breaking news
Chandrababu Naidu
-
Sajjala: ఆర్గనైజ్డ్ మీడియా టెర్రర్... కేక్ ను ఎవడైనా గొడ్డలితో కట్ చేస్తాడా?
-
Kakani : బాబూ.. అడ్డుకోవాలని చూడకు.. ప్రజలే నిన్ను తరిమి తరిమి కొడతారు
-
Sajjala: కోర్టు మొట్టికాయలు వేసిన బుద్ధి రావడం లేదు.. కోడి కొస్తే కేసు పెడతారా..
-
Buggana: ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది?
-
దేవాలయాల్లో అపచారాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: కారుమూరి
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందేరం చేసే కుట్రలకు తెర తీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచి పెట్టేందుకు కేబినెబ్లో తీర్మానం చేశారు. మూడు వేల కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారుచౌకగా 25 కోట్లకు కట్టబెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు.దేవాలయాల పవిత్రను దెబ్బతీస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చూపిస్తే.. అలా చూపించిన వారిపైనే కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఆలయాల్లో జరుగుతున్న ఘటనలకు ఏమని సమాధానం చెబుతుంది?. చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీపై విషప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘కూటమి సర్కార్ అరాచకాలపై అలుపెరగని పోరాటం’
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి అన్నారు.సుధాకర్ బాబు మాట్లాడుతూ.. నేడు గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదలు కొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ పని చేస్తోందని.. ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వైఎస్ జగన్ ఒక్కరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారింది’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు.టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోంది. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపు ఎరుగని పోరాటం చేస్తాం’’ అని సుధాకర్బాబు చెప్పారు. -
Sajjala : కోడి కోశారని నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు
-
Sajjala : రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు విఫలమయ్యారు
-
‘బాబూ.. సీమకు ద్రోహం చేస్తారా.. బాధ్యత లేదా?’
సాక్షి, నంద్యాల: ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రాజెక్ట్ విషయంలో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి’ అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమకు ద్రోహం చేస్తూ మీడియా సమావేశాల్లో తప్పుడు వ్యాఖ్యలు చేయడమేంటి?. నిజాయితీగా నీటిని అందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు కృషి చేయాలి. కూటమి నేతలు సవాల్ విసరడం బాగానే ఉంది కానీ పాలకులుగా మీకు బాధ్యత లేదా?. చర్చకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్కు మేము సిద్ధమే. రాయలసీమ ప్రాంతవాసులకు నీరు అందించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. -
‘ఆ ప్రాంతంలో అవినీతి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించకూడదు?’
తాడేపల్లి : అమరావతిలో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తన తందాన కంపెనీలకే బాబు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, ఆ కంపెనీల నుంచి 4 శాతం కమీషన్లు బాబు తీసుకుంటున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల.. మొబలైజేషన్ అడ్వాన్స్లతో బాబు అండ్ కో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇల్లు ఉన్న ఏరియా, అమరావతి ఒక్కటైనా.. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారు.. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. మేం అమరావతిని తక్కువ చేయలేదుతాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్లను ప్రశ్నిస్తున్నామన్నారు సజ్జల. ‘విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పాం. అమరావతిని వైఎస్సార్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. చంద్రబాబు బెదిరింపులు అరుపులు కాకుండా సూటిగా సమాధానం చెప్పాలి. గొంతెత్తి, కళ్లు పెద్దవి ేసి బెదిరిస్తే సమాధానం దొరకదు. రూ. లక్ష కోట్ల అప్పుకు ఏడాదికి రూ. 8 వేల కోట్ల వడ్డీ కట్టాలిరాయలసీమ ప్రయోజనాలు ఎలా.?శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రోజుకు 8 టీఎంసీలు వాడుకుంటుంది. 777 అడుగుల నుంచే తెలంగాణ నీళ్లు తోడుకుంటుందే రాయలసీమ ప్రయోజనాలు ఎలా?, రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబ విఫలమయ్యారు. ఆర్గనైజ్జ్ మీడియా టెర్రరిజంతో నిజాలను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు. చంద్రబాబు సైలెంట్ ఉండటం అంటే రేవంత్ చెప్పింది నిజమే అని అర్థం చేసుకోవాలివిష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్డీవిష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని సజ్జల విమర్శించారు. పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ అనేది వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఉందని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే అందులో దాపరికం ఎందుకని ప్రశ్నించారు. ‘లక్షా 80 కేజీల గోమాంసం విశాఖలో పట్టుబడితే ఏం చేశారు. క్వశ్చన్ చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వకుండా.. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. అధికారం వచ్చాక కూడా వారంలో మూడు, నాలుగు రోజులే బాబు ఇక్కడ ఉంటున్నారు. ప్రతివారం హైదరాబాద్లో చంద్రబాబు, లోకేష్లకు ఏం పని? అని నిలదీశార సజ్జల. చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందాంచంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందామన్నారు సజ్జల ‘ వైఎస్ జగన్ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. రూ. 3.30 లక్షల కోట్లలో రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చాం. చంద్రబాబు రెండేళ్లు తిరగకుండానే రూ. 3 లక్షల కోట్లపైగా అప్పు చేశారు. చంద్రబాబ పాలనను ప్రజలు, విజ్ఞులు మేధావులు ప్రశ్నించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
రేవంత్ తో కుమ్మక్కై.. సీమకు సమాధి.. చివరకు కథ అడ్డం తిరిగింది
-
భూ సర్వే రాయి పై జగన్ ఫోటో..! బాబుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన పేర్ని నాని
-
Manohar Reddy: కేక్ కట్ చేసినా కేసా..? ఇదెక్కడి న్యాయం..?
-
Gadikota Srikanth: మిడి మిడి జ్ఞానంతో మాట్లాడొద్దు..! చరిత్ర మిమ్మల్ని క్షమించదు
-
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్కిల్ స్కాంలో బాబుకు ఎదురుదెబ్బ ?
-
మైసూరు బోండంలో మైసూరు ఉండదు.. మన రాజధానిలో అమరావతి ఉండదు
-
కొంచమైనా సిగ్గుండాలి... బాబుకు CPI రామకృష్ణ మాస్ వార్నింగ్
-
సభ అట్టర్ ఫ్లాప్.. పాస్ బుక్ ఇవ్వడం కోసం హెలికాప్టర్.. పేర్నినాని సెటైర్లు
-
అడ్డదారిలో కేసు క్లోజ్.. ACB కోర్టు తీర్పుపై ఉత్కంఠ!
-
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం...
-
దరఖాస్తుతో.. దేవుడి భూములు!
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆ«దీనంలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మీక సంస్థల పేరిట ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకు ఇవ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మీక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఐదేళ్ల వరకు లీజుకివ్వడం లేదంటే పాత లీజులు పొడిగించే అధికారాన్ని దేవదాయ శాఖ కమిషనర్కు కల్పించింది. లీజు ఐదేళ్లకు మించితే ఆ అధికారాన్ని దేవదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ధార్మీక పరిషత్కు కల్పించింది. అయితే గతంలో దేవదాయ శాఖ జారీ చేసిన జీవో 426 ప్రకారం దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకు ఇవ్వాలని నిర్దేశించడం గమనార్హంనిన్న ఆమోదం.. నేడు జీవో.. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల దేవుడి భూములను ఎలాంటి వేలం లేకుండా ధార్మీక సంస్థల పేరిట కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపుతూ చంద్రబాబు ప్రభుత్వం 2025 మే 2వతేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. దాదాపు 8 నెలల తర్వాత తుది మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా.. శుక్రవారం జీవో ఎంఎస్ నెంబరు 15 ద్వారా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే లీజు ధరలను సైతం స్పష్టంగా వెల్లడించకపోవడం గమనార్హం. అధికారుల విచక్షణ మేరకు లీజు ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు... రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో ఆలయాలు, సత్రాలు, మఠాలు పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నాయి. అందులో పట్టణ ప్రాంతాల్లో 4,244 ఎకరాల మేరకు అత్యంత విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. వీటిలో 1.55 కోట్ల చదరపు గజాలు ఖాళీ భూములుగానూ, మరో 50 వేల చదరపు గజాలు కట్టడాల రూపంలో ఉన్నాయి. -
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతరు.. బాబు కోసం బరితెగింపు
ఈ కేసులో చంద్రబాబు కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారే తప్ప తాను అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదు. సెక్షన్ 17(ఏ)ను ఉటంకిస్తూ ఈ కేసు తనకు వర్తించదన్న చంద్రబాబు వాదన సరికాదు. నిజాయితీపరులైన అధికారులను రక్షించడానికి సెక్షన్ 17(ఏ) ఉద్దేశించిందే తప్ప.. అవినీతి పరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదు. ఈ దృష్ట్యా ఈ కేసును కొట్టివేయలేము. – జస్టిస్ బేలా త్రివేది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిసాక్షి, అమరావతి: చంద్రబాబే నిందితుడిగా, చంద్రబాబే పోలీసుగా సాగుతున్న పచ్చ నాటకం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తూ సాగుతున్న కుట్ర దేశంలో కొత్త దుస్సంప్రదాయానికి తెరతీస్తోంది. చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి బాగోతాన్ని అడ్డగోలుగా మూసి వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ బరితెగింపు విస్మయ పరుస్తోంది. చంద్రబాబు కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేత కోసం సీఐడీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది.న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంపై న్యాయ నిపుణులే విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసు అడ్డగోలు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేస్తూ ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పిటిషన్పై విచారణ, తదుపరి పరిణామాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లను ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేశాయన్నది గమనార్హం. ఈ అవినీతి కేసు దర్యాప్తు, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఆ మూడు న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి. స్పష్టంగా ఆధారాలు.. కొట్టేయడం కుదరదు స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. అందుకే ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత సమరి్పంచిన రిమాండ్ నివేదికతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందింది. రిమాండ్ నివేదికను తిరస్కరించాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిది. సిట్ నివేదికతో ఏకీభవిస్తూ చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతోనే ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత అనారోగ్య సమస్యల కారణంగానే ఆయనకు బెయిల్ మంజూరైంది.