narayana
-
కాలేజ్ బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
-
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగింపు
-
కావాలంటే బయట మార్పుకోసం ఎంతయినా శ్రమిద్దాం! మనలో మార్పంటే అసాధ్యం కామ్రేడ్!
-
రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. వరద నివారణ పనులుఅమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను విస్తరిస్తామని చెప్పారు. నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు. -
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన మంత్రి నారాయణ!
విజయవాడ, సాక్షి: హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నారాయణ ఏకీభవించారు.హోంమంత్రిగా అనిత విఫలమైందన్న పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా మంత్రి నారాయణ సమర్థించారు. ఇతర శాఖల్లో తప్పులు జరిగినప్పుడు సీఎం, డీప్యూటీ సీఎం స్పందిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కూడా అదే చేశారని తెలిపారు. ‘‘పవన్ ఏం కామెంట్ చేశారు. ఏం చేయలేదు. సిరియస్గా తీసుకుని పనిచేయమన్నారు. డిప్యూటి సీఎంగా అక్కడ జరిగిన దానిని బేస్ చేసుకుని మాట్లాడారు. దానికి తగ్గట్లుగా హోం మినిస్టర్ చర్యలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ..సీఎం, డిప్యూటీ సీఎం వేరే డిపార్టుమెంట్ సరిగ్గా పనిచేయకుంటే కామెంట్స్ చేస్తారు. లీగల్గా పోలీసులు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉండోచ్చు. దాని వల్ల ఒకోసారి అలస్యం కావచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సీఎం అన్ని కో ఆర్డినేట్ చేస్తారు’’అని అన్నారు. -
పోలవరం ఎత్తు తగ్గింపు.. ఆత్మహత్యా సదృశ్యమే: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: పోలవరం ఎత్తు తగ్గించడం ఆత్మహత్యా సదృశ్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎత్తు తగ్గించి నిర్మించడానికి ఇంత ధనం అవసరం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ను 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నారాయణ ప్రశ్నించారు.పోలవరం 41 మీటర్లకు తగ్గితే బ్యారేజిగా మాత్రమే పనికివస్తుందని నారాయణ అన్నారు. ఉత్తరాంధ్రకు నీళ్లు రావు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్కు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు.కాగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: పోలవరం ఇక ఉత్త బ్యారేజే -
అడ్డంగా దోచేస్తోన్న అనుచరులు
-
అడుసు తొక్కనేల.. చంద్రబాబు లిక్కర్ పాలసీపై సీపీఐ నారాయణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు. మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.ఇదీ చదవండి: అవే బ్రాండ్లు... అవే రేట్లు -
ఎమ్మెల్యేలు చెప్పిన వారికే మద్యం లైసెన్సులు అంటే ఇక టెండర్లు ఎందుకు
-
నేను డబ్బులిస్తా..టెండర్లు వెయ్యండి ప్రజలకు ఫుల్లుగా తాగించండి
-
రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా
సాక్షి, టాస్క్ఫోర్స్ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి వ్యక్తులకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షాపులు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధరఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరిస్తున్నా. నెల్లూరులో రౌడీయిజం ఒప్పుకోను. దుకాణాల వద్దకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్లు అడిగినా ఒప్పుకోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖాస్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
సనాతన ధర్మం గురించి పవన్ కు తెలుసా?
-
మంత్రి నారాయణ్ కు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
మీరిద్దరూ దోస్తులే కదా?
-
బ్యారేజ్లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు
సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’అని నారాయణ డిమాండ్ చేశారు.గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్కొల్లేరు టు బుడమేరు పర్యటించాంవరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారుగ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారుఅధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారువేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదుప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారుగిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదుచంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషంగ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిబుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందిపెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారుబుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలికొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాంఅవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాంఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స -
మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంపదని దాటేసిన పార్ట్ నర్...
-
హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ
సాక్షి హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి చెరువులో కాలేజీలు నిర్మించారని వారి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయని నారాయణ అన్నారు. ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు. కబ్జాలు పాల్పడిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు జరపాలన్నారు. ఎంఐఎం నేతలవి కూడా తొలగించాలన్న నారాయణ.. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. -
సహచరుల లైంగిక వేధింపులకు డెంటల్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్కుమార్, ప్రదీప్కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్యవైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్ఫోన్కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు. – మృతుడి అన్న అఖిల్కుమార్ -
నారాయణ, చైతన్య సహా కోచింగ్ సెంటర్లను నిషేధించండి
-
చంద్రబాబు సీరియస్.. ఆ ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్
-
బాబు భూ దోపిడీ ఖజానా!
సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.మోయలేని భారం మోపుతూ...రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.భూములు లాక్కుని గాలి మేడలు..!అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు. 2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.పచ్చ దండు దురాక్రమణ..దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు. చంద్రబాబు, లోకేశ్తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.మభ్యపుచ్చే యత్నాలు..నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు. అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం. -
చంద్రబాబు, నితీష్పై బీజేపీకి అపనమ్మకమే: సీపీఐ నారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతుండవని హెచ్చరించారు రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం అని కామెంట్స్ చేశారు.కాగా, సీపీఐ నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్ అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా?. ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే.రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి.. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు.. రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా?. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
వయనాడ్ బరిలో ప్రియాంక.. పోటీ సరికాదన్న సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు.కాగా, నారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రియాంక గాంధీని వయనాడ్లో పోటీకి దింపడం సరికాదు. కేరళ స్థానిక నాయకులకే వయనాడ్ సీటు వదిలిపెట్టాలి. అలాగే, ఏపీలో కూల్చావేతలకు మేము పూర్తిగా వ్యతిరేకం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా వయనాడ్, రాయబరేలీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచి రాహుల్ తప్పుకోవడంతో ఉప ఎన్నికల కోసం ప్రియాంక గాంధీని బరిలో దింపారు. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగా ఉన్న విషయం తెలిసిందే. -
చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు: నారాయణ
-
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
శాపంగా నారాయణ గారడీలు
‘నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తున్నాం..నగర సుందరీకరణే నా ధ్యేయం.. భూగర్భ డ్రైనేజీతో మెరుగైన పారిశుధ్యాన్ని అందిస్తాం’అంటూ గత ప్రభుత్వ హయాంలో మంత్రిగావ్యవహరించిన నారాయణ తన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఆ రోజుల్లో ఊదరగొట్టారు. ఇవన్నీ జరగకపోగా.. తనలోపభూయిష్ట విధానాలతో నెల్లూరు నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. హడ్కో ద్వారా రుణాలను తీసుకొచ్చి.. పనులను చేయకుండానే నిధులను దిగమింగారు. ఈ పరిణామాలతో ఆ అప్పులపై కార్పొరేషన్ ఏటా రూ.55 కోట్ల వడ్డీని కడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ పాపాలు నగర వాసులను నేటికీ వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ విస్మరించి తాజాగా జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ ఆయన అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘నారాయణ అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. 9.95 శాతం వడ్డీకి అప్పు నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా కోసం రూ.1136 కోట్ల రుణానికి హడ్కోను ఆశ్రయించారు. ఇందులో తాగునీటి సరఫరా కోసం రూ.556 కోట్లు, భూగర్భ డ్రైనేజీకి రూ.580 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే హడ్కో రూ.830 కోట్లను 9.95 శాతం వడ్డీకి 2016లో మంజూరు చేసింది. అయితే నామమాత్రపు పనులతో 2018 వరకు కాలం వెళ్లదీశారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా.. గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు రెండు ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలకు టెండర్లను ఖరారు చేశారు. అప్పటికే నగరంలో ఒకట్రెండు వీధుల్లో మినహా మిగిలిన అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీ పేరుతో రోడ్లను తవ్వి.. అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. ధ్వంసమైన రోడ్లపై నడిచేందుకు సైతం వీల్లేని పరిస్థితి ఏర్పడింది. భూగర్భ డ్రైనేజీ పైప్లైన్లను అన్ని వీధుల్లో వేస్తేనే గానీ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వీలుంటుంది. ఈ తరుణంలో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నరకాన్ని చవిచూశారు. డివిజన్ ఇన్చార్జీలకు సబ్ కాంట్రాక్ట్లు..! సిమెంట్ రోడ్ల పనులను తమకే కేటాయించాలంటూ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల టీడీపీ ఇన్చార్జీలు నారాయణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు కన్స్ట్రక్షన్ కంపెనీలతో మాట్లాడి నిర్మాణాల పనులు వారికి అప్పగించారు. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనగా, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఎత్తుపల్లాలుగా.. అత్యంత నాసిరకంగా రోడ్లను నిర్మించారు. కొన్ని వీధుల్లోని రోడ్లు వారానికే కుంగిపోయాయంటే నాణ్యత ఎలా ఉంతో అర్థం చేసుకోవచ్చు. గుంతలమయంగా.. వర్షమొస్తే చెరువులను తలపిస్తూ.. పైప్లైన్ల లీకేజీలు.. ఇలా రోడ్లు దుర్భరంగా మారాయి. చిన్నపాటి లీకేజీని సైతం సరిదిద్దేందుకు రోడ్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అసంపూర్తిగా ఉన్నా.. బిల్లుల మంజూరు హడావుడిగా చేసిన పనులకు బిల్లులను మాత్రం పూర్తిగా తీసుకున్నారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయని.. బిల్లులను మంజూరు చేయలేమని ఇంజినీరింగ్ అధికారులు చెప్పినా, నారాయణ మౌఖిక ఆదేశాలతో వీటికి ఇవ్వక తప్పలేదు. కొన్ని బిల్లులను అధికారులు క్లియర్ చేయకపోవడంతో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. స్వచ్ఛ నీరు.. కాలువల పాలు నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పైపులను ఇళ్ల వద్ద ఏర్పాటు చేసి ఓపెన్గా వదిలేశారు. ఈ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిని ఏర్పాటు చేసి.. వినియోగాన్ని లెక్క కట్టేందుకు మీటర్లను బిగిస్తామని చెప్పారు. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ ఓపెన్ పైపుల ద్వారా విడుదలయ్యే నీరు కాలువల పాలైంది. మరికొన్ని చోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. నగరంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి పనులను పూర్తి చేయాలంటే మరో రూ.240 కోట్లు అవసరమవుతాయని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వడ్డీ భారం ఇలా.. హడ్కో నుంచి తెచ్చిన రుణానికి 9.95 శాతం వడ్డీని ఏటా చెల్లించాలి. అసలు కింద రూ.80 కోట్లు.. వడ్డీగా రూ.55 కోట్లు.. ఇలా ఏడాదికి రూ.135 కోట్లను నగరపాలక సంస్థ చెల్లించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా రూ.810 కోట్లను కార్పొరేషన్ చెల్లించింది. ఈ లెక్కన ఇంకా దాదాపు రూ.400 కోట్లను అసలు, వడ్డీ కింద జమ చేయాల్సి ఉంది. ఇలా నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నారాయణ లాగారు. -
కోటంరెడ్డి, నారాయణ పై విజయ్ సాయి రెడ్డి ఫైర్
-
నారాయణ నకిలీ పనులు
-
నారాయణ పై విజయసాయిరెడ్డి ఫైర్
-
సీపీఐ నారాయణకు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మాములుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని.. రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. -
బడుగుల భూచోరుడు చంద్రబాబే..
రాజధాని పేరిట అమరావతిలో చోటుచేసుకున్న భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ముఠానేనని సీఐడీ తేల్చింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం చార్్జషీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను చంద్రబాబు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడీ వెలుగులోకి తీసుకొచి్చన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూబాగోతం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా రూ.4,400 కోట్లు విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు, నారాయణ తమ బినావీులు, సన్నిహితుల పేరిట గుప్పెట పట్టారన్నది సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలింది. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి భయపెట్టారు. తమకు ఆ భూములు విక్రయిస్తే కొంతైనా డబ్బులు వస్తాయని చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినావీులకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన కేపీవీ అంజనీకుమార్ (రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్), గుమ్మడి సురేశ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కొల్లి శివరామ్లతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల పేరిట ఆ అసైన్డ్ భూములు బదలాయించారు. అనంతరం.. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని అక్రమంగా బదలాయిస్తూ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. అసైన్డ్ భూములను అలా జీపీఏ పేరిటగానీ ఇతరత్రా విధాలుగాగానీ బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఆ తర్వాత ఆ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. తద్వారా తాము బినామీల పేరిట హస్తగతం చేసుకున్న అసైన్డ్ భూములకు సీఆర్డీఏ భారీ ప్యాకేజీ దక్కేలా చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. వాటికి భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు, నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి తాము చెప్పినట్లు చేయమని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు నారాయణ కుటుంబసభ్యుల పేరిటే 162 ఎకరాలు ► అసైన్డ్ భూదోపిడీ కోసం చంద్రబాబు ముఠా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్కు తెగబడింది. రెవెన్యూ రికార్డులు, సీఆర్డీఏ భూసమీకరణ రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లకు విరుద్ధంగా సీఆర్డీఏ భూసమీకరణ ప్యాకేజీ ఇచ్చిన వాటిలో 1,336 మంది బినామీల పేర్లు ఉండటం గమనార్హం. ► నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచే రూ.16.5 కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ నిధులను నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వారి పేరున అసైన్డ్ భూములను అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. ► నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే అక్రమంగా 162 ఎకరాల అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. వీటి విలువ రూ.650కోట్లు. నారాయణ 16.5 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.650కోట్ల భూములు కొల్లగొట్టారు. ► అంతేకాక.. దాదాపు రూ.4వేల కోట్ల విలువైన మరో 1,000 ఎకరాల వరకు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. -
Chandrababu: ఉనికి కోసం ఆర్థిక నేరాలు!
