-
డీలా పడ్డ కూటమి
-
టీడీపీ జనసేన మధ్య డబ్బు గొడవ
-
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
-
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, అక్కచెల్లెమ్మలకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికలలో గెలవబోతున్నదన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత. ఓట్ల శాతం పెరిగినంతమాత్రాన అది పాజిటివ్ అనో, నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా పరిశీలిద్దాం.ఏపీలో సుమారు ఎనభై ఒక్క శాతం వరకు ఓట్ల పోలింగ్ నమోదు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమివారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలివచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు.మహిళలు, వృద్దులు ఉదయానే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ, మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పేవరకు వెళ్లారు. మిగిలిన 99 శాతం హామీలు అమలు చేయడన్ని విస్మరించి ఈ ఒక్క కారణంకోసం వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం.నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అదికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న! కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు. మరికొన్నిసార్లు అది నిజంకాదు అని చెసప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సిండికేట్ నాయకుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఆమె చేయదలచుకున్న బ్యాంకుల నేషనలైజేషన్ , రాజభరణాల రద్దు వంటి వివిధ సంస్కరణలను సిండికేట్ నేతలు వ్యతిరేకించారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డిని వ్యతిరేకించి, తిరుగుబాటు అభ్యర్ధి వి.వి.గిరిని బలపరిచారు. దాంతో పార్టీ కూడా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా చీలిపోయింది. 1971లో ఆమె పార్లమెంటు ఎన్నికలకు వెళ్లినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారు. అప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు లభించింది. అప్పుడు ప్రజలలో సానుకూల ఓటింగ్ పడింది. 1967లో 61 శాతం ఓట్లు పోలైనా కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ చీలికతో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయినా ఆమె డి.ఎమ్.కె.,వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 1971లో ఎన్నికలకు వెళ్లినప్పుడు 55 శాతం ఓట్లే పోలైనప్పటికీ, ఇందిరాగాంధీ ఆద్వర్యంలోని కొత్త కాంగ్రెస్కు 352 సీట్లు రావడం విశేషం. అలాగే 1967 కాంగ్రెస్కు 40 శాతం ఓట్లు వస్తే, 1972లో ఇందిరాగాంధికి 43 శాతం ఓట్లు లబించాయి. అంటే ఓట్ల శాతం తగ్గినా, పెరిగినా, ఆనాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, నాయకత్వం వీటన్నిటి ఆదారంగా గెలుపు, ఓటములు ఉంటాయని తేలుతుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం చూద్దాం. 1982 లో టీడీపీ ఆవిర్బావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1983 లో జరిగిన ఎన్నికలలో 67.70 శాతం ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఆవిర్భవించిన టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. 1985లో శాసనసభను రద్దు చేసి మద్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి.ఆ ఎన్నికలలో 67.60 శాతం ఓట్లు పోల్ కాగా టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1984లో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ఎన్నికలలో 70.40 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటించిందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కి 181 సీట్లు, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1994లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు. ఆ ఎన్నికలలో కేవలం 0.60 శాతం పోలింగ్ పెరిగింది. అయినా టిడిపికి 216 సీట్లు, మిత్రపక్షాలకు మరో 34 సీట్లు వచ్చాయి. దీనిని ఏ విధంగా అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు. ఆనాడు ఎన్.టి.ఆర్.ఇచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లే వచ్చాయి. తదుపరి 1995లో ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . ఆ తర్వాత 1999 ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గినా టిడిపి 180 సీట్లతో అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది. అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు. కాంగ్రెస్ అంతకుముందున్న 26 సీట్లనుంచి 91 సీట్లకు పెరగడమే నిదర్శనం. 2004 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అంటే కేవలం 0.7 శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. కాని ఈసారి కాంగ్రెస్ 185 సీట్లతో అధికారంలోకి రాగా, మిత్ర పక్షమైన టిఆర్ఎస్ కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లబించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టిడిపి ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే, దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్,వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర,రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి.2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది.ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటటీచేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో తలపడ్డాయి. ఈ ఎన్నికలలో ఓట్ల శాతం 72,70 శాతంగా ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమమాట. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లను సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్కు పది, వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం కు 18 సీట్లు రాగా, లోక్ సత్తా ఒక సీటుకే పరిమితం అయింది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించేవారికి ఇది సమాధానం అవుతుంది. ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తి పాజిటివ్ ఓటా అంటే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92 కి పెరిగింది. కాని ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. అయినా దానిని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాదించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014 లో విభజిత ఏపీలో 76.80 శాతం ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోవడం టీడీపీకి కలిసి వచ్చింది. గతంతో పోల్చితే నాలుగు శాతం ఓట్లు పెరిగినా, టీడీపీ, బిజెపి కూటమికి 106 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓటు అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రదాని అభ్యర్ధిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటివల్ల అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చినా, కొందరు కీలక నేతలుపార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించినా, ఆయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికలలో 79.80 శాతంం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అదే టైమ్లో జగన్ ఇచ్చిన హామీలు కూడా పనిచేశాయని చెప్పవచ్చు. అందువల్లే వైఎస్సార్సీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా సుమారు రెండు శాతం పెరిగినట్లు లెక్కలు గడుతున్నారు. దీనివల్ల వైఎస్సార్సీపీకి నష్టం అని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా, ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంతమాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కనుక గెలవకపోతే పేదవర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. కాని దానికన్నా ప్రభుత్వంపై సానుకూలత ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదవర్గాలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాలలో కొంత అనుకూలత ఉన్నా, అక్కడ కూడా ఉండే పేద వర్గాలు సీఎం జగన్ వైపే మొగ్గుచూపుతాయి. దానికితోడు ఎస్సి, బిసి, ఎస్టి, మైనార్టీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైఎస్సార్సీపీ ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో,దాదాపు అవే ఇప్పటికే కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా, అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది. జగన్ పేదలు vs పెత్తందార్ల స్లోగన్ బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. అది కరెక్టు అయితే సీఎం జగన్కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్కు డోకా ఉండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆయా ఎన్నికలలో అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాగ్దానాలు, సామాజిక సమీకరణలు, నాయకత్వంపై విశ్వాసం మొదలైన అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి ఈ ఎన్నికలలో సీఎం జగన్కు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న భావన బలీయంగా ప్రజలలో నెలకొంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తమ పార్టీ వ్యక్తినే కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో జనసేన కార్యకర్త రేకపల్లి నాగరాజును ఆ పార్టీ కార్యకర్తలే కిడ్నాప్ చేశారు. సోమవారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు ముందుగా వేసే విషయంలో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రేకపల్లి నాగరాజును తోసేశారు. వాగ్వాదం జరిగింది. దీంతో నాగరాజు వ్యతిరేక వర్గమయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తుల బంధువులు అయిన గూడపల్లి, కేశనపల్లి గ్రామాలకు చెందిన జనసేన యువకులు నాగరాజును సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసినట్టు నాగరాజుతండ్రి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు గురయిన నాగరాజు దొరికాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు -
రెచ్చిపోయిన జనసేన.. అర్ధరాత్రి విధ్వంసం..
-
పచ్చ ముఠాల విధ్వంస కాండ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటమి భయంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్ , రౌడీ మూకలతో కలిసి బీభత్సం సృష్టించారు. కర్రలతో దండెత్తారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఏకంగా బాంబు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ఓటర్లపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు బరితెగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లు, వాహనాలపై దాడులకు తెగబడి విధ్వంస కాండతో చెలరేగిపోయారు. సామాన్య ప్రజానీకాన్ని హడలెత్తించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ గొడవలన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పోలింగ్ సరళి టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బెంబేలెత్తిపోయారు. దాంతో ముందస్తు పన్నాగంతో సిద్ధం చేసిన తమ రౌడీమూకలకు పచ్చ జెండా ఊపారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన రౌడీలు యథేచ్ఛగా దాడులకు తెగబడి రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించారు. ఉదయం మొదలైన ఈ దాడులు, దౌర్జన్య కాండ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తెగబడ్డ టీడీపీ, జనసేన సోమవారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారిలో మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉండటం విశేషం. అంటే ఓటింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందన్నది స్పష్టమైంది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు.. విధ్వంసం సృష్టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్రలు, కత్తులతోపాటు పెట్రోల్ బాంబులు కూడా ముందుగానే సమకూర్చుకోవడం టీడీపీ, జనసేన కుట్రకు నిదర్శనం. చంద్రబాబు ఆదేశించగానే.. టీడీపీ, జనసేన రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. చోద్యం చూసిన ఈసీ టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విధ్వంసానికి పాల్పడి పోలింగ్కు ఆడ్డంకులు సృష్టించినా ఎన్నికల కమిషన్(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నివ్వెర పరుస్తోంది. వారం రోజుల ముందు నుంచే టీడీపీ ఎన్నికల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వుయ్ యాప్ పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పూర్తి ఆధారాలను కూడా సమరి్పంచింది. టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఉదంతాలను.. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు పదును పెడుతున్న కుట్రలను కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. అయినా సరే పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అసలు టీడీపీ, జనసేన గూండాలు వీధుల్లోకి వచ్చి చెలరేగిపోతున్నా, పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఈవీఎంలను ధ్వంసం చేసినా.. ఏకంగా బాంబు దాడులకు పాల్పడినా సరే ఈసీ మాత్రం క్రియాశీలంగా స్పందించనే లేదు. పైగా వైఎస్సార్సీపీ నేతలనే కట్టడి చేసేందుకు యత్నించడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నబత్తున శివకుమార్ను మాత్రమే గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఏకపక్షంగా ఆదేశించడం విస్మయ పరిచింది. ఆయన్ను దూషించిన టీడీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపై టీడీపీ రౌడీలు దాడికి పాల్పడి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. కానీ ఈసీ మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచమని పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. మచ్చుకత్తితో దాడి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో స్లిప్పుల పంపిణీ కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ శిబిరం వద్దకు ఓటర్లు వెళ్లడంతో ఓర్చుకోలేని టీడీపీ కార్యకర్త ఇడగొట్టు రంగప్ప మచ్చుకత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంద్రప్పను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై పేగులు బయటకు వచ్చాయి. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు చెల్లాచెదురయ్యారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్పురంలో ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పురుషోత్తం రెడ్డి కారు ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ కార్యకర్త నవీన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై హత్యాయత్నం పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రిలీవ్ ఏజెంట్గా ఉన్న వైఎస్సార్సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాణ భయంతో వారు తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. దాదాపు 300 మంది టీడీపీ గూండాలు వెంట పడటంతో కారెంపూడి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం పొట్టి శ్రీరాములు కాలనీలోని ఎన్నికల బూత్ల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగి రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్తో పాటు పలువురికి గాయాలయ్యాయి. కారెంపూడిలోని 288 నెంబర్ బూత్లో ఎన్నికల ఏజెంట్గా ఉన్న గోగుల సాంబశివరావు తమ్ముడిపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడడంతో దాడిని అడ్డుకునే యత్నంలో సాంబశివరావు తలకు గాయమైంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నూలి భాస్కర్రెడ్డిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం రాళ్ల దాడి చేశారు. కాగా, టీడీపీ వర్గీయుల రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన లావనూరు హనుమంతురెడ్డి కారు అద్దాలు పగిలాయి. రాళ్ల దాడిలో జల్లా సునంద అనే మహిళకు చేయి విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూతలపట్టులో తెలుగు తమ్ముళ్ల వీరంగం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మూడు పోలింగ్ బూత్లతో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై పచ్చ మూక దాడులకు పాల్పడింది. పేటగ్రహారానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రవినాయుడు పోలింగ్ బూత్లోకి వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అనంతరం పేటపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు గురుస్వామినాయుడుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గురుస్వామి నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వావిల్తోట పంచాయతీ సీఎం కండ్రిగ పోలింగ్ బూత్లో ఏజెంట్గా వున్న హరిబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే జిల్లా సోమల మండలం కందూరు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు సురే‹Ùరెడ్డిపై టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ కేంద్రంలో వద్ద ఏర్పడిన వివాదంతో సుబ్రమణ్యం నాయుడు తన అనుచరులతో కలసి దాడి చేశాడు. గంగాధర్ నెల్లూరు మండలం జంగాలపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులు గ్రామస్తులపై దౌర్జన్యం చేశారు. చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగలో టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి చేశారు. కారును ధ్వంసం చేసి ఓ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. తొలుత టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ రోడ్డుకు అడ్డంగా పందిరి వేశారు. దీనిని పోలీసులు తీసి వేయడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇనుప రాడ్లు, కొయ్యలతో పలువురిని తీవ్రంగా గాయపరిచారు. పసుపు కండువాతో ‘గంటా’ హల్చల్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్నపల్లి పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన మల్లాడి చిన ధర్మారావు, మల్లాడి నర్సింహులు, అరదాని శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. రామకృష్ణారావుపేటలో కొందరు టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడిలో మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణతో పాటు మరికొందరు గాయపడ్డారు. రూరల్ కరప మండలం పెదకొత్తూరులో పోలింగ్ బూత్ వద్ద జనసేన కార్యకర్తలు వైఎస్సార్ సీపీకి చెందిన చింతా సత్యనారాయణపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కొని వివాదం సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం విరవ, విరవాడ ప్రాంతాల్లో కూడా జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు.‘చింతమనేని’ వర్గీయులు కత్తెరతో దాడి పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన చలపాటి రవిపై చింతమనేని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన రవి భుజంపై కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హైస్కూలులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్ పాఠశాల బూత్లో డీఎస్పీ మల్లికార్జునరావు వైఎస్సార్ సీపీకి చెందిన బూత్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారు. వారి గుర్తింపు కార్డులను లాక్కొని బయటకు వెళ్లాలంటూ ఆదేశించారని బూత్ ఏజెంట్లు పలువురు ఆరోపించారు. పొత్తూరివారిపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు. కత్తిపోటు నుంచి రాళ్ల దాడుల వరకూ..> పోలింగ్ మొదలైన కాసేపటికే టీడీపీ రౌడీలు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఏజంట్పై కత్తితో దాడి చేశారు. అనంతరం పోలింగ్ శాతం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన దాడుల తీవ్రతను అమాంతం పెంచుకుంటూ పోయాయి. > వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల 14వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జి షాహీద్పై టీడీపీ నేతలు దాడి చేశారు. వీరపునాయునిపల్లె మండలంలోని యు.వెంకటాపురం, బుసిరెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కడపలో ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లింలపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తన అనుచరులతో అక్కడకు చేరుకుని ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. > రాయచోటి నియోజకవర్గంలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటంతో వైఎస్సార్సీపీ నేత తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజంట్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. > మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
వన్స్ మోర్.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్’కే పట్టం
సాక్షి, అమరావతి: గత 59 నెలలుగా సుపరిపాలనతో ఇంటింటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షాత్కారం చేశారు. సుపరిపాలన.. ఇంటింటి అభివృద్ధి.. సుస్థిరాభివృద్ధి మరింత ఉద్ధృతంగా కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగనే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీకి మరోసారి అఖండ విజయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్కు జనం బ్రహ్మరథం పట్టడం.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సభలకు ప్రజాస్పందన లేకపోవడాన్ని బట్టి వైఎస్సార్సీపీ మరోసారి ఘన విజయం సాధించడం తథ్యమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు. జాతీయ మీడియా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 22కుపైగా సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ తిరిగి అఖండ విజయం సాధిస్తుందని వెల్లడైంది. సీఎం జగన్ సుపరిపాలనపై సానుకూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్) ఓటుతో వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంటింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలంటే..గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు తమ జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. బాబు హయాంలో 2018–19లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి సీఎం జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్ వస్తేనే ఇంటింటి భవిష్యత్తు మరింతగా మారుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సాగు మరింత లాభసాటిగా మారాలంటే..సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగాన్ని చక్కదిద్దారు. గ్రామాల్లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, విపత్తుల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 2018–19లో 8.3 శాతంతో దేశంలో 12వ స్థానంలో ఉంటే 2023–24 నాటికి 13 శాతానికి వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. మళ్లీ జగన్ వస్తేనే వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని రైతన్నలు, కౌలు రైతులు విశ్వసిస్తున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఉన్నతంగా మారాలంటే..ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేదింటి బిడ్డలకు ఇంగ్లీషు మీడియం బోధన అందుబాటులోకి తెచ్చారు. సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద లాంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సగటు నమోదు నిష్పత్తి రేటు వంద శాతానికి చేరుకుంది. మూడో తరగతి నుంచే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. 2025–26 నుంచి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్తో రాయనున్నారు. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ భాగస్వామ్యంతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన మన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే విద్యా సంస్కరణలు కొనసాగి ఉన్నత విద్యా ప్రమాణాలతో తమ పిల్లల భవిత బాగుంటుందని తల్లితండ్రులు బలంగా భావిస్తున్నారు. వైద్యరంగంలో సంస్కరణలు కొనసాగాలంటే..వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సీఎం జగన్ వైద్య సేవలను పేదల చెంతకు చేర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు పేద, మధ్య తరగతికి అందుతున్నాయి. విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడ్డాయి. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొనసాగి నాణ్యమైన వైద్యం ఉచితంగా పేదలకు, మధ్య తరగతికి అందాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకెళ్లాలంటే..విభజిత ఆంధ్రప్రదేశ్ను 2014–19 మధ్య అవినీతి పాలనతో చంద్రబాబు అధోగతి పాలు చేశారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి వైపు నడిపించారు. రాష్ట్ర అప్పులు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 21.87 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 12.13 శాతానికి తగ్గింది. దేశ జీడీపీలో మన వాటా చంద్రబాబు హయాంలో 4.47 శాతం ఉండగా సీఎం జగన్ హయాంలో 4.83 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ చంద్రబాబు హయాంలో 2018–19లో 11 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2023–24 నాటికి 16.2 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం కావడం గమనార్హం. బాబు హయాంలో ఏపీ 14వ స్థానంలో ఉండేది. ఇక తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,54,031 మాత్రమే ఉంటే 2023–24 నాటికి ఏకంగా రూ.2,19,518కి పెరిగింది. మళ్లీ జగన్ వస్తేనే రాష్ట్రం సుస్థిరాభివృద్ధి వైపు దూసుకెళుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.ఉద్యోగ, ఉపాధి విప్లవం మరింత గొప్పగా కొనసాగాలంటే..పారదర్శక పారిశ్రామిక విధానంతో సులభతర వాణిజ్యం(ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్)లో సీఎం జగన్ ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. విశాఖలో 2023 మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రూ.13,08,887 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ 59 నెలల్లో రూ.3,02,085 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ఎంఈలకు పోత్సాహకాలు ఇవ్వడంతో వాటి సంఖ్య 1.9 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 58.22 లక్షల మంది ఉపాధి పొందారు. మళ్లీ జగన్ వస్తేనే భారీ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని యువత బలంగా విశ్వసిస్తోంది.మహాస్వప్నం సాకారం కావాలంటే..విశాఖపట్నం సమీపంలో రూ.5 వేల కోట్లతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును సీఎం జగన్ నిర్మిస్తున్నారు. ఒకవైపు విదేశీ వర్సిటీల నుంచి ప్రతిష్టాత్మక కోర్సులు పూర్తి చేసిన రాష్ట్ర యువత.. బలమైన గ్రోత్ ఇంజిన్ లాంటి విశాఖ నగరం.. ఐకానిక్ బిల్డింగ్లు.. పెద్ద ఎత్తున వచ్చే ఐటీ, ఇతర పరిశ్రమలు.. కోస్తా తీరమంతటా విరాజిల్లేలా ‘బ్లూ’ ఎకానమీని ఆవిష్కరించడానికి సీఎం జగన్ నడుం బిగించారు. మళ్లీ జగన్ వస్తేనే ఆ మహాస్వప్నం సాకారమై రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని సామన్యుల నుంచి మేధావుల వరకూ బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారాలంటే..సువిశాలమైన 974 కి.మీ.ల పొడవైన తీర ప్రాంతం రాష్ట్రం సొంతం. తీరం మన బలం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దాన్ని ఎన్నడూ ఉపయోగించుకోవాలనే ఆలోచన చేయలేదు. సీఎం జగన్ రూ.16,500 కోట్లతో నాలుగు పోర్టులు(కాకినాడ గేట్వే, మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం) నిర్మిస్తున్నారు. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఇవన్నీ పూర్తయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు దిగ్గజాలు క్యూ కట్టడం ఖాయం. రామాయపట్నం పోర్టు వద్ద ఇండోసోల్ పరిశ్రమ అప్పుడే ఉత్పత్తులను ప్రారంభించడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్ వస్తేనే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారుతాయని యువత బలంగా నమ్ముతోంది. -
కూటమి మాట.. రిజర్వేషన్లు రద్దు..
సాక్షి, అమరావతి: మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు! జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను బహిర్గతం చేసిన చంద్రబాబు వాటిని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు! ‘ఎస్సీ, ఎస్టీలు, ఇతర కొన్ని వర్గాలకు ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి వాళ్లు ఏమైనా బాగుపడ్డారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతుండగా ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు మభ్యపెట్టేలా మాట్లాడారు. పోలింగ్కు ముందు చంద్రబాబు తన ముసుగు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ వర్గాలు ఆవేదనతో రగిలిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ పేదల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చరిత్ర కూడా ఆయనదే. చంద్రబాబు నరనరానా కులోన్మాదం జీర్ణించుకుపోయిందనేందుకు దళితులు, ముస్లింలు, బీసీలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తాజాగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ వారి పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అది ఫేక్ అంటూ ఎప్పటి మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.నైపుణ్య శిక్షణ చాలన్న పవన్చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. దేశంలో చాలా కులాలు, ఉప కులాలు ఉన్నాయని, అందరూ రిజర్వేషన్లు అడుగుతారని, కానీ అందరికీ ఇవ్వలేమని ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పేర్కొన్నారు. అర్హతను బట్టి అవకాశాలు రావాలని, అందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, తన కులం వాళ్లు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారని, కానీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వ్యాఖ్యల ద్వారా పేద వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. -
నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కాపులతో వ్యవహరించిన తీరును... కాపు నేతలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. నాడు చెప్పుతో కొట్టి కేసులు పెట్టి వేధించిన అనిత... ఇప్పుడు ఓట్లు కావాలంటూ పైరవీలు చేస్తుండటం విమర్శలపాలవుతోంది. తమ సొంత సామాజికవర్గాన్ని వేధించిన అనితకు మద్దతుగా భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అనితను వ్యతిరేకించినందుకు ఏకంగా పార్టీ నుంచి కొద్దిమంది నేతలు సస్పెండ్ అయ్యారు.తమ వెనుక ఉండి నడిపించిన గంటా... తీరా తన సీటు కోసం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మళ్లీ అనితకు మద్దతివ్వాలంటూ పాయకరావుపేట నియోజకవర్గానికి వచ్చి మరీ చెప్పడాన్ని కాపులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు గంటా కాపు కాదని కాపునాడు తీవ్రంగా విమర్శలు చేసింది. కాపు సామాజికవర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకే తమ మద్దతని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంగా తమ సామాజికవర్గాన్ని తీవ్రంగా అవమానించిన అనితతోపాటు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన గంటాకూ తమ దెబ్బ రుచి చూపిస్తామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనిత బాధితులెందరో...! ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత నియోజకవర్గంలోని నేతలందరిపైనా అధికారం చెలాయించారు. కాపు నేతలపై మరింత కక్షపూరితంగా వ్యవహరించారు. ఏకంగా కాపు నేతలను చెప్పుతో కొట్టడమే కాకుండా కేసులు బనాయించి మరీ వేధించారు. కాపుల మద్దతుతో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత మంగవరం గ్రామానికి చెందిన ఒక కాపు యువకుడ్ని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టారు. తనపై తప్పుగా వ్యాఖ్యలు చేశాడన్న ఆగ్రహంతో చెప్పుతో కొట్టి కాపు జాతిని ఘోరంగా అవమానించారు. మహిళా ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పే కానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఆ సామాజిక వర్గం పెద్దల సమక్షంలో మందలించడం దీనికి పరిష్కారం. ఇవేమీ చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో వ్యవహరించారు.చెప్పుతో కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అదే విధంగా ఆనాడు ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిన కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన సీనియర్ నేత గెడ్డం బుజ్జిపై అత్యాచారం కేసు పెట్టించింది. అతన్ని అరెస్టు చేయించడానికి తన అధికారాన్ని అంతా ఉపయోగించింది. బుజ్జికి చెందిన భూములపై సిట్కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బుజ్జికి అండగా నిలబడటంతో ఆయన అరెస్టు నుంచి బయటపడ్డారు. తన గెలుపునకు సహకరించిన మరో కాపు నేత తోట నగేష్ పట్ల కూడా ఆమె నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అనిత ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నారు. అలాగే పట్టణానికి చెందిన మరో ఇద్దరు కాపు టీడీపీ నాయకులు గొర్లె రాజబాబు, మజ్జూరి నారాయణరావుల పట్ల కూడా అనిత కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఈ ఇద్దరు నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం, వారు వేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంగా వారిద్దరినీ గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది.గంటా మధ్యవర్తిత్వంపై కాపుల్లో ఆగ్రహం అనిత చేతిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న గెడ్డం బుజ్జి పలుసార్లు జనసేన సమావేశాలు ఏర్పాటు చేసి అనితకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, ఓడించి తీరుతామంటూ గతంలో ప్రకటనలు చేశారు. కాపులను చెప్పుతో కొట్టి... తమ నేతపై రేప్ కేసు పెట్టిందని పదే పదే బుజ్జి అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. బుజ్జి మెత్తబడడాన్ని కూడా ఆయన అనుచరులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తోట నగేష్ జనసేనలో చేరి అనితకు మద్దతుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటివరకు గంటా వర్గంగా ముద్రపడి... అనితను తీవ్రంగా వ్యతిరేకించిన గొర్లె రాజబాబు, నారాయణరావులు ఏకంగా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు.అయితే గంటా వీరి మధ్య రాజీ కుదిర్చారు. ‘నీకు సీటు ఇవ్వాలంటే పాయకరావుపేటలో నీ వర్గాన్ని అనితకు మద్దతు ఇచ్చేలా చేయాల్సిందే’నంటూ చంద్రబాబు నుంచి గంటాకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వారి మనోభావాలను సైతం పట్టించుకోకుండా గంటా వ్యవహరించాడంటూ ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గంటాది అసలు కాపు సామాజికవర్గమేనా అని కాపునాడు నేతలు నేరుగా ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు అత్యధిక సీట్లను కేటాయించిన వైఎస్సార్సీపీకి మద్దతిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. -
