Janasena
-
బలం లేకపోయినా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం తిరుపతిలో అరాచకం సృష్టిస్తోంది. ఏడాది మాత్రమే ఉండే ఈ పదవిని బలం లేకపోయినా సరే దక్కించుకోవాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి శేఖర్రెడ్డి, మరి కొందరు కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసానికి తెగబడింది. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేయించింది. తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి, సాధారణ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు.కొత్త డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 3న జరగనున్న ఎన్నిక కోసం వైఎస్సార్సీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్రెడ్డిని పోటీలోకి దింపింది. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఉన్నారు. టీడీపీ కేవలం ఒక డివిజన్లో మాత్రమే గెలిపొందింది. మరో డివిజన్ ఎన్నికపై కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. 9 మంది కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీ, జనసేన వైపు తిప్పుకుంది. అయినా వైఎస్సార్సీపీకి 39 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ లెక్కన న్యాయంగా డిప్యూటీ మేయర్ పదవి వైఎస్సార్సీపీదే. బలం లేదని తెలిసినా బలవంతండిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన బలం లేకున్నా, అరాచకానికి పాల్పడి అయినా దక్కించుకునేందుకు కూటమి పార్టీల నేతలు అరాచకాలకు తెరలేపారు. 2 రోజుల క్రితం కార్పొరేçÙన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తుల వివరాలు, పాత కేసుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేశారు. మిగిలిన కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ‘అంతు చూస్తాం.. ఆస్తులను ధ్వంసం చేస్తాం. కేసులు బనాయిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. మరో వైపు పోలీసులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి కుటుంబ సభ్యుల వివరాలు చెప్పండని అడిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరూ వారి డిమాండ్లకు ససేమిరా అనటంతో విధ్వంసానికి దిగారు. రెవిన్యూ, కార్పొరేషన్ అధికారులు శనివారం ఉదయం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు అంటూ శేఖర్రెడ్డి, మరికొందరు కార్పొరేటర్లకు చెందిన భవనాలు కూల్చేందుకు జేసీబీలను మోహరించారు.అలిపిరి పోలీస్టేషన్ సమీపంలోని శాంతినగర్లోని భవనం కూల్చేస్తామని పుకార్లకు తెరతీశారు. వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో.. శ్రీనివాసం సముదాయం వెనుక డీబీఆర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనంలో రెండు గదుల గోడలను కూల్చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుని నిరసనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు శాంతినగర్లోని భవనం ప్రహరీ గోడను కూల్చివేశారు. నిర్బంధం.. ఆపై అరెస్ట్లు అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, వందలాది మంది పార్టీ శ్రేణులతో కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. దౌర్జన్యానికి దిగి తిట్ల పురాణం అందుకున్నారు. ఇద్దరు కార్యకర్తలను గొంతు నులిమి దాష్టీకాన్ని ప్రదర్శించారు. మేయర్ను సైతం నెట్టుకుంటూ అరెస్ట్ చేశారు. భూమన అభినయ్రెడ్డిని నిర్భందించి భవనంలోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. బయటకు లాగి పడేసి అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలను బూతులు తిడుతూ చొక్కాలు పట్టుకుని లాక్కెళ్లారు. మహిళల పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో మహిళా పోలీసులను రప్పించి అరెస్ట్ చేయించారు. అరుపులు, కేకలు, పోలీసు వాహనాల సైరన్ మోతలు, డ్రోన్ల కదలికలు, పోలీసుల కవాతుతో ప్రజలు హడిలిపోయారు. పార్టీ శ్రేణులను కట్టడి చేసే క్రమంలో స్థానిక ద్విచక్రవాహన దారులపైనా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ ఎన్నిక పర్యవేక్షణ కోసం నేరుగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగడం విస్తుగొలిపింది. ఈ నేపథ్యంలో విధ్వంసకాండతో తీవ్ర ఒత్తిడికి గురైన వైఎస్సార్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్రెడ్డి.. మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి సమక్షంలో రాత్రికి రాత్రి కూటమిలో చేరిపోయారు. దీంతో తమ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ లడ్డూ భాస్కర్రెడ్డిని ప్రకటించింది.