breaking news
Janasena
-
నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు
-
పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం
అల్లూరి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో నిర్వహించిన మాటామంతి సభలో సీఎం చంద్రబాబు నాయుడి మోసం బయటపడింది. వితంతువులకు భర్త చనిపోయిన నెల రోజుల్లో కొత్త పెన్షన్ ఇస్తున్నట్లు వివిధ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితమని మరోసారి స్పష్టమైంది. తనకు పెన్షన్ రాలేదని పవన్ కల్యాణ్ సభలో వితంతు మహిళ స్పష్టం చేసింది. తన భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్ అందలేదని ఓ గిరిజన మహిళ తెలిపింది. పెన్షన్ కోసం చాలా దూరం నడిచి వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. నలుగురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. తనకు ఏ ఆధారమూ లేదని వివరించింది. -
పోలీస్ VS పేర్ని నాని.. స్ట్రాంగ్ వార్నింగ్
-
రెచ్చగొడుతున్న జనసైనికులు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
-
మచిలీపట్నంలో మరోమారు ఉధ్రిక్తత
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పదే పదే రాజకీయ విద్వేషాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. గత రాత్రి మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపం రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా ఏర్పాటుకు జనసేన నాయకుల యత్నించారు. అయితే వారిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే ఈరోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) మళ్లీ కాంక్రీట్తో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలను అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేత బొర్రా విఠల్ను బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన జనసేన కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం
-
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.ఇదిలా ఉండగా, తన సోషల్ మీడియా అకౌంట్ను మూడేళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే ఒకేసారి చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా జరగదు. ఒకరు ఉదయం భూమి చేస్తే.. అదే కార్యక్రమానికి సాయంత్రం మరొకరు భూమి పూజ చేస్తారు. ఇలా భూమి పూజతో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమిలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు సార్లు భూమిపూజ నిర్వహించారు కూటమి నేతలు. కోడూరు మండలం కోడూరు ఎస్సీ కాలనీ రోడ్డుకు భూమి పూజలో రగడ నెలకొంది. ఉదయం జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ భూమి పూజ చేశారు. మధ్యాహ్నం అదే రోడ్డుకు కోడూరు మండల టిడిపి నాయకులు మళ్లీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దేనికి పనికొస్తార్రా మీరు.. కార్యకర్తలపై జనసేన ఎమ్మెల్యే ఫైర్
-
జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు
కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చింతకింద సునీల్, మేక స్వాతి తేజ్ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్ మండిపడ్డారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంగన్వాడీలపై ఆటవిక దాడి!
2000 జూలై 26..సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.2026 మార్చి 3..విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!సాక్షి, అమరావతి, నెట్వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్వాడీలు రాత్రి ధర్నా టెంట్లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం..దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈడ్చేసిన మగ పోలీసులు..టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో యాక్షన్లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్ను కకావికలం చేసి అంగన్వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్న మహిళలు..చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.కర్నూలులో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలు బాబు మారలేదు.. అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులుచంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్వాడీల వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు. -
రూ.6,000 కోట్లు ఔట్.. ‘పారి’.. శ్రమ!
సాక్షి, అమరావతి: ‘‘మీ కప్పాలు కట్టలేం.. మీ బెదిరింపులు భరించలేం.. మీ భూములు వద్దు.. మీకో దండం..!’’ అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖంమీదే విసిరి కొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి నాలుగు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా రూ.6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాలను ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూపు నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమీషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని గాయపర్చారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరితెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ‘సీమ’ దాకా సేమ్ సీన్..శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఆరీ్టపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటే తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పారీ్టకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. బైబై చెప్పేసిన కోకోకోలా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకొని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొర పెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఒప్పందానికే దిక్కులేదు.. బాబు సర్కారు అధికారం చేపట్టిన తరువాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. రూ.85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎలీజీ ఎల్రక్టానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. వడ్డీతో సహా ‘ఆజాద్’ వసూలు..! శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండీ కింద అజాద్ మొబిలిటీ చెల్లించిన రూ.2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.జిన్ఫ్రా.. పరుగో పరుగు! రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్ఐపీబీ 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షలు చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను రద్దు చేయాలంటూ లేఖ రాసింది. దీంతో జిన్ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్కో మిథాని యూనిట్ ప్యాకప్...!కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పీఎస్యూ ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతోంది. రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథాని కలిసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంతులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జారుకున్న ‘జూపిటర్..’ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని.. రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్ధలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
బాబు, పవన్ పై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఆగ్రహం..
-
జనసేన ప్రధాన కార్యాలయంలో యువకుడి హల్చల్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి శుక్రవారం ఓ యువకుడు ప్రవేశించి కారు అద్దాలను పగలగొట్టడం సంచలనం కలిగించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతను కార్యాలయంలో చొరబడ్డాడు. సాధారణంగా పార్టీ కార్యక్రమాలు ఉంటేనో.. లేదంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకుంటే తప్ప మీడియా ప్రతినిధులను సైతం భద్రతా సిబ్బంది జనసేన పార్టీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే ఆ వ్యక్తి ఎలా లోపలకు ప్రవేశించాడన్న దానిపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనపై గుంటూరు ఐజీ, ఎస్పీ ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల నారం నీలాద్రిగా సమాచారం. అతనికి మతిస్థిమితం లేదని.. పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆ వ్యక్తి నిర్మాణ పనులకొచి్చన కారి్మకుడిగా భద్రతా సిబ్బంది భావించడం వల్లే లోపలకు రాగలిగాడని చెబుతున్నారు. గత ఏడాది మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఓ జనసేన నేత ‘జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, దానికి జనసేన పార్టీలో కొందరు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. -
టీడీపీ ఎమ్మెల్యే పై జనసేన నేత బాలినేని సంచలన కామెంట్స్
-
Mangalagiri : జనసేన ఆఫీస్ లో దాడి.. కారు అద్దాలు ధ్వంసం
-
దేవుడా లేక...త్రివిక్రమ్ స్క్రిప్ట్ మాట్లాడించిందా... ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు
-
ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని నీకు.. డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?
-
పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు
-
సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు
-
మూగబోయిన పవన్ గొంతు అవమాన భారంతో జనసైనికుల ఆవేదన..
-
ఆమెని చూసి సిగ్గు తెచ్చుకోండి... జనసేన రజినీ పై అంబటి ప్రశంసలు
-
జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మలినేడి బాబి అనుచిత వ్యాఖ్యలు
-
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీజేపీ, జనసేనను అవమానిస్తోన్న టీడీపీ
-
జనసేన ఇంచార్జ్ రామారావుకు షాక్.. మత్స్యకారుల ఝలక్
సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు జనసేన ఇంచార్జ్ టీవీ రామారావుకు చేదు అనుభవం ఎదురైంది. కొవ్వూరులో మత్స్యకారులు ఆయనపై తిరుగబడ్డారు. దీంతో, మత్స్యకారులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, చేసేదేమీ లేక అక్కడి నుంచి రామారావు వెళ్లిపోయారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వూరు శ్రీనివాస ఘాట్ వద్ద అనుమతులు లేకుండా టారిజం బోట్ పేరుతో టీవీ రామారావు కట్టడాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేని టూరిస్ట్ బోటు కట్టడాలను ఆపాలని తమ బతుకు తెరువు పోగొట్టుదంటూ మత్య్సకారులు ఆందోళనకు దిగారు. దీంతో, మత్స్యకారులకు, టీవీ రామారావు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మత్స్య కారులు.. పనులు అడ్డుకోవడంతో చేసేది ఏమీ లేక పర్మిషన్ తీసుకునే వస్తానంటూ పనులను ఆపేసి రామరావు అక్కడి నుంచి జారుకున్నారు.ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. తమ జీవనోపాధి దెబ్బతిసేలా తమ పడవలు పెట్టుకునే ప్రాంతంలో టూరిజం బోట్ ఏర్పాటు చేస్తామని తమపై రామారావు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపుల మధ్య టూరిస్ట్ బోటు కట్టడాలను కట్టి 100 కుటుంబాలకు జీవనోపాధి పోగొడుతున్నారని అన్నారు. అక్రమ కట్టడాలు కడుతున్నా అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవమానాలు భరించలేను.. జనసేనకు రాజీనామా చేస్తున్నా..
ఉంగుటూరు: ‘జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి శక్తికి మించి పనిచేశా.. అయితే అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నాకు ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు.. అవమానాలు భరించలేను.. అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పంది రాంబాబు తెలిపారు.సోమవారం పార్టీ సభ్యత్వానికి, మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ.. ప్రతిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్కి, జిల్లా అధ్యక్షుడికి పంపించారు. అనంతరం ఉంగుటూరులో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారీ్టలో తనను చిన్నచూపు చూస్తున్నారని, తనకు అన్నీ అవమానాలేనని వాపోయారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నాలుగు సార్లు పార్టీ మండల కార్యకర్తల సమావేశాలు నిర్వహించారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.తనను ఒక మండల అధ్యక్షుడిగా ఎప్పుడూ చూడలేదని.. కార్యకర్తల దగ్గర చులకనగా చూసేవారని వాపోయారు. ఉన్నత వర్గాలకు, ధనికులకు మాత్రమే ఎమ్మెల్యే ధర్మరాజు దగ్గర ప్రాధాన్యత లభిస్తుందని..బడుగు, బలహీన (బీసీ) వర్గాలకు ఉండదన్నారు. అందుకే ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పని చేయలేనని చెప్పారు. -
యువత దెబ్బ.. జనసేన MLA కనబడుట లేదు
-
నాకు శ్రీధర్ కి జరిగింది ఇదే.. బాధితురాలి కొత్త వీడియో
-
కోటలు దాటిన మాటలు.. కోట్లు తేలేకపోయాయి ...!
ఈ ఏడాది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమిటి? ఈ ప్రశ్నకు ఎన్డీయే భాగస్వామి పక్షాలైన టీడీపీ, జనసేనలు కూడా సమాధానం చెప్పలేకున్నాయి. ప్రత్యేక కేటాయింపు లేవీ లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్లు ముక్తసరిగా ‘హర్షం’ వ్యక్తం చేశారు. ఏపీ దృష్టిపెట్టిన అంశాలపై దూకుడుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుందని సీఎం, అభివృద్ధికి ఊతమని పవన్కళ్యాణ్, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందని లోకేశ్లు పొడిపొడిగా వ్యాఖ్యానించారు.ఫలానా రంగానికి ఇన్ని నిధులు వచ్చాయని మాత్రం చెప్పలేకపోయారు. పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. వేర్వేరు మంత్రులను కలిసి అధిక నిధులు కోరామని ప్రకటనలు గుప్పించినా లభించింది హళ్లికిహళ్లి.. సున్నకు సున్నా! అంతే! కానీ.. ఎల్లో మీడియా మాత్రం తెగ హడావుడి పడిపోయింది.ఈనాడు పత్రిక కథనంలో.. అభివృద్ది బుల్లెట్ పరుగులేనట. అవేమిటంటే రేర్ ఎర్త్ మినరల్ కారిడార్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ గుండా వెళతాయట. సెమీ కండక్టర్ 2.0తో ఏపీకి ప్రయోజనం అంటోంది. అదేసమయంలో ఏపీ సమస్యలు, ఆర్థికలోటు వంటివి గాలికొదిలేసింది. పోలవరానికి రూ.3320 కోట్లు, అమరావతికి రూ.2000 కోట్లు వస్తాయని సంబరపడిపోయింది. అప్పుగా అమరావతికి డబ్బులిచ్చినా ఈనాడు చంకలు గుద్దుకుందన్నమాట. అమరావతికి చట్టబద్ధతపై ఏపీ ప్రతిపాదనకు కేంద్రం కొర్రీ పెట్టడంతో ఆలస్యమవుతోందని లేకుంటే ఎప్పుడో అయిపోయేదని కూడా చెప్పుకొచ్చింది ఈ పత్రిక చంద్రబాబు ఈ అంశంపై కూడా అమిత్ షాకు విన్నవించారని తెలిపింది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి వెళ్లారు. ఎందుకెళ్లారో స్పష్టత లేదు. పథకాలకు నిధుల కోసమా? తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ పెద్దలకు వివరణ ఇచ్చుకునేందుకా? ఇదీ కాకుండా.. ఇతరత్రా వ్యక్తిగత పనుల కోసమా? అన్నది తెలియదు. సహజంగానే బాకా పత్రికలు ప్రాజెక్టుల కోసమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమని కథనాలు ఊదాయి. చంద్రబాబు స్టైలు కూడా ఇలా లీకులివ్వడమే. కానీ పోలవరం విషయంలో ఈయన గారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తే ఈ డొల్ల వ్యవహారం బట్ట బయలవుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పోలవరానికి కేంద్రం బడ్జెట్లో రూ.మూడు వేల కోట్లు కేటాయించింది. ఇంత తక్కువ ఇచ్చారేమిటని కనీసం ప్రశ్నించలేని చంద్రబాబు రెండో దశకు రూ.32 వేల కోట్లు అడిగామని చెప్పుకుంటున్నారు. గత ఏడాది పోలవారినికి రూ.5000 కోట్లు కేటాయించినా.. అంచనాలను సవరించిన తరువాత దక్కింది రూ.మూడు వేల కోట్లే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. చంద్రబాబు అండ్ కో అంకమ్మ శివాలెత్తేది. ‘రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు’’, ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవం మంటకలిసింది’’ అంటూ ఊగిపోయేది. గత ఢిల్లీ పర్యటనలోనూ రాయలసీమలో ఉద్యానవన హబ్ ఏర్పాటుకు రూ.41 వేల కోట్లు అడిగామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఆ తరువాత ఈ విషయం అయిపు అజా లేకుండా పోయింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడం ఏపీకి నష్టం. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కష్టమతుంది. తొలిదశలో ఇలా ఉంటుంది, ఆ తర్వాత దానిని యథా ప్రకారం 45.72 మీటర్లకు పెంచుతామని కేంద్రం ప్రకటించితే బాగుంటుంది. కాని అలా చేయడం లేదు. ఎందుకంటే పునరావసానికి అధిక నిధులు అవసరం అవుతాయి. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కనీసం రూ.30 వేల కోట్లు అయినా కావాలి. కాని కేవలం మూడువేల కోట్లతో సరిపెడితే ఏపీ అభివృద్దికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని చంద్రబాబు, పవన్ లు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా చెబుతున్నారు? తూతూ మంత్రం చేసి అంతా అయిపోయిందని అంటారా అన్నది నీటి పారుదల రంగ నిపుణుల అనుమానంగా ఉంది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడకు టీడీపీ, జనసేనలకు ఉన్న పదిహేడు మంది ఎంపీల మద్దతు కీలకం. అయినా వీరు రాష్ట్రానికి సంబంధించి తగినన్ని నిధులూ సాధించలేకపోయారు.. కొత్త పథకాలూ వచ్చింది లేదు. ఏంటో వీరి బలహీనత! శీతకన్నేసినా... పట్టించుకోకపోయినా కేంద్రం సహకరిస్తోందన్న ప్రచారం చేసుకోవాల్సిన దౌర్భాగ్యమెందుకో? స్కిల్స్కామ్లో ఈడీతో కూడా క్లీన్ చిట్ ఇప్పించుకున్నట్లు ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయని.. ఢిల్లీ యాత్రల మర్మం ఇదేనని వైసీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూండటం గమనార్హం. గతంలో ప్రధానిని కలిసిన తర్వాత 2026 నాటికి విశాఖ- తిరుపతి బుల్లెట్ ట్రైన్ లు వచ్చేస్తాయని చెప్పారన్న విషయాన్ని మీడియా గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీకిప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు కూడా లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గత ఏడాది మూడువేల కోట్లు కేటాయించినా, ఈసారి కేవలం వంద కోట్లకే పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమే. ఏదో రకంగా దానిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే విభాగాల వారీగా ప్రైవేటువారికి అప్పగిస్తున్నారు. విశాఖ పోర్టుకు గత ఏడాది 750 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, ఈసారి అది 450 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంఘం నిధులలో కోత,గ్రామీణ ఉపాధి హామీ నిధులలో కోత వంటివి కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని కూడా ప్రభావితం చేస్తాయి.మరో వైపు తెలంగాణ కు కూడా అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వాపోయారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు కాని, మెట్రో విస్తరణకు కాని నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తావనే లేదు. తామంతా ప్రధానమంత్రిని నిధుల కోసం కలిసినా ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కొంత శీతకన్ను వేశారని అనుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అని చెప్పుకుంటారు. చంద్రబాబు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయినా బడ్జెట్ లో ఏపీకి దక్కింది ఏమీ లేకుండా పోయింది. దీనిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఉండడం ఏపీకి మరింత నష్టం చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నేను దాక్కోలేదు
సాక్షి, అమరావతి: భయపడి తానేమీ దాక్కోలేదని, ఎక్కడికీ పారిపోలేదని రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనపై పలు మీడియా చానళ్లలో వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను న్యాయపరంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన యత్నాలు చేస్తున్నానని వివరించారు. అలాగే జనసేన నియమించిన కమిటీ విచారణకు రావాలని తనను ఎవరూ పిలవలేదని స్పష్టం చేశారు. తనకు తానుగా కమిటీ సభ్యుడు శివశంకర్కు ఫోన్ చేసి తన వాదన వినాల్సిందిగా అభ్యర్ధించి పెన్డ్రైవ్, లేఖ పంపించానని వెల్లడించారు. పిలిస్తే కమిటీ ముందుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. -
భూ కబ్జాకోరుగా మారిన జనసేన ఎమ్మెల్యే తిరగబడుతున్న ప్రజలు
-
కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన హైడ్రామా
-
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్.. జనసేన హైడ్రామా
తిరుపతి: కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన హైడ్రామా కొనసాగుతోంది. రేపు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) మరోమారు రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్తో పాటు కార్యకర్తలను సదరు కమిటీ విచారించింది. అయినా ఇంతవరకూ పార్టీకి నివేదిక ఇవ్వలేదు త్రిసభ్య కమిటీ.ఇదిలా ఉంచితే,. నిన్నటి జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అంటూ లీకులిచ్చారు. అదే సమయంలో అరవ శ్రీధర్ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైప బాధిత మహిళపై పోలీసు కేసులతో పాటు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు వెలుగుచూస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం చేసినదంతా చేసి పార్టీకి సంబంధం లేదంటూ కొత్త డ్రామాకి తెరలేపాడు. -
బాబుపై తిరగబడుతున్న బీజేపీ, జనసేన
-
బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేదు
-
లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరగలేదు: జనసేన ఎమ్మెల్యే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ‘ఎన్డీడీబీ, సిట్ నివేదికలలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు’ అని ఆయన స్పష్టంచేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తూ ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు, జనం అభిప్రాయపడుతున్నారు. -
జనసేన ఎమ్మెల్యే దందా.. 200 కోట్లు భూమి కబ్జా!
సాక్షి, అనకాపల్లి: ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్పై భూకబ్జా ఆరోపణలు బయటకు వచ్చాయి. దాదాపు 200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమిని కబ్జా చేయాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ చూస్తున్నారని దళితులు ఆరోపించారు. ఆ భూములే తమకు జీవనాధారం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.వివరాల మేరకు.. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్పై రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు భూ కబ్జా ఆరోపణలు చేశారు. 50 ఏళ్ల క్రితం తమకు ఇచ్చిన 42 ఎకరాల భూములను విజయ్ కుమార్ కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆ భూములే తమకు జీవనాధారం.. సదరు 42 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. మా భూముల్లోకి వెళ్లొద్దంటూ అధికారులు పోలీసులు బెదిరిస్తున్నారు. నిరసన తెలియజేసేందుకు వేసిన టెంట్ను కూడా పోలీసులు అర్ధరాత్రి తొలగించారని అన్నారు.తమ భూములు బలవంతంగా తీసుకుంటే చావడానికి అయిన సిద్ధమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలు పెరిగిపోయాయి. గడిచిన 50 ఏళ్ల సమయంలో మా భూములను ఎవరు తీసుకునే సాహసం చేయలేదు. కానీ, ఇప్పుడు కూటమి నేతల కన్ను మా భూములపై పడింది అంటూ మండిపడ్డారు. -
పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై
-
నాకు బీపీ లేపొద్దు.. పంతం నానాజీపై పవన్ సీరియస్
-
వెలుగులోకి కీచక MLA మరిన్ని రాసలీలల వీడియోలు
-
దేవునికి ఉరేస్తా.. నాగబాబు పచ్చి బూతులు
-
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో
-
నేను ట్రాప్ చేయాలనుకుంటే.. నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు
-
Arava Sreedhar: రాసలీలల ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి,హైదరాబాద్: జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చూట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు అరవ శ్రీధర్పై కేసులు నమోదు చేశారు. అయితే, అరవ శ్రీధర్ అసెంబ్లీలో ఉండగా తనకు వీడియో కాల్స్ చేశారు. ఇదే అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలిపై బెదిరింపులు, అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు. అరవ శ్రీధర్ స్త్రీ లోలుడు. ఆయన బాధితుల్లో నేనే కాదు. నాతో పాటు మరో ఐదుగురు ఉన్నారురూ.25 కోట్లు నేను అడగలేదు. డబ్బులు డిమాండ్ చేసినట్లు నాపై వస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలే. అరవ శ్రీధర్ ప్రతిసారి అసెంబ్లీ నుండి కాల్ చేసేవాడు. అక్కడ జరిగే అన్ని విషయాలు చూపించేవాడు. ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్ అయ్యింది. అతను నాతోనే కాదు. మరో ఐదుగురితో ఇలాగే చేశాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆయన మోసాలన్నీ నాకు తెలిసి ఇదంతా ఆపేద్దాం అన్నాను. అందుకే సేఫ్ సైడ్గా అన్ని ఆధారాలు ఉంచుకున్నానునన్ను అతను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇల్లు మొత్తానికి తెలుసు. శ్రీధర్కు రైల్వేకోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానంద్ రెడ్డి అండదండలున్నాయి. అతనే వెనక ఉంది శ్రీధర్ను నడిపిస్తున్నారు’అని ఆరోపించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ అరాచకాల్ని బయటపెట్టినందుకు బాధితురాలిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని ఆమె తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కోరుతున్నాము. బాధిత మహిళ రూ.25 కోట్లు మహిళా డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్రమే అని అఫిడవిట్లో ఉంది. అలాంటిది రూ. 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారు. అక్రమంగా సంపాదిస్తే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాము. కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. మరి అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ పైన స్పీకర్ చర్యలు ఉండవా?? అని ప్రశ్నించారు. -
జనసేనకు బిగ్ షాక్
సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన ఆవిర్భావం నుండి పవన్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయం ప్రకటించారు.అయితే, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బొలిశెట్టి కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కీచక ఎమ్మెల్యే శ్రీధర్పై కేసు నమోదు
-
మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..
-
జనసేన MLA రాసలీలలపై విచారణ రైల్వే కోడూరుకు త్రీమెన్ కమిటీ..
-
Tirumala Laddu Row : ఫ్రస్టేషన్లో పవన్ కళ్యాణ్
సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం గుంటూరులో జనసేన జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
అరవ శ్రీధర్ మరో రెండు వీడియోలు రిలీజ్
-
కీచక శ్రీధర్.. మరో సంచలన వీడియో లీక్.. ఏకంగా అసెంబ్లీ నుండే..
-
స్త్రీధరుడి రాస లీలలు ఇంకెన్నో?
దేశంలో నాడు స్త్రీకి ఉన్నత గౌరవం ఉండేది. ఆమెను దేవతతో సమానంగా చూసేవారు. నేడు బాబు సర్కారులో ఓ మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా అతివలకు రక్షణ కరువైంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఆమెను చెరబడుతున్నారు. అందుకు నిదర్శనం మూడు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన అరవ శ్రీధర్ కీచకపర్వమే. ఆ ఒక్కటితో ఆగలేదు ఆయనగారి రాసలీలలు. ఆయన కీచక పర్వం రోజుకొక వీడియోతో కొనసాగుతోంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన రాసలీలలు ఇంకెన్ని బయట పడతాయోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. రైల్వేకోడూరు అర్బన్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగితో జరిపిన కీచక పర్వం వీడియో లీకులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బాధితురాలు రోజుకొక లీకులు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తున్నారు. నియోజకవర్గమంతా ఇంకా ఎన్ని కొత్త వీడియోలు వస్తాయో? అనే చర్చే కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా నియోజక వర్గంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిశాక సీను మొత్తం రివర్స్ కావడంతో టీవీ చానళ్ల ద్వారా జరిగిన విషయాలను బయట పెట్టి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిజ స్వరూపం బయట పెట్టింది. ఈ మధ్యలో జనసేన నాయకుడు, మరి కొందరూ మంతనాలు జరిపినట్లు తెలిసింది. అయితే బాధితురాలికి నమ్మకం లేక పోవకోవడంతో ఎమ్మెల్యేకి తనకు మధ్యలో జరిగిన విషయాలను బహిర్గతం చేసింది. మూడు రోజులుగా ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా రోజుకొటి రెండు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్న వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒంటరిగా కారు తోలుతూ బాధిత మహిళకు వీడియోకాల్ చేసి ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన వీడియో హల్చల్ చేస్తోంది. కొత్త కోణంలో ఈ చిత్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.పోలీసులు ఎంక్వైరీ సక్రమంగా సాగేనా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ తన కొడుకుని, తమ కుటుంబ సభ్యులను ఆ మహిళా ఉద్యోగి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తూ బాధిత మహిళపై రైల్వేకోడూరులో పోలీసులకు ఈనెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ చంద్రశేఖర్ ఆరోపిస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని చెబుతున్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఆమె అందుబాటులో లేదని, నోటీసు ఇచ్చి విచారణ చేస్తామని, దీనికి తోడు మరో కేసు నమోదు చేసామన్నారు. ఇదిలా ఉండగా జిల్లా పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఏకపక్షంగా ఎంక్వయిరీ జరిగేలా నాయకులు పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అజ్ఞాతంలోకి అరవ శ్రీధర్ ఈవిషయం జరిగిన మరుక్షణం నుంచి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోని వెళ్లారు. మరుసటి రోజు ఆ వీడియోలకు తనవి కావని చట్టరీత్యా నిరూపించుకుంటానని ఎక్కడో ఉండి వివరణ ఇచ్చాడు. అంతేకాని మూడురోజులవుతున్నా ఎవరికీ అతని జాడ తెలియలేదు. ఎవరితోనూ సంప్రదించలేదని తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవడంతో అధికారిక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతోంది. ఎమ్మెల్యే అయ్యి ఉండి అతను బహిరంగంగా ప్రజలకు ఎం జవాబు చెబుతాడోనని ఉత్కంఠగా పలువురు ఎదురు చూస్తున్నారు. ఇంత వరకు ఖండించని స్థానిక పార్టీ, నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, వీడియోలపై ఇంతవరకు, జనసేన పారీ్టకాని, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గానీ ఖండించలేదు. ఎవరికీ వారు తమ పనులు చేసుకుంటూ విషయం ఎవరికీ తెలీదన్నట్లు ఉన్నారు. ఎమ్మల్యే అరవ శ్రీధర్ను అన్నీ తానై గెలిపించిన టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఈ తతంగంపై మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. -
Bolisetty: టీడీపీపై జనసేన నేత బొలిశెట్టి ఫైర్
-
అరవ శ్రీధర్ దరిద్రం.. సంచలన ఆడియో లీక్
-
జనసేన MLA అరవ శ్రీధర్ బాధితురాలి కొత్త వీడియో
-
దమ్ముంటే మొత్తం ఆడియో పెట్టండి.. బాధితురాలి మరో సంచలన వీడియో
-
అరవ శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్
-
మరో వీడియో విడుదల చేసిన 'రైల్వేకోడూరు' మహిళ
-
నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్
-
గుండాట క్వీన్ జనసేన వీరమహిళ.. మంత్రులు రికార్డింగ్ డాన్సులు
-
మొత్తం 500 వీడియోలు.. నువ్వసలు ఎమ్మెల్యేవేనా ?
-
ఇది జనసేన పతనం.. పవన్ కళ్యాణ్ ఒక డమ్మీ.. అందుకే నో యాక్షన్
-
ఇవి ఫేక్ వీడియోలా? నీ రోత, బూతు వీడియోలు.. చూడలేక బ్లర్ చేసి చూపిస్తున్నాం
-
కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తన వర్గానికి పదవుల కోసం హస్తిన వేదికగా లాబీయింగ్కు తెరలేపారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఇక్కడికొచ్చి తన బంధువు, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా ఇప్పుడు అదే బాటపట్టారు. తనకు, సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన పార్టీ లో కీలకంగా ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలÔౌరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. లింగమనేని కోసం పవన్ ఆరాటం.. త్వరలో ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వీటికోసం అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వేదికగా పైరవీలు చేస్తుండగా.. సీఎం చంద్రబాబు ఇటీవల తన అస్మదీయుల కోసం అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్కు అత్యంత ఆప్తుడుగా ఉన్న కిలారు రాజేశ్కు రాజ్యసభ సీటు కేటాయించాలని చంద్రబాబు అడగ్గా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కూడా రాజ్యసభలో చోటు కల్పించాలని పవన్ తాజాగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏడాది క్రితం ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి పంచుకున్నాయి. అప్పట్లో పవన్ లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో జనసేన నుంచి లింగమనేని రమేష్కు అవకాశం కల్పించాలంటూ పవన్ అమిత్ షాను అడిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ కి మంత్రి పదవిస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఎదుట పవన్ విన్నవించినట్లు సమాచారం. కాగా ఉప్పాడ సముద్ర రక్షణ కోసం గోడ నిర్మాణం, రాష్ట్రంలో పరిపాలన, ఇతర ముఖ్యమైన విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లు పవన్కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఆ ఒక్క మెసేజ్ నా జీవితాన్నే నాశనం చేసింది!
-
కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యం
సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు. -
నేనే అడ్వకేట్... ఎలా తప్పించుకుంటాడో చూస్తా
-
‘బాధితురాలినే నిందితురాలిగా చేసేందుకు కూటమి కుట్రలు’
సాక్షి, తాడేపల్లి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెంటనే అరెస్టు చేయాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకు లేదా? అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. తిరుపతిలో కిరణ్ రాయల్పై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు.‘‘అరవ శ్రీధర్ చేసిన పనితో ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ లేదని అర్థం అవుతుంది. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారారు. పోలీసు వ్యవస్థ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?. కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు.?..హోంమంత్రి అనితకు పబ్లిసిటీ, రీల్స్పై ఉన్న శ్రద్ధ మహిళ భద్రతపై లేదు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించ లేదు. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయారు.?. ఎమ్మెల్యేపై పార్టీ కమిటీ వేయడం ఏంటి? పోలీసుల విచారణ వుండదా?. మంత్రి సంధ్యారాణి కొడుకు పేకాట అడుగుతూ దొరికిపోయారు’’ అంటూ వరుదు కల్యాణి మండిపడ్డారు. -
MLA అరవ శ్రీధర్ రాసలీలలు వైఎస్ జగన్ సీరియస్ రియాక్షన్
-
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి,అమరావతి: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాల గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని బాధితురాలు మీడియాతో ఎదుట బాంబు పేల్చారు. ఎమ్మెల్యే శ్రీధర్పై చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. నారావారిపల్లెలో 10రోజల క్రితమే చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడతారునుకున్నా. బాబు మాత్రం సాధారణ అర్జీదారునిగానే ఫిర్యాదును తీసుకున్నారు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాట చేస్తా. ఎమ్మెల్యే నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు’అని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు టెలిగ్రామ్లో మెస్సేజ్ చేశాను.రెండురోజులు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత పర్సనల్ ఫొటోలు పంపించమని అడిగాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించాడు. నీ ట్రాన్స్ఫర్,ప్రమోషన్ నా చేతిలోనే ఉంటుందని బెదిరించాడు. మా ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఓ ఇంటి వద్ద ఆపాడు. నేను,నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరా అయ్యింది. బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. -
వయసుతో సంబంధమే లేదా.. తానేటి వనిత స్ట్రాంగ్ రియాక్షన్
-
RK Roja : జనసేన కాదు కామసేన
-
RK Roja : కీచక జనసేన ఎమ్మెల్యేను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ
-
అరవ శ్రీధర్పై నో యాక్షన్.. కూటమి మరో డైవర్షన్ రెడీ
-
ప్రభుత్వ ఉద్యోగితో ఇదేంపని ఎమ్మెల్యే రాసలీలలపై జగన్ రియాక్షన్
-
ఎమ్మెల్యే రాసలీలపై ప్రశ్నించగా పారిపోయిన పవన్
-
‘జనసేన అంటే కామసేన.. కామాంధుల సేన’
సాక్షి,చిత్తూరు: ‘జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన’అని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్ కే రోజా, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలు నిరసన చేపట్టారు. కీచక ఎమ్మెల్యేని శిక్షించాలని డిమాండ్ చేస్తూ..నగరి ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన.క్యారెక్టర్ లేనివాళ్లతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నాయకులుంటే ప్రజలకు విలువ ఉండదు. మహిళకు అన్యాయం జరిగితే.. న్యాయం చేయరు. రైల్వేకోడూరులో బాధితురాలికి న్యాయం చేయాలి. రాష్ట్ర హోంమంత్రిని సస్పెండ్ చేయాలి’అని డిమాండ్ చేశారు. -
‘ఎంపీ భరత్ భూ దోపిడీ.. పవన్, బీజేపీకి కనిపించట్లేదా?’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖలో భూ బదలాయింపు అంశం రేపు(గురువారం) జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ ఐటమ్గా చేర్చారు. భూ దోపిడిని ఆపాలని మేయర్, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించాం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. రేపు గీతం యూనివర్సిటీలో కబ్జాకి గురైన 5 వేల కోట్ల విలువైన భూమిని సందర్శిస్తాను. ఈనెల 30వ తేదీన కౌన్సిల్లో పోరాటం చేస్తాం. అదే రోజు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపడతాం.విశాఖ భూ దోపిడీపై జనసేన, బీజేపీ సమాధానం చెప్పాలి. ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడటంపై మీ స్పీడ్ చూపించాలి. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నీతి కబుర్లు చెబుతారు. విశాఖ భూ దోపిడీపై ఎందుకు మాట్లాడలేదు?. సెంటు, రెండు సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పెడతారు. 55 ఎకరాల భూమిని ఎలా క్రమబద్దీకరణ చేస్తారు?. వామపక్షాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. గీతం విద్యా సంస్థ ఒక దోపిడీ సంస్థ. విద్యార్థుల నుంచి సీట్లు కోసం కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేశారు. 1998 నుంచి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.మరోవైపు.. విశాఖ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..‘అధికారం చేతిలో ఉంది కదా అని గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఈ భూ కేటాయింపు అన్యాయం. ఎంపీ భరత్కు 55 ఎకరాల భూమి కేటాయించడం అప్రజాస్వామ్యం. విశాఖలో భూములను పప్పు బెల్లాలులా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్ట పెట్టారు. జీవీఎంసీ ఎజెండా నుంచి గీతం అంశాన్ని తొలగించాలని వినతి పత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూ దోపిడిపై మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
అరవ శ్రీధర్ దరిద్రం.. సంచలన ఆడియో లీక్
-
తూచ్.. అదేం లేదు.. జనసేన యూ టర్న్?
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓ ఒంటరి మహిళను బెదిరించి శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన, ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా జనసేన పార్టీ శ్రీధర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సదరు మహిళ ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కమిటీ మహిళ ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందించనుంది. అనంతరం, నివేదికను పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అందులో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అంశాన్ని, పవన్ కళ్యాణ్ను సేవ్ చేయడానికి జనసైనికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే అరవ శ్రీధర్ను జనసేన నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇక, తాజాగా పార్టీ ప్రకటనతో జనసైనికులకు భంగపాటు ఎదురైంది. అయితే, జనసేన కమిటీ ఏర్పాటుపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇదంతా డైవర్షన్లో భాగంగానే జరుగుతోందని.. శ్రీధర్ను కాపాడే ప్రయత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
KSR LIVE Show: కీచక ఎమ్మెల్యే అరవ కొంపలు కూల్చుతున్న కూటమి
-
చెయ్యండి.. కానీ దొరకొద్దు.. జనసేన సంచలన ప్రెస్ నోట్
-
పశువుల్లా విరుచుకుపడుతున్న కామ 'కూటమి' నేతలు
-
నువ్ మోసపోయావ్.. వదిలేయ్
సాక్షి, అమరావతి : ‘‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్ మోసపోయావ్.. అయ్యిందేదో అయ్యింది.. నువ్ సర్దుకుపోవడం మంచిది’ అంటూ రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే బాధిత మహిళతో కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలివి. ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీధర్ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్ ఫ్లర్ట్ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు. -
ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా?
ఓ ఒంటరి మహిళను బెదిరించి కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన నేతలు చేస్తున్న ప్రయత్నాలు, వాటికి నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియా మారుమోగుతోంది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా?Arava Sreedhar a genuine JanaSainik who follows his leader not just in words, but in actions. pic.twitter.com/DDc57K3BNn— Pandu (@PanduPrabhas__) January 27, 2026 హలో సేఫ్ హ్యాండ్స్ సాయి @IamSaiDharamTejమీ మామ చెప్పిన సేఫ్ హ్యాండ్స్ ఇదా?లుంగీ తీసి అంగం చూపించడమామీ మామ చెప్పిన మగతనం ఇదా?లుంగీ తీసి అంగం చూపించడమామీ మామ చెప్పిన ఆడబిడ్డకు రక్షణ ఇదా?లుంగీ తీసి 5 సార్లు అబార్షన్ చేయించడమా#aravasridhar #PawannKalyan#Kaamasena #YSRCPSM https://t.co/oYe0OSbrIg pic.twitter.com/7cMZzyprHi— దర్శన్–𝐃𝖆 𝐑ֆ𝖍𝖆η😎ツ (@Darshan_Ysj) January 27, 2026 ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా కాపాడుకునే యత్నంలో భాగంగా ముందుగానే లేఖలు విడుదల చేస్తున్నారా?చిన్న చిన్న వాటికే అతిగా స్పందించే పచ్చ మీడియా.. ఓ ఎమ్మెల్యే విషయంలో ఇంత జరుగుతున్నా..ఎందుకు స్పందించడం లేదు? NDA-Alliance @JanaSenaParty MLA caught in rape allegations. Railway Koduru MLA and Government Whip Arava Sridhar exposed for exploiting a woman government employee by misusing his political power, through threats, coercion, and sustained sexual abuse. The victim has reportedly… pic.twitter.com/klwWggPRID— YSR Congress Party (@YSRCParty) January 27, 2026@JanaSenaParty కామసేనాని ప్రొడక్షన్సీన్ -1 టేక్ -4 #SaveApSisters pic.twitter.com/x5GA71biqv— Andhra Now 📰 (@AndhraXpress) January 27, 2026 View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam) -
కామ‘కూటమి’
సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం గక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి.. బ్లాక్ మెయిల్ చేసి.. విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తుండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేమిటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్లు బాధితురాలు స్వయంగా చెప్పిన వీడియో మంగళవారం ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసినా కూటమి పెద్దల నుంచి కనీస స్పందన లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్.. ఇలా ఎంతో మంది దురాగతాలు బట్టబయలు కావడం కలకలం రేపింది. ఇక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఆగడాలు, మహిళలపై వేధింపులు తరచూ బయట పడుతూనే ఉన్నాయి. స్థానిక నేత తనను మోసం చేశారంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం పోలీసు స్టేషన్లో పది రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేంత కఠినంగా చట్టాలు అమలు చేస్తామన్న ఆయా పార్టీల పెద్దలు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా మహిళలను దారుణంగా వేధిస్తున్నా.. బహిరంగ వీడియోల్లో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికినా.. బెదిరించి గర్భవతులను చేసి అబార్షన్లతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నా కనీసం కట్టడి చేయక పోవడంపై జనం నివ్వెరపోతున్నారు. కిరణ్ రాయల్ వికృత చేష్టలు తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్ వికృత చేష్టలు గత ఏడాది ఫిబ్రవరి 8న బాధిత మహిళ రిలీజ్ చేసిన వీడియో ద్వారా బయపడ్డాయి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన ఆమెతో కిరణ్రాయల్ చనువు పెంచుకుని డబ్బులు అడిగేవారని, కిరణ్ రాయల్కు అప్పులు చేసి మరీ రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత డబ్బులు అడిగితే రాయల్ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత కూటమి పెద్దలు ఆమెకు, కిరణ్ రాయల్ మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. ఆదిమూలం.. అరాచకం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకు వచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది. మంత్రి సుభాష్ అశ్లీల నృత్యాలు సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన అశ్లీల నృత్యాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట ఇటీవల మ్యూజికల్ నైట్లు, డ్యాన్స్లు నిర్వహించారు. బుల్లితెర నటులు, జబర్దస్త్లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ పలు పాటలకు అసభ్యంగా చిందులు వేశారు. ఈ వీడియోలు సామాజికమాధ్యమాల్లో చక్కెర్లుకొట్టడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా మంత్రి తన నృత్యాలను సమర్థించుకున్నారు. ‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’ అంటూ వింత వాదనకు దిగారు. కూన రవి వేధింపులకు దళిత ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య గతేడాది ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. అంతకు ముందు ఆమె శ్రీకాకుళం తిలక్నగర్లోని తన నివాస గృహంలో ఓ ఎల్రక్టానిక్ మీడియాకు రవి వేధింపులపై ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం తన గదిలోకి వెళ్లి బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మాట్లాడుతూ.. పక్కకు తూలిపోవడంతో ఆమెను వెంటనే రిమ్స్కు తరలించారు. వైద్యులు 48 గంటల పర్యవేక్షణలో ఉంచారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకీ దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలేవి? ఈవ్ టీజింగ్కు పాల్పడేవారిని, ఆడపిల్లలను అభద్రతా భావానికి గురిచేసే వారిని పది మంది చూస్తుండగా వాతలు తేలిపోయే బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలు రావాలని కూటమి పెద్దలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలో లేనప్పుడైతే.. తమకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని, రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారంటూ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వారే ప్రభుత్వ పెద్దలుగా కొనసాగుతుండడంతో పాటు కేంద్రంలోని ఎన్డీఏలో మిత్రపక్షంగానూ ఉన్నారు. మరి రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతల అఘాయిత్యాలు, కీచక పర్వాలపై నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం లేదా? లేదంటే తెలిసీ మౌనంగా ఉన్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కాగా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరలో ఐదుసార్లు గర్భవతిని చేసి, అబార్షన్లు చేయించారన్న బాధితురాలి వీడియో వెలుగులోకి రావడానికి ముందు కూటమి పెద్దల్లో ఒకరు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. కొందరి వివాహేతర సంబంధాలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. తద్వారా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై వారికి ముందుగానే సమాచారం ఉందా? అని విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాధితురాలిపైనే ఎదురు దాడికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Arava Sridhar : నా కోరిక తీర్చకపోతే నీ కొడుకుని చంపేస్తా..
-
‘జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను సస్పెండ్ చేయాలి’
సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు లేవు.ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారుఅధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. -
జనసేన నేతల రాసలీలలు అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలి
-
చూశావా మీ ఎమ్మెల్యే రాసలీలలు తాటతీస్తా.. అంటావ్..!
-
Victim Reveals: అసలేం జరిగిందంటే..?
-
Arava Sridhar: మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నరగా అత్యాచారం
-
Arava Sreedhar: వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాల్ని బయటపెట్టింది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్కు అరవ శ్రీధర్ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది. అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్ ఎక్కడ. ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు. అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది. -
లోకేష్ ఎవరు నువ్వు? రెడ్ బుక్ లో జనసేన నేతలు ఏకిపారేసిన శైలజానాథ్
-
రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు: శైలజానాథ్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్ప చంద్రబాబు సాధించింది శూన్యం. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ట్రంప్తో ఫోటో కోసం చంద్రబాబు ప్రయత్నించారని సమాచారం. డబ్బా కొట్టుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అందరినీ ట్రంప్ భయపెడితే.. చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ట్రంప్ భయపడ్డారట!ఏపీ బ్రాండ్ ఇమేజ్ను రెడ్బుక్ ద్వారా నాశనం చేశారు. రెడ్బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి. దావోస్ నుంచి జీరోల్లా తిరిగి వచ్చామని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించాలి. 99 పైసలకు చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఇచ్చుకోవాలి. చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. చంద్రబాబుకు బ్రాండ్ లేదు. సోషల్ మీడియాలో లైక్, కామెంట్ చేస్తే ప్రభుత్వం సహించలేకపోతుంది. రెడ్బుక్లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి. కూటమి పాలనలో పోలీసు శాఖ నిర్వీర్యం అయింది అని ఘాటు విమర్శలు చేశారు. -
జనసేన సమావేశంలో రసాభాస
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రసాభాస జరిగింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఎదుట తూర్పు నియోజకవర్గ జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది.వివరాల మేరకు.. జనసేన పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సౌజన్య వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పుబట్టారు. పార్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారని సౌజన్యపై ఆరోపణలు చేశారు. దీంతో, తనపై ఆరోపణలు కాదు బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను వారికి సర్ది చెప్పారు. -
రక్తం కారేలా కొట్టుకున్న TDP, జనసేన కార్యకర్తలు
-
టీడీపీ Vs జనసేన.. తలలు పగిలేలా తన్నులాట
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం కాస్తా కొట్లాటకు దారి తీసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేసినట్టు సమాచారం.వివరాల మేరకు.. బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ వర్గీయులు.. ప్రభుత్వం స్థలంలో ఉన్న చెట్లు నరికివేశారు. ఈ క్రమంలో చెట్ల నరికివేతపై జనసేన వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం, రెండు వర్గాలతో బుచ్చయ్యపేట ఎమ్మార్వో గ్రామసభ ఏర్పాటు చేశారు. దీంతో, సభలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.ఎమ్మార్వో నిర్వహించిన గ్రామసభలోనే రెండు వర్గాలు రాళ్ల, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడి పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు సమాచారం. తలలు పగిలినట్టు తెలిసింది. అయితే, పోలీసులు సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పెళ్లి చేసుకుంటానని 12 ఏళ్లుగా నమ్మిస్తూ..
నాతవరం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రాజాన సూర్యచంద్ర తనపై దాడి చేసి తనను, తన తండ్రిని కొట్టారని ఓ మహిళ నాతవరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు నాతవరం గ్రామానికి చెందిన పోలుపర్తి లావణ్య తన తండ్రి పోలుపర్తి సూరిబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ లావణ్యకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా.. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, భర్తతో విడాకులు తీసుకునేలా జనసేన నేత సూర్యచంద్ర నమ్మించాడు. 12 ఏళ్లుగా వివాహం చేసుకోవాలని ఎన్నిసార్లు అడుగుతున్నా సూర్యచంద్ర పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాడు.ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సూర్యచంద్ర.. లావణ్య ఇంటికి వెళ్లి, గతంలో తాను ఇచ్చిన సెల్ఫోన్ ఇవ్వాలని అడిగాడు. సెల్ఫోన్ను ఉదయం ఇస్తామని లావణ్య తండ్రి చెప్పడంతో సూర్యచంద్ర కోపంతో ఊగిపోయి లావణ్య, ఆమె తండ్రి సూరిబాబును తీవ్రంగా కొట్టి గొడవ చేశాడు. దీంతో సూరిబాబుకు గాయమైంది. ఈ సంఘటనపై నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు లావణ్య తెలిపింది.ఈ విషయంపై నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావును సంప్రదించగా.. సూర్యచంద్రపై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు. తాము చాలాకాలంగా కలిసి ఉంటున్నామని శనివారం రాత్రి సూర్యచంద్ర మద్యం తాగి గొడవకు దిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరినట్టు ఎస్ఐ చెప్పారు. కేసు నమోదు చేసేందుకు సంతకం చేయమంటే ఆమె నిరాకరించినట్టు తెలిపారు. ఫిర్యాదురాలి అభీష్టం మేరకు కేసు నమోదు చేస్తామన్నారు. -
మెడికల్ కాలేజీలకు నిధులుండవు.. ఎర్టీఆర్ విగ్రహానికి రూ.1,700 కోట్లా?