సాక్షి, అమరావతి: కూటి కోసం కోటి పాట్లు అన్నది లోకోక్తి! ఉనికి కోసం ఆర్థిక నేరాలు అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు యుక్తి! అధికారంలో ఉండగా రాజధాని పేరుతో రైతుల భూములను సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల కోసం మళ్లీ ఆర్థిక నేరగాళ్లనే ఆశ్రయిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న ఆయన... ఉనికి చాటుకునేందుకు యధావిధిగా డబ్బు కట్టలనే నమ్ముకున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి ఆర్థికంగా బలవంతులైన ఎన్నారైలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లను ఎన్నికల బరిలోకి దింపేందుకు గాలం వేస్తున్నారు. వీళ్లిచ్చే డబ్బుతో పాటు ఎన్నికల్లో వెదజల్లేందుకు తన చుట్టూ ఉన్న ఆర్థిక నేరగాళ్లకు కూడా నిధులు సమీకరించే పని పురమాయించారు. అధిక వడ్డీల ఆశచూపి సామాన్యుల నుంచి డబ్బులు సమీకరించటం, బ్యాంకులను బురిడీ కొట్టించటం, లేని కంపెనీలను సృష్టించి మరీ రుణాలు తెచ్చి ఎగవేయటం వంటి కళల్లో సిద్ధహస్తులైన బాబు ముఠా మళ్లీ ఆ పనిలో పడ్డారు. దీన్లో భాగంగా అధిక వడ్డీల ఎర వేసి అప్పుల రూపంలో డబ్బులు సేకరించే బాధ్యత తన బినామీ అయిన మాజీ మంత్రి నారాయణకు అప్పగించారు. ఇక ఎడాపెడా రుణాలు తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన చరిత్ర సుజనా చౌదరిది. దాదాపు 10వేల కోట్లకుపైగా వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనాను అరెస్టు చేస్తారన్న భయంతోనే 2019లో ఓడిపోయిన వెంటనే బీజేపీలోకి పంపారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావుదీ రుణాలు ఎగవేసిన బాపతే. వీళ్లు మళ్లీ అదే పనిలో పడ్డారని విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆర్థిక నేరగాళ్లతో బ్యాంకులకు కన్నమేసి.. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబుతో ఆది నుంచి ఆర్థిక నేరగాళ్లు పెనవేసుకుపోయారు. ఆది నుంచీ పలువురు బినామీలను పెంచి పోషిస్తూ వచ్చిన చంద్రబాబు... రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలోకి వచ్చినపుడు ప్రభుత్వ సహజ వనరులను, వ్యవస్థలను వీళ్లకు అప్పగించేశారు. అంతా అందినకాడికి దోచుకున్నారు. ఇది చాలదన్నట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీరు బ్యాంకులను కూడా అధికారికంగా దోచుకున్నారు. ఎడాపెడా నకిలీ కంపెనీలు పెట్టి... వాటి పేరిట కోటానుకోట్ల రుణాలు తీసుకున్నారు. ► వివిధ బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరిపై 2018–19లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టింది. గత ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీడీపీని వీడి బీజేపీ పంచన చేరిన సుజనా... ఇప్పటికీ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలు సాగిస్తూనే ఉన్నారని, చంద్రబాబుకు ఇం‘ధనం’ చేకూర్చుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ► ప్రత్యూష కంపెనీ పేరుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వివిధ బ్యాంకుల నుంచి రూ.141 కోట్ల రుణాన్ని తీసుకోగా వడ్డీతో కలిపి రూ.203.62 కోట్లకు చేరాయి. వాటిని చెల్లించకుండా మొండికేస్తున్న గంటా మరిన్ని ఆర్థిక సంస్థలను కొల్లగొడుతూ టీడీపీకి ఎన్నికల వ్యయాన్ని భారీ ఎత్తున సమకూరుస్తున్నారని సమాచారం. రిత్విక్కు పందేరం.. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేసుల నుంచి తప్పించుకునేందుకు సుజనా చౌదరితో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ను కూడా బీజేపీ గూటికి చేర్చారు చంద్రబాబు. ఆయన బీజేపీలో ఉంటున్నా తరిస్తున్నది మాత్రం చంద్రబాబు సేవలోనే. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల విలువైన పనులను సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్టŠస్కు కట్టబెట్టిన చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ తోపాటు సీఎం రమేష్కు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి భారీగా రుణాలను సేకరిస్తూ టీడీపీకి ఇం‘ధనం’ సమకూర్చుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పోలవరాన్ని పాతిపెట్టి! పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులను 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్కు కట్టబెట్టింది. దాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అర్హత లేని ట్రాన్స్ట్రాయ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానానికి రూ.వందల కోట్లు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. అనంతరం 2014 ఎన్నికల్లో భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చాలనే షరతుతో రాయపాటిని చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బులతోపాటు పోలవరం పనుల కోసం బ్యాంకుల నుంచి ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న రుణాన్ని సైతం ఎన్నికల ఖర్చుల కోసం చంద్రబాబు వసూలు చేశారని, అలా ఇచ్చేశాం కాబట్టే తాము దివాలా తీయాల్సి వచ్చిందని ఇటీవల ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు బహిరంగంగా ప్రకటించటం తెలిసిందే. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్టుతో పాటు తాము కూడా నాశనమయ్యామని ఆయన స్పష్టంగా చెప్పారు. కాలేజీలో నారాయణ ‘కౌంటర్’ 2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ బినామీగా వ్యవహరించిన నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ.. అధిక వడ్డీల ఆశ చూపిస్తూ భారీ ఎత్తున రుణాలను సేకరించి చంద్రబాబుకు అందిస్తుంటారు. టీడీపీ హయాంలో నారాయణకు అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు ఆయనతో కలసి అమరావతి భూకుంభకోణంలో భారీ ఎత్తున దోచేశారు. అయితే ఎన్నికలు ముగిశాక అధిక మొత్తంలో అప్పులు ఇచ్చిన ఇద్దరు బడా వ్యాపారులు, మార్వాడీలకు నారాయణ టోపీ పెట్టారనే చర్చ నెల్లూరులో భారీ ఎత్తున సాగింది. ఇప్పుడు కూడా నారాయణ తనకు అలవాటైన రీతిలో అధిక వడ్డీల ఎర వేసి వ్యాపారులు, మార్వాడీలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున రుణాలు సేకరిస్తున్నారు. నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో వారం క్రితం నాలుగు కౌంటర్లు తెరిచి నూటికి 5 రూపాయల వడ్డీ ఆశ చూపించి... (అంటే ఏడాదికి 60 శాతం) వ్యాపారులు, మార్వాడీల నుంచి దాదాపు రూ.650 కోట్లు సమీకరించారని సమాచారం. దీన్ని రహస్య ప్రాంతానికి తరలించిన నారాయణ... అక్కడి నుంచి చంద్రబాబు సూచించిన స్థావరాలకు చేరవేయడంలో నిమగ్నమయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు
సాక్షి,నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా -
నారాయణ మెడికల్ కాలేజీలో ఏసీబీ తనిఖీలు
-
నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
సానుభూతి కోసం కుమార్తెతో నారాయణ ప్రచారం చేయిస్తున్నారు: అనిల్
-
పరువు పాయె..మాజీ మంత్రి నారాయణకు షాక్
-
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధలయ్యాయి. ప్రభుత్వ భూములూ గల్లంతయ్యాయి. చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతమయ్యాయి. ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్ భూములు.. రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు.. వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలైంది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ.5వేల కోట్ల భూదోపిడీ.. ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో రూ.760.25 కోట్ల భూసమీకరణ ప్యాకేజీ పొందారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్ల భూములు కొల్లగొట్టారు. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం రాజధాని భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా కథ నడిపారు. అనంతరం.. అసైన్డ్ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా కోర్టును కూడా మోసంచేసి తమ పన్నాగాన్ని అమలుచేశారు. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే ఆ జీఓను జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములూ హాంఫట్.. ఇక రాజధాని కోసం అమరావతి పరిధిలోని ప్రభుత్వ భూములను కూడా చంద్రబాబు, నారాయణ ముఠా కొల్లగొట్టింది. ఎవరి ఆ«దీనంలోనూ లేని ప్రభుత్వ భూములను గుర్తుతెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. మొత్తం 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆ«దీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా రూ.760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) రావెల కిశోర్బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) తెనాలి శ్రావణ్కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు (రియల్టర్) మండల రాజేంద్ర (రియల్టర్) టకేవీపీ అంజనీకుమార్ (రియల్టర్) దేవినేని రమేశ్ (రియల్టర్) టబొబ్బా హరిచంద్రప్రసాద్ (రియల్టర్) హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) దోనేపూడి దుర్గాప్రసాద్ (రియల్టర్) అసైన్డ్ భూదోపిడీలో నిందితులు ఏ1 : నారా చంద్రబాబు ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్విత్ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్ఐఆర్ నమోదు. -
నారాయణపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన ఆరోపణలు
-
మాజీ మంత్రి నారాయణపై అనిల్ ఫైర్
-
నీకు దమ్ముంటే చర్చకు రా.. అనిల్ కుమార్ సవాల్
-
నీకు దమ్ముంటే చర్చకు రా..అనిల్ కుమార్ సవాల్
-
సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ గెలిచింది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ పార్టీతో పొత్తు లేకపోవడంతో మిగతా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోడిందని అన్నారు. కాగా, సీపీఐ నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీకి 90-100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయని తెలిపారు. మిగితా రాష్ట్రాలో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ఢ్లో అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అలాగే మధ్యప్రదేశ్లో కూడా గతంలో వచ్చిన సీటలును ఆ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఏఐసీసీ ముఖ్యంగా దీనిని గమనించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని ఉంటే తమ పార్టీ ఓట్లు కూడా పడేవని, ఇవి ఎంతగానో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేవని కామెంట్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్ గెలిచినా.. ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమన్నారు. ఇండియా భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని నారాయణ చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సీపీఐ పోటీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేరళలో నాలుగు, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్లో మూడు, ఛత్తీస్గఢ్లో బస్తర్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్ యాదవ్ మద్దతునిస్తున్నారన్నారు. కాంగ్రెస్తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామన్నారు. -
టీడీపీ నేత నారాయణ ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ
-
మంత్రివర్గంలో చేరేందుకు సీపీఐ ఆసక్తి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు మంగళవారం ఎల్లా హాటల్లో భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి తదితరులు రేవంత్ను కలిసి అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తమను మంత్రివర్గంలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనిపై చాడ వెంకటరెడ్డిని ప్రశ్నించగా, తమకు అలాంటి ఆలోచన లేదనీ, అయితే కాంగ్రెస్ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పామన్నారు. అంటే సీపీఐకి ఈ ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం కావాలన్న ఆలోచన ఉన్నట్లుగా సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సీటు గెలిస్తే మంత్రి పదవి వస్తుందా? అయితే, ఒక్క సీటు గెలిచిన సీపీఐకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండదనీ, కాంగ్రెస్లో ఉన్న వారికే సర్దుబాటు చేయడం కష్టమని అంటున్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటి వారు ఉన్నప్పుడు సీపీఐకి ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం: నారాయణ మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టూరిజం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై జ్యూడీషియల్ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన ద్రస్తాలను తగులబెట్టారని విమర్శించారు. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకుచిత వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రమాదకరమని, వ్యవస్థలను నాశనం చేస్తోందని విమర్శించిన ఆయన ఇండియా కూటమి బలపడాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటానన్నారు. -
మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మీ కుమారుడు అజయ్కుమార్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు. తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్కుమార్ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు. -
కేటీఆర్పై సీపీఐ నారాయణ విమర్శలు
-
టీడీపీ నారాయణను ఏకిపారేసిన మహిళా..
-
చంద్రబాబు బెయిల్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు 'పచ్చ' మూకల డేటా చౌర్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ బరితెగిస్తోంది. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతోనూ, ఓటర్ల జాబితాలో ఓటు ఉందో, లేదో తెలుసుకునే పేరుతోనూ ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ డేటా దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు, ఓటీపీ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని ఈ ముఠా సేకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ ఈ పచ్చ మూకల దండు ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపైన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంతలోనే రాజంపేట కోవలోనే తాజాగా నెల్లూరులోనూ టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. నెల్లూరులో నారాయణ గ్యాంగ్ బరితెగింపు.. నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ గ్యాంగ్ శనివారం పట్టపగలే ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించింది. ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ సున్నిత వ్యక్తిగత సమాచారం రాబట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లు, మొబైల్ ఫోన్ నంబర్, దానికి వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పాలని అడగడంతో నెల్లూరులో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. నెల్లూరు నగరంలోని మూలాపేట డివిజన్లో ఓ ఇంటికి వెళ్లి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ ముఠా సభ్యుడ్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ సున్నిత వ్యక్తిగత సమాచారం మీకెందుకంటూ నిలదీశారు. దీంతో ఆ డేటా దొంగ పరార్ కావడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన విద్యాసంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను ముఠాగా ఏర్పాటు చేసి నారాయణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నెల్లూరు నగర నియోజకర్గంలో దాదాపు 75 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు నారాయణ తన ముఠాను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారాయణకు రూ.కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు. తన విద్యాసంస్థల ఉద్యోగులు, అధ్యాపకులను రంగంలోకి దింపి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వెదజల్లినా ఓటర్లు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ ధపా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడానికి కుట్ర పన్నారని చెబుతున్నారు. పచ్చ దొంగల డేటా తస్కరణ ఇలా.. టీడీపీ పచ్చ దొంగల ముఠా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ చెబుతున్నారు. ఆ ఇంటి ఓటర్ల పేర్లు చదువుతున్నారు. ఆపై వారిని మాటల్లో పెట్టి సున్నిత వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబం వైఎస్సార్సీపీ మద్దతుదారులైతే వారి ఓట్లు తొలగింపు ఫారం–7 నమోదు చేసి మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వచ్చిందని.. దాన్ని చెప్పాలని దబాయిస్తున్నారు. కొందరు అమాయకులు ఓటీపీ చెబుతుండటంతో వారి ఓట్లు తొలగింపునకు ఫారం–7 నమోదవుతుంది. దాంతో పాటు ఓటర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం టీడీపీ నేత నారాయణ మీ ఖాతాలో నగదు జమ చేస్తాడని చెబుతూ మాయ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల నగదు కూడా జమ అవుతుందని పచ్చి అబద్ధాలకు దిగుతున్నారు. ఓటీపీ క్లిక్ చేస్తే అంతే సంగతులు పట్టపగలే దొంగల్లా ప్రజల ఇళ్లల్లోకి చొరబడుతున్న టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని తమ దగ్గర ఉన్న ఒక యాప్లో నమోదు చేస్తున్నారు. మొబైల్ నంబర్కు ఓటీపీ, మేసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేస్తే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది’ అంటూ కనిపిస్తోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో మర్రి మౌనిక అనే మహిళను ఇలాగే టీడీపీ దొంగల ముఠా బురిడీ కొట్టించింది. అంతటితో ఆగటంలేదు.. చంద్రబాబు సంతకం చేశారంటూ ఒక గ్యారెంటీ పత్రాన్ని సైతం ఇస్తుండటం ఈ ముఠా బరితెగింపుకు నిదర్శనం. ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తుండటం వీరి పైత్యానికి పరాకాష్ట. ఎల్లో మీడియా తీరు మారదా? రాష్ట్రంలో పచ్చ ముఠా ఇళ్లలోకి చొరబడి ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నా.. ఎల్లో మీడియా మాత్రం ఓటర్ల సవరణలు, చేర్పులు, తొలగింపుల్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల సర్వేపల్లిలో టీడీపీ ముఠా వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేసి అడ్డంగా దొరికినా ఎల్లో మీడియా పచ్చ కళ్లకు కనిపించడం లేదు. -
ఏపీలో మేం టిడిపితో కలవాలనుకుంటున్నాం
-
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
టీడీపీతో కలవాలనుకుంటున్నాం, కానీ.. : సీపీఐ నారాయణ
సాక్షి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. తాము టీడీపీతో కలవాలని అనుకుంటున్నప్పటికీ.. ఆ పార్టీ పక్క చూపులు చూస్తోందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో మేం టీడీపీతో కలవాలనుకుంటున్నాం. కానీ, ఆ పార్టీ పక్క చూపులు చూస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం. ఒకవేళ.. టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం మేం సపోర్ట్ చేస్తాం అని తేల్చి చెప్పారాయన. ఇక చంద్రబాబు అరెస్ట్.. బెయిల్పై విడుదల పరిణామాపై నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ‘‘చంద్రబాబుది అన్ అఫీషియల్ కండిషనల్ బెయిల్. బీజేపీ అగ్రనేత అమిత్ షాను నారా లోకేష్ కలిసిన తర్వాతనే పరిణామాలు మారాయి. షా వల్లనే చంద్రబాబుకి బెయిల్ వచ్చింది. చంద్రబాబు మళ్లీ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు అని నారాయణ వ్యాఖ్యానించారు. -
నారాయణపై అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు, నారాయణపై అనిల్ కుమార్ యాదవ్ పంచులే పంచులు
-
నేడు హైకోర్టులో చంద్రబాబు, నారాయణ కేసుల విచారణ
-
నీ మరదలి ప్రశ్నలకు సమాధానం చెప్పు ముందు..!
-
పొత్తులో భాగంగా నెల్లూరు సీటీ కోరనున్న పవన్ కళ్యాణ్
-
ఆ రెండు సీట్లు దక్కేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్పార్టీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవాలని సీపీఐ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన కొత్తగూడెంతోపాటు చెన్నూరు లేదా మునుగోడు స్థానాలను ఇవ్వాలని కోరుతోంది. అందుకోసం ప్రయత్నాలు తీవ్రం చేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజాను స్థానిక నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర కమిటీకి బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర సమితి ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి సీపీఐ రాష్ట్ర విస్త్రృతస్థాయి సమావేశం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్తో పొత్తు విషయాన్ని తేల్చే బాధ్యతను కేంద్ర కమిటీకి అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులతో చర్చించి రెండు అసెంబ్లీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాల్సిందిగా కోరామని ఆయన చెప్పారు. కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో గందరగోళం.. కాగా, కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా బరిలో నిలవాలని సీపీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ మాత్రం అలా తెగతెంపులు చేసుకోవడానికి ఏమాత్రం సిద్ధపడడంలేదని తెలుస్తోంది. వామపక్షాలన్నీ కలసి పోటీ చేసినా ఎక్కడా గెలిచే పరిస్థితి లేదనీ, కాబట్టి ఎలాగైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటేనే అసెంబ్లీలో అడుగు పెట్టగలమని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోవడం, శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిందనీ, కేడర్ చెల్లాచెదురైపోతున్నారనేది సీపీఐ భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలని సీపీఐ యోచిస్తోంది. అయితే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో మాత్రం నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు తెలిసింది. కొందరు సీపీఎం సహా ఇతర వామపక్ష, లౌకిక శక్తులతో కలసి పోటీ చేయాలని కోరగా, కొందరు ఎలాగైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని అన్నట్లు తెలిసింది. అంతేకాదు మునుగోడు, కొత్తగూడెం సీట్ల విషయంపై ఆయాచోట్ల తలెత్తిన అసంతృప్తి కూడా ఈ సమావేశంలో బయటపడినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు ఖరారై కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చినా మునుగోడులో పోటీ చేసి తీరాల్సిందేనని కొందరు పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సమావేశానికి వచ్చిన సభ్యులను శాంతింప చేయడం కష్టమైందని సమాచారం. ఈ నేపథ్యంలో పొత్తు బాధ్యతను కేంద్ర కమిటీకి అప్పగించినట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్తో సయోధ్య కుదరకుంటే, తదుపరి ఏం చేయాలన్న దానిపైనా కూడా కేంద్ర కమిటీనే తేల్చాలని కోరినట్లు వెల్లడైంది. కాంగ్రెస్తో పొత్తు కుదరకుంటే దాదాపు 20 సీట్లలో పోటీ చేసే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. -
కాంగ్రెస్ పొత్తు యూటర్న్పై నారాయణ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్-కమ్యూనిస్టుల పొత్తును ఉద్దేశించి ట్విటర్ వేదికగా నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిశ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కుడా జరిగితే ఎలా? పొత్తు ధర్మం పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ‘‘ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc — Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023 కాంగ్రెస్ పార్టీతో మంగళవారం కటీఫ్ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది. ఇదిలా వుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: అయితే వెయిటింగ్! -
టీడీపీ నారాయణను చెడుగుడు ఆడిన అనిల్ కుమార్ యాదవ్
-
హైకోర్టులో నారాయణ బావమరిది పిటిషన్..!
-
టీడీపీలో ఒక వెధవకి చెప్తున్నా..అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ కామెంట్స్
-
ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
-
బెయిల్, క్వాష్ పిటిషన్లపై నేడే విచారణ
-
ఏపీ సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేసిన పొంగూరు ప్రియ
-
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్
-
అమరావతి భూదోపిడిలో వెలుగులోకి కొత్త కుట్రలు
-
అసైన్డ్ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమరావతి భూదోపిడీలో కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించారన్నది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టానికి విరుద్ధంగా జీఓ–41 జారీకి ఆ ద్వయం బరితెగించి మరీ వ్యవహరించింది. అందుకోసం ఏకంగా కేబినెట్కు తెలియకుండా.. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ దోపిడీకి వారిద్దరూ కుట్ర పన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా.. సీఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా జీఓ–41ను జారీచేశారని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి.. ఆ తర్వాత తమ బినామీల ద్వారా వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ సేల్డీడ్ల ద్వారా రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తెలిసికూడా దరఖాస్తు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉంది. సబ్రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తూ నెంబర్ కేటాయించిన తర్వాత ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని బుకాయిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు.. టీడీపీ నేతల ఒత్తిడితో ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని సీఆర్డీఏ అధికారులు గుర్తించి టీడీపీ నేతలు, వారి బినామీ పేర్లను సీఆర్టీఏ రికార్డుల్లో నమోదుచేసి ప్యాకేజీ ప్రకటించారు. భూములన్నీ తమ హస్తగతమయ్యాక అసైన్డ్ భూములకూ భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ జీఓ–41ను టీడీపీ ప్రభుత్వం జారీచేసింది. ఈ కుట్ర ద్వారా 950 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ భూదోపిడీకి మూలమైన జీఓ–41 జారీ వెనుక అసలు కుట్ర తాజాగా బయటపడింది. కేబినెట్ ఆమోదం లేకుండానే జీఓ.. అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీఓ–41 జారీచేయడం వెనుకనున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి.. రాజధాని అమరావతి ఏర్పాటుకోసం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సీఆర్డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ, అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ–41ను తీసుకొచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా జీఓ–41ను అడ్డదారిలో జారీచేసేసింది. ఎందుకంటే కేబినెట్లో తీర్మానం చేయాలంటే అందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే కేబినెట్ను బైపాస్ చేసి జీఓ జారీచేసింది. తద్వారా.. మంత్రివర్గం ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది. నారా, నారాయణే కుట్రదారులు.. ఇక నిబంధనలకు విరుద్ధంగా జీఓ–41ను అప్పటి పురపాలక–సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016, ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016, మార్చి 22న సీఎం హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–రాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే.. అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీఓ–41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు సిట్ దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీఓ–41 జారీచేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అలా జారీచేసిన జీఓ–41తో అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్టకొట్టింది. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు
-
రెండో రోజు నారాయణ అల్లుడు పునీత్ సీఐడీ విచారణ
-
రేపు మళ్లీ విచారణకు రావాలని పునీత్ కు సీఐడీ నోటీసులు
-
IRR కేసులో నారాయణ అల్లుడు పునీత్ ను విచారిస్తున్న సీఐడీ
-
నారాయణ అల్లుడిని విచారిస్తున్న సీఐడీ
-
సీఐడీ విచారణలో నారాయణ అల్లుడు..
-
నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
-
నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీస్ క్వాష్ చేయాలన్న పునీత్ పిటిషన్ను కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్ను హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. కొత్త కోణాలు వెలుగులోకి టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్మెంట్లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్మెంట్నే మాస్టర్ప్లాన్లో పొందుపరచాలని షరతు విధించారు. అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు. చదవండి: తోడు దొంగల ‘రింగ్’! -
IRR కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడికి సీఐడీ నోటీసులు