ప్రజాస్వామ్యం ఖూనీకి కూటమి సైసాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి అధికార టీడీపీ వెనకాడటం లేదు. టీడీపీ చేస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకొని దీటుగా సమాధానం ఇవ్వడానికి వైఎస్సార్సీపీ సమాయాత్తమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్/డిప్యూటీ చైర్మన్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. అయినా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి ఆ స్థానాలను దక్కించుకోవాలని అధికార టీడీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలతో పాటు మరో 7 మున్సిపాలిటీల్లో 3 చైర్మన్లు, 5 వైస్ చైర్మన్ స్థానాలు ఖాళీ కావడంతో వాటిని భర్తీ చేస్తున్న విషయం విదితమే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆ స్థానాలను దక్కించుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా విప్ జారీ చేయడంతో పాటు అవసరమైతే పోటీ క్యాంపులు నడపడానికీ సమాయాత్తమవుతోంది. టీడీపీ ప్రలోభాలకు లొంగి, గెలిచిన పార్టీని కాదని కూటమి పార్టీలకు ఓటేస్తే.. అనర్హత వేటు పడుతుందని వైఎస్సార్సీపీ చెబుతోంది. విప్ ధిక్కరించిన వారి మీద అనర్హత వేటు వేయించడానికి న్యాయ పోరాటం కూడా చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. -
ఇప్పుడు అదే మాట పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ‘‘గతంలో వైఎస్సార్సీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.. రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది...అయినా సరే ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన చట్టంలో గల అంశాలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు. అయితే... ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది.. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు...?’ అంటూ ఎక్స్ వేదికగా రోజా ప్రశ్నించారు. గతంలో... వైసిపి ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని @PawanKalyan అన్నారు.అప్పట్లో ... కేంద్రంలో @BJP4India ప్రభుత్వం పూర్తి…— Roja Selvamani (@RojaSelvamaniRK) February 1, 2025 -
కర్నూలు జిల్లా ఆందోనిలో టీడీపీ, జనసేన బాహాబాహీ
-
టీడీపీ, జనసేన బాహాబాహి
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్షిప్ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద గుమిగూడారు.నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్షిప్లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విషయంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్షిప్ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్ పోలీసులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు. -
ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతయర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
‘నువ్వు మా పాలేరువి రా’
రామవరప్పాడు: ‘ఒరేయ్.. తోలు తీస్తా, నువ్వు ఎవడవిరా మాకు చెప్పడానికి.. ఉద్యోగం నుంచి తీయించేస్తా, మా కింద పాలేరువి’ అంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ ఎనికేపాడు పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ను బూతులు తిట్టడం తీవ్ర దుమారం రేపింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు శివాలయం పల్లాల్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా, మహత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణలో మంగళవారం జనసేన నాయకులు రణరంగం సృష్టించారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు హాజరైన చలమలశెట్టి రమేష్ రంకెలేస్తూ వీధి గూండా మాదిరి పంచాయతీ కార్యదర్శిని బూతులు తిట్టి, కాలర్ పట్టుకుని తొయ్యడం కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై ఈ రీతిగా చేయడాన్ని పలువురు గ్రామస్తులు ప్రశ్నించడంతో గొడవ కాస్తా పెద్దదైంది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల జనసేన పారీ్టలో చేరిన గ్రామానికి చెందిన టంకసాల సుబ్బారావు, ఆయన కుమారుడు ఉపసర్పంచ్ టంకసాల శివ ప్రసాద్ వంగవీటి మోహన్ రంగా, గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారు. బీసీ నాయకుడైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని జనసేన మండల నాయకుడు పొదిలి దుర్గారావు సూచించారు. అయితే టంకసాల సుబ్బారావు, టంకసాల శివప్రసాద్లు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి రంగా, గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు నియోజకవర్గ జనసేన నేత చలమలశెట్టి రమేష్ను ఆహ్వనించారు. గ్రామంలోని జనసేన నాయకులకు గాని, పక్క గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలకు గాని సమాచారం ఇవ్వకుండా ఆవిష్కరణ పూర్తి చేశారు. దీనిని జనసేన పార్టీలోని మరో వర్గం ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్ర స్థాయిలో తోసుకున్నారు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ ఘటనా స్థలానికి చేరుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించగా.. రెచ్చిపోయిన చలమలశెట్టి రమేష్ కార్యదర్శిపై విరుచుకుపడ్డారు. షర్టు కాలర్ పట్టుకొని దుర్భాషలాడారు. బుజ్జగిస్తున్న కూటమి నాయకులు గ్రామస్తుల మధ్య ప్రభుత్వ ఉద్యోగికి తీవ్ర అవమానం జరగడంతో కార్యదర్శి విద్యాధర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కలుగజేసుకుని బుజ్జగిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కేసుల వరకూ వెళ్ల వద్దని సముదాయించారు. దీంతో తనపై జరిగిన దాడిని వివరిస్తూ మండలాధికారులకు విద్యాధర్ ఫిర్యాదు చేశారు. -
రెచ్చిపోయిన జనసేన నేత.. గ్రామస్తులపై దాడి
సాక్షి,చిత్తూరుజిల్లా:జీడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలో జనసేన నాయకుడు లోకనాథ రెడ్డి రెచ్చిపోయాడు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. గంగమాంబ పురం పరిధిలోని సర్వే నెంబర్ 202/5లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని లోకనాథరెడ్డిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు.దీంతో లోకనాథ్రెడ్డి గ్రామస్తులు,అధికారులపై దాడికి దిగాడు. రెవెన్యూ అధికారులు,గ్రామస్తులపై ఏకంగా మారణాయుధాలతో దాడి చేశాడు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. -
పవన్కు కొత్త ట్విస్ట్.. అన్నా ఎన్నాళ్లీ అవమానాలు!
అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.మనం గేమ్లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.వాస్తవానికి పవన్ సపోర్ట్తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్ లోలోన బాధ పడుతోంది.పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్లు నడుపుతున్నారని. కేడర్ ఆవేదన చెందుతోంది.తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరుతిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది. -సిమ్మాదిరప్పన్న. -
లోకేష్ జన్మదిన వేడుకల్లో రచ్చ.. జనసేన కార్యకర్తపై దాడి
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే భాగస్వాములైన జనసేన(Janasena), బీజేపీ నాయకులకు పలుచోట్ల అవమానాలు తప్పలేదు. ఇప్పటికే పలుచోట్ల పచ్చ నేతలు రెచ్చిపోయి కూటమి నేతలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తను టీడీపీ(TDP) కార్యకర్తలు చితకబాదారు. ఈ క్రమంలో అతడిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో గురువారం రాత్రి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) జన్మదిన వేడుకల్లో బ్యానర్లు కట్టినందుకు, కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన కార్యకర్తను టీడీపీ నాయకులు చితకబాదారు. కందూరులో జనసేన కార్యకర్త మునీర్ బాషా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బ్యానర్లు వేసి జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు మునీర్ బాషాను ‘నువ్వెవడురా రావడానికి’ అంటూ చితకబాదారు.ఈ ఘటనను చూసిన ఆయన తల్లి బిడ్డపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెపై కూడా దాడి చేయడంతో పిడికిలి దెబ్బలకు ఆమె పళ్లు రాలిపోయాయి. దీంతో, వెంటనే స్థానికులు పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చిన్నారాయల్కు సమాచారం అందించారు. ఆయన తన అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన మునీర్ బాషాను, ఆయన తల్లిని, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.గాయపడిన జనసేన కార్యకర్త మునీర్ తాజాగా మాట్లాడుతూ..