అటు మోసం – ఇటు నమ్మకం
అటు మాటపై నిలబడని చంద్రబాబు.. ఇటు మాటపై నిలబడే సీఎం జగన్ కూటమిది మాయఫెస్టో..👉 మాటలతో మభ్యపెట్టి లబ్ధి పొందడమే చంద్రబాబు అజెండా 👉 మేనిఫెస్టో అంటే బాబు దృష్టిలో చిత్తు కాగితం 👉 ఎన్నికలప్పుడు అలవికాని హామీలు..ఆ తర్వాత చెత్తబుట్టలో వేయడం బాబు నైజం 👉 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టుకట్టి 650 హామీలు ఇచి్చన బాబు 👉 అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచిన వైనం 👉 రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా రైతులకు టోపీ 👉 రూ.25,570.90 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలకు మోసం 👉 ఇంటికో ఉద్యోగం.. లేదా నెలకురూ.2 వేల నిరుద్యోగ భృతి అంటూ యువతకు వంచన2014 ఎన్నికల తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీలతో జట్టుకట్టి అలవికాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటక, తెలంగాణల్లోవిఫలమైన పథకాలకు సూపర్ సిక్స్ ముసుగు వైఎస్సార్సీపీది మేనిఫెస్టో👉 మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా చూస్తున్న సీఎం జగన్ 👉 అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇస్తున్న జననేత 👉 విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది జగన్ సిద్ధాంతం 👉 ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం జగన్ విధానం 👉 2019లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ 👉 అధికారంలోకి వచి్చన తొలి ఏడాదే 95 శాతం.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు 👉 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ 👉 నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం 👉 ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత 👉 2024 ఎన్నికల మేనిఫెస్టోను రెండు పేజీలతో విడుదల చేసిన సీఎం జగన్ 👉 జగనన్న అమ్మ ఒడి కింద ఇస్తున్న సొమ్ము రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు 👉 వైఎస్సార్ రైతు భరోసా కింద చేస్తున్న సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు 👉 వృద్ధాప్య పెన్షన్ రూ.3 వేల నుంచి రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతానని హామీచంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం ఇదే తొలిసారి కాదు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, 1995లో అధికారంలోకి వచి్చన బాబు.. 94 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం హామీలను తుంగలో తొక్కారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, రూ.2 కే కిలో బియ్యాన్ని రూ.5.50కి పెంచి ప్రజలను మోసం చేశారు. 1999 ఎన్నికల్లోనూ అదే కథ. కోటి మందికి ఉపాధి కల్పిస్తానని, 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. సాక్షి, అమరావతి: మేనిఫెస్టో అంటే ప్రజలకు నాయకుడు ఇచ్చే మాట.. పారీ్టకి, ప్రజలకు మధ్య ఒప్పంద పత్రం.. నాయకుడికి, ప్రజలకు మధ్య బంధం. అందుకే మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా పవిత్రంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూస్తారు. విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది ఆయన సిద్ధాంతం. అందుకే అమలు చేయదగిన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు. 2014, 2019, 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలే అందుకు నిదర్శనం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తద్భిన్నం. ఎన్నికలప్పుడు అలవికాని హామీలతో.. అబద్ధాలకు రెక్కలు కడుతూ మేనిఫెస్టోను విడుదల చేయడం, అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కడం, ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో మేనిఫెస్టోను మాయం చేయడం చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల మేనిఫెస్టో అమలే అందుకు తార్కాణం. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన చంద్రబాబు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ సహా అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సమయంలో రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ ప్రకటించాలని సీఎం జగన్కు సన్నిహితులు సూచించినా.. దాన్ని అమలు చేయలేమని, అలాంటప్పుడు ఆ హామీ ఇవ్వలేనని తేల్చిచెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో సీఎం జగన్ అధికారంలోకి రాలేకపోయారు. అప్పుడు అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు. వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేశారు. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరి కొత్త నిర్వచనం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆరి్థక ఇబ్బందులు ఉత్పన్నమైనా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు.2014 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కారు. 2019 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచి్చన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక దానిపై విస్తృతంగా అధ్యయనం చేసి.. పదవీ విరమణ అయ్యే నాటికి చివరి నెల జీతంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్ను తెచ్చారు. హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండే రెండు పేజీలతో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా ఇస్తున్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతానని.. రైతు భరోసా కింద ఏటా ఇస్తున్న రూ.13,500ను రూ.16 వేలకు పెంచుతానని.. వృద్ధాప్య పెన్షన్ను రూ.3 వేల నుంచి రెండు దశల్లో రూ.3,500కు పెంచుతానని కొత్తగా హామీలు ఇచ్చారు. కానీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 2014 తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. తెలంగాణ, కర్ణాటకల్లో విఫలమైన పథకాలకే సూపర్ సిక్స్ ముసుగేసి అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని భావించే బీజేపీ దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇచ్చిన మాటపై నిలబడే సీఎం జగన్ ఓ వైపు.. చెప్పిన మాటపై నిలబడిన చరిత్ర ఎన్నడూ లేని చంద్రబాబు మరో వైపు.. ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే. -
కూటమితో లాభం లేదు..
-
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
సాక్షి, అమరావతి/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV -
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
-
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయమని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కల్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం సిద్ధమేనా.. టైము రెండు కావస్తోంది. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యే ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచి పెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ,ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.కేవలం మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కానేకావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇదే చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే? పొరపాటున చంద్రబాబు నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతిఒక్కరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్దం చెప్పిన మీ జగన్.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు రూ.2.70 లక్షల కోట్లు, మళ్లీ చెబుతున్నాను రూ.2.70 లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కడం, వివిధ పథకాలకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా పంపించాడు అని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. నేను అడుగుతున్నాను.. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా ఈ మాదిరిగా జరిగిందా? ఈమాదిరిగా బటన్లు నొక్కడం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్లిపోవడం.. గతంలో ఎప్పుడైనా చూశామా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి మీ జగన్. ఇలా అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలలకాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చింది ఈ 59 నెలలకాలంలోనే కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతీదీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో జరగనివిధంగా నాడు-నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ బడులల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూములో కూడా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబ్లు కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3 తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతోంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే పిల్లల టెక్స్ట్ బుక్కుల్లో ఒక పేజీ ఇంగ్లీష్ మరో పేజీ తెలుగుతో పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి. బడులు తెరిచే టైమ్కే పిల్లలకు విద్యాకానుక అందుతోంది, బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటున్నాం, ఈరోజు నేను అడుగుతున్నాను.. మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం,పెద్ద చదువులకు ఏ తల్లి, తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదని, అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన అనే కార్యక్రమం, ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలతో అనుసంధానం, డిగ్రీలో ఇంటర్న్షిప్ తప్పనిసరి చేయడం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడూ?.అక్కచెల్లెమ్మలు ఆర్దిక స్వావలంబన దిశగా...మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మలను తమ కాళ్ల మీద తాము నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ,చేయూత, కాపునేస్తం,ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, అందులో చేపట్టిన ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇక్కడున్న ఇన్ని వేలమంది నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను.. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా? అన్నా జరిగాయా? జరిగాయా అక్కా? జరిగాయా తమ్ముడూ?.గతంలో లేని విధంగా రైతన్నను చేయిపట్టుకుని నడిపించాం.అవ్వాతాతలకు గతంలో ఎప్పుడూ జరగనివిధంగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పథకాలు.. నేను అడుగుతున్నాను ఇప్పుడిలా జరుగుతున్న కార్యక్రమాలు ఇంటికే పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం.. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. అన్నా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ.. నేను అడుగుతున్నాను ఇంతగా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా ఆటోలు, ట్యాక్సీలు తోలుకునే నా అన్నదమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకారభరోసా,చిరువ్యాపారులకు, శ్రమజీవులకు అండగా ఓ తోడు, చేదోడు, లాయర్లకు కూడా లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం.. నేను అడుగుతున్నాను పేదవాడికి ఆరోగ్యంపట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. వీటన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, నాలుగు అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, మరో నాలుగు అడుగులు ముందుకుపోతే అదే గ్రామంలో నాడు-నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది, గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తోంది. నేడు అడుగుతున్నాను.. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్లెదుటే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా చూశారా? అని కూడా మీ బిడ్డ అడుగుతున్నాడు. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు . మరోవంక చూడండి.. చంద్రబాబు 14 ఏళ్లు, ౩ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానంటాడు. ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీలో ఏఒక్కరికైనా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు మీలో ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు మరి అలాంటి వ్యక్తి పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఒక్క హామీని అమలు చేయని బాబు.అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఆయన మీ ప్రతిఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా? (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అని అడుగుతున్నాను. గుర్తుందా అన్నా ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడూ? అక్కా ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తోందా? 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫొటోలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా? అని అడుగుతున్నాడు మీబిడ్డ.చంద్రబాబు విఫల హామీలు.ఇందులో చెప్పిన హామీలు.. మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నా రూ.87,612 కోట్ల మేర రైతుల రుణమాఫీ జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా రూ.14,205 కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఇన్నివేల మంది ఉన్నారు నేను అడుగుతున్నారు మీ ఇళ్లల్లో ఏ ఒక్కరికైనా కూడా రూ.25 వేల కథ దేవుడెరుగు, ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి నెలనెలా అన్నాడు. ఐదేళ్లు ఆయన పరిపాలన చేశాడు 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇక్కడున్నవాళ్లల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అర్హులందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు. అన్నా నేను అడుగుతున్నా?, అక్కా నేను అడుగుతున్నా ? మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?.రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, నిర్మించాడా? కళ్యాణదుర్గంలో కనిపిస్తోందా ? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించి... 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అనిమీబిడ్డ అడుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న బాబు.మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే వ్యక్తి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే చంద్రబాబు.. మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటున్నాడు. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? అన్నా నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? అక్కా నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారమంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? అన్నా నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ ఒక్క మంచి చేయలేదు. 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్కపేదవాడికి ఏ రోజూ కూడా ఏ స్కీమూ తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసిన పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితమంతా కూడా మోసాలు, ఆయన జీవితమంతా కూడా అబద్ధాలు. ఆయనకు అధికారం వచ్చిన ప్రతీసారి కూడా పేదవాడు బాగు పడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసిందేమిటంటే దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు.మంచి కొనసాగాలంటే ఫ్యానుకే ఓటేయండి.కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండి ఉన్నాయి. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బుల్లేవు. కానీ చంద్రబాబు ఆ బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులోనుంచి ఓటుకు రూ.2వేలు, 3వేలు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఓటుకు రూ.4వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరూ ఆ డబ్బులు వద్దు అని చెప్పొద్దు. ఎందుకంటే ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతిఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి వెళ్లండి. మీ భార్యలతో కూర్చొండి, మీ ఇంట్లో ఉన్న అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లలను పెట్టొద్దు. వాళ్లతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి. మీ ఆడపడుచులతో మాట్లాడండి. అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరిగింది? మీకు మంచి జరిగింది? ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీఅందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను.ఇది విన్నవించుకుంటూ వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ రూ.3వేలు మళ్లీ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్లీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు... సిద్ధమేనా?మన గుర్తు ఫ్యాను. ఇక్కడో, అక్కడో, ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే..మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడూ, అక్కా మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వా మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి.మన అభ్యర్ధులను ఆశీర్వదించండి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తున్నాను. మీలో ఒకడు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు, మంచివాడు, సౌమ్యుడు.. నేను ఇంతకు ముందే చెప్పా.. చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. బాబు ఇచ్చే రూ.2 వేలకో, రూ.3 వేలకో పొరపాటున మోసపోకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మళ్లీ ఉంటేనే ప్రతినెల కేలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందే చెప్పి ప్రతి నెలా ఇదుగో ఈనెల రైతు భరోసా, ఇదిగో ఈనెల అమ్మఒడి, ఇదిగో ఈనెల చేయూత అంటూ ప్రతి సంవత్సరమూ..ఐదు సంవత్సరాలూ ప్రతి పథకమూ కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రూ.2వేలకు, రూ.3వేలకు మోసపోవద్దండీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే..ప్రతి నెలా ప్రతి ఇంట్లో పండుగే అని గుర్తుపెట్టుకోండి. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే...మళ్లీ జగనే రావాలి..జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంపీ అభ్యర్థిగా శంకరన్న నిలబడుతున్నాడు. తాను కూడా మీలో ఒకడు. వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు. మంచివాడు సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్లుగా మీ మెజారిటీతో ఇద్దరినీ గెలిపించాలని సవినయంగా మీఅందర్నీ రెండు చేతులు జోడించి పేరుపేరునా మీబిడ్డ ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి శ్రీ.వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
PK: 'పులుసు కారుతోంది'..!
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్.. అని ఆంగ్ల నానుడి. నాలుగైదు రోజులుగా పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్కల్యాణ్ ముఖాన్ని చూస్తే.. ఆయన పరిస్థితి ఏంటన్నది తెలిసిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయం పవన్ను నిలువెల్లా వణికిస్తోందట. టీడీపీ నేత వర్మ అనుచరులు పవన్కు సహకరించేది లేదని ఇప్పటికే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు.మరోవైపు మహాసేన రాజేష్ కూడా జనసేన ఓటమే లక్ష్యంగా తమ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని పవన్ అభిమానుల ఆరోపణ. పవన్ను ఎదగనిస్తే లోకేశం రాజకీయ భవిష్యత్తుకు గుదిబండలా మారతారన్న భయంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆక్రోశిస్తున్నారు. అందుకే చిరంజీవితో సహా పవన్ తన కుటుంబాన్ని, బుల్లితెర, సినీ పరిశ్రమలో తన అనుయాయుల్ని బతిమాలి మరీ ఎన్నికల ప్రచారంలోకి దించారట.ఇవి చదవండి: బాబు-మోదీ ఇద్దరూ తోడు దొంగలే.. -
వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
-
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
-
బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్
-
కూటమి చర్యలు అనైతికం
నెల్లూరు (దర్గామిట్ట): కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడుతున్నాయని నెల్లూరు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో కొందరు కూటమి పార్టీ నాయకులు పోలింగ్ బూత్లోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు.టీడీపీ సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డి లాంటి వ్యక్తులు పోలింగ్ జరిగే చోటుకు వెళ్లారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో కొందరు బీఎల్ఓలు నిబంధనల్ని ఉల్లంఘించారని తెలిపారు. కొందరు అధికారులు కూటమికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రిటరి్నంగ్ అధికారి వికాస్ మర్మత్కు ఆధారాలతో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏడుగురు సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే ఒకరి మీద చర్య తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూప్కుమార్ యాదవ్ రౌడీలని.. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఆయనకు తనవంతు సాయం అందిస్తున్నారన్నారు. డబ్బులతో గెలవచ్చనుకుంటున్నారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు. డబ్బులతో గెలవ వచ్చని వాళ్లు భావిస్తున్నారన్నారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చి దాంతో గెలుస్తానని నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం 1,200 మంది రౌడీలను, నారాయణ సిబ్బంది, విజయవాడ, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారన్నారు. -
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు
ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయపడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోం ఓటింగ్ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్ సీపీకి చెందిన షేక్ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి.శరత్బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్పై వెళ్తున్నవైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జుల నగేష్పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం జగన్పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్
-
Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు. 2019లో గుడివాడ అమర్నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది. -
మహిళలంటే పవన్కు గౌరవం లేదు..
‘మహిళల్ని అన్ని విధాలుగా దోచుకోవడం... పై నుంచి కిందివరకూ అన్ని స్థాయిల్లో ప్యాకేజీలు తీసుకోవడం... తెలుగుదేశం పార్టీని గెలిపించడం తప్ప మరో సిద్ధాంతాలేవీ జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్కు లేవు. ఆ పార్టీలో ఎంతో ఉన్నతాశయంతో చేరిన నేను ఎంతగానో నష్టపోయా. అందులో పనిచేశాక ఆయన మనస్తత్వం తెలుసుకుని ఇక ఉండలేక బయటకు వచ్చేశా.’ అని ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరిన ఎన్ఆర్ఐ చిట్టె సుభాషిణి అన్నారు. జనసేన వల్ల తాను ఏవిధంగా నష్టపోయిందీ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...అమెరికా నుంచి వచ్చి అగచాట్లు..తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు దగ్గర సింగవరం గ్రామం మాది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయన ఉద్యోగరీత్యా 2011లో అమెరికా వెళ్లాం. నా భర్తకు మొదటి నుంచీ పవన్కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన గురించి గొప్పగా ప్రచారం చేసే కొన్ని చానళ్లు, కొన్ని వీడియోలు నాకూ చూపించేవారు. నెమ్మదిగా నేను కూడా ఆయన అభిమానిగా మారాను. ఆ పిచ్చితోనే ఉద్యోగం సహా అన్నీ వదిలేసుకుని ఇండియా వచ్చేసి జనసేన పార్టీలో చేరిపోయాను.పేరుకే జనసేన... టీడీపీ గెలుపే దాని లక్ష్యం!తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గమైన గోపాలపురం వేదికగా జనసేన పార్టీతో నా అనుబంధం మొదలైంది. నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ తరపున ప్రచారం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఆ పార్టీలో పరిస్థితులు అర్థమయ్యాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ కోవర్టు. అతడే కాదు జనసేన ముఖ్యనాయకులందరూ అంతే. నాలా జనసేన కోసం నిస్వార్థంగా, చిత్తశుద్ధితో పనిచేసే వారిని అడ్డుకోవడమే వారి ధ్యేయం. ఐదేళ్లు పార్టీకోసం నిరంతరం పనిచేసినా ఏ చిన్న పదవి కూడా నాకివ్వలేదు.దళితులంటే చిన్నచూపు..ఆ పార్టీలో ప్రతి ఒక్కడూ నాయకుడే అన్నట్టు ప్రవర్తించేవారు. నేను పవన్తో ఫొటో దిగాలంటే రూ.2 లక్షలు డొనేషన్ అడిగారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీలో దళితుల్ని ఎదగనీయకుండా చేయడమే వారి ఆలోచన. అందుకే నా లాంటి దళిత మహిళ అభ్యర్థి ని ప్రోత్సహించాలనే ఆలోచన చేయ లేదు.వీర అంటూనే... వేధిస్తారు!వీరమహిళ అనే గొప్ప పేర్లు పెడతారు. కానీ అదంతా మోసం. అయినా వీర మహిళలమేమిటి? ఇలాంటి పైపై మెరుగులు ఆపాదిస్తే ఏమీ ఆశించకుండా అలా పడి ఉంటారనీ, మొగుళ్లని ఇళ్లను వదిలేసి తమ వెనుక తిరుగుతారని భ్రమలు కల్పిస్తారు. అంతేగాదు పవన్కి ఎంత మహిళాదరణ ఉందో అంటూ అందరూ అనుకోవాలని మాత్రమే తప్ప మహిళలకి ఎటువంటి ఆదరణ లేదు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేని మహిళకి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. నన్ను ఎన్నో రకాలుగా వేధించారు. శారీరకంగా, ఆరి్థకంగా దోచుకో వాలని చూశారు.రియల్ లీడర్ వైఎస్ జగన్..అమాయకుల అభిమానాన్ని అడ్డం పెట్టు కుని పవన్లా పావలా.. పరకా పోగేసుకోవడం నాయకత్వం అనిపించుకోదు. నాయకుడు అంటే సామాన్యులను కూడా నాయకులుగా మార్చాలి. ఆ సత్తా వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. చిన్న చిన్న వారిని కూడా ఆయన గెలిపించుకున్నారు. అప్పట్లో నేను చేసిన తప్పు ఏమిటంటే వైఎస్సార్సీపీని అసలు గమనించలేనంతగా జనసేన పిచ్చిలో కూరుకుపోవడం. వీరుడైనా, శూరుడైనా ప్రజానాయకుడు అన్నా జగన్కు మాత్రమే నప్పుతుంది. ఆయన నాయకత్వంలోనే మహిళలకు మంచి జరుగుతుంది.కుటుంబాన్ని వదిలేసి పార్టీకోసం పాటుపడ్డా..నా సొంత ఖర్చులు పెట్టుకుని పిలల్ని, భర్తని హైదరాబాద్లో వదిలేసి తూర్పు గోదావరి జిల్లాలో కాళ్లరిగిపోయేలా తిరిగాను. అవసరమైన సమయంలో పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల వారికి మాటలు కూడా సరిగా రాలేదు. గుండె పగిలిపోయేంత ఆవేదనతో చెబుతున్నా. నా ఉసురు తప్పకుండా పవన్కి తగులుతుంది. రూ.కోటిన్నరకి పైగా డబ్బు కోల్పోయాను. అయినా పవన్ పిచ్చి వదలని నా భర్తతో కూడా గొడవలు పడాల్సి వచ్చింది. జనసేన పార్టీలో నేనెన్ని అవమానాలు భరిస్తున్నానో విడమరిచి చెప్పాను. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
విజయ మనదే.. ధీమాగా ఉండండి
ఓటర్లకు ఎమ్మెల్యే కేపీ కృతజ్ఞతలు
వాదంపల్లి నాయకులకు తాటిపర్తి పరామర్శ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement