనే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. దీని వల్ల చాలా నష్టం కలగడమే కాక జాతుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని అంబేడ్కర్ ప్రజలకు ఉద్బోధించారు. నిజానికి ఆయన భూమిని జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి అని పిలుపును ఇచ్చిన మేధావి. భారతదేశంలో అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచవ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని చెప్పారు. విద్య, విజ్ఞానం, ఉత్పత్తి, భూపంపిణీ, సామాజిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, స్త్రీ అభివృద్ధి, యువశక్తి వినియోగం, వృద్ధుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నదుల అనుసంధానం... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగినపుడు భారతదేశం నిజమైన వికాసాన్ని, ప్రాభవాన్ని పొందుతుందని చెప్పారు. ఆ దిశగా పాలకులు, ప్రజలు నడుస్తారని ఆశిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సెన్సెక్స్ రోలర్ కోస్టర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం. కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.కట్ చేస్తే... జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంతా సిద్ధమేనా?
భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత శిక్షాస్మృతి– 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. -
నీట్పై ప్రధాని స్పందించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్–యూజీ ఎంట్రన్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను ప్రధాని మోదీ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశా రు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని కలలుగన్న తల్లి దండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన వ్యవహారంతో నీళ్లు చల్లినట్టయిందని ధ్వజమెత్తారు.బిహార్లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్ర యించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివారం రాసిన బహిరంగ లేఖలో నీట్ పరీక్షపై పలు సందేహాలను వెలిబుచ్చారు. ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని...నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్య లు తీసుకొని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. 67 మందికి మొదటి ర్యాంకు ఎలా? నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థు లు 720 మార్కులు సాధించడం చూస్తే ..పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చ ర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని.. అంతమందికి ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు కలిపారో స్పష్టం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా పేపరే లీకేజీ ఆరోపణలపైనా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, బిహార్ లో అవకతవకలకు పాల్పడిన కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా పరీక్ష తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ వల్ల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. -
ఎన్డీఏ సర్కారు త్వరలోనే కూలుతుంది: ఖర్గే
బెంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున మూడోసారి అధికారంలోకి వచి్చందని, త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచి్చంది. ప్రజల తీర్పు మోదీకి అనుకూలంగా లేదు. ఈయనది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అతిత్వరలో కుప్పకూలుతుంది’అని పేర్కొన్నారు. ‘దేశ క్షేమం కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నాం. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తాం. కానీ, మన ప్రధానికి సవ్యంగా కొనసాగే ఏ పనికైనా అవాంతరం కల్పించడం అలవాటు. అయినప్పటికీ దేశం కోసం మేం సహకారం అందిస్తూనే ఉంటాం’అని ఖర్గే అన్నారు. భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై ఉంచడంలో బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ పక్షాలైన జేడీయూ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), హిందుస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ సారథ్యంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వాలు ఎలా కొనసాగాయో చరిత్ర చెబుతోందని ఖర్గేను ఎద్దేవా చేశాయి. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావు రాజకీయ చతురతతో రెండేళ్లలోనే మెజారిటీ ప్రభుత్వంగా మారిందని జేడీయూ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు పొరపాటున కొంత బలం పుంజుకున్నాయని, ప్రతిపక్ష పోషించాలని రిపబ్లికన్ పార్టీ, హెచ్ఏఎంలు ఖర్గేకు సలహా ఇచ్చాయి. -
పార్లమెంట్ సమావేశాలు
-
Raksha Khadse: సర్పంచ్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకూ
తాజా ఎన్.డి.ఏ. మంత్రి వర్గంలో 71 మంది ప్రమాణ స్వీకారం చేస్తే ఏడుగురే స్త్రీలు. వారిలో అందరి కంటే చిన్నది రక్ష ఖడ్సే. 37 సంవత్సరాల రక్ష భర్తను కోల్పోయాక రాజకీయాల్లోకి వచ్చింది. సింగిల్ పేరెంట్గా ఉంటూనే సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎదిగింది. మహారాష్ట్ర ఎం.పి. అయిన రక్షకి ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆమె స్ఫూర్తిదాయక కథనం.రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయికి రాజకీయాలు ఎంత నాటకీయంగా ఉంటాయో, పదవి విషయంలోనే కాదు జీవితంలో కూడా గెలుపు ఓటములు ఎంత ఖేద మోదాలు కలిగిస్తాయో మెల్లగా తెలిసి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని రావెర్ స్థానం నుంచి మూడోసారి బి.జె.పి. తరఫున గెలిచి, కేంద్రమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసిన రక్ష ఖడ్సే ఆ ఎత్తుకు చేరడానికి తీవ్ర సవాళ్లనే ఎదుర్కొంది. కాని ఓడిపోలేదు. ఆగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుని చేసిన ప్రయాణమే గెలుపు తీరానికి చేర్చింది.భర్త ఆత్మహత్యతో...మహారాష్ట్రలోని నాసిక్లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్ష ఖడ్సే జలగావ్కు చెందిన రాజకీయ కుటుంబంలో కోడలిగా వచ్చింది. ఆమె మామగారు ఏక్నాథ్ ఖడ్సే బి.జె.పి.లో ప్రముఖ నాయకుడు. మంత్రిగా కూడా పని చేశాడు. అతని కుమారుడు నిఖిల్తో రక్ష వివాహం జరిగింది. రక్షకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా 2010లో జనం ‘కొథాలి’ అనే ఊరికి సర్పంచ్ను చేశారు. ఆ తర్వాత ఆమె జిల్లా పరిషత్ స్థాయి నాయకురాలైంది. కాని 2013లో జీవితం తల్లకిందులైంది. 2013 శాసనమండలి ఎన్నికలలో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయినందుకు మనస్తాపం చెందిన రక్ష భర్త నిఖిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి తండ్రి ఏక్నాథ్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఇద్దరు చిన్న పిల్లలతో రక్ష మొత్తం కుటుంబానికే ఊతంగా నిలబడాల్సి వచ్చింది.అత్తింటి ఆదరణతో...భర్త చనిపోయినా అత్తింటిని రక్ష వీడలేదు. అత్తింటి వారు ముఖ్యంగా మామగారు ఆమెను కన్నకూతురిలా ఆదరించి రాజకీయాలలో ్రపోత్సహించాడు. 2014 ఎన్నికలలో రావేర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె ఘన విజయం సాధించింది. భర్త చనిపోయిన సంవత్సరానికే ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని ఆమె సాగించిన ప్రచారం ఆ రోజుల్లో పెద్ద ఆసక్తిని రేపింది. జనం ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించారు. ఐదేళ్ల కాలంలో వ్యవసాయం, విద్యావ్యవస్థ కోసం రక్ష చేసిన కృషి జనానికి నచ్చడంతో 2019లో కూడా రావేర్ నుంచి ఎం.పి.గా ఘనంగా గెలిపించారు.ప్రత్యర్థిగా మామగారురక్ష మామగారైన ఏక్నాథ్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో వచ్చిన విభేదాలు బి.జె.పి.ని వీడేలా చేశాయి. ఆయన ఎన్సిపి (శరద్పవార్) వర్గంలో చేరి ఎం.ఎల్.సి. అయ్యాడు. కాని రక్ష బి.జె.పి.లోనే కొనసాగింది. 2024 ఎన్నికలలో రావేర్ నుంచి రక్ష నిలబడుతున్నప్పుడు శరద్ పవార్ వర్గం ఏక్నాథ్ను ప్రత్యర్థిగా నిలపాలనుకున్నాయి. కాని కోడలి విజయం కోరిన ఏక్నాథ్ తాను పోటీలో నిలవనని దూరంగా ఉండిపోయాడు. దాంతో ఎన్.సి.పి. అభ్యర్థి శ్రీరామ్ పాటిల్ పై రక్షా ఖడ్సే రెండు లక్షల డెబ్బయి వేల మెజారిటీతో గెలిచింది. పిల్లల కోసం...పిల్లలను ముంబైలో చదివిస్తున్న రక్షా ఖడ్సే ప్రతి శని, ఆదివారాలు వారి దగ్గరకు వెళ్లి సమయం గడుపుతుంది. ‘పిల్లలను ముంబైలో ఉంటున్న మా ఆడపడుచులు బాగా చూసుకుంటారు. కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. మా ్రపాంతంలో ఇంకా సాగునీటి వసతి చాలా చోట్ల లేదు. దేశానికి అవసరమైన అరటిలో 35 శాతం మా దగ్గరే పండుతుంది. వ్యవసాయాన్ని ఇంకా వృద్ధి చేయడంలో నేను కృషి చేస్తాను. కేంద్ర మంత్రిగా ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా పని చేసి నిరూపించుకుంటాను’ అని తెలిపింది రక్షా ఖడ్సే. -
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ మీద తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్లో మోదీ మార్క్తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం. -
సహాయ మంత్రి మాకొద్దు: ఎన్సీపీ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇవ్వజూపిన సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయమంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలపగా మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని వివరించారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్సీపీకి కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్లో ఎన్సీపీకి ఇద్దరు సభ్యులున్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కారే లోక్సభలో సభ్యులుగా ఉన్నారు. -
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్లాల్ ఖట్టర్లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్ -
నేడు మోదీ మూడోసారి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్నాథ్ ఠాకూర్ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి (రాంవిలాస్) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు కేబినెట్లో చోటు దక్కనుంది. ఢిల్లీకి చేరుకున్న హసీనా మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్ఏంజెలెస్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ– యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్ మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
ఎన్నికలు ఎందుకింత హాటు?
ఎండలు బాబోయ్ ఎండలు... ఏప్రిల్లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు 100 కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు. ఎన్నికలు ఇలా దంచికొడుతున్న ఎండల్లో జరగడానికి కారణం నూటికి నూరుపాళ్లూ రాజకీయాలే. అవును! తొలి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అని 20 ఏళ్లుగా ఇదుగో, ఇలా మండే ఎండల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ టు అక్టోబర్... స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951–52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. నెహ్రూ ప్రధానిగా తొలి లోక్సభ 1952 ఏప్రిల్ 17 నుంచి 1957 ఏప్రిల్ దాకా కొనసాగింది. అక్కణ్నుంచి 1980 దాకా లోక్సభ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి, లేదంటే మార్చిలోనే జరిగాయి. 1984లో ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్ గాంధీ లోక్సభను రద్దు చేయడంతో డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1989లో సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవక చివరికి రెండేళ్లకే లోక్సభ రద్దయింది. దాంతో 1991 మే, జూన్ నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే. 1996లోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకే లోక్సభ రద్దవడంతో 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాజ్పేయి సర్కారు 13 నెలలకే కుప్పకూలి 1999లో ఎన్నికలు సెపె్టంబర్, అక్టోబర్ మధ్య జరిగాయి. ఇప్పుడు మనందరినీ ఠారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలకు 2004లో వాజ్పేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం. బీజేపీ ఆర్నెల్ల ముందే లోక్సభను రద్దు చేసి ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్లింది. అలా ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ మండుటెండల్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్ ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత 2009, 2014, 2019లోనూ ఎండా కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్–జూన్ ఎన్నికల ‘వేడి’ కొనసాగుతూ వస్తోంది. మార్చడం కుదరదా? చట్టప్రకారం లోక్సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువుదీరాల్సిందే. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్సభ గడువు జూన్ 16తో ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్సభ కొలువుదీరాలన్నమాట. కనుక ఎన్నికల తేదీలను మరీ ముందుకు, వెనక్కు జరపడం కుదరదు. అంటే మళ్లీ మధ్యంతరమో, ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్ మారబోదు. అప్పటిదాకా మనమంతా ఇలా ఎండల్లో ఓటెత్తకా తప్పదు!! లోక్సభ ఎన్నికలు జరిగిన తీరు... ఏడాది పోలింగ్ తేదీలు 1951–52 అక్టోబర్ 25 – ఫిబ్రవరి 21 1957 ఫిబ్రవరి 24 – మార్చి 14 1962 ఫిబ్రవరి 19–25 1967 ఫిబ్రవరి 17–21 1971 మార్చి 1–10 1977 మార్చి 16–20 1980 జనవరి 3–6 1984 డిసెంబర్ 24–28 1989 నవంబర్ 22–26 1991 మే 20 – జూన్ 15 1996 ఏప్రిల్ 27 – మే 7 1998 ఫిబ్రవరి 16–28 1999 సెపె్టంబర్ 5 – అక్టోబర్ 3 2004 ఏప్రిల్ 20 – మే 10 2009 ఏప్రిల్ 16 – మే 13 2014 ఏప్రిల్ 7 – మే 12 2019 ఏప్రిల్ 11 – మే 19 2024 ఏప్రిల్ 19 – జూన్ 1 – సాక్షి, నేషనల్ డెస్క్ -
నారీశక్తి నూతనాధ్యాయం లిఖిస్తా
సాక్షి, న్యూఢిల్లీ/గురుగ్రామ్: ఎన్డీఏ ప్రభుత్వం మూడో దఫా కొలువుతీరడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హ్యాట్రిక్ పాలనలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రకటించారు. నారీశక్తి అభివృద్ధిలో నూతన అధ్యయనం లిఖిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘సశక్తి–నారీశక్తి’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల కష్టాలు, కన్నీళ్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. మా ప్రభుత్వాలు మహిళలను ప్రతిదశలోనూ చేయి అందించిమరీ వారి అభ్యున్నతికి పాటుపడ్డాయి. మరుగుదొడ్ల లేమి, శానిటరీ ప్యాడ్ల వాడకం, వంటచెరకు వాడకంతో వంటగదుల్లో పొగచూరిన మహిళల బతుకులపై మాట్లాడిన ఏకైక ప్రధాని మంత్రిని నేనే. మహిళలందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు డ్రోన్లు సశక్తి–నారీశక్తి కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంక్ రుణాలను మోదీ అందజేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడారు. స్వావలంభనతో అభివృద్ధిలోకి వచి్చన వారిని మెచ్చుకున్నారు. దీన్దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కార్యక్రమం మద్దతుతో లక్షాధికారులుగా మారిన ‘లఖ్పతి దీదీ’లను ఈ సందర్భంగా మోదీ సత్కరించారు. వ్యవసాయం, సాగు సంబంద పనుల్లో డ్రోన్లను వినియోగంచడంలో ఇప్పటికే తర్ఫీదు పొందిన 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు మోదీ డ్రోన్లను పంపిణీచేశారు. మూలధన సంబంధ నిధి కింద స్వయం సహాయక బృందాలకు మరో రూ.2,000 కోట్లను మోదీ పంపిణీచేశారు. ప్రతికూల మనస్తత్వానికి ప్రతిబింబం.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సానుకూల మనస్తత్వం ఏ కోశానా లేదని మోదీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా 112 జాతీయ రహదారులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. -
‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’
తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పిందని సీఎం పినరయి గుర్తుచేశారు. ఆదే మాటపై తమ ప్రభుత్వం కట్డుబడి ఉంటుందని తెలిపారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. చదవండి: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు -
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
BJP National Convention 2024: 100 రోజులు.. 370 స్థానాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 370 నియోజవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేయాలని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు లభిస్తున్నగౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. మరో మూడు నెలల్లోగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. తొలిరోజు భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు సహా 11 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలిలియజేసే ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ, నడ్డా తదితరులు తిలకించారు. అనంతరం పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలు, ప్రచార వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు. ముఖర్జీకి నిజమైన నివాళి: మోదీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శనివారం బీజేపీ జాతీయ ఆఫీసు–బేరర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆరి్టకల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజుల ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడటంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: జేపీ నడ్డా ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో బీజేపీ అనేక విజయాలు సాధించిందని జేపీ నడ్డా అన్నారు. 2014లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ, 17 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని గుర్తుచేశారు. పశి్చమ బెంగాల్లో బీజేపీకి 10 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ పరంగా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కటి నుంచి 8కి, ఓట్ల శాతం 7.1 నుంచి 14కు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టబోమని, అక్కడ అధికారంలోకి వస్తామని, అందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలంతా దీపాలు వెలిగించినా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ మహత్కార్యానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన నేతలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్లతో పాటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీనియర్ నేతలు సోము వీర్రాజు, కిరణ్కుమార్రెడ్డి, విష్ణువర్ధ్దన్రెడ్డి, సత్యకుమార్, కిలారు దిలీప్ హాజరయ్యారు. -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బ్లాక్ అండ్ వైట్’ నిజాలు!
సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్ పేపర్) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్ నల్లపత్రం (బ్లాక్ పేపర్) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది. 2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్ అండ్ వైట్’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది. ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్ పేపర్) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్ పేపర్ పేరిట కాంగ్రెస్ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి. రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది. అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. -
PM Narendra Modi: మాకది దిష్టి చుక్క!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. దారిచూపే దీపం మన్మోహన్ సింగ్ దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది. -
Parliament Budget Session 2024: ‘ఇది కర్తవ్య కాలం’
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి. 2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్లో పేర్కొన్నారు. ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Viral Video : ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. -
విపక్షాలు ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్సభ వాయిదా
లోక్సభలో ఎన్డీయేపై అవిశ్వాసం.. Live Updates లోక్సభ వాయిదా మణిపుర్ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. మణిపుర్పై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నడుమ లోక్సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ► “ప్రధానమంత్రి పార్లమెంటును గౌరవించాలి. ఇది రాష్ట్రపతి పాలన కాదు, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’’..లోక్సభ స్పీకర్ ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ► ఢిల్లీ పాలనాధికారాల బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్లు విప్ జారీ చేశాయి. లోక్సభ ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ. ఢిల్లీ పాలనాధికారాల బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ విప్లో పేర్కొంది. ► మణిపూర్ అంశంపై పార్లమెంట్లో నెలకొంటున్న గందరగోళంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘‘ప్రధాని మోదీని వచ్చి మాట్లాడమని మేం కోరుతున్నాం.ఆయన మౌనం ఆయన ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. దేశ ప్రజలకు మేం కట్టుబడి ఉన్నాం, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాం. అంటూ లేఖలో పేర్కొన్నారయన. LoP in Rajya Sabha Mallikarjun Kharge writes to Union Home Minister Amit Shah over the logjam in the Parliament over Manipur issue. "We have been urging the Prime Minister to come and speak in the Parliament but it seems that will hurt his prestige. We are committed to the… pic.twitter.com/OtAr41TqK8 — ANI (@ANI) July 26, 2023 ► ప్రధాని మోదీ గైర్జాహజరు విపక్ష సభ్యులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొనగా.. లోక్సభ మధ్యాహ్నాం 2గం. వరకు వాయిదా పడింది. Lok Sabha adjourned till 2 pm amid sloganeering by the Opposition MPs who are demanding the PM's presence in the House for discussion on Manipur. pic.twitter.com/vSJTsQRR9a — ANI (@ANI) July 26, 2023 ► ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ గోగోయ్ ప్రవేశపెట్టిన తీర్మానంపై.. సోనియా గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు తమ తమ స్థానాల్లో నిలబడి మద్దతు ప్రకటించారు. అయితే అఖిలపక్షంతో భేటీ తర్వాత అవిశ్వాసంపై తేదీ ప్రకటిస్తానని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ► తిరిగి ప్రారంభమైన లోక్సభ ► బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంతో మాకు సంబంధం లేదు. మేము విడిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలి. ఆయన అసలు ఎందుకు మాట్లాడడం లేదు? అని ఎంపీ రంజిత్ రెడ్డి నిలదీశారు. ► BRS ఎంపీల అవిశ్వాస తీర్మానంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. Rajya Sabha adjourned till 12 noon amid sloganeering by MPs in the House, who are demanding discussion on Manipur. pic.twitter.com/7KYA1vVmpx — ANI (@ANI) July 26, 2023 రాజ్యసభలో మైక్ లొల్లి ► రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మైక్ను ఆపేశారంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. మైక్ ఆపేయడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిందని వాదించారాయన. అయితే తాను మైక్ ఆపేయలేదని చైర్మన్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. అయినా ఆ వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందకుండా.. నిరసన కొనసాగిస్తున్నారు. ► విపక్ష సభ్యుల నినాదాలతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. ► రాజ్యసభలోనూ విపక్షాల మొండిపట్టు. మణిపూర్పై చర్చ జరగాలని డిమాండ్. ► మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ► పార్లమెంట్వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. బుధవారం ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్ ఘటనపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. ► లోక్సభలో ఎన్డీయే కూటమి బలం 330, ఇండియా కూటమి బలం 141, ఏ కూటమిలో లేని మరో 64 మంది ఎంపీలు. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకం చేశారు. వీగిపోతుందని తెలిసి కూడా.. అవిశ్వాసంతో మణిపూర్ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా విపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. ► అందుకే అవిశ్వాసం మా పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టాం. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే శాంతి నెలకొంటుంది.అందుకే మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. :::బీఆర్ఎస్ ఎంపీ నామా #WATCH | BRS MP Nama Nageswara Rao says, "We have moved the No Confidence Motion on behalf of our party. Since the commencement of the session all Opposition leaders had been demanding discussion on Manipur issue. If the PM speaks on this, there will be peace among people of the… https://t.co/wHC997gWVm pic.twitter.com/Jb9NWfEKPR — ANI (@ANI) July 26, 2023 ► ప్రజలే బుద్ధి చెప్పారు దేశ ప్రజలకు ప్రధాని మోదీ, బీజేపీపై విశ్వాసం ఉంది. గత టర్మ్లోనూ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. ఈ దేశ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. :::పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says, "People have confidence in PM Modi and BJP. They brought a No Confidence Motion in the last term as well. People of this country taught them a lesson." pic.twitter.com/GCemoT5gLT — ANI (@ANI) July 26, 2023 ► లోక్ సభలో వేరుగా.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. అలాగే.. తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీఆర్ఎస్. ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q — ANI (@ANI) July 26, 2023 ► మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ► డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, రంజీత్ రంజన్, ఆప్ ఎంపీ రాఘ చద్దా రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసును సస్పెండ్ చేస్తూ మణిపూర్ పరిస్థితిపై చర్చకు డిమాండ్ చేశారు. ► కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అంతా రంగం సిద్ధమైంది. యాభై మంది ఎంపీలు సంతకాలు చేశారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ — ANI (@ANI) July 26, 2023 ► మణిపూర్ అంశంపై విపక్ష కూటమి ప్రభుత్వంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని చర్చకు రావాలన్న డిమాండ్కు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. పైగా దీర్ఘకాలిక చర్చకూ సిద్దంగా లేదు. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానానికి విపక్ష కూటమి సిద్ధమైంది. ► బుధవారం ఉదయం విపక్ష కూటమి INDIA నేతలు సమావేశం కాగా.. 50 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం కోసం సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్చౌదరి సైతం ధృవీకరించారు. ► అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. ఒకవేళ స్పీకర్ గనుక ఓటింగ్-చర్చకు అనుమతించడం ద్వారా మణిపూర్ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం దొరుకుతుందని, తద్వారా బీజేపీని నిలదీయొచ్చని విపక్ష కూటమి ఇండియా భావిస్తోంది. -
శరద్ పవార్ కీలక నిర్ణయం.. తిరుగుబాటు చేసినవారిపై వేటు..
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి అగ్గి మీద గుగ్గిలమవుతూ వేగంగా పావులు కదుపుతున్నారు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్. ఇందులో భాగంగా అజిత్ పవార్ కు తిరుగుబాటులో సహకరించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ప్రఫుల్ పటేల్, సునీల్ తాత్కారేలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరి మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. తమతో ఉంటూనే తమకు వెన్నుపోటు పొడిచిన వారిని విడిచిపెట్టనని, పార్టీని పునర్నిర్మించుకుంటానని ఇదివరకే ప్రకటించిన శరద్ పవార్ కార్యాచరణ మొదలుపెట్టారు. మొదటిగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకున్న 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ నర్వేకర్ ను కోరారు. అనంతరం అజిత్ పవార్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ఎన్సీపీ నేతలు నరేంద్ర రాథోడ్, విజయ్ దేశ్ ముఖ్, శివాజీరావు గార్జే లపై వేటు వేసిన పార్టీ శరద్ పవార్ ఇప్పుడు కీలక నేతలపై కొరడా ఝళిపించారు. జాతీయ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తాత్కారేల పార్టీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్లో రాస్తూ.. ఎన్సీపీ జాతీయాధ్యక్షుడిగా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటూ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను శ్రీ సునీల్ తాత్కారే, ప్రఫుల్ పటేల్ లను పార్టీ నుండి తొలగిస్తున్నామని తెలిపారు. I, as the National President, Nationalist Congress Party hereby order removal of the names of Shri Sunil Tatkare and Shri Praful Patel from the Register of Members of NCP Party for anti-party activities.@praful_patel @SunilTatkare — Sharad Pawar (@PawarSpeaks) July 3, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
వారంతా అవినీతిపరులే.. కేసులు నుండి తప్పించుకోడానికే..
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు. అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు. మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు. ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్ -
ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఉన్నట్టుండి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా ఎన్సీపీలో నాయకత్వ మార్పుపై అసంతృప్తిగా ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలిపారు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి గవర్నరుని కలవడం, సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా ఆగమేఘాలమీద జరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియా సూలే తోపాటు నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ చేరికతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే అజిత్ పవర్ తో చేతులు కలిపాము. ఇందులో మా ప్రోద్బలం ఏమీ లేదు. ఆయనంతట ఆయనే వచ్చి మాతో చేతులు కలిపారని తెలిపారు. ఆయనతోపాటు ఎన్డీయేలో చేరిన మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఛగన్ భుజబల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావు బాబా ఆత్రం, అదితి తాత్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
కేంద్రం గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలి
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలను కేంద్రం నిలువరిస్తోందని ఆమె మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 % రిజర్వేషన్లు దక్కాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన జాతీయ బంజారా మీట్–2023 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంటు భవనం గిరిజనులదేనని అన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా గిరిజన, ఆదివాసీభవన్లను ఏర్పాటు చేసిందన్నా రు. ఢిల్లీలో సంత్ సేవాలాల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలన్నారు. 15 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంజారాల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలు.. ♦ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా భాషను చేర్చాలి. ♦ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను గిరిజనులుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్లను వర్తింపచేయాలి. ♦ పార్లమెంటు ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా పేరిట బంజారా భవన్ను నిర్మించాలి. ♦ పార్లమెంట్ ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలి. ♦ తెలంగాణలో గిరిజన వర్సిటీని ప్రారంభించాలి. ♦ ప్రైవేటు రంగంలోనూ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలి. -
ఆకాంక్షలు నెరవేరేనా
వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న చివరి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ఇదే. ఎంత కాదన్నా బడ్జెట్ నిర్ణయాలు, కేటాయింపుల ప్రభావం కొన్ని వర్గాలపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు 9 ఏళ్లుగా పాలిస్తోంది. మరోసారి ప్రజామోదం కోసం బడ్జెట్ను ఒక అవకాశంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావిస్తారా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటారా? అన్నది ఫిబ్రవరి 1న తేటతెల్లం అవుతుంది. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పన్నుల భారాన్ని తగ్గించాలన్న మధ్యతరగతి వాసుల వినతులు, వివిధ రంగాల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలేదు. డిమాండ్ పరిస్థితులు దీన్నే తెలియజేస్తున్నాయి. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్ప్రేరణకు ఆర్థిక మంత్రి ఏం చేస్తారో చూడాలి. నిర్మలమ్మకు ఇది ఐదో బడ్జెట్ కానుంది. మధ్యతరగతికి ‘ఐటీ’ తాయిలం..? రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదు. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లుగా ఇదే బేసిక్ పరిమితి కొనసాగుతోంది. రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించారు. కానీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఔషధాల భారాన్ని దింపరూ.. పరిశోధన, అభివృద్ధికి, ఫార్ములేషన్, ఏపీఐల తయారీకి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఔషధాలపై జీఎస్టీని సులభతరం చేయాలని కోరుతున్నాయి. దేశ ఫార్మా పరిశ్రమ 2023 ముగిసే నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా ఉంది. ఫార్మా పరిశ్రమ ఔషధ పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సేవలను అందిస్తున్నా.. సేవల ఎగుమతి ప్రోత్సాహక పథకం (ఎస్ఈఐఎస్) కింద ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని, తమకూ వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. ఆరోగ్యం కోసం ప్రజలు జేబు నుంచి చేసే ఖర్చు 65 శాతంగా ఉందని, కనుక ఔషధాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల ఈ భారాన్ని దింపొచ్చని పరిశ్రమ కోరుతోంది. పాలసీదారులు/బీమా కంపెనీలు మనదేశంలో బీమా వ్యాప్తి ఇప్పటికీ అంతర్జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పెట్టుకుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎంతో మందికి భారంగా పరిణమించిదని, దీన్ని 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోంది. ఉదాహరణకు రూ.10,000 ప్రీమియంపై రూ.1800 పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పన్ను తగ్గింపుతో ప్రీమియం తగ్గడం వల్ల మరింత మంది బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తారని పరిశ్రమ చెబుతోంది. ఈ డిమాండ్ను ఆర్థిక మంత్రి నెరవేర్చితే అది కచ్చితంగా బీమా వ్యాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా అధిక కవరేజీనిచ్చే టర్మ్ ఇన్సూరెన్స్కు ఆదరణ పెరుగుతుంని పరిశ్రమ అంటోంది. హెల్త్ ఇన్సూరెన్స్కు చెల్లించే ప్రీమియం ఒక కుటుంబానికి రూ.25,000 వరకు ఉంటే సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు కావాలని, యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) ఆదాయంపై పన్ను ఎత్తేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మరింత పన్ను మినహాయింపు ఇవ్వాలని బీమా రంగం కోరుతోంది. ఉపాధి కల్పన అమెరికా, యూరప్లో ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుక ఉపాధి కల్పన, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రతిపాదనలకు చోటు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఉపాధి కల్పన లక్ష్యంతోనే మోదీ సర్కారు భారత్లో తయారీ విధానాన్ని ఎంచుకుంది. దీనికింద ఆత్మనిర్భర్ (స్వావలంబన) భారత్ పేరుతో దేశీ తయారిని ప్రోత్సహించే పలు విధానాలను ఇప్పటికే చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఇప్పటికే 14 రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మరిన్ని రంగాలు తమకు సైతం పీఎల్ఐ ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్నాయి. వీటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారన్నది బడ్జెట్తో తెలుస్తుంది. స్టార్టప్లకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనికి కూడా కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కింద కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ద్వారా ఉపాధి కల్పించొచ్చనే సూచనలు వస్తున్నాయి. ఫిన్టెక్/ఎంఎస్ఎంఈ దేశీ ఫిన్టెక్ పరిశ్రమ తమకు మరిన్ని మద్దతు చర్యలు కావాలని కోరుతోంది. అందరికీ ఆర్థిక సేవల చేరువలో తమ పాత్ర కీలకమని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు కీలకంగా వ్యవహరిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం అవసరాలు తీర్చడంలోనూ ఫిన్టెక్ పరిశ్రమ చేస్తున్న సేవలను గుర్తు చేసింది. 45 శాతం మందికి ఉపాధినిస్తూ, జీడీపీలో 30 శాతం వాటాను ఎంఎస్ఎంఈ పరిశ్రమ కలిగి ఉంది. కనుక బడ్జెట్ ప్రతిపాదనల పట్ల ఫిన్టెక్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. కార్పొరేట్ రంగం డిమాండ్.. కొత్తగా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే దేశీ కంపెనీలకు అతి తక్కువగా 15 శాతం కార్పొరేట్ పన్నును కేంద్రం లోగడ ప్రకటించింది. 2024 మార్చి 31లోపు తయారీ కార్యకలాపాలు ఆరంభించేవి ఈ ప్రయోజనం పొందొచ్చు. ఈ గడువును పొడిగించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని, తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయట పడేందుకు కంపెనీలకు సమయం పట్టిందని.. ఇప్పుడు నూతన పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నందున గడువు పొడిగించాలనే డిమాండ్ ఉంది. కొత్త ప్లాంట్ తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కనీసం 2–3 ఏళ్లు పడుతుందని, కనుక ప్రస్తుత గడువు చాలదన్న అభిప్రాయం ఉంది. ఆదాయపన్ను విషయంలో ఊరట కల్పిస్తే అది హౌసింగ్ పరిశ్రమ వృద్ధికి మేలు చేస్తుందని రియల్టీ భావిస్తోంది. భారీ ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం తమకు క్షేత్రస్థాయిలో రుణ లభ్యత సమస్యగా ఉందని చెబుతోంది. ఎంఎస్ఎంఈ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కీలకమైన ఆటోమొబైల్ రంగం పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. కనిష్టంగా 28%, గరిష్టంగా 40 శాతానికి పైనే వాహనాలపై పన్నుల భారం వేస్తున్నారని.. మార్కెట్ విస్తరణకు ఇది అవరోధంగా నిలుస్తున్నట్టు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్ కోర్కెలు మూలధన లాభాల పన్ను పరంగా ఉపశమనం కల్పిస్తే అది మార్కెట్లకు మంచి జోష్నిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెట్, ఈక్విటీ, ప్రాపర్టీలకు వేర్వేరు మూలధన లాభాల పన్ను, హోల్డింగ్ పీరియడ్ అమలవుతున్నాయి. వీటి మధ్య ఏకరూపతకు అవకాశం ఉందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఇప్పటికే సంకేతం ఇచ్చింది. ఈ క్రమంలోనే మూలధన లాభాల పన్ను విషయమై అంచనాలు ఏర్పడ్డాయి. దీర్ఘకాల మూలధన లాభాలపై నష్టాన్ని, స్వల్పకాల మూలధన లాభాలతో సర్దుబాటుకు అవకాశం లేదు. విద్యారంగం దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విద్యా సంస్థలకు మోదీ సర్కారు ఆహ్వానం పలికింది. విద్యా సేవలపై జీఎస్టీ భారాన్ని తొలగించడం లేదంటే తగ్గించాలని విద్యా సంస్థలు కోరుతున్నాయి. దేశంలో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి పిరమిడ్ మాదిరి చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అందుకుని ఉన్నత విద్యలోనూ మరింత మంది చేరేందుకు వీలుగా ఆకర్షణీయమైన రుణ పథకాలు, స్కాలర్షిప్లు ప్రకటించాలనే డిమాండ్ ఉంది. గృహ కల్పన అందరికీ ఇల్లు అనేది మోదీ సర్కారు నినాదం. దీని సాకారానికి వీలుగా రుణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని హౌసింగ్ పరిశ్రమ కోరుతోంది. అందుబాటు ధరల ఇంటికి నిర్వచనాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ఉంది. నిర్మాణ రంగ మెటీరియల్ అయిన స్టీల్, సిమెంట్పై జీఎస్టీ తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువును మరింత కాలం పెంచాలని కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణంపై కొంత రాయితీ లభిస్తుంది. రైతులను చూస్తారా..? సాగు రంగం నుంచి డిమాండ్ల చిట్టా పెద్దదిగానే ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా సాగుకు కావాల్సిన ముడి సరుకుల కోసం ఇస్తున్న రూ.6,000ను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనివల్ల రైతులు రుణాలతో పనిలేకుండా సాగుకు కావాల్సిన ముడి పదార్థాలను కొనుగోలు చేసుకోగలరన్న సూచన ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందించాలనే డిమాండ్ సైతం ఉంది. అగ్రి టెక్ స్టార్టప్లకు రాయితీలు కల్పించాలని, ఆగ్రోకెమికల్స్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. సాగులో టెక్నాలజీ విస్తరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు చర్యలు ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ముడి చమురు మాదిరే వంట నూనెల విషయంలోనూ 65 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీంతో ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్’ పేరుతో నూనె గింజల సాగుకు ఆర్థిక సహకారం అందించాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఏటా రూ.25,000 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించాలని కేంద్రానికి సూచించింది. దీనివల్ల దిగుమతులను 30 శాతానికి తగ్గించొచ్చని పే ర్కొంది. సాగు రంగంలో పరిశోధన, అభివృద్దికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ధనూకా గ్రూప్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్న బడ్జెట్లో వ్యవసాయానికి మెరుగైన కేటాయింపులు చేస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెల్త్కేర్కు పెద్ద పీట వేస్తారా? ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్) రంగానికి బడ్జెట్లో కేటాయింపులను 20–30 శాతం పెంచాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని గర్తు చేసింది. హెల్త్కేర్ రంగానికి 2022–23 బడ్జెట్లో 16.5 శాతం అధికంగా రూ.86,200 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ విడత కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపుల పట్ల భారీ అంచనాలతో ఉన్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా హెల్త్కేర్ పరిశ్రమ డిజిటైజేషన్కు అదనపు నిధులు అవసరమని అపోలో టెలీహెల్త్ సీఈవో విక్రమ్ తాప్లూ అభిప్రాయపడ్డారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకటించినప్పటికీ, వీటి విస్తరణకు మరిన్ని నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్ సేవల విస్తరణకు అధిక నిధుల కేటాయింపు అవసరమని డాక్టర్ అగర్వాల్ సైతం పేర్కొన్నారు. స్వచ్చందంగా మెడికల్ ఇన్సూరెన్స్కు ప్రతిపౌరుడికీ అవకాశం కల్పించాలని కోరారు. అది కూడా ఉచితంగా అందించాలని సూచించారు. కేన్సర్ కేర్ వసతుల పెంపునకు మరిన్ని నిధులు అవసరమని నిపుణుల సూచనగా ఉంది. హెల్త్కేర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధి కేటాయించాలనే డిమాండ్ సైతం ఉంది. – బిజినెస్ డెస్క్ -
'దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ.. ఆయన చెప్పిందే వేదం..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చెప్పిందే వేదమని, నియంతృత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో దేశ న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. జ్యుడీషియరీని కూడా ప్రధాని కార్యాలయంలో ఓ భాగం చేశారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని జైరాం రమేశ్ మీడియా సమావేశంలో తెలిపారు. 'దేశంలో అనధికారిక ఎమెర్జెన్సీ ఉంది. ఒక వ్యక్తే శాసిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సభలో చర్చలు జరగనివ్వడం లేదు. రెండున్నరేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
ఎంబీబీఎస్ సీట్లు 87% పెరిగాయ్
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 87%, పీజీ మెడికల్ సీట్లు 105% పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. గురువారం ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశంలో యువతకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం 2014 తర్వాత పలు చర్యలు చేపట్టిందన్నారు. ఫలితంగా, 2014లో 387 మెడికల్ కాలేజీలుండగా, 2022 కల్లా వాటి సంఖ్య 648కి పెరిగిందన్నారు. 2014 తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 96%, ప్రైవేట్ కళాశాలల సంఖ్య 42% పెరిగిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 355 ప్రభుత్వ, 293 ప్రైవేట్ వైద్య కళాశాలలున్నాయని తెలిపారు. అదేవిధంగా, 2014లో ఎంబీబీఎస్ కాలేజీల్లో 51,348 సీట్లుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 96,077కు చేరిందన్నారు. 2014లో 31,185 పీజీ మెడికల్ సీట్లుండగా, 2022కు వచ్చే సరికి అవి 63,842కు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచాలనే లక్ష్యంతో 16 రాష్ట్రాల్లోని 58 కాలేజీలకు గాను 3,877 ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు ఆమోదం తెలిపామన్నారు. ఇదే విధంగా, 21 రాష్ట్రాల్లోని 72 మెడికల్ కాలేజీల్లో మొదటి దశలో 4,058 పీజీ సీట్ల పెంపునకు అనుమతించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై) ద్వారా 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు, 75 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆధునీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. -
మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప ఒరిగిందేమీ లేదు
ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్గా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం. - జూలకంటి రంగారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే -
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్మన్గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తలచుకుంటే నడుచుకోవాలి!
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపాన ఉన్న ఛత్రంలో సెప్టెం బరు 8న స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఒకప్పుడు ఆ ఛత్రంలో ఉండిన బ్రిటిష్ రాజు 5వ జార్జ్ విగ్రహం తొలగింపుతో ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేయాలన్న విషయమై దశాబ్దాల తరబడి సాగిన ఊగిసలాట అనంతరం తీసు కున్న సముచిత నిర్ణయం ఇది. స్వాతంత్య్ర సాధన కోసం సాయుధ మార్గాలను అన్వేషిస్తూ నేతాజీ 1941 జనవరి 26న భారతదేశాన్ని వీడి ప్రవాసం వెళ్లిన అనంతరం ఇన్నేళ్లకు న్యూఢిల్లీలో తొలిసారిగా ఏర్పాటైన ఆ యోధుడి గర్వస్థలి ఇది! 1947కి ముందే అండమాన్ను వలస పాలన నుంచి విముక్తం చేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు బోస్ను ‘అఖండ భారత్కు తొలి అధిపతి’గా మోదీ ప్రశంసించడం కూడా సరైనదే. అదే సమయంలో మనం స్వతంత్ర భారతిపై బోస్ ఆలోచనలు ఏమిటన్నవి మననం చేసుకోవాలి. స్వాతంత్య్రానంతరం భారత భద్రతా బలగాలు ఎలా ఉండాలనే విషయమై నేతాజీ ఐరోపాలో ఉన్నప్పుడే ప్రయోగాత్మకమైన ఆలోచనలు చేశారని చాలామందికి తెలియకపోవచ్చు. 1943 అక్టోబరు 21న షోనన్ (సింగ పూర్)లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వరంగంగా బోస్ 1943 ఆగస్టు 25న ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి నాయకత్వం వహించడానికి చాలాముందే ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆనాటికి బెర్లిన్లో ఉంటున్న దివంగత భారతీయ పాత్రికేయుడు ఏసీఎన్ నంబియార్తో భవిష్యత్ స్వతంత్ర భారత విదేశాంగ విధానం, రక్షణ, అంతర్గత పాలనపై తన ఆలోచనలను బోస్ 1934 నుండీ నిరంతరంగా పంచుకుంటూ వచ్చారు. 1942–1945 మధ్య కాలంలో నంబియార్ ఐరోపాలో బోస్కు సహాయకారిగా ఉన్నారు. బోస్ ఆయనను 1942 జనవరిలో పూర్తి దౌత్య హోదాతో బెర్లిన్లోని జర్మనీ విదేశాంగ కార్యాలయానికి అను బంధంగా ఉన్న ‘ఆజాద్ హింద్ ఆఫీస్’కు తన డిప్యూటీగా నియమించుకున్నారు. 1943 ఫిబ్రవరి 8న బోస్ రహ స్యంగా ఐరోపాను విడిచిపెట్టారు. బోస్తో నంబియార్ జర్మనీ, జపాన్లలోని ఫౌజ్ యంత్రాంగం ద్వారా మంత నాలు జరుపుతుండేవారు. బోస్కు ఆయన చివరి సమా చారం 1945 జనవరి 12న జర్మనీ పడవ యు–234 ద్వారా బట్వాడా అయింది. అయితే ఆ పడవ 1945 మే 14న అమెరికా నౌకాదళానికి పట్టు బడటంతో ఆ సమాచారం బోస్కు చేరలేదు. గాంధీజీ ప్రబోధించిన మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర భారతావనిలో అన్ని పాలనా వ్యవస్థలను నిర్మించడం బోస్ పథకం అని నంబియార్ నాతో చెప్పారు. జర్మనీలో బోస్ చేపట్టిన ప్రారంభ కార్యకలాపాలలో ఒకటి, 1941 డిసెంబర్ నుంచి భారత సైనిక దళాన్ని పటిష్టం చేసుకుంటూ రావడం. అందుకోసం ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలను జర్మనీ సహకారంతో వాలంటీర్లుగా తీసుకున్నారు. ఏడాది లోనే దాదాపు 4,000 మంది బోస్ దళ వాలంటీర్లుగా చేరారు. ‘‘భారతదేశంలోని ప్రధాన సామాజిక వర్గాలతో బోస్ దళం సమీకృతంగా ఉండేది. ఆ వర్గాలలోని అల్పసంఖ్యాకులైన ముస్లిం, సిక్కు ప్రతినిధుల సంక్షేమం కోసం బోస్ శ్రద్ధ వహించారు. అంతే కాదు, బోస్ తన కొత్త సైన్యాన్ని మతం, కులం లేదా ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లుగా విభజించాలని అనుకోలేదు. తన దళంలో మైనారిటీల మనోభావాలు దెబ్బతినకుండా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను బోస్ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ముస్లింలు నిరసించిన ‘వందేమాతరం’కు బదులుగా రవీంద్రనాథ్ టాగూర్ ‘జనగణమన’ను ఎంచుకున్నారు. మైసూర్కు చెందిన బ్రిటిష్ వ్యతిరేక యోధుడు టిప్పు సుల్తాన్ స్ఫూర్తిని సైన్యంలో ప్రేరేపించ డానికి ఆజాద్ దళ త్రివర్ణ పతాకం మధ్యలో దుముకుతున్న పులిని చేర్చారు’’ అని చరిత్రకారుడు సుగతా బోస్ తెలి పారు. తర్వాత పులి గుర్తుకు బదులుగా గాంధీజీ ‘చరఖా’ వచ్చింది. ఆజాద్ హింద్ ఫౌజ్లోని సైనికుల వేర్వేరు భాషల వల్ల కూడా సైనిక దళ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని బోస్ బలంగా నమ్మారు. ఆ పరిస్థితిని నివారించేందుకు రోమన్ లిపిలో రాసిన హిందుస్థానీ భాషను దళాల ఉమ్మడి మాధ్యమంగా బోస్ స్వీకరించారని ఫౌజ్కు 1941–45 మధ్య హిందీ–జర్మన్ అనుసంధాన వ్యాఖ్యాతగా పనిచేసిన ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ లెక్చరర్ రుడాల్ఫ్ హార్టోగ్ తెలిపారు. హిందువులు, ముస్లిములు మాట్లాడే భాషలను హిందూస్థానీగా సమ్మిళితం చేయడం ద్వారా తన సైనిక దళంలో బోస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సంస్కృతుల మధ్య సమైక్యతను సాధించారని హార్టోగ్ రాశారు. 1939 తర్వాత కాంగ్రెస్లోని మితవాద నాయకులతో విభేదించిన కారణంగా గాంధీజీకి బోస్ దూరమైనప్పటికీ, అది ఆయన పట్ల బోస్కు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేదు. 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన ప్పుడు బోస్ ‘ఆజాద్ హింద్ రేడియో’ ద్వారా గాంధీజీ ఆదేశాలను విధిగా పాటించాలని భారతీయులందరికీ స్పష్టమైన పిలుపు నిచ్చారు. (క్లిక్ చేయండి: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) 1944 జూలై 6న బోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్కు గాంధీజీ ఆశీర్వాదం కోసం సింగపూర్ నుండి ప్రత్యేక రేడియో ప్రసంగం చేశారు. ‘‘జాతిపితా, భారతదేశ విముక్తి కోసం ఈ పవిత్ర యుద్ధంలో మేము మీ ఆశీర్వాదాలను, శుభాకాంక్షలు కోరుతున్నాము’’ అని బోస్ తన ప్రసంగంలో అన్నారు. 2012లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, గాంధీజీని ఎవరైనా ‘జాతిపిత’ అని సంబోధించిన తొలి సందర్భం అది! ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేతాజీ ప్రాధాన్యాలను అనుసరించాలనుకుంటే, దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. లేదంటే, మత సామరస్యం అన్నది ఒక నినాదంలా మాత్రమే మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...) - వప్పల బాలచంద్రన్ కేబినెట్ సెక్రటేరియట్ మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Sakshi Cartoon: సంవత్సరాల అభివృద్ధి కేవలం రోజుల్లో చెప్పేంత ఉందా సార్!
సంవత్సరాల అభివృద్ధి కేవలం రోజుల్లో చెప్పేంత ఉందా సార్! -
Sakshi Cartoon: మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం
మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం -
మీది ఎన్డీఏనా.. ఎన్పీఏనా?.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి దేశంలో నిరుద్యోగం పెరిగింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అతిఎక్కువ ధరకు చేరుకుంది. వినియోగదారుల నమ్మకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు చెప్తోంది. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అనాలా లేక ఎన్పీఏ ప్రభుత్వం అనాలా? భక్తులారా.. ఎన్పీఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) అని అర్థం’అంటూ ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటే యుద్ధం చేస్తామంటూ వీహెచ్పీ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపైనా కేటీఆర్ స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారూ.. వీళ్లందరూ ఈ దేశ రాజ్యాంగం, పీనల్ కోడ్ నిబంధనలకు అతీతులా? మీ అధికార పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీసులకు ఇలాంటి దారుణ పరిస్థితులను మీరు సహిస్తారా?’అని ప్రశ్నించారు. (చదవండి: కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేయాలి) బెంగళూరులో పెట్టుబడులివిగో! కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు హైదరాబాద్కు రావాలంటూ మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్పై కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్ గ్రూప్ స్పందించింది. ‘కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పరిసరాల్లో సుమారు రూ. 11,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 46,984 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన పరిశ్రమల జాబితాలో రెండు లిథియం అయాన్ సెల్ యూనిట్లు, ఎక్సైడ్ ప్లాంటు ఉన్నాయి’ అని పరిశ్రమల జాబితాను కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసింది. (చదవండి: రాహుల్ రాకతో ’సీన్’ మారాల్సిందే) -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్లో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలు, నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలను తాము సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్–చైనా ఒక్కటయ్యాయంటూ రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్–చైనా బంధంపై మాట్లాడే విషయాన్ని ఆయా దేశాల ప్రజలకే వదిలేద్దామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. అమెరికా, చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలన్నది ప్రపంచ దేశాల ఇష్టమని చెప్పారు. దేశానికి రాజా అనుకుంటున్నారు... లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ మాటల దాడి కొనసాగిస్తోంది. ఆయన భారతదేశానికి ఇన్నాళ్లూ యువరాజులాగా ప్రవర్తిం చేవారని, తప్పుడు రాజును అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎద్దేవా చేశా రు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాహుల్ గాంధీ దృష్టిలో తప్పేనా? అని బీజేపీ అధికార ప్రతినిధి, బిహార్ మంత్రి షానవాజ్ హుస్సేన్ నిలదీశారు. నిజాలే మాట్లాడారన్న కాంగ్రెస్ రెండు భారతదేశాలు అంటూ పార్లమెంట్లో ప్రసంగించిన రాహుల్ గాంధీని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థించారు. దేశానికి రెండు ముఖాలు ఉన్నాయని, ఒకటి ధనికం కాగా, మరొకటి నిరుపేద అని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రెండింటి మధ్య అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే రాహుల్ విమర్శించారని గుర్తుచేశారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని పేర్కొన్నారు. రాహుల్ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ఖండించారు. సభా హక్కుల నోటీసు పార్లమెంట్ సభ్యులను, దేశ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కాంగ్రెస్ నేత రాహుల్ గాం ధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసును లోక్సభ సెక్రటేరియట్కు అందజేశారు. భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛ వెల్లడించే రాజ్యాంగబద్ధ హక్కు ప్రతి ఎంపీకి ఉన్నప్పటికీ ఈ విషయంలో మర్యాద పాటించాలని దూబే పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి రాహుల్ చేసి న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భారత్ను రాహుల్ ఒక దేశంగా పరిగణించకపోవడం బా ధాకరమని, రాహుల్ అసలు రాజ్యాంగ ప్రవేశికను చదివారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించాలన్నారు. -
చెప్పింది ఒకటి... చేసేదొకటి!
ఎన్నికలు రాగానే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంట్లో లక్షలు సొమ్ము వేస్తామని చెబితే పేదప్రజలందరూ నమ్మి ఓట్లు వేసి గద్దె నెక్కించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క రూపాయి కూడా ఏ ఖాతాకు జమ కాలేదు. నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని పైకి తీసుకొని వస్తానన్నారు. ఏమయింది? చివరకు నల్ల ధనం, నకిలీధనం కూడా ఆర్బీఐలోకి వెళ్లాయి. ఎంత ధనం ఆర్బీఐకి వచ్చిందో లెక్క తేల్చలేని పరిస్థితి. బ్యాంకులలో ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)లు ఎక్కువ య్యాయని చిన్నాచితకా బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మొత్తం బ్యాంకులను అమ్మివేసే పరిస్థితి! ఫలితంగా ఎన్పీఏలు తగ్గకపోగా సుమారు 15 శాతానికి పెరగటం గమనార్హం. రిజర్వు బ్యాంకులో ఉన్న అధిక ధనాన్ని డివిడెండుగా ప్రభుత్వం వాడుకొని స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వు బ్యాంకుని నిర్వీరం చేస్తోంది. బ్యాంకులను జాతీయీ కరణ చేసిన ఘనత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకే దక్కుతుంది. లేకపోతే సామాన్యుడు బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయేది. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తానని చెప్పి ఆ పని చేయలేక పోయారు. పీఎం ఫసల్ బీమాని ప్రయివేట్ సంస్థల కిచ్చి రైతులకు పంట నష్టం జరిగినపుడు న్యాయ బద్ధంగా ఇవ్వవలసిన క్లయిమ్ను ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించినా... పంటలను కొనకుండా రైతులను నిండా ముంచుతున్నది కేంద్రం. నిత్యం పాలిచ్చే ఆవులాగ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని కార్పొరేట్లకు అమ్మాలన్న ఆలోచన చూస్తుంటే దేశాన్ని ఈ పాలకులు ఏ దారికి తీసుకెలుతున్నారనే అనుమానం కలుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు తెగనమ్మాలనుకోవడం దేనికి నిదర్శనం? సుమారు 20 వేల మంది ఉద్యోగుల భవితవ్యాన్ని గాలిలో కలిపేస్తారా? కాంగ్రెసు పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే... దానికి పార్లమెంటులో వత్తాసు పలికి, తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? విభజన చట్టంలో పోలవరానికి పూర్తిగా నిధులు ఇస్తామని చెప్పిన మాట మార్చి రకరకాల మాటలు చెప్పడం దేనికి సంకేతం? విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తాననడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గుతున్నా... మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర పాలన ఎవరికి లాభం చేకూర్చుతున్నదో అర్థం కాని ప్రశ్న. ఒక దేశం ఒకే పన్ను విధానాన్ని (జీఎస్టీ) తీసుకొచ్చి చిన్న వ్యాపారస్థుల నడ్డి విరిచారు. ప్రతి నెలా రిటర్ను దాఖలు చేయడంతోనే సమయం డబ్బు వృథా అవుతుండడం వలన చిన్న వ్యాపార స్తుల కష్టాలు వర్ణనాతీతం. ప్రతి మనిషికి అవసరమైన బట్టలను, చెప్పులను కూడా వదలకుండా పన్ను విధించటం గమనార్హం. బట్టలపై 5% పన్ను విధించి, అంతటితో ఆగకుండా మరలా 7% పన్నుని విధించటం వలన వ్యాపార వర్గంలోను, ప్రజలలోనూ వ్యతిరేకత పెరిగింది.. దీంతో సదరు పన్నును కేంద్రం ఉపసంహరించుకొంది. కొత్త వ్యవసాయ చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించడంతో రైతులు ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో దిక్కుతోచని పరిస్థితిలో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. - కొవ్వూరి త్రినాథరెడ్డి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం -
కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రిమండలిని విస్తరించనున్నట్టు తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరో 25 మందికి చోటు ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షమైన అప్నాదళ్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియా పటేల్కు, జేడీయూ, లోక్జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్ సింగ్లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి.. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కనుంది. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులలో జీవీఎల్కుగానీ, టీజీ వెంకటేష్కుగానీ చాన్సు దక్కొచ్చని తెలుస్తోంది. -
రాజ్యసభలో వంద దాటిన ఎన్డీయే బలం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 100 దాటింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది. తాజా విజయాలతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 92కి చేరింది. మిత్రపక్షం జేడీయూకి ఎగువ సభలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు కాకుండా, మిత్రపక్షాలు ఆర్పీఐ–అఠావలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పీఎంకే, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే, కీలక బిల్లుల ఆమోదానికి, అవసరమైనప్పుడు అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నాడీఎంకేకు 9 మంది, బీజేడీకి 9 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లు రాజ్యసభలో కీలక, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన ప్రభుత్వానికి తాజా విజయాలతో ఆ సమస్య తొలగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 242. యూపీ, ఉత్తరాఖండ్ల్లో జరిగిన తాజా ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 3 స్థానాలను, బీఎస్పీ 1 స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం యూపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బీజేపీకి చెందిన నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్, గీతా షాఖ్య, హరిద్వార్ దూబే, బ్రిజ్లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేదీ ఉన్నారు. ఎస్పీ నుంచి రామ్గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్జీ గౌతమ్ కూడా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున నరేశ్ బస్వాల్ ఎన్నికయ్యారు. -
పాకిస్తాన్ కంటే చైనాయే డేంజర్!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకముందని 73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 17 శాతం ప్రజలు విపక్షాలపై నమ్మకం ఉందన్నారు. చైనాతో ఘర్షణలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానంపై సీఓటర్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక సర్వేలో పాల్గొన్న 61 శాతం మంది రాహుల్ గాంధీపై నమ్మకం లేదన్నారు. జాతీయ భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకం ఉందని 73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో 14 శాతం మాత్రమే రాహుల్ గాంధీ పై నమ్మకం ఉందని అన్నారు. (చదవండి: ఆ వార్త అవాస్తవం: చైనా) ఇక 68 శాతం మంది చైనా వస్తువులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరో 31 శాంత మంది చైనా వస్తువులను కొనడంలో అభ్యంతరం లేదని చెప్పారు. పాకిస్థాన్ కన్నా చైనాయే భారత్కు పెద్ద సమస్య అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. చైనా వైఖరి భారత్కు ప్రధాన ఆందోళన అని 68 శాతం మంది తెలిపారు. 32 శాతం మంది పాకిస్తాన్ ప్రమాదకరమని అన్నారు. గల్వాన్ హింసాత్మక ఘటనల్లో భారత్ ఇంకా చైనాకు గట్టి జవాబు ఇవ్వలేదని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. (చదవండి: భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?) -
ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన సభలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు, ఆ కూటమి ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం జరిగిందని, విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని కేంద్రం మాట తప్పిందని గుర్తు చేశారు. -
ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి
-
‘శరద్కు కేంద్ర పదవులు’
పట్నా: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ను కూడా శరద్ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్ దివాస్గా జరుపుకుంటామన్నారు. -
దేశీయ పరిశ్రమకు ఆర్సీఈపీ విఘాతం
మన అభివృద్ధి ప్రక్రియే ప్రస్తుతం మందగించిపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాల్లో ఆర్సీఈపీ సభ్యదేశాలకు తలుపులు తెరవడం వల్ల భారత్కు లాభం కంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువ. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మన పరిశ్రమ ఏమాత్రం సిద్ధంగా లేదు. బయట నుంచి వచ్చే ఎలాంటి పోటీకి కూడా మన పరిశ్రమలు తట్టుకునే స్థితిలో లేవు. ఒప్పందం షరతులను అమలు చేస్తే భారతీయ పరిశ్రమలు మూసివేతకు గురవుతాయి. ప్రపంచీకరణ విధానంలో భాగంగా భారత ప్రభుత్వాలు ఉద్యోగాలకు, ఉపాధికి కాకుండా వృద్ధికే అమిత ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాయి. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. బ్యూరోక్రాట్ల వైఖరి ఎలా ఉన్నా దేశ శ్రేయస్సుకు సంబంధించి రాజకీయనాయకత్వం అప్రమత్తంగా ఉండాలి. మనం చస్తున్నా సరే.. ఆర్థిక వ్యవస్థ మాత్రం స్వేచ్ఛా వాణిజ్యానికే మళ్లాలనుకోవడం ప్రమాదకరం. స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకిస్తున్నందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ను విధ్వంసకరమైన సంస్థగా ముద్రించారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతున్నట్లు సర్వత్రా భయాం దోళనలు వ్యాపిస్తున్న సమయంలో చైనా నేతృత్వంలో ఏర్పడిన 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వాణిజ్య ఒప్పంద కూటమి (ఆర్సీఈపీ)లో చేరితే భారత్ తీవ్రంగా నష్టపోతుందని భారతీయ వ్యవసాయ, పౌర సమాజ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ మన దేశం ఆర్సీఈపీలో చేరడంపై అత్యంత ఆసక్తి చూపుతుండటాన్ని ఆర్ఎస్ఎస్ ఆర్థిక విభాగం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారతీయ అభివృద్ధి ప్రక్రియే ప్రస్తుతం మందగించిపోతున్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలను ఆర్సీఈపీ సభ్యదేశాలకు తలుపులు తెరవడం వల్ల భారత్కు లాభం కంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువని ఆరెస్సెస్ అనుకూల ఆర్థిక చింతనా సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎమ్) జాతీయ సహ కన్వీనర్ అశ్వని మహాజన్ పేర్కొంటున్నారు. దేశ రాజకీయ నాయకత్వం, మీడియా కూడా చైనా నియంత్రణలోని ఒప్పందం గురించి ప్రగాఢ ఆసక్తి ప్రదర్శిస్తుండటంపై అశ్వని తీవ్రంగా విమర్శిస్తున్నారు. చైనా నేతృత్వం లోని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వైపు పరుగుతీయడం కంటే దేశీయ పాలపరిశ్రమ, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అశ్వని అంటున్నారు. ఆయన ఇంటర్వ్యూ సారాంశం క్లుప్తంగా... ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వాణిజ్య ఒప్పంద కూటమి (ఆర్సీఈపీ) గురించి 2011 సంవత్సరం నుంచి చర్చల్లో ఉంటోంది. ఈ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అన్ని షరతులను భారత్ ఆమోదిస్తే అది దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదని మా అభిప్రాయం. యూపీఏ హయాంలో కూడా మా వైఖరి ఇదే. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మన పరిశ్రమ ఏమాత్రం సిద్ధంగా లేదు. బయట నుంచి వచ్చే ఎలాంటి పోటీకి కూడా మన పరిశ్రమలు తట్టుకునే స్థితిలో లేవు. ఒప్పందం షరతులను అమలు చేస్తే భారతీయ పరిశ్రమలు మూసివేతకు గురవుతాయి. ఒక పరిశ్రమను ఏర్పర్చడానికి చాలా ప్రయత్నం అవసరం. ఉక్కు, ఆటోమొబైల్స్, రసాయనాలు, టెలికం, డెయిరీ, వ్యవసాయం వంటి అన్నిరంగాల్లోనూ భారీస్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది నియమితులయ్యారు. ఇలాంట ప్పుడు మన దేశీయ సామర్థ్యాలు బయటి శక్తుల ప్రభావానికి గురైతే ఈ రంగాలు ఏవీ తట్టుకుని నిలబడలేవు. దీంతో భారతీయ పరిశ్రమలు మూతపడతాయి. దేశం భారీ స్థాయిలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనవలసి ఉంటుంది. బయటి శక్తుల ప్రభావం ఎంత ప్రమాదకరమైనదో 1991 నుంచి అనేక ఉదాహరణలను చూడవచ్చు. ప్రపంచీకరణ విధానంలో భాగంగా భారత ప్రభుత్వాలు ఉద్యోగాలకు, ఉపాధికి కాకుండా వృద్ధికే అమిత ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాయి. అదేవిధంగా విదేశాలనుంచి మన మార్కెట్లకు వెల్లువలా సరుకులను ఆహ్వానించాము. ప్రత్యేకించి 2001 నుంచి చైనా ఉత్పత్తులు భారత్కు వెల్లువలా తరలివచ్చాయి. గత ప్రభుత్వాలు ఏవీ దిగుమతుల వెల్లువను అరికట్టలేకపోయాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ సరుకుల దిగుమతిని కాస్త ఆపడానికి ప్రయత్నించింది. ప్రత్యేకించి గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఒక అవగాహనతో పనిచేస్తోంది. భారతీయ పరిశ్రమ తీవ్రంగా ఇబ్బందిపడుతోందని కేంద్రం గమనించింది. స్థానిక పరిశ్రమను కాపాడేందుకు రక్షణాత్మక సుంకాలను విధిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం తెలిపింది. యాంటీ డంపింగ్ సుంకాలను కూడా కేంద్రం విదేశీ దిగుమతులపై విధించింది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగానే ఉంది. చైనా నుంచి వెల్లువలా వస్తున్న దిగుమతులను అరికట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.ఆర్సీఈపీపట్ల కేంద్రప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండేది. 2015–16 సంవత్సరాలలో నిర్మలా సీతారామన్ వాణిజ్య మంత్రిగా ఉండేటప్పుడు భారత్ ఆర్సీఈపీలో చేరడానికి సిద్ధంగా లేదని స్పష్టంచేశారు బ్యూరోక్రాట్లు, వాణిజ్య నిపుణులు, ఆర్థిక వేత్తలు, మీడియా కూడా నాటి సమావేశంలో పాల్గొన్నారు. అందరి అభిప్రాయం ఆర్సీఈపీకి వ్యతిరేకంగానే ఉండేది. అయితే తర్వాతేం జరిగిందో తెలీదు కానీ కేంద్ర ప్రభుత్వం మరోవైపున స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నట్లు ఉంది. ఆర్సీఈపీ వ్యవహారాలను పరిశీలించాల్సి ఉండిన బ్యూరోక్రాట్లు ఆ ఒప్పం దంలో చేరవలసిన అవసరం గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తూవచ్చారు. అంటే వారు ప్రభుత్వానికి వివరించడం అనే ప్రక్రియనుంచి చాలా దూరం పోయారు. వాస్తవం చెప్పాలంటే యావద్దేశం స్వేచ్ఛా వాణిజ్యం పట్ల తీవ్ర వ్యామోహంతో ఉంటోంది. మీడియాది కూడా ఇదే దారి. మన దేశ వాణిజ్య పత్రికలను ఒకసారి చూస్తే చాలు అర్థమవుతుంది. మన ఆర్థిక వ్యవస్థ తలుపులను పూర్తిగా తెరిచి ఉంచాలనే దుగ్ధ వీరికీ ఉంది. సుంకాలు జీరోకి తగ్గించాలని, అలా చేయకపోతే తాము పోటీ పడలేమని, మనం చస్తున్నా సరే.. ఆర్థిక వ్యవస్థ మాత్రం స్వేచ్ఛా వాణిజ్యానికే మళ్లాలని వీరి ఘనమైన అభిప్రాయం. దాన్ని వ్యతిరేకిస్తున్నందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ను విధ్వంసకరమైన సంస్థగా వారు ముద్రించారు. పైగా దేశ శ్రేయస్సు గురించి తమకే బాగా తెలుసని వారు భావిస్తున్నారు మరి. దేశంలో నిజాయితీ కలిగిన జర్నలిజం ఇప్పుడు లేదు. ఈ పరిస్థితికి వారు కూడా బాధ్యులే. బ్యూరోక్రసీ, మీడియా దారి ఏదైనా, రాజకీయ నాయకత్వం మాత్రం జాగరూకతతో పనిచేయాల్సి ఉంది. అందుకే ఆర్సీఈపీకి వ్యతిరేకంగా జాతీయవ్యాప్త ఆందోళనకు స్వదేశీ జాగరణ్ మంచ్ సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం వల్ల ప్రభావితం అయ్యే రంగాలు ఏవనే విషయం వెల్లడి కావాలి. పసిబిడ్డ ఏడిస్తేనే కదా తల్లి పాలు ఇచ్చేది. అందుకే స్వేచ్ఛావాణిజ్యం కారణంగా దెబ్బతింటున్న పరిశ్రమలు, వర్గాలు ఒక్కటొక్కటిగా తమ గొంతు విప్పాల్సి ఉంది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆందోళనకు దిగినప్పుడు సైకిల్ పరిశ్రమ తన సమస్యలతో ముందుకొచ్చింది. అలాగే ఉక్కు పరిశ్రమ, టెలికాం పరిశ్రమ కూడా గళం విప్పాయి. చివరకు కొందరు మంత్రులు సైతం ఈ ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఆ ఒప్పం దాన్ని కోరుకుంటున్నట్లయితే, ముందుగా భారత ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఎవరు ఎక్కడ తప్పు చేశారు అనేది రాజకీయ నాయకత్వం గుర్తించగలదు. ఈ అంశంపై జాగరణ్ మంచ్ ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కానీ దాని ఆలోచనలపై వస్తున్న సమాచారం ప్రోత్సాహకరంగానే ఉంది. స్వదేశీ జాగరణ్ మంచ్ దీన్దయాళ్ ఉపాధ్యాయ బోధనలను అనుసరిస్తోంది. ప్రభుత్వం ఏ విధానాలను పాటించినా, ఎలాంటి ఒప్పందాలపై చర్చించినా, అంతిమ ఫలితం మాత్రం దేశంలోని చివరి వ్యక్తి కూడా లబ్ధి పొందేలా ఉండాలి. మంచ్ ఆందోళన చెందుతున్నట్లు పాల పరిశ్రమ దెబ్బతినేటట్లయితే అది దేశానికి మంచిది కాదు. వ్యవసాయం దెబ్బతినేటట్లయితే అది రైతులకు మంచిది కాదు. ప్రజా శ్రేయస్సే దెబ్బతింటున్నట్లయితే అలాంటి విధానాలను వ్యతిరేకించడమే మార్గం. ఆర్సీఈపీ ప్రభావాల గురించి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ముంచుకొస్తున్న సమస్యలను అది పరిష్కరించాలి. ప్రజలు కూడా ఈ ఒప్పందం నుంచి గౌరవప్రదమైన నిష్క్రమణపై మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం చేయాల్సింది అదే. ముఖ్యంగా 15 సంవత్సరాల వ్యవధిలో సుంకాలను జీరో స్థాయికి తగ్గిస్తూ పోవాలన్న ప్రతిపాదనను మంచ్ అస్సలు ఒప్పుకోదు. 15 ఏళ్ల తర్వాత అమలుచేసే ఒప్పందం ఏ పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు. ఇప్పుడు ఒక తప్పుకు పాల్పడితే తర్వాత ఎన్నటికీ పశ్చాత్తాపం చెందాల్సిందే. అలాంటి తప్పులను ఎవరూ చేయకూడదు. స్పష్టంగా చెప్పాలంటే చైనాతో ఎలాంటి ఒప్పందానికైనా స్వదేశీ జాగరణ్ మంచ్ కోరుకోవడం లేదు. వారి ఉత్పత్తులు మన దేశానికి అవసరం లేదు. ఇటీవల భారత్, చైనా అగ్రనేతలు మామల్ల పురంలో కలిశారు. నవ్వుకున్నారు. చేతులు కలిపారు. సంభాషించుకున్నారు. ఇవన్నీ బాగున్నాయి కానీ అంతిమ ఫలితం ముఖ్యం. ఆర్థిక మాంద్యంపై అస్పష్ట ప్రకటనలు చేయడం సరి కాదు. ప్రజలు బిస్కెట్లు కొనలేకపోతున్నారనడం వాస్తవం కాదు. దేశంలో రిఫ్రిజిరేటర్లకు, ఏసీలకు డిమాండ్ పెరుగుతోంది. సత్వరం అమ్ముడుపోయే వినియోగదారీ సరుకుల కొనుగోళ్లు తగ్గడం లేదు. ఈ రంగాలన్నింటిలోనూ వృద్ధి ఉంది. అటోమొబైల్స్ రంగంలో మాత్రమే అది వెనుకపట్టు పట్టింది. అది బ్యాంకింగ్ రంగంలో సమస్య. బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇవ్వడం లేదు. సంఘ్ పరివార్లో ఆర్థిక వ్యవస్థ తీరుపై ఎలాంటి భేదాలు లేవు. అందరిదీ ఒకే వైఖరి. (ది వైర్తో ప్రత్యేక ఏర్పాటు) -
ఎన్నికల వేళ ఉల్లిబాంబ్
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి ఉల్లిబాంబు పేలింది. కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజధాని ఢిల్లీ, ముంబైలలో కేజీ 80 రూపాయలు దాటేసింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుల వరకు ఉల్లి లేనిదే ముద్ద దిగని కుటుంబాలే ఎక్కువ. ఎన్నికల సమయంలో ఉల్లి ధర పెరిగిదంటే ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనల్ని గతంలో చూశాం. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండడంతో తమ అధికార పీఠం ఎక్కడ కూలిపోతోందన్న ఆందోళనతో కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ధరకు కళ్లెం వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి ? ►ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది. ►కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో తక్షణమే 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ►కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్ డైయిరీ సఫాల్ ఔట్లెట్స్ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది. ►కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్చేశారు. ఉల్లి కావాలన్న రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్చేస్తోంది. వీటిని ఆయారాష్ట్రాలు రూ. 24కి అమ్ముతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే సప్లయ్ చేస్తున్నారు. నవంబర్ నాటికి కొత్తవి మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా. అయితే అక్టోబర్లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉల్లి ధరని దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ధర ఎందుకు పెరుగుతోంది? ఉల్లి పంట ఎక్కువగా పండే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ధర ఆకాశాన్నంటింది. పండగ సీజన్ వస్తూ ఉండడంతో కొందరు దళారులు కావాలనే స్టాక్ని దాచేసి కృత్రిమ కొరతను సృష్టించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ, ముంబై మార్కెట్లలో ఉల్లి ధర కేజీ రూ.70–80 పలికింది. నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ సీజన్లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువ. -
ఐటీఐఆర్కు పైసా ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్కు (ఐటీఐఆర్) యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒక్క పైసా ఇవ్వలేదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తన పదవీ కాలం చివరి సమయంలో ఐటీఐఆర్ను తీసుకొచ్చినా ఒక్క రూపాయి ఇవ్వలేదని, కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రాన్ని దాదాపు పది సార్లునేరుగా కలిసి అడిగినా, లేఖలు రాసినా స్పందించలేదని శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెల్లడించారు. నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్ ఇవ్వలేదని మాట్లాడారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించామని తెలిపారు. దీనిపై అప్పటి సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైతం ఐటీఐఆర్ మా పాలసీ కాదని, దాన్ని ముందుకు తీసుకెళ్లమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి ఆగలే దన్నారు. గడిచిన ఏదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు గాదరి కిషోర్ కుమార్, కేపీ వివేకానంద్, కాంగ్రెస్ సభ్యుడు డి.శ్రీధర్బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి రూ.1.09 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర ఐటీలో 17 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని, కరీంనగర్లో వచ్చే నెలలో ఐటీ టవర్ను ప్రారంభిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మురుగు శుద్ధి లేకే జ్వరాలు: అక్బరుద్దీన్ హైదరాబాద్లో కేవలం 30% మాత్రమే మురుగు శుద్ధి జరుగుతోందని, కావాల్సినన్ని సీవరేజీ ట్రీట్మెంట్ప్లాంట్లు (ఎస్టీపీ) లేకపోవడంతో మురుగు పెరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మురుగు శుద్ధి జరగక నగరంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతున్నాయని, దోమలు విజృంభిస్తున్నాయన్నారు. ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొందని, మురుగు శుద్ధి లేకపోవడం, మూసీ నదిలో వదులుతున్న వ్యర్థాలే దీనంతటికీ కారణమన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. నగరంలో 735 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు 21 ఉన్నాయని, అయితే ఇవి చాలినంతగా లేవన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే 2021 నాటికి మరో 700 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసేలా, 2036 నాటికి 3 వేల ఎంఎల్డీల మురుగు శుద్ధి జరిగేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. దోమల నివారణకు 200 జెట్టీ యంత్రాలతో స్ప్రే చేయిస్తున్నామని, డెంగీ నివారణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మురుగు పారుదల వ్యవస్థ బలోపేతం చేసేందుకు మాస్టర్ప్లాన్ తయారు చేసే బాధ్యతను ముంబైకు చెందిన షా కన్సల్టెన్సీకి అప్పగించిందని, ఈ నివేదిక డిసెంబర్లో వస్తుందని తెలిపారు. -
ప్రజాతీర్పు దుర్వినియోగం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజలిచ్చిన తీర్పును చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి సోనియా అధ్యక్షత వహించారు. బీజేపీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు దూకుడుగా ముందుకు వెళ్తున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్ను అణగదొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సోనియా ఆరోపించారు. ‘దేశ ఆర్థికస్థితి ఆందోళనకరంగా ఉంది. నష్టం తీవ్ర స్థాయిలో ఉంది’అని అన్నారు. ఆర్థిక వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల ప్రబోధాలను వక్రీకరించి తమ అజెండాకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి మందగించింది. పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది. వాస్తవమేంటో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మున్ముందు నిరుద్యోగం తీవ్రత మరింత పెరగనుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. -
ఇది ట్రైలర్ మాత్రమే..
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా రావాల్సి ఉంది. అభివృద్ధితోపాటు టెర్రరిజాన్ని సమూలంగా అంతం చేయడం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు ముందు ఏంచెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నాం. ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ. మాది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం. చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్లారు (చిదంబరాన్ని ఉద్దేశించి).. – రాంచీ సభలో ప్రధాని మోదీ రాంచీ: బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా రావాల్సి ఉందని రాంచీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నామనీ, ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ అన్నారు. జార్ఖండ్ కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాంచీలో మాట్లాడారు. తమ ప్రభుత్వ 100 రోజుల పాలన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వమనీ, తాము చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్ళారనీ చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు జాతీయ పథకాలను మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించారు. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, అందుకే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చామనీ తెలిపారు. కశ్మీర్, లడక్ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామనీ, అందులో భాగంగానే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేశామనీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎన్డీఏ–2 వంద రోజుల పాలనలో ఆవిష్కృతమైనవేనని ఆయన గుర్తుచేశారు. రాంచీలో నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు పెన్షన్ స్కీంని మోదీ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు నూతన సెక్రటేరియట్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ► ‘జాతీయ స్థాయి పథకాల ప్రారంభోత్సవానికి జార్ఖండ్ వేదికగా నిలుస్తోంది. గత సెప్టెంబర్ లో సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కూడా జార్ఖండ్లోని ప్రభాత్ తారా గ్రౌండ్ నుంచే ప్రారంభించాం. ఈ రోజు మూడు జాతీయస్థాయి సంక్షేమ పథకాలను సైతం ఇక్కడి నుంచి ప్రారంభించాం’ అని అన్నారు. ► ‘ఆదివాసీలతో సహా ప్రజలందరికీ సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన్ జ్యోతి యోజన, జన్ ధన్ ఎకౌంట్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఆరంభించింది’ అని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించడంలో జార్ఖండ్ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ► ‘మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఒక చోటికి సమీకరించి, దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడండి’ అంటూ మోదీ ప్రజలకు సూచించారు. కిసాన్ మాన్ధన్ యోజన ప్రధాని ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 1,16,183 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ తెలిపారు. స్వరోజ్గార్ పెన్షన్ ఇక్కడ నుంచి ప్రారంభించిన మరో రెండు పథకాలు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్ధన్ యోజన, స్వరోజ్గార్ పెన్షన్ స్కీంలు. వీటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనం -
అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అహంకారం, రాజకీయ ప్రచారం, అనిశ్చితి, ఆందోళన, డోలాయమానంగా బీజేపీ పాలన సాగిందంటూ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ గత బడ్జెట్ సమావేశాల్లో 39 బిల్లులను ప్రవేశపెట్టి 28 బిల్లులను ఆమోదించుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఏ ఒక్క బిల్లును కూడా పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి గానీ, స్టాండింగ్ కమిటీకిగానీ పంపలేదన్నారు. గత వంద రోజుల్లో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు తప్పించుకొనేలా మార్గ్గం సుగమం చేస్తున్నాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, అస్సాంలో ఎన్ఆర్సీతో దేశంలో అనిశ్చితి సృష్టించిందన్నారు. ఆటోమొబైల్ రంగం తిరోగమనంలో ఉందని, 3.50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధి తగ్గి, చేనేత, బంగారం ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. -
100 రోజుల్లో పెనుమార్పులు
రోహ్తక్(హరియాణా): ఎన్డీయే ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టాక 100 రోజుల పాలనలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి, విశ్వాసం, భారీ మార్పులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తమ పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ రంగం, జాతీయ భద్రత వంటి అంశాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు 130 కోట్ల మంది భారతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రజల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోహ్తక్లో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించడం, ఉగ్రవాదాన్ని రూపుమాపడం వంటి వాటి కోసం కీలక చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. గత 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ సమావేశాల్లో అత్యధిక బిల్లులు పాసయ్యాయని వెల్లడించారు. దీనికి సహకరించిన ప్రతిపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాబోయే రోజుల్లో దేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఉద్ఘాటించారు. ఏ రంగంలోనైనా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా కసరత్తు చేస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ అంశం, తాగునీటి సంక్షోభం సహా పలు సవాళ్లు తమ ముందున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని వ్యాఖ్యానించారు. ఇండియా తనకు ఎదురైన సవాళ్లను సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. చంద్రయాన్–2 దేశాన్ని ఏకం చేసింది.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–2 ప్రయోగంలో చివరి 100 సెకన్లు గెలుపు, ఓటముల నిర్వచనాలను మార్చేశాయని తెలిపారు. దేశ ప్రజలు గెలుపు, ఓటముల పరిధిని దాటి ఆలోచిస్తున్నారని.. అలా చేసినప్పుడే దేశం తన లక్ష్యాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల స్ఫూర్తిలాగా ప్రస్తుతం ఇస్రో స్ఫూర్తి కొనసాగుతోందని అన్నారు. దేశమంతా మార్పుపై విశ్వాసంతో ముందుకు సాగుతోందని అన్నారు. -
అలా చేయడం తప్పే అవుతుంది : విజయ్ సేతుపతి
చెన్నై : కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని కోలీవుడ్ స్టార్హీరో విజయ్ సేతుపతి తప్పుబట్టారు. బీజేపీ తీరు సరిగా లేదని విమర్శించారు. కశ్మీర్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అంతపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ‘ఎస్బీఎస్ తమిళ్’ అనే రేడియా చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్డీయే ప్రభుత్వం నడుచుకుంది. ఎవరి సమస్యలేంటో, వివాదాలేంటో వారినే తేల్చుకోనీయండని ద్రవిడ ఉద్యమ నిర్మాత పెరియార్ చెప్తుండేవారు. మీ ఇంటి సమస్యల్లో తలదూర్చడానికి నేనెవరినీ..? అక్కడ బతికేది నువ్వు. నీకు సంబంధించిన వ్యవహారాలు వినడం వరకే నా పని. కానీ, నా నిర్ణయాన్ని నీపై రుద్దాలనుకోవడం సరైంది కాదు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది’అన్నారు. కశ్మీర్పై కేంద్రం నిర్ణయాలు తనకు బాధ కలిగించాయని చెప్పారు. ‘కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వరకే మనపని. వారికి మనం ఎలాంటి సలహాలు ఇవ్వలేం. మన అభిప్రాయాల్ని వారరిపై రుద్దడం తప్పే అవుతుంది’అని పునరుద్ఘాటించారు. మెల్బోర్న్లో గతవారం జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ పాల్గొనేందుకు విజయ్ వెళ్లారు. ఇక ఆర్టికల్ 370 రద్దుపై సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయడం భారత్కు, కశ్మీరీ ప్రజలకు శుభపరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృష్ణార్జునులు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. -
జమిలి పోరాటాలు నేటి అవసరం
ఇప్పుడు దేశాన్ని చుట్టుముడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటి అన్ని కీలక సమస్యలను గాలికి వదిలేసి లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనే అంశమే అతి ప్రధాన సమస్య అయినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ, భారత్కి ఇప్పుడు కావలసింది మౌలిక సమస్యలపై జమిలి పోరాటాలే తప్ప జమిలి ఎన్నికలు కావని గ్రహించాలి. అలాగే ఏపీలో సాధారణ ప్రజానీకం తరపున పేదలకు అండగా సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపర్చేందుకు ప్రగతిశీల శక్తులు సిద్ధంకావాలి. ఇటీవలనే జమిలి (లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి) ఎన్నికల అంశాన్ని, అది మన దేశ ప్రజలముందున్న అతి తీవ్రమైన, తక్షణం పరిష్కరించవలసిన సమస్య అయినట్లూ.. దానిముందు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటివి చాలా చిన్న సమస్యలైనట్లు, ముందుకు తెచ్చి దానిపై చర్చించేందుకు ఎన్టీయే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక్కడో చిన్న మెలిక ఉంది. బీజేపీ ప్రభుత్వం ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అన్న అంశాన్ని ఎజెండాగా చేసింది. ఇది ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న అర్థంలో మన తెలుగు మీడియాలోకి వచ్చి చర్చలు జరిగాయి. నిజానికి దీని అసలు అనువాదం ‘ఒకేజాతి, ఒకే ఎన్నికలు’ అని చెప్పుకోవాలి. జాతి–దేశం సమానార్థకాలు కావు. భౌగోళికంగా సారూప్యత, ఒకే విధమైన వాతావరణం, ఆర్థిక నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలు అన్నింటినీ మించి ఒకే భాష కలిగిన ప్రజాసమూహాన్ని జాతి అంటాము. నిజానికి ఈ దేశంలో రాష్ట్రపతి గానీ, ప్రధాని గానీ, తమ మాతృభాషలో ప్రసంగిస్తే, మన దేశ జనాభాలో సగంమందికి అర్థం కాదు. అంటే ఒకే భాష ‘జాతి’కి ఒక సామాన్య అంశం. ఉదాహరణకు, మనది తెలుగుజాతి, అలాగే ద్రవిడ, మరాఠా, పంజాబీ, గుజరాతీ ఇలా మనదేశంలో వివిధ జాతులున్నాయి. మన జాతీయ గీతం జనగణమనలో కూడా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా అని మన దేశం వివిధ జాతుల సముదాయం అనే రాశారు. నా భారతదేశం జిందాబాద్, మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని సగర్వంగా నేను నినదిస్తాను. ఇలా ఒక దేశంలో ఎన్నో జాతులున్నట్లే, ఒకేజాతి ఎన్నో దేశాలలో ఉండవచ్చు. మన దేశ స్వాతంత్య్రోద్యమంలో, వివిధ జాతుల ప్రజానీకమూ, పరాయి, వలస బ్రిటిష్ దుర్మార్గ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా, తమ తమ పోరాటాలు సాగించారు. మన అల్లూరి, కొమరం భీం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, తమిళులకు వీరపాండ్య కట్టబొమ్మన, మరాఠాలకు శివాజీ, కన్నడిగులకు టిప్పుసుల్తాన్, ఇలా స్వాతంత్య్రం కోసం పోరాడిన వివిధ జాతుల వీరులెందరో ఉన్నారు. అయినా రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీ గాంధీజీ నాయకత్వాన దేశవ్యాపితంగా ప్రధానమైన పాత్ర పోషించిందనడం నిర్వివాదం! 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు, తొలి సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అనే పిలిచారు. నిజానికి భారత స్వాతంత్య్రోద్యమం ‘భారత జాతుల స్వాతంత్య్రోద్యమం’ అన్నమాట. ఈ వివిధ జాతులన్నీ బ్రిటిష్ వాడు ఏర్పర్చిన పాలనాపరమైన దేశంలాగా గాక, తమ జాతుల అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, భారతదేశంగా ఏకశిలాసదృశ్యమైన, రాజ్యాంగంగానే.. వివిధ రాష్ట్రాలుగా ఉన్న ఒక సమాఖ్య స్వరూపంగానే మన రాజ్యాంగం ఏర్పడింది. ఇప్పటికీ తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండులో జాతులు, ఉపజాతులు మన దేశంలో కళ్లముందు ఉన్న దృశ్యమే. ఇంత సువిశాల భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ సమయాలలో, ఎన్నికలు జరుగుతూ ఉండటం వలన, ఎన్నికల నియమావళి, పాలనాపరమైన ఇబ్బందులు, అధిక ధనవ్యయం, ఎప్పుడూ ఎన్నికల వాతావరణంతో అభివృద్ధి వెనకడుగు వేయడం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రాష్ట్రాల శాసనసభలకూ, దేశ లోక్సభకూ ఎన్నికలు నిర్వహించడం వలన మేలు జరుగుతుందన్న భావన ఉండవచ్చు. వాస్తవానికి మన రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అలా జమిలి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జమిలి ఎన్నికలకు సూత్రప్రాయమైన అంగీకారం తెలిపారు. తనకు అత్యంత ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పొందుపర్చవలసిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్న ఆకాంక్షను, అక్కడి అఖిలపక్ష సమావేశంలో మరోసారి వక్కాణించారు. అదీ ఆయన నిబద్ధత. వైవిధ్యభరితమైన వివిధ జాతుల ప్రత్యేకతలను బీజేపీ తృణీకరించి ప్రతిపాదించిన అఖండ భారత జాతి అన్న అవగాహనకు భిన్నంగా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ అంశం మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకే ఒక కమిటీ ఏర్పాటుకు అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. అంతేకాదు. జమిలి ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్ర ప్రాధాన్యతలు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, మొన్నటి మన శాసనసభ ఎన్నికలలో గత వెన్నుపోట్ల పార్టీ పాలనలోని అవినీతి, అసమర్థత, కులతత్వం, నయవంచన వంటి వాటిని అంతం చేయడం.. మన రాష్ట్రానికి, ప్రత్యేక హోదాతోసహా విభజన లాభాలను సాధించడం.. ఒక నిబద్ధత గల, ప్రజానురంజక, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ప్రధాన ఎజెండాగా వైఎస్ జగన్ నాయకత్వాన వైఎస్సార్సీపీ ఎన్నికల రంగంలోకి దిగి అద్భుత విజయాన్ని సాధించింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఈ అంశాలు పట్టలేదు. భారత జాతీయత, అఖండ భారతం అంటూ సామాజిక న్యాయసాధనను వ్యతిరేకిస్తూ మనుస్మృతి ఆధారిత, మతతత్వ నిచ్చెనమెట్ల వర్ణ(కుల) వ్యవస్థను నిలబెట్టడం ఎజెండా. అందుకే ప్రజలు, వెన్నుపోటు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేవిధంగా తిరస్కరించడమే కాక, బీజేపీ పార్టీకీ దాని భావజాలానికి రాష్ట్ర శాసనసభలో స్థానం లేకుండా చేశారు. కేవలం మాటలతోనూ, ప్రచారంతోనే కాదు.. ఆచరణలో మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా, పదహారు రోజుల పండుగ కూడా ముగియకుండానే, జగన్మోహన్రెడ్డి ఆచరణలో అడుగులు వేశారు. ఆయన పాలన ఆరంభించి అవినీతి రహిత పాలన దిశగా, నవరత్న పథకాల ఆచరణకు రూపు దిద్దుకునే రీతిలో రాష్ట్రం ముందడుగు వేయడం చూస్తున్నాం! వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థుల సంగతి ఎలా ఉండినా, దాదాపు యావదాంధ్ర ప్రజలు ఆశావహ రీతిలో అభినందించడమూ చూస్తున్నాం. ఒక్క సామాజిక న్యాయ అంశాన్నే తీసుకుందాం. ఎన్నడైనా, ఏ పార్టీ అయినా తన మంత్రివర్గ కూర్పులో అయిదుగురు దళిత, గిరిజన, మైనార్టీ, మహిళా, వెనుకబడిన కులాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి గౌరవించిందా? తన మంత్రివర్గంలో 60 శాతం సామాజిక న్యాయం అవసరమైన వారికే స్థానం కల్పించి చరిత్ర సృష్టించిన వారు ఇంతకు ముందెవరు? ఇటీవల ఒక మార్క్సిస్టు మిత్రుడు నాకు ఫోన్ చేసి, ‘మీరు జగన్ను సమర్థిస్తున్నట్లు వ్యాసాలు రాస్తుంటే, జగన్ ఏమైనా సోషలిజం తీసుకువస్తాడా అని అడిగాడు. కానీ సాధారణ ప్రజానుకూల పాలనదిశగా, ఇంత త్వరగా ఇంత నిబద్ధతతో జగన్ తన ప్రస్థానం ఆరంభించగలడని అనుకోలేదండీ! ఎండకన్నెరుగని జగన్మోహన్ రెడ్డి ఇలా దళితులకు, గిరిజనులకు, మహిళలకు, మైనారిటీలకు, వెనుకబడిన కులాలవారికి, ఇంత పెద్ద పీట వేస్తారని అనుకోలేదండీ’ అంటూ ఎంతో స్పందనతో మాట్లాడాడు. నిజానికి ఈ వర్ణ(కుల) వ్యవస్థను అంతం చేయడం.. ఈ దేశ ప్రజల శ్రేయస్సును కోరేవారందరి ప్రథమ కర్తవ్యం. ఆర్థిక దోపిడీకి గురవుతున్న సాధారణ శ్రామికులలో కూడా ఈ అణగారిని ప్రజానీకమే ఎక్కువ. వర్గదోపిడీని అరికట్టాలన్నా, ఈ కులవ్యవస్థను బద్దలు కొట్టకుండా మన దేశంలో అసాధ్యం. విభిన్న జాతుల సమాహారం మన భారతదేశం అని చెప్పుకున్నాం కదా! ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జాతిలో అయినా ఈ కులవివక్ష ఉంది. అదే మన సామాన్య అంశంగా ఉందన్నదీ నిర్వివాదాంశమే. ఆంధ్రప్రదేశ్లో అయినా, బెంగాల్లో అయినా, ఉత్తరాది రాష్ట్రాల్లో అయినా కులవ్యవస్థ అమానవీయత మన దేశంలో సర్వేసర్వత్రా వ్యాపించింది. అత్యంత పేదరికం అనుభవిస్తున్న శ్రమజీవులూ ఈ అణగారిన కులాల్లోనే ఉన్నారు. అంతేకాదు మన జనాభాలో ఆధిపత్య కులాలవారు 20 శాతం ఉంటే మిగిలిన వారిలో అత్యధికులు సామాజిక న్యాయం పొందవలసిన అణగారిన ప్రజానీకమే. ఎక్కువమంది పేద మధ్యతరగతి ప్రజానీకం ఉండగా, కోటీశ్వరుల సంఖ్య చట్టసభల్లో పెరుగుతుండటం నిజం. ప్రజాస్వామ్యం పెంపొందే క్రమంలో అది పేద, మధ్యతరగతి ప్రజానీకానికి అనుగుణంగా మారాలి. అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వారిలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ ఉన్నది. ఇతర వెనుకబడిన కులాల వారికి, మహిళలకు, మైనారిటీలకు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అవసరం. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం ఆధిపత్య కుల ధనస్వామ్యంగా మారకుండా ఉంటుంది. పార్లమెంటులో వైఎస్సార్ సీపీ తరపున విజయసాయిరెడ్డి.. ఇతర వెనుకబడిన కులాలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి, ఆ ప్రజాసమూహాల అభినందనలు అందుకున్నారు. నిజానికి ఇలాంటి బిల్లును కమ్యూనిస్టులే ఎప్పుడో పెట్టాల్సి ఉండింది. కానీ సృజనాత్మకత, సాధారణ వివేకం కనుమరుగైనట్లుగా.. ఈ కుల వ్యవస్థ నిర్మూలనకు నడుం కడితే, వర్గపోరాటం వెనకపట్టు పడుతుందని వాదిస్తున్న కమ్యూనిస్టు నేతల ఆలోచనా ధోరణి సరి కాదు. కులతత్వం మన భారతదేశంలో ఘనీభవించింది అని ఇఎంఎస్ నంబూద్రిపాద్ అన్నారు. పైగా మార్క్సిజం ప్రవచించిన నాటి ‘ప్రొలిటేరియట్స్’ నేడు బాగా తగ్గిపోతున్నారు. నేడు ట్రేడ్ యూనియన్లలో ప్రధానంగా ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్లలో (రెక్కల కష్టం తప్ప మరేమీ లేనివారు), బ్యాంకింగ్ రంగంలో, తదితర పరిశ్రమల్లో ఉన్న వారిలో అత్యధికులు మధ్యతరగతివారు. వారు ఆర్థిక సమస్యలతో పాటు నిజానికి, అంతకంటే కొంచెం ఎక్కువగానే సామాజిక న్యాయం అవసరమని అర్రులు చూస్తున్నారు. కనుక వర్గపోరాటాన్ని, వర్ణపోరాటాల్ని పరస్పర విరుద్ధంగా ఆలోచించడం మన దేశ పరిస్థితుల్లో మార్క్సిజం అనిపించుకోదు. తెలంగాణ రాష్ట్ర సీపీఎం, నాడు తెలంగాణ పోరాటంలో దిశానిర్దేశం చేసి నేడు ఈ కులనిర్మూలన పోరాటంలో ముందున్నందుకు వారికి అభినందనలు! ఆ తెలంగాణ గడ్డమీదే లాల్–నీల్ నినాదమిచ్చాడు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం! కానీ, ఇప్పుడెందుకో పార్టీ కేంద్రనాయకత్వం తెలంగాణ సీపీఎం విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు లేదు. ప్రజలు ఎక్కడ ఏరకమైన దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారో వారికి అండగా ఉంటేనే మనదేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఏమాత్రమైన పురోగమనం ఉంటుంది. లేకుంటే ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఈ విషయంలో.. మన మార్క్సిస్టు పరిభాషలో, బూర్జువా పార్టీనే అయినా, బహుజన వామపక్ష సంఘటన వంటి వాటి నిర్మాణంతో, ప్రస్తుత దేశ, కాల, రాష్ట్ర, సామాజిక న్యాయ పరిస్థితులకు అనుగుణంగా, సాధారణ ప్రజానీకం తరఫున పేదలకు అండగా సామాజిక న్యాయదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజల అభ్యున్నతి – ప్రస్తుత దశలో, ఎలా ఆచరణలోకి వస్తే, దానిని బలపర్చి, మొత్తం సమాజం మార్క్స్ చెప్పిన పరిణామ దిశగా పురోగమించడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించాలని మనసారా కోరుకుంటున్నాను. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
‘మూకదాడుల’ బిల్లు జాడేది?
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళ, బుధవారాల్లో చేసిన ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గత సార్వత్రిక ఎన్నికలకు మించి భారీ మెజారిటీ సాధించాక జరిగిన తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానంగా మోదీ మాట్లాడారు. ఇందులో సహజంగానే జార్ఖండ్లో ఇటీవల ఒక ఉన్మాద మూక ముస్లిం యువకుణ్ణి హతమార్చడం, ఉత్తరప్రదేశ్లో పసివాళ్ల ఉసురు తీస్తున్న మెదడువాపు వ్యాధి ప్రస్తావన తదితరాలున్నాయి. మూకదాడి ఉదంతంపై ప్రధాని మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. మోదీ మాట్లాడటం అవసరమనడంలో సందేహం లేదు గానీ... అంతకన్నా ముఖ్యంగా దేశానికి అప్రదిష్ట తెస్తున్న ఈ తరహా దాడులకు పూర్తిగా అడ్డుకట్ట వేయడం ప్రధానం. ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాల్లో మోదీ గతంలో మాట్లాడారు. కానీ ప్రభుత్వాల్లో కదలిక ఉన్న దాఖలా లేదు. నిందితులను సత్వరం అరెస్టు చేయడంలోనూ, కఠినంగా వ్యవహ రించడంలోనూ అవి చొరవ చూపడం లేదు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కాస్త వెనకో, ముందో బెయిల్పై విడుదలవుతున్నారు. విచారణ పూర్తయిన కొన్ని కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లభించక నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. మూకదాడుల విషయంలో పార్టీలు, పౌర సమాజ కార్యకర్తలు, వివిధ సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం ఏడాదిక్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో నిందితులను శిక్షించడానికి కఠినమైన చట్టం తీసుకురావాలని పార్లమెంటును కోరింది. అది వచ్చేలోగా ఆ మాదిరి దాడుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. ముసాయిదా బిల్లు రూపకల్పనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల కమిటీని, మంత్రుల బృందాన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆ పని ఎంతవరకూ వచ్చిందో ఎవరికీ తెలియదు. మూకదాడులు మాత్రం యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకే తీరుగా జరుగుతున్నాయి. పశువుల్ని తీసుకెళ్తున్న వాహనాలను గమనించి కొంతమంది వాటిని అడ్డగించడం, డ్రైవర్తోపాటు ఇతరుల్ని పట్టుకుని నెత్తురోడేలా కొట్టడం వీటన్నిటా కనిపిస్తుంది. ఈ ఉదంతాల్లోని బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. తాజా ఉదంతంలో యువకుడు మోటార్ సైకిల్ అపహరించాడని మూక ఆరోపించింది. కానీ అతను అది నిజం కాదని ప్రాధేయపడుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు చెబుతున్నాయి. చావుబతుకుల్లో ఉన్న అతనితో ఆ గుంపు బలవంతంగా ‘జైశ్రీరాం’, ‘జై హనుమాన్’ అనిపించింది. బుధవారం మధ్యప్రదేశ్ రాజ ధాని భోపాల్లో జరిగిన ఘటనా ఇటువంటిదే. బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్వర్గియా కుమారుడు గుంపును వెంటేసుకుని అక్రమ నిర్మాణాలను కూలగొట్టిస్తున్న పనిలో ఉన్న మున్సిపల్ అధికారిపై గూండాగిరీకి దిగాడు. క్రికెట్ బ్యాట్తో చావబాదాడు. విజయ్వర్గియా అతగాణ్ణి సమర్ధించడమే కాదు...‘అడగడానికి నువ్వెవరు, నువ్వేమైనా జడ్జీవా’ అంటూ ఒక పాత్రికేయుణ్ణి దబాయించారు. పశువుల్ని తరలిస్తున్నారని లేదా గోమాంసం దగ్గరుంచుకున్నారని దాడులు చేయడంతో మొదలై, ఇప్పుడు ఇతర కారణాలతో దాడులు చేయడం వరకూ ఇవి పెరిగిపోయాయని, ఒక సంస్కృతిగా మారాయని అర్ధమవుతోంది. వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు ఆవేశాలు పెరుగుతాయి. వాటి తీవ్రతనుబట్టి ఒక్కోసారి అవి హత్యలకు కూడా దారితీస్తాయి. కానీ మూక దాడులకు కారణమవుతున్న ఉదంతాలు అటువంటివి కాదు. పట్టుబడినవారు బతిమాలుతు న్నారు. చేతులెత్తి మొక్కుతున్నారు. కానీ ఉన్మాద మూకలకు అవేమీ పట్టడంలేదు. అవతలినుంచి కనీస ప్రతిఘటన కూడా లేనప్పుడు తోటి మనిషిని అంతమంది ఏకమై చంపడానికి ఎలా సిద్ధ పడతారో అనూహ్యం. ఈ అమానుషమైన ఉదంతాలు పునరావృతం కాకుండా నిరోధించడంలో విఫలమవుతున్నందుకు సహజంగానే జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తారు. దాన్ని ఆ రాష్ట్రాన్ని నిందించడంగా, అవమానించడంగా మోదీ భావించనవసరం లేదు. పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యలనూ, వీటినీ ఒకేలా పరిగణించాలనడం కూడా సరికాదు. రెండు రకాల దాడుల్లోనూ హత్యలు చోటుచేసుకుంటున్నా స్వభావరీత్యా మూకదాడులకూ, రాజకీయ కార ణాలతో పరస్పరం చేసుకునే దాడులకూ మధ్య వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్పై మోదీ చేసిన రాజకీయ విమర్శలకు ఆ పార్టీ జవాబు చెప్పుకునే స్థితిలో లేదు. ఆ పార్టీ ఏలుబడిలో దేశానికి సేవలందించిన పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ఘనత గురించి ఏరోజైనా మాట్లాడారా అని ఆయన వేసిన ప్రశ్నకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు. వారి వరకూ అవసరం లేదు... స్వతంత్రంగా ఆలోచించగలిగే కింది స్థాయి నాయకులను సైతం సంశయించడం, వారిని అవమానించడం, చివరకు వెళ్లగొట్టడం కాంగ్రెస్లో ఒక సంస్కృతిగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్నాక ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దీని పర్యవసానమే. కాంగ్రెస్ పార్టీ అటు విజయాన్నయినా, ఇటు అపజయాన్నయినా స్వీకరించే స్థితిలో లేదని మోదీ చేసిన విమర్శలోనూ వాస్తవం ఉంది. అపజయానికి కారణాలేమిటో సమీక్షించుకుని, అవసరమైన దిద్దుబాటు చర్యలకు దిగకపోగా రాహుల్గాంధీ పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటానని భీష్మిం చుకుని కూర్చున్నారు. మరోపక్క ఈవీఎంల వల్లే బీజేపీ నెగ్గిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తు న్నారు. దేశం మరింతగా ఎదిగేందుకు పార్టీలకతీతంగా కలిసిరావాలని ప్రధాని అనడం స్వాగతించదగ్గదే. కానీ అందుకవసరమైన వాతావరణాన్ని కల్పించవలసిన ప్రధాన బాధ్యత అధికార పక్షానిదే. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమేరకు కృషి చేస్తుందో మున్ముందు చూడాలి. -
జమిలి పరీక్ష
‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ పేరుతో వచ్చిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపైన భిన్నాభిప్రాయాలు వెల్లడి కావడం సహజం. రెండవ విడత ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే నరేంద్రమోదీ ప్రదర్శిం చిన పూనికలలో అత్యంత కీలకమైనది ఈ అంశం. మొత్తం నలభై రాజకీయ పార్టీలను సమాలోచ నకు ఆహ్వానిస్తే దాదాపు సగం పార్టీల (21) ప్రతినిధులు ఢిల్లీలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమా వేశంలో పాల్గొన్నారు. లోక్సభకూ, శాసనసభలకూ ఏకకాలంలో సమాంతరంగా ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన మోదీ మదిలో కొంతకాలంగా మెదులుతున్నదే. ఒ కేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు కలసి వస్తుందనీ, ఎన్నికల నియమావళి పేరుతో నిష్క్రియాపరత్వం పాటించవలసిన రోజుల సంఖ్య తగ్గుతుందనీ, ప్రతి సంవత్సరం రెండు, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సైతం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తుందనీ, ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలన్నీ పరిపాలనపైన దృష్టి పెట్టవచ్చుననీ ఈ ప్రతిపాదనకు అను కూలంగా చెప్పుకోదగిన అంశాలు. 1967 ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధి పత్యం అంతమైంది. ప్రాంతీయపార్టీల ప్రాభవం పెరిగింది. సంకీర్ణయుగం మొదలయింది. ఈ కారణాల వల్ల అస్థిరత చోటు చేసుకున్నది. పరిపాలనకు గండి పడింది. అతుకుల బొంతల సంకీ ర్ణాలు ప్రభుత్వాలు ఏర్పరచడం, పార్లమెంటులో అడుగుపెట్టకుండానే ప్రధాని రాజీనామా సమ ర్పించిన సందర్భం కూడా చూశాం. ఐదేళ్ళకు ఒకసారి అన్ని శాసన వ్యవస్థలకూ ఎన్నికలు జర గడం వల్ల దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొనడానికి ఆస్కారం ఉన్నది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుందనీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజమైన ఆధిక్యం ఉంటుం దనీ, భిన్నత్వంలో ఏకత్వం సూత్రం దెబ్బతింటుందనీ, దేశ సమగ్రతకు జమిలి ఎన్నికలు భంగం కలిగిస్తాయనే వాదనలు ఉన్నాయి. పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు దారితీసే ప్రమాదం ఈ ప్రతిపాద నలో ఉన్నదనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. సందేహాలు ఉన్నంత మాత్రాన చర్చకు వెనకాడనక్క రలేదు. ప్రధాని అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడు హాజరు కాకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సమావేశానికి వెళ్ళి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడమే విజ్ఞత. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని శాసనసభల పదవీ కాలాన్ని పొడిగించాలి. మరి కొన్ని శాసనసభల గడువును కుదించవలసి రావచ్చు. ఇటువంటి పని ఏది చేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభలూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)కి లోక్సభలో మూడింట రెండు వంతుల ఆధిక్యం ఉన్నది కానీ రాజ్యసభలో లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికీ లేదా చీల్చడానికీ మోదీ ప్రభృతులు ప్రయత్నిస్తున్నారు. తె లుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని చీల్చడం, బీజేపీలో విలీనం కావడం ఇందుకు తాజా నిదర్శనం. రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఎన్డీఏకి దక్కితే ఎన్నికల సంస్కరణలతో సరిపెట్టుకోదనీ, కశ్మీర్పైన ప్రభావం చూపించే 370వ అధికరణను సవరించే ప్రయత్నం చేయవచ్చుననీ ప్రజాస్వామ్యవాదులు కొందరు భయపడుతున్నారు. వారి భయాలు నిర్హేతుకమైననవి విశ్వాసం కలిగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వా నికి ఉంది. సమాంతర ఎన్నికలపైన 2018 ఆగస్టులో లా కమిషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. దాని ప్రకారం చట్టానికి సవరణ చేసిన తర్వాత దానిని దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. బీజేపీ సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కారణంగా అది తేలికే. మోదీ వంటి ప్రతిభావంతుడైన నాయకుడు ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ప్రజలు లోక్ సభకీ, శాసనసభలకీ ఒకే విధంగా ఓటు చేసే అవకాశం ఉన్నది. 2019లో ఒడిశా ప్రజలు లోక్సభ ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టి శాసనసభ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ను అయిదో విడత గెలిపించి విచక్షణాజ్ఞానం ప్రదర్శించారు. నిరుడు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించిన ఓటర్లు మొన్నటి లోక్సభ ఎన్నికలలో అదే పార్టీకి ఘనవిజయం కట్టబెట్టారు. కానీ అసెంబ్లీ ఎన్నికలూ, లోక్సభ ఎన్నికలూ ఒకేసారి జరిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ గెలిచి ఉండేదేమో. కేంద్రంలో ప్రభుత్వం గడువు కంటే ముందు పడిపోయినా, రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల కారణంగా కుప్పకూలినా కష్టమే. కేంద్ర ప్రభుత్వం పడిపోతే లోక్సభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. దానితో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు నిర్వహిస్తారా? కేంద్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించాలంటూ కొత్త చట్టం తెస్తారా? ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయి, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ రాష్ట్రపతి పాలన విధించాలి. ఎటుచూసినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమే. ఎవరైనా లోక్సభ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ మృతి చెందితే ఆ స్థానం మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకూ ఖాళీగా ఉండాల్సిందే. జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థిస్తూ చెప్పే కారణాలు ఎంత బలమైనవో, వ్యతిరేకిస్తూ చెప్పే కారణాలు సైతం అంతే బలమైనవి. అందుకే కూలంకషంగా చర్చించి రాజ్యాంగస్ఫూర్తికీ, సమాఖ్య స్వభావానికీ, ప్రజా స్వామ్య స్పృహకూ అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సకల రాజకీయ పక్షాల నాయకులూ చర్చలో పాల్గొనాలి. విధివిధానాలు చర్చించడానికి ఒక కమిటీని నియమిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అన్ని కోణాల నుంచీ పరిశీలించి మౌలి కమైన రాజ్యాంగ విలువలకు విఘాతం కలగకుండా సంయమనమే ప్రధానంగా భవిష్యత్ కార్యా చరణ ఉంటుందని ఆకాంక్ష. -
బీజేపీతో జేడీయూ కటీఫ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి బీజేపీ, జేడీయూ విషయంలో మరోసారి నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో బిహార్లో నితీశ్ కుమార్ నాయకత్వంలో కలిసి పోటీ చేసిన జేడీయూ, బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాయి. ఇదే మైత్రి ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతుందని అంతా భావించారు. అయితే, తాజాగా మారిన నితీశ్ వైఖరి ఎన్డీయేకు గుడ్బై చెప్పేందుకేనా అన్నట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర కేబినెట్ ఏర్పాటు నుంచి.. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ మంత్రివర్గంలో జేడీయూకు ఒక్క మంత్రి పదవినే ఇవ్వజూపడం నుంచి నితీశ్కు అసంతృప్తి మొదలైంది. అనంతరం రాష్ట్ర కేబినెట్ విస్తరించిన సీఎం నితీశ్ బీజేపీకి కూడా ఒకే ఒక్క మంత్రిపదవి ఇవ్వజూపారు. అదేవిధంగా, తగిన మార్పులు చేయకుంటే ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరసత్వ బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటామని నితీశ్ అంటున్నారు. 370వ అధికరణ, రామాలయ నిర్మాణం వంటి అంశాల్లోనూ ఎన్డీయే వైఖరికి భిన్నంగా నితీశ్ మాట్లాడుతున్నారు. బీజేపీతో తమ మైత్రి కేవలం బిహార్కే పరిమితమని, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతామని జేడీయూ నేతలు అంటున్నారు. ఎన్నికల విశ్లేషకుడు, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో కలిసి పని చేస్తామని ప్రకటించడమూ బీజేపీని ఇరుకున పెట్టడానికేనంటున్నారు. గొడవల్లేవంటున్న జేడీయూ: ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ఇచ్చిన ఇఫ్తార్ విందులో నితీశ్ పాల్గొనడంపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ తప్పుపడుతోంది. బీజేపీయే గిరిరాజ్తో ఈ పని చేయించిందంటోంది. అయితే, కమలనాథులతో విభేదాల్లేవని జేడీయూ అంటోంది. కీలక అంశాలపై ఎన్డీయే పక్షాల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నామే తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదంటోంది. బీజేపీతో సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని నితీశ్ అంటున్నారు. సొంత ప్రయోజనాలే ముఖ్యం నితీశ్కు సొంత ప్రయోజనాలే ముఖ్యమని, దానికోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు వెనుకాడరని విశ్లేషకులు అంటున్నారు. 2005లో బీజేపీతో కలిసి ఆయన బిహార్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కొంతకాలం బీజేపీతో ఆయన స్నేహం నడిచింది. అనంతరం ఎన్డీయేను వీడి 2014 లోక్సభ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడ్డారు. 2017లో తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి రాష్ట్రంలో ఉన్న 40 సీట్లలో 39 సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో బిహార్ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అప్పటి దాకా వారి మైత్రి కొనసాగేది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ నాయకత్వం నుంచి ఎటువంటి స్పందనా వ్యక్తం కాలేదు. -
42.40 లక్షల మందికి ‘ఉపాధి హామీ’
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు తీసుకుంటోంది. గడువులోగా లక్ష్యం చేరేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 12 కోట్ల పని దినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా ఇప్పటికే రూ. 947.2 కోట్లు ఖర్చు చేసి 5.70 కోట్ల పనిదినాలు కల్పించారు. గత నెలాఖరు వరకు రాష్ట్రంలోని 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.20 లక్షల మంది కూలీలకు పనులు ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి 2018–19 సంవత్సరంలోనే అత్యధికంగా 25.20 లక్షల కుటుంబాలకు చెందిన 42.40 లక్షల మంది కూలీలకు పనులు ఇవ్వగా వారిలో 2,24,366 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించారు. ఈ పనుల కోసం రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి హామీ అమలుపై గ్రామీణాభివృద్ధిశాఖ తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ మండలి నాలుగో సమావేశం సోమవారం హైదరాబాద్లో జరిగింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నివేదికలను సమీక్షించారు. 2018–19లో తెలంగాణకు హరితహారంలో భాగంగా రూ. 688 కోట్లతో 11,933 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 11.43 కోట్ల మొక్కలు నాటారు. అలాగే రూ. 670 కోట్లతో 61,116 భూసార/నీటి పరిరక్షణ పనులు పూర్తి చేశారు. రూ. 46.7 కోట్లతో 2,031 శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టారు. రూ. 470.8 కోట్లు ఖర్చు చేసి 22,037 సిమెంటు రోడ్లు వేశారు. రూ. 63.5 కోట్లతో 1,219 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు, రూ. 14.86 కోట్ల వ్యయంతో 634 కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించారు. పనుల ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ నీటి గుంతలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వంట గదుల నిర్మాణం, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పశువుల కొట్టాలు, మేకలు–గొర్రెల షెడ్లు, కూరగాయల పందిళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సి.హెచ్. మల్లారెడ్డి, ఉపాధి హామీ మండలి సభ్యులు గద్దల పద్మ, తుల ఉమ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహెష్దత్ ఎక్కా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి అమల్లో ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల అమల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ది మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఉపాధి హామీ పథకం అమలులో గ్రామ పంచాయతీలు క్రీయాశీలపాత్ర పోషించాలి. పంచాయతీల ఆదేశాల మేరకు పనుల గుర్తింపు, అమలు జరగాలి. గ్రామసభ ఆమోదించిన పనులనే చేపట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత గ్రామ పంచాయతీకి నివేదిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీపై ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో తెలంగాణకు హరితహారం, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, పంట కాల్వలు, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శ్మశానాలు, మరుగుదొడ్లు, వంట గదులు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల వంటి పనులు చేపట్టాలి. ఉపాధి కల్పించే వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణకు హరితహారంలో భాగంగా చింత, వేప చెట్లను విరివిగా నాటి వాటి సంరక్షణలో సర్పంచులను, కార్యదర్శులను భాగస్వాములను చేయాలి. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ భవనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి’అని అన్నారు. -
దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ!
కేంద్రమిలా... 2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించింది. రాష్ట్రమిలా... ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం కోసం ముసాయిదాకు తుదిరూపునిస్తోంది. సాక్షి, హైదరాబాద్: టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హరియాణాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్కు అప్పగించింది. ఇప్పటికే మన రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్ధేశంతో టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని ప్రవేశపెట్టడమే ఉత్తమ మార్గమమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసేందుకుగాను ముసాయిదాకు తుదిరూపునిస్తోంది. ఆర్థిక భారం కేంద్రానిదే!.. భూ సర్వే, రెవెన్యూ సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇది వరకే అంగీకరించింది. భూ భారతి మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలోనే టైటిల్ గ్యారెంటీ చట్టం అమలుకు అవసరమైన వ్యయాన్ని భరించడానికి సుముఖంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాతీయ భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం (ఎన్ఎల్ఆర్ఎంపీ) ప్రవేశపెట్టింది. దీని స్థానే ఎన్డీఏ సర్కారు డిజిటల్ ఇండియా భూ రికార్డుల నవీకరణ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)ను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశం టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడం. ఈ నేపథ్యంలోనే గతేడాది హర్యానాలోని ఒక జిల్లాలో టైటిల్ గ్యారెంటీని పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది. అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్లోని పట్టణ ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలులో కొంత ముందడుగు పడింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడంతో టైటిల్ గ్యారెంటీ చట్టంపై ఆశలు చిగురించాయి. మరోవైపు మన రాష్ట్ర ప్రభుత్వంకూడా ఆ దిశగా ఆలోచన చేస్తుండటం.. కేంద్రం కూడా దానికి సానుకూలంగా ఉండటంతో టైటిల్ గ్యారెంటీ పట్టాలెక్కేందుకు మార్గం సుగమమం కానుంది. అంతేగాకుండా.. టైటిల్ గ్యారెంటీని ప్రవేశపెట్టాలంటే హద్దులు, టైటిల్ క్లియర్ అవసరం. దీంతో భూసర్వే నిర్వహిస్తే తప్ప ఈ చట్టం అమలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సమగ్ర భూ సర్వే చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అవసరమైన నిధులను రాష్ట్రాలకు కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. 2022లోపు టైటిల్ గ్యారెంటీని అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించడం కూడా మోదీ సర్కారు భూసంస్కరణల వైపు మొగ్గు చూపడానికి కారణంగా కనిపిస్తోంది. -
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన కేంద్రం
-
అఆల నుంచి ఱ వరకు... ప్రతి దశలోనూ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్ :విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన, పరిశోధన, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ చైర్మన్గా ఏర్పాటైన కమిటీ... కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్కు ఇటీవలే జాతీయ ముసాయిదా విద్యా విధానం–2019 నివేదికను సమర్పించింది. అందులో భారీ సంస్కరణలను సిఫారసు చేసింది. ప్రీ ప్రైమరీ మొదలుకొని ఉన్నతవిద్య వరకు అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసేలా మార్పులను సూచించింది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతోపాటు వారిలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు కూడా అసమానతలు లేని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నూతన విద్యా విధానాన్ని సిఫారసు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అందుబాటులోకి విద్య, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం అనే నాలుగు అంశాలు లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చాలని పేర్కొంది. నూతన విద్యావిధానంలో తీసుకురానున్న ప్రధాన మార్పులివీ... పాఠశాల విద్యలో... ♦ పాఠ్య ప్రణాళిక, బోధన రూపాలను మార్చాలి. ♦ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ను పాఠశాల విద్యలో భాగం చేయాలి. ♦ విద్యాహక్కు చట్టం పరిధిని 3 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు విస్తరించాలి. తద్వారా ప్రీ ప్రైమరీని ప్రాథమిక విద్యలో భాగం చేయడంతోపాటు ఇంటర్మీడియెట్ను కూడా విద్యాహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలి. ♦ 10+2గా ఉన్న పాఠశాల విద్యను 5+3+3+4గా మార్పు చేయాలి. ఇందులో మొదటి ఐదేళ్లు ఫౌండేషనల్ స్టేజ్గా, తరువాత మూడేళ్లు ప్రిపరేటరీ స్టేజ్గా, తరువాత మూడేళ్లు మిడిల్ స్టేజ్/అప్పర్ ప్రైమరీ స్టేజ్గా తరువాత నాలుగేళ్లు హైస్టేజ్/సెకండరీ స్టేజ్గా మార్పు. 5+3+3+4 విధానంలో.. ♦ మొదటి ఐదేళ్ల ఫౌండేషనల్ స్టేజీలో మూడేళ్లపాటు ప్రీ ప్రైమరీ, గ్రేడ్–1, గ్రేడ్–2 తరగతులు (ఒకటో, రెండో తరగతి) ఉంటాయి. ♦ ప్రిపరేటరీ స్టేజ్లో 3, 4, 5 గ్రేడ్లు. ♦ మిడిల్ స్టేజ్/అప్పర్ ప్రైమరీ స్టేజ్ పరిధిలోకి 6, 7, 8 గ్రేడ్లు. హై స్టేజ్/సెకండరీ స్టేజ్ పరిధిలోకి 9, 10, 11, 12 గ్రేడ్లు. తద్వారా విద్యా పాఠ్య ప్రణాళికలో విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గించవచ్చు. ♦ ఫౌండేషన్ స్టేజ్ వయసు 3–8 ఏళ్లుగా, ప్రిపరేటరీ దశ వయసు 8–11 సంవత్సరాలుగా, మిడిల్ స్టేజ్ వయసు 11–14 సంవత్సరాలుగా, సెకండరీ స్టేజ్ వయసును 14–18 ఏళ్లుగా చేయాలి. ♦ కరిక్యులర్, కో కరిక్యులర్ లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ మధ్య తేడా ఉండదు. పాఠ్య ప్రణాళికలపరంగా, కళలు, సంగీతం, క్రీడలు, యోగా వంటి అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. ♦ 2025 నాటికి 5వ తరగతి, ఆపై స్థాయిలో ఉండే 5 కోట్ల మందికిపైగా పిల్లల్లో ఫౌండేషన్ లిటరసీని పెంపొందించాలి. ♦ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించాలి. ♦ టీచర్ ఎడ్యుకేషన్ను సమూలంగా మార్చడం, అతితక్కువ స్థాయిగల ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసేయడం, టీచర్ ప్రిపరేషన్/ ఎడ్యుకేషన్ను కాలేజీ/యూనివర్సిటీకి అనుసంధానించాలి. ♦ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ను అమలు చేయాలి. ♦ పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో స్కిల్స్, లైఫ్ సంబంధ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచస్థాయి బోధనతోపాటు 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించేలా మార్పులు చేయాలి. ♦ ఉపాధ్యాయుల కనీస అర్హత డిగ్రీ ఉండాలి. ♦ ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలను సమానంగా చూడాలి. అవి లాభాపేక్ష లేనివిగా మార్పు చేయాలి. ఉన్నత విద్యలో.. ♦ ఉన్నత విద్యాసంస్థలను మూడు రకాలుగా మార్పు చేయాలి. ♦ అంతర్జాతీయ స్థాయి పరిశోధన, నాణ్యతతో కూడిన బోధనపై దృష్టి కేంద్రీకరించాలి. ♦ అన్ని కోర్సుల్లో పరిశోధనలకు అవసరమైన అంశాలను గుర్తించి అందుబాటులోకి తేవాలి. ♦ అండర్ గ్రాడ్యుయేట్ విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన విద్యను అందించాలి. ♦ ఈ లక్ష్యాలను సాధించేందుకు మిషన్ నలంద, మిషన్ తక్షశిల పేరిట రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంబంధ అంశాల్లో పరస్పర సహకారం కోసం రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలి. ♦ విద్యా సంస్థల్లో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఉన్నత విద్యలో అన్ని స్థాయిల్లో పరిశోధన స్థాయి పెంచడానికి మరో ప్రత్యేక సంస్థ ‘ది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయాలి. ♦ పాళీ, పర్షియన్, ప్రాకృత భాషల అభివృద్ధికి చర్యలు చేపట్టడంతోపాటు వాటిని జాతీయ విద్యాలయాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో అమలు చేయాలి. ♦ సంస్కృతాన్ని ద్వితీయ భాషగా (ఆప్షనల్) అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని స్థాయిల్లో సుల భంగా పాఠ్య పుస్తకాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ♦ ఉన్నత విద్యలో అంతర్జాతీయీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దూరవిద్య, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నత విద్యలో వివిధ రంగాలు, పారిశ్రామిక నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రజాభిప్రాయ స్వీకరణకు జూన్ 30 తుది గడువు బండెడు పాఠ్య ప్రణాళిక ఉండదు. ఆటపాటలు, విద్యేతర కార్యక్రమాలూ ఇక చదువులో భాగమే. ఆసక్తిని బట్టి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. పరీక్షలు సులభంగా ఉంటాయి. రెండుసార్లు పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తారు. మొత్తంమీద ఇక ఒత్తిడిలేని చదువును అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతీయ నూతన విద్యావిధానం నివేదిక సారాంశం ఇదే. కస్తూరి రంగన్ కమిటీ నివేదికను వెబ్సైట్లో ఉంచిన కేంద్రం జూన్ 30లోగా ప్రజలు అభిప్రాయాలను పంపించాలని కోరింది. కేంద్ర మానవ వనరుల శాఖను విద్యామంత్రిత్వ శాఖగా పిలవాలని ప్రతిపాదించింది. విద్యా ప్రగతి పర్యవేక్షణకు ప్రధాని చైర్మన్గా జాతీయ విద్యా కమిషన్ను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. పాఠశాల, ఉన్నత విద్యకు సంబంధించి పలు మార్పులు చేయాలని సూచించింది. వచ్చే కొద్ది రోజుల్లోనే నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపిస్తారు. పాఠశాల విద్యలో ఇవీ మార్పులు... ♦ 8వ తరగతి వరకు మాతృభాషలో చదువుకోవాలి. కనీసం 5వ తరగతి వరకు తప్పనిసరి. 3–8 వయసు వరకు పిల్లలు వివిధ భాషలు సులువుగా నేర్చుకుంటారు. అందుకే వారికి మూడు భాషలను పరిచయం చేస్తారు. దానివల్ల వారు మాట్లాడటానికి వీలవుతుంది. ♦ అవగాహన పెంచుకునేందుకు 9–12వ తరగతి విద్యార్థులందరికీ కరెంట్ అఫైర్స్ కూడా పాఠ్య ప్రణాళికలో ఉంటుంది. ♦ ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ దృకృథం పెంచేలా చదువు ఉంటుంది. నైతిక భావాలు, తార్కిక పరిశీలన, సాంఘిక, భావోద్వేగపరమైన అంశాలు, కమ్యూనికేషన్, నైతికత, డిజిటల్ విద్య, భారత్పై పరిజ్ఞానం, దేశంలోని ముఖ్యమైన సమస్యలను తెలుసుకునేలా సిలబస్ రూపొందిస్తారు. ♦ పాఠశాల నుంచి ఉన్నతవిద్య వరకు సంస్కృతం ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉంటుంది. ♦ వివిధ సబ్జెక్టులపై ఒలింపియాడ్, ఇతర పోటీ పరీక్షలను మరింత ప్రోత్సహిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడ్లలో పాల్గొనేందుకు కేంద్రం నిధులిస్తుంది. ♦ ప్రైవేటు పాఠశాలలు రుసుములను నిర్ణయించుకోవచ్చు. కానీ ఇష్టారాజ్యంగా రుసుములు పెంచరాదు. ఉన్నత విద్యలో.. ♦ అనుబంధ కళాశాలలు ఉండవు. విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ ఇచ్చే స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలే ఉంటాయి. అంటే ఇక ప్రతి కళాశాల స్వయం ప్రతిపత్తి వైపు అడుగులేయాలి. ♦ ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్సీటీఈ తదితర నియంత్రణ సంస్థల స్థానంలో ఉన్నత, సాంకేతిక విద్యాసంస్థలకు కలిపి జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. ♦ బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్ పేరిట నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలి. -
45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత..!
న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోదీతో సహా 58 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎన్నికల ముందు తయారైన జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) వివరాలు వెల్లడయ్యాయి. సర్వే వివరాలను కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. 2017–18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉందని తెలిపింది. ఇది గడిచిన 45 ఏళ్లలో గరిష్టమని వెల్లడించింది. గత ఏడాది(2017–18) పట్టణ ప్రాంత పురుషుల్లో 7.8 శాతం, మహిళల్లో 5.3 శాతం నిరుద్యోగంలో ఉన్నారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా గత ఏడాది (2017–18) పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగిత ఉందని సర్వే పేర్కొంది. ఇక ఎన్నికలకు ముందే పీఎల్ఎఫ్ఎస్ పూర్తయింది. సర్వే వివరాలు కూడా అనధికారికంగా ఫిబ్రవరిలోనే వెల్లడయ్యాయి. అయితే, ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ నివేదిక ముసాయిదా మాత్రమేననీ, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు. (50 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం) -
‘అదే జరిగితే.. రక్తం ఏరులై పారుతుంది’
పట్నా : కౌంటింగ్ రోజున అధికార పార్టీ అవకతవకలకు పాల్పడితే.. జనాలు ఊరుకోరు.. రక్తపాతం సృష్టిస్తారని హెచ్చరిస్తున్నారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) నాయకుడు ఉపేంద్ర కుష్వహా. బిహార్, యూపీల్లో ఈవీఎంల తరలింపు విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ఎవరూ సరిగా సమాధానం చెప్పడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూసి జనాలు భయపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. మహాకూటమి కానీ, ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు. మా ఓటు.. మాకు గౌరవం, జీవనాధారం. మా బతుకుల జోలికి వస్తే.. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాడతామో.. అలానే మా ఓట్ల కోసం కూడా కొట్లడతాం. ఓట్ల లెక్కిపు రోజున ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం హింసాకాండ చెలరేగడం.. రక్తం ఏరులై పారడం ఖాయం’ అన్నారు. అంతేకాక ‘లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. అప్పుడు జనాల్లో మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత.. మా(మహాకూటమి) పాట్ల సానుకూల స్పందన కనిపించింది. చాలా చోట్ల మహాకూటమి విజయం సాధిస్తుందని అర్థమైంది. అందుకే ఓట్ల లెక్కింపు నాడు ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల’ని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎన్డీఏ ఖండిస్తుంది. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆర్ఎల్ఎస్పీకి చెందిని ఉపేంద్ర కుష్వహా ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టాడు. కానీ ఈ లోక్సభ ఎన్నికల్లో.. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో గత ఏడాది డిసెంబరులో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు. -
‘ఎగ్జిట్’ను మించి సీట్లొస్తాయ్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించి రాష్ట్రంలో బీజేపీకి లోక్సభ సీట్లు దక్కనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లోని అసంతృప్తవాదులు, రాష్ట్ర కాంగ్రెస్లోని మరికొందరు నేతలు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల్లో నిశ్శబ్ధ విప్లవం రాబోతోందని, బెంగాల్ తరహాలోనే రాష్ట్రంలో కూడా బీజేపీ రాజకీయాలను తిరగరాయబోతోందని అన్నారు. ఇద్దరు చంద్రుల ఫెడరల్ ఫ్రంట్.. ఫ్యామిలీ ఫ్రంట్కు టెంటు లేదని ఏపీ, తెలంగాణ సీఎంలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సమాజం సమయం కోసం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ మీద విపక్షాలు రుజువులు అడగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. ఈ దాడుల్లో దోమ కూడా చనిపోలేదని కేసీఆర్ చెప్పారని, బహుశా ఆయనకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ చెవిలో చెప్పి ఉంటాడని ఎద్దేవా చేశారు. సైన్యం మీద కన్నా ఉగ్రవాదుల మీదే కేసీఆర్కు నమ్మకం ఎక్కువ అని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వం అని కేసీఆర్ కాంగ్రెస్కు బయట నుంచి మద్దతు ఇస్తా అంటున్నారని, కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. చంద్రబాబు టీడీపీని సోనియా గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు చక్రం తిప్పుతారని, కేసీఆర్ బొంగరం తిప్పుతారని కొన్ని మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏపీలో ఎదురుకానున్న ఓటమికి చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ సాకులు వెతుకుతున్నారన్నారు. ఓ వైపు ట్యాంపరింగ్ జరిగిందంటూ.. మరోవైపు నేనే గెలుస్తానని చెప్పుకుంటూ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. బీజేపీకి స్వతహాగా మెజారిటీ వస్తుందని, ఎన్డీఏకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. మోదీ ఓటమి కోసం కూటమి కట్టి, ఎజెండా లేకుండా ఎన్నికలకు వెళ్లిన విపక్షాల కూటములను ప్రజలు నమ్మలేదన్నారు. -
‘అక్కడ 53 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలింది’
న్యూఢిల్లీ : పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వెల్లూరులో ఈసీ ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ప్రజానాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి పార్టీలతో పాటు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ను నేను నమ్మను: మమతా బెనర్జీ ‘ఎగ్జిట్ పోల్స్ గాసిప్ను నేను నమ్మను. ఈ గాసిప్ ద్వారా జనాల దృష్టి మరల్చి.. వేలాది ఈవీఎంల్లో అవకతవకలకు పాల్పడటం, వాటిని మార్చడమే లక్ష్యం. ఇలాంటి సమయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవ్వాలని, దృఢంగా కావాలని నేను కోరుతున్నాను. ఈ యుద్ధంలో మనందరం కలిసి పోరాడాలి’ అని మమత ట్వీట్ చేశారు. I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together — Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019 ప్రారంభం నుంచి జరుగుతుంది ఇదే : రాహుల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎంలతో పాటు, ఎన్నికల షెడ్యూల్ను కూడ ప్రభావితం చేశారని విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ , ఈవీఎంలతో పాటు ఎన్నికల షెడ్యూల్ను కూడా మోదీ ప్రభావితం చేశారని రాహుల్ విమర్శించారు. నమో టీవీ, ఆర్మీని కూడ మోదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్నాథ్లో పూజలు అంటూ మోదీ డ్రామాలు ఆడుతున్నారు. ఈసి కూడా మోదీకి పూర్తిగా లొంగిపోయింది అంటూ రాహుల్ విమర్శలు చేశారు. From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians. The EC used to be feared & respected. Not anymore. — Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019 ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టలేదు : చంద్రబాబు ‘ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. గతంలోనూ తప్పులు ఇచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో ఎలాంటి అనుమానం లేదు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. Time and again exit polls have failed to catch the People's pulse. Exit polls have proved to be incorrect and far from ground reality in many instances. While undoubtedly TDP govt will be formed in AP, we are confident that non-BJP parties will form a non-BJP govt at the center. — N Chandrababu Naidu (@ncbn) May 19, 2019 ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పే : శశి థరూర్ ‘ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పేనని నా నమ్మకం. గత వారం ఆస్ట్రేలియాలో 56 వేర్వేరు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పని రుజువైంది. మన దేశంలో జనాలు ప్రభుత్వాలకు భయపడి.. తాము ఏ పార్టీకి ఓటు వేశామో చెప్పరు. వాస్తవ ఫలితాల కోసం 23 వరకూ ఎదురు చూస్తాం’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు. I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results. — Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019 కాంగ్రెస్ పార్టీ చనిపోతే మంచిది : యోగేంద్ర యాదవ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల రాజకీయ పరిశీలకుడు యోగేంద్ర యాదవ్ స్పందించారు. ‘ఒక వేళ ఈ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలవరించలేకపోతే.. భారతదేశ చరిత్రలో ఆ పార్టీకి సానుకూల పాత్ర లేదని స్పష్టమవుతోంది. అప్పుడిక కాంగ్రెస్ పార్టీ చనిపోతే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. The Congress must die. If it could not stop the BJP in this election to save the idea of India, this party has no positive role in Indian history. Today it represents the single biggest obstacle to creation of an alternative. My reaction to @sardesairajdeep https://t.co/IwlmBmf75d — Yogendra Yadav (@_YogendraYadav) May 19, 2019 -
నమో నమ:
2014లో ప్రధాని పీఠాన్నిచ్చిన యూపీలో ఈసారి బీజేపీకి భారీ దెబ్బ తప్పదు.. మమత, అఖిలేశ్–మాయావతి, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ జోరును విజయవంతంగా అడ్డుకుంటారు.. మొన్నటివరకు వెన్నంటి ఉన్న హిందీబెల్ట్ ఈసారి బీజేపీకి మొహం చాటేయడం ఖాయం.. మోదీ మళ్లీ ప్రధాని కావడం దాదాపుగా అసంభవం.. మోదీ, అమిత్ షా ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.. ఇదీ ఏడు విడతల వారీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు. కానీ ఈ అంచనాలేవీ నిజం కాకపోవచ్చని.. మోదీ మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని పోస్ట్పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం 300 సీట్లతో ఎన్డీయే రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్పోల్స్ అంచనా వేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఏడుదశల్లో హోరాహోరీగా జరిగిన పోరులో.. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన పోటీని తట్టుకుని మరీ మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని అభిప్రాయపడ్డాయి. ప్రధానిగా మోదీ పనితీరుకు, కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి, ప్రాంతీయ పార్టీల సత్తాకు అసలు సిసలు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకే జై కొట్టబోతున్నారని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థల సర్వే ఫలితాల్లోనూ ఎన్డీయే మేజిక్ ఫిగర్ (272)ను దాటి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడైంది. 2014 ఎన్నికల్లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్ గతంలో కంటే కాస్త మెరుగుపడినా.. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన 542 స్థానాలకు గానూ బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభావవంతంగా మహా ఘట్బంధన్ అత్యంత కీలమైన మహారాష్ట్ర సహా హిందీ బెల్ట్లోని గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడిస్తున్నాయి. మోదీ వర్సెస్ దీదీ రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోనుందని.. తృణమూల్కు గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక స్థానాలున్న (80 ఎంపీలు) ఉత్తరప్రదేశ్లో ఎస్పీ–బీఎస్పీ మహాఘట్బంధన్ ప్రభావం స్పష్టంగా ఉందని పలు ఎగ్జిట్పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి 40 సీట్ల వరకు రావొచ్చని అభిప్రాయపడ్డాయి. అయితే యూపీలో కోల్పోయే సీట్ల నష్టాన్ని పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కొంతమేరనైనా పూడ్చుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. ప్రియాంక, రాహుల్ ప్రభావమేదీ? గతేడాది చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం, కాంగ్రెస్ బలం పుంజుకోవడం, మోదీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు, వ్యవసాయ సంక్షోభం, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మొదలైన కారణాలతో మోదీకి ఎదురుగాలి వీస్తోందనే చర్చ మొదలైంది. బాలాకోట్ దాడుల ప్రభావం బీజేపీకి నైతిక బలాన్నిస్తుందని భావించినప్పటికీ.. వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగుల్లో అసంతృప్తి వంటివాటిపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిసారించింది. దీంతో బీజేపీకి ఎదురుగాలి తప్పదని.. పరిశీలకులు అంచనా వేశారు. ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్కు బలాన్నిస్తుందని భావించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్కు 59, ఇతరులకు 148 సీట్లు వచ్చాయి. అయితే, మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని, రాహుల్గాంధీ, ప్రియాంకలు అనుకున్నంతగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. దక్షిణభారతంలో మాత్రం బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేదని.. మొత్తంగా 30 స్థానాల్లోపే ఉండొచ్చని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకే మెజారిటీ వస్తుందని మెజారిటీ సంస్థలు స్పష్టం చేశాయి. ఏపీ లోక్సభ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ 18–20 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి. దేశానికి నిస్వార్థం, అంకితభావంతో సేవలు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి సానుకూలంగా భారీగా పోలింగ్ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. సుపరిపాలన అందించిన మోదీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. మోదీపై నిరాధార ఆరోపణలు, అబద్ధాలు చెప్పిన ప్రతిపక్షాలు ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి. –జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూ ఎదురుచూస్తాం. – శశిథరూర్, కాంగ్రెస్ రిపబ్లిక్ టీవీ డబుల్ ఎగ్జిట్ పోల్ మళ్లీ ఎన్డీయేనే..! 17వ లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే పట్టం కట్టనున్నారని ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ రిపబ్లిక్టీవీ సీ–ఓటర్, జన్ కీ బాత్ సంస్థలతో కలసి నిర్వహించిన డబుల్ ఎగ్జిట్ పోల్ జోస్యం చెప్పింది. రిపబ్లిక్సీ–ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ 287 సీట్లు (42.3% ఓట్లు), కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 128 స్థానాలు (28.1% ఓట్లు), యూపీ లోని బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాగఠ్ బంధన్ 40 సీట్లు, రెండు కూటముల్లో లేని ఇతర పార్టీలు 87 సీట్లు గెలుచుకోనున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 సీట్లు రాగా ఈసారి 49 సీట్లు తగ్గుతా యని ఈ సర్వే జోస్యం చెబుతోంది. మరోవైపు రిపబ్లిక్– జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏ 305 (45.5%), యూపీఏ 124 (24.5%), మహాఘట్బంధన్కు 26 సీట్లు సాధిస్తాయని తేలింది. యూపీలో బీజేపీ x మహాకూటమి ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి 38, మహాకూటమికి 40, కాంగ్రెస్కు రెండు సీట్లు వస్తాయని రిపబ్లిక్–సీ ఓటర్ సర్వే అంచనా వేయగా రిపబ్లిక్–జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 46–57 సీట్లు, మహాకూటమి 21–32 సీట్లు, కాంగ్రెస్ 2–4 సీట్లు వస్తాయని పేర్కొంది. మహరాష్ట్రలోని 48 సీట్లలో బీజేపీ–శివసేన కూటమికి 34, యూపీఏకు 14 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్–సీ ఓటర్ సర్వే పేర్కొంది. బీజేపీ–శివసేన కూటమికి 34–39, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన యూపీఏకు 8–12 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్–జన్ కీ బాత్ సర్వేలో అంచనా వేశారు. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు 29, బీజేపీకి 11, కాంగ్రెస్కు రెండు సీట్లు దక్కుతాయని సీ–ఓటర్–రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 18–26, తృణమూల్ కాంగ్రెస్కు 13–21, కాంగ్రెస్కు మూడు సీట్లు వస్తాయని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్లలో కమలం స్వీప్ మధ్యప్రదేశ్లోని 29 సీట్లలో బీజేపీకి 24, కాంగ్రెస్కు 5 స్థానాలు లభిస్తాయని సీ–ఓటర్ సర్వే, బీజేపీ 21–24, కాంగ్రెస్కు 5–8 సీట్లు గెలుచుకుంటాయని జన్కీబాత్ ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న 26 ఎంపీ సీట్లలో బీజేపీకి 22, కాంగ్రెస్కు 4 సీట్లు దక్కుతాయని సీ–ఓటర్ ఎగ్జిట్ పోల్, బీజేపీకి 22–23, కాంగ్రెస్కు 3–4 సీట్లు దక్కుతాయని జన్కీబాత్ సర్వేలు జోస్యం చెప్పాయి. 40 సీట్లున్న బిహార్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏకు 33, ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలున్న ప్రతిపక్ష కూటమికి 7 సీట్లు లభిస్తాయని సీ–ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 28–31, ఆర్జేడీ కూటమికి 11–8 ఇతరులకు ఒక సీటు వస్తాయని అంచనా వేశారు. కర్ణాటకలో కాషాయపక్షానిదే హవా 28 సీట్లున్న కర్ణాటకలో బీజేపీకి 18, కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 9 సీట్లు లభిస్తాయని, ఓ సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకుంటారని సీ–ఓటర్ సర్వే, బీజేపీకి 18–20, కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 10–7 సీట్లు దక్కుతాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సూచిస్తున్నాయి. తమిళనాడులో పోలింగ్ జరిగిన 38 సీట్లలో కాంగ్రెస్, డీఎంకేతో కూడిన యూపీఏకు 27, బీజేపీ, ఏఐడీఎంకేతో కూడిన ఎన్డీఏకు 11 సీట్లు వస్తాయని సీ–ఓటర్ సర్వే తెలిపింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 9–13, యూపీఏకు 15–29 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. టైమ్స్ నౌ టీవీ చానల్ వీఎంఆర్ సంస్థతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 542 ఎంపీ స్థానాలకుగాను 306 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,211 ప్రత్యేక ప్రాంతాల్లో తాము సుమారు 40 వేల మందితో శాంపిల్ సేకరించామని, భౌగోళిక, ఓటింగ్ సరళిలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసిన మరో 40 వేల మంది నుంచి సమాచారం సేకరించిన తరువాత తుది అంచనాకు వచ్చామని టౌమ్స్ నౌ వెల్లడించింది. తొలిదశ పోలింగ్ మొదలైన ఏప్రిల్ 11 నుంచి ఆదివారం జరిగిన తుది విడత వరకు సమాచార సేకరణ జరిగిందని తెలిపింది. తుది అంచనాల ప్రకారం ఎన్డీయే 306 స్థానాలు గెలుచుకోనుండగా యూపీఏ 132స్థానాలకు పరిమితం కానుంది. అదే సమయంలో ఇతర పార్టీలు మొత్తం 104 స్థానాల్లో విజయం సాధించ వచ్చు. కూటముల వారీగా ఓటింగ్ శాతాన్ని గమనిస్తే ఎన్డీయే 41.1% ఓట్లు కైవసం చేసుకోనుండగా యూపీఏ 31.7, ఇతర పార్టీలు 27.2 % ఓట్లు సాధిస్తాయని తెలిపింది. యూపీలో బీజేపీకి 58 సీట్లు దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ 58 స్థానాలు సాధిస్తుందని, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు పరిమితమవు తుందని టైమ్స్ నౌ–వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ లెక్క గట్టింది. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆర్ఎస్ఎల్పీలతో కూడిన మహాఘట్ బంధన్ 20 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో టైమ్స్ నౌ–వీఎంఆర్ అంచనాల ప్రకారం బీజేపీ 11 స్థానాలు గెలుచుకోవచ్చు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. మొత్తం 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి 38 స్థానాల్లో విజయం సాధించనుండగా.. కాంగ్రెస్– ఎన్సీపీల కూటమి పది స్థానాలు గెలుచుకోనుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ అత్యధికంగా 23 స్థానాలు గెలుచుకోనుంది. కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితం కానుంది. తమిళనాడు విషయానికొస్తే డీఎంకే 29 స్థానాలు, ఏఐఏడీఎంకే తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీయేకి 300 వరకు సీట్లు న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో 300 వరకు సీట్లతో ఎన్డీయే సునాయాస విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. యూపీఏ 127, ఇతర పార్టీలు 123 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్ల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అత్యధిక స్థానా ల్లో విజయం సాధించనున్నట్లు అంచనా వేశాయి. హరియాణ, అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రా ల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లలో బీజేపీకి 49 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీ, ఎస్పీల కూటమి 29 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో (42 సీట్లు) 2014 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి 14 సీట్లతో రెండంకెలకు చేరుకోనుంది. టీఎంసీకి 26, కాంగ్రెస్కు 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్రలో (48 సీట్లు) బీజేపీ–శివసేనల విజయం సుస్పష్టమవుతోంది. ఒడిశాలో (21) మాత్రం బీజేపీ (10), అధికార బిజూ జనతాదళ్ (10) మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించే అవకాశం ఉంది. తమిళనాడులో (38) బీజేపీ, ఏఐఏడీఎంకేల కూటమికి 11, డీఎంకే, కాంగ్రెస్ల కూటమి 27 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బిహార్లో (40) బీజేపీ, జేడీయూలు 32 సీట్లలో విజయకేతనం ఎగురవేయనున్నాయి. గుజరాత్లో (మొత్తం 26) 23 సీట్లతో, రాజస్తాన్లో (25) 22 సీట్లతో బీజేపీ దాదాపుగా క్లీన్స్వీప్ చేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ను బట్టి తెలుస్తోంది. కర్ణాటక.. కాషాయానిదే హవా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలకు ఊపునిచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల అనంతరం జట్టు కట్టిన కాంగ్రెస్ జేడీఎస్లు ఒకవైపు.. బీజేపీ మరోవైపు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందంటున్నాయి. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరక్కపోవడంతోపాటు.. ఇరు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు కూటమికి మైనస్ కానుంది. దీనికితోడు కర్ణాటకలోని తీర ప్రాంతంలో బీజేపీ పట్టు కొనసాగడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు గెలుచుకోగా, వీటిల్లో అత్యధికం కోస్తా ప్రాంతం నుంచే రావడం గమనార్హం. తమిళనాడు .. డీఎంకేకు జై ప్రాంతీయ పార్టీల కలగూర గంప తమిళనాడులో ఈసారి డీఎంకే పూర్తి అధిపత్యం కనబరుస్తుందని ఎగ్జిట్పోల్స్ తేల్చి చెప్పాయి. మొత్తం 38 స్థానాలుండగా.. వెల్లూరు లోక్సభ స్థానం పోలింగ్ వాయిదా (భారీగా డబ్బు పట్టుబడడంతో) పడింది. కాంగ్రెస్, డీఎంకేతో సహా పలు పార్టీలకు యూపీయే కూటమిగా.. ఏఐఏడీఎంకే, పలు చిన్న పార్టీలతో బీజేపీ మరో కూటమిగా బరిలో నిలిచింది. ఇండియాటుడే ఎగ్జిట్పోల్స్ ప్రకారం.. డీఎంకే కూటమి 34–38 స్థానాల్లో.. బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి గరిష్టంగా 5చోట్ల గెలవొచ్చని తెలుస్తోంది. న్యూస్ 18– ఐఎస్పీఎస్ఓస్ అంచనా కాస్త భిన్నంగా ఉంది. ఈ సర్వే డీఎంకే 22–24 స్థానాలు.. బీజేపీ–ఏఐఏడీఎంకే 14–16 స్థానాలను అంచనావేస్తోంది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణం తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. కేరళ.. కాంగ్రెస్కు బలం దశాబ్దాలుగా తమను గెలిపిస్తున్న అమేథీతోపాటు కేరళలోని వయనాడ్లోనూ పోటీచేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని చాలామంది తప్పుపట్టినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే అతడి నిర్ణయం సరైందే అనిపించకమానదు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోగలదని దాదాపు అన్ని ఎగ్జిట్పోల్స్ చెబుతూండటం ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా.. యూడీఎఫ్ 15 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 3స్థానాలు ఎక్కువ. ఇదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 3చోట్ల బీజేపీ ఒకచోట గెలిచే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. బెంగాల్.. దీదీ కోటకు బీటలు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కోటలోకి చొరబడాలన్న కమలనాథుల ఆశ నెరవేరనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో మమత ఆధ్వర్యంలోని తృణమూల్కు 24–28 సీట్లు వస్తాయని, బీజేపీ 14 సీట్లలో జయకేతనం ఎగురవేసే అవకాశం ఉందని సర్వేలంటున్నాయి. 2014 ఎన్నికల్లో తృణమూల్ 34 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి కేవలం 2 స్థానాలే దక్కాయి. అయితే ప్రధాని మోదీ ఏకంగా రాష్ట్రంలో 17 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారంటే బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో పోలింగు హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, సీపీఎం శ్రేణులు పరోక్షంగా బీజేపీకి సహకరించడం మమతకు నష్టం కలిగించి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర.. ఎన్డీయేదే పైచేయి దేశంలో యూపీ తర్వాత రెండో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం 48 లోక్సభ స్థానాల్లో ఎన్డీయే 38–42 సీట్లు.. యూపీయే 6–10 చోట్ల గెలుస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 42 సీట్లు గెలుచుకుంది. బీజేపీ–శివసేనల విభేదాలను అనుకూలంగా మలుచుకోవాలన్న కాంగ్రెస్ ఆశ నెరవేరలేదు. పుల్వామా దాడి, బాలాకోట్ సర్జికల్ దాడుల నేపథ్యంలో బీజేపీ–శివసేన విజయం సాధిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. గుజరాత్.. బీజేపీ క్లీన్ స్వీప్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలోని 26 లోక్సభ సీట్లలో.. బీజేపీకి 25 సీట్లు రావచ్చని న్యూస్18–ఐపీఎస్వోఎస్ సర్వేలో వెల్లడయింది. ఇక్కడ కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ సర్వే వెల్లడించింది. న్యూస్ 24–చాణక్య సర్వే ప్రకారం బీజేపీ మొత్తం 26 సీట్లలోనూ జయకేతనం ఎగురవేయనుంది. ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో కాంగ్రెస్కు ఒక సీటు రావచ్చని వెల్లడయింది. 2014 ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలూ బీజేపీకే దక్కాయి. యూపీ.. మహాఘట్బంధన్ సత్తా అత్యధిక లోక్సభ సీట్లున్న యూపీలోని 80 సీట్లలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని టైమ్స్ నౌ (58), రిపబ్లిక్ టీవీ–జన్కీబాత్ (53), ఇండియాటుడే (62–68) ఎగ్జిట్పోల్స్ సూచిస్తున్నాయి. కాగా, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ మహాఘట్బంధన్కు 20 స్థానాలకు పైనే దక్కుతాయని టైమ్స్ నౌ (20), జన్కీ బాత్ (24), సీ–ఓటర్ (40), న్యూస్ ఎక్స్ (41), నీల్సన్ (56) అంచనావేశాయి. ఎగ్జిట్పోల్ అంచనాల ప్రకారం ఎస్పీ–బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ బాగానే జరిగిందనీ, ఎస్సీ, బీసీలతోపాటు ముస్లింలు పెద్ద సంఖ్యలో కూటమికి ఓట్లేశారని అర్థమౌతోంది. కాంగ్రెస్కు 2–4 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. బిహార్.. ఎన్డీయే కూటమిదే.. బిహార్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మూడొంతులకు పైగా సీట్లు లభిస్తాయని మెజారిటీ సర్వేలు సూచిస్తున్నాయి. 40 లోక్సభ సీట్లున్న బిహార్లో ఎన్డీయే కూటమికి టైమ్స్ నౌ (30 సీట్లు), సీ–ఓటర్ (33), జన్కీ బాత్ (29) సీట్లు రావొచ్చని సర్వేలు అంచనావేశాయి. యూపీయే మహాకూటమికి 7–10 సీట్లే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. లాలూ యాదవ్ జైల్లో ఉండడం, కుటుంబంలో విబేధాల కారణంగా ఆర్జేడీకి ఓటేయలేదని తెలుస్తోంది. రాజస్తాన్.. 20కి పైనే 2014లో రాజస్తాన్లో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. ఈసారి కూడా 20కి పైగానే స్థానాలు కాషాయపక్షం గెలుచుకుంటుందని ఇండియా టుడే (22), టైమ్స్–నౌ (21), సీ–ఓటర్(22), టుడేస్ చాణక్య (25), ఏబీపీ నీల్సన్ (19) వస్తాయని అంచనావేశాయి. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గరిష్టంగా ఆరుకు మించి సీట్లు రావనే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. రాజస్తాన్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజేపై వ్యతిరేకతతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే మోదీ మళ్లీ ప్రధాని కావాలని లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ స్థాయిలో గెలిపిస్తున్నారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే గాలి వీస్తుండగా ఒడిశాలో (21 సీట్లు) మాత్రం బీజేపీ పక్షాలు, బిజూ జనతాదళ్ మధ్య పోటాపోటీ వాతావరణం కన్పిస్తోంది. ఎన్డీటీవీ బీజేడీ, బీజేపీలకు చెరో 10, కాంగ్రెస్కు 1 సీటు వస్తుందని అంచనా వేస్తే, సీఓటర్ బీజేడీకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య మాత్రం బీజేపీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్లో (29 సీట్లు) బీజేపీ గాలి వీస్తుండటం గమనార్హం. ఎన్డీటీవీ, సీఓటర్, టైమ్స్ నౌ మూడూ బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపాయి. -
పోలింగ్ ప్రక్రియ ఇంత సుదీర్ఘమా?
పట్నా: దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అసహనం వ్యక్తం చేశారు. రెండుమూడు దశల్లోనే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ప్రస్తుతం పోలింగ్ బూత్ల వద్ద ఎటువంటి నీడా లేకపోవడంతో, ఓటర్లు మండే ఎండల్లో క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. పెద్ద దేశం, అందునా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ల్లో కొండ ప్రాంతాలు ఉన్నందున సాధారణ ఎన్నికలను రెండు లేక మూడు దశల్లోనే పూర్తి చేయాలి’ అని అన్నారు. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నిర్వహణలోపంగా చూడరాదంటూ ఆయన.. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యాక మిగతా పార్టీల ఏకాభిప్రాయంతో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆర్జేడీతో సయోధ్యకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్ను తాను పంపించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ తన ఆత్మకథలో పేర్కొనడాన్ని నితీశ్ తోసిపుచ్చారు. ‘ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ భూషణ్ ఎందరినో కలుస్తుంటారు. లాలూ పేర్కొన్న సమయంలో ప్రశాంత్ భూషణ్ మా పార్టీలో చేరనే లేదు’ అని తెలిపారు. -
కేంద్రంలో మళ్లీ మేమే
న్యూఢిల్లీ/ఖర్గోన్(మధ్యప్రదేశ్): బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వమే వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి 300పైగా సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. 2014లో ప్రధాని అయ్యాక జరిగిన మొట్టమొదటి మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ అమిత్షా నిర్వహించాల్సిన ఈ సమావేశంలో ప్రధాని కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆయన గత ఐదేళ్ల పాలనానుభవం, ప్రస్తుత ఎన్నికలు, ప్రచారం గురించి మాత్రమే మాట్లాడారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడే అంతా చూసుకుంటారని, విలేకరుల ప్రశ్నలకు అమిత్షాయే సమాధానమిస్తారని చెప్పారు. ప్రధానిగా అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతా పార్టీ అధ్యక్షుడే చూస్తారు తమది క్రమశిక్షణ గల పార్టీ అని, అన్ని విషయాలను పార్టీ అధ్యక్షుడే చూసుకుంటారని ప్రధాని తెలిపారు. ‘మేం క్రమశిక్షణ గల పార్టీ సైనికులం. మాకు సర్వస్వం పార్టీ అధ్యక్షుడే. ఐదేళ్లపాటు ప్రధానిగా పనిచేసే అవకాశం ఇస్తూ ఆశీర్వదించిన మీ అందరికీ, మీద్వారా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. పూర్తి మెజారిటీతో ఒకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం గతంలో కొన్ని సార్లు మాత్రమే జరిగింది. ఈసారి 300పైగా సీట్లు తప్పకుండా గెలుచుకుంటాం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. పగ్గాలు చేపట్టిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కృషిచేస్తా’ అని తెలిపారు. ‘ప్రచారంలో నాకు మంచి అనుభవాలు ఎదురయ్యాయి. మా పార్టీ ప్రచారంపై ఎవరైనా పరిశోధన చేయదలచిన వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా అనుకున్న ప్రకారమే అన్ని కార్యక్రమాలను నిర్వహించాం. ఎన్నికల్లో బీజేపీ ప్రచారం అద్భుతంగా సాగింది. అందుకు వాతావరణం కూడా అనుకూలించింది’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల వేదికలను వేరే దేశాలకు మార్చిన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి ఎన్నికలతోపాటు ఐపీఎల్, రంజాన్ వంటివి ఏకకాలంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనకుంది. వైవిధ్యభరితమైన మన ప్రజాస్వామ్యంతో ప్రపంచాన్ని మెప్పించాలి’ అని అన్నారు. రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీని ఓ విలేకరి ప్రశ్నించగా అమిత్ షా జోక్యం చేసుకుంటూ..అన్ని ప్రశ్నలకూ ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు ప్రధాని మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో జరిగిన చిట్టచివరి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి 300కు పైగా సీట్లను గెలుచుకుని వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి, కచ్ నుంచి కామ్రూప్ వరకు ‘ఈసారి 300కు పైగా సీట్లు, మళ్లీ మోదీ ప్రభుత్వమే’ అని దేశం అంటోంది.130 కోట్ల భారతీయుల ఆకాంక్షే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఆదివారం మీరు ఓటేయడానికి వెళ్లి చరిత్రను లిఖిస్తా రు. దశాబ్దాల తర్వాత దేశంలో వరసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ప్రసు ్తత ఎన్నికలు గతానికి పూర్తిగా భిన్నం. ఈసారి ప్రజలు ఏదో ఒక పార్టీ కోసం కాకుండా దేశం కోసం, నవ భా రత నిర్మాణం కోసం ఓటేస్తున్నారు’ అని తెలిపారు. ప్రజ్ఞాసింగ్ను క్షమించను: మోదీ మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరామ్ గాడ్సేను దేశభక్తునిగా కీర్తించిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను క్షమించలేనని ప్రధాని మోదీ తెలిపారు. ఖర్గోన్లో ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని..‘గాంధీజీ లేక గాడ్సేల గురించి ప్రజ్ఞాసింగ్ చెడ్డగా మాట్లాడారు. ఆవ్యాఖ్యలు ఖండించ దగినవి. సభ్య సమాజంలో ఇటువంటి భాష, ఆలోచనలకు తావులేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఆమె ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ, నేను మాత్రం మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నా’ అని అన్నారు. మళ్లీ మోదీయే ప్రధాని: అమిత్షా నాథూరాం గాడ్సేను పొగుడుతూ భోపాల్ లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్తోపాటు, కేంద్రమంత్రి అనంత్కుమార్ హెగ్డే, ఎంపీ నళిన్కుమార్ కటీల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పార్టీ సిద్ధాంతాలకు అవి వ్యతిరేకమని మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. పది రోజుల్లోగా ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ వారికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అయితే, ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్ షా తెలిపారు. ఈసారి 300పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. ‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశ భద్రత విషయంలో రాజీపడింది. -
దేశ ఆర్థిక వృద్ధి దారుణంగా నెమ్మదించింది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దారుణంగా నెమ్మదించిందనీ, స్థూల ఆర్థిక సూచీలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. సమాచారాన్ని దాయడం, తమకు ఇష్టమొచ్చినట్లుగా దాన్ని మార్చడంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో నైపుణ్యం చూపిస్తున్నారని చిదంబరం ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుత ఆర్థిక స్థితి గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దోషాలతో కూడిన వివరాలు ఇస్తోంది. బహుశా ఆర్థిక వ్యవస్థకు ఇదే బలహీనమైన సమయం కావచ్చు. బీజేపీ హయాంలో భారీగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేయడానికి తర్వాతి ప్రభుత్వం భారీగానే కష్టపడాల్సి ఉంటుంది’ అని చిదంబరం పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితి ఏంటనేది ఎన్ఎస్ఎస్వో, సీఎస్వో లెక్కలు చూస్తే అర్థమవుతుందన్నారు. -
సాగు సంక్షోభానికి సరైన జవాబు
వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చివేసే దిశగా మన రాజకీయ నాయకత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలోకి ఏటా రూ. 6 వేలను బదలాయిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. దేశీయ వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం దిశగా పయనిస్తోందని గుర్తించినందువల్లనే కేంద్రం పీఎమ్–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశచరిత్రలో తొలిసారిగా వ్యవసాయరంగంలో ‘ధరల విధానం’ నుంచి ‘ఆదాయ విధానం’ వైపు పయనించడానికి కేంద్రం మొదటి అడుగు వేసిందని ఈ పరిణామం తేల్చి చెబుతోంది. ఇది మన ఆర్థిక చింతనలో సమూలమార్పునకు సంకేతం. దీనికి పోటీగా రాహుల్ గాంధీ సంవత్సరానికి రూ. 72,000లను రైతుల ఖాతాలకు బదలాయిస్తానని హామీ ఇవ్వడం.. రాజకీయ నాయకత్వం ఆలోచనల్లో పెను మార్పునకు సంకేతాలే. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి కొద్ది రోజుల ముందుగా దేశవ్యాప్తంగా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి రూ. 6 వేలను ప్రత్యక్షంగా బదలాయిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్–కిసాన్) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఇది కనీస మొత్తమే అయినప్పటికీ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రస్థాయిలో ఉంటోందో పాలకవర్గాలే గుర్తించి అంగీకరించిన వాస్తవానికి ఇది ప్రతీక అయింది. అయిదేళ్లు పూర్తి అధికారం చలాయించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసింది కానీ వాస్తవానికి రైతుల ఆదాయం ఇప్పుడు గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత అధమస్థాయికి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలోనే రైతులకు జీవితంపై కాసింత ఆశలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నాటకీయ విధానాన్ని ముందుకు తీసుకురావలసి వచ్చింది. 2016 తర్వాత వ్యవసాయరంగ ఆదాయం పెరుగుదల దాదాపుగా జీరో స్థాయిలోనే ఉండిపోయిందని నీతి ఆయోగ్ స్వయంగా అంగీకరించింది. 2011 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో రైతుల నిజమైన ఆదాయం సంవత్సరానికి అర్ధశాతం కంటే తక్కువగానే పెరుగుతూవచ్చిందని (0.44 శాతం) నీతి ఆయోగ్ ప్రకటించింది. వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం దిశగా పయనిస్తోందని, రైతులకు ప్రత్యక్ష నగదు రూపేణా మద్దతు అవసరమని గుర్తించినందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆకస్మికంగా పీఎమ్–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ధరల విధానం నుంచి ఆదాయ విధానం వైపు పయనించడానికి మొదటి అడుగు వేసిం దని ఈ పరిణామం తేల్చి చెబుతోంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది మన ఆర్థిక చింతనలో సమూల మార్పుకు స్పష్టమైన సంకేతం. పీఎమ్–కిసాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన మేరకు దేశంలోని సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు తొలివిడతగా 2 వేల రూపాయలను బదలాయించారు. దీనికి తక్షణ ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ‘న్యాయ్’ ఆదాయ పథకం అమలు చేస్తామని ప్రతి నెలా దేశంలోని రైతులకు ఒక్కొక్కరికి రూ. 6,000లను నగదురూపేణా బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ దఫా ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశంలోని 20 శాతంమంది అత్యంత నిరుపేదల ఖాతాల్లోకి నెలకు 6 వేల రూపాయలను నేరుగా బదిలీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. అంటే తీవ్ర దారి ద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాదిమంది సన్నకారు రైతులను తమ దుస్థితినుంచి బయటపడేయాలంటే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అత్యవసరంగా చేపట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించినట్లయింది. ఈ సందర్భంగా దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000లకు మించలేదని, నెలవారీగా చూస్తే ఇది రూ. 1,700 కంటే తక్కువేనని 2016 ఆర్థిక సర్వే పేర్కొన్న విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగం ఇప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అత్యంత దిగువస్థాయిలో పడి ఉంటోంది. నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగ ఆదాయాలు ద్రవ్యోల్బణాన్ని సవరించిన తర్వాత చూస్తే దాదాపు స్తబ్దతకు గురై ఉంటున్నాయి. రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పొందడంలేదు. ప్రభుత్వం ప్రకటించే ధరలకంటే మార్కెట్ ధరలు మరీ తక్కువగా ఉండటం గమనార్హం. 2000–2017 సంవత్సరాల మధ్య ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ సంస్థలు జరిపిన సంయుక్త అధ్యయనం ప్రకారం ధరల పతనం కారణంగా దేశ రైతులు రూ. 45 లక్షల కోట్లను నష్టపోయారని తెలుస్తోంది. దేశంలోని ఏ ఇతర రంగమైనా ఇంత భారీ నష్టానికి గురై ఉంటే కుప్పగూలిపోయేది. గ్రామీణ రంగ దుస్థితి ఎంత పరాకాష్టకు చేరిందంటే రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతూ వార్తలకెక్కుతున్నాయి. ఈ వాస్తవాన్ని దేశప్రజలకు తెలుపడానికి కూడా భీతిల్లుతున్న కేంద్రప్రభుత్వం గత రెండేళ్లుగా రైతుల ఆత్మహత్యలకు చెందిన డేటాను కూడా విడుదల చేయకుండా నిలిపి ఉంచడం గర్హనీయం. పుల్వామాలో మన సైనికుల కాన్వాయ్పై దాడి తర్వాత మన భుజబలాన్ని ప్రదర్శించే తరహా జాతీయవాదం గురించి రాజకీయ నేతల ఊకదంపుడు ఉపన్యాసాల వెల్లువలో దేశీయ వ్యవసాయరంగ దుస్థితి సమస్య పక్కకు పోయి ఉండవచ్చు కానీ త్వరలో కేంద్రంలో అధికారంలోకి రాబోయే ప్రభుత్వం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఏదంటే కొనసాగుతున్న గ్రామీణ దుస్థితికి చెందిన సంక్లిష్ట సమస్యను పరిష్కరించడమే. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా రైతుల నిరసన ప్రదర్శనలు పెరుగుతుండటం చూస్తున్నప్పుడు, నూతన ప్రధానమంత్రికి వ్యవసాయ సమస్యను ఇక వాయిదా వేయడం ఆసాధ్యమే అనిపిస్తోంది. ప్రత్యక్ష నగదు బదలాయింపుతోపాటు వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను నూతన ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. నా అభిప్రాయం ప్రకారం కొత్త ప్రధాని దృష్టి పెట్టవలసిన, చేపట్టాల్సిన దశలు ఇవి. 1. రైతుల ఆదాయం, సంక్షేమంపై కమిషన్: ఈ కమిషన్ వ్యవసాయ ధరలపై కృషి చేయాలి. వ్యవసాయరంగానికి ఆదాయం కల్పించే ప్యాకేజీకి హామీ ఇవ్వాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ను తనలో కలిపేసుకుని, రైతు కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000 ఆదా యం వచ్చే ప్యాకేజీని అమలుపర్చాలి. జిల్లాలో రైతుకుటుంబం నెలకు సంపాదించే సగటు ఆదాయానికి ఈ ఆదాయ ప్యాకేజీ అదనపు సహాయంగా జతకూర్చాలి. దీనికి సంబంధించిన డేటా సిద్ధంగా ఉంది కాబట్టి జిల్లాలో సగటు వ్యవసాయదారుడి ఆదాయాన్ని నిర్ణయించడం పెద్ద కష్టమేమీ కాదు. 2. రైతు రుణాల మాఫీ: రైతురుణాలను ఒకే దఫాలో మాఫీ చేయడాన్ని తక్షణ ప్రాతిపదికగా అమలు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 2017 నుంచి 1.9 లక్షల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసేశాయి. వ్యవసాయరంగంలో రైతులు చెల్లించలేకపోతున్న మొండి రుణాలు దాదాపు రూ. 3.5 లక్షల కోట్లమేరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తాన్ని రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. తమపై పేరుకుపోయిన గత రుణాల భారంనుంచి విముక్తి కానిదే రైతులు కొత్తగా ఉత్పాతక సామర్థ్యంతో ఉంటారని భావించకూడదు. ఈ కష్టకాలంలో రైతుల పక్షాన జాతి మొత్తం నిలబడాల్సిన అవసరం తప్పనిసరి. రైతు రుణ మాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా పరిగణించరాదు. పైగా, కార్పొరేట్ రంగంపై ఉన్న రుణాలను మాఫీ చేస్తున్న విధానాన్ని బ్యాంకింగ్ రంగం రైతు రుణాల పట్ల కూడా అమలు చేయాల్సి ఉంది. కేంద్రప్రభుత్వం తనవంతుగా కార్పొరేట్ రంగ మొండిబకాయిల విషయంలో చేస్తున్నట్లుగానే రైతు రుణమాపీకి కూడా వీలిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని ఆదేశించాలి. 3. ప్రభుత్వ రంగ పెట్టుబడులు: భారతీయ రిజర్వ్ బ్యాంకు డేటా ప్రకారం 2011–12, 2016–17 మధ్య వ్యవసాయరంగంపై ప్రభుత్వరంగం పెట్టిన మదుపు మొత్తం స్థూల దేశీయోత్పత్తి –జీడీపీ–లో 0.3 నుంచి 0.4 శాతం మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా వ్యవసాయరంగంపై ప్రైవేట్ రంగం మదుపు కూడా తక్కువగానే ఉంది. జనాభాలో దాదాపు 50 శాతం ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయరంగంలో మునిగి తేలుతున్నందున, ప్రభుత్వ రంగ మదుపుల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేశీయ వ్యవసాయ రంగం తగిన మదుపులను అందుకోకపోతే, వ్యవసాయం లాభదాయకమైన పరిశ్రమ అవుతుందని భావించడం అత్యాశే అవుతుంది. 4. సులభతర వ్యవసాయ పద్ధతులు: ప్రతి దశలోనూ రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకుల కారణంగానే భారతీయ వ్యవసాయరంగం కునారిల్లిపోతోంది. పాలనా లేమి కారణంగా వ్యవసాయం బాధితురాలుగా మిగిలిపోతోంది. పరిశ్రమల రంగంలో సులభతర వాణిజ్యం కోసం దాదాపు 7,000 రకాల చర్యలను చేపడుతుండటం సాధ్యపడుతున్నప్పుడు, వ్యవసాయ రంగ కార్యకలాపాలకు ఇదేవిధమైన ప్రాధాన్యతను ఇవ్వకపోవడానికి తగిన కారణమేదీ నాకు కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రతిదశలోనూ వ్యవసాయరంగ పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చు. ఇది వ్యవసాయాన్ని రైతు అనుకూలమైనదిగా మార్చడంలో ప్రారంభ చర్యలకు తావిస్తుంది. 5. ధరలు, మార్కెటింగ్ సంస్కరణలు: మార్కెట్ సంస్కరణలను తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏపీఎమ్సీ మండీల క్రమబద్ధీకరణ మార్కెట్ల నెట్వర్క్ని విస్తరించడం ద్వారా దీన్ని మొదలెట్టవచ్చు. ప్రతి అయిదు కిలోమీటర్ల పరిధిలో ఒకటి చొప్పున దేశంలో కనీసం 42,000 మండీలను ఏర్పర్చవలసి ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,600 వ్యవసాయ రంగ మండీలు మాత్రమే ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో రాజ్యమేలుతున్న సిండికేట్లను కుప్పగూల్చడం ద్వారా వ్యవసాయ మండీల ఏర్పాటులో సంస్కరణలను తప్పక చేపట్టాలి. అదే సమయంలో రైతులు పండించే ప్రతి పంటకూ కనీస మద్దతు ధరకు వీలు కల్పించే దిశలోనే ఎపీఎమ్సీ మండీల్లో సంస్కరణలు సాగాలి. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com దేవిందర్ శర్మ -
రాఫెల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
రైతుల పరిస్థితి ఎంత మారింది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. ఓ పంట ఉత్పత్తికయ్యే ఖర్చుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఆ పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తాం. దేశంలోని వ్యవసాయ మార్కెట్లన్నింటిని హేతుబద్ధం చేస్తాం. పంట సేకరణ వ్యవస్థను, సంస్థలను మరింత పటిష్టం చేస్తాం. ఆహార ఉత్పత్తి మరింత పెరిగేందుకు కృషి చేస్తాం’ ఈ హామీలతో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభం లాంటిది కావడం, దేశంలో అధిక జనభా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తుండడం వల్లనే బీజేపీ ఈ రంగానికి ప్రాధ్యానత ఇవ్వాలని నిర్ణయించి ఈ హామీలను ఇచ్చింది. మరి ఈ హామీల్లో ఎన్నింటిని పాలకపక్షం నెరవేర్చింది? ఏ మేరకు నెరవేర్చింది? 1. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)’ ఓ ప్రణాళికను 2016లో విడుదల చేసింది. అదే సంవత్సరం పండించిన పంటలకు సరైన గిట్టుబాటు లభించక దేశవ్యాప్తంగా రైతులు పలుసార్లు ఆందోళనలు చేశారు. పంట రుణాలను రద్దు చేయడంతోపాటు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఢిల్లీలో కిసాన్ ముక్తి మోర్చా ర్యాలీలో పాల్గొన్న మహిళలు (ఫైల్) 2. 2018, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువ స్థాయికి పడిపోయిందని పలు నివేదికలు వెల్లడించాయి. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. 3. దేశంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం 1980–81 సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడులు 43.2 శాతం ఉండగా, అవి 2016–17 సంవత్సరానికి 18.8 శాతానికి పడిపోయింది. 4. వ్యవసాయ ఉత్పత్తులకయ్యే ఖర్చుకన్నా వాటికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరను కల్పిస్తామన్న హామీని మొదటి నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. 2018లో బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ హామీని పునరుద్ఘాటించారు. అదే ఏడాది ఓ నెల ఆలస్యంగా అంటే 2018, జూలై నెలలో ఖరీఫ్ పంటలకు బీజేపీ ప్రభుత్వం పంట ఉత్పత్తులకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధరను నిర్ణయించింది. అయితే రైతులు డిమాండ్ చేసిన ‘సీ 2’ ఫార్ములా ప్రకారం కాకుండా ‘ఏ2ప్లస్ ఎఫ్ఎల్’ ఫార్ములా ప్రకారం కేంద్రం కనీస మద్దతు ధరలను ప్రకటించింది. పంట పంట గింజలు, ఎరువులు, ఓ కుటుంబం పడిన శ్రమను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భూమి లీజుకు అయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోలేదు. 5. తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడిని సాధించడం, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, తక్కువ నీరు అవసరమైన పంటలను ప్రోత్సహించడం, రైతుల భూములు ఎలాంటి పంటలకు అనువైనవో భూ పరీక్షలు నిర్వహించి రైతులకు భూసార కార్డులను అందజేయడం, క్రిమిసంహారక మందుల ఉపయోగాన్ని నియత్రించడం, దేశంలో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం కింద ఆహార శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమల్లో కూడా పురోగతి అంతంత మాతంగానే ఉంది. 6. సేంద్రీయ ఎరువల విధానం, పంట నష్టం స్కీమ్, రైతు రుణ వ్యవస్థ విస్తరణ, జన్యు మార్పిడి విత్తనాలు అనుమతించక పోవడం ఎన్నో స్కీమ్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. రైతులకు ఎప్పటికప్పుడు పంట సలహాలు ఇవ్వడానికి అన్ని ప్రాంతీయ భాషల్లో 24 గంటల ప్రసార ఛానళ్లను ప్రవేశపెడతామని కూడా బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ‘డీడీ కిసాన్’ పేరిట ఓ హిందీ ఛానల్ను మాత్రమే ఏర్పాటు చేయగలిగింది. ప్రాంతీయ ఛనాళ్ల ఊసే లేదు. -
300 సీట్లు ఖాయం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ సంపూర్ణ ఆధిక్యంతో తాము తిరిగి అధికారం చేపడతామని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తమకు పోటీయే లేదని ఆయన అన్నారు. శుక్రవారం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మళ్లీ ఎన్డీయేను గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనీ, తమ కూటమికి కనీసం 300 సీట్లయితే తప్పక వస్తాయని చెప్పారు. మిషన్ శక్తి కార్యక్రమం ఇప్పటికిప్పుడు అనుకుని చేపట్టినది కాదనీ, అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తక్కువ సమయంలో సాధ్యం కాదని మోదీ తెలిపారు. ‘దీన్ని సాహసం అనుకోండి, ప్రారంభ ప్రయత్నం అనుకోంది. ఇవన్నీ అకస్మాత్తుగా జరిగేవి కావు. మనం ఈ ప్రయోగం చేసే సమయంలో అంతరిక్షంలో మనం పంపిన క్షిపణి లక్ష్యాన్ని మాత్రమే ఢీ కొనేలా చూడాలి. అలాంటప్పుడు క్షిపణి దారిలోకి మధ్యలో అడ్డంగా ఇతర ఏరకమైన వస్తువులూ రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఇతర దేశాలకు మన ప్రయోగ విషయాన్ని తెలియజేసి వారి నుంచి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయంలో అంతరిక్షంలో మన దారికి ఏవీ అడ్డురాకుండా చూసుకుని ఈ ప్రయోగం చేయాలి. దీనికి ఎంత సమయం పడుతుంది? కొన్ని రోజులు లేదా వారాల్లో అయ్యే పనేనా ఇది?’ అని మోదీ వివరించారు. విపక్షాల్లో ఇప్పుడే ఎక్కువ అనైక్యత 2014తో పోలిస్తే ప్రస్తుతం విపక్షాలు మరింత ఐక్యంగా ఉన్నాయన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. నిశితంగా పరిశీలిస్తే విపక్షాలు అప్పటికన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువ అనైక్యతతో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఏపీ, బెంగాల్, ఒడిశా, కేరళ తదితర అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్తో చేతులు కలిపే పార్టీ లేదని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కూడా విపక్షాలు ఏకమయ్యే అవకాశమే లేదనీ, ఎన్డీయేకు తక్కువ సీట్లు వచ్చి, ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలిస్తే మాత్రమే అందుకు ఆస్కారం ఉండొచ్చన్నారు. ఈ ఎన్నికల్లో అయితే తమకు పోటీయే లేదనీ, 2024 ఎన్నికల్లో ఎవరో ఒకరు తమకు పోటీగా వచ్చే అవకాశం ఉందని మోదీ స్పష్టం చేశారు. నిరుద్యోగంపై విపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా కూడా విపక్షాలు నిరుద్యోగం అంశాన్ని లేవనెత్తాయి. కానీ అటల్ జీ హయాంలో 6 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చినట్లు గణాంకాలు చెప్పాయి. అదే యూపీఏ పాలనలో వచ్చిన కొత్త ఉద్యోగాలు 1.5 కోటి మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి కోసం 4 కోట్ల మంది ముద్ర పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వారంతా ఏదో ఓ చిన్న వ్యాపారమైనా చేసి కనీసం మరొక్కరికైనా ఉపాధి కల్పించి ఉంటారు. మా ప్రభుత్వ కాలంలో కోటి మంది ఈపీఎఫ్వోలో కొత్తగా నమోదయ్యారు. వారందరికీ ఉద్యోగాలు వచ్చినట్లే కదా’ అని మోదీ ప్రశ్నించారు. -
భూమి.. ఆకాశం.. అంతరిక్షం
మీరట్/న్యూఢిల్లీ/అఖ్నూర్/డెహ్రాడూన్: శత్రుదేశాలపై భూ, గగనతలం, అంతరిక్షంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం తెగువ చూపిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఎన్డీయే ప్రభుత్వానికి మరోసారి ఓటేయాలని నిర్ణయించుకున్నారన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్ష విజయవంతం కావడంపై స్పందిస్తూ.. శత్రుదేశాల నుంచి భారత్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్కు థియేటర్ సెట్కు, ఏ–శాట్కు తేడా తెలియడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యూపీ, ఉత్తరాఖండ్, కశ్మీర్లో పర్యటించిన మోదీ, విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలముందు పెడతాం.. భారత్ను దొంగదెబ్బ తీస్తున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఎన్డీయే ప్రభుత్వం ధైర్యంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘దమ్మున్న బీజేపీ ప్రభుత్వానికి, కళంకితులైన ప్రతిపక్షాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే మా రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచడంతో పాటు గత 60 ఏళ్లలో ప్రతిపక్షాలు ఏం చేశాయన్న విషయమై నిలదీస్తాం’ అని వెల్లడించారు. రాçహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్)పై స్పందిస్తూ..‘పేద ప్రజల చేత కనీసం బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించలేనివాళ్లు ఇప్పుడు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోకి నగదును జమచేస్తామని హామీ ఇస్తున్నారు. అంతకంటే వాళ్లేం చేయగలరు?’ అని వ్యాఖ్యానించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ఇచ్చిన గరీబీ హటావో(పేదరికాన్ని తరిమేద్దాం) నినాదాన్ని తాను చిన్నప్పటి నుంచి వింటున్నాననీ, కానీ దేశంలో పేదరికం తగ్గకపోగా పేదలు నిరుపేదలుగా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే పేదరికం దానంతట అదే అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసమే ‘రఫేల్’ ఆలస్యం.. తనపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ నేతల ప్రసంగాలను పాకిస్తాన్లో ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్ ప్రతిస్పందన నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. మోదీపై వ్యతిరేకత వీళ్లను గుడ్డివాళ్లను చేసేసింది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేవారితో కాంగ్రెస్ జతకడుతోంది. 2008లో ఉగ్రవాది తర్వాత కూడా కాంగ్రెస్ నేతల రక్తం మరగలేదు....’ అని మండిపడ్డారు. అనంతరం ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో మాట్లాడుతూ.. కమీషన్లపై కన్నేసిన కాంగ్రెస్ దేశభద్రతను పణంగా పెట్టి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలును ఆలస్యం చేసిందని మోదీ ఆరోపించారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ప్రసుత్తం కోర్టులో నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడన్నారు. ఆరోగ్యానికి మంచిది కాదు.. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ–ఆర్ఎల్డీ–బీఎస్పీలు మహాకల్తీ కూటమిగా తయారయ్యాయని విమర్శించారు. ‘ఈ మూడు పార్టీల పేర్లలోని తొలి అక్షరాన్ని తీసుకుంటే సరాబ్(షరాబ్–మద్యం)అని అర్థం వస్తుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ మహాకల్తీ కూటమి పాలనలో ఉగ్రవాదం దేశమంతటా విస్తరించింది. యూపీలో చేతులు కలిపిన ఎస్పీ–బీఎస్పీలు ‘ఒకరి తర్వాత మరొకరం యూపీని దోచేద్దాం’ అనే నినాదంతో వెళ్తున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించారు’ అని ప్రధాని తెలిపారు. బాలాకోట్ ఉగ్రస్థావరంపై దాడికి సంబంధించి సాక్ష్యాలు చూపాలన్న విపక్షాల విమర్శలపై స్పందిస్తూ..‘మనకు సాక్ష్యాలు కావాలా? లేక భారతమాత పుత్రుడు కావాలా? సాక్ష్యాలు చూపాలంటూ ఈ భారతమాత బిడ్డ(మోదీ)ను కొందరు సవాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. సరాబ్, షరాబ్కు తేడా తెలియదా? తమను మద్యంతో పోల్చడంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ప్రధాని మోదీ విద్వేషపు మత్తులో మాట్లాడుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఆయనకు సరాబ్ (ఎండమావి), షరాబ్(మద్యం)కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను మద్యంతో పోల్చడం ద్వారా మోదీ పేదలను అవమానించారని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలనీ, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారని పేర్కొన్నారు. -
లెక్క తేలింది..
ఆదిలాబాద్టౌన్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సర్వే పూర్తయ్యింది.. దీంతో ఈ పథకానికి అర్హుల లెక్క తేలింది. జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన 45,042 కుటుంబాలు ఉండగా, ఇందులో 41,439 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సర్వే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. కాగా మొదటి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున ఈ నెల 24న డబ్బులు జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,33,447 మంది రైతులు ఉండగా, కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి నిబంధన ఉండడంతో సగానికంటే ఎక్కువ మంది రైతులు పథకానికి దూరమయ్యారు. ఈ నెల 14న ప్రారంభమైన సర్వే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఏఈఓలు సేకరించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. ఇప్పటివరకు 32,763 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. మిగతా వారి వివరాలు సైతం మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు రైతుల ఖాతాల్లో డబ్బులు.. సమ్మాన్ పథకంలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈనెల 24 నుంచి డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా అకౌంట్లలో వేయనున్నారు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందించనున్నారు. అయితే జిల్లాలోని 18 మండలాల్లో 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులు 45,042 రైతు కుటుంబాలు ఉండగా, ఇందులో 194 మంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, లాయర్లు, డాక్టర్లు, ఐటీ చెల్లించేవారు, తదితరులు ఉండడంతో అనర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి 41,439 మంది రైతులను అధికారులు అర్హులుగా గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు 32,763 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉందని, 676 మంది రైతుల పూర్తి వివరాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రైతుల వివరాలు అప్లోడ్ చేస్తున్నాం జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలు 45,042 ఉండగా, ఇప్పటివరకు 41,414 మంది రైతులను అర్హులుగా గుర్తించాం. 194 మంది రైతులను ఈ పథకానికి అనర్హులుగా గుర్తించాం. 676 మంది రైతుల వివరాలు పూర్తిగా లేవు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 33,763 రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాం. ఇంకా 95 గ్రామాల రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
కశ్మీర్ సమస్యపై కమల్హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు : రాహుల్
జగదల్పూర్: అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం..రైతులకు మాత్రం రోజుకు రూ.3.50 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. శనివారం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా ధురగాన్ గ్రామంలో జరిగిన గిరిజనుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దోచి పెడుతోంది. కానీ రైతులకు మాత్రం రోజుకు రూ.3.50 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది’అని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు కనీస ఆదాయం హామీ కింద వారి ఖాతా ల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేయడం, 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజా ధనాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిన మోదీ ప్రభుత్వం..బడా వ్యాపార వేత్తలకు భారీ రాయితీలు ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. ‘నోట్ల రద్దు తర్వా త అర్ధరాత్రి తీసుకొచ్చిన గబ్బర్సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రం గా నష్టపోయాయి. మేం అధికారంలోకి వస్తే జీఎస్టీని ‘సచ్చా’జీఎస్టీగా మారుస్తాం’అని పేర్కొన్నారు. టాటా స్టీల్ భూముల పత్రాల అందజేత బస్తర్ ప్రాంతంలోని లోహండిగూడలో టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు పదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో 2008లో ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు సంబంధించిన పత్రాలను, అటవీ హక్కుల ధ్రువపత్రాలు, రైతు రుణమాఫీ పత్రాలను ఆయన చేతుల మీదుగా రైతులకు అందజేశారు. -
ప్రోగ్రెస్ రిపోర్ట్..!
-
సుస్థిర ప్రభుత్వంతోనే దేశ ప్రతిష్ట
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట మెజారిటీ కట్టబెట్టడంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. అస్థిర ప్రభుత్వాలతో ఇంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజైన బుధవారం మోదీ లోక్సభలో ప్రసంగించారు. 2019–20 తాత్కాలిక బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ చేపట్టకుండానే రాజ్యసభ బుధవారం బడ్జెట్కు పచ్చజెండా ఊపింది. అనంతరం లోక్సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో 16వ లోక్సభా కాలంలో చివరి పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్లయింది. ఈ లోక్సభా కాలంలో మొత్తం 219 బిల్లులు ప్రవేశపెట్టగా 203 బిల్లులు ఆమోదం పొందాయి. లోక్సభ కార్యకలాపాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సమర్థంగా నిర్వహించారని మోదీ ప్రశంసించారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులకు జూన్ 3న గడువు తీరనుంది. భూకంపం వస్తుందన్నారు..ఏదీ? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యస్త్రాలు కొనసాగిస్తూ.. రఫేల్ ఒప్పందంపై మాట్లాడితే భూకంపం వస్తుందన్న ఆయన మాటలు డొల్ల అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో రాహుల్ తనను కౌగిలించుకుని తరువాత కన్ను గీటడాన్ని ప్రస్తావిస్తూ.. మొదటిసారి లోక్సభ ఎంపీ అయిన తనకు ఇలాంటివి చాలా కొత్తగా అనిపించాయని చురకలంటించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరగడానికి తాను కానీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కానీ బాధ్యులు కారని, ఈ క్రెడిట్ సంపూర్ణ మెజారిటీ సాధించిన ప్రభుత్వానికి, దేశ ప్రజలకు దక్కుతుందని మోదీ అన్నారు. నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వ విజయాల్ని మోదీ ప్రస్తావిస్తూ..భారత్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. ఈ లోక్సభ సమావేశాల్లో మొత్తం 17 సెషన్లు జరగ్గా, అందులో 8 సెషన్ల లో వందశాతానికి పైగా ఉత్పాదకత సాధించా మన్నారు. మొత్తం మీద లోక్సభ సఫలతా శాతం 85 శాతంగా నమోదైందని తెలిపారు. అంచనాలు అందుకున్నారా: స్పీకర్ ఐదేళ్లలో ప్రజల అంచనాలను అందుకున్నారో? లేదో? ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభ సభ్యులకు సూచించారు. సభ ఏర్పడినప్పటి నుంచి సభ్యుల ఆందోళనల వల్ల 422 గంటల 19 నిమిషాల సమయం వృథా అయిందన్నారు. మొత్తం 331 సిట్టింగ్లలో 1,612 గంటల పాటు కార్యకలాపాలు కొనసాగాయి. మళ్లీ మోదీనే ప్రధాని కావాలి: ములాయం నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం లోక్సభలో అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి మోదీ స్పందిస్తూ ములాయంకు చేతులు జోడించి నమస్కరించారు. ప్రస్తుత సభ్యులు మళ్లీ లోక్సభకు ఎన్నిక కావాలని కోరుకుంటున్నట్లు ములాయం తెలిపారు. తరువాత మోదీ వైపు చూస్తూ ‘మీరే మళ్లీ ప్రధానిగా రావాల’ని అనడంతో అధికార పక్ష సభ్యులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చున్న యూపీయే అధ్యక్షురాలు సోనియా గాంధీ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించింది. తనను ఆశీర్వదించిన ములాయంకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
యూపీఏతో పోలిస్తే చవకే
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకు మోదీ సర్కారు ఒప్పందం కదుర్చుకున్నట్టు కాగ్ వెల్లడించింది. బుధవారం రాజ్యసభకు సమర్పించిన 141 పేజీల నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2007, 2015 కొనుగోలు ఒప్పందాలను పోల్చిచూసినట్టు కాగ్ తెలిపింది. రఫేల్ యుద్ధవిమానాల కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు జరిపిన సంప్రదింపుల్లో బేస్ ధరలో ఎటువంటి మార్పులేదని తేల్చింది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ నిర్వహణ 4.77 శాతం తగ్గింది. భారత అవసరాలకు తగినట్లు సాంకేతిక మార్పులు చేయడంలో 17.08 శాతం తగ్గుదల కనిపించింది. ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ 6.54 శాతం పెరిగింది. పనితీరు ఆధారిత విషయంలో 6.54 శాతం మెరుగుపడింది. టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్మెంట్లో 0.15 శాతం పెరిగింది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గుదల నమోదైంది. పైలట్, సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం 2.68 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. అయితే ధరల వివరాలు వెల్లడించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యం గెలిచింది: బీజేపీ కాగ్ నివేదికపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సత్యం గెలిచిందని, ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇకలైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని పేర్కొన్నారు. -
ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
-
ఏపీకి మళ్లీ మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఇక చట్టబద్ధమైన హామీల ప్రస్తావనగానీ, ప్రత్యేక హోదా ఊసుగానీ ఈ బడ్జెట్లో లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. అలాగే 2019–20కి కూడా ఈ పద్దు కింద నిధులు కేటాయించ లేదు. పూర్తిస్థాయి బడ్జెట్లో జాతీయ సంస్థలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొన్ని జాతీయ సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీలో కలిపి చూపారు. ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును – 0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి. -
వ్యవసాయం గట్టెక్కించేనా?
అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 184 రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు దిగడంతో రైతన్నల ఆగ్రహజ్వాలలు ఢిల్లీ పీఠాన్ని తాకాయి. ఇటీవల హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయానికి అన్నదాతల ఆగ్రహమే కారణమని నిర్ణయానికొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలపై అధ్యయనం చేసి, చివరికు తెలంగాణ,ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెట్టుబడి సాయమే మంచిదన్న నిర్ణయానికొచ్చింది. కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాల జల్లులు కురిపిస్తూ ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కానీ దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకమే. – సాక్షి, హైదరాబాద్ వ్యవసాయ సంక్షోభం ఎలా ఉందంటే.. - మన దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా, 2016–17 నాబార్డ్ ఆర్థిక సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై రూ.1.04 లక్షల అప్పు భారం ఉంది. - దేశం మొత్తం మీద 52శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయినట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఒ) వెల్లడించింది. - రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 92.9శాతం మంది రైతులు రుణగ్రస్థులు కాగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ (89.1%), తమిళనాడు (82.5%) ఉన్నాయి. - ప్రభుత్వ పథకాలపై 64 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నట్టు సీఎస్డీఎస్ అధ్యయనంలో తేలింది. - సాగు కమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోవడం, ఎకరా, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతుల సంఖ్య పెరగడంతో వారు బేరమాడేశక్తిని కోల్పోతున్నారు. దీంతో దళారులు చెప్పే «ధరకే పంటని అమ్ముకుంటున్నారు. - పంటల ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదు. - గోదాములు, శీతల గిడ్డంగుల కొరతతో పంట ఉత్పత్తులు తొందరగా చెడిపోవడం కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది. - డీజిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనంతో ఎరువుల ధరలు ఎగబాకడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. - ప్రత్యామ్నాయ మార్గాలుంటే వ్యవసాయ రంగాన్ని వదులుకోవాలని సుమారు 40 శాతం రైతులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణంలో 40 శాతం వాటా.. ద్రవ్యోల్బణానికి, వ్యవసాయాదాయానికి మధ్య మౌలికంగా కొంత వైరుధ్యం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వినిమయ ధరల సూచి (సీపిఐ)లో 40% వరకు ఆహార పదార్థాలే ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దేశ ద్రవ్యవిధానంలో కీలకమైన అంశం. ద్రవ్యోల్బణం తగ్గడం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వ్యవసాయాదాయాన్ని నియంత్రించడం మంచిది కాదు. విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ–ఆర్థిక సమస్య ఇది. సాయం కంటితుడుపేనా? 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ పెట్టుబడి సాయం రూపంలో తాయిలాలు ప్రకటించింది. భారత్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య 50 శాతానికి పైనే అయినా, ఆ రంగం నుంచి వస్తున్న స్థూల జాతీయోత్పత్తి అంతకంతకు తగ్గిపోయి 17–18 శాతానికి చేరుకుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఆహార ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేయడం కంటి తుడుపు చర్యేనన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పిం చడం, వ్యయ భారాన్ని తగ్గించడం, పంట నిల్వ వసతుల్ని మెరుగుపరచడం లాంటి వాటిపై దృష్టి సారించాలి. రాష్ట్రాల వారీగా అక్కడున్న ఖర్చుల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించాలని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఎన్డీయేతర పక్షాలు కీలక సమావేశం నిర్వహించాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసి’ పేరుతో శుక్రవారం విపక్ష నేతలు భేటీ అయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, జాతీయ నేతలు శరద్ పవార్, డీ రాజా, శరద్ యాదవ్, డీఎంకే నాయకురాలు కనిమొళితో సహా పలువురు నేతలు హాజరైయ్యారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. బడ్జెట్పై స్పందిస్తూ.. రైతులకు రోజుకు 17 రూపాయలు ప్రకటించి ప్రభుత్వం వారిని అవమానపరిచిందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఈవీఎంలపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని.. ఈనెల 4న వాటిపై ఎన్నికల అధికారులను కలుస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని రాహుల్ హెచ్చరించారు. -
బడ్జెట్ 2019
-
తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్
-
అధికారానికి 20 సీట్ల దూరంలో ఎన్డిఏ
-
ఇచ్చిన మాటను తప్పిన ప్రభుత్వమిది
-
ఈబీసీ రిజర్వేషన్: కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
పేదల కోటాకు రాజముద్ర
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగ(103వ సవరణ) చట్టం పేరిట తెచ్చిన ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. ప్రభుత్వం త్వరలో ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక పరిమితుల ఆధారంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ప్రభుత్వం కాలానుగుణంగా గుర్తిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీచేసింది. ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే.. ► వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ► 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు ► నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు ► నాన్ నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు -
ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో భారత ప్రభుత్వం గెజిట్ను విడుదల చేయడంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అగ్రవర్ణపేదలకు 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభల్లో వెనువెంటనే ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించింది. మరోవైపు ఈ బిల్లును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ బిల్లుతో కోటా పరిమితి 50 శాతం దాటిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. అర్హులు ఎవరంటే.. అగ్ర కులాల్లోని పేదలను గుర్తించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. (విశ్వసనీయ సమాచారం ప్రకారం) ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపు ఉండాలి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంతిల్లు ఉండొద్దు మున్సిపాలిటీల్లో 100 గజాలు, మున్సిపాలిటీ కాని ప్రాంతాల్లో 200 గజాలకు మించిన స్థలాలు ఉండకూడదు. -
రాజ్యసభకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. మంగళవారం లోక్సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ ఎగువ సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో సునాయాసంగా ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. బిల్లును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కీలకమైన బిల్లుపై చర్చించేందుకు తగిన సమయం లేదని, ఇంత హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును తీసుకువచ్చిందని విపక్ష సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించిన డీఎంకే సభ్యురాలు కనిమొళి పలు సవరణలు కోరారు. ఈబీసీ బిల్లుపై గెహ్లట్ మాట్లాడుతూ.. సామాజిక సమనత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. సభ్యుల ఆందోళనతో సభను రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. సభ ప్రారంభమైన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బిల్లుపై ప్రసంగించనున్నారు. కాగా 124వ రాజ్యాంగ సవరణకు లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజ్యసభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. -
ఈబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. లోక్సభలో ఆమోదంతో ఈబీసీ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోద ముద్ర పడింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఈబీసీ బిల్లుకు మద్దతు తెలిపారు. సభలో ఉన్నవారిలో కేవలం ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈబీసీ బిల్లు పాసైనట్లు ప్రకటించారు. అంతకుముందు సుమారు 5 గంటల పాటు ఈబీసీ బిల్లుపై చర్చ జరిగింది. పలు పార్టీల నేతలు బిల్లుపై అభ్యంతరాలు చెప్పినా...పంతంతో బీజేపీ బిల్లును నెగ్గించుకుంది . ఆర్థికంగా వెనకబడి అగ్రకులాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం మోదీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. చట్టబద్దత కోసమే ఆర్టికల్ 15,16లకు అదనపు క్లాజ్లు జోడించామని కేంద్రం తెలిపింది. అలాగే ఈబీసీల రిజరేషన్లకు సంబంధించిన అర్హత ధ్రువీకణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభ నిరవధికంగా వాయిదాపడింది. -
ఈబీసీ బిల్లును స్వాగతించిన టీఆర్ఎస్
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లును తమ పార్టీ సమర్థిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్సభలో మంగళవారం రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యమైనా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలవుతున్న తీరుగా.. తెలంగాణలో కూడా రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలన్నారు. విభజన జరిగాక తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. -
అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ బిల్లుపై చర్చ
న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ మంగళవారం లోక్సభలో ప్రవేశ పెట్టారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా గెహ్లాట్ స్పష్టం చేశారు. అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, రిజర్వేషన్లు కాకుండా వేర్వేరు మార్గాల్లో వారికి ఊరట కలిగించే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ఆర్థిక స్థోమత లేక, రిజర్వేషన్ల పరిధిలోకి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, సామాజిక సమానత్వం కోసమే ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదాన్ని పరిపూర్ణం చేయడానికే.. ఈ రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. రాజ్యాంగంలోని అధికరణం 15, 16లను సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే జరిగిన రాజ్యంగ సవరణలు ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలిగించాయన్నారు. తొందరపాటు చర్య : కాంగ్రెస్ ఎంపీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా నిర్ణయాలు.. అనేక సమస్యలకు దారి తీస్తాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు తెచ్చారని, కానీ ఆ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టేసిందని ఈ సందర్భంగా థామస్ గుర్తు చేశారు. ఆ అనుభవం దృష్ట్యా ఇందులో ఎన్నో చట్టపరమైన అంశాలున్నాయని తెలిపారు. ఎన్డీయేకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని, తొందరపాటుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఎన్డీయే తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు. అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు : అరుణ్ జైట్లీ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్తో న్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ రాజ్యంగ సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదన్నారు. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణకు ఎలాంటి ఇబ్బందుల్లేవని, దేశంలోని పేదలకు మేలు చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే తమ ఈ ప్రయత్నమని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అన్న అంశాన్ని 15వ అధికరణ క్లాజ్(5) సవరణ సమయంలోనే చేర్చారని, అదే ప్రకారం ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. పీవీ హయాంలో ప్రత్యేక చట్టం ఏమీ చేయలేదని, అందుకే కోర్టు కొట్టివేసిందన్నారు. చాలా మంది రిజర్వేషన్లు 50శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని అంటున్నారని, ఆ ఆందోళన నిజమే అయితే ఇప్పటివరకు రిజర్వేషన్లకు ఆర్టికల్ 15, 16 కల్పించిన వెసులుబాటులే మూలమని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉందని జైట్లీ వెల్లడించారు. ఇదో రాజకీయ జిమ్మిక్కు: టీఎంసీ రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు ఓ రాజకీయ జిమ్మిక్కనే అనుమానం కలుగుతోందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు కొట్టిపారేశారు. ఈ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈబీసీ బిల్లు ఉద్దేశం మంచిది: శివసేన ఈబీసీ బిల్లును తీసుకొస్తున్న ఉద్దేశం చాలా మంచిదని, అన్ని రాష్ట్రాల్లోను రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారన్నారని శివసేన ఎంపీలు పేర్కొన్నారు. అర్హత ఉండి రిజర్వేషన్లు కోల్పోయిన వారికి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇంత తొందరేంటి: ఏఐడీఎంకే ఈబీసీ బిల్లును తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఏంటని ఏఐడీఎంకే ఎంపీ తంబిదురై ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే ఇంకా పేదరికం ఉందని, 70 ఏళ్ల స్వాతంత్ర భారత్లో ఇంకా కుల వివక్ష ఉందన్నారు. ఈ రాజ్యంగ సవరణ బిల్లుకు ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీ అవసరం కాగా.. ఈ నిర్ణయంతో రిజర్వేషన్లు 50 శాతం దాటనున్నాయి. ప్రస్తుతం అమలవుతున్నరిజర్వేషన్ల శాతం 49.5 శాతం కాగా.. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, బీసీలకు 27 శాతంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై మాయావతి..
లక్నో: అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి స్పందించారు. వెనుకబడిన అగ్ర కులాల వారికి రిజర్వేషన్లు కల్పించడం మంచిదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ గిమ్మిక్కుగా ఆమె వర్ణించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఆమె ఇచ్చిన హామీను గుర్తుచేశారు. కాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రవర్ణ కులాల ఓట్లకు గాలం వేసేందుకే రిజర్వేషన్ల అంశాన్ని మోదీ తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా సంబంధిత బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అగ్రవర్ణ పేదలకు 10% కోటా -
అగ్రవర్ణ పేదలకు 10% కోటా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : మరో నాలుగు నెలల్లో లోక్సభకు సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సోమవారం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్రం మంగళవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు కావడం గమనార్హం. ఇది బీజేపీ ఎన్నికల గిమ్మిక్కు అనీ, మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో లోక్సభ ఎన్నికల్లోనూ అదే జరగుతుందని భయపడి ఉన్నపళంగా రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ బిల్లును ఉభయసభలూ మూడింట రెండొంతుల ఆధిక్యంతో ఆమోదించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది. కాపులు, మరాఠాలు, జాట్లు ఇటీవలి కాలంలో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు నిర్వహించడం, అవి హింసాత్మకంగా మారడం తెలిసిందే. గతంలో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటకూడదు. మిగతా 50 శాతం సీట్లు, ఉద్యోగాలను పూర్తిగా ప్రతిభ ఆధారంగా (జనరల్ కోటా)నే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లను మరో 0.5 శాతానికి మించి పెంచే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం దాదాపు 60కి చేరుతుంది. రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల గురించి ప్రస్తావనేదీ లేదు కాబట్టి అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అధికరణం 15, 16లను సవరించడం ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ ‘బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాక రాజ్యాంగాన్ని సవరించి, అగ్ర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రాథమిక హక్కులను అనుసరించి అగ్ర కులాల్లోని వారికి ఈ రిజర్వేషన్లు ఇస్తాం. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన.. రాజ్యాంగాన్ని సవరించకుండా పార్లమెంటును నిలువరించలేదు’అని చెప్పారు. పలువురు బీజేపీ నేతలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను స్వాగతించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదనీ, అందరి తోడుగా అందరి వికాసమనే ప్రభుత్వ విధానంలో ఇది భాగమని పలువురు పేర్కొన్నారు. బీజేపీ మిత్రపక్షం ఎల్జేపీ అధ్యక్షుడు, దళిత నేత రాం విలాస్ పాశ్వాన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. నిమ్న, అగ్ర కులాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసేందుకే: కాంగ్రెస్ ప్రజలను మోసగించేందుకే బీజేపీ ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను తీసుకొచ్చిందనీ, ఆ పార్టీకున్న ఓటమి భయానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. అయితే తాము ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ మాట్లాడుతూ ‘పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైనంత ఆధిక్యం బీజేపీకి లేదన్న విషయం ఆ పార్టీకి బాగా తెలుసు. అయినా దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకే, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు ఈ బిల్లు తీసుకొస్తున్నారు. మరి గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఏం చేశారు?’అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు తెలపడం తప్పనిసరి. విపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటం అసాధ్యం. అయితే అగ్ర కులాల ఓట్ల కోసం ఈ బిల్లుకు అడ్డుచెప్పే ప్రయత్నాన్ని ఏ పార్టీ చేయబోదని బీజేపీ విశ్వసిస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల బిల్లుతో సాధారణ ఎన్నికల్లో అగ్ర కులాల ఓట్లు తమకు గణనీయంగా పడతాయని బీజేపీ భావిస్తోంది. అర్హులు ఎవరంటే.. అగ్ర కులాల్లోని పేదలను గుర్తించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. (విశ్వసనీయ సమాచారం ప్రకారం) ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపు ఉండాలి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సొంతిల్లు ఉండొద్దు మున్సిపాలిటీల్లో 100 గజాలు, మున్సిపాలిటీ కాని ప్రాంతాల్లో 200 గజాలకు మించిన స్థలాలు ఉండకూడదు. -
వారికి కచ్చితంగా మరణశిక్ష పడుతుంది!
న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్తులకు మరణశిక్ష విధించేలా పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడే నేరగాళ్లకు మరణశిక్ష విధించడమే సరైందని పేర్కొన్నారు. ఈ మేరకు పోక్సో చట్టానికి సవరణలు చేసినట్లు తెలిపారు. పిల్లలను మేజర్లుగా చిత్రీకరించేందుకు హార్మోన్లు ఎక్కించడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడే వ్యక్తులకు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. Union Law Minister, Ravi Shankar Prasad: Cabinet has approved death penalty in aggravated sexual offences under the Protection of Children from Sexual Offences (POCSO) Act. pic.twitter.com/E1JB8xCOOq — ANI (@ANI) December 28, 2018 కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టానికి ఈ ఏడాది ఏప్రిల్లో సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. -
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్సభ ఆమోదం
-
హైకోర్టును విభజిస్తూ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
-
నెట్టింట్లో పోలీస్!
-
ఉల్లి పతనంతో రైతుకు కన్నీళ్లు
గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమేటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలును వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. కానీ అమెరికాలో అధిక ఉత్పత్తితో వ్యవసాయ ధరలు పతనమైనప్పడు అమెరికా వ్యవసాయ విభాగం రైతులనుంచి నేరుగా ఉత్పత్తులను కొంటూ సమస్యను పరిష్కరిస్తున్న పద్ధతిని భారత్లో ఎందుకు అమలు చేయరు? వినియోగదారుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే వ్యవస్థ నుంచి రైతుకు ప్రాధాన్యమిచ్చే తరహా వ్యవస్థకు భారత్ చోటు కల్పించాలి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మద్నగర్లో ఉన్న సంగమ్నెర్కి చెందిన యువరైతు శ్రేయస్ అభాలే. ఇతడి వయస్సు 21 సంవత్సరాలు. 53.14 క్వింటాళ్ల ఉల్లిపాయలు అమ్మిన తర్వాత తాను సంపాదించిన మొత్తం కేవలం రూ. 6 (ఆరు రూపాయలు) మాత్రమే అని తెలుసుకుని ఒక్కసారిగా నివ్వెరపోయాడు. తీవ్రమైన నిరాశా నిస్పృహలతో అతడు తను సంపాదించిన ఆ ఆరు రూపాయలను చెక్కురూపంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవీందర్ ఫడణవీస్కు పంపాడు. కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్రలోని యోలా తాలూకాలో ఉన్న అండర్సుల్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ బైకన్ దేశ్ముఖ్ అనే మరొక రైతు తాను పండించిన ఉల్లి పంటకు కిలోకి 51 పైసలు మాత్రమే ధర పలకడంతో హతాశుడయ్యాడు. దారుణంగా పడిపోయిన ఉల్లిపాయల ధరకు నిరసనగా అతడు 216 రూపాయలను మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మనీఆర్డర్ రూపంలో పంపాడు. మండీ చార్జీలు, రవాణా ఖర్చులు మినహాయిస్తే ఈ సీజన్లో తాను పండించిన ఉల్లిపాయలకు వచ్చిన రాబడి అంతే మరి. ఎంవో వద్దట.. ఆన్లైన్లో పంపాలట..! మహారాష్ట్రలోని నాసిక్ రైతు సంజయ్ సాఠేను వీరిద్దరూ ఆదర్శంగా తీసుకున్నట్లుంది. సాఠే కూడా ప్రధాని విపత్తు సహాయ నిధికి రూ. 1,066ల మనీఆర్డర్ను పంపి వార్తలకెక్కాడు. 750 కిలోల ఉల్లిపంటను అమ్మగా, ఖర్చులన్నీ మినహాయించుకున్న తర్వాత సాఠేకి దక్కిన రాబడి ఇదే. ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఆ మనీఆర్డర్ను స్వీకరించకుండా, మళ్లీ తనకే వెనక్కు పంపడంతోపాటు ఆ సొమ్మును ఆన్లైన్లో పంపమని ఉచిత సలహా ఇవ్వడం చూసి సాఠే విస్తుపోయాడు. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో, పంటపొలాల్లో నిజంగా రక్తస్నానం చోటు చేసుకుంది. దేశంలోనే ఉల్లిపాయలకు అతిపెద్ద వ్యాపార కేంద్రమైన లసల్గావ్ మండీలో ఉల్లి ధర క్వింటాలు (వంద కేజీలు)కు రూ. 100 నుంచి రూ. 300 వరకు పడిపోయింది. సగటున ఉల్లిరైతులు ఉల్లిసాగుకు అయిన ఖర్చుల్లో 15 శాతానికి మించి రాబడి పొందలేకపోయారు. ఈ ఉత్పాతం కలిగించిన ప్రకంపనలను తట్టుకోలేక నాసిక్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు. మధ్యప్రదేశ్లోని నీముచ్ మండీలో, ఉల్లి ధరలు కిలో 50 పైసలకు పడిపోయాయి. ఇలాంటి అనేక ఘటనల్లో, విసిగిపోయిన రైతులు తమ పంటను వీధుల్లో పారవేశారు. కొంతమంది రైతులు ఉల్లి పంటను రహదారుల పైన కుమ్మరించి ఆ దారెంట వెళుతున్న జనాలకు ఉచితంగా పంచిపెట్టారు. చివరకు వెల్లుల్లి పంటకు కూడా ఇదే గతి పట్టింది. గత సంవత్సరం రాజస్థాన్లోని హడోటి (కోటా, బుండి, బరన్, ఝళవర్ అనే నాలుగు జిల్లాలు) రీజియన్లోని రైతులు ధర బాగా పలుకుతోందని వెల్లుల్లి పంట సాగుకు మళ్లారు. ఈ సంవత్సరం మార్చి నెలలో పంట చేతికొచ్చింది. కానీ మార్కెట్లో ధర కిలోకు 1 రూపాయి మేరకు పడిపోయింది. మండీకి రవాణా చేయడం కూడా సాధ్యం కాని దుస్థితి ఏర్పడింది. వెల్లుల్లిధరలు అనూహ్యంగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో అయిదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి. ఉల్లి, వెల్లుల్లి సాగుదారుల దుస్థితి అసాధారణమైన విషయం కాదు. కొన్ని నెలల క్రితం నాసిక్ మార్కెట్లో టొమేటో టోకు ధరలు 65 శాతం పతనమైనప్పుడు చాలామంది రైతులు తాము పండించిన టొమేటో పంటను రోడ్లమీదే కుప్పపోశారు. ఇలా ధరలు కుప్పకూలే ధోరణి మన దేశానికి కొత్తేమీ కాదు. గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టొమేటోలు, క్యాబేజీ, కాలిఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలను వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. నిజానికి గతంలో ఒక రైతు తాను పండించిన దానిమ్మకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుమీద కూర్చుని దానిమ్మ పళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగులగొడుతూ తన నిస్పృహను వ్యక్తపరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధరలు కుప్పగూలిపోవడం అనేది వేలాది వ్యవసాయదారుల జీవితాలను ఎలా దెబ్బ తీస్తోందో తెలుసుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు నిత్యం సమాజం అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. కనీస మద్దతు ధరను వెక్కిరిస్తున్న వ్యవసాయ ధరల పతనం నవంబర్ నెలలోనే కనీస మద్దతు ధరకంటే కనిష్ట స్థాయికి బహిరంగ మార్కెట్లో ధరలు పతనమైపోయినప్పుడు మన దేశ రైతులు ఇంతకు మించి ఏం చేయగలరని ఆశించాలి? రైతులు పండించే పంటల ధరలు మొత్తంగా 15 నుంచి 25 శాతం వరకు పడిపోవడం ప్రస్తుతం సాధారణ కృత్యమైపోయింది. చివరకు వరిధాన్యం విషయంలో కూడా కనీస మద్దతు ధర కింద అదనపు వరి ధాన్యాన్ని సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న దశలోనూ వరి ధర 20 శాతం మేరకు పడిపోయింది. ప్రతి సంవత్సరం 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న నేపథ్యంలో వీటిలో 21 పంటల ఉత్పత్తి అనూహ్య స్థాయిలో మిగులు రూపంలో పోగుపడటం ఫలితంగానే ధరలు కుప్పకూలుతున్నాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఒక సంవత్సరం ఏదైనా పంటకు అధిక ధర లభించడం, వాతావరణం అనుకూలించడం పట్ల ఆకర్షితులైన రైతులు ఆ మరుసటి సీజ నులో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ వారి ఆ ఉత్సాహం, చొరవ తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలి పోతూ రైతులను సంక్షోభంలో ముంచెత్తుతున్నాయి. మన ఎగుమతులకు సుస్థిర మార్కెట్ను కల్పించడంలో వైఫల్యానికి కారణంగా దేశీయ ఎగుమతి, దిగుమతి పాలసీని తప్పుపట్టడం సహజమే. అదే సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చేస్తున్న వాగ్దానం రైతులను నష్టాల బారినుంచి గట్టెక్కించడంలో విఫలమయింది. వాస్తవానికి ఆపరేషన్ ఫ్లడ్ విధానాలకు అనుగుణంగా ఆపరేషన్ గ్రీన్ని ప్రారంభించినప్పుడు టొమేటో, ఉల్లి, బంగాళాదుంప అనే మూడు కీలక పంటల విషయంలో మార్కెట్ జోక్యానికి వీలుకల్పించాలని నిర్ణయించారు. ధరలు పెరిగే అవకాశముందనేది వార్తల రూపంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ పాలు వంటి అతిత్వరగా పాడైపోయే ఉత్పత్తి కోసం సమర్థవంతంగా సహకార వ్యవస్థను దేశంలో ఏర్పర్చుకోగలిగినప్పుడు, ఇదే వ్యూహాన్ని ఇతర కీలక వ్యవసాయోత్పత్తుల విషయంలో ఎందుకు అమలు చేయలేరన్నది ప్రశ్న. అమెరికాలో, ధరల పతనం నుంచి రైతులను కాపాడటంలో ప్రైవేట్ మార్కెట్లు విఫలమైనప్పుడు అమెరికా వ్యవసాయ విభాగం (యుఎస్డిఎ) రైతుల వద్ద ఉన్న మిగులుపంటకు ధర కల్పించే విషయమై పదే పదే చర్యలు తీసుకుంటుంది. 2016లో మార్కెట్ధరలు పతనమైనప్పుడు అమెరికా రైతులనుంచి 20 మిలియన్ డాలర్ల విలువైన కోటి పది లక్షల టన్నుల చీజ్ని (జున్నుగడ్డలాంటిది) యుఎస్డిఎ సేకరించింది. ఆ సందర్భంగా అమెరికా వ్యవసాయ కార్యదర్శి టామ్ విల్శాక్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అనేది సమగ్రమైన భద్రతా నెట్వర్క్లో భాగమని, 30 ఏళ్ల కాలంలో కనివీనీ ఎరుగని రీతిలో ఉత్పత్తయిన చీజ్ మిగులును తగ్గించడానికి, సమాజంలో అత్యవసరమైన వారికి ఈ అత్యధిక ప్రొటీన్ విలువలున్న ఆహారాన్ని అందించడానికి ఈ నెట్వర్క్ తోడ్పడుతుంద’’ని చెప్పారు. రైతు కేంద్రక భద్రతా వ్యవస్థ అవశ్యం అంతకుముందు కూడా, యుఎస్డిఎ కోటి పౌండ్ల స్టాబెర్రీలను కొనుగోలు చేసి వాటిని పాఠశాలలకు, సమాజంలో అవసరమైన వారికి పంపిణీ చేసింది. అధిక మిగులుతో సతమతమవుతున్న టొమేటో రైతులనుంచి 2011లో తాజా టొమేటాలను 6 మిలియన్ డాలర్ల విలువైన టొమేటాలను కొనుగోలు చేసింది. ఇదేవిధంగా భారత ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ అదనంగా ఉత్పత్తయిన టొమేటో, ఉల్లి, బంగాళాదుంపలను ఎందుకు కొనలేదు అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాగే త్వరగా పాడైపోయే అదనపు ఆహార పదార్థాలను ఆహార భద్రత వలయంలో లేని వారికి మనం ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నట్లు? ఈ దేశంలో ప్రతి రాత్రీ 2 కోట్లమంది ప్రజలు పస్తులతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అదనపు టొమేటాలను వీధుల్లో పారవేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగని, అమెరికా ప్రతి సందర్భంలోనూ ఈ వ్యవసాయ ధరల పతనాన్ని పరిష్కరిస్తూ వచ్చిందని చెప్పలేం. 2002లోనే అమెరికా ప్రైజ్–లాస్ కవరేజ్ సిస్టమ్ పేరిట రైతులకు మద్దతు ప్రకటించేందుకు యుఎస్ ఫార్మ్ బిల్ తోడ్పడింది. 2014లో కూడా వేరుశనగ ఉత్పత్తిదారులు ధరల పతనం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఈవిధమైన ఇన్కమ్ సపోర్టు వ్యవస్థ సంబంధిత రైతులను ఎంతగానో ఆదుకుంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునే భారతీయ మార్కెట్ ఇంటర్వెన్షన్ సిస్టమ్లా కాకుండా, అమెరికాలో రైతులకు భద్రతా నెట్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తుండటం గమనార్హం. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కేంద్ర మంత్రి కుష్వాహా రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. కుష్వాహా తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) ఆమోదం కొరకు పంపినట్టు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిహార్లో ఎన్డీఏ సీట్ల సర్ధుబాటు ప్రతిపాదనలతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరితో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీఏ సర్కార్ నుంచి బయటకు రావాలని ఇటీవల జరిగిన ఆర్ఎల్ఎస్పీ మేధోమధన భేటీలో ఆ పార్టీ నిర్ణయించింది. కాగా సోమవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి తాను హాజరు కాబోనని కుష్వాహా ప్రకటించారు. ఈనెల 12న పార్టీ నేతల కీలక భేటీలో ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై ఆర్ఎల్ఎస్పీ ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కాగా,ఎన్డీఏ వ్యవహారాలపై సంప్రదించేందుకు తాను బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల సమయం కోరినా తనకు అపాయింట్మెంట్ నిరాకరించారని గతంలో కుష్వాహా అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు బిహార్లో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాకూటమిలో ఆ పార్టీ చేరవచ్చని తెలుస్తోంది. -
రఫేల్ 'వార్'.. రాజకీయ యుద్ధం!
ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. రఫేల్ ఒప్పందం వివరాలు బయటకు తీసుకురావాలా ? వద్దా అనే అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు బయటకు వస్తే పరిస్థితి ఎలా మారు తుంది ? సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ? ఈ వ్యవహారం ఎందుకు రాజకీయ వేడిని రగులుస్తోంది? ధర.. దడ దడ రఫేల్ ఒప్పందానికి బీజం 2000 సంవత్సరం వాజ్పేయి హయాంలో పడినప్పటికీ యూపీఏ హయాంలోనే ఒక కొలిక్కి వచ్చింది. 2007లో యూపీఏ ఈ ఒప్పందంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చివరికి 2011లో ఫ్రాన్స్ నుంచి 126 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఒక్కో విమానానికి దాదాపుగా రూ.526 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే దీనిపై రెండు దేశాల ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాకుండానే ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. ఆ తర్వాత భారత్లో కూడా ఎన్నికలు జరిగి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం పరుగులు తీసింది. 126కి బదులుగా 36 విమానాల కొనుగోలుకే కేంద్రం ఒప్పందం ఖరారు చేసుకుంది. అయితే ధర విషయంలో గోప్యత పాటించింది. ఈ ఒప్పందం వివరాలు, విమానం ధరల్ని బయటపెడితే శత్రుదేశాలకు ఆయుధాలు, పరికరాల వివరాలు తెలిసిపోయి దేశ భద్రత ప్రమాదంలో పడుతుందంటూ వాటి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు రూ.12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెప్పుకుంది. కానీ 36 విమానాలకే రూ.59 వేల కోట్లు చెల్లించడానికి ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు రూ.1,638 కోట్లు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2016 విదేశీ మారకద్రవ్య మార్పిడి లెక్క ప్రకారం ఒక్కో యుద్ధ విమానం ధర రూ.670 కోట్లు అని, అయితే పూర్తిస్థాయి ఆయుధాలు, ఏవియానిక్స్తో కూడిన ధరను వెల్లడిస్తే దేశ భద్రతకే ప్రమాదం అంటూ దాటవేశారు. ఇక పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్కో యుద్ధ విమానం ధర 15.5 కోట్ల యూరో(దాదాపు రూ.1275 కోట్లు)లు ఉండేదని, ఇప్పుడు ఏకంగా 40 శాతం పెరిగిపోయి 27 కోట్ల యూరోలకు (దాదాపు రూ.2,219 కోట్లు) చేరుకుందని వాదించారు. ఇలా ఇరుపక్షాల మ«ధ్య రఫేల్ ధరల యుద్ధం రాజకీయ వివాదాన్ని మరింత రాజేసింది. ఆఫ్సెట్ కంపెనీ చేతులెత్తేస్తే? అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని గట్టెక్కించడానికే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆఫ్సెట్ ఒప్పందానికి అనుమతిచ్చిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2008లో రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కంపెనీకే రఫేల్ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అప్పగించాల్సి ఉంది. కానీ మోదీ హయాంలో సీన్ మారింది. ముఖేశ్ ఆర్ఏటీఎల్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. అనిల్ రాత్రికి రాత్రి రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ ఆర్డీఎల్ దక్కించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను కాదని మరీ ఆర్డీఎల్కు కాంట్రాక్ట్ అప్పగించడమేంటని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి నిలదీస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు వాదనల సమయంలో న్యాయమూర్తులు ఈ అంశంపైనే ప్రభుత్వ లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. యుద్ధ విమానాల తయారీలో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చలేకపోతే, విమానాల తయారీ చేపట్టలేకపోతే ఏం జరుగుతుంది? దేశ ప్రయోజనాల సంగతేంటి? అని న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే ఆఫ్సెట్ కంపెనీని ఒప్పందం నుంచి తప్పించవచ్చని దసో ఏవియేషన్కు జరిమానాలు కూడా విధించవచ్చని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ చేతుల్లో ఏమీ ఉండదా ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిందేనని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం భారత్కు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’కు కుదిరిన ఒప్పందం మాత్రమే. యుద్ధ విమానాల సరఫరాలో ఏమైనా తేడాలొచ్చినా, దసో ఏవియేషన్ యుద్ధ విమానాల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోయినా ఫ్రాన్స్ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు వహించదు. ఎందుకంటే ఒప్పందం సమయంలో ఇవ్వాల్సిన సార్వభౌమ హామీ(సావరీన్ గ్యారంటీ) ఫ్రాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా రక్షణ శాఖ ఏమీ పట్టకుండా ఒప్పందంపై ముందుకు వెళితే న్యాయశాఖ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఒత్తిడి మేరకు ఫ్రాన్స్ సర్కార్ కంఫర్ట్ లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇంచుమించుగా సావరీన్ గ్యారంటీతో సమానమని కేంద్రం పేర్కొంటోంది. కానీ భవిష్యత్లో ఇబ్బందులు ఎదురైతే ఆ లేఖకు చట్టబద్ధత ఉండదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అది చెల్లుబాటుకాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ఆత్మరక్షణలో కేంద్రం అదే ఒప్పందం, అవే విమానాలు కానీ యూపీఏ నుంచి ఎన్డీయే హయాం వచ్చేసరికి ఎన్నో తేడాలు. ధర రెట్టింపు అయిందంటూ ఆరోపణలు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను పక్కన పెట్టారంటూ విమర్శలు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికే దేశ ప్రయోజనాలను కాలరాశారంటూ కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు దీటైన జవాబులివ్వలేక కేంద్ర మంత్రులు తడబడిపోతున్నారు. కేంద్ర మంత్రులు చేసిన వాదనలన్నీ తప్పుడువేనని ఎప్పటికప్పుడు తేలిపోతూ ఉండటంతో కేంద్రం ఇరుకున పడిపోతోంది. విమానం ధరలు వెల్లడిస్తామని తొలుత ప్రకటించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మాటమార్చి దేశ ప్రయోజనాల దృష్ట్యా గోప్యత తప్పదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను కాదని, అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిఫెన్స్ను సర్వీసు ప్రొవైడర్లుగా ఎందుకు ఎంపిక చేశారన్నదానికి, అది తమ పరిధిలో లేదని దసో ఏవియేషనే ఆ నిర్ణయం తీసుకుందని కేంద్రం వాదిస్తోంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్ రిలయెన్స్ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వమే తమకు సూచించిందని బహిరంగంగానే చెప్పడంతో బీజేపీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. హాల్కి యుద్ధ విమానాలు చేసే సామర్థ్యమే లేదంటూ నిర్మలా సీతారామన్ వాదించడంపై రాజకీయంగా రచ్చ జరిగింది. ఆ తర్వాత హాల్ మాజీ చైర్పర్సన్ సువర్ణ సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలనే తాము తయారు చేశామని ఈ బాధ్యతను అప్పగించినా చేసేవాళ్లమని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో కేంద్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది. దీన్ని ఆయుధంగా చేసుకొని రాహుల్ హాల్ సిబ్బందితో సమావేశమై నైతిక మద్దతుని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఆ తర్వాత కోర్టులో కూడా న్యాయమూర్తుల నుంచి కేంద్రం గట్టి ప్రశ్నల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం లేదన్న విషయంపై కూడా ఇప్పడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తమ్మీద రఫేల్ ఒప్పందం అవకతవకలు కోర్టుకి చేరడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ రేగుతోంది. ఒప్పందం వివరాలు బహిర్గతం చేయాలన్న నిర్ణయం కోర్టు తీసుకుంటే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే రఫేల్ యుద్ధంలో కేంద్రంపై పైచేయి సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సమయానికి ఈ ఒప్పందంలో లొసుగులన్నీ వెలుగులోకి వచ్చి తమకే లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉంది. యూపీఏ డీల్.. 2007 మధ్యతరహా బహుముఖ యుద్ధ విమానాలు(ఎంఎంఆర్సీఏ) కొను గోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆగస్టు 28, 2007 ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల సంస్థ దసో ఏవియేషన్ బిడ్ వేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన మిగ్–35, స్వీడన్సాబ్ జాస్–39 గ్రిపెన్, అమెరికా మార్టిన్ ఎఫ్–16, యూరో ఫైటర్ టైఫూన్ వంటి సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. సెప్టెంబర్ 4, 2008 రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరితే దసో ఏవియేషన్, ఆర్ఏటీఎల్ సంయుక్తంగా యుద్ధ విమానాల తయారీ చేపట్టాలని ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మే 2011 భారత వాయుసేన చేసిన షార్ట్ లిస్ట్లో రఫేల్, యూరోఫైటర్ జెట్స్ నిలిచాయి. జనవరి 2012 బిడ్లను పరిశీలిస్తే దసో ఏవియేషన్ తక్కువ ధరని కోట్ చేసింది. మొత్తం 126 విమానాల్లో 18 విమానాలను అప్పటికప్పుడు పంపడానికి, మిగిలిన వాటిని దసో సహకారంతో హాల్ తయారు చేయాలని అంగీకారానికి వచ్చాయి. మార్చి 13, 2014 రఫేల్ ధరలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, దసో–హాల్ మధ్య పని విభజన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఒక అవగాహనకు రాలేకపోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్లుగా చెబుతోంది. ఎన్డీయే డీల్.. మార్చి 28, 2015 అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ అనే కొత్త కంపెనీ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 10, 2015 ప్రధాని నరేంద్ర మోదీ పారిస్కు వెళ్లి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. జూన్ 2015 126 యుద్ధ విమానాల టెండర్లను రక్షణ శాఖ అధికారికంగా వెనక్కి తీసుకుంది. డిసెంబర్, 2015 అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలన్ సహచరి, నటి అయిన జూలీ గయె ప్రధాన పాత్రలో నటించే సినిమాల్లో రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. రఫేల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసం క్విడ్ప్రోకో ఒప్పందంలో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 2016 ఫ్రాన్స్ అధ్యక్షుడి హోదాలో ఫ్రాన్సిస్ హోలన్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రఫేల్ ఒప్పందంపై ఇరుపక్షాలు సంత కాలు చేశాయి. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమానాలు సరఫరా చేయాల్సి ఉంది. అక్టోబర్ 3, 2016 అనిల్ అంబానీ ఆర్డీఎల్, దసో ఏవియేషన్ జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం దసో ఏవియేషన్ ఒప్పందం విలువలో 50% పెట్టుబడుల్ని భారత్లో తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. ఫిబ్రవరి 2017 దసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఎల్) అన్న పేరుతో సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు. -
మళ్లీ మోదీనే రావాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశమిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయపడినట్లు ఓ సర్వేలో తేలింది. 63 శాతం పైగా మంది ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తీకరించారు. వార్తా వెబ్సైట్ డైలీహంట్, డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ ఇండియాలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. దేశ విదేశాల్లో సుమారు 54 లక్షల మంది అభిప్రాయాల్ని ఆన్లైన్లో సేకరించి ఈ నిర్ధారణకు వచ్చాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ సర్వే ఫలితాల్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ అంచనాలు వృథా, నకిలీవని పేర్కొంది. ‘ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎన్డీయేకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదు. అన్ని దారులు మూసుకుపోయాక తన అర్థ బలంతో ఇలాంటి నకిలీ సర్వేలను తెరపైకి తెచ్చి, అవి నిజమని నిరూపించాలనుకుంటోంది. ప్రజలే తిరస్కరించాక ఇలాంటి వృథా సర్వేలతో వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సర్వేలో ఏం తేలిందంటే.. ► మోదీ పనితీరు, నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది. 2014తో పోలిస్తే మోదీ ప్రభుత్వంపై వారికి ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ► సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించేందుకు మోదీనే అందరి కన్నా ఎక్కువ అర్హుడని అభిప్రాయపడిన సుమారు 62 శాతం మంది. తరువాతి స్థానాల్లో రాహుల్ గాంధీ(17 శాతం), అరవింద్ కేజ్రీవాల్(8 శాతం), అఖిలేశ్ యాదవ్(3 శాతం), మాయావతి(2 శాతం) ఉన్నారు. ► మోదీకి రెండోసారి ప్రధాని అయితే తమ భవిష్యత్తు బాగుంటుందన్న 50 శాతం మంది. ► అవినీతి నిర్మూలనలో మోదీకి మద్దతుతెలిపిన సుమారు 60 శాతం మంది. ► ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎక్కువ మద్దతు పలికారు. ► ఇతర వయో బృందాల కన్నా 35 ఏళ్లకు పైబడిన వారే మోదీకి అత్యధిక మద్దతు తెలిపారు. ► త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచగా, తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ధోరణి కనిపించింది. -
ఏది రాజకీయం, ఏది కుట్ర?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘బహుత్ హువా నారి పర్ వార్ (మహిళలపై జరిగిన అత్యాచారాలు ఇక చాలు)’ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ముఖ్య నినాదాల్లో ఒకటి. ఇప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న బీజేపీని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజె అక్బర్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ తనపై జరుగుతున్న రాజకీయ కుట్రగా అక్బర్ అభివర్ణించారు. పరువు నష్టం కేసు వేయాలని కూడా నిర్ణయించారు. ఎంత హాస్యాస్పదం! మీడియా మాజీ ఎడిటరైన అక్బర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 14 మంది మహిళలు. వారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉంది. పైగా వారంతా జర్నలిస్టులు. ప్రియా రమాని, ఘజాల వాహబ్, సబా నక్వీ, మజ్లీ డే పుయ్ కాంప్, శుమా రహా, హరిందర్ బవేజా, శుతాప పాల్, సుపర్ణ శర్మ, అంజు భారతి, మాలిని భూప్తా, కాదంబరి వాడే, కనిక గహ్లాట్, రుత్ డేవిడ్, ప్రేరణ బింద్రా అక్బర్పై ఆరోపణలు చేశారు. వారిలో కొందరు తమపై లైంగిక దాడి జరిపినట్లు చెప్పగా, లైంగిక దాడులకు ప్రయత్నించినట్లు మిగతా వారు ఆరోపించారు. పేర్లను బట్టి చూస్తే వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వారంతా కలిసి ఎలాంటి ప్రజా పలుకబడి పునాదులు లేకుండా రాజ్యసభ ద్వారా మంత్రి అయిన అక్బర్పై రాజకీయ కుట్ర పన్నుతారా? ఎంత హాస్యాస్పదం! బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఎంజె అక్బర్పై వచ్చిన ఆరోణలపై బీజేపీ నేతలు పలు విధాలుగా స్పందించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సుబ్రమణియన్ స్వామి అన్నారు. అది ఆయనకు, ఆరోపణలు చేసిన వారికి సంబంధించిన సమస్య, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉమా భారతి వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలను చేస్తున్న మహిళలను లక్ష్యంగా పెట్టుకోరాదని, అయితే అక్బర్ గురించి మాట్లాడే స్థానంలో తాను లేనని మరో మహిళా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ అన్నారు. లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిని తాను నమ్ముతున్నానని, ప్రతి ఫిర్యాది వెనకనుండే బాధను, వ్యధను తాను అర్థం చేసుకోగలనంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ‘మీటూ’ ఆరోపణలన్నింటిని విచారించేందుకు సీనియర్ జుడీషియల్, లీగల్ వ్యక్తులతోని ఓ కమిటీ వేయాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆమె చెప్పారు. (చదవండి : మీటూ సంచలనం : ఎంజే అక్బర్పై లైంగిక ఆరోపణలు) మరోసారి వేధించే అవకాశం ఉంది! అయితే లైంగిక ఆరోపణలు చేసిన మహిళల సమ్మతి ఉన్న కేసుల్లోనే విచారణ జరపాలని రుత్ మనోరమా, అమ్మూ జోసఫ్, గీత లాంటి మహిళా సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఇలాంటి సంఘటలనకు సంబంధించి సరైన ఆధారాలు లభించక పోవచ్చని అలాంటి సందర్భాల్లో విచారణ నుంచి బయటపడే మగవాళ్లు ఫిర్యాదుదారులను వేధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విచారణ కమిటీలకన్నా మహిళల హక్కులను గౌరవించేలా మగవాళ్ల మనస్తత్వాన్ని మార్చే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదంతోపాటు మహిళలపై జరగుతున్న అన్యాయాలను ఏ నాగరిక ప్రపంచం సహించదంటూ పదే పదే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం నుంచి అక్బర్ను తొలగించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?! -
‘చమురు’ ధరతో ఆటలు!
ఈమధ్య కాలంలో పైపైకి పోవడం తప్ప కిందకు దిగడం తెలియని పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం హఠాత్తుగా రూటు మార్చుకుని తగ్గుముఖం పట్టాయి. ప్రతి లీటర్కూ వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ. 2.50 కోత విధించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటమే ఇందుకు కారణం. అంతేకాదు...రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో తాము వసూలు చేసే వ్యాట్లో లీటర్కు రూ. 2.50 చొప్పున తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకం వెనువెంటనే దాన్ని శిరసావహించాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో వెళ్తే ఈ రెండింటి ధరలూ లీటర్కు రూ. 5 మేర తగ్గుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పెట్రో ధరలు డజనుసార్లు పెరిగాయి. ఇలా పెరిగిన ప్రతిసారీ జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. గత నెల 11న విపక్షాలు భారత్ బంద్కు పిలుపునివ్వగా పుండు మీద కారం జల్లినట్టు అదే రోజు పెట్రో ధరలు మరికాస్త పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు బ్యారెల్ ధర 86 డాలర్లుంది. నాలుగేళ్లలో ఇది అత్యధికం. దీనికితోడు రూపాయి విలువ నానాటికీ దిగజారుతోంది. డాలర్తో పోలిస్తే దాని ప్రస్తుత విలువ రూ. 73.81. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరల పెంపు పర్యవసానాలు బహుముఖంగా ఉంటాయి. సరుకు రవాణా చార్జీలు తడిసిమోపెడై నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి రిజర్వ్బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతుంది. దాని ప్రభావం వల్ల వృద్ధి మందగిస్తుంది. ఇలా ఒకదానికొకటి ముడి పడి ఉండే అనేక పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అంతర్జాతీయ పరిణామాలవల్ల చమురు ధరలు తగ్గటం మొదలయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 115 డాలర్లుంటే ఏడాది తిరిగేసరికల్లా అది 53.36 డాలర్లకు చేరుకుంది. మన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడతాం గనుక ఇలా ధరలు పడిపోవడం వల్ల ఒక్కసారిగా మన కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం ప్రారంభించింది. లక్షల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం మొదలైంది. అయితే మోదీ ప్రభుత్వం చమురు ధరల తగ్గుదలను వినియోగదారులకు బదిలీ చేసే ప్రయత్నం చేయలేదు. ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ పోయి భారీ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టింది. 2014 నవంబర్ మొదలు 2016 జనవరి వరకూ 9 సార్లు ఈ సుంకాన్ని పెంచింది. నిరుడు అక్టోబర్లో ఒక్క సందర్భంలో మాత్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించింది. గత ఏడు నెలల్లో పెట్రోల్పై లీటర్కు దాదాపు రూ. 6, డీజిల్పై లీటర్కు దాదాపు 6.50 చొప్పున పెరిగింది. ఈ పెట్రో ధరల పెరుగుదలలో రాష్ట్రాల పాత్ర తక్కువేమీ కాదు. అవి వ్యాట్(విలువ ఆధారిత పన్ను) పేరుతో బాదుతుంటాయి. సరుకు విలువను బట్టి ఈ పన్ను విధిస్తారు గనుక కేంద్రం పెట్రో ధరలు పెంచినప్పుడల్లా రాష్ట్రాలకు పండగే. వ్యాట్ ద్వారా వాటి ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ వ్యాట్ అన్నిచోట్లా ఒకేలా లేదు. పెట్రోల్పై అత్యధికంగా వ్యాట్ విధించే రాష్ట్రాల్లో అగ్ర స్థానం మహారాష్ట్రది. అది పెట్రోల్పై 38.11 శాతం, డీజిల్పై 24.78 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. పెట్రోల్పై ఆంధ్రప్రదేశ్ 35.77 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా...డీజిల్పై మాత్రం అందరికన్నా ఎక్కువగా 28.08 శాతం వసూలు చేస్తోంది. కనుకనే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. ప్రతి పెట్రోల్ బంక్ వద్దా పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు ఆ ధరలో ఎవరి వాటా ఎంతో వివరంగా ప్రదర్శిస్తే అందరి వేషాలూ బయటపడతాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆంధ్రప్రదేశ్ పెట్రోల్పైనా, డీజిల్పైనా విధించిన వ్యాట్ ద్వారా రూ. 1,208 కోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయన బృందం నివేదిక అంచనా వేసింది. చమురుపై విధించే వ్యాట్ ద్వారా రూ. 10,800 కోట్లు ఆర్జించాలని 2018–19 బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకోగా ఆ లక్ష్యానికి మించే ఆదాయం లభిస్తుందని ఈ నివేదిక చూస్తే అర్థమవుతుంది. ఒకపక్క జనంపై ఇలా ఎడాపెడా వ్యాట్ పేరుతో బాది భారీగా ఆదాయం గడిస్తూ బిచ్చం వేసినట్టు లీటర్కు రూ. 2 తగ్గించామని బాబు సర్కారు ఆర్భాటంగా గత నెలలో ప్రకటించింది. ఇప్పటివరకూ పొందిన ఆదాయాన్ని, ఆ రాష్ట్రం పెట్టుకున్న లక్ష్యాన్ని బేరీజు వస్తే పెట్రోల్పై లీటర్కు రూ. 3, డీజిల్పై లీటర్కు రూ. 2.50 వరకూ తగ్గించవచ్చునని ఎస్బీఐ అధ్యయన నివేదిక లెక్కేసింది. చమురుపై మొత్తంగా రాష్ట్రాల ఆదాయం రూ. 23,000 కోట్లు దాటుతుందని ఆ నివేదిక చెబుతోంది. ఇప్పుడు హఠాత్తుగా ధరల్ని తగ్గించడానికి త్వరలో ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు, అటుపై వచ్చే సార్వత్రిక ఎన్నికలు కారణమని సులభంగానే అర్ధమవుతుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం రూ. 2.50లో కేంద్రం వాటా రూ. 1.50 మాత్రమే. మరో రూపాయిని చమురు సంస్థలు భరిస్తాయి. 2013 జనవరిలో అప్పటి యూపీఏ సర్కారు పెట్రోల్ ధరపై నియంత్రణ ఎత్తేసింది. ఇకపై అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఆ ధరలుంటాయని చెప్పింది. ఎన్డీఏ సర్కారు వచ్చిన వెంటనే డీజిల్పై కూడా నియంత్రణ తొలగించింది. ఆ విధానానికే కట్టుబడి ఉంటే ఈపాటికల్లా చమురు ధరలు బాగా తగ్గాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగంపై ఆధారపడి ఏటా లక్షల కోట్ల మేర ఆదాయం గడిస్తున్న తీరు సరికాదని గతంలో రంగరాజన్ కమిటీ హితవు పలికింది. ఇతరేతర రంగాల ద్వారా వనరులు పెంచుకోవాలని సూచించింది. కానీ ఆ కమిటీ నివేదికను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గించటం మంచిదే. కానీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చమురు ధరలు మరింత తగ్గేలా చూడాలి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. -
వివక్షాపూరిత సెక్షన్ విరగడ
మారుతున్న సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా కాలదోషం పట్టిన చట్టాలను యధావిధిగా కొనసాగించటం అనర్ధదాయకం. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తరహా చట్టాలను వదుల్చుకుందామని మంత్రిత్వ శాఖలన్నిటికీ తాఖీదులిచ్చారు. ఆ కసరత్తు పర్యవసానంగా అనంతరకాలంలో చాలా చట్టాలు రద్దయ్యాయి. గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం చెల్లదంటూ చెప్పిన భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 497 కూడా నిజానికి ఆ కోవలోకే వస్తుంది. కానీ దాన్ని రద్దు చేస్తే వైవాహిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కారణంతో కేంద్రం దాని జోలికి పోలేదు. భార్యతో లైంగిక సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తిపై నేరం మోపడానికి, అతనికి శిక్ష పడేలా చేయటానికి భర్తకు ఈ సెక్షన్ వీలు కల్పిస్తోంది. ఈ నేరంలో వేరే వ్యక్తితోపాటు తన భార్య కూడా భాగస్వామే అయినా భర్త ఆమెపై కేసు పెట్టలేడు. ఈ నేరం రుజువైతే నిందితుడికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. విచిత్రమేమంటే భర్త అనుమతితో అతడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణించదు. ఇలాంటి నేరాల్లో మహిళలను శిక్షించాలని చెప్పటం లేదు గనుక ఈ సెక్షన్ వారికి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది. లోతుగా పరిశీలిస్తే ఇందులో దాగి ఉన్న వివక్ష తేటతెల్లమవుతుంది. భార్యను అసలు సజీవమైన వ్యక్తిగా ఈ సెక్షన్ పరిగణించటంలేదని అర్ధమవుతుంది. ఐపీసీలో ఈ సెక్షన్ను కొన సాగించటంపై మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం విచిత్రమైన జవాబిచ్చింది. ‘వైవాహిక వ్యవస్థకూ, దాని పవిత్రతకూ భారతీయ విలువలు అత్యున్నత ప్రాముఖ్యతనిస్తాయి. ఈ సెక్షన్ను కొట్టేస్తే ఆ విలువలకు హాని కలుగుతుంది’ అని కేంద్రం వివరించింది. అయితే మహిళల ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తున్నదని గుర్తించలేకపోయింది. మహిళా సంఘాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని చాన్నాళ్లుగా కోరు తున్నాయి. ఈ చట్టం భార్యాభర్తలిద్దరినీ సమాన భాగస్వాములుగా కాక భర్తను యజమానిగా, భార్యను బానిసగా చూస్తున్నదని ఆ సంఘాలు అంటున్నాయి. ఇలాంటి కీలకమైన అంశంలో ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పునివ్వడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సెక్షన్ 497 దృష్టిలో వివాహిత భర్త ఆస్తి లేదా వస్తువు. ఆస్తిని అపహరించిన వ్యక్తిపై కేసు పెట్టిన విధంగానే తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిపై కూడా ఈ సెక్షన్ కింద భర్త కేసు పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వైవాహిక వివాదాన్ని విచారిస్తున్నప్పుడు 2011లో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ కొనసాగింపును ప్రశ్నించింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిపై తాను ఈ సెక్షన్ కింద కేసు ఎందుకు పెట్టరాదని ఒక మహిళ ప్రశ్నించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్ కేవలం మగవాడికి మాత్రమే ఆ హక్కునిస్తున్నదని ధర్మాసనం అభిప్రాయపడి కేసు కొట్టేసింది. 2016లో సుప్రీంకోర్టు ముందుకొచ్చిన కేసు కూడా ఈ తరహాదే. వేరే వ్యక్తితో తన భార్య సంబంధం పెట్టుకున్నప్పుడు కేవలం అతనిపై మాత్రమే కేసు పెట్టాలన్న నిబంధన ఎలా సరైందని ఆ పిటిషనర్ ప్రశ్నించాడు. సమాజం ఇలాంటి వైవాహికేతర బంధాన్ని నైతిక తప్పిదంగా పరిగణిస్తుంది. అది విడాకులకు ఒక ప్రాతిపదిక కూడా అవుతుంది. ఆ సంబంధాలు ఆత్మహత్యకు దారితీస్తే అందుకు ప్రేరేపించిన కేసు(సెక్షన్ 306) పెట్టొచ్చు. అయితే సెక్షన్ 497 అలాంటి సంబంధంలోకెళ్లినవారిలో కేవలం పురుషుడే తప్పు చేసినట్టు పరిగణిస్తుంది. బ్రిటిష్ ఏలుబడిలో థామస్ మెకాలే నేతృత్వంలో 1834లో మొదటి లా కమిషన్ ఏర్ప డినప్పుడు ఇలాంటి సంబంధాలను కేవలం సివిల్ తగాదాగా భావించింది. కానీ జాన్ రోమిలీ నేతృత్వంలోని రెండో లా కమిషన్ సిఫార్సు మేరకు సెక్షన్ 497 కింద దీన్ని క్రిమినల్ నేరంగా 1860లో మార్చారు. అయితే జమ్మూ–కశ్మీర్లో 1932లోనే ఈ సెక్షన్ కిందికి భార్యను కూడా తీసుకొచ్చారు. మన దేశంలో హిందూ కుటుంబ చట్టం మినహా క్రైస్తవ, ముస్లిం, పార్సీ తదితర మతాలకు చెందిన కుటుంబ చట్టాలు విడాకులు తీసుకోవడానికి ఇతర కారణాలతోపాటు వివాహేతర సంబంధాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. పైగా దంపతులిద్దరికీ సమానంగా ఈ హక్కు కల్పిస్తున్నాయి. హిందూ కుటుంబ చట్టం మాత్రం వివాహేతర సంబంధాలను విడాకులకు ప్రాతిపదికగా భావిస్తున్నా... దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి, దాని కింద కేసు పెట్టే అధికారం ఒక్క భర్తకు మాత్రమే ఇస్తోంది. నేర న్యాయ వ్యవస్థలో తీసుకురావల్సిన సంస్కరణలపై నియమించిన జస్టిస్ వీఎస్ మాలిమత్ కమిటీ వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించటాన్ని వ్యతిరేకించకుండా దాన్ని దంపతులిద్దరూ సమానంగా ఉపయోగించుకునేలా మార్చాలని సూచించింది. 1972లో ఐపీసీకి సవరణలు తీసుకొస్తూ రూపొందించిన బిల్లులో సెక్షన్ 497ను మహిళలపై కూడా కేసు పెట్టేవిధంగా మార్చారు. అయితే అది పార్లమెంటు ముందుకు రాకుండానే మూలనబడింది. అనంతరకాలంలో పలుమార్లు ఈ సెక్షన్ ఉనికిని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలైనా వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇన్నేళ్లకు ఆ సెక్షన్ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వివాహేతర సంబంధాలకు లైసెన్స్నివ్వడంగా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ అది సరికాదు. భార్యాభర్తలిద్దరినీ సమానులుగా చూడకపోవడాన్ని, ఆమెను బానిసగా, ప్రాణం లేని వస్తువుగా పరిగణించడాన్ని తీర్పు ఎత్తిచూపింది. ఇంత వివక్షాపూరితమైన సెక్షన్ భారతీయ శిక్షాస్మృతిలో 158 ఏళ్లపాటు కొనసాగడం ఒక వైచిత్రి. -
రక్షణ కొనుగోళ్లలో ‘సెల్ఫ్గోల్’
రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను చేరుస్తూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సెల్ఫ్గోల్ వేసుకుంది. రాఫెల్ ఒప్పందం కుంభకోణమే కాదు. బీజేపీ ప్రభుత్వం అతి జాగ్రత్తతో, పిరికితనంతో ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో వ్యవహరిస్తోందనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పం దంలో భారీ కుంభకోణం ఉందనడానికి తగినంత సాక్ష్యాధరాలు లభ్యమౌతున్నాయిగాని ‘కుంభ కోణం’ అనే మాట స్థానంలో ‘మూర్ఖత్వం’ అనే పదం వాడాలి. ‘మూర్ఖత్వం’ అనే మాట మరీ ఎక్కువవుతుందనుకుంటే మరో పదం వాడవచ్చు. ఎందుకంటే దాదాపు వేయి కోట్ల డాలర్ల ఈ కొను గోలు ఒప్పందంలో విమానాల ధర నిర్ణయంపై అడిగిన ఏ ప్రశ్నకూ జవాబు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ ఒప్పందం రెండు ప్రజాతంత్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. కాని, ఒప్పందంలోని వివరాలను వెల్లడించకూడదనే (రహస్యంగా ఉంచాలనే) నిబంధన ఉందని చెప్పడం అడ్డగోలు వాదన. పార్లమెంటు నిశిత పరిశీలన తర్వాతే ఇంతటి భారీ కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర లభిస్తుంది. అందుకే సర్కారు వివరణ హాస్యాస్పదంగా ఉంది. నేటి అంతర్జాతీయ ఆయు ధాల విపణిలో ఆయుధాలు, వాటి రకాలు, ఉపకర ణాలకు సంబంధించి రహస్యా లేవీ ఉండవు. రాఫెల్ విమానాలతో ప్రయోగించే మిటియోర్ క్షిపణులు కూడా కొనే ఆలోచన మీకుంటే, వాటి గురించి స్మార్ట్ఫోన్ ఉండి, రక్షణ వ్యవహరాల నిపుణుడిగా భావించే ఏ కుర్రాడైనా ఉపన్యాసం దంచగలడు. ఈ విషయంలో రహ స్యంగా ఉంచాల్సింది సున్నితమైన ఎలక్ట్రానిక్స్, వ్యూహాలు మాత్రమే. మిటియోర్ క్షిపణి, పైలట్ ధరించే 360 డిగ్రీల ఇజ్రాయెలీ హెల్మెట్ అంచనా ధరల గురించి కూడా నేడు సులు వుగా దొరికే ఆయుధాల వివరాలు తెలిపే పుస్తకాలు, పత్రికల్లో బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాబట్టి రాఫెల్ ఒప్పందంపై బహిరంగంగా చర్చించడంలో తప్పేమీ లేదు. దాచ డానికి కారణాలు కూడా లేవు. రక్షణ ఒప్పందంపై మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరి కైనా ఎంత ధైర్యం? బోఫోర్స్ శతఘ్నిల ఒప్పందం జరిగిన కాలం నాటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటు న్నారా మమ్మల్ని? అనే అహంకారపూరిత ధోరణితో కేంద్ర సర్కారు మాట్లా డుతోంది. అయితే, ఇప్పుడు బీజేపీకి విషయం అర్థమౌతోంది. బోఫోర్స్ కుంభ కోణం తర్వాత, భారీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం చేసుకునే ఏ ప్రభు త్వమైనా తనను దొంగ అని పిలుస్తారనే అంచనాతో ఉండక తప్పదు. ఇలాంటి సమస్యపై మూడు రకాలుగా వ్యవహరిం చవచ్చు. మొదటిది, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పద్ధతి. అంటే, ఏమీ కొనకుండా ఉండడమే గాక, అన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఆయుధాల కంపెనీలను నిషేధించడం. ఆయన హయాంలో ప్రభుత్వాల మధ్యే ఆయుధాల కొనుగోళ్లు జరిగాయి. ఆయుధాల ధరల విషయంలో పారదర్శకత పాటిం చని రష్యా ప్రభుత్వం నుంచి ఆయుధాలు కొన్నారు. అలాగే, అమెరికా నుంచి ప్రాణాతకం కాని ఆయు ధాలను కొనుగోలు చేశారు. రెండో పద్ధతి, పార దర్శక విధానంతో ధైర్యంగా కొనుగోలు చేయడం. చివరికి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. ఇక మూడోది, రాజు లాగా ఆయుధాలు కొనడం. అంటే, భద్రతపై కేబినెట్ కమిటీ పరిశీలన వంటి అన్ని రకాల ‘విసుగు పుట్టించే’ ప్రక్రియలకు స్వస్తి పలకడం. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మీడి యాలో భారీ ప్రచారం వచ్చేలా చూసుకోవడమేగాక ఇలాంటి రక్షణ ఒప్పందాలపై అడిగే ప్రశ్నలకు సమా ధానం చెప్పడానికి మొండిగా నిరాకరించడం. ఈ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అహంకారపూరితమైన మూర్ఖత్వంతో పదే పదే రాఫెల్ ఒప్పందంపై వ్యక్త మైన అనుమానాలు తీర్చడానికి నిరాకరిస్తూ పెద్ద తప్పు చేసింది. అనవసరంగా తనకు తాను గొయ్యి తవ్వుకుంది. లోతుగా గొయ్యి తవ్వుకుంటున్న ప్రభుత్వం! ఈ వ్యవహారంలో ప్రభుత్వం రోజు రోజుకూ తాను ఇరుక్కుపోయే ప్రమాదమున్న లోతైన గొయ్యి తవ్వు కుంటూనే ఉంది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం 126 రాఫెల్ విమానాల్లో 108 విమానాలను ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) తయారు చేయాలి. అయితే, హెచ్ఏ ఎల్ వద్ద ఈ విమానాల ఉత్పత్తికి తగినంత మౌలిక సౌకర్యాలు లేని కారణంగా 126 విమానాలు కొనా లన్న నిర్ణయం మార్చుకున్నామని ప్రభుత్వం వివ రణ ఇచ్చింది. అత్యంత ఆధునిక విదేశీ యుద్ధ విమానాలకు ప్రపంచంలోని ఏ కంపెనీలోనూ తక్షణ ఉత్పత్తి–అమర్చే (అసెంబ్లీలైన్) సౌకర్యాలుండవు. ఏ కంపెనీ రూపొందించిన యుద్ధ విమానాలనైనా లైసె న్స్పై ఉత్పత్తి చేయడానికి అన్ని విధాలా మెరుగైన కంపెనీ హెచ్ఏఎల్ అని హేతుబద్ధంగా ఆలోచించే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ సంస్థ తనకు ఎదురులేని గత కొన్ని దశాబ్దాల కాలంలో చేసిన పని ఇదే. అంత సమర్ధంగా చేయకపోయినా ఆయుధాలు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ కంపెనీని ఎవరూ చులకనచేసి మాట్లాడరు. వాజ్పేయి పాలనాకాలంలో మిరాజ్– 2000 రకం విమానాలన్నింటినీ ఇండియాలోనే రూపొందించాలని భారత వైమానికిదళం(ఐఏఎఫ్) ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో తెహెల్కా వ్యవ హారంతో భయపడిన రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ అందుకు అంగీకరించలేదు. ఒకే కంపెనీ చేతిలో పెడితే అనుమానాలొస్తాయని భయపడ్డారు. ఒకేసారి 126 రాఫెల్ విమానాల భారీ కొనుగోలుకు అవస రమైన నిధులు సమకూర్చడం కష్టమనే వాస్తవాన్ని చెప్పడానికి ప్రభుత్వం ఏదో కారణం వల్ల సిద్ధంగా లేదు. నిజంగా ఇన్ని విమానాలు కొనాలంటే ఆర్మీ, నేవీ దళాల బడ్జెట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి రెండు స్క్వాడ్రన్ల విమా నాలు(36) చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాఫెల్ విమానాల తయారీకి వేరే ఇతర కంపెనీకి అవకాశం ఇవ్వడం కోసం హెచ్ఏఎల్ను వదిలేశారని నిందించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాని, కొనుగోలు చేసే విమానాల సంఖ్య తగ్గిం చుకున్నారనీ, కలిసి ఉత్పత్తి చేసే అవకాశం పోగొ ట్టుకున్నారని మాత్రం విమర్శిస్తున్నారు. ఈ వ్యవహా రంలో వాస్తవాలు వెల్లడించి అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉండగా ప్రభుత్వం అనవసరంగా అర్థం లేని వాదనలు వివరణలతో వివాదంలో చిక్కు కుంటోంది. యుద్ధ విమానాలు వైమానిక దళానికి తక్షణమే అత్యవసరమైనందునే రాఫెల్ విమానాల కొనుగోలు చేయాల్సివస్తోందనేది కేంద్ర సర్కారు చెప్పే మరో కారణం. తగినన్ని యుద్ధ విమానాలు లేవనేది 15 ఏళ్లుగా తెలిసిన విషయమే. 2001లోనే మొదటిసారి విమానాల అవసరం గుర్తించి, కొనుగో లుకు ప్రతిపాదించారు. రెండు దశాబ్దాల క్రితమే అవ సరమైన యుద్ధవిమానాలను కొనలేకపోవడం అగ్ర రాజ్యంగా అవరించాలనే కలలుగనే దేశం బలహీన తకు అద్దంపడుతోంది. ఈ 36 రాఫెల్ విమానాలు సైతం యుద్ధరంగంలో వినియోగించడానికి 2022 వరకూ పూర్తిగా సిద్ధం కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వంటి అసమర్ధ ప్రభుత్వం గానీ, ప్రభుత్వ వ్యవస్థగానీ (ఏ పార్టీ అధికారంలో ఉన్నాగాని) తన జాతీయ భద్రత బాధ్యతను మరో అగ్రరాజ్యానికి అప్పగించడం లేదా కశ్మర్ను పాకిస్తాన్కు, అరుణా చల్ప్రదేశ్ను చైనాకు ఇచ్చేయడం మంచిది? అలా చేయగా మిగిలే సొమ్మును దేశ ప్రజల విద్య, ఆరో గ్యానికి ఖర్చు చేయవచ్చు! జాతీయ భద్రతపై హామీతోనే అధికారం 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీని అధికారంలోకి తీసు కొచ్చిన ప్రధాన వాగ్దాల్లో ఒకటి జాతీయ భద్ర తపై ఇచ్చిన హామీ. జాతీయ భద్రత విషయంలో నిర్ణ యాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తామని ఎన్డీఏ వాగ్దానం చేసింది. సైనిక దళాలకు కొత్త ఆయుధాలు కొనుగోలు చేసే ధైర్యం చేయలేని యూపీఏ సర్కారు వాటిని బలహీనపరిచిందని మోదీ ఆరోపించారు. ఆయన సరిగానే మాట్లాడారు కాబట్టి అప్పుడు ప్రజలు ఆయన మాటలు నమ్మారు. అందుకే, లోపాలు సరిదిద్దుకోవడానికి కొద్ది నెలలే ఉన్నందున ‘మీరేం చేశారు?’ అని ప్రధానిని అడగడంలో తప్పేమీ లేదు. రక్షణ ఆయుధాలకు సంబంధించి కొన్ని ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు ప్రచారం చేయడం, కొన్ని వైమానిక ప్రదర్శనలు జరపడం మాత్రం ఈ ప్రశ్నకు జవాబు కాజాలదు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా తక్కువ అనేది వాస్తవం. ఆ విషయం చెప్పడానికి కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ విషయంలో యూపీఏ ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు. కాని, దాని కంటే మెరుగైన రీతిలో పనిచేస్తానని చెప్పిన బీజేపీ అందులో విఫలమైంది. వచ్చే ఏడాది రాఫెల్ విమనాలు భారత గగన తలంలో ఎగిరే మాట వాస్తవమే కావచ్చు. కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల భవిష్యత్తులో జరిగే ఆయుధాల కొనుగోళ్లపై దాని నీడ పడుతుంది. ఆయుధాలు దేశంలోనే ఉత్ప త్తిచేయాలనే లక్ష్యం ఘోరంగా దెబ్బతింది. కొన్ని దశాబ్దాల కాలంలో అతి పెద్దదిగా భావించే రక్షణ కొనుగోలు ఒప్పందంలో దేశంలోని అత్యంత వివా దాస్పదమైన కార్పొరేట్ సంస్థను లబ్ధిదారుగా చేయడం ద్వారా ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు రంగంలోని ఏ కంపెనీ కూడా సైన్యానికి అవసరమైన ప్రధాన ఆయుధాలను తయారు చేసి ఇవ్వలేదు. రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను తీసుకుంటూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. ఎవరూ సాధించలేరు కూడా. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేసి పడేసింది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఇందులో ఏదెక్కువో తేల్చండి!
సాక్షి, న్యూఢిల్లీ : 56.71 రూపాయలు ఎక్కువనా, 72.83 రూపాయలు ఎక్కువనా అని ఏ ఒకటవ తరగతి పిల్లవాడిని అడిగినా 72.83 రూపాయలు ఎక్కువని ఠక్కున చెప్పేస్తాడు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలను సమర్థించుకునేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మతో విడుదల చేసిన ఓ గ్రాఫిక్ చిత్రంలో 56.71 రూపాయలకన్నా 72.83 రూపాయలు 28 శాతం తక్కువని చూపించింది. ఆ మేరకు దిగువకు బాణం గుర్తును కూడా గీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకన్నా బీజేపీ ప్రభుత్వం హయాంలో పెట్రోలు పెరగడం కన్నా తగ్గిందని గ్రాఫ్లో చూపించడం కోసం తాపత్రయ పడిన బీజేపీ మొన్నటి వరకున్న అసలు డీజిల్ ధరను కూడా సూచించాల్సి వచ్చి బొక్క బోర్లా పడింది. ఆ గ్రాఫ్ను చూసిన వారెవరైనా కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. అలా కాసేపు కొట్టుకున్న ట్విట్టర్లు ఆ తర్వాత తేరుకొని తమదైన శైలిలో ట్వీట్లు పేలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పరిస్థితితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా దేశీయంగా చమురు ధరలను ఎప్పటికప్పుడు మోదీ ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై భారత్ బంద్కు పిలుపునివ్వడం, భగ్గుమంటున్న భారత ప్రజలు కూడా బంద్ను విజయవంతం చేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ విజయవంతమైందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించుకోగా, పెట్రోలు ధరల పెంపునకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అంతర్జాతీయ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటున్నాయని మోదీ ప్రభుత్వం సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. తిమ్మిని బమ్మిచేసైనా ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్న బీజేపీ కార్యాలయం పాఠకుల దిమ్మ తిరిగేలా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేట్లు (ఢిల్లీ మార్కెట్ రేట్లు) 2004, మే 16వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బారెల్కు 36 డాలర్లు ఉండగా, లీటరు ప్రెటోలు ధర 33.71 రూపాయలు, డీజిల్ లీటరు ధర 21.74 రూపాయలు ఉండింది. 2009, మే 16వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 36 డాలర్ల నుంచి 58 డాలర్లకు పెరగ్గా, పెట్రోలు ధర 33.71 రూపాయల నుంచి 40.62 రూపాయలకు, డీజిల్ ధర 21.74 రూపాయల నుంచి 30.86 రూపాయలకు పెరిగింది. ఇక 2014, మే 16వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ క్రూడాయిల్ ధర 107 డాలర్లకు పెరగ్గా, లీటరు పెట్రోలు ధర లీటరుకు 71.41 రూపాయలకు, డీజిల్ ధర 56.71 రూపాయలకి పెరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక (ఢిల్లీ మార్కెట్లో) కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పెరిగిన చమురు ధరలను పరిశీలిస్తే విస్తు పోవాల్సిందే. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 107 డాలర్లు ఉన్నప్పుడు లీటరు పెట్రోలు ధర 71.41 రూపాయలు ఉండగా, 2018, సెప్టెంబర్ 10వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 71 డాలర్లకు పడిపోగా లీటరు పెట్రోలు ధర 80.73 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటరు ధర 72.83 రూపాయలకు పెరిగింది. ఇక్కడే బీజేపీ పొరపాటు చేసింది. 2014లో డీజిల్ ధర 56.71 రూపాయలు ఉండగా, 2018, సెప్టెంబర్ 10కి 72.83 రూపాయలకు పడిపోయిందని గ్రాఫిక్ ద్వారా చూపింది. దీంతో ట్వీట్ల మీద ట్వీట్లు పేలుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో చమురు ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా, పెరిగిన ధరలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వం సూచించిన మేరకే దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు పెంచేవి. దీనివల్ల చమురు కంపెనీలపై పడే ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేది. ప్రభుత్వ ధరలలో పోటీ పడలేక ప్రైవేటు చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయేవి. ఈ దశలో ప్రైవేటు చమురు కంపెనీలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ధరలను పెంచుకోవాల్సిందిగా ఆదేశిస్తూ చమురు కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగానే మోదీ ప్రభుత్వం హయాంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. చమురు కంపెనీలకు స్వేచ్ఛనిచ్చిన మోదీ ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ఇచ్చి ఉండాల్సింది. అలా చేయక పోవడం వల్ల దేశంలో డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా అన్ని సరకుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. నరేంద్ర మోదీలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అడ్వానీ ఒకప్పుడు మోదీలో ఏం చూశారోగానీ, మోదీని ‘బ్రిలియెంట్ ఈవెంట్స్ మేనేజర్’ అని ప్రశంసించారు. మరి తాజా గ్రాఫ్ చూశాక ఇప్పుడేమంటారో! -
కనీస వేతనం ఎలా ఉండాలి?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని కార్మికులకు కనీస వేతనం నెలకు 18 వేల రూపాయలు ఉండాలన్నది బుధవారం నాడు ఢిల్లీని ముట్టడించిన కార్మికుల, కర్షకుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. నెలకు 18 వేల రూపాయలన్నది ఎలా ప్రామాణికం? దేశంలో ప్రస్తుతం కనీస వేతన ఎంత ఇస్తున్నారు? దాన్ని ఎలా లెక్కిస్తున్నారు. ఏటా కనీస వేతనం పెరుగుతున్నదా ? తగ్గుతున్నదా? ఇతర దేశాల్లో ఈ వేతనం ఎలా ఉంది? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించింది. తమకు కూడా అంతే వేతనాన్ని కనీస వేతనంగా ఇప్పించాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రకారమే ఇప్పటికీ దేశంలో కనీస వేతనాన్ని అంచనా వేస్తున్నారు. నాటి చట్టానికే పలుసార్లు మార్గదర్శకాలను మారుస్తూ వచ్చారు తప్ప, చట్టం స్వరూపాన్ని ఇప్పటికీ మార్చలేక పోయారు. పర్యవసానంగా గత మూడు దశాబ్దాలుగా దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పెరగాల్సిన కార్మికుడి వేతనం (విలువ ఆధారిత సూచిక ప్రకారం...ఉత్పత్తులు, వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకొని విలువను అంచనా వేస్తారు) తగ్గుతూ వస్తోంది. దీని అర్థం దేశం సాధిస్తున్న ఆర్థిక ఫలితాల్లో కార్మికుడికి సరైన భాగం లభించడం లేదు. ఫలితాల్లో ఎక్కువ భాగం యజమానులకే వెలుతోంది. 1981–1982 సంవత్సరం నుంచి 2011–12 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఆర్థిక పురోభివద్ధి గణాంకాల ప్రకారం కంపెనీల ఉత్పత్తి, లాభాలు ఎంతో పెరిగినా కార్మికుల కనీసవేతనాలు మాత్రం తగ్గుతూ వచ్చాయి. 2009–-2010లో ఆర్థిక పురోభివద్ధి విలువలో కార్మికుడి వేతనాల శాతం 11.9 శాతం ఉన్నట్లు తేలింది. అంతకు దశాబ్దం క్రితం 15 శాతం ఉండగా,ఆ తర్వాత తగ్గింది. అభివద్ధి చెందిన దేశాల సంగతి పక్కన పెడితే వర్ధమాన దేశాలకన్నా భారత కార్మికుల వేతనాలు ఎంతో తక్కువ. ఆర్థిక పురోభివద్ధి విలువ ఆధారిత వేతనాల పద్ధతి మన దేశంలో లేకపోవడంతో వేతనాలు తగ్గడం కనిపిస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రమాణాల ప్రకారం నేడు కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా ఉంది. దీన్ని నెలలోని 31 రోజులకు లెక్కిస్తే 5,456 రూపాయలు మాత్రమే. ఈ కనీస వేతనాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన చట్టంలో లేకపోయినప్పటికీ కేంద్రం పరిధిలోని ఓ కంపెనీ తన కార్మికుడికి ఈ కనీస వేతనం ఇస్తే సరిపోతుందన్నమాట. రోజువారిగా ఓ కార్మికుడు తీసుకునే కాలరీల ఆహారం, నలుగురు సభ్యులుగల కుటుంబంలో వారందరి బట్టలకయ్యే గుడ్డా, ఉండటానికి అద్దె, ఇద్దరు పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రమాణంగా తీసుకొని దినసరి వేతనాలను లెక్కించే బరువు బాధ్యతలను పార్లమెంట్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. తర్వాత సవరించిన ప్రమాణాల్లోఓ కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పనిచేసినా, ఒకరి వేతనాన్నే పరిగణలోకి తీసుకోవాలని, కుటుంబంలోని నలుగురు వ్యక్తుల ఆహారాన్ని 2700 కాలరీలుగా లెక్కించాలని, వారికి ఏడాదికి 72 యార్డుల గుడ్డ ఖర్చు అవుతుందని, ఇద్దరి పిల్లల చదువు, నలుగురి ఆరోగ్యానికయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోవాలని, ఇంట్లో వంటకయ్యే ఖర్చును 20 శాతంగా తీసుకొని కనీస వేతనాన్ని లెక్కించాలని (అంటే కనీస వేతనంలో 20 శాతం డబ్బులను చెల్లిస్తే వారి ఇంధనపు ఖర్చు వెళ్లిపోవాలి) సూచనలున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తేనే నేడు కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా తేలింది. కార్మికుడి కనీస అవసరాలను దష్టిలో పెట్టుకొని కనీస వేతనాన్ని లెక్కించే ఈ పద్ధతిని మార్చుకోవాలని, దేశం సాధిస్తున్న ఆర్థిక వద్ధిలో వాటా పద్ధతిన కార్మికుడికి వేతనాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆర్థిక నిపుణులు ఆందోళన చేస్తుండడంతో కనీస వేతనాలను నిర్ణయించే పూర్తి అధికారం ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి అప్పగిస్తూ గతంలో కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. అది ఇప్పటికీ పార్లమెంట్లో మూలన పడి ఉంది. మనకంటే ఆర్థికంగా ఎంతో అభివద్ధి సాధిస్తున్న చైనాలో కార్మికుడి కనీస వేతనం నెలకు 22 వేల రూపాయలుంది. ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో గంటకు ఏడున్నర డాలర్ల నుంచి ఎనిమిది డాలర్ల వరకు కనీస వేతనం ఉంది. అంటే రోజుకు ఎనిమిది గంటలు పనిచేసే ఓ కార్మికుడికి నెలకు లక్షా ఇరవై వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఉంటుంది. అమెరికాకన్నా కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కనీస వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా దేశాల్లో కనీస వేతనాలను చట్టబద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. భారత్లో కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలు చేయాలన్న డిమాండ్తోపాటు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచాలని, వ్యయసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీల అటవి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఒకటిన్నర లక్షల మంది కార్మికులు, కర్షకులు బుధవారం ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఇవే డిమాండ్లపై దాదాపు ఆరు నెలల క్రితం మార్చిలో 40 వేల మంది రైతులు మహారాష్ట్రలో 180 కిలోమీటర్ల పాద యాత్ర జరిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే అందులో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని నాటి ర్యాలీలో పాల్గొని నేటి ర్యాలీలో కూడా పాల్గొన్న నాసిక్ నుంచి వచ్చిన సోమ్నాథ్ మంకర్ లాంటి వారు చెబుతున్నారు. సీపీఎం నాయకత్వంలోని యూనియన్ల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కార్మికులు, కర్షకులు ర్యాలీకి తరలి వచ్చారు. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
మన్మోహన్కు అనుకూలంగా రిపోర్టు..
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, బీజేపీ శ్రేణులకు పెద్ద షాకిస్తూ.. గత మూడు రోజుల క్రితం ఓ సంచలనాత్మక రిపోర్టు విడుదలైంది. మన్మోహన్ సింగ్ హయాంలోనే భారత్ అధిక వృద్ధి రేటు నమోదు చేసిందని స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రిపోర్టు పేర్కొంది. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగిందని ఆ నివేదిక సారాంశం. కానీ ఆ నివేదికతో బీజేపీ గుండెల్లో ఒక్కసారిగా గుబులు పట్టుకుంది. మరోవైపు నుంచి ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే హఠాత్తుగా ఆ రిపోర్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ వెబ్సైట్ నుంచి మాయమైపోయింది. అంతేకాక ఆ నివేదిక కేవలం డ్రాఫ్ట్ రిపోర్టు మాత్రమేనని, దాని ఫైండిగ్స్ అధికారికమని ఎక్కడా కూడా చెప్పలేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇండియా టుడే టీవీ పరిశీలనలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ వెబ్సైట్ నుంచి తొలగించిన ఆ రిపోర్టు, మరో వెబ్సైట్లో దర్శనమిస్తున్నట్టు తెలిసింది. రిపోర్టు కోసం ఒరిజినల్ లొకేషన్లో సెర్చ్ చేస్తే.. ఎలాంటి స్పందన లేదు. కానీ ఆ రిపోర్టు ప్రస్తుతం నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్(ఎన్ఎస్సీ) పేజీలో ఉందని తెలిసింది. రిపోర్టుపై సలహాలు, సూచనలు కింద దీన్ని ఎన్ఎస్సీ సెక్షన్లో పొందుపరిచారట. ఎన్ఎస్సీ అనేది మినిస్ట్రీ వెబ్సైట్లో ‘అబౌట్ అజ్’ అనే సెక్షన్లో లిస్ట్ అయి ఉంటుంది. రిపోర్టును మరో ప్రాంతానికి తరలిస్తూ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మద్దతు తెలిపారు. ఆ రిపోర్టు ఇంకా ఫైనల్ కాదని, దానిపై ప్రభుత్వంలోనూ.. మంత్రిత్వ శాఖలోనూ ఇంకా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. కాగ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రూపొందించిన తాజా నివేదికలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణ తర్వాత ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది మన్మోహన్ హయాంలోనేనని రిపోర్ట్ పేర్కొంది. -
సాంకేతికతలో భేష్ అనిపించాలి
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో భారత్ భేష్ అనిపించేలా పని చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్ (సీడీఎఫ్డీ) విభాగం పని చేయాలని సూచించారు. హైదరాబాద్లోని ఉప్పల్లో నూతనంగా నిర్మించిన సీడీఎఫ్డీ భవనాన్ని హర్షవర్దన్ ఆదివారం ప్రారంభించారు. డీఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్ గుర్తింపు, సమాచార సేకరణలో దర్యాప్తు సంస్థలకు సీడీఎఫ్డీ కీలకమని, దేశంలోని అన్ని దర్యాప్తు విభాగాలు ఉపయోగించుకునేలా పనిచేయాలని కోరారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారబోతోందని, అనేక కేంద్ర సంస్థలు ఇక్కడ ఏర్పాటవడం సంతోషకర పరిణామమని అన్నారు. దక్షిణ భారతదేశానికి ఉపయోగపడేలా సౌత్ విజ్ఞాన్ భవన్కు రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశామని, హైదరాబాద్ ఇప్పుడు దేశంలో కీలకమైన నగరమని అభిప్రాయపడ్డారు. వచ్చే సమావేశాల్లోనే డీఎన్ఏ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు లోక్సభలో ఆమోదం పొందుతుందని హర్షవర్దన్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి ఏర్పడ్డప్పుడే డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు రూపొందించామని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల అప్పటినుంచి బిల్లు పెండింగ్లోనే ఉందన్నారు. ఇటీవల ముగిసిన సమావేశాల్లో బిల్లును లోక్సభకు పరిచయం చేశామని, వచ్చే శీతాకాల సమావేశాల్లో డీఎన్ఏ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. డీఎన్ఏ బిల్లు ఆమోదం వల్ల అదృశ్యమైన చిన్నారుల కేసులు, సంచలనాత్మకమైన కేసుల్లో పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నామన్నారు. డీఎన్ఏ టెక్నాలజీ యాక్ట్లో ఆధార్ అనుసంధానం అంశం లేదని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆధార్ను ఈ యాక్ట్కు అనుసంధానించే ఆలోచన కూడా తమకు లేదని వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, సీడీఎఫ్డీ డైరెక్టర్ మిత్రా, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీడీఎఫ్డీ మాజీ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ల్యాకోన్స్ కృషి భేష్ సమన్వయంతో పనిచేస్తే ఎన్ని అద్భుతాలైనా సాధించవచ్చనేందుకు హైదరాబాద్లోని ల్యాబొరేటరీ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్స్) నిదర్శనమని హర్షవర్ధన్ అన్నారు. అంతరించిపోతున్న అరుదైన జింక జాతిని ఆధునిక శాస్త్ర పద్ధతుల ద్వారా వృద్ధి చేయడం.. వాటిని మళ్లీ అడవుల్లోకి ప్రవేశపెట్టడం హర్షణీయమని చెప్పారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఆదివారం వన్యప్రాణి జన్యువనరుల కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాకోన్స్ వంటి కేంద్రాలను అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వన్యప్రాణి జన్యు వనరుల కేంద్రంలో ప్రస్తుతం 23 జీవజాతులకు సంబంధించిన జన్యువులు, కణజాలం అండాలను నిల్వ చేశామని, రానున్న మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్యను ఐదు రెట్లు ఎక్కువ చేసేందుకు ప్రయతిస్తున్నామని సీసీఎంబీ ల్యాకోన్స్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కార్తికేయన్ వాసుదేవన్ ‘సాక్షి’కి తెలిపారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మౌస్ డీర్ల సంఖ్యను పెంచగలిగామని.. ఇప్పటివరకూ అవి స్థానిక జంతు సంరక్షణాలయంలో ఉండగా.. దశల వారీగా వాటిని మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్, తదితర అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని ఆయన వివరించారు. -
కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్పోస్టర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్ పోస్టర్ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
లోక్పాల్ కోసం అక్టోబర్ 2 నుంచి నిరశన
రాలేగావ్ సిద్ధి: లోక్పాల్ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్పాల్ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్పాల్ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్పాల్ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్పాల్ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్పాల్ చట్టాన్ని తెచ్చింది. -
విశ్వాస పరీక్ష.. దేశం మొత్తం చూస్తోంది
దాదాపు పదిహేనేళ్ల తర్వాత పార్లమెంట్లో విశ్వాసపరీక్ష అంశం తెరపైకి రావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐక్యత ప్రదర్శించేందుకు విపక్షాలు ఉవ్విళ్లూరుతుంటే.. మెజార్టీ(అంతకు మించే...) ఉందన్న ధీమాలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో కాసేపట్లోనే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలుకానుంది. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో ఓ సందేశం ఉంచారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. అంతరాయం లేని.. నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనే ఆశిస్తున్నా. ప్రజలకు.. రాజ్యాంగ రూపకర్తలకు మనం ఈ ప్రమాణం చేస్తున్నాం. దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తోంది’ అని ప్రధాని.. ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు తీర్మానంపై చర్చ మొదలై సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ సమయాన్ని పొడిగిస్తే మాత్రం రాత్రి 9 గంటలకు వరకు సభ నిర్వహణ ఉండొచ్చు. అన్ని పార్టీల ఫ్లోర్ నేతలు మాట్లాడాక చివర్లో ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఓటింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ చర్చ ఆలస్యం అయితే మాత్రం ఓటింగ్ను సోమవారానికి వాయిదా వేసే అవకాశం ఉంటుంది. (అవిశ్వాస తీర్మానాలు.. ఆసక్తికర అంశాలు) మిశ్రమ స్పంద... అవిశ్వాసంపై తటస్థుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గత కొంతకాలంగా మాటల తుటాలు పేలుస్తున్న శివసేన.. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. మరోవైపు కావేరీ పోరాటానికి ఏ పార్టీ మద్ధతు ఇవ్వలేదన్న కారణంతో అన్నాడీఎంకే.. అవిశ్వాసానికి మద్ధతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అటు బీజేడీ కూడా తన వ్యూహాన్ని పార్లమెంటులోనే ప్రకటిస్తానని తెలిపింది. ఎవరి ప్లాన్లు వాళ్లవి... వీలైనంత ఎక్కువ మెజార్టీ కోసం స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. భాగస్వామ్య పక్షాలతోపాటు చిన్నా, చితకా పార్టీలతో నేరుగా మాట్లాడుతూ వచ్చారు. అటు విపక్షాలు కూడా.. తమ వ్యూహాలకు పదును పెట్టాయి. అవిశ్వాస పరీక్ష అంకెల గారడీ కాదని.. మోదీ ప్రభుత్వానికి గెలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతున్నప్పటికీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ఈ అవిశ్వాసం పనికొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Today is an important day in our Parliamentary democracy. I am sure my fellow MP colleagues will rise to the occasion and ensure a constructive, comprehensive & disruption free debate. We owe this to the people & the makers of our Constitution. India will be watching us closely. — Narendra Modi (@narendramodi) 20 July 2018 -
ముందస్తుకు సంకేతమా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి కేంద్రం అంగీకరించడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికలను ముందుకు జరిపే విశేష అధికారం ప్రధానికే ఉన్నా, చివరి నిమిషం లెక్కలను బేరీజు వేసుకుని ఆ దిశగా అడుగేసే అవకాశాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా 7–8 నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోదీ ఆలోచన ఏంటో ఊహించడం కష్టమని, ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఒకరు వెల్లడించారు. మరోవైపు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతో పాటే లోక్సభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులపై చర్చ తప్ప, ముందస్తు ఎన్నికలపై ఆలోచించడం లేదని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. జాగ్రత్తగా పరిశీలిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్.. ఇటీవల ప్రధాని మోదీ వరుసగా యూపీలో పర్యటించిన సంగతిని విపక్షాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ అన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందా? అని కాంగ్రెస్, లెఫ్ట్లో అంతర్మథనం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం, ప్రచారకర్తకు ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుస్తాయని లెఫ్ట్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీకి తగిన రాజకీయ అస్త్రాలు ఉన్నట్లయితే ఇతర పార్టీలు స్పందించేందుకూ అవకాశం ఇచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘సంపర్క్ కే సమర్థన్’ పేరిట ప్రముఖులతో సమావేశమై ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. సుమారు 100 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి అవకాశం కోల్పోవచ్చని అమిత్ షా పర్యటనల్లో తెలిసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరెస్సెస్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అనుమతించని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వర్షాకాల సమావేశాల తొలిరోజే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. శుక్రవారం (జూలై 20న) చర్చతోపాటు ఓటింగ్ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సభాపతి పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, బి.శ్రీరాములు, సి.ఎస్.పుట్టరాజు ఇచ్చిన రాజీనామాలు ఆమోదించినట్లు సభకు వెల్లడించారు. అనంతరం వివిధ పార్టీల సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను ప్రస్తావించారు. శుక్రవారం జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. విశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించడం గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. ‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ రావు, తోట నర్సింహం, తారిఖ్ అన్వర్, మహ్మద్ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్చంద్రన్, కేసీ వేణుగోపాల్ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తూ నోటీసులందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతిని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఇందులో ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక కూడా ఉన్నారు. అధికార బీజేపీ సహా.. శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు కూర్చున్నారు. మొత్తంగా విపక్షాలకు చెందిన 70 మందికి పైగా సభ్యులు లేచి నిలుచున్నారు. సభాపతి వారిని లెక్కించి నిబంధనల ప్రకారం అవసరమైన (50 మందికి పైగా) సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. పాలేవో, నీళ్లేవో తేలిపోతాయ్: కేంద్రం ఈనేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ లేచి మాట్లాడారు. ‘విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పాలేవో నీళ్లేవో తెలిసిపోతాయి’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే సభాపతి జీరో అవర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడారు. తాను అవిశ్వాస తీర్మానానికి ముందుగానే నోటీసులు ఇచ్చానని, పెద్ద పార్టీ అయినందున తాను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి బదులిస్తూ నోటీసులు ఇచ్చిన అందరి పేర్లు ప్రస్తావించానని, పార్టీ పరిమాణాలతో సంబంధం లేకుండా.. అందరి కంటే ముందుగా ఇచ్చిన వారినే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తానని తెలిపారు. సభ వాయిదా పడి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరిగి ప్రారంభమైన అనంతరం.. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ, ఓటింగ్ ఉంటుందని ప్రకటించారు. ఒకవేళ శుక్రవారం నాడు చర్చ ఆలస్యమైతే.. ఓటింగ్ సోమవారం జరిగే అవకాశం ఉంది. మమత మద్దతు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన పార్టీలకు తమ మద్దతుంటుందని తృణమూల్ చీఫ్ మమత బెనర్జీ స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతకు కట్టుబడి ఉన్నందున సంపూర్ణ మద్దతుంటుందని ఆమె కోల్కతాలో పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది అందుకే ఈ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. సభలో బీజేపీకి మద్దతున్నప్పటికీ.. బయట పూర్తి వ్యతిరేకత ఉంది’ అని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీలంతా శుక్రవారం సభకు హాజరవ్వాలని.. చర్చ, ఓటింగ్లో పాల్గొనాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. దేనిపైనైనా చర్చకు సిద్ధం: మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. రాజకీయ పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే పలు అంశాలపై దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం సభ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. విస్తృతమైన అంశాలపై సభలో కూలంకశంగా చర్చ జరిగేలా ఎంపీలు వ్యవహరించాలని.. రాజకీయ పార్టీలు దేశానికి అవసరమైన అంశాలపై సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని తెలిపారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు విపక్షాలు సహకరించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయ పార్టీ సభ్యుడైనా, దేశానికి లాభం చేసే ఏ అంశాన్నైనా సభ దృష్టికి తెస్తే.. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇలాంటి చర్చల ద్వారా ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు అందుతాయి’ అని మోదీ పేర్కొన్నారు. అవిశ్వాసం నెగ్గుతుంది: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రాజీవ్ సాతవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోదీ నెరవేర్చలేకపోయారనీ, ఇది గారడీ ప్రభుత్వమని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయింది. పైపెచ్చు, స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన ధనం 50శాతంపైగా పెరిగింది. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేరలేదు. అధికారంలోకి వచ్చి 50 నెలలు గడిచినా ఒక్కటీ నెరవేరలేదు. కశ్మీర్ సమస్య రగులుతూనే ఉంది. దళితులపై దాడులు పెచ్చుమీరాయి’ అని విమర్శలు గుప్పించారు. అంతకుముందు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేందుకు సభలో అవసరమైన సంఖ్యాబలం లేదని మీడియా ప్రశ్నించగా.. ‘మాకు బలం లేదని ఎవరన్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సభలో ఉండాలంటూ తన సభ్యులకు కాంగ్రెస్ విప్ కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ, ఓటింగ్కు స్పీకర్ అంగీకరించిన నేపథ్యంలో బుధవారం వరకు అవిశ్వాసానికి అనుకూల, వ్యతిరేక, తటస్థ పార్టీల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అనంత్కుమార్, విజయ్ గోయల్, జితేంద్రసింగ్, మేఘ్వాల్ పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ -
అవిశ్వాసంపై చర్చ.. ఎంపీ జేసీ డుమ్మా!
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అవిశ్వాసంపై చర్చకు ఒక్క రోజు ముందే అధికార పార్టీలో చీలిక మొదలైంది. పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. ఇవాళ లోక్సభలో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఎంపీ సుజనా చౌదరి తీరుపై జేసీ అలిగినట్లు తెలుస్తోంది. అంతేకాక అవిశ్వాస తీర్మానానికి జేసీ హాజరుకానంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా శుక్రవారం నాడు లోక్ సభకు జేసీ వెళ్లనంటున్నారట. ఎంపీ జేసీ దివాకర్ బాటలో మరికొందరు టీడీపీ ఎంపీలు నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ చేపడుతామని స్పీకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. టీడీపీ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చర్చలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాజ్యసభలో వచ్చే సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేయాలని కూడా పార్టీ తీర్మానించింది. ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద ప్రజా సంకల్ప యాత్ర శిబిరంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్.. మూడు గంటల పాటు పార్టీ నేతలతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చలేదని, అందువల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని, ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించినట్టు తెలిపారు. సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ వెలుపల.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం పోరాడి పదవీ త్యాగం చేసిన.. లోక్సభ మాజీ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపడతారన్నారు. ఈ విధంగా యావత్ దేశ ప్రజలకు తమ నిరసన తెలిసేలా చేస్తామని చెప్పారు. సాధారణంగా ఇలాంటి రాజ్యాంగ పదవులకు జరిగే ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఒక ధృఢమైన అభిప్రాయంతో ఉందని, అయితే ఏపీ ప్రజలకు అత్యంత ముఖ్యమైన, ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి అవసరమైన ప్రత్యేక హోదా హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలని బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చిందని, చివరకు లోక్సభలో అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా ఇచ్చిందని ధర్మాన వివరించారు. అప్పటికీ స్పందించనందున పార్టీ లోక్సభ సభ్యులు రాజీనామాలు చేశారన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ప్రాముఖ్యమైనదిగా తాము భావిస్తున్నామని, అది ఇవ్వనందుకు నిరసనగానే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయించామన్నారు. హోదా రాకపోతే ఎలా సాధించుకోవాలనే విషయంలో జగన్ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకపోతే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 20 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో రేపు ఏర్పడే ప్రభుత్వాలు మన వద్దకే వచ్చి ఇచ్చిన హామీని అమలు చేస్తాయని ధర్మాన అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి కూడా పాల్గొన్నారు. -
అప్పుడు జమిలికి సై...ఇప్పుడు జమిలికి నై
-
50 కోట్ల మందికి సామాజిక భద్రత
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 కోట్ల మందికి సామాజిక భద్రత పథకాల లబ్ధి చేకూరుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014లో ఈ పథకాల లబ్ధిదారుల సంఖ్య కేవలం 4.8 కోట్లుగానే ఉందని, నాలుగేళ్ళలో 10 రెట్లు పెరిగిందన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో బుధవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘సామాజిక భద్రత పథకాలు ప్రజలు తమ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు బలాన్ని, ధైర్యాన్నిస్తాయి. ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ సురక్ష యోజన, అటల్ పింఛను యోజన, ప్రధాన మంత్రి వ్యయ వందన యోజన వంటి పథకాల ద్వారా నేడు దేశంలోకి కోట్లాది మందికి ఈ బలం, ధైర్యం వచ్చాయి’ అని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లాగా భారత్లో సామాజిక భద్రత పథకాలు పేదలకు అందడం లేదనే చర్చ జరిగేదని.. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. పీఎం జన్ధన్ యోజనతో జీవిత బీమా, రూపే కార్డుతో ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. వీటికి తోడు రెండు బీమా పథకాలు, ఒక పింఛను పథకాన్ని ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. వీటన్నిటి ఫలితంగానే.. 2014లో 4.8 కోట్లుగా ఉన్న సామాజిక భద్రత పథకాల లబ్ధిదారుల సంఖ్య పదిరెట్లు పెరిగి 50 కోట్లకు చేరిందన్నారు. పీఎం జన్ధన్ యోజనలో భాగంగా దేశంలో 2014–2017 మధ్యలో 28 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు. నేడు ఉత్తరప్రదేశ్కు మోదీ ప్రధాని మోదీ గురువారం ఉత్తరప్రదేశ్లో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కబీర్ దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని మఘర్లో ‘కబీర్ అకాడెమీ’కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా కబీర్ దాస్ బోధనలు, తత్వాన్ని ప్రసారం చేయనున్నారు. అనంతరం మఘర్లో ఏర్పాటుచేయనున్న బహిరంగసభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం యోగి సమీక్షిస్తున్నారు. మోదీ మౌలిక ప్రాజెక్టుల సమీక్ష వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షించారు. 4కోట్ల కుటుంబాలకు విద్యుత్ అందజేసే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ప్రాజెక్టుల పనితీరును సమీక్షించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకోసం ఉద్దేశించిన పథకం అమలుపైనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. 40వేల గ్రామాల్లో (వెనుకబడిన జిల్లాల్లోని) జరుగుతున్న రెండో విడత గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆగస్టు 15 నాటికి ఈ జిల్లాల్లోని పనులన్నీ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని భద్రతపై సమీక్ష సాధారణమే! ప్రధాన మంత్రి సహా దేశంలో వీవీఐపీల భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడం సాధారణంగా జరిగే ప్రక్రియేనని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రధానికి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన భద్రతపై మంగళవారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
పూర్వ వైభవం కోసం సినీ నటి సహకారం..
సాక్షి, నిజామాబాద్ : బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పతనం ప్రారంభమయిందని జోష్యం చెప్పారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని తెలిపారు. ‘పూర్వ వైభవం కోసం సినీ నటి మాధురీదీక్షిత్ లాంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని నిరూపించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి చివరి నిమిషంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడం అవకాశవాదమే. ప్రభుత్వం వల్లే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంద’ని నారాయణ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శిఖండి పాత్ర పోషిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ‘ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ ఫ్రంట్. బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా అందర్నీ సమీకరిస్తున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం చెబుతుంది. దీనిపై కేంద్రం మీద కేసీఆర్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. కేసీఆర్కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి. బాంచెన్ దొర అంటూ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులను ఆదుకోవాలి. కాళేశ్వరం పేరు చెప్పి ఓట్లు పొందుదామనుకోవడం భ్రమే. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. తెలంగాణను వ్యతిరేకించిన వారు క్యాబినెట్లో ఉన్నార’ని నారాయణ ధ్వజమెత్తారు. -
అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ద్వారా రివ్యూ పిటివేషన్ వేశామని, ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి యథాతధ స్థితిలో ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ఆ తర్వాత బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 4.4 శాతం ఉన్న జీడీపీ... ప్రస్తుతం నరేంద్రమోదీ పాలనలో 7.7 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. 2020 వరకు దేశంలోని ప్రతీ నిరుపేదకు సొంత ఇళ్లు నిర్మించాలన్నదే ప్రధాని ధ్యేయమని అన్నారు. జన్ధన్ యోజనతో 32 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. ఇటీవలే జరిగిన పలు సర్వేల్లో నరేంద్రమోదీపై 65 శాతం నుంచి 70 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలో జరగనున్న రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీకి భయపడం: బాబు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘నాలుగేళ్లు బీజేపీతో కలిసి పనిచేశాం. అడుగడుగునా అడ్డుపడ్డారు. ఏ మాత్రం సహకరించలేదు. భయపెడితే మేం భయపడే పరిస్థితుల్లో లేం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాదని చెప్పారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సంక్షేమం, సాధికారతపై నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘బీజేపీ గెలవదు. మేం చెప్పిన వారే ప్రధాని అవుతారు. మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పుతా. గుజరాత్ కంటే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే కేంద్రం సహకరించడం లేదు. బీజేపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల సమయంలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లి అడిగినా పట్టించుకోలేదు. నేను మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశా’ అని సీఎం తెలిపారు. కర్ణాటకలో అధికారం కోసం కుట్రలు తాను ఇచ్చిన పిలుపు మేరకు కర్ణాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించారని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారం కోసం కుట్రలు చేశారని, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపించారు. మన రాష్ట్రంలో అలాంటి కుట్రలు సాగనివ్వబోమన్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ఐదో బడ్జెట్ చూశాక కేంద్రం నుంచి, ఎన్డీఏ నుంచి తప్పుకుని అవిశ్వాసం పెట్టామని చెప్పారు. బీజేపీతో విడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ తనపై, టీడీపీపై, పార్టీ ఎమ్మెల్యేలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మనమే నంబర్ వన్ ‘కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధికి నేను కష్టపడుతున్నా. దేశ ఆర్థికాభివృద్ధి కన్నా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఎక్కువ. 10.5 శాతం ఆర్థిక వృద్ధి, వ్యవసాయంలో 15 శాతం వృద్ధి సాధించాం. పారిశ్రామిక రంగం దెబ్బతింటోంది. అయినా కష్టపడి కొన్ని కంపెనీలు తెచ్చా. తిరుమల దేవాలయం పవిత్రతను మేం కాపాడుతున్నాం. అక్కడ ఓ పంతులును పట్టుకుని దేవాలయంపై కేంద్రం కుట్రలు చేస్తోంది. బీజేపీ, వైఎస్సార్ సీపీ, జనసేన కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కాపులకు ఇచ్చిన హామీని అమలు చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి కళావెంకటరావు, నక్కా ఆనంద్బాబు, సుజయ్కృష్ణ రంగారావు, ఎంపీలు తోట నరసింహం, పి.రవీంద్రబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. నీరు–ప్రగతిపై 52 శాతం మంది అసంతృప్తి సాక్షి, అమరావతి: నీరు–ప్రగతి పనులపై ప్రజల్లో 48 శాతం సంతృప్తి వ్యక్తమైందని, 52 శాతం మందిలో అసంతృప్తి నెలకొదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం తన నివాసం నుంచి నవనిర్మాణ దీక్షపై సర్పంచులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడుతూ ‘రైతు రథం, పొలం పిలుస్తోంది’పై 56 శాతం సంతృప్తి ఉందన్నారు. మూడో రోజు దీక్షలో 17 లక్షల మంది పాల్గొన్నారని, 19 వేల శంకుస్థాపనలు జరిగాయన్నారు. చంద్రబాబు మృత్యుంజయ హోమం అమలాపురం టౌన్: సీఎం చంద్రబాబు మంగళవారం అమలాపురం రూరల్ మండలం రంగాపురంలోని రాజరాజేశ్వరి సమేత రామేశ్వరస్వామి ఆలయంలో సకృత మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా హోమంలో పాల్గొని పూర్ణాహుతిలో ద్రవ్యాలను వేశారు. ఆలయ ప్రాంగణంలో కోనేరుకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. హోమం నిర్వహించిన 25 మంది వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదించారు. చంద్రబాబు శివాలయంలో దాదాపు అరగంట పాటు ఉన్నారు. రాజయోగం, మృత్యుంజయం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం చేసే ఈ అరుదైన హోమాన్ని చంద్రబాబుతో చేయించాలన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నం ఇన్నాళ్లకు ఫలించిందని పార్టీ నేతలు తెలిపారు. -
కేంద్రంపై పోరాటం చేయాలి
కొత్తగూడ(ములుగు): దళిత, గిరిజనులు ఏకమై కేంద్రంపై పోరాటం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో జరిగిన సింహగర్జన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేడు హరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లకు అణుగునంగా భద్రత, స్వేచ్ఛగా జీవించే హక్కులు కల్పించారన్నారు. దళిత, గిరిజనులు చదువువుకు దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. దళిత, గిరిజనులపై అత్యాచారా లు జరుగుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు సుప్రీం కోర్టును అగ్రవర్ణాలు ఉపయోగించుకున్నాయన్నారు. రక్షణ కవచం లాంటి చట్ట రక్షణకు దళిత, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని సూచించారు. ఈనెల 10 తలపెట్టిన సింహ గర్జనకు తరలి రావాలన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, జెన్కో భూపాలపల్లి జిల్లా ఎస్ఈ జనగం నరేష్, నర్సంపేట డీఈ విజయ్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, బూర్క యాదగిరి, సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు బూర్క వెంకటయ్య, శ్రీశైలం ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, మిడుతపల్లి యాకయ్య, వజ్జ సారయ్య,రేణుక, వివిధ సంఘాల నాయకులు బాబూరావు, నర్స య్య, ప్రేమ్సాగర్, రాజం సారంగం, కల్తి ఎల్లయ్య, గుమ్మడి లక్ష్మినారాయణ, కంగాల లచ్చయ్య, చెన్నూరి మహేందర్, విజయ్, గంగిరెడ్లు, బుడిగ జంగాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ చట్టం కవచం లాంటిది మరిపెడ: అట్రాసిటీ చట్టం ఎస్సీ, ఎస్టీలకు ఒక కవచంలాంటిది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మరిపెడ లోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎల్హెచ్పీఎస్ నియోజక వర్గ ఇన్చార్జి భూక్యా రామ్మూర్తినాయక్ అధ్యక్షతన సింహగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బానిస బతుకుల నుంచి విముక్తి కావాలంటే దళిత, గిరిజనులు తరలిరావాలన్నారు. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసి టీ యాక్ట్ చట్టాన్ని రూపొందించారన్నారు. ఈనెల 10న వరంగల్లో జరిగే దళిత, గిరిజన సింహగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో హలావత్ శంకర్ నాయక్, రామన్ననాయక్, అల్వాల వీరయ్య, బానాల రాజన్న, చెన్నయ్య, కనకయ్య, లక్ష్మి, భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఉజ్వల యోజన లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చిందని, వాటిలో నాలుగు కోట్లు పేద మహిళలకే కేటాయించామని ఆయన చెప్పారు. గ్యాస్ కనెక్షన్లలో సింహ భాగం దళితులు, గిరిజనులకే దక్కాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల అనుకూల పథకాల్ని అమలు చేస్తుంటే.. ఆ విషయంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని తప్పుపట్టారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు కేవలం ధనికులు, ప్రభావితం చేసే వ్యక్తులకు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా పథకం అమలవుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతీ 100లో 81 కుటుంబాలకు కనెక్షన్లు ఉన్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆరు దశాబ్దాల్లో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే.. గత నాలుగేళ్లలో 10 కోట్లు ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. ఉజ్వల్ యోజనతో లబ్ధి పొందిన మహిళలతో మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేది. ఆ సమయంలో పొగ వల్ల ఎంతో ఇబ్బంది పడేది. భవిష్యత్లో 100 శాతం ఇళ్లకు శుద్ధమైన ఇంధనం అందించడమే మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. మా హయాంలోనే దళితులకు ప్రయోజనాలు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా దళితులు ఎంతో లాభపడ్డారని పేర్కొంటూ.. ఎన్డీఏ, యూపీఏ హయాంలో దళితులు పొందిన లబ్ధిని మోదీ పోల్చారు. ‘2010–14 మధ్యలో దళితులు 445 పెట్రోల్ బంకులు పొందితే.. 2014–18లో 1200 పెట్రోల్ బంకులు కేటాయించాం. యూపీఏ హయాంలో 900 మంది దళితులకు మాత్రమే ఎల్పీజీ డీలర్షిప్ కేటాయిస్తే.. ఎన్డీఏ పాలనలో 1300 మందికి ఇచ్చాం’ అని చెప్పారు. ఉజ్వల యోజన కింద లబ్ధి పొందడం ప్రారంభమైనప్పటి నుంచి పేదలు, దళితులు, గిరిజన వర్గాల జీవితాలు మెరుగయ్యాయని, సామాజిక సాధికారితలో ఈ పథకం ప్రధాన పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు. మే, 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకంలో 5 కోట్ల నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఆ సంఖ్యను 8 కోట్లకు పెంచారు. తమిళనాడు వస్తే దోసె దొరుకుతుందా..? టీ నగర్ (చెన్నై): తమిళనాడుకు వస్తే దోసె దొరుకుతుందా? అని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మహిళ రుద్రమ్మతో వీడియో కాన్ఫనెన్స్లో మోదీ అన్నారు. తప్పకుండా తయారు చేసి ఇస్తానని, తమ ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించారు. అనంత్నాగ్కు చెందిన మహిళా బృందం ‘ఇది రంజాన్ మాసం. ఖురాన్ను రోజూ చదువుతాం. రోజూ మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రధానిగా కొనసాగుతారని మేం ఆశిస్తున్నాం’ అని మోదీతో అన్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన లబ్ధిదారుతో మోదీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్కు ఇబ్బందులుంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. గతంలో కట్టెల పొయ్యి వాడినప్పుడు వంటకు ఎంతో సమయం పట్టేదని.. ఇప్పుడు గ్యాస్ పొయ్యితో సమయం ఆదా అవడం వల్ల పిల్లలతో సమయం గడుపుతున్నానని ఆమె పేర్కొంది. -
మా పాలనకు ప్రజామోదం
కటక్, భువనేశ్వర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని, ప్రజలు తమకు ఆమోద ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడమే అందుకు నిదర్శమని ఆయన చెప్పారు. దేశం దుష్పరిపాలన నుంచి సుపరిపాలనకు, నల్లధనం నుంచి ప్రజాధనం వైపుగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలన అనంతరం.. దేశం మారగలదన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒడిశాలోని కటక్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటం అనేకమంది వెన్నులో వణుకు పుట్టించిందని, దాంతో విపక్షాలు ఒకే వేదికపైకి చేరాయని విమర్శించారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడాన్ని అందరూ గమనించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే ప్రభుత్వం మాది కాదు. సర్జికల్ దాడులు నిర్వహించగల సత్తా ఎన్డీఏ సర్కారుకు ఉంది అలాగే అక్రమ ఆదాయం, ఆస్తులపై వివిధ దర్యాప్తు సంస్థలు మూడు వేల దాడులు నిర్వహించాయి. రూ. 53 వేల కోట్ల అక్రమాదాయం బయటపడింది. బినామీ చట్టం కింద రూ. 3500 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం. అవినీతి కేసుల్లో నలుగురు మాజీ సీఎంలు జైళ్లలో ఉన్నారు. 2.26 లక్షల డొల్ల కంపెనీల్ని రద్దు చేశాం. నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న కఠిన నిర్ణయాలతో వెన్నులో వణుకు పుట్టిన అనేకమంది.. ఒకే వేదికపైకి చేరారు’ అని ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా విపక్షాల ఐక్యతను పరోక్షంగా విమర్శించారు. ప్రజానుకూల పథకాలు చేపట్టాం.. కాలం చెల్లిన చట్టాల్ని పక్కనపెట్టామని, గత నాలుగేళ్లుగా ప్రపంచం ఒక కొత్త భారతదేశాన్ని చూస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే.. ఈ నాలుగేళ్ల కాలంలో 7.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఎన్డీఏ హయాంలో ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులు అందాయి. 25 కోట్ల జన్ధన్ బ్యాంకు ఖాతాల్ని ఇచ్చాం. 10 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు అందచేశాం. మా హయాంలో పారిశుద్ధ్య సౌకర్యాల్ని రెండింతలు మెరుగుపర్చాం. గత నాలుగేళ్లలో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే మా విధానాలు కూడా ప్రజానుకూలంగా ఉన్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ అధికార యావ అని మోదీ విమర్శించారు. శనివారం కటక్లో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ ప్రజా ఉద్యమంగా ఎన్డీఏ అభివృద్ధి పనులు గత నాలుగేళ్లలో ఎన్డీఏ చేపట్టిన అభివృద్ధి ఉత్సాహపూరిత ప్రజా ఉద్యమంగా మారిందని ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు. ‘2014లో ఇదే రోజున దేశ పరివర్తన కోసం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. దేశం వృద్ధి పథంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యాడు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. ‘సాఫ్ నియత్, సహీ వికాస్’(మంచి ఉద్దేశం, సరైన అభివృద్ధి) హ్యాష్ట్యాగ్లతో ప్రభుత్వ విజయాల్ని ప్రస్తావిస్తూ పలు చార్ట్లు, గ్రాఫిక్స్, వీడియోల్ని పోస్టు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల దృఢమైన నమ్మకానికి నేను నమస్కరిస్తున్నా. మీ మద్దతు, వాత్సల్యం ప్రభుత్వానికి ప్రేరణ, బలం’ అని ట్వీట్ చేశారు. ఉత్సాహం, అంకితభావంతో ప్రజలకు సేవచేయడాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. ముందుచూపుతో ప్రజలకు సాయం చేసే నిర్ణయాలు తీసుకున్నామని సరికొత్త భారతావనికి అవి పునాదులు వేశాయని చెప్పారు. -
నాలుగేళ్లు.. 200 పథకాలు
సాక్షి, హైదరాబాద్ : పేదల సంక్షేమం, అవినీతి రహిత పాలన, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా నాలుగేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన సాగిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్షణ్ మీడియా సమావేశంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు పాలనలో చేయలేనిది.. నాలుగేళ్లలో ఏన్డీఏ ప్రభుత్వం సాధించిందని అభివర్ణించారు. జవాబుదారీతనంగా మోదీ పాలన సాగిందని.. కానీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రతిపక్షాలు తప్పుదోవపట్టించాయని మండిపడ్డారు. అయినప్పటికీ ప్రధాని ఎక్కడా వెనక్కి తగ్గలేదని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల పాలనలో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేదని, కానీ మహిళల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు. ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మోదీ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. తాను అనుభవించిన కటిక పేదరికం ఎవరు అనుభవించకూడదనే పేదలకు అనేక పథకాలు మోదీ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అమ్మాయి పుడితే పురిట్లోనే చంపే ఈ రోజుల్లో అమ్మాయిల సంక్షేమమే ధ్యేయంగా సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఈ నాలుగేళ్లలో మోదీ రెండు వందలకు పైగా పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. అంబేడ్కర్ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడే హక్కే లేదని, అదే ఏన్డీఏ ప్రభుత్వం దళితుడిని రాష్ట్రపతి చేసిందని గుర్తుచేశారు. ఇక తెలంగాణలో కుటుంబ, నియంతృత్వ పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానంటూ చెప్పిన కే. చంద్రశేఖర్ రావు ఆ తరువాత మాటతప్పారని, మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవచేశారు. -
ఈ నేల నాకెంతో ప్రత్యేకం : మోదీ
కటక్ : ‘ఈ నేల నాకెంతో ప్రత్యేకం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించిన పవిత్ర స్థలం కటక్లో ఎన్డీయే ప్రభుత్వ నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కటక్లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘ఈ నాలుగేళ్ల పాలన.. 125 కోట్ల మంది భారతీయులకు దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. గత అరాచక ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించి సుపరిపాలన అందిస్తున్నామంటూ’ మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని పురోగమనంలో నడిపించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం వెనుకాడబోదని మోదీ పేర్కొన్నారు. పేద ప్రజలకు బ్యాంకు అకౌంట్ ఖాతా తెరవడం, జీఎస్టీ ద్వారా ఆర్థిక సంస్కరణలకు నాంది పలకడం, బలమైన విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి అంశాలు దేశ భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం ద్వారా శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశామని మోదీ వ్యాఖ్యానించారు. కాగా 2014 ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. ఒడిశాలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని ఎదుర్కోలేక కేవలం పది స్థానాలకే పరిమితమైంది. -
అదొక అరాచక కూటమి..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ పక్షాలు అభినందనలు తెలుపుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ విశ్వాస ఘాతుక దినోత్సవం పేరిట దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే కాంగ్రెస్, ఇతర పార్టీల తీరుపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న జైట్లీ.. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వేదికగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ భారత ప్రజలు తిరస్కరణకు గురికాక తప్పదంటూ జైట్లీ జోస్యం చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత్ వంటి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన ఈ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనసాగాలంటే ఆయా పార్టీల మధ్య సఖ్యత అవసరం. అప్పుడే నిజాయితో కూడిన పాలన అందించడానికి వీలవుతుందంటూ పేర్కొన్నారు. అధికార దాహంతో అరాచక కూటమి ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఒక్కసారి వారి (టీఎంసీ, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్) ట్రాక్ రికార్డు చూస్తే వారికున్న నిలకడ ఏమిటో అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు. అవసరాలకు అనుగుణంగాఎప్పటికప్పుడు సిద్థాంతాలు మార్చుకునే అలాంటి పార్టీలు కూటమి ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా లాభమేమీ ఉండదని జైట్లీ పేర్కొన్నారు. కర్ణాటకలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్.. చివరి నిమిషంలో ప్రాంతీయ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దిగజారుడుతనానికి పాల్పడిందంటూ ఘాటుగా విమర్శించారు.