‘గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కందూరులో బ్యానర్లు కట్టొద్దని బెదిరించారు. నేను వాటిని లెక్క చేయలేదు, అప్పుడు నాపై దాడి చేసి గాయపరిచారు, పవన్ కళ్యాణ్ బ్యానర్లు చింపారు. నిన్న రాత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా నాపై దాడి చేశారు, నా తల్లిని గాయ పరిచారు. నన్ను చంపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు?. నన్ను ఊరు విడిచి వెళ్ళాలి అని బెదిరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ జనసేన పార్టీ నాయకుల్ని, నన్ను ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ వాళ్ళ కంటే వైఎస్సార్సీపీ నాయకులే బెస్ట్ అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో మరోసారి కలకలం
-
కూటమిలో కుమ్ములాటలు
-
సోషల్ మీడియాలో.. డిప్యూటీ సీఎం రచ్చ
సాక్షి, భీమవరం: మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు అందుకున్న రాగం కూటమిలో కుంపటి రాజేసింది. తమ నాయకుడి ప్రాధాన్యతను తగ్గించేందుకు టీడీపీ కూటమి ధర్మాన్ని కాలరాస్తోందని జన సైనికులు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆ రెండు పారీ్టల అధిష్టానాలు ప్రకటించినా తగ్గేదే లేదంటూ సోషల్ మీడియా వేదికగా పోటాపోటీగా పోస్టులు పెట్టుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో జనసేన.. ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకులలో టీడీపీ పోటీ చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ కారణమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమ అధినేత సీఎం కావాలని జనసేన పార్టీ కేడర్ ఆశించింది. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టినా రాష్ట్రానికి ఒక్కరే డిప్యూటీ సీఎం కదా అని కేడర్ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రచారానికి తెరలేపడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు పారీ్టల అధిష్టానాల సూచనల నేపథ్యంలో పబ్లిక్గా ఎవరూ స్టేట్మెంట్లు ఇవ్వకపోయినప్పటికీ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ టాపిక్ పైనే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పవన్ ప్రాధాన్యం తగ్గించేందుకే.. దీనిపై జనసేన కేడర్ రకరకాల పోస్టులు, కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. కూటమిలో పవన్ ప్రాధాన్యతను తగ్గించేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి గెలుపులో ఆయన పాత్రని అప్పుడే మీరు మర్చిపోయారా అని ఒకరు పోస్టు పెట్టగా, డిప్యూటీ సీఎంగా లోకేష్ ఓకే.. పవన్కల్యాణ్ని సీఎం చేస్తారంటూ ఒక నెటిజన్ పోస్టు చేశారు. టీడీపీ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారంటూ, ఈ ఎనిమిది నెలల్లో విద్యా శాఖ, ఐటీ శాఖల్లో వచ్చిన అభివృద్ధి ఏమిటి తమ్ముళ్లూ.. అన్ని ప్రశి్నస్తూ ఒకరు, కూటమి ధర్మం ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం.. ఇది పాటించండి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మంత్రి లోకేష్పై సెటైరికల్గా రీల్స్ పోస్టు చేస్తున్నారు.పవన్కు పదవులు లెక్క కాదు ..నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీని చిన్నచూపు చూస్తున్నారని, నీటి సంఘాల నియామకాల్లో టీడీపీ ఒంటెద్దు పోకడగా వ్యవహరించిందని ఇటీవల ఒక సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి ఈ టాపిక్ పైనా ఓ పోస్టు పెట్టారు. మళ్లీ చెబుతున్నాం.. పదవులు మీకు గొప్ప.. ఆయనకు కాదు.. పదవి ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా ఆయనకేం ఊడదు.. అంటూ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఉండి నియోజకవర్గానికి చెందిన ఒక పొలిటికల్ వాట్సప్ గ్రూపులో ఆయన పేరిట వచ్చిన పోస్టు వైరల్ అవుతోంది. పవన్కళ్యాణ్కు మద్దతుగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.లోకేష్ కు మద్దతుగా టీడీపీ కేడర్ ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లోని టీడీపీ, జనసేన పారీ్టల పేరిట, పవన్ కల్యాణ్, లోకేష్ అభిమానుల పేరిట ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు, లోకల్ వాట్సప్ గ్రూపులు, ఫేస్బుక్, యూట్యూబ్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. యువగళం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలని కొందరు కోరితే, డిప్యూటీ సీఎంగా చేస్తే తప్పేంటని కొందరు, సీఎం చేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. -
భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్గా ఉండండమ్మా
ఆగండ్రా బాబు.. అసలే అయన తిక్కలోడు.. ఏ క్షణానికి కండువా విసిరేసి వెళ్ళిపోతాడో తెలీదు.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి.. వచ్చి ఏడాది కూడా కాలేదు ఇప్పుడే మీరు చినబాబు డిప్యూటీ సీఎం .. చినబాబు డిప్యూటీ సీఎం అని కేకలు వేయకండి.. కొన్నాళ్ళు ఆగండి .. పరిస్థితులు చిన్నగా సర్దుకున్నాక అన్నీ చేద్దాం.. ముందే గాయిగాత్తర చేయకండి. అసలే తిక్కలోడికి ఢిల్లీ సపోర్ట్ ఉంది.. వాళ్ళ సపోర్ట్ టోన్ మనం గెలిచాం.. అప్పుడే అల్లరల్లరి చేస్తే లేనిపోని బాధలు. కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి అని తెలుగుదేశం అధిష్టానం పార్టీ వీరవిధేయులైన ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులకు సూచించింది.వాస్తవానికి ఇది అధిష్టానానికి తెలిసి.. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందో..లోకేష్ పట్ల భక్తిభావం పెల్లుబికి.. దాన్ని అణచుకోలేక అంటున్నారో తెలియదు కానీ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అర్జంట్ గా లోకేష్ ను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన పిఠాపురం వర్మ కూడా అదే రాగం ఎత్తుకున్నారు. ఇది గత రెండు నెలలుగా ఉధృతంగా సాగింది. ఐతే ఇన్నాళ్లుగా ఆ భజనను చూస్తూ ఊరుకున్న జనసైనికులు గత కొద్దిరోజులుగా నోరువిప్పుతూ సోషల్ మీడియాలో టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ ఇవ్వండి ఫర్లేదు కానీ అదే టైములో పవన్కు సీఎంగా బాధ్యతలు ఇవ్వండి.. అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు.. అంతేకానీ పవన్ను డిప్యూటీ సీఎంగా ఉంచుతూ మళ్ళీ లోకేష్కు అదే హోదా ఇస్తేమాత్రం గొడవలైపోతాయి అన్నట్లుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ జనసైనికులను పవన్ సైతం నియంత్రించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు.. జనసేనలో సీట్ల సర్దుబాటు వంటివన్నీ పవన్ దగ్గరుండి మరీ కుదిర్చారు. పవన్ లేకపోతె మొన్న తెలుగుదేశం గెలుపు అసాధ్యం అనేది అందరికి తెలిసిందే అలాంటపుడు మా పవన్ను కాదని వేరే వాళ్లకు.. అదే లోకేష్కు ఎలా డిప్యూటీ ఇస్తారు అనేది జనసేన వాదన. దీంతోబాటు కేంద్రం సైతం పవన్ తోబాటు ఇంకో డిప్యూటీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొన్న అమిత్ షా వచ్చినపుడు సైతం లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగా అయన తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేంద్రం దన్ను సంపూర్ణంగా ఉన్న పవన్ తో గొడవ ఎందుకు.. అందాకా సైలెంట్ గా ఉండండి అని తెలుగుదేశం తన క్యాడరుకు ఒక మెసేజ్ పంపింది.ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పార్టీ శ్రేణులకు ఒక సందేశం పంపింది. ఇకముందు ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ డిమాండ్లు చేయకండి. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకండి అంటూ గేటు వేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికారం రుచి మరిగిన నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టి. ఇరిటేట్ చేసేలా ఏదీ చేయొద్దని.. అలాగైతే కూటమిలో చిచ్చు రేగుతుందని చంద్రబాబు గ్రహించి క్యాడర్ను నియంత్రించినట్లు చెబుతున్నారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది అనే పవన్ కు తిక్కరేగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారన్నమాట. --సిమ్మాదిరప్పన్న -
కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?
ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.కొద్దికాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్కు చెక్ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.నారా లోకేష్కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్, పవన్ కళ్యాణ్ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.ఇక, సీఎం పదవి లోకేష్కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్గా తగ్గించారు. ఇక లోకేష్ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్కు చెక్ పెట్టినట్లు కూడా ఉంటుంది.ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్ల మధ్య రాజకీయ వార్గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్ను సీఎంగా చేసి, లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ ‘డిప్యూటీ’ కాదు.. కాబోయే సీఎం!
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు చేసిన హడావుడితో కూటమిలో కాక రేగడంతో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడొద్దంటూ దావోస్ నుంచి పార్టీ నేతలను హెచ్చరించారు. తన సమక్షంలోనే పార్టీ నేతలు ఈ డిమాండ్ చేసినప్పుడు స్పందించని చంద్రబాబు... రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి ఉండడంతో దావోస్ నుంచి స్పందించడం గమనార్హం. మరోవైపు ఇదే వేదికగా మంత్రి టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి కాబోయే సీఎం లోకేశేనని తాజాగా వ్యాఖ్యానించడం టీడీపీ పెద్దల రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యూటీ కాదు.. కాబోయే సీఎం టీడీపీ పెద్దల రాజకీయాలు కూటమి పార్టీల్లో రక్తి కట్టిస్తున్నాయి. డిమాండ్ చేసేదీ.. వార్నింగ్లు ఇచ్చేదీ పచ్చ నేతలేనని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. లోకేశ్ని డిప్యూటీ సీఎంగా చేయాలని నాలుగు రోజులుగా టీడీపీ నేతలు పోటీలు పడి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో మొదలైన ఈ డిమాండ్ల పర్వం.. తాజాగా దావోస్కి చేరింది. కాబోయే సీఎం లోకేశేనని మంత్రి టీజీ భరత్ ప్రకటించేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి ఇదంతా టీడీపీ పెద్దలు ఆడుతున్న డ్రామాగా స్పష్టమవుతోంది. స్పందన తెలుసుకునేందుకే.. లోకేశ్ను డిప్యూటీ సీఎంగా చేయాలని మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ సందర్భంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి.. సీఎం చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు వారించలేదు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తదితరులు ఇదే పల్లవి వినిపించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ఈ అంశం హోరెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. దీన్నిబట్టి ఆయన ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు ఈ డిమాండ్లు చేస్తున్నట్లు వెల్లడైంది. తనయుడికి ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమై కూటమిలో నేతల స్పందన తెలుసుకునేందుకే తన పార్టీ నేతలతో డిమాండ్లు చేయించినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కూటమిలో చిచ్చు రగిలే పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా రూటు మార్చారు. ఇదంతా చంద్రబాబు, ఆయన తనయుడు ఆడిస్తున్న నాటకాలేనని జనసేన నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.జన సైనికులు ‘రివర్స్’.. టీడీపీ నేతల డిమాండ్లపై జనసేనకు నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన విశ్వం రాయల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు తమ నేత పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలనే వాదన వినిపించారు. పవన్ సీఎం కావాలని తమకు కోరిక ఉన్నట్లు తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చెప్పారు. సోషల్ మీడియాలో ఇది రెండు పార్టీల మధ్య పెద్ద వార్గా మారిపోయింది. లోకేశ్ డిప్యూటీ సీఎం ఏంటని జనసేన శ్రేణులు సెటైర్లు వేస్తుంటే.. పవన్కు సీఎం పదవా? ఆయనకు అంత సీనుందా? అంటూ టీడీపీ నేతలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నారు. -
పవన్ను సీఎం చేయాలి.. జనసేన నేత డిమాండ్
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను డిప్యూటీ సీఎంను చేయాలనే వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు జనసేన నేతలు కౌంటరిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి వ్యాఖ్యలపై జనసేన(janasena) నాయకుడు కిరణ్ రాయల్ కౌంటిరచ్చారు. తాజాగా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కూడా ఉంది. టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. తమ నేత భద్రత పార్టీకి ఎంతో అవసరం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, జనసేన నేత వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరోవైపు.. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా విశాఖలో హోంమంత్రి అనితను లోకేష్కి డిప్యూటీ సీఎం పదవిపై మీడియా ప్రశ్నించింది. ఈ క్రమంలో నారా లోకేష్కి మద్దతు తెలపని హోంమంత్రి అనిత. ఈ సందర్బంగా అనిత.. అంతా దైవేచ్చ.. నుదుటి మీద రాసి పెట్టి ఉందేమో చూద్దాం.. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. -
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదవుండదన్నట్లు.. భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయనేందుకు ఈ ‘ఒప్పందం’ అతికినట్లు సరిపోతుంది. సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరకున్నా, ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆ పార్ట్నర్ అడగడం.. ఈ పార్ట్నర్ మద్దతు పలకడం.. పొలిటికల్ పార్ట్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. కనీసం ఈ–మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా 1,200 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార ప్రముఖులు, ఇటు అధికారులు నివ్వెరపోతున్నారు. సాక్షి, అమరావతి: టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఈ పేరు చాలా మందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో(Pawan Kalyan) పలు సినిమాలు తీయడమే కాకుండా, ఆయనతో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది ఈయనే. టీజీ విశ్వప్రసాద్కు ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్) తొలి దశలో 15 చిత్రాలు నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ‘బ్రో’ అనే సినిమా కూడా తీశారు. అందులో అప్పటి జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిత్వ హననం చేసే విధంగా నటుడు పృథ్వీతో ఓ సీన్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా 2024 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు. అయితే ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు సమకూర్చినట్లు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో హైదారాబాద్లో విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇవ్వడంపై భారీగా చర్చ జరిగింది. పవన్కళ్యాణ్ పార్టనర్ అయినందునే ఆయనకు రూ.కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేయడానికి ఫైళ్లు చకచకా కదిలాయని, ఆ వెంటనే ఒప్పందం కుదిరిందనే వాదన వినిపిస్తోంది. అనుభవం లేని కంపెనీతో ఒప్పందంపీపుల్ టెక్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ స్క్రీన్స్, పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పీటీజీ వెంచర్స్, వీ జోన్ హాస్పిటల్స్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీజీ విశ్రప్రసాద్ ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండానే ఈ–మొబిలిటీ పార్కుతోపాటు ఈ– స్కూటర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ–మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీని కూడా ఎంచుకోలేదు. తైవాన్, కొరియా, చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొన్నారు. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆర్థికస్థితి పీపుల్ గ్రూపుకు లేనే లేదు. అయినా ఈ విషయాలు ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూపుతో ఒప్పందం చేసుకుంది.కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1,200 ఎకరాలను రూ.1,800 కోట్లతో ఈ–మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు, యాంకర్ (ప్రధాన) కంపెనీగా పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ రూ.300 కోట్లతో ఈ –మొబిలిటీ యూనిట్ను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.సచివాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ను కలిసిన విశ్వప్రసాద్ రూ.6 వేల కోట్లు పైమాటేహైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధికి 2,621 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఆ భూమి పక్కనే 1,200 ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్కు ఏర్పాటు చేస్తామంటూ పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకోవడం.. అనంతరం ఆ కాగితాలతో విశ్వప్రసాద్.. డిప్యూటీ సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఎకరం రూ.కోటి వరకు ఉన్న ఈ భూమి ధర.. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందితే రూ.ఐదారు కోట్ల వరకు వెళుతుంది. ఈ లెక్కన 1,200 ఎకరాల భూమి విలువ రూ.ఐదారు వేల కోట్లకు పైగానే ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశం తెలుగుదేశం పార్టీతో పాటు పరిశ్రమల శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.కారు చౌకగా కొట్టేసే యత్నంఓర్వకల్లు వద్ద సుమారు 9,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తొలి దశలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిక్డిక్ట్ నిధులతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం పారిశ్రామిక పార్కు కోసం 2,621 ఎకరాల భూమి బదలాయింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులు మొదలైతే అక్కడ భూముల రేట్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి 80 లక్షల నుంచి కోటి రూపాయల పైనే పలుకుతోంది. ఒకసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి అయితే ఈ రేట్లు నాలుగైదు రెట్లు పెరుగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ సీఎం వ్యాపార భాగస్వామి కారు చౌకగా ఈ భూములను కొట్టేసే విధంగా పథకం రూపొందించారు. పీపుల్ టెక్ పేరుతో ఈ మొబిలిటీ పార్కును ఏర్పాటు చేస్తున్నామంటూ ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షలకు అప్పగించే విధంగా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పుతున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడక్కడ ఏపీఐఐసీనే ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలకు విక్రయిస్తుంటే అత్యంత కారుచౌకగా భూములను అప్పగించడానికి రంగం సిద్ధం కావడం వెనుక ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్కళ్యాణ్ వ్యాపార భాగస్వామికి రూ.వేల కోట్ల విలువైన భూములను అత్యంత కారుచౌకగా ధారాదత్తం చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో జనసేన నాయకులు
-
క్రికెట్ బెట్టింగ్ 140 కోట్లు!.. కూటమి ఎమ్మెల్యేల సహకారం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.క్రికెట్ బెట్టింగ్లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.ఇంకా లెక్కతేలాల్సిందే..!వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదుపులోకి తీసుకోకుండా..!సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఎవరీ కాకినాడ కార్తీక్!ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. -
జనసేన నేతల బరితెగింపు
-
ఇసుక కోసం టీడీపీ, జనసేన సిగపట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు, సిద్దవటం మండల జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్లోనే ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్కి గనులు, భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5.30 లోగా టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరువర్గాల నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండరు పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది. తమ సొంత మండలమైన సిద్దవటంలో ఇసుక టెండరు తమకే దక్కాలని అతికారి కృష్ణ వర్గీయులు పట్టుపట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అతికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండరు ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి, అతికారి కృష్ణ వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారి తీసింది. ఒక దశలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వన్టౌన్ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలోనే టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు. టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారా అనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదు. -
జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ను నిలదీసిన టీడీపీ, జనసేన నేతలు
-
‘బరి’తెగించిన కూటమి నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: సంక్రాంతి (Sankranti) పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు(Cockfighting), జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది.పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి నేతల. ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా: జీవహింస వద్దన్న కోర్టు మార్గదర్శకాలను కూటమి నేతలు లెక్కచేయడం లేదు. యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూదాలను ప్రోత్సహిస్తున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పందెం బరులను ప్రారంభించారు. పోలీసుల మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం స్టాళ్లు ఏర్పాటు చేసి భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ఏరులై పారుతోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగాచేతులు మారింది.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కోనసీమలోనూ భీమవరం తరహా పందేల ఏర్పాట్లు
సాక్షి, అమలాపురం: కోడిపందేలంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతమే గుర్తొస్తుంది. ఈసారి భీమవరం తరహా ఏర్పాట్లను తలదన్నేలా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పందేలకు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్లను తలపించేలా.. పెద్దపెద్ద సినిమాల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ల మాదిరిగా కోనసీమలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు, గుండాటలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఇక్కడ పెద్దఎత్తున కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుండాటలు నిర్వహించారు. ఈసారి అంతకుమించి మురమళ్లల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) స్వగ్రామం మురమళ్ల కావడం, ఆయన అశీస్సులు పుష్కలంగా ఉండటంతో నిర్వాహకులు రెండు ఫుట్బాల్ మైదానాలంత స్థలంలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల స్థలంలో 10 వేల మందికి పైగా కూర్చుని పందేలు చూసేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే 500 మంది వీవీఐపీల కోసం సోఫా సెట్లు, కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు బరుల్లో పందేలు నిర్వహించనున్నారు. పందేలు అందరికీ కనిపించేలా చుట్టూ భారీ ఎల్సీడీలు ఏర్పాటు పెడుతున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు కూడా పెద్దఎత్తున నిర్వహించనున్నారు. కోనసీమ రుచులను చూపించేందుకు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని పేరొందిన బిర్యానీలు, మాంసాహారం, ఆత్రేయపురం పూతరేకులతో పాటు పలు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.ఆంధ్రా గోవా అంటూ..ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం బీచ్ను ‘ఆంధ్రా గోవా’గా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తరచూ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి పండుగ మూడు రోజులు బీచ్వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు సమీపంలోనే కోడి పందేలు, గుండాటలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వేలం పాటలు కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రా గోవా అని పిలుస్తున్నందుకు పండుగ రోజులలో బీచ్ను గోవా తరహాలో జూద కేంద్రంగా మారుస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కోడి పందాలు, బెట్టింగ్ లు వెంటనే ఆపేయ్.. చింతమనేనికి జనసేన ఇంచార్జ్ వార్నింగ్