జంగారెడ్డిగూడెం: సీఎంచంద్రబాబు పాలనను ఎండగడుతూ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన నాయకుడు బల్లె మురళికి సంబంధి రెండు సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, కాపు కార్పొరేషన్కు నిధులుండవు కానీ, ఎన్టీఆర్ విగ్రహానికి ఉంటాయా? చంద్రబాబు వైఖరి మార్చుకుంటే చాలా మంచిది. సోషల్ మీడియా వచ్చింది. ఎల్లో మీడియాను నమ్మరు. మీరు చెప్పే అబద్ధాలు, నిర్లక్ష్యాన్ని సహించే పరిస్థితి లేదు. మాలాంటి వారితో జనసేనలో మార్పు మొదలైంది’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రూ.1,700 కోట్లతో ఎర్టీఆర్ విగ్రహం పెడతారంట. ప్రభుత్వ నిర్ణయం ఘోరాతి ఘోరం. దీన్ని జనసైనికులంతా వ్యతిరేకించాలి.పవన్కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల్లో కాపు యువత సొంత డబ్బు రూ.లక్ష–రూ.2 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తారేమో అని చూస్తున్నారు. కార్యకర్తలు రాకుండా పార్టీ ఆఫీస్కు తాళం వేశారు. ఈ ప్రభుత్వంలో జన సైనికులకు ఒరిగింది ఏమీ లేదు. అమరావతి సెల్ఫ్ ఫండ్ ప్రాజెక్టు, టీడీపీ సెల్ఫ్ ఫండ్ పార్టీ అన్నారు కదా. ఎర్టీఆర్ విగ్రహం కూడా అలాగే కట్టండి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ (యూకే) అన్నీ మా చేతుల్లో ఉన్నాయని చెప్పుకొనే టీడీపీ వారు ఎర్టీఆర్ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతో కట్టడం ఏంటి? చంద్రబాబు హైదరాబాద్ కట్టేశాడంట.. అమరావతి కట్టలేకపోతున్నాడు. అది మునిగిపోయే ప్లేస్. అట్టర్ ఫ్లాప్. ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అంటున్నారు. ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం.పవన్.. మీరు చంద్రబాబుకు చేసే భజన చూసి సిగ్గుపడుతున్నాం. ఇంత దిగజారతామా?’ అని మురళి ధ్వజమెత్తారు. మొదటి వీడియో సంచలనంగా మారడంతో రెండో వీడియో విడుదల చేశారు. ‘ఎర్టీఆర్ విగ్రహం ప్రజల సొమ్ముతో కట్టడానికి జనసేన వ్యతిరేకం. దీనిపై సోషల్ మీడియాలో నన్ను తిడుతున్నారు. నా నంబర్ ఉంది. దమ్ముంటే కాల్ చేయండి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కడి చర్మం తీస్తా. వైఎస్ జగన్కు భయపడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ వారు పారిపోయారు. అప్పుడు పోటీ చేసింది జనసేన. మేం లేకపోతే మిమ్మల్ని జగన్ ఆడుకుంటారు. కానీ, మీరు పదవిలోకి వచ్చాక జనసేనను జీరో చేయాలని చూస్తున్నారు. కాపు కార్పొరేషన్ నిధులు ఆపేశారు. ఇది టీడీపీ చేస్తున్న తప్పు’ అని పేర్కొన్నారు. -
తిరుపతిలో తారాస్థాయికి ‘కూటమి’ విభేదాలు
తిరుపతి: తిరుపతిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని టీడీపీ నేల, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పరామర్శించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తిరుపతిలో రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. బయట ప్రాంత వ్యక్తుల వచ్చి తిరుపతి ప్రశాంత వాతావరణం దెబ్బతిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు పుటేజీ బయటపెట్టాలన్నార సుగుణమ్మ. అదే సమయంలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బరుల వద్దే క్యాసినోలు..
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కోర్టు తీర్పులను లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నేతలు బరులు పంచుకుని విచ్చలవిడి జూద క్రీడలకు తెర తీశారు. ఇప్పటికే ఊరూరా బెల్టు షాపులు, కుటీర పరిశ్రమలా మద్యం తయారీ, సహజ వనరుల దోపిడీతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సంక్రాంతి పండుగనూ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ముడుపులు తీసుకుని కోడి పందేల బరుల వద్ద క్యాసినోలు, జూద క్రీడలకు పచ్చజెండా ఊపారు. దీంతో మూడు రోజుల్లో రూ.వేల కోట్లు చేతులు మారాయి! టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల తరహాలో జూదాల జాతర సాగుతోంది. అన్ని బరుల వద్దా పేకాట, గుండాట, కోతముక్క నంబర్ల ఆటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.బరుల వద్దే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ.5 వేల కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. పెద అమిరం వద్ద బరిలో క్యాసినో ఏర్పాటు చేసి గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లను ప్రత్యేక అతిథుల కోసం రప్పించినట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా జూద క్రీడలు సాగుతుంటే సంక్రాంతి సంబరాలు అంటూ ఎల్లో మీడియా మభ్యపుచ్చేందుకు యత్నించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. ఎప్పటి మాదిరిగానే అత్యధిక బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం కాగా ఆ తర్వాత తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. భీమవరం, ఉండి, దెందులూరు, రావులపాలెంలో బరులు గోవా, శ్రీలంక క్యాసినోలను తలదన్నేలా ఏర్పాటయ్యాయి. గన్నవరం, నూజివీడు మధ్య మీర్జాపురం, బిళ్లనపల్లి గ్రామాల సమీపంలో ఏర్పాటైన పందేల బరి హైలైట్గా నిలిచింది. అక్కడికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు రావడంతో ప్రత్యేకంగా వీవీఐపీ గ్లాస్ గ్యాలరీలు ఏర్పాటు చేసి క్యారవాన్లు, బౌన్సర్లను రంగంలోకి దించారు. ఏసీ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, రాత్రయితే ఫ్లడ్ లైట్లతో పందేల బరులు ఎగ్జిబిషన్లను తలపిస్తున్నాయి. ఈ గ్యాలరీల్లో ప్రవేశం రుసుం కింద రూ.2 వేలు చొప్పున వసూలు చేశారు. అతిథులకు సకల మర్యాదలు చేస్తున్నారు. స్థానిక వంటలు రుచి చూపించేందుకు వంట మాస్టర్లను రప్పించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో బరులను దగ్గరుండి పర్యవేక్షించారు. గురు, శుక్రవారం కోడి పందేలను వీక్షించారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేటతోపాటు యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో కోడి పందేలు భారీగా జరిగాయి. రాజమహేంద్రవరం రమేష్ జాక్పాట్..! రెండు రోజుల్లో రూ.2.50 కోట్లు.. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1.53 కోట్ల భారీ పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ సేతువ జాతి పుంజు, రాజమహేంద్రవరంవాసి రమేష్ డేగ జాతి కోడి పుంజుల మధ్య పందెం జరగ్గా డేగ జాతి పుంజు గెలిచింది. దీంతో రమేష్ పందెంలో రూ.1.53 కోట్లు నెగ్గారు. శుక్రవారం కనుమ రోజు నిర్వహించిన మరో పందెంలో రమేష్ రూ.90 లక్షలు గెలుచుకోవడం విశేషం. ఇన్నోవా కారు, బుల్లెట్లు.. రావులపాలెంలో పందెంలో గెలుపొందిన గ్రూపు రాయల్ ఎన్ఫీల్డ్ను సొంతం చేసుకుంది. ఏడు పోటీలకు ఆ గ్రూపు 6 పందేలలో గెలిచింది. మురమళ్లలో ఇన్నోవా కారు, బుల్లెట్ ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఏలూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన బరిలో సర్వ హంగులు కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరం బరి వద్ద బిరియానీ పాయింట్లు, కోడి పకోడి సెంటర్లు, ఆహార పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా రూ.5 వేల కోట్ల జూదం..! చిన్న బరుల్లో పందేలు రూ.వేల నుంచి మొదలై రూ.లక్షల వరకూ వెళుతున్నాయి. పెద్ద బరుల్లో రూ.లక్షల్లో మొదలై రూ.కోట్లకు చేరుకుంటున్నాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లోని 14 పెద్ద బరుల్లో రూ.వందల కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా రూ.200 కోట్ల వరకూ పందేలు జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఒక్కో బరిలో రోజుకు 25 నుంచి 30 వరకు ప్రధాన పందేలు జరగ్గా, కనీస పందెం రూ.50 లక్షల నుంచి మొదలై రూ.కోటి వరకూ వెళ్లాయి. తాడేపల్లిగూడెం బెల్ట్లోనే రూ.250 కోట్ల మేర పందేలు జరిగినట్లు చెబుతున్నారు. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు పందేలు జరిగినట్లు అంచనా. భీమవరంలో భలే గిరాకీ.. భోగి పండుగ రోజు మొదలైన పందేలు సంక్రాంతి రోజు పతాక స్థాయికి చేరి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా బాబులతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర చోట్ల నుంచి జూదరులు తరలివచ్చారు. దీంతో హోటళ్లు, వాహనాల అద్దెలు, తాత్కాలిక వసతులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భీమవరంలోని పెద్ద హోటళ్లలో రూమ్ కోసం ఒక రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బౌన్సర్లు.. ‘జబర్దస్త్’ వినోదం⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండాట, పేకాట, కోతాట, క్యాసినోల నిర్వాహకులు పగలు రాత్రి తేడా లేకుండా జూదాలు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు బరి నుంచి బయటకు రాకుండా సకల సదుపాయాలు కల్పించారు. ఈసారి మినీ ఏటీఎంలు వెలిశాయి. జబర్దస్త్ నటులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద మాడుగుల హల్వా, సంగం డెయిరీ అవుట్ లెట్, ఐస్ బర్గ్ లాంటి ఐస్క్రీం స్టాల్స్ కనిపించాయి. పెద అమిరం బరి వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సినీ ప్రముఖులు పందేలు తిలకించారు. ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తుతోంది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో భారీగా పందేలు నిర్వహించారు. కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, సినీ నటి హేమ తదితరులు పందేలను వీక్షించారు. తూర్పు గోదావరి జిల్లాలో కడియం – వీరవరం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో క్యాసినో నిర్వహించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బరుల వద్ద భారీ పందేలు జరిగాయి. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో బరి వద్ద రేగిన వివాదం కేతనకొండలో రెండు సామాజిక వర్గాల మద్య ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి శిబిరంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి పేకాట, క్యాసినో నిర్వహించారు. రూ.10 వేలు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్తో లోపలికి అనుమతించారు. పెనమలూరు నియోజకవర్గం ఆకునూరు, ఉప్పులూరు గ్రామాల్లో క్యాసినో తరహా జూద క్రీడలు సాగాయి. ఎంట్రీ టికెట్ రూ.లక్ష చొప్పున బరుల నిర్వాహకులు వసూలు చేశారు. కాకినాడ జిల్లాలో బరులకు వెళ్లే దారిలో రెండు కి.మీ. మేర ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి సెల్ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. ⇒ పిఠాపురం మండలం కందరాడలో జనసేన నేత ఆధ్వర్యంలో సినీ సెట్టింగ్ మాదిరిగా ఏర్పాట్లు చేసి కోడిపందేలు, గుండాట నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడిపందేల విజేతలకు రెండు కార్లు, ఒక బైక్ బహుమతిగా అందించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా పందేలు జరిగాయి. పూతలపట్టు మండలం బండపల్లిలో పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నట్లు ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రూ.12.26 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రణస్థలం మండల పరిధిలో కోడి పందేలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుల కనుసన్నల్లో పందేలు సాగాయి. అచ్యుతాపురం మండలంలో బెల్టు షాపులకు వేలం నిర్వహించారు. సబ్బవరం మండలం అమృతపురం, మొగలిపురం గ్రామాల్లో టీడీపీ, జనసేన కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలో కోడిపందేలు, గుండాట నిర్వహించారు. టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ స్వగ్రామమైన మొగలిపురంలో పందేల వద్ద గొడవ జరిగింది. సుజాతనగర్కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఓ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకుని రాత్రంతా విద్యుత్ స్తంభాలకు కట్టేశారు. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కోడి పందాల బరులన్నీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఏర్పాటయ్యాయి. వారి సూచనల మేరకే పోలీసులు బరులకు అనుమతి ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముందే ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ముడుపుల బేరం కుదుర్చుకున్నాక పోలీసు అధికారుల వద్దకు వెళుతున్నారు. అక్కడ కూడా లంచాలు ఇచ్చాక తూతూమంత్రంగా కేసులు పెట్టేందుకు కొంతమందిని నిర్వాహకులే పోలీసులకు అప్పగిస్తున్నారు. వారిని పోలీసులు ముందే బైండోవర్ చేసి కొన్నిచోట్ల దాడి చేసి అరెస్టు చేసినట్లు చూపుతున్నారు. ఇందుకోసం స్టేషన్కి రూ.10 నుంచి రూ.15 లక్షలు ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
Janasena: రికార్డింగ్ డ్యాన్సర్లతో బరితెగింపు..
-
బట్టలు తీసేయండి.. మహిళా రికార్డింగ్ డ్యాన్సర్లతో జనసేన ఎమ్మెల్యే అనుచరులు
-
కూటమిలో కొత్త కొట్లాట ఎంపీ సీట్ల కోసం లాబీయింగ్
-
కూటమిలో ‘పెద్ద’ లాబీయింగ్!
సాక్షి, అమరావతి: త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబీయింగ్ మొదలైంది. మూడు నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్ పదవీకాలం ఈ ఏడాది జూన్లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల కోసం మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేనకు మొండిచెయ్యి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్బాబుకే కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతోపాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. జనసేన కోటాలో లింగమనేని త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడైన లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఒక అంగీకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రెండు సీట్లకు బీజేపీ పట్టు ఏపీ కోటాలో ఈసారి తమకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి, రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యా బలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకు మరోమాటకు తావు లేకుండా ఒక సీటు కమలనాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.సానాకే మరోసారి చాన్స్..!రెండు బీజేపీకి, ఒకటి జనసేనకు ఇస్తే ఇక టీడీపీకి మిగిలేది ఒకే ఒక స్థానం. దాన్ని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడి సానా సతీష్బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు చినబాబు వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. -
మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్
-
చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్ను నిలదీసిన నేతలు
-
పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన జనసేన నాయకులు
-
జనసేనకు బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలోకి చేరికలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలకు వైఎస్సార్సీపీ కండువా కప్పి.. వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏబండారు గంగాసురేష్, ఆనెం సుభాష్, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ సహా పలువురు నేతలు.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ నేత బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు. -
చంద్రబాబు పై బీజేపీ, జనసేన సీరియస్... ప్రజల ప్రాణాలతో ఆటలు వద్దు....
-
‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకునేరు..
జిల్లాలో కోడి పందేలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐ.పోలవరం, అల్లవరం, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో పందేలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన మండలాల్లో కూడా పందేలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు పందేల బరుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. పోలీసులు అధికారికంగా అనుమతులు ఇవ్వకున్నా పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేసేలా చూడాలని, బరులకు అనధికార అనుమతులు ఇప్పించాలని ఒత్తిడి పెంచారు. బరులు ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయా ప్రాంతాలను చదును చేసి పందేల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. కోడి పందేలతోపాటు ఈ ఏడాది గుండాటలు కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశముంది. పందేల బరుల వద్దే గుండాటల కూడా నిర్వహించనున్నారు. ఈ తంతుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్ధకమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా: ‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకుంటారు. అసలు కాదండోయ్.. ఇది అధికార టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగే కోడి పందేలకు చేసిన రీల్స్.. సంక్రాంతి సమీపిస్తుండడంతో జూదరులను ఆకర్షించేందుకు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కోడి పందేలను అడ్డుకుంటామనే పోలీస్ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ, పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గతంలో సంక్రాంతి పండగ ముందు రోజు వరకూ పందేల నిర్వహణ, బరులు సిద్ధం చేయడాన్ని రహస్యంగా ఉంచేవారు. ప్రభుత్వం మారిన తరువాత వారం పది రోజుల ముందు నుంచే కోడి పందేలకు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇది సరిపోదన్నట్టు ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరదీశారు. కోడి పందేల బరులతో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో పందేల రీల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇలా పందేల కోసం బహిరంగంగానే ప్రచారం మొదలు పెట్టారు. కోడి పందేల బరులు, వాటి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీలు, ఎల్సీడీలు, కార్ పార్కింగ్లు.. ఇలా సర్వం రీల్స్లో చూపిస్తూ జూదరులను ఆకర్షిస్తున్నారు. జిల్లాలో కోడి పందేలు అనగానే గుర్తొచ్చేది ఐ.పోలవరం మండలం మురమళ్ల. ఇక్కడ పండగ మూడు రోజులూ రూ.కోట్లలో చేతులు మారుతుంటాయి. టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే పందేలలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు హాజరవుతుంటారు. వీరితోపాటు అదనపు ఆకర్షణగా తెలుగు సినిమా నటులు కూడా వస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే హైటెక్ బరులు, చుట్టూ ఫెన్సింగ్, ఎల్సీడీ టీవీలు, గ్యాలరీ వంటివి అధునాతంగా ఉంటాయి. వీవీఐపీలకు ఆతిథ్యం అదనం. దీనికే ఇప్పుడు విస్తృతంగా ప్రచారం కలి్పస్తున్నారు. ఇది రీల్స్లో అగ్రగామిగా నిలిచింది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పందేలకు ఏర్పాట్లు చేస్తుండడంతో జూదరులు మరింత మంది పందేలకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ రీల్స్లో గత ఏడాది పందేలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సినీ నటులు కూడా కనిపిస్తున్నారు. దీనితో పాటు జిల్లాలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పులంక, అల్లవరం మండలం గోడి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగే వాటికి కూడా ప్రచారం మొదలైంది. కోడి పందేల నిర్వహణ చట్టరీత్యా నేరమైనా చంద్రబాబు ప్రభుత్వంలో దీనికి కూడా ఒక బ్రాండింగ్ కల్పించి ప్రచారం చేయడాన్ని చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టులో హై టెన్షన్.. జనసేన కార్యకర్తల ఆందోళన
-
నేనొక జనసైనికుడిగా చెప్తున్నా... విశాఖకు కింగ్ గుడివాడ అమర్నాథ్
-
Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్ను పట్టుబట్టిన స్థానికులు
-
మహేష్ బాబు, అతని అభిమానిపై జనసేన ఫ్యాన్స్ బూతులు
ఎన్నికల సమయంలో వేదికలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఆపై అల్లు అర్జున్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్లు పాన్ ఇండియా రేంజ్ హీరోలు అని, వాళ్లతో పోలిస్తే తాను చాలా చిన్న నటుడుని మాత్రమే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇలా ఇవ్వండి.. ఆ ప్రభాస్ ఫోటో పైకి ఎత్తండి అంటూ.. ఎన్నికల ముందు ఇతర హీరోలను ఆకాశానికి ఎత్తారు. ఇదంతా వారి ఫ్యాన్స్ ఓట్ల కోసం ఆయన చేసిన మ్యాజిక్.. కానీ, గెలిచిన తర్వాత పరిస్థితి మారింది. వారి అభిమానులపై సైకోలు మాదిరి జనసేన అభిమానులు రెచ్చిపోతున్నారు.మహేష్ బాబు అభిమానిపై బూతులువిశాఖలోని జగదాంబ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని జనసేన పార్టీ నేతలు దగ్గరుండి కొద్దిరోజుల క్రితమే తొలగించారు. ఆపై తాము తలుచుకుంటే ఒకే రోజులో విగ్రహాన్ని ఎత్తేశాం అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ను రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పడు మహేష్ బాబు అభిమానిపై బూతులతో జనసేన అభిమానులు రెచ్చిపోయారు. తాజాగా జల్సా, మురారి సినిమాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ బాబు అభిమాని ఒకరు జల్సా సినిమాకు వెళ్లాడు. అయితే, ఆ యువకుడి మెడలో వారణాసి మూవీ లాకెట్ ఉంది. దానిని గుర్తించిన జనసేన ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆ యువకుడిని తిట్టడమే కాకుండా ఏకంగా మహేష్ బాబును దూషిస్తూ ఆయన్ని కూడా తిట్టాలని హుకూం జారీ చేశారు. అలా చేయకుంటే దాడిచేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఆ యువకుడి తల్లిని కూడా వారు తిట్టి మరింత దిగిజారిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, నెటిజన్లు కూడా పవన్ ఫ్యాన్స్పై విరుచుకుపడుతున్నారు. 'ఇవ్వేం బూతులు రా..' అంటూ భగ్గుమంటున్నారు. ఆపై అల్లు అర్జున్ ఫోటో మాస్క్ను దరించిన కొందరు జనసేన అభిమానులు సైకోలుగా మారిపోయారు. తమ వికృత చేష్టలకు విరుగుడు లేదన్నుట్లుగా పవన్ అభిమానులు ఉన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ఏ హీరో ఫ్యాన్తో తమకు పనిలేదనే అహంకారం వారిలో కనిపిస్తోందని ఇతర హీరోల అభిమానులు అంటున్నారు.ఇతర హీరోల అభిమానులంటే చిన్న చూపుకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది హీరోలను, వారి అభిమానులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది అనేది క్లియర్గా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి 'పుష్ప' సినిమాపై పవన్ చేసిన కామెంట్.. ఆపై జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆడించమంటూ ఏకంగా ఆయన కుటుంబంపై రాయలేని బూతులతో ఎగబడిన టీడీపీ ఎమ్మెల్యే, అతన్ని సపోర్ట్ చేసిన జనసేన అభిమానులు.. వారిని తరుచూగా ఎగదోసే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కల్యాణ్. వీళ్ల తీరు చూస్తుంటే.. తాము అధికారంలో ఉన్నాం.. ఇక హీరోల ఫ్యాన్స్తో పనేంటి.. ఏదైనా ఉంటే మళ్లీ ఎన్నికల ముందు వాళ్లను కాకపట్టొచ్చులే అనేలా వారి భావన ఉంది. (మహేష్ బాబు అభిమానిపై జనసేన ఫ్యాన్స్ వాగిన బూతులు చిన్న పిల్లలు వినకపోవడమే మంచిది) View this post on Instagram A post shared by Tupaki (@tupaki_official) -
డిజాస్టర్ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా
పవన్ కల్యాణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో పవన్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలారోజుల క్రితమే ప్రకటించారు. దర్శకుడు సురేంద్ర రెడ్డి 2023లో తెరకెక్కించిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా ప్రకటించలేదు. అయితే, తాజాగా పవన్ కల్యాణ్తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. వక్కంతం వంశీ ఈ ప్రాజెక్ట్కు కథ అందిస్తున్నాడు. అయితే, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇప్పటికే రవితేజకు ఈ కథను వినిపించారని సమాచారం. పలు కారణాల వల్ల షూటింగ్ వరకు చేరలేదని టాక్ వుంది. గతంలో ఆయన తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి, ఏజెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సరైన కథ కోసం సురేంద్ర రెడ్డి ప్లాన్ చేస్తుండగా వక్కంతం వంశీ చెప్పిన కథతో పవన్ వద్దకు వెళ్లడంతో ఆయన ఓకే చేసినట్లు సమాచారం. హైదరాబాద్లో గన్ కల్చర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుందని తెలుస్తోంది. అయితే, ఇదే స్టోరీని రవితేజకు చెబితే నో అన్నారని టాక్ ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి గతంలో రవితేజతో నేల టికెట్టు, డిస్కో రాజా చిత్రాలను నిర్మించారు. -
కూటమి గుండెల్లో అప్పుడే గుబులు?
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా.. పార్టీ మీటింగ్లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్ కూడా రెడ్బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి ఉండాలట. ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అడ్డంగా ఇరుక్కున్నారుగా!! పచ్చ బొట్టు సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం
-
రెచ్చిపోదాం.. రచ్చ చేద్దాం
సాక్షి, పుట్టపర్తి: దాడి ఏదైనా.. గొడవ ఎక్కడ జరిగినా.. రాజకీయ రంగు పూసి ‘రెచ్చిపోదాం.. రచ్చ చేద్దాం’ తరహాలో కూటమి పార్టీల నాయకులు తయారయ్యారు. నిందితులకు వైఎస్సార్సీసీ ముద్ర వేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణపై దాడి ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ నెల 21వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల అనంతరం అజయ్దేవ్ అనే యువకుడు గర్భిణిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ‘నిండు గర్భిణిని వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు’ అంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి అజయ్దేవ్ జనసేన పార్టీ కార్యకర్త. అతడిపై వైఎస్సార్సీపీ ముద్ర వేయడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని చితకబాదారు. నడవలేని స్థితిలోనూ రోడ్డు మీద ఊరేగిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కానీ, గంటల వ్యవధిలోనే అజయ్ జనసేన కార్యకర్త అని తేలిపోయింది. అతడిని రిమాండ్కు పంపిన తర్వాత అసలువిషయం బయటకు వచ్చింది. అతడు జనసేనకు చెందినవాడని స్వయంగా అతని సోదరి రజిత, జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యుడు అమర్ కార్తికేయ వెల్లడించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా చెప్పారు. తనకు పదేళ్ల నుంచి అజయ్ తెలుసని, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో అతడిని వైఎస్సార్సీపీ కార్యకర్తగా చిత్రీకరించిందని అమర్ మండిపడ్డారు. పవన్కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అతడు పాల్గొన్న ఫొటోలు విడుదల చేశారు. ‘‘పవన్కళ్యాణ్ అంటే అజయ్కు విపరీతమైన అభిమానం. ముందు నుంచి నా సోదరుడు జనసేనలోనే కొనసాగుతున్నాడు. అనవసరంగా వైఎస్సార్సీపీ కార్యకర్త అని ముద్ర వేశారు’’ అని అజయ్దేవ్ సోదరి రజిత బుధవారం వీడియో విడుదల చేశారు. అజయ్దేవ్ వైఎస్సార్సీపీ అని తొలుత ప్రచారం కావడంతో మంత్రి నారా లోకేశ్ కామెంట్ చేశారు. ‘ఇదేం పైశాచికం జగన్ గారూ’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. మరి లోకేశ్ ఇప్పుడు ఏమంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ ఏం చెబుతారు? ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు అజయ్దేవ్ విషయంలో హోం మంత్రి అనిత స్పందించాలి. ఘటనకు ఠక్కున రాజకీయ రంగు పూసి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. రామగిరిలో దళిత బాలికపై, హిందూపురంలో అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ విషయంలో కూటమి పార్టీల నాయకులు ఎందుకు నోరు మెదపలేదు? కానీ, అజయ్దేవ్ వైఎస్సార్సీపీ కార్యకర్త అనే అనుమానంతో చకచకా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ ఏమి చెబుతారు? -
YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు
-
పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు
-
మా అన్న పవన్ వీరాభిమాని: రజిత
సాక్షి, అనంతపురం: కదిరి ఘటనలో ఇంకో ట్విస్ట్ చేసుకుంది. అజయ్కు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదని స్వయంగా అతని సోదరి రజిత స్పష్టత ఇచ్చింది. ఇంతకు ముందు.. ఇదే విషయాన్ని ఎంపీటీసీ అమర్ సైతం ధృవీకరించారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న అజయ్ జనసేన అని ప్రకటించారు. దీంతో ఎల్లో మీడియా ఎలివేషన్లు కాస్త తుస్సుమనిపిస్తున్నాయి. ‘‘మా అన్నకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదు. అతను ముందు నుంచే జనసేనలో ఉన్నాడు. మా అన్న మొదటి నుంచి పవన్ అభిమానే. అందుకే చెయ్యిపై పవన్ కల్యాణ్ టాటూ కూడా వేయించుకున్నాడు(పీఎస్ పీకే). ఎంపీటీసీ అమర్తో మా అన్నకు పదేళ్ల పరిచయం ఉంది. పక్కా జనసేన. మా అన్నని పాత కక్షలతోనే ఇరికించారు’’ అని రజిత ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అజయ్పై ఫిర్యాదు చేసిన గర్భిణీ కుటుంబంతో పాత గొడవలు ఉన్నాయని.. తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతుతుండడం గమనార్హం.వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నంలో పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కదిరి తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్ జగన్ బర్త్డేనాడు పటాకులు పేలుస్తున్న వాళ్లను ఓ గర్భిణిపై మందలించిందని.. అందుకు ఆమెను కాలితో తన్ని దాడి చేశాడని.. దీంతో ఆమె ఆస్పత్రిపాలై కడుపులో బిడ్డ కదలికలు సైతం లేవని.. పోలీసులు అతన్ని తమశైలిలో బుద్ధి చెప్పి(కోటింగ్) నడిపించారంటూ అజయ్ దేవ్ గురించి కూటమి అనుకూల మీడియా.. సోషల్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఏపీలో ఆదిత్యా యోగినాథ్ ట్రీట్మెంట్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్.. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్తే అంటూ ఎల్లో మీడియా కలరింగ్.. అది నమ్మి కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్ను అదుపులోకి తీసుకోవడం.. నాటకీయ పరిణామాలను తలపించింది. చివరకు.. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించడంతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్లైంది.ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు చెప్పినదాని ప్రకారం.. ఈనెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత అజయ్ కూడా కేక్ తిన్నాడు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత సంధ్యారాణితో అజయ్కి మాటామాటా పెరిగి గర్భిణి పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. అజయ్ దేవ్ వైఎస్సార్ సీపీ నేత అని.... గర్భిణి పై దాడి చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనుకాముందు ఆలోచించకుండా వైఎస్సార్సీపీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన నేత అని కదిరి పోలీసులు గుర్తించారు. అయితే... మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా ఆరోపణలు నిజం చేసే బాధ్యత తీసుకున్న పోలీసులు అజయ్ని ఊరేగించారు. ఇప్పుడు.. అజయ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అటు జనసేన అమర్ క్లారిటీ ఇవ్వగా.. ఇటు ఫేక్ ప్రచారంపై అజయ్ సోదరి రజిత భగ్గుమంది. -
గర్భిణీపై దాడిలో నిజం బయటపెట్టిన జనసేన నేత
-
ఎల్లో మీడియా ఎఫెక్ట్.. జనసేన కార్యకర్తకు పోలీసుల కోటింగ్!
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీపై బురదజల్లాలని పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కదిరిలో గర్భిణిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్త కాదని.. అతడు జనసేన యాక్టివ్ కార్యకర్త అని ఆ పార్టీ నేత అంగీకరించారు. దీంతో, ఈ కేసులో మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై అజయ్ దేవ్ దాడి చేశాడు. దీంతో, నిందితుడు అజయ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కలరింగ్ ఇచ్చింది. తప్పుడు కథనాలను ప్రచురించింది. పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అని భావించి.. అతడిపై పోలీసులు తమదైన మార్క్తో కోటింగ్ ఇచ్చారు. అనంతరం, పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా.. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించారు. అజయ్కి వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు. అజయ్ చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ అజయ్ దేవ్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక, ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ఎల్లో మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు జనసేన కార్యకర్త అజయ్పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి దాయాదులని, తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. -
టీడీపీ–జనసేన దుష్ప్రచారం ఆర్బీఐ నివేదికతో బట్టబయలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై స్థూల విలువ జోడింపు (జీవీఏ– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)తో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నెలలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ విష ప్రచారాన్ని ఎండగట్టారు. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను జత చేస్తూ.. ‘సత్యమేవ జయతే’ హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు.ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘‘టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనిగట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రం పని తీరు దయనీయంగా ఉండేది.కానీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ, పరిశ్రమల రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి.. 2019–24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఇంతకుముందెన్నడూ చూడని ఆర్థిక పురోగతిని చూశామా? -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
మేం మళ్లీ వస్తే అంటూ కొందరు బెదిరిస్తున్నారు.. బెదిరించేవారికి ఈ సారు భయపడడు.. మేం నిర్ణయం తీసుకుంటే మీకు మళ్లీ ఆ మాటలు రావు.. ఓ సభలో తమను నమ్మి చక్కని పాలన అందిస్తారని ఓట్లేసిన ప్రజల ముందు మన పవన్ సార్ పెట్టిన ముచ్చట్లు.. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నట్లు తనను విమర్శించారని, యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు.. కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు.. సాక్షాత్తు మన పవన్ సార్ పెట్టిన మరో ముచ్చట.అయితే ఇన్నేసి మాటలంటూ.. కాలుకు కాలు కీలుకు కీలు తీస్తామని బెదిరించేవారిని ఏమంటారంటూ ప్రజల్ని ఆలోచనలో పడేసారు. అయినా ఇంత కరుకుగా ఎలా మాట్లాడగలిగారని నోళ్ళు నొక్కుకోవాల్సిన అవసరం లేదు.. సారంటే ఎవరనుకున్నారు.. నట పవరేశ్వరుడు. ఏమాటకామాట.. అతనో విలక్షణ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం ఆయన సొంతం. తనది కాని పాత్రలోనూ అంతే సహజంగా ఇమిడిపోవడం అతని స్పెషాలిటీ. మొన్నమొన్నటి దాకా స్పాంటేనియస్ గా ఆవేశం వచ్చేది. ఇప్పుడేమో బూతులూ వస్తున్నాయి. అభిమానుల చప్పట్లకు పరవశించని నటుడుండడు కదా.. వీరూ అందుకు మినహాయింపు కానేకాదు. తనే ఓ సైన్యాన్ని కట్టి పార్టీ పెట్టి జన బాహుళ్యంలో చొచ్చుకుపోవాలని గతంలో విఫలయత్నం చేశారు. అయితే ఒక్కోసారి అదృష్టం కూడా దారితప్పుతుంది కదా.. అలా మన సారు గారికి పవర్ రావడంతో పవరేశ్వరుడి అవతారం ఎత్తారు.అసలే వెండితెర హీరో.. ఒంటి చేత్తో లారీలు లేపి ఆవల పడేసిన ధీరోదాత్తం ప్రదర్శించిన వారాయే. ఓట్ల పండగనాడు వారెంత వీరంగం వేశారని.. అబ్బో చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ప్రచారంలో ఆహా ఏం వాగ్దాటి.. ఆ.. ఏవన్నారు చూసి చదివారనా? సర్లేండి పేపర్లు పట్టుకునేవారు.. కళ్ళద్దాల్లోంచి తొంగి చూసి మరీ చదివేవారు.. అది కాదండీ మీరు చూడాల్సింది.. ప్రతి అయిదు నిమిషాలకోసారి పూనకం వచ్చినట్లు ఊగి రేగి చలరేగి పోయేవారు. అస్సలు ఆ కిక్ కోసమే కదా మేం కాళ్ళునొప్పెట్టేలా నిలుచుని మరీ చూసింది. మీరెన్నెన్ని అన్నా ఈసారి మన సారుకు బాగా వర్కవుట్ అయ్యింది. దెబ్బకు పెద్దసీట్లో పడ్డారు.. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందనమాట.సారు సినిమా రెండో భాగం ఇంకా సూపరు తెలుసా? అప్పుడే క్యారెక్టర్.. కాస్ట్యూములు మారిపోతాయి. అదెలా అదెలా అంటారేంటి సార్.. నటులకు ఆమాత్రం క్రియేటివ్ లిబర్టీ ఇవ్వరా ఏంటి? సరే మొన్నటి దాకా చెగువేరా అన్నారు. ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో అని స్టెప్పులేశారు.. గొంతుకు ఎర్ర తువాలు చుట్టుకున్నారు. మాటలో ఎరుపు అరువు తెచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో గట్టెక్కి సీట్లో సెటిలయ్యాక.. అడ్రస్ మారిస్తే ఎలా ఉంటుంది అని తెగ ఆలోచించారు. అదేమంటారు.. మేధోమథనం.. అదే అలా మదనపడీ పడీ.. సివరాఖరికి హిందూధర్మ పరిరక్షణోద్యమం అంటూ కాషాయం చుట్టేసుకుని నుదుటిపై పేద్ద బొట్టు పెట్టేసుకుని బొబ్బలు పెట్టడం మొదలెట్టారు. మొదట్లో కొందరు కంగారు పడిన మాట నిజవే. కానీ వెంటనే సర్దుకుని ఓహో క్యారెక్టర్ ఛేంజా అని సరిపెట్టుకున్నారు. ఎంతైనా వారి వెండితెర ప్రయాణంలో మమేకమైన అబిమానులం కదా ఆమాత్రం అడ్జస్టు చేసుకోలేమా ఏంటి? అని వ్యాఖ్యానించారు కూడా.అయినా సారు ఏ వేషం కట్టినా సరే.. ఆవేశం అస్సలు మిస్ చేయరు అదే బాగా నచ్చే విషయం. అపుడు చెగువేరా అని గర్జించారా.. ఇపుడు నా ధర్మం.. నా హిందుత్వ అంటూ గుండెలవిసేలా దిక్కులు పిక్కుటిల్లేలా ఘోషిస్తున్నారు. ఏదైనా అరుపే కదా మనకు కావల్సింది ఆ సౌండింగే కదా అందుకే పోనీలే పవరేశ్వరా ఈసారి ఇలా కానిచ్చేయ్ అంటూ అభిమానులు పచ్చజెండా బరబరా ఊపేసరికి సారువారు పొంగిపోయారు. అప్పట్నుంచి ఇదే బాపతు. అయినా దేశపెద్ద అండదండ తనకుందని.. ఇరు పెద్దల్ని కలిపిన పిల్లకాల్వలా తనకు ఎప్పటికైనా గుర్తింపు ఉండనే ఉంటుందని వారి గొప్ప నమ్మకం. అందుకే తాజాగా వారు తమదైన శైలిలో ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎందుకంటే అవసరం లేని చోట ప్రశ్నించడం వారి పురాప్రాప్త హక్కు కదా. అధికారంలోకి మళ్ళీ మేమొస్తే అని అన్నారో సహించం కాక సహించం అని గుడ్లురిమారు. బెదిరించే వారికి ఈ సారు అస్సలు భయపడడు.. రాజకీయంగా అనుకుంటే జస్ట్ 48 గంటల్లో అంతా క్లియర్ చేసేస్తాం అని హూంకరించారు. ఇక్కడ అర్థం కానిదేంటంటే...సారుకు కోపం ఎందుకొచ్చింది? ఎదుటి పార్టీవారేదో తమను బెదిరిస్తున్నారని.. సరే మరి మీరు బదులిచ్చిన ధోరణి ఎలా ఉంది? అది కూడా ఫక్తు బెదిరింపు ధోరణే కదా. ఈ మాత్రం దానికి మరీ అంతలేసి బిల్డప్పులు అవసురమా సార్. అసలు ఈపాటికే మీరు మీ పెద్దసారు చేయాల్సిందంతా చేస్తున్నారుగా.. ఇంకా తీగ లాగుడు ఎందుకు?పోనీ అలా అంటే వారేమైనా బెదురుతారా అంటే అదీ జరగదని మీక్కూడా తెలుసు. మరెందుకు పవరేశ్వర్ సార్ ఈ అనవసర రౌద్రు బీభత్స భయానక సమ్మిళిత డైలాగులు. దీనికన్నా కాస్త పాలన బెటర్గా చేయండి పదుగురు హ్యాపీగా ఫీలవుతారు. అంతేగానీ...రాక రాక వచ్చిందోచ్ నాకూ పవరూ అంటే ..అదేదో మీరన్నారే క్లియర్ చేస్తామని.. అంత రిస్క్ మీకెందుకు సార్.. మన ప్రజలున్నారుగా.. అయిదేళ్లు ఓపిక పట్టండి వారే క్లియర్ సేల్స్ బోర్డు పెట్టేస్తారు.-ఆర్ఎం -
రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు. -
జనసేన కార్యకర్తను చితకబాదిన టీడీపీ నేతలు
-
కూటమి నాయకుల్లో భగ్గుమన్న వర్గ విభేదాలు
నెల్లూరు: జిల్లాలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టిడిపి జనసేన నాయకులు మధ్య ఫ్లెక్సీల వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. జనసేన నాయకడు భాను కిరణ్పై టీడీపీ నాయకులు దాడులకు దిగారు. ఈ ఘటనలో గాయపడ్డ జనసేన నేత భాను కిరణ్ను ఆత్మకూర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. ఇవి జిల్లాల వారీగా స్థానిక నాయకుల మధ్య ఘర్షణలకు దారి తీస్తూ ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక నేతల పనితీరు, అధికారుల వ్యవహారశైలి పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు జిల్లా వారీగా సర్వేలు చేయిస్తున్నారని సమాచారం.పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణలు బహిరంగంగా జరిగాయి. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత వ్యాఖ్యలు జనసేన వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఒంగోలులోనూ నేతల మధ్య విభేదాలు ముదిరాయి.కర్నూలు జిల్లా: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కేటాయింపులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీసీ వర్గాలకు విలువ ఇవ్వలేదని ఆరోపణలు, పదవుల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తమైంది. -
బార్గా మారిన అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం..!
-
బార్గా మారిన అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం..!
అనకాపల్లి: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని బార్గా మార్చారనే ఆరోపణలు ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీకి చెందిన నేత సూర్య చంద్ర బార్గా మార్చి అక్కడ దావత్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్టీ కార్యాలయాన్ని బార్గా మార్చడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి జనసేన శ్రేణులు. రాజకీయ పార్టీ కార్యాలయం ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా ఉండాలి కానీ, దాన్ని ఇలా వినియోగించడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తల నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది పార్టీ సిద్ధాంతాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగిందని, ఇది పార్టీకి అవమానకరమని మండిపడుతున్నారు. -
సుందరపు ’ఛీ’త్రాలు
-
టీడీపీ సభల్లా పేరెంట్–టీచర్స్ సమావేశాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: పాఠశాలలు, విద్యార్థులు, విద్యా సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు టీడీపీ సభల్లా మారాయి. రాజకీయ ప్రసంగాలకు, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేశ్పై పొగడ్తలకు పరిమితమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు తొలి ప్రాధాన్యంతో పాటు మాట్లాడే అవకాశమివ్వాల్సిన చోట రాజకీయ నాయకులే అంతా ముందుండి నడిపించారు. మెగా పీటీఎం పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా అందించిన డబుల్ డెస్క్ బెంచీలకు ‘లీప్’ స్టిక్కర్లు అతికించారు. వాటిపైనే కూర్చుని సీఎం విద్యార్థులతో మాట్లాడారు. అన్ని చోట్లా కేవలం రాజకీయ ప్రసంగాలు, లోకేశ్ను మార్కెట్ చేయడమే ప్రధానంగా సమావేశాలే సాగాయి. గుంటూరు పట్టణంలో జరిగిన పీటీఎంలో వేదిక పైనా, కిందా టీడీపీ నాయకులే ఆక్రమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల పీటీఎంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని బూటుకాళ్లతో తన్నిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంపీ సుబ్బారావును డీఈవో సస్పెండ్ చేశారు. కడపలోని గాం«దీనగర్ మున్సిపల్ హైసూ్కల్లో తల్లిదండ్రుల కోసం వేసిన కురీ్చల్లో టీడీపీ నేతలు కూర్చున్నారు.పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు వైఎస్సార్ కడప జిల్లా కాశినాయనమండలంలోని నాయునిపల్లి ఎంపీపీ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమునెమ్మ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళాలు వేసి నిరసన తెలిపారు. ఒకే ఉపాధ్యాయిని ఉండటంతో విద్య బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తల్లిదండ్రులు రాకపోవడంతో టీడీపీ నేతలు బలవంతంగా పిలిపించారు. తిరుపతి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలలు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. తల్లిదండ్రుల కంటే టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా చోట్ల 30 శాతం మంది తల్లిదండ్రులు కూడా పాల్గొనలేదు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే రీతిలో సమావేశాలు కొనసాగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీడీపీ రాక ఆలస్యం కావడంతో హిందుపురం టీడీపీ ఎమెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను ప్రదర్శించారు. భోజనం బాగోలేదంటూ ఆగ్రహం కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి జిల్లా పరిషత్ హైసూ్కల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం బాగుండటం లేదని, దీంతో పిల్లలు ఇళ్లకు వచ్చేస్తున్నారని చెప్పారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చక పోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాన్ని బహిష్కరించారు. పాఠశాల గేటు మూసివేసి బయటే ఉండిపోయారు. -
జనసేన 'పంచ'సూత్ర.. రెచ్చిపోతున్న షాడో సీఎం
-
‘తవ్వండి.. తోలండి.. మనల్ని ఎవడ్రా ఆపేది’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జనసేన నేతలు రెచ్చిపోతున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ మన్యంలోని కొండలు, గుట్టల్ని తవ్వేస్తూ.. గ్రావెల్, మట్టిని మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ రూ.5 వేల చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. వీరి చర్యల వల్ల ఏజెన్సీలోని కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. చివరకు పంట కాలువ గట్లు, పరిసర ప్రాంతాలను కూడా వదలటం లేదు. మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ పగలు, రాత్రి టిప్పర్లలో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సహకారంతోనే తవ్వకాలు సాగుతున్నాయా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం సమీపంలోని కొండను నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల జేసీబీతో తవ్వి తరలించారు. తాజాగా సోమవారం బుట్టాయగూడెం శివారు బూసరాజుపల్లి సమీపంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టును జేసీబీతో తవ్వి గ్రావెల్, మట్టిని తరలించడం ప్రారంభించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ ఏఈ అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై తహసీల్దార్ కార్యాలయానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఇరిగేషన్ డీఈ ఎం.నాగరాజు తెలిపారు. అయినా అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. -
పవన్ పర్యటనలో ఆగంతకుడు అంటూ జనసేన "క్యామెడీ" అంబటి రాంబాబు సెటైర్లే సెటైర్లు
-
దుష్ప్రచారం చేయబోయి అడ్డంగా బుక్కయిన జనసేన!
మలికిపురం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 26న జరిగిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త పాల్గొన్నాడని.. పవన్ను హత్య చేసేందుకు పర్యటన ఆద్యంతం ఆయన వెనకే తిరిగాడంటూ జనసేన నాయకులు చేసిన హడావుడి వికటించింది. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ మీద బురదజల్లాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజోలు దీవిలో బుధవారం పవన్ కల్యాణ్ పర్యటనలో మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన పున్నం నరసింహమూర్తి అనే వ్యక్తి పాల్గొన్నాడు. అతడు వైఎస్సార్సీపీకి చెందిన వాడని, పవన్ను హత్య చేయడానికి రెక్కీ చేశాడని జనసేన నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఆ పార్టీ నాయకులు అమరావతిలోని పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. తీరా చూస్తే నరసింహమూర్తి జనసేన కార్యకర్తగా నిర్ధారణ అయ్యింది. అసలేం జరిగిందంటే.. గూడపల్లికి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుందర శ్రీనుబాబు అనారోగ్యం వల్ల పవన్ పర్యటనకు రాలేదు. అతడి పాస్ మీద నరసింహమూర్తి పవన్ పర్యటనలో పాల్గొన్నాడు. ఈ వివాదానికి రాజోలులో జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కూడా ఒక కార ణం. పవన్ పర్యటనలో రైతుల సభకు వచ్చే వారికి ఇచ్చే పాస్ల పంపిణీ ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలకు కారణమైంది. పాస్లు పెద్దగా పొందలేకపోయిన ఒక వర్గం.. జనసేన కార్యకర్తలకు కాదని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పాస్లు ఇచ్చారనే ప్రచారానికి దిగారు. ఇలా పాస్ పొందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పవన్కు హాని కలిగించేందుకు వచ్చారంటూ జనసేన వ్యక్తులే ప్రచారం చేశారు. విచారించిన పోలీసులు నరసింహమూర్తి జనసేన కార్యకర్తేనని, అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని నిర్ధారించడంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. అసలు విషయం బయటపడగానే అందరూ కుక్కిన పేనులా మారిపోయారు. -
మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
సాక్షి,గుంటూరు: మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని మల్లవల్లి రైతులు ధర్నా చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆఫీస్కు ఇప్పటికి 27సార్లు వచ్చినా పట్టింపులేదంటూ రైతులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తమను కలవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు.కాగా, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిన్న (నవంబర్ 24, సోమవారం) పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ప్రజలు, కార్మీకుల నుంచి నిరసనల సెగ తగిలిన సంగతి తెలిసిందే. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మీకులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా పవన్కళ్యాణ్కు గోడు వెళ్లబోసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ, పవన్ను కలిసేందుకు కార్మీకులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మీకులు పవన్కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
చంద్రబాబును మించిన పెద్ద దొంగ.. నాదెండ్ల మనోహర్ పై పేర్ని నాని సెటైర్లు
-
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్ తెలిపారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ వివరాలను ఎక్స్లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ జగన్ పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉంది. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.కానీ, కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు?. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. కానీ, అభివృద్దిలో వేగంగా పరుగులెత్తుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు?’ అని ప్రశ్నించారు.𝙇𝙤𝙬 𝙍𝙚𝙫𝙚𝙣𝙪𝙚 𝙂𝙧𝙤𝙬𝙩𝙝, 𝙇𝙤𝙬 𝘾𝙖𝙥𝙚𝙭 𝙖𝙣𝙙 𝙍𝙞𝙨𝙞𝙣𝙜 𝘿𝙚𝙗𝙩 - 𝙏𝙝𝙚 𝙑𝙞𝙨𝙞𝙤𝙣 𝙤𝙛 @ncbn 𝙂𝙖𝙧𝙪The figures released by the CAG for first half of FY 2025-26 reveal a very discouraging growth of State Government revenues. This is quite contrary to the… pic.twitter.com/aQSOlWz7uL— YS Jagan Mohan Reddy (@ysjagan) November 16, 2025 -
పవన్ కళ్యాణ్కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై స్పందించిన మిథున్.. ఆ ఆరోపణలను నిరూపించాలని పవన్కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు.ఆ భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని పవన్కు ఆయన హితవు పలికారు. గతంలో కూడా ఎర్ర చందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని మిథున్ గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Mr @PawanKalyan you are good at shooting and scooting. You have done that in the past (remember red sanders remarks made by you) and ran away after I demanded you to prove the allegations. What you have shot from your helicopter is our legitimate land, we bought it in 2000.— Mithunreddy (@MithunReddyYSRC) November 13, 2025 -
మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్
-
షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..
-
విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు
-
జనసేన నేత వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
చేతకాకపోతే మీ ఇద్దరూ రాజీనామా చేయండి.. బొమ్మి ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్


