Janasena
-
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లోనే చెరిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. ఫాల్స్ డీఎన్ఏ పెట్టేశారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు కీలకం. నిర్థారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ల ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేం’’ అంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. -
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
-
రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ 'జనసేన' బెదిరింపు
నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..! సీఐ నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫొటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్స్టేషన్ బాత్రూమ్లో పడేశారు. స్టేషన్లో చంపేసి, ఇద్దరు పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు’ అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..!’ అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశించారు. తమ బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే..రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ జనసేన తూర్పు ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు బెదిరిస్తున్నారని కంటతడి పెట్టారు. ‘మేం జనసేనకు చెందిన వాళ్లమే.. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఈ విషయంలో స్పందించాలి..’ అని సాయికృష్ణ చిన మేనమామ ముళ్లపూడి నవరంగ్ కోరారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులైతే... చంపి తగలబెడతారా? సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడని, ఫొటో చేయించి దండేసుకో అన్నాడని, చివరకు కనిపించకుండా చేశాడంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా బిడ్డకోసం పోలీస్ స్టేషన్కు వెళ్లా.. అక్కడ కుర్రాళ్లను కొడుతుంటే తట్టుకోలేకపోయా. నా కుమారుడిని చూపించమంటే చూపించలేదు. నా కుమారుడిని కొట్టి బాత్రూమ్లో పడేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్లో చంపేసి.. ఇద్దరు పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి ఎవడు ఇచ్చాడు అధికారం చంపేయమని? పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా? నాకు మద్దతుగా నిలిచిన వారిపై నిందలు వేస్తున్నారు. నా కుమారుడికి రాజకీయాలు అంటగట్టొద్దు. న్యాయం చేయమని కోరుతున్నాం’ అని విజయలక్ష్మి విలపించారు.మాఫియా, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? పోలీసులు అన్ని కేసులు ఉన్నాయి.. ఇన్ని కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాడిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఫోటోల్లో గొడ్డలి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. కోర్టు వాయిదాకి వచ్చి కనిపిస్తే కొడతారని భయపడి మార్కాపురం వెళ్లి జొమాటోలో పనిచేస్తూ రోజుకు రూ.350 ఆదాయంతో బతికాడు. అంత పెద్ద మాఫియా డాన్, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? గంజాయి ఫాల్స్ కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవీ నిరూపణ కాలేదు. మా పిల్లోడిని మాకు అప్పగించాలి. చనిపోతే బాడీ అయినా ఇవ్వండి. పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్దకి వచ్చి కేసులు ఉన్నాయని నిరూపించాలి. – ముళ్లపూడి నాగేశ్వరరావు, సాయికృష్ణ మేనమామరెండు కేసులే ఉన్నాయి: కనకదుర్గ, అడ్వొకేట్ సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో వాయిదాలకు హాజరు కాలేదని తీసుకొచ్చి కొట్టారు. బందర్ రోడ్డులో కూర్చుంటా. పోలీసులు వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపించాలి. సాయికృష్ణకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ప్రశ్నిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అనేక కేసుల్లో ఆందోళనలు చేశారు. మా అబ్బాయి విషయంలో ఏం చేస్తారు? మేమంతా జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్, లోకేశ్ కోసం పని చేశాం. పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలి. సాయికృష్ణను స్టేషన్కు తీసుకొచ్చి చంపేస్తే డీజీపీ అడగరా..? కేసు సెటిల్ చేసుకుందామని, రూ.50 లక్షలు ఇప్పిస్తామని జనసేన నేత అమ్మిశెట్టి వాసు బెదిరించినా మేం ఒప్పుకోలేదు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న సీఐతో పాటు అశోక్, బాబూరావు, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, మరికొంతమంది స్టేషన్లో ఉన్న వాళ్లను సస్పెండ్ చేయాలి. కేసులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టి చంపేస్తారా? మావాడు రౌడీ అంటున్నారు. మీరు చేసిందేమిటి? మీరు హంతకులు కాదా? సామాన్యులకు న్యాయం జరగదా? అన్యాయం జరిగిందని మాకు అండగా నిలుస్తున్న వారికి పారీ్టలను అంటగడతారా? మాకు పారీ్టలు లేవు.. కులం లేదు. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకు న్యాయం చేయండి. విజయవాడలో వందల మంది రౌడీ షీటర్లు ఉన్నారు. కానీ మావాడినే తీసుకొచ్చి చంపేశారు. మేం రాజకీయాలు చేసే వాళ్లం కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, లోకేష్, హోం మంత్రి అనిత స్పందించాలి. మేం పనిచేసిన పార్టీ వాళ్లు మా కోసం ఏమీ చేయలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నారు. – ముళ్లపూడి నవరంగ్, సాయికృష్ణ మేనమామ -
కుక్కలకు ఇంచార్జ్ పదవులు ఇస్తారా..? లైవ్ లో పవన్ కళ్యాణ్ ను కడిగి పడేసిన సాయి కృష్ణ మేనమామ..
-
viral video: వాడికే దిక్కులేదు, పచ్చి బూతులు తిడుతూ జనసేన వీడియో
-
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్
-
కారులో గన్ తీసుకురండిరా.. కాల్చేద్దాం.. జనసేన MLAకు కార్యకర్త సవాల్
-
Balaraju: కారులో గన్ తీసుకురండిరా.. కాల్చేద్దాం
-
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
సాక్షి, ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బందిపై తాను దాడి యత్నం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను.. ఎమ్మెల్యేపై దాడి చేయగలనా అని ప్రశ్నించారు. తన బైక్ను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకే ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని చెప్పారు.అయితే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఎమ్మెల్యే, ఆయన అనుచరులే తనపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం "నేను చేసిన తప్పేంటి?" అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి తనను జైలుకు పంపించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన ఆరోపణలకు సంబంధించిన మూడు అంశాలను నిరూపించాలని వంశీ డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష ఇచ్చారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని వంశీ తెలిపారు. తన తరఫున కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఇతర కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై నియోజకవర్గంలోని జనసేన నాయకులు స్పందించాలని కోరారు. వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పోలవరం జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. -
కన్నీటి ఆవేదన! ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిక..
-
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చేశాడని పేర్కొంది. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్శేఖర్ దాడి చేశారు.బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయ్శేఖర్కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది. -
రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన తరఫున లింగమనేని రమేష్ దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వెల్లడించారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు
-
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
డబ్బులున్న వారికే టికెట్.. జెండా మోసిన కూలీలు బానిసలు..
-
పాపం లింగమనేని.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
-
పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేనలో కాక రేపుతోంది. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతుండగా.. జనసేనలో పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని మరోసారి తేటతెల్లమైందని, ఇలాగైతే పార్టీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అత్యధిక చోట్ల ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలకే సీట్లు దక్కాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. లాబీయిస్టు సానా సతీష్, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్కి పదవుల పందేరంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతూ ఆదివారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసినా రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీలో దళిత సామాజికవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిసారీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో వర్ల రామయ్య పేరును తెరపైకి తేవడం చివరకు సామాజిక సమీకరణాల పేరుతో పక్కనపెట్టి అవమానించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అనే విషయం మరోసారి రుజువైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకపోగా పదవుల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రామయ్య సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. యనమల గుర్రు.. కంభంపాటి కస్సు..! సీనియర్ నేత యనమల రామకృష్ణుడి బాధ వర్ణనాతీతమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పెద్దల సభకు పంపాలని పదేపదే ప్రాథేయపడినా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై యనమల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నారా లోకేష్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ధన బలం ఉన్న వారిని పార్టీ నేతలుగా చిత్రీకరించి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు సైతం తనను అవమానించారని ఆవేదనతో రగిలిపోతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని అయినప్పటికీ పదవుల విషయంలో వంచించారని ఆయన వాపోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, ఎంఏ షరీఫ్ తదితర నేతలు సైతం తమకు అన్యాయం చేశారని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఒక్క మహిళా కనపడలేదా? మూడు స్థానాల్లో టీడీపీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని మహిళా లోకం నిలదీస్తోంది. మహిళల కోసమే టీడీపీ ఉందని మహానాడులో తీర్మానాలు చేసి తీరా రాజ్యసభ సీటు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు. కార్పొరేట్ వైపే మొగ్గు.. తన కుమారుడి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న సానా సతీష్కి మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తాను లాబీయిస్టుల వైపే మొగ్గు చూపుతానని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సతీష్ వివాదాస్పద వ్యక్తి అని, అతడితో కలిసి తిరిగితే జనం ఏమనుకుంటారని ఎల్లో మీడియాకు చెందిన ఏబీఎన్ రాధాకృష్ణ తన తొలి పలుకులో ప్రశ్నించారు. టీడీపీలో సీనియర్లంతా వ్యతిరేకించినా సతీష్కు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి ఆయన రాజ్యసభకు పంపుతుండటాన్ని బట్టి తమ బంధం ఎంత బలమైందో రుజువు చేశారు. భాష్యం రామకృష్ణ కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నా ఆయనకే అవకాశం ఇవ్వడం ద్వారా కార్పొరేట్ శక్తులంటే తనకు మక్కువని చంద్రబాబు తేల్చేశారు. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ దురహంకారి కావడంతో పార్టీలో ఆయన పట్ల పూర్తి ఆమోదం లేదు. అందుకే పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల నుంచి చాలాకాలం క్రితమే ఆయన్ను తప్పించారు. అయితే లోకేష్కి సన్నిహితుడు కావడం, ధన బలం ఆధికంగా ఉండడంతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని తరచూ చెబుతూ తండ్రికి స్పీకర్ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని టీడీపీలో ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. నాలుగింటిలో రెండు సొంత వర్గానికే.. కూటమి తరఫున నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతుండగా రెండు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలోనూ వినిపిస్తోంది. జనసేన తరఫున సీటు పొందిన లింగమనేని, టీడీపీ తరఫున సీటు దక్కించుకున్న భాష్యం రామకృష్ణ.. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఆయనకు సన్నిహితులనే విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. విజయ్ సత్తా చూశాకైనా మారకుంటే ఎలా? జనసేన అంటే టీడీపీకి బీ టీమ్ అని ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా పార్టీకి దక్కిన రాజ్యసభ సీటును సైతం చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తికే కేటాయించడం పట్ల జన సైనికుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి ఓ బడా వ్యాపారవేత్తను పెద్దల సభకు పంపడం వెనుక అంతర్యమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతల్లో ఎవరికైనా ఆ పదవి ఇచ్చి ఉంటే జనసేన క్యాడర్ చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. ‘కష్టపడేవారికి గుర్తింపు లేకుండా.. పైరవీలు, ఆర్థిక అండదండలు ఉన్నవారికే పదవులు కట్టబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు? ఇలాగైతే జనసేన బలపడేదెలా?’ అంటూ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రెండేళ్లలోనే అధికారంలోకి రాగలిగిన సీఎం విజయ్ ఎక్కువగా కొత్త వ్యక్తులకే అవకాశం కల్పించారని.. దళపతి సత్తా, ఆ పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం చూసిన తర్వాత కూడా పవన్కళ్యాణ్ మారకపోతే ఎలా? అని జనసేన సైనికులు ప్రశ్నిస్తున్నారు. -
మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్
-
దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు..! పోతిన మహేష్ మాస్ వార్నింగ్!
-
నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే !
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి భర్తీ అవుతున్న నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. అధికారికంగా మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించుకున్నారు. కానీ, జనసేన అభ్యర్థిగా చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న లింగమనేని రమేష్ ని ఎంపిక చేయడంతో నాలుగు స్థానాలూ టీడీపీయే తీసుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి పొత్తులో భాగంగా నాలుగింటిలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీ చెరొక స్థానం పంచుకోవాల్సి ఉంది. కానీ, కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తమకు 3 సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీని ఒప్పించి టీడీపీకి చంద్రబాబు మూడు స్థానాలు కేటాయించుకున్నారు. గతంలో భర్తీ అయిన 4 స్థానాల్లో బీజేపీ రెండు తీసుకోవడంతో మిగిలిన ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున తన మనిషిని అభ్యర్థిగా పెట్టి మొత్తం నాలుగింటిని టీడీపీకే దక్కేలా చేసుకున్నారు. టీడీపీలో భారీ లాబీయింగ్ టీడీపీకి దక్కనున్న మూడు స్థానాల కోసం ఆ పార్టీలో పెద్దఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కి ఆ పదవి రెన్యువల్ చేయడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు స్థానాలకు మంత్రి నారా లోకేశ్ అనుయాయుడు కిలారు రాజేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజేష్, విజయ్ పేర్లు ఖరారైనట్లు శుక్రవారం అంతా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో భాష్యం రామకృష్ణ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తన మద్దతుదారులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.అయితే అక్కడున్న నేతలు ఆయనకు సర్దిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ చివరి నిమిషంలో సామాజిక సమీకరణలు మార్చాలని చంద్రబాబు భావిస్తే బీసీ, ఎస్సీ నేతలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అందులో మహిళా నేతలు గుండా లక్ష్మీదేవి, సజ్జా హేమలత, ఉండవల్లి శ్రీదేవి పేర్లను పరిశీలించినా వారు ఆర్థికంగా టీడీపీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన డాక్టర్ దేవయ్య, కంభంపాటి రామ్మోహనరావు పేర్లను పరిశీలించినా చివరికి వారినీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి గానీ శనివారం గానీ అధికారికంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమకు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. బాబు సొంత మనిషి.. ఇప్పుడు పవన్కి ఆప్తుడులింగమనేని రమేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటున్నా నిజానికి ఆయన చంద్రబాబు సొంత మనిషిగా, బినామీగా పేరు పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట నివాసం ఆయనదే. రమేష్ దాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారనే ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్తో సైతం రమేష్ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపాలని పవన్ నిర్ణయించారు. రమేష్ జనసేన తరఫున ఎంపీ అయినా చంద్రబాబు జేబులో మనిషేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వ్యూహం ప్రకారమే రమేష్ జనసేన తరఫున రాజ్యసభ రేసులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా నాలుగు రాజ్యసభ స్థానాలను చేజిక్కించుకోవడానికి చంద్రబాబు పన్నిన వ్యూహం ఫలించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
సాక్షి,అమరావతి: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ను ఖరారు చేసింది. అధికారికంగా జనసేన ప్రకటించిన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లింగమనేని రమేష్కు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబుకు లింగమనేని కరకట్ట వద్ద గెస్ట్ హౌస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ భవనం అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్తో పాటు లింగమనేని రమేష్కు లావాదేవీలు ఉన్నాయి. లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే పవన్ కళ్యాణ్ నివాసం, అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో, జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా లింగమనేని రమేష్కు అవకాశం ఇచ్చినట్లు జనసేన ప్రకటించింది. -
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
-
‘అక్కడ టెర్రరిస్టులున్నారా?’.. ఇంటి కూల్చివేతపై బాలశౌరి ఆగ్రహం
మచిలీపట్నం జనసేన లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక అధికారిక సమావేశంలో బందరు మున్సిపల్ కమిషనర్ ను నిలదీసిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎపిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత ఆరాచకపాలన చేస్తున్నదో ఆయన మాటలను బట్టి అర్దం అవుతుంది. మచిలీపట్నంలో జనసేన స్తానిక నేత ఒకరి ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేయించారు. అందుకు సుమారు 200 మంది పోలీసుల సాయం కూడా తీసుకుని కమిషనర్ ఆ విధ్వంసానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని బాలశౌరి ప్రస్తావించి ఎవరు చెబితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చారని, అతనికి దీనివల్ల నలభై లక్షల నష్టం వచ్చిందని సమాధానం ఇవ్వాలని కోరారు మచిలీపట్నం పౌర సమాజం మంచిది కాబట్టి సైలెంట్ గా ఉన్నారని, మరో చోట అయితే ఇంకో రకంగా ఉండేదని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని ఆయన అడిగారు. అక్కడేమైనా టెర్రరిస్టులు ఉన్నారా. ఇల్లు కూల్చడమన్నది చిన్న విషయం కాదని, ఇద్దరు వ్యక్తుల మద్య ఉన్న ప్రైవేటు తగాదాలో మీరెలా జోక్యం చేసుకున్నారని ఆయనఅడిగారు.మహిళలు కాళ్లమీద పడి బతిమలాడుతున్నా పోలీసులు వినిపంచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఏమైనా చేశారా.పోలీసుల పాయం కావాలని ఏ ప్రాతిపదికన లెటర్ రాశారు. అదేమి మున్సిపల్ ఆస్తి కాదు కదా అని,ఇంటిలో పెళ్లి చేసుకోవడానికి ఇల్లు కట్టుకుటుంటే దానిని కూల్చుతారా? ఇదేనా ప్రెండ్ లీ ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఎంపీ అడిగినా కమిషనర్ మాత్రం మౌనంగా నిలబడిపోయారు తప్ప జవాబు ఇవ్వలేదు.దాంతో కలెక్టర్ దీనిని తేల్చాలని బాలశౌరి కోరారు. జనసేన కు చెందిన వ్యక్తి ఇంటిని కూల్చడం బందరులో టీడీపీ, జనసేన ల మధ్య రచ్చ రాజుకుంది. ఈ నేపధ్యంలో బాలశౌరి అధికారిక సమావేశంలో కడిగిపారేయడం చర్చనీయాంశం అయింది. జనసేన కార్యకర్తలు తమకు టీడీపీ నుంచి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరించాలన్నట్లుగా పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా ,బాలశౌరి మాత్రం కార్యకర్తల తరపున మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఈ ఇంటిని పడగొడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ అడ్డుకోవడానికి యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనల మధ్య పలు చోట్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక జనసేన నేత ఏదో వ్యాఖ్య చేశారని ,టీడీపీ స్థానిక నాయకులు అతనిపై దౌర్జన్యం చేసి మోకాలిపై కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కలకలం సృష్టించింది. కొల్లూరు వద్ద జనసేన కార్యకర్తపై టీడీపీ మూకలు దాడి చేశాయట. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే , టీడీపీ వారు పోలీస్ స్టేషన్ లో బీతావహ వాతావరణం సృష్టించారని వార్తలు వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత ఒకరికి సంబంధించి వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి అనేక చోట్ల ఘటనలు జరగకపోలేదు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ జనసేన తరపున సూటిగా టీడీపీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించడం లేదన్న ఆవేదన జనసేన క్యాడర్ లోను, ఆయన అభిమానులలోను నెలకొంది. మరో విశేషం చెప్పాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై లైంగిక వేధింపులు చేశారని, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్య తీసుకోలేదు. చంద్రబాబును విమర్శిస్తూ వేస్ట్ అని శ్రీధర్ వ్యాఖ్య చేసిన వీడియో బయటకు రాగానే అతని విప్ పదవికి పవన్ రాజీనామా చేయించారు. ఈ అంశం కూడా జనసేనలో చర్చకు దారితీసింది. అంతేకాదు.పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో వచ్చిన ఒక సమాచారాన్ని ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించడంపై జనసేన కార్యకర్త కేసు పెట్టడం కూడా వివాదంగా మారింది. రాజకీయ అంశాలపై విశ్లేషణలు వచ్చినా, చర్చలు జరిగినా పోలీసు కేసులు పెట్టడం అంటే పార్టీ అంత బలహీనంగా మారిందా అన్న వ్యాఖ్యకు ఆస్కారం ఇచ్చారు. ప్రోఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసు ఎలా పెడతారని అనేక మంది ప్రశ్నించారు. ఇలాంటివాటిపై కేసులు పెట్టవలసి వస్తే ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టవలసి ఉంటుందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పొత్తు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ఇచ్చింది. అది పవన్ ను బాగా డామేజీ చేసింది. అయినా ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది. జగన్ పై అయితే ఎల్లో మీడియా రాసినన్ని కల్పిత కధలు ఇన్నీ అన్నీ కావు. ప్రధాని మోడీని, అమిత్ షాను కలిసిన దాదాపు ప్రతి సందర్భంలోను ,అక్కడ కూర్చుని చూసినట్లు,విన్నట్లు రాసిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ఎన్నడూ కేసులు పెట్టలేదు.కాని ఇప్పుడు తెలివిగా జనసేనను టీడీపీ ఇరికించి నాగేశ్వర్ పైన,కొన్ని మీడియా సంస్థలపైన టీడీపీ నాయకత్వం కేసులు పెట్టించిందని,దీనివల్ల జనసేనకే తీరని నష్టం వచ్చిందని ఆ పార్టీ వారే బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా నాగేశ్వర్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు సైతం కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు నానా పాట్లకు గురి చేయడంపై ఆందోళన చెలరేగింది. రైతులు తమ మొక్కజొన్న ఉత్పత్తులను ఒక గోడౌన్ లో దాచుకుంటే అది వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీదని ఆరోపిస్తూ దానికి సీల్ వేశారు.అది పెద్ద ఉద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ నేతలు పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా రచ్చ చేశారు.తీరా చివరికి ఆ పంట అంతా రైతులదే అని తేలడంతో సీల్ తీయకతప్పలేదు.బాలశౌరి బందరులో జరిగిన ఘటనకే పరిమితం అయినా, వైఎస్సార్సీపీపైన ఈ రెండేళ్లలో జరిగినన్ని దాడులు ఇన్నీ అన్నీ కావు.వైఎస్సార్సీపీ తర్వాత జనసేనపై టీడీపీ రెడ్ బుక్ ప్రభావం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జనసేన ఎంపీ బాలశౌరి ఈ మాత్రం అయినా ప్రతిఘటించి, గట్టిగా మాట్లాడినందుకు అభినందించాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలంగాణలో తిట్టించుకుని.. AP పరువు తీసిన పవన్
-
బీజేపీకి ఝలక్.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానం కేటాయించుకున్నాయి. నాలుగింటిలో బీజేపీకి ఒక్క స్థానం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపు, రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను పల్లా, మాధవ్, నాదెండ్ల కలిసి మీడియాకు వివరించారు. మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేనకి కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్కళ్యాణ్ ప్రకటిస్తారని మనోహర్ చెప్పారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని మాధవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో రెండేళ్ల పాలనపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ‘సర్’ గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. గతంలో రెండు, రెండు గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయినప్పుడు టీడీపీ, బీజేపీ రెండు చొప్పున పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగింటిలో మూడు తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో తమకు ఒక స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్కళ్యాణ్ కోరడంతో జనసేనకు ఒక స్థానం కేటాయించారు. టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతుండడంతో సానా సతీష్, కిలారు రాజేష్ కు ఇవ్వాలని ఈ సమావేశంలో లోకేశ్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సతీష్, రాజేష్లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్ దేవయ్య, ఓ మహిళా నేతల్లో ఒకరికి చాన్స్ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. జనసేనకు దక్కనున్న ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. -
AP క్యాబినెట్ మధ్య నుంచే వెళ్లిపోయిన పవన్.. ఎందుకంటే..!
-
తెలంగాణలో ఏం వాగుతున్నావ్!? పవన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ స్ట్రాంగ్ రియాక్షన్
-
పవన్ కల్యాణ్కు అస్వస్థత
సాక్షి,అమరావతి: పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. అయితే కేబినెట్ సమావేశం మధ్యలో పవన్ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కు వెళ్లిపోయారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు...మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు సంచలన కామెంట్స్
-
నువ్వేంటో, నీ స్థాయేంటో తెలుసుకో..! పవన్ పై అడ్వకేట్స్ కేసు
-
ఉరికించి ఉరికించి తంతం..! నువ్వు తెలంగాణ వచ్చి ఏం పీకుతావ్...
-
పవన్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. తెలంగాణ గడ్డ ముమ్మాటికీ మా జాగీరే. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం’’ అని వెన్నెల పేర్కొన్నారు.‘‘ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు’’ అని వెన్నెల అన్నారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై.. గద్దర్ కూతురు వెన్నెల .. pic.twitter.com/oSdScmlfm5— Prabhakar Venavanka (@Prabhavenavanka) June 3, 2026ఆ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: పొన్నంకాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న(మంగళవారం) పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్కు లేదని, వెంటనే గద్దర్ ఆత్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.12 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ను పాకిస్తాన్లా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. -
జగన్.. జగన్.. అని గొంతు చించుకున్నాడు... తెలంగాణలో మీటింగ్ పెడతాడట
-
సీఎం రమేష్కు షాకిచ్చిన జనసేన నేత
సాక్షి, అనకాపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కూటమి నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే.. పాలకుల అరాచకాలను బయటపెడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని వంశీ డిమాండ్ చేశారు.వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ను అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చిన నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు.అలాగే, అక్రమ మైనింగ్ జరగలేదని పైకి చెబుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వ హయాంలోనే పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేని లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ పాల్పడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి’ అని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో జనసేన ఉంటుంది..!
-
పర్మిషన్ ఇవ్వు లేకపోతే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకుంటా..
-
జనసేన నేత కాబట్టే చర్యలు లేవా?
పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
తెలంగాణ నవ నిర్మాణ సభవెనుక భారీ కుట్ర..
-
పోస్టింగ్ ఇస్తామన్నా ‘వద్దు సార్’ అంటున్న అధికారులు
ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’ నాయకుల ఒంటెత్తు పోకడలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకుని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మాకొద్దు సార్’ అంటూ చేతులెత్తేస్తున్నారు. కాదని బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం: మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 5 నెలలుగా ఇక్కడ ఇన్చార్జ్ ఆర్డీఓ, ఇన్చార్జ్ డీఎస్పీతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సమస్మాత్మక ప్రాంతాల్లో ధర్మవరం ఒకటి. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఇక్కడి పోలీస్ సబ్ డివిజన్కు 5 నెలలుగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడం గమనార్హం. పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పను ఇన్చార్జ్గా నియమించినా, రెండు సబ్ డివిజన్లను పర్యవేక్షించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ సక్రమంగా లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అవస్థల పర్వం.. ధర్మవరం రెవెన్యూ డివిజన్లో సైతం పాలన అటకెక్కింది.తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రెండేళ్లుగా ఆర్ఐలు కూడా లేరు. ఇక.. నియోజకవర్గానికి రెగ్యులర్ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఆమె ఎప్పుడో ఒకసారి ధర్మవరం వచ్చి వెళ్తుండటంతో రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. భూముల రీ సర్వేలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. అంతులేని అవినీతి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటంటే తమ మాటే జరగాలంటూ ‘కూటమి’ పారీ్టలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్చార్జ్లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూధన్రెడ్డి సైతం పెత్తనం కోసం ప్రయతి్నస్తుండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. –గుండా ఈశ్వరయ్య, ధర్మవరంవాసిప్రజల్లో భయాందోళన ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. –చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం -
బాలినేని ఎంట్రీతో రియాజ్ విఫలమయ్యారా..?
-
లైన్ మెన్ పై బూతులతో రెచ్చిపోయిన జనసేన నేత
-
కాపులను బెదిరిస్తున్న పవన్ కళ్యాణ్
-
ప్రశ్నలకు పారిపోయిన సంపత్ నాయక్
-
జనసేన సంపత్ ను తరిమి తరిమి కొట్టిన జర్నలిస్టులు
-
కులాల కోసం మాట్లాడింది నువ్వు... దమ్ముంటే అరెస్ట్ చేయండి ప్రో. కే నాగేశ్వర రావు ఛాలెంజ్
-
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా బిడ్డ పేరు వాడుకుని గెలిచావ్.. ఇప్పుడు తప్పించుకుంటున్నావ్
-
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్మీడియాలో హైలైట్గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిలో చీలికలు.. ఎమ్మెల్యే నానికి చెప్పు చూపించిన జనసేన నేత
-
బొచ్చులో పార్టీ.. మీకేంటి నొప్పి.. కొల్లు రవీంద్రపై జనసేన నేత ఆగ్రహం
-
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు
-
నువ్వు ఎవడివి వాళ్ళ ఇల్లు కూల్చడానికి..!? పోలీసులను ఎవరు తీసుకెళ్లమన్నారు..?
-
అప్పుడో న్యాయం.. ఇప్పుడో న్యాయమా..? అరవ శ్రీధర్ పై బాబు యాక్షన్
-
‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్ను వేధిస్తారా?’
సాక్షి, అమరావతి: రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన నాయకులు కేసులు పెట్టడాన్ని సినీ నటుడు ప్రకాష్రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో విడుదల చేశారు. ‘ఆయన మాట్లాడిన మొత్తం అంశాలను పక్కన పెట్టి, అందులో ఒక లైను మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, కేసులు, బెదిరింపులు... ఏమిటివన్నీ. ఇది ప్రజాస్వామ్యమా. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?..మీకు నిజంగా ఒక్క మాట తప్పు అనిపిస్తే దానికి ఆధారం అడగండి. రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి’ అంటూ తూర్పారపట్టారు. ‘ఓ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వాళ్లను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించారు, పవన్కళ్యాణ్ను ప్రశ్నించారు. కేసీఆర్ను ప్రశ్నించారు, జగన్ను ప్రశ్నించారు. రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పటి ఆయన నిజాయితీ కూడా మీకు గుర్తుకు రాలేదు...ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా ? ప్రశ్నించే గొంతులను కేసులతో మూసేయాలని చూడడం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్, రేపు ఇంకెవరో...’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో... ఎవరి పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలు దయచేసి వెంటనే ఆపండి’ అంటూ జనసేన నేతలకు సూచించారు. ‘నాగేశ్వర్.. మీకు అండగా మేం ఉన్నాం. కీప్ అప్ ది గుడ్ వర్క్’ అంటూ మద్దతు తెలిపారు. -
జనసేన కార్యకర్తపై... టీడీపీ మూకల దాడి
కొల్లూరు: పచ్చమూకల దాష్టీకానికి బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. టీడీపీ శ్రేణుల అరాచకపర్వంతో పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చమూకల విధ్వంసం కారణంగా పోలీసు స్టేషన్లో భీతావహ వాతావరణం నెలకొని స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేసి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడిని విమర్శించాడన్న సాకుతో దాడి.. కొల్లూరులో నూడిల్స్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన్ ప్రసాద్ను విమర్శించి, చులకనగా మాట్లాడాడన్న సాకుతో ఆ పార్టీ శ్రేణులు దాడి చేసినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్ మూసేసి ఇంటికి వెళ్తున్న జానకిరామయ్యకు, టీడీపీ నాయకుడి అనుచరులైన కొల్లూరులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తులు సమీపంలోని మద్యం దుకాణం వద్ద తారసపడ్డారు. ఈ క్రమంలో తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ఆ కాలనీకి చెందిన కొండూరు సురేష్ ప్రశ్నించడంతో ఇరువురి నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.ఈ క్రమంంలో జానకిరామయ్య తలపై మద్యం సీసాతో సురేష్ దాడి చేయడంతో గాయమైంది. వెంటనే బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు జానకిరామయ్య కొల్లూరు పోలీసు స్టేషన్కు వెళ్లాడు. తీవ్ర రక్త స్రావమవుతున్న జానకిరామయ్యను వైద్యశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అతడిని తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో కాలనీ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపైనా దాడి చేశారు. జానకిరామయ్య మేనల్లుడు రాము బాలశివగంగాధర్ ఆ కాలనీకి వెళ్లి తన మేనమామను కొడతారా... చూసుకుందాం రండి అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాలనీకి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్కు దూసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది.పోలీసుల జీపు దహనానికి యత్నంవేమూరు సీఐ పీవీ.ఆంజనేయులుతోపాటు, పోలీసు సిబ్బంది కూడా టీడీపీ శ్రేణుల దాడికి గురయ్యారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీసు జీపును రోడ్డుపైకి నెట్టుకెళ్లిన పచ్చ మూకలు ధ్వంసం చేసి దహనం చేసేందుకు ప్రయతి్నంచారు. దాన్ని తిరిగి ఆవరణలోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన హోంగార్డు నాగరాజుపై ఇష్టానుసారంగా దాడికి తెగబడి దుస్తులు చింపేశారు. ఇదే క్రమంలో వేమూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రసాద్పైనా దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాల వారూ గాయపడడంతో గుంటూరు, తెనాలి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉప్పు జానకిరామయ్యతోపాటు, అతని సోదరి రాము వెంకటలక్ష్మి, అతని బావ, రాము శివనారాయణ, మేనల్లుడు రాము బాల శివగంగాధర్ గాయాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన గొడవర్తి తేజ, దున్నా చింతయ్య, చొప్పర చింతయ్య గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కొల్లూరులో పోలీసుల పహారాకొల్లూరు పోలీస్ స్టేషన్లో దాడి సమాచారంతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావుతోపాటు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు కొల్లూరు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇరు సామాజికవర్గాల నడుమ జరిగిన వివాదం కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొల్లూరులోని పలు ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.వేమూరు, చుండూరు, రేపల్లె టౌన్, రేపల్లె రూరల్ సీఐలు పీవీ.ఆంజనేయులు, ఎం.ఆనందరావు, బి.అశోక్కుమార్, సురేష్బాబు, పలు స్టేషన్ల ఎస్ఐలు కొల్లూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు పోలీసు స్టేషన్పై చేసిన దాడి ఘటనలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అందరిపైనా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ నాయకుల పాత్రపైనా విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా..!
-
చంద్రబాబు వేస్ట్.. అరవ శ్రీధర్ మాట్లాడిన సంచలన వీడియో విడుదల చేసిన హర్షవీణ
-
మరొక వివాదంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ముస్లిం మహిళపై వ్యాఖ్యలు
-
అరవ శ్రీధర్ మరో సంచలన వీడియోను విడుదల చేసిన హర్ష వీణ
-
పవన్ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?
ఉమ్మడి జిల్లా కూటమిలో కుంపట్లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పేరుకే జనసేనలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెర వెనక ఆట ఆడిస్తున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలిసిన 24 గంటలు గడవకముందే జనసేన నాయకుడు ఆరోపణలు గుప్పించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణల వెనుక టీడీపీ ముఖ్యనేత హస్తం ఉందని బాలినేని వర్గం ఆరోపణలు చేస్తోంది. సాక్షి ప్రకాశం : జిల్లా కూటమిలో వర్గ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. జనసేన ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోవడం తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆరు జిల్లాల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలు అప్పగించడంతో అటు జనసేనలోనే కాకుండా ఇటు టీడీపీలో కూడా అలజడి రేగుతోంది. ఆ సమావేశానికి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం గైర్హాజరవడం ద్వారా బాలినేని ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది. బాలినేని ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంతో ఆందోళనకు పచ్చనేతలు జడా బాల నాగేంద్రం ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేయించిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలు పోటా పోటీగా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో జిల్లా కూటమి నాయకులు ఎండలకు మించి ఉక్కపోతకు గురవుతున్నారు. అధిష్టానాన్ని లెక్క చేయకుండా.... స్థానిక సంస్థల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలను బాలినేనికి అప్పగించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమావేశం ఒంగోలులో నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అండ్ కో ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. తమకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన డీ లిమిటేషన్ సమావేశాన్ని స్వయంగా జిల్లా అధ్యక్షుడే బాయ్ కాట్ చేసినప్పటికీ జనసేన అధిష్టానం ఏమీ చేయలేక పోయింది. దీంతో పారీ్టపై జనసేన అధిష్టానం పట్టు కోల్పోయిందన్న విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులతో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై రియాజ్ వర్గం రగిలిపోతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబును కలిశాక... ఒకవైపు జిల్లా కూటమిలో టీడీపీ, జనసేనలోని వర్గాలు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే బాలినేని కలవడం పచ్చశిబిరంలో అలజడి రేపింది. దీంతో బాలినేనికి చెక్ పెట్టకపోతే ఇక లాభం లేదని భావించిన ఆ వర్గం వ్యూహాత్మకంగా జడా బాల నాగేంద్రంను రంగంలోకి దింపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల నాగేంద్రం మొదట్నుంచి బాలినేని ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే దామచర్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన డీ లిమిటేషన్ సమావేశంలో కూడా బాలినేని వెంట ఉన్న బాల నాగేంద్రం ఉన్నట్టుండి ఆయనపైనే ఆరోపణలు చేయడంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బాలినేని వర్గం ప్రతి విమర్శలు... ఉదయం బాల నాగేంద్రం బాలినేని మీద విమర్శలు గుప్పించారు. సాయంత్రం అయ్యేసరికల్లా బాలినేని వర్గం ప్రెస్మీట్ పెట్టి ప్రతి విమర్శలు చేసింది. ఇతర పార్టీ నాయకులు తెర వెనక ఉండి బాలినేని మీద విమర్శలు చేయిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఎం చంద్రబాబుతో కలిసి జిల్లా పరిస్థితులు చర్చించిన విషయం బయటకు వచ్చిన వెంటనే కొందరు నాయకులు బాలినేని మీద తప్పుడు ఆరోపణలతో ప్రెస్ మీట్ పెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. నాగేంద్రం వెనక ఉన్న వ్యక్తి ఏమీ పీకలేరని ఆమె విరుచుకుపడ్డారు. ఇతర పారీ్టల నాయకులు జనసేనపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ఇరు పార్టీల అధినేతలు మౌనం... జిల్లాలో కూటమి పారీ్టల్లో ఎత్తులు, పై ఎత్తులతో స్థానిక నాయకులు తరచూ వీధిన పడుతున్నారు. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాలినేనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయినా టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొదట రియాజ్, అరుణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అరుణను వెంటాడి మరీ దాడి చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలినేని కార్యక్రమాలను రియాజ్ అండ్ కో బాయ్ కాట్ చేసింది. అయినా సరే జనసేన అధినేత పట్టించుకోవడం లేదు. ఇరు పారీ్టల అధినేతల మౌనం వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పదవులు అమ్ముకుంటున్న బాలినేని...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని జడా బాల నాగేంద్రం చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ తాల్లూరి, లింగమనేని రమేష్ లతో కుమ్మక్కై పదవులు అమ్ముకుంటున్నారని బాల నాగేంద్రం విమర్శలు చేయడం గమనార్హం. నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రూ.10 లక్షలు, జిల్లా అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తామంటూ ఎన్ఆర్ఐలకు ఫోన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో, ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని, ఆయన కుమారుడ్ని దూరంగా పెట్టాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ వెనక అధికార పార్టీకి చెందిన కీలకనేత వర్గం హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. -
అరవ శ్రీధర్ కోసం పాట పాడిన హర్ష వీణ
-
మైనర్ బాలికపై జనసేన నేత అత్యాచారయత్నం..
-
పార్టీ కోసం కష్టబడ్డ మాలాంటి వాళ్ళను 2 ఆఫీస్ గేటు దగ్గరకు కూడా రానివ్వడం లేదు
-
కుక్కలాగా.. గుంట నక్క లాగా పడి ఉంటా.. సిగ్గులేకుండా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్
-
కుల పిచ్చి కామెంట్స్... ఆంధ్రా భావన ఎలాగూ లేదు.. కులం కోసమైనా గెలిపించండి
-
ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు కదా..! ట్రోల్స్ పై పవన్ రియాక్షన్
-
టీడీపీ, జనసేన పార్టీలో చీలికలు
-
అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి..
వెనకటికి ఒక సామెత ఉంది. ఏమి చేస్తున్నావురా అని అంటే పారబోసి, ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ,జనసేన, కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన పనులే మళ్లీ చేయడం,ఇప్పటికే ఉన్న నిర్మాణాలనే మళ్లీ చేపట్టడం, కోట్లు వ్యయం చేసి కంప కొట్టిస్తుండడం, వరద వస్తే నీళ్లు తోడుతుండడం..ఇలాంటి వైనం అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటారా? కాని ఏపి ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా ఫర్వాలేదు..వేల కోట్లు వ్యయం అయినా ఫర్వాలేదు..తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తొలుత 34వేల ఎకరాలు భూముల నుంచి సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడు అది కేవలం మున్సిపాల్టీగానే ఉంటుందని, ఇంకా మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.అందులో భాగంగా ఏభైవేల ఎకరాలకు టెండరుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి వీర మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాలవారు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు.తాము భూములు ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారు అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారే రెండో దశ భూమి సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి,నోరు మొత్తుకుని ఇదంతా భూ దందానే అని,ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. అయినా వీటన్నిటిని పెడచెవిన పెట్టి కూటమి సర్కార్ వేల కోట్ల వ్యయం చేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి వచ్చింది. అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పనులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీ పార్దసారధి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన ఎవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ది చేస్తామని చెప్పారట.పెనుమాక, శాఖమూరు, నీరుకొండ, లలో కొత్తగా నాలుగు రిజర్వాయిర్లు కడుతున్నామని తెలిపారట.దీనికి మళ్లీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి!అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు? ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు ఎందుకు వ్యయం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను ప్రపంచ బ్యాంక్ బృందం వేయలేదు. ఎందుకంటే వారి వ్యాపారం వారిది. ఇదంతా ఏపీ ప్రజలపై పడే భారమే కదా!అంతేకాదు..కృష్ణ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలకు అంత అనువైనవి కావని నిపుణులు మొత్తుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్ లు ,రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.ఇక్కడ 84 శాతం సాగు,పర్యావరణ భూములు ఉన్నాయని, మూడు పంటలు పండే భూములను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లలో పలువురు పర్యావరణవేత్తలు సైతం ఇదంతా పర్యావరణ విధ్వంసం అని హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు.ఇటు రేగడి భూములలో కాకుండా,నాగార్జున యూనివర్శిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి భూములలో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతోమంది చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.అందులో భాగంగా ఇప్పటికే 47 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.వేల కోట్ల రూపాయలతో రిజర్వాయిర్లు నిర్మిస్తూ ,వరద ప్రాంతంలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు.దానికే దిక్కులేదట.అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట.చిత్రమేమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు.. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లు వంటివాటిని మళ్లీ కొత్త డిజైన్ లతో నిర్మిస్తారట.ఏపీ ఆర్దికంగా అంత పటిష్టంగా ఉంటే ఏమి చేసుకున్నా ఎవరూ కాదనరు,కాని ఒక పక్క చెప్పిన హామీలకు డబ్బులు లేవని పదే,పదే వాపోయే ప్రభుత్వం, అనేక వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరిపై లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశ లో సమీకరించిన భూములకు సంబందించి రైతులకు ప్లాట్లు ఇంతవరకు అభివృద్ది చేసి ఇవ్వలేదు.దానికి ఎన్నివేల కోట్ల వ్యయం అవుతుందో ఎవరూ చెస్పలేరు.ఎప్పటికి ఇస్తారో తెలియదు.దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారట. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.దీనికోసం తమ భూములను గుంజుకుంటున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా 70 మీటర్లు మించి అవుటర్ రింగ్ రోడ్లు లేవు.కానీ జనమే పెద్దగా లేని ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో రింగ్ రోడ్డు వేసి ఏమి సాధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను రైతులు అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత,మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ ప్రాంత ప్రజలు కూటమి నేతల తీరుపై మండిపడుతూ తమకు మద్దతు ఇచ్చే వారివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇవన్ని ఒక ఎత్తు అయితే తొలిదశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి సన్నిహితులకు జగన్ టైమ్ లో దాదాపు పూర్తి అయిన వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన,లేదా ఇతర కూడలి ప్రదేశాలలో వారు కోరుకున్నచోట ప్లాట్లు వస్తున్నాయట.అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల,చివరికి స్మశానాలలో ,వాగులలో ప్లాట్లు ఇస్తున్నారట.దీని గురించి ఆందోళన చెందిన ఒక రైతు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.ఇవన్ని ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఐదెకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి.ఎకరా 20 కోట్లు ఉందని ఆయన ప్రచారం చేస్తున్నారు కాని, తన వరకు వచ్చేసరికి 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. ఆయన ఇంటి పరిసరాలలో మరొకరికి ప్లాట్ రాకుండా దక్షిణవైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట.ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా కనిపించవచ్చేమో కాని, సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అసలు జరిగింది ఏంటంటే..?
-
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే మేనల్లుడు
సాక్షి టాస్క్ఫోర్స్: అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడి అనుచరులు ఓ కాలనీ గోడను కూల్చివేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించిన కాలనీవాసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నానితోపాటు ఎమ్మెల్యే బంధువైన కొణతాల బాల సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతి పొందిన లేఅవుట్లో కాలనీ వాసులు నిర్మించుకున్న గోడను జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని, ఎమ్మెల్యే బంధువు కొణతాల బాల, విల్లూరి గణేష్, ఆడారి శంకరరావు, శరగడం రమేష్, బుద్ద మురళీ తాతారావు తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న అర్ధరాత్రి పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు.కాలనీ వాసులు తమ రక్షణ కోసం చాలాకాలం క్రితం ఆ గోడను నిర్మించుకోగా.. ఆ గోడ అవతల ఉన్న స్థలంపై జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కన్నేశారు. కాలనీ వాసులు అడ్డు చెప్పేలోపే పాత గోడను తొలగించి.. పక్కన మరో గోడ నిర్మించారు. గోడ తొలగించిన స్థలంలో అది తమ స్థలమేనంటూ బోర్డులు పెట్టారు. గోడ కూల్చివేత, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు పక్కనే అక్రమ కట్టడం నిర్మించడంపై కాలనీవాసులు అప్పట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారు.ఎమ్మెల్యే బంధువు ఈ వ్యవహారంలో ఉండటంతో కేసు నమోదులో జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు శనివారం (ఈ నెల 9న) బాధితులలో ఒకరైన కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడు, బంధువుపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే మేనల్లుడు తదితరులు కాలనీవాసులపై శనివారం రాత్రి దౌర్జన్యానికి దిగటం కలకలం రేపింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్రాయల్, విజయ్ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది. -
దయచేసి వైద్యాన్ని పేదవాడికి దూరం చేయకండి.. కన్నీరు పెట్టిన రజని
-
సుగాలి ప్రీతి కేసు ఏం చేశావ్!..పవన్ కు పూనమ్ కౌర్ కౌంటర్
-
జనసేన పార్టీ సర్వసభ సమావేశంలో గందరగోళం
-
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
సినిమా సూపిత్త మామా..
కాకినాడ జిల్లా: పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్ నటుడు. మేకప్.. పేకప్ ఆయనకు బాగా పరిచయమైన పదాలు. అందుకేనేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అధికార యంత్రాంగం కూడా పైపై మేకప్పులకే పరిమితమై పట్టణ సుందరీకరణకు పేకప్ చెప్పడానికి సిద్ధమైంది! స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పిఠాపురం పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభించారు. గోడలపై చిత్రాలు వేయడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి సుందరంగా అలంకరించడం వంటి పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాలం చెల్లిన భవనాలకు సైతం మాం...చి మేకప్ వేసి జనాలకు సినిమా చూపించాలనుకుంటున్నారు. మున్సిపల్ పార్కులో ఉన్న మస్తరు కార్యాలయం పూర్తిగా శిథిలమై తుప్పలు, డొంకలతో ప్రమాద స్థితిలో ఉంది. రేపో మాపో కూలి పోయే ఆ భవనానికి మరమ్మతులు చేయకుండా పగిలిపోయిన గోడలకే రంగులు వేసి బొమ్మ చూపిస్తున్నారు. ఇది చూసిన జనం ‘ఇదేనా సుందరీకరణ అంటే’ అని ముక్కున వేలేసుకుంటున్నారు! -
నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో... పవన్పై రెచ్చిపోయిన జనసైనికుడు
-
విజయలో ఉన్నదేంటి..? పవన్ లో లేనిదేంటి..?
-
పవన్ సార్.. మమ్మల్ని బానిసలుగా మార్చకండి!
సాక్షి ప్రతినిధి, కడప: తమిళనాడుకి కాబోయే సీఎం విజయ్కు శుభాకాంక్షలంటూనే, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్పై జనసేన నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘విజయ్ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25శాతం ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నప్పటికీ మీరెందుకు పోరాటం చేయలేకున్నారు. మీరెందుకు సీఎం కాలేకున్నారు. మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు’’ అంటూ నిలదీస్తున్నారు. తాజాగా రాజంపేట జనసేన ఇన్చార్జి కొనిశెట్టి హరి రాయల్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరి రాయల్ వీడియో సారాంశం ఇలా ఉంది. పవన్ సార్ విజయ్ను చూడండి.. ''పవన్కళ్యాణ్ సార్ మిమ్మల్ని తప్పుబట్టట్లేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఈ జనసేన బిళ్లను చూడండి. 2014లో పార్టీ పెట్టారు. ఆరోజు నుంచి బిళ్లను మోస్తున్నాం. కానీ మా బతుకులు చూడండి, కుక్కల్లాగా బతుకున్నాం. మాది కూడా ఒక బతుకేనా! మాకు ఆత్మగౌరవం లేదు. అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు. పార్టీ గెలవకపోయినా వందేళ్లు మీతో నడుస్తాం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కడప జిల్లాకు వస్తే, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టుకోరు. పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎందుకు కలవరు? నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బందేమిటీ? పార్టీని నిర్మాణం చేసుకుని జనాల్లోకి తీసుకు వెళ్లకుండా ఇలా ఎందుకు సార్! జనాల్లో నమ్మకం పోయింది.ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేసి కమిటీలు, ఇన్చార్జీలను వేయండి సార్. పార్టీ పెట్టి 15 ఏళ్లు అయింది. ఎందుకు ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెడుతున్నారు? తమిళనాడులో విజయ్ వెనుక ఎలాంటి కులం లేదు. కానీ మీ వెనుక 25 శాతం ఓట్లు ఉన్న కులం ఉంది. విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చారు. విజయ్ మాలాంటి వారికి నమ్మకం కలిగించారు. ఇప్పటికైనా పార్టీని ముందుకు నడిపించి మీరు సీఎం అవ్వండి సార్. మీ కాళ్లు పట్టుకుంటాం. మా జీవితాలను నాశనం చేయవద్దు. మాట్లాడితే సస్పెన్షన్లు తగవు. జనసేన పార్టీ మాది. మెగా ఫ్యామిలీతో మాది పేగు బంధం. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోతాం. మీరు ముంచినా మునిగేందుకు మీ వెంట నడుస్తున్నాం. కష్టపడే వారికి అవకాశం ఇవ్వండి సార్..'' అంటూ హరిరాయల్ పవన్ను వేడుకుంటూ వీడియోను ముగించారు. -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
పవన్ తలదించుకో విజయ్ ని చూసి నేర్చుకో..
-
పిఠాపురం వర్మపై దాడి.. సీఎం చంద్రబాబు రియాక్షన్
-
పిఠాపురంలో జనసేన మట్టి మాఫియా.. పట్టుకొని దుమ్ము దులిపేసిన వంగా గీత
-
అమ్మ మీద దాడి చేసింది వాడే.. పోలీసుల ముందే దౌర్జన్యం
-
జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి
-
వర్మ ప్యూజ్ పీకేసిన బాబు.. అయ్యో వర్మ.. ఏంటీ కర్మ
-
చంద్రబాబు, పవన్ కు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు
-
సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్
-
‘మీకు కార్పొరేషన్ కావాలా?’.. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా?
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గత వారం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
జనసేన జోలికి వస్తే.. ఖబర్దార్.. TDPకి జనసేన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
-
గెలిపించిన మమ్మల్నే కొడతారా పిఠాపురం వర్మ ఫైర్
-
పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?
-
పిఠాపురంలో సీన్ రివర్స్.. జనసేనకు ఎదురుతిరిగిన వర్మ
-
మేం ఏంటో చూపిస్తాం.. గిల్లుతే గిల్లించుకునే రకం కాదు.. జనసేనకు టీడీపీ వర్మ వార్నింగ్
-
పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్
-
పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు
-
అరకోటి భూమి కొట్టేసేందుకు జనసేన నేత స్కెచ్
సాక్షి, కాకినాడ సిటీ: వరుసకు సోదరి అయిన మహిళ భూమి కొట్టేసేందుకు డీసీసీబీ చైర్మన్, కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు స్కెచ్ వేశారు. కాకినాడ జిల్లా యర్రవరంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 94 సెంట్ల భూమిని తన ఆధీనంలో పెట్టుకుని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసీ కిరణ్మయిని తుమ్మల బాబు వేధిస్తున్నారు. కిరణ్మయి భర్త కిడ్నీ పేషెంట్ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకుంటానని నమ్మించి.. ఆ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఆమె పేరిట ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.అధికార పార్టీ నేత కాదనడంతో స్థానిక తహసీల్దార్ ఆమెకు పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తనకు పాస్బుక్ ఇవ్వకపోవడంతో బాధితురాలు తల్లితో కలసి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ హరేందిరప్రసాద్కు ఫిర్యాదు చేసింది. తుమ్మల బాబు తన పెదనాన్న కొడుకు అని, తన భూమి తనకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు తనకు పసుపు కుంకుమ మాన్యం కింద ఇచ్చిన ఈ భూమిని కొన్నేళ్లుగా తుమ్మల బాబు ఆధీనంలో ఉంచుకొని తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపింది.తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. తుమ్మల బాబు అధికారం బలంతో ఆ భూమికి పట్టాదార్ పాస్బుక్ కూడా సంపాదించినట్టు తెలిసిందన్నారు. ఆ భూమికి సంబంధించి పంట డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు ఆమె తెలిపింది. భూమి గొడవల నేపథ్యంలో తన భర్త గత ఏడాది సెప్టెంబర్లో ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో తన తండ్రికి చెందిన 5 సెంట్ల స్థలం కూడా కాజేసేందుకు తుమ్మల బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విషయం జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు. -
సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన
-
పవన్ త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఇటీవల సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ త్వరగా కోలుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. శుక్రవారం ఉదయం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
ఎక్కడపోయావ్ సనాతని.. గుడిని కూల్చడమా నీ సనాతన ధర్మం
-
జనసేన నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఎంపీ బాలశౌరికి పేర్ని నాని కౌంటర్
-
ఐస్ క్రీమ్ పార్లర్ లో జనసేన నేత హల్ చల్
-
ఆమె ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే.. నేను ఆమెకు మొగుడిని..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చాలా కుటుంబాల్లో పిల్లలు పుట్టినప్పుడు కొద్దిరోజుల్లో వారి జాతక చక్రాలు వేయించే ఆచారం ఉంది. వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.. మున్ముందు బిడ్డ నడవడిక ఎలా ఉంటుంది.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తాడా? లేదా?.. ఇలా రకరకాలుగా పరిశీలన చేస్తారు. కొందరైతే బిడ్డ ఏదైనా గండంమీద పుట్టాడా అనేది కూడా చూస్తారు.. అంటే తల్లి గండం.. తండ్రి గండం.. మేనమామ గండం.. ఇలా అన్నమాట... ఇదే క్రమంలో విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్యేలకు కూడా బోలెడు గండాలున్నట్లు జాతక చక్రాలు చెబుతున్నాయి. వీళ్లందరికీ ఆయా కుటుంబీకులే పెద్ద గండాలుగా తయారై వారి పదవికి గండం తెచ్చేలా ఉందని రాజకీయ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా తేల్చి చెప్పారు. మొన్నటి మీటింగ్లో ఎవరెవరికి ఏయే గండాలు పొంచి ఉన్నదీ విడమర్చి చెప్పారు. ఆ గండాలే ఇప్పుడు వారిపాలిట సుడిగుండాలు అయ్యాయి. వీటిలో నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలు ఈదులాడుతున్నారు. ప్రజలకు మేలు చేయకపోయినా ఫరవాలేదు.. పదవికి మచ్చతేవద్దంటూ దండాలు పెడుతున్నారు. నెల్లిమర్లలో ఎమ్మెల్యే భర్త రుబాబు తొలిసారి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీమంతురాలు లోకం నాగమాధవి గెలుస్తూనే ఊళ్లమీదపడి దందాలు మొదలెట్టారన్నది ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట. ఎకరాల నుంచి నాలుగైదు సెంట్ల భూమి సైతం కొనడంతో పాటు ఇరుగుపొరుగు రైతులను బెదిరించడం సర్వసాధారణమైందట. దీనికి తోడు ఆమె భర్త లోకం ప్రసాద్ ఆమె పాలిట గుదిబండగా మారారు. ఆమె ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే.. నేను ఆమెకు మొగుడిని.. కాబట్టి నాకే ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులపై రుబాబు చూపిస్తున్నారు. దీనికితోడు బినామీ ఒకరిని పెట్టుకుని కాంట్రాక్టు పనులన్నీ ఆయనతోనే చేయించుకుంటూ అందులో కూడా ఆదాయం తమ ఖాతాకు వచ్చేలా చూసుకుంటున్నారు. పార్టీకోసం పనిచేసిన జనసేన కార్యకర్తలు, టీడీపీ వారి పరిస్థితి శ్మశానం ముందు నక్కలమాదిరిగా తయారైంది. ఎక్కడైనా ఏదో ఎముక దొరక్కపోదా అనేలా ఉంది వారి పరిస్థితి.. దీంతో భర్తగండంతో కొట్టుమిట్టాడుతున్న ఈమెకు కూడా సీఎం చంద్రబాబు నుంచి చీవాట్లు తప్పలేదట. -
ఓటు వేసినందుకు చేతిలో చిప్ప పెట్టారు
-
జనసేన సేత రాసలీలల కేసు.. పోలీసుల నిర్లక్ష్యం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జనసేన సేత రాసలీలల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడింది. జనసేన నేత జయప్రకాశ్పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో బాధితురాలిగా అండగా నిలవాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ నాయకులకు కొమ్ముకాస్తున్న వైనం కొట్టొచ్చినట్లు కనబడింది. రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సైలు ఉన్నా జయప్రకాశ్పై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. బాధితురాలని నాలుగు గంటల పాటు స్టేషన్లోనే ఉంచారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జనసేన నేతపై కేసు నమోదు చేయకుండా ఉండటమే కాకుండా, చివరకు బాధితురాలని నాలుగు గంటలపైగా స్టేషన్లో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధితులకి న్యాయం జరగకపోవడం సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. -
జనసేన రాసలీలలు.. నన్ను శారీరకంగా వాడుకొని మోసం చేశాడు..
-
పచ్చ కుట్రలకు కూలిన జనసేన నేత ఇల్లు.. పట్టించుకోని పవన్..
-
జనసేన జెడ్పీటీసీ సభ్యుడి వేధింపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని, రూ.10 లక్షలు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసుకు ప్రతి కార్యక్రమానికి వెళ్లేదానినని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. నేను అంటే ఇష్టమని, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగాడన్నారు. నాకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని... సెట్ అవ్వదని చెప్పానన్నారు. తనకూ పెళ్లి అయ్యిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్ తో రెండేళ్లు కలిసి ఉన్నానని బాధితురాలు చెప్పారు. ఈ క్రమంలో ఇల్లు కొంటున్నానని, ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని... తర్వాత నుంచి అతడి ప్రవర్తన మారి తనను ఇష్టం లేకుండా చూడటం, కొట్టడం, గంజాయి కలిపిన స్వీట్స్ పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తనను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక మా పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా మళ్లీ ఫోన్ చేయడంతోపాటు, మా అమ్మతో మాట్లాడి... తీసుకెళ్లి మరలా టార్చర్ చేశాడని వాపోయింది. ఓ సారి టార్చర్ చేసిన తర్వాత ఆస్పత్రిలో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆది నుంచి వివాదాస్పదుడే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్నాయుడు(జేపీ) ఆది నుంచి వివాదాస్పద వ్యక్తి. ఆయనపై భూఆక్రమణలు, సివిల్ వివాదాలు, కొట్లాటలకు సంబంధించి కేసులున్నాయి. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించిన, తెలంగాణలో మత్స్యశాఖలో చేపల సాగు టెండర్ల విషయంలోనూ నకిలీ ధ్రువీకరణపత్రాలు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారని ఆరోపణలపైనా తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కిందట విచారణ నిర్వహించింది. తణుకు, భీమవరం, వీరవాసరంలోనూ ఆయనపై కేసులున్నాయి. -
జనసేన నాయకుడి వేధింపులపై బాధిత మహిళ ఆవేదన
-
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై TDP నేత సంచలన వ్యాఖ్యలు
-
పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. జనసేన నేత విచారణలో పోలీసుల హైడ్రామా..!
-
స్టేషన్ గేటుకు బేడీలు ఎందుకు?.. లోపల తాతంశెట్టి నాగేంద్ర ఉన్నాడంట
సాక్షి,రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు హర్షవీణపై దాడి కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హర్షవీణపై జనసేన నాయకులు నడిరోడ్డుపై దాడి చేసి, పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని కొట్టడంతో పాటు తరుముతూ అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనలో నిందితుడు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాజాగా, తాతంశెట్టి నాగేంద్ర విచారణలో పోలీసుల హైడ్రామా బయటపడింది. హర్షవీణపై దాడి చేసిన కేసులో విచారణను పోలీసులు అత్యంత గోప్యంగా నిర్వహించారు. విచారణ సందర్భంగా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేశాడు. హర్షవీణను నడిరోడ్డుపై చితకబాదినా, ముద్దాయికి వేయాల్సిన బేడీలను స్టేషన్ గేటుకు వేసి విచారణ జరపడం పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్న తప్పులకే అమాయకులను నడిరోడ్డుపై నడిపించే పోలీసులు, ఇలాంటి ఘటనలో మాత్రం నిందితుడికి సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్రకు వంతపాడడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
శ్రీకాళహస్తి కూటమి నేతల్లో తారాస్థాయికి విభేదాలు
సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి పట్టణంలో కూటమి నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. జనసేన పార్టీ కార్యకర్త శివ కుమార్ ఇంటిని అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారు. పానగల్ ఉరంధూరు ఆర్చ్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మార్చి 28న మున్సిపల్ అధికారులు బెదిరించారని జనసేన కార్యకర్త శివ తెలిపారు. కూల్చిన ఇంటిని జనసేన నాయకురాలు వినూత కోట పరిశీలించారు. జనసేన నాయకులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ టార్గెట్ చేసి వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దళిత మహిళపై జనసేన నాయకుడి అమానుషం
గొల్లప్రోలు (పిఠాపురం): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రాజకీయ అండదండలతో ఒక దళిత మహిళపై జనసేన నేత అమానుష ఘటనకు పాల్పడ్డారు. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఐ.సుబ్రహ్మణ్యం, అతని అనుచరులు ఒక ఎస్సీ మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా కులం పేరుతో దూషించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన కందేటి ప్రమీలరాణి అనే మహిళ భర్త సతీష్ భవన నిర్మాణ కాంట్రాక్ట్లు చేస్తుంటారు. తాటిపర్తిలో ఇటీవల ఒక ఇల్లు నిర్మాణం చేశారు. అందుకు సంబంధించిన డబ్బు విషయంలో ఇంటి యజమానికి, కాంట్రాక్టర్కు వివాదం తలెత్తడంతో సెటిల్మెంట్ చేసుకోవడానికి శుక్రవారం ప్రమీలారాణి, ఆమె భర్త తాటిపర్తి వచ్చారు. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం, గోవిందరాజు, సత్యనారాయణ మరో ఇద్దరు జనసేన నాయకులతో కలిసి డబ్బు విషయం తేల్చకుండా వివాదాస్పదంగా మాట్లాడుతుండటంతో భద్రత కోసం తాను సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా తనపై దాడికి దిగారని బాధితురాలు ప్రమీలరాణి ఆరోపించారు. తాను వీడియో తీస్తుండగా తనపై దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. సుబ్రహ్మణ్యం, అతని అనుచరులైన గోవిందరాజు, సత్యనారాయణ తనపై విరుచుకుపడ్డారని, తన చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించి తనను కిందకు తోసేశారని బాధితురాలి వివరించింది. అందరూ చూస్తుండగానే తన ఒంటిపై దుస్తులు చింపి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని తెలిపింది. కులం పేరుతో దూషిస్తూ ‘నీ బతుకెంత? నీ జాతి ఎంత?‘ అంటూ అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులకు ఇచ్చి న ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తూ తీవ్రంగా హింసించినట్లు తెలిపింది. ‘నా వెనుక పార్టీ ఉంది. నా దగ్గర డబ్బు ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు‘ అంటూ నిందితుడు సుబ్రహ్మణ్యం తనను బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది. ఈ అమానుష ఘటనపై బాధితురాలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. -
నాగేంద్రను స్టేషన్ కు పిలిచి విచారించాలి
-
దళిత మహిళ బట్టలు చించి.. పిఠాపురంలో జనసేన నేత అరాచకం
-
నారా లోకేష్ కు టీడీపీ క్యాడర్ బిగ్ షాక్
-
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు.. దళిత మహిళపై దాడి
-
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టీకం ప్రదర్శించారు. సెటిల్మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత బారతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు.తన భర్త ఆర్థి లావాదేవిల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో సెల్లో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు.. సెల్ ఫోన్ లాక్కుని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
మనీ లాండరింగ్ కేసులో జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్
-
జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు
-
ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్
-
నన్ను రక్తం వచ్చేలా కొట్టారు.. అసలు ఏం జరిగిందంటే..
-
చావడానికైనా సిద్దం.. శ్రీధర్ ప్లాన్తోనే దాడి: హర్ష వీణ
సాక్షి, తిరుపతి: జనసేన నేతల దాడి ఘటన నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా స్పందించారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తన పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు.జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సహకారం లేదు. మాపై దాడి జరిగినప్పుడు అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. నేను ఎందుకు అని అడిగినందుకు నాపై దాడి చేశారు. తాతంశెట్టి నాగేంద్ర నాపై రెండు దెబ్బలు వేశారు. పది మంది వచ్చి చావు దెబ్బలు కొట్టారు. ప్లాన్ ప్రకారమే మాపై దాడి చేశారు. శ్రీధరే జనసేన వాళ్లను నాపైకి ఉసిగొల్పాడు.నేను చావడానికైనా సిద్ధమే. కానీ, పోరాటం ఆపను. అరవ శ్రీధర్ వ్యవహారం పవన్ కల్యాణ్కు తెలియకుండా ఉంటుందా?. పోలీసుల విచారణకు నేను సహకరిస్తున్నా. తాతంశెట్టి దాడి చేసేలా ప్రేరేపించింది శ్రీధరే. నన్ను నమ్మించి శ్రీధర్ నట్టేట ముంచాడు. జనసేన నేతలే నాపై దాడి చేసి చంపేందుకు చూశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ నాకు న్యాయం చేయాలి. అరవ శ్రీధర్కు శిక్ష పడాల్సిందే.. అందుకే నా పోరాటం’ అని చెప్పుకొచ్చారు.అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు.అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై దాడి.. CCTV వీడియో
-
నడిరోడ్డుపై MLA శ్రీధర్ బాధితురాలు హర్షవీణను చంపేందుకు జనసేన నేతల కుట్ర
-
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సాక్షి,అమరావతి/రైల్వే కోడూరు/ఓబులవారిపల్లె /విశాఖపట్నం: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. బాబు ఏం చేస్తున్నారు? : వరుదు కళ్యాణి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన నేతల దాడిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనపడవా.. అని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి
రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడికి పాల్పడ్డారు జనసేన పార్టీ కార్యకర్తలు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు టోల్గేట్ సమీపంలో ఆమెపై దాడి చేశారు జనసేన కార్యకర్తలు. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపీ అనే వ్యక్తిని చితకబాదారు. ఆపై హర్షవీణను మూకుమ్మడిగా ఎటాక్ చేశాయి ఆ మూకలు. తనపై దాడి జరిగిన విషయన్ని రైల్వేకోడూరు పీఎస్లో ఫిర్యాదు చేశారు అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ.కాగా, నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సూటిగా ప్రశ్నించారు. తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్ కళ్యాణ్ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు.తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు.మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?, మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్ను నిలదీశారు. -
మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు
-
అరవ శ్రీధర్ బాధితురాలు లేటెస్ట్ విజువల్స్
-
నీ గెలుపుకోసం మేము కష్టపడితే.. మా ఇళ్లనే కూల్చుతావా..? కొల్లు రవీంద్రపై జనసేన నేత ఫైర్
-
అరవ శ్రీధర్ అకృత్యాలపై పవన్ కల్యాణ్ మౌనం ... కారణం ఇదేనా?
-
పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత
-
నేను ఆత్మహత్య చేసుకుంటా.. మరో సంచలన వీడియోతో ఆరవ శ్రీధర్ బాధితురాలు
-
ప్రశ్నిస్తే తాట తీస్తా.. జనసేన నేతను గెంటేసిన పవన్
-
బొలిశెట్టి సత్యనారాయణకు షాకిచ్చిన జనసేన
సాక్షి, విజయవాడ: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేని తాజాగా జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.అయితే, బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల విశాఖలో పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. కొల్లేరులో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అయితే, కొద్దికాలంగా కూటమిలో టీడీపీ చేస్తున్న అన్యాయాన్ని బొలిశెట్టి ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూటమి పార్టీ అయిన జనసేన దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో, బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి సంబంధం లేదని జనసేన ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పార్టీకి సంబంధంలేదని తేల్చి చెప్పింది.శ్రీ బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలియచేస్తున్నాము. pic.twitter.com/Xo1aBaiqAH— JanaSena Party (@JanaSenaParty) March 25, 2026పార్టీ నిర్ణయంపై బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన..‘పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.మనల్ని కలిపిన, మనం కలిసి పనిచేద్దాం అనుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ, పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు. ముఖ్యంగా కొల్లేరు సరస్సు రక్షణ విషయంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మరియు భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నందున మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను.అలాగే, పర్యావరణ ప్రభావ అంచనాలు (Environmental Impact Assessment) లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి (Land Use Conversion) వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో మీ వంతు బాధ్యతను మీరు చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత సిద్ధాంతాలకు మరియు సామాజిక బాధ్యతకు విలువనిస్తూ నా నిర్ణయాన్ని ఆమోదించిన మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు’ అని వ్యాఖ్యలు చేశారు. గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక… pic.twitter.com/whOs56u2SU— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 25, 2026అయితే, అంతకుముందే బొలిశెట్టి సత్యనారాయణ కొల్లేరు విషయమై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా..‘కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా?. కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం!. సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది..ఆక్రమణలను తొలగించకుండా, కనీస శాస్త్రీయ హైడ్రాలజీ అధ్యయనం లేకుండా ₹2,952 కోట్లతో 'శాలినిటీ మిటిగేషన్' పేరుతో అశాస్త్రీయ కట్టడాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఈ పనులపై స్టే ఇచ్చింది. ప్రకృతిని కాంక్రీట్ గోడలతో బంధించలేము; కొల్లేరుకు కావాల్సింది 'శాస్త్రీయ పునరుద్ధరణ'. ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల ఉపాధి హామీ పథకంగా మార్చవద్దు. కొల్లేరును దాని సహజ స్థితికి ఎలా తీసుకురావచ్చో, శాస్త్రీయ ఆధారాలు మరియు మ్యాప్స్తో సహా ఈరోజు ఇంటర్వ్యూలో వివరించాను.. మన పర్యావరణాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది’ అంటూ పోస్టు చేశారు.కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా ?కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం! సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది..… pic.twitter.com/fxdzIAbXAf— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 24, 2026 -
జనసేన అంటే అంత చిన్న చూపా.. టీడీపీపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
-
అన్నింటిలోనూ జనసేనకు తీవ్ర అన్యాయం: బొలిశెట్టి శ్రీనివాస్
విజయవాడ: తమ పార్టీకి అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ వారు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదాంట్లో జనసేన అసంతృప్తిగానే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నాం.. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. -
కూటమిలో కామ పిశాచులు
-
దారుణ ఘటన.. పిల్లలను అమ్మేస్తున్న జనసేన నేత తల్లి వీరమ్మ
-
పిల్లల విక్రయం కేసు.. జనసేన నేత తల్లి అరెస్టు
సాక్షి,కైకలూరు: రాష్ట్రంలో కలకలం రేపుతున్న పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీగలాగితే డొంకంత కదిలిందన్న చందంగా పిల్లల విక్రయం కేసులో నిందితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా, పిల్లల విక్రయాల్లో సూత్రధాని జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ ప్రమేయం ఉన్నట్లు తేలింది. అబ్బిశెట్టి వీరమ్మతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయ ముఠా సభ్యురాలు ఫరీనాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్జైల్లో ఉన్న ఫరీనాను పిటి వారెంట్పై విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కైకలూరు పోలీసులు పీటీ వారెంట్పై విచారించనున్నట్లు కైకలూరు పోలీసులు తెలిపారు. -
సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎమ్మెల్యే
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే సైబర్ నేరస్తుల బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొబైల్ ఫోన్కు ఆర్టీఏ చలానా పేరిట ఒక లింక్తో కూడిన మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు డ్రా చేసినట్టు మెసేజ్లు రావడంతో షాక్కు గురయ్యారు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యా దు చేశారు. జీలుగుమిల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలిపా రు. ప్రభుత్వ, అధికారిక సంస్థల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్లను ఓపెన్ చేయవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ఎమ్మెల్యే వి అని కూడా చూడను: జక్కంపూడి గణేష్
-
YSRCP నేతలపై నోరుజారిన జనసేన ఎమ్మెల్యే
-
మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు
-
నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు
-
పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం
అల్లూరి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో నిర్వహించిన మాటామంతి సభలో సీఎం చంద్రబాబు నాయుడి మోసం బయటపడింది. వితంతువులకు భర్త చనిపోయిన నెల రోజుల్లో కొత్త పెన్షన్ ఇస్తున్నట్లు వివిధ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితమని మరోసారి స్పష్టమైంది. తనకు పెన్షన్ రాలేదని పవన్ కల్యాణ్ సభలో వితంతు మహిళ స్పష్టం చేసింది. తన భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్ అందలేదని ఓ గిరిజన మహిళ తెలిపింది. పెన్షన్ కోసం చాలా దూరం నడిచి వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. నలుగురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. తనకు ఏ ఆధారమూ లేదని వివరించింది. -
పోలీస్ VS పేర్ని నాని.. స్ట్రాంగ్ వార్నింగ్