కాగా, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిచినా ఆయనకు చుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న ఆయన వాదనను హైకోర్టు తిరస్కరించింది. అధికారిక విధుల్లో భాగంగానే స్కిల్ కార్పొరేషన్ నిధుల చెల్లింపునకు అనుమతిచ్చానన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చిది. ప్రజాధనాన్ని స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ 140 మంది సాక్షులను విచారించి, నాలుగు వేల డాక్యుమెంట్లను కూడా సేకరించిందని తన తీర్పులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే దొంగాట చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ను అర్ధంతరంగా మూసివేతకు కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలకు విరుద్ధంగా కుట్రకు తెగబడుతోంది. వాస్తవానికి స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై కేసు నమోదు, విచారణకు గతంలో ప్రభుత్వం అధికారికంగా సీఐడీకి అనుమతినిచ్చిది. అనంతరమే సీఐడీకి చెందిన సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ అధికారిక విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక అనుమతి ఇవ్వలేదు.కానీ సీఐడీ మాత్రం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ’ ముసుగులో కేసును మూసి వేయడానికి న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. ఎందుకంటే అధికారికంగా అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధిత అధికారి బాధ్యుడు అవుతారు. ఆ అధికారిక ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేతకు కుట్ర పన్నింది. ప్రభుత్వ అధికారిక అనుమతి లేకుండానే కేసు మూసివేతకు సీఐడీ అధికారులు బరితెగించారు. ఆ అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు ఎండీల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఈ కేసు మూసివేత వ్యవహారంలో ఏపీఎస్ఎస్డీసీ పూర్వ ఎండీ, ప్రస్తుత ఎండీ పరస్పర భిన్న వాంగ్మూలాలు ఇవ్వడం గమనార్హం. గతంలో ఎండీగా వ్యవహరించిన బంగార్రాజును ప్రభుత్వ పెద్దలు తమదైన శైలిలో బెదిరించి లొంగ దీసుకున్నారు. దాంతో ఈ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. కాగా ప్రస్తుత ఎండీ గణేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న ఆయన తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.అంతే కాకుండా న్యాయపరంగా నిబంధనలను పాటించడంతోపాటు.. ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అంటే కేసు మూసివేయవచ్చని.. అందుకు తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పలేదు. నిబంధనలు పాటించాలని చెప్పారు. అంటే సీఐడీ నిబంధనలను పాటించడం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెబితే తాను భవిష్యత్లో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. అందుకే ఈ కేసు మూసివేత ప్రతిపాదనను ఆయన సమర్ధించ లేదు. అడ్డగోలుగా మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న ఆతృతలో సీఐడీ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఈ కుంభకోణంపై ఫిర్యాదుదారును పక్కన పెట్టేసి, తమ గుప్పిట్లో ఉండే అధికారుల ద్వారా కుట్ర కథ నడుపుతోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించి సీఐడీ కేసు నమోదు చేసి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చింది. కాగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసు మూసివేత ప్రక్రియలో అజయ్ రెడ్డిని విస్మరించింది.అప్పటి ఎండీగా ఉన్న బంగార్రాజు ద్వారా పావులు కదుపుతోంది. కేసు మూసివేతపై అభ్యంతరం ఉందా లేదా తెలపాలని సీఐడీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే ఆయన్ను ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం జరిగిపోయింది. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథకు పన్నాగం పన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వ కుట్రను అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి తిప్పి కొట్టారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారు తానే అని, ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు స్కిల్ కేసు కొట్టివేతను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ను దాఖలు చేశారు. కమీషన్లు దండుకున్న వారు అరెస్టు.. కొల్లగొట్టిన చంద్రబాబుపై కేసు క్లోజా!? స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి విస్మయ పరుస్తోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉండీ.. కొల్లగొట్టిన నిధుల్లో కమీషన్లు దండుకున్న వారిని ఈడీ అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది.ఈడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ కుంభకోణం సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు చంద్రబాబుపై కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా మూసి వేస్తుందని నిపుణులు ప్ర శ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార దురి్వనియోగానికి పాల్పడి, లేని ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది ఆయనే. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిధుల జారీకి ఆదేశాలు జారీ చేసిందీ చంద్రబాబే. కొల్లగొట్టిన నిధుల్లో సింహ భాగం ఏకంగా రూ.271 కోట్లు చంద్రబాబు ప్యాలస్కే చేరాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబుపై కేసును తొలగించడం నిబంధనలకు విరుద్ధం.. చట్ట విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఐడీ క్లోజర్ రిపోర్ట్పై నా వాదనలు వినండి ⇒ స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారు, ఆ కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ⇒ ఈ కుంభకోణంలో ఆధారాలున్నందునే చంద్రబాబుపై కేసు.. రిమాండ్ ⇒ దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురు ⇒ చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర ⇒ అసలు ఫిర్యాదుదారుడినైన నాకు నోటీసు ఇవ్వలేదు ⇒ ఇలా నోటీసు ఇవ్వక పోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం ⇒ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లోనూ నేను పార్టీగా ఉన్నాసాక్షి అమరావతి : స్కిల్ డెవలప్మెంట్æ కార్పొరేషన్ కుంభకోణంలో ఫిర్యాదుదారునైన తనకు తెలియకుండానే కేసును మూసి వేయడానికి వీల్లేదని ఆ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం కేసుని మూసివేసేందుకు సీఐడీ, ప్రాసిక్యూషన్, నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని అయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై కేసును మూసి వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిపారు. ఈ కుమ్మక్కు కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు నాయుడు 37వ నిందితుడిగా ఉన్నారని చెప్పారు.ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండటంతో సీఐడీ ఆయన్ను 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిందని, ఆ మరుసటి రోజు అంటే 2023 సెపె్టంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్కు పంపిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురైందన్నారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు బెయిల్ పొంది బయటకు వచ్చారని, ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ప్రస్తుత దర్యాప్తు అధికారి నిందితులతో కుమ్మక్కై క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారని చెప్పారు. ఫిర్యాదుదారు అయిన తనకు విచారణ పురోగతి గానీ, క్లోజర్ రిపోర్ట్ దాఖలు గురించి గానీ తెలియజేయలేదన్నారు.ఇది మీనూ కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అని తెలిపారు. ఫిర్యాదుదారుడికి నోటీసు ఇచ్చి వాదనలు వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ‘కేసు మూసివేతకు ఇఐఈ, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్, నిందితులు కలిసి కుట్ర పన్నారు. ఎఫ్ఐఆర్ లో కాలమ్ 6లో ఫిర్యాదుదారుగా నా పేరు స్పష్టంగా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లో కూడా నేను పార్టీగా ఉన్నా. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసి వేసేందుకు సీఐడీ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ముందుగా నాకు నోటీసు ఇవ్వాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశించండి. ఆ క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశాను. ఈ సందర్భంగా నా వాదనలు వినాలి’ అని అజయ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్పై ఏం జరగనుంది.. సర్వత్రా తీవ్ర చర్చస్కిల్ స్కామ్ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న సీఐడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజయ్రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు సోమవారం చేపట్టనుంది. ఈ కేసు విచారణ కేవలం స్కిల్ స్కామ్ కేసుపైనే కాదు.. భవిష్యత్లో ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులపై కూడా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం. అందుకే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం 40 మందికిపైగా సాక్షులను విచారించింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వారు చెప్పిన సాక్ష్యాలు, నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ఎఫ్ఐఆర్లు, చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయం ప్రస్తావనార్హం. ఏకంగా నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లలో పేర్కొన్న విషయాల్లోని ప్రామాణికతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగాలని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి హోదాలో పాల్పడిన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసి వేయడం ఒక దుస్సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే జరిగితే మునుముందు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు బరితెగించి అవినీతికి పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు, విచారణ కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ.3,300 కోట్లుగా నిగ్గుతేల్చిన సీఐడీ2014–19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది. రూ.370 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందుకు అనుగుణంగా కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది. అంతిమంగా ఈ కుంభకోణం విలువను రూ.3,300 కోట్లుగా తేల్చింది. అటు తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. స్కిల్ కుంభకోణం నిధులను నిందితులందరూ కలిసి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ఈడీ తేల్చింది.స్కిల్ కుంభకోణం కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, చంద్రబాబు నాయుడిని 2023 సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన పలు ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ రూపంలో కోర్టుకు సమరి్పంచింది. సాక్షుల వాంగ్మూలాలను సైతం కోర్టుకిచ్చిది. చంద్రబాబును రిమాండ్కు పంపాలని కోరింది. 2015లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం మొదలు నిధుల మళ్లింపు వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచింది.చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో కేవలం మూడు రోజుల లోపే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే స్కిల్ కుంభకోణంపై సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కూడా కోరారు. చంద్రబాబు పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేస్తూ 2023 సెపె్టంబర్ 22న తీర్పునిచ్చిది. దర్యాప్తులో భాగంగా సీఐడీ 140 మంది సాక్షులను విచారించిందని, అలాగే 4,000 డాక్యుమెంట్లను కూడా సేకరించిందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. దర్యాప్తు విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సీమెన్స్కు నిధుల చెల్లింపుల నిర్ణయాన్ని అధికారిక విధుల్లో భాగంగానే తీసుకున్నానన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసి పుచ్చిది. పబ్లిక్ సర్వెంట్ ప్రజాధనాన్ని తన స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని తేల్చి చెప్పింది. కేసు కొట్టివేతకు సుప్రీం నిరాకరణఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను ఆయన సవాలు చేశారు. అలాగే తనపై కేసును సైతం కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. అవినీతి నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేసే ముందు ఆ చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోలేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్న తీర్పులు వెలువరించారు.అయితే ఇరువురు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు కుమ్మక్కుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమరి్థస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబుపై కేసును కొట్టేసేందుకు సైతం ఇరువురు న్యాయమూర్తులు నిరాకరించారు. సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ చెప్పగా, అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. సెక్షన్ 17(ఏ)ను నిజాయితీపరులైన అధికారులను రక్షించేందుకే తీసుకొచ్చారే తప్ప, అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు.స్కిల్ స్కామ్లో అసలు దోషి బాబే ఆధారాలతో నిగ్గు తేల్చిన ఈడీ, సీఐడీ⇒ దాచాలన్నా చంద్రబాబు అవినీతి బాగోతం దాగేది కాదు. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అనే పేరుతో కుట్రకు తెరతీశారు. కానీ స్కిల్ స్కామ్ కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనని ఇప్పటికే ఈడీ, సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చాయి. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో సమరి్పంచిన రిమాండ్ నివేదికలో సిట్ వెల్లడించింది. ⇒ జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.370 కోట్ల ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. లేని ఈ ప్రాజెక్టును కాగితాలపై చూపించి.. సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ⇒ నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపునకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 13 నోట్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేసి ఈ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారు. అలా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చారు. ⇒ 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఈ కుంభకోణం బయట పడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చిది. ⇒ సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుతో ఆధారాలతో సహా నిగ్గు తేలింది. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో ఛేదించారు. కొల్లగొట్టిన అవినీతి సొమ్ములో రూ.77.37 కోట్లను హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిల్లోని టీడీపీ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. కేవైసీ నిబంధనలకు విరుద్ధంగా నిధులను డిపాజిట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో బట్టబయలైంది. ⇒ ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్ïÙట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా ఎవరూ చెప్పక పోవడం గమనార్హం. ⇒ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. ⇒ రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. -
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉంది. ఒక్క పాసు పుస్తకం ఇవ్వటానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కానీ, చివరకు ఏమైంది.. పరాభవం ఎదురైంది. పాస్ బుక్లు ఇవ్వలేదని స్వయంగా సీఎంకే రైతులు చెప్పారు. అయినా కూడా వైఎస్ జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదు. చంద్రబాబు, లోకేష్, పవన్లు జగన్ కోటి రాస్తూ.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారు. రైతులను జగన్ ఏం ఇబ్బంది పెట్టారు?. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22(A)లో భూముల్ని పెట్టి రైతులని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22Aలో చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందుల ఎదురయ్యాయి. జగన్ ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధం అని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జగన్ పరిష్కరిస్తే ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏం అనాలో తెలుగులో పదాలు దొరకటం లేదని అన్నారాయన. జగన్ వచ్చాక జేసీతో పనిలేకుండా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబు హయాంలోనే భూ రికార్డుల్లో చాలా అక్రమాలు జరిగాయి. ఆయన చెప్పే మాటలకు ఆయనకే నమ్మకం ఉండదు. బంధువులతో గొడవలు పెట్టుకో వద్దని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గర్నుంచి జూ.ఎన్టీఆర్ వరకు అందరితో గొడవలు పెట్టుకున్నదే చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆయనకే తగాదాలు ఉన్నాయి. ఎన్డీఆర్ ఆస్తుల్ని లాక్కున్నది ఎవరు?. నిమ్మకూరులో ఎన్టీఆర్ భూములు తీసుకున్నది ఎవరో చెప్పాలి?. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఆయన ఇల్లు, బ్యాంకు అకౌంటను లాగేసుకున్నది ఎవరు?. క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?.. అంటూ పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్ను కూడా జగనే తెచ్చారు. జగన్ చేపట్టిన భూ సర్వేనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్ బుక్కులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చిందే వైఎస్ జగన్. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక.. భూ సర్వేలు, పాస్ బుక్కుల విషయంలో ఏం మార్పులు చేశారో చెప్పాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. పాసు పుస్తకాల ప్రింటింగ్లో కూడా కూటమి నేతలు కక్కుర్తి పడి కమీషన్లు తీసుకుంటున్నారు. పాస్ పుస్తకం మీద ఫోటో వేసుకుంటే నేరమా?. పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ తొలగించటం తప్ప చంద్రబాబు ఏం చేశారు?. అనేక ప్రభుత్వ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఫొటోలు పెట్టారు కదా. చంద్రబాబు ఆరు అడుగుల గురివింద గింజ. 18 నెలలకే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు. రేపు వేసవి కాలానికే మా వైఎస్సార్సీపీ హయాంనాటి అప్పుల్ని దాటి పోతారు. త్రిబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలి?. పూర్తి కాని పోలవరం దగ్గర జయం జయం చంద్రన్నా అంటూ ఎందుకు భజన చేయించారు?. డబుల్ ఇంజిన్ సర్కార్తో తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు మిగిలాయి. కూటమి నేతలు రికార్డు స్థాయిలో అప్పులు చేశామని సంబురాలు చేసుకోవచ్చు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.👉నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజి కి నీళ్లు రాకపోతే కృష్ణాడెల్టా ఏం కావాలి?. మా హక్కులను కాలరాయటానికి చంద్రబాబు ఎవరు?. తన స్వార్ధానికి పొరుగు రాష్ట్రానికి మా హక్కులు కాలరాస్తారా?. ముచ్చుమర్రిలో 0.33tmc ల నీటితో కుప్పం వరకు నీళ్లు ఎలా వెళ్తాయి?. రాయలసీమకు లిఫ్టు అవసరం లేదంటూ చంద్రబాబు పాపం మూట కట్టుకుంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు విద్వేషం👉2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానన అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. పోలవరం పూర్తి చేయలేని వారు నల్లమల సాగర్ ఎలా పూర్తి చేస్తారు?. ఈ ప్రాజెక్టు చేయటానికి లక్ష కోట్లు కావాలి. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలి. ఈ సొమ్మంతా ఎక్కడినుండి తెస్తారు?. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్తే చంద్రబాబు రచ్చ చేశారు. అలా ఎలా వెళ్తారనీ.. తెలంగాణతో గొడవ పడాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నీతులు ఎలా చెప్తారు?. రాజధానిలో వెయ్యి కోట్లతో లిఫ్టులు కడతారా?. ఆ ఖర్చు చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పూర్తవుతుంది కదారాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. ఆ తర్వాత రెండో విడత గురించి మాట్లాడాలి. సీఎంగా ఉన్న చంద్రబాబుకు వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించమని జగన్ కోరారు. అమరావతి మీద జగన్ కు మమకారం లేకపోతే ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారు?. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదు. లింగమనేని రమేష్ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు?ఏపీలో కులం, మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్. ఆయన్ని జనం కాపు కాయాలంట. ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంట. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలి?. దళితులను వెలి వేస్తుంటే ఎవరు కాపు కాయాలి? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. -
East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన
-
చరిత్ర మిమ్నల్ని క్షమించదు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు బాగోతం బయటపడ్డా.. ప్రభుత్వం ఎదురుదాడి చేయడంపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న ఆయన.. అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.మరో వైపు మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఒకటే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో అబద్దపు వార్తలు రాయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా వైఎస్ జగన్కి మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమ చేసిన మేలు శూన్యమని తేల్చి చెప్పారు.అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే వైఎస్ జగన్ తపన అని.. తెలంగాణా వినియోగించుకున్నట్టే.. కృష్ణా జలాలతో సీమను స్టెబిలైజ్ చేసేందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చేపట్టారని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని రద్దు చేయడం తీరని ద్రోహమని ఆక్షేపించారు. తన కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టునే నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ను ప్రభుత్వం పూర్తి చేయాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని.. కానీ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అలా చేస్తే చరిత్ర మిమ్నల్ని క్షమించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..తప్పును సరిదిద్దుకోని చంద్రబాబు..కానీ సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, కనీసం దాన్ని పరిశీలించే యోచన కూడా చేయకుండా ఎదురుదాడికి దిగడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో రెండు రోజులగా అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీం అవసరం ఏముంది అనేలా హేళన చేయడంతో పాటు అడ్డుగోలుగా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టంపై కనీసం ఆలోచన చేయకుండా తిరిగి ఎదురుదాడి చేయడం, వారి అనుకూల పత్రికల్లో అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు వార్తలు రాయించిన తీరు అత్యంత దుర్మార్గం.ఈ తరహా వార్తలు రాసే వారు ముందు పూర్తిగా అవగాహన కలిగించుకుని.. జరుగుతున్న నష్టాన్ని తెలియజేయాలే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని కనీసం అంచనా వేయడం లేదు. కేవలం వైయస్సార్సీపీ, వైయస్.జగన్ కి మైలేజ్ వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో తప్పుదోవ పట్డిస్తూ అసత్యాలు ప్రచురించడం శ్రేయస్కరం కాదు.మచ్చుమర్రి సహా ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ చలువే..మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కింద స్థాయిలో నీళ్లు తోడేస్తున్న నేపథ్యంలో.. 834 అడుగులకి చేరడం కష్టం అవుతుంది కాబట్టి.. దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్రెడ్డే కేసీ కెనాల్కు, హంద్రీనీవాకు వేసవిలోనే, తాగునీరు ఇచ్చేందుకు మచ్చుమర్రికి జీవో ఇచ్చారు. మచ్చుమర్రి పనులు ప్రారంభమైన తర్వాత అందులో నాలుగు పంపులుకే సీ కెనాల్కు, మిగిలిన పంపులు హంద్రీ నీవా ద్వారా జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు.అవేవీ తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రికి క్యూసెక్కులుకు, టీఏసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. అదే విషయం మరోసారి స్పష్టమవుతుంది. 790 అడుగుల్లో ముచ్చుమర్రి ప్రాజెక్టు 0.31 టీఎంసీ సామర్ధ్యం అంటే దాదాపు 3వేల క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తుంది. దాన్ని 3 టీఎంసీలు అని మీరు అనుకుంటున్నారు. ఆ విధంగా ప్రచురించారు. దాదాపు 33 వేల క్యూసెక్కులు వస్తే తప్ప... 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు, అది కూడా తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం ముచ్చుమర్రి ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండూ సేమ్ అన్నట్టు వార్తలు రాశారు.సీమకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం..చంద్రబాబుకి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంతగా... అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉంటే అవకాశం చంద్రబాబుకి వచ్చినా ఆయన ప్రజలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఆయను రాలేదు. మల్లెల, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పోతిరెడ్డుపాడు, ముచ్చుమర్రి, గండికోడ, తెలుగుగంగ ముందుకు తీసుకెళ్లే యోచన, హంద్రీనీవా చేపట్టే ఆలోచన కానీ, చివరకు పోలవరాన్ని చేయాలన్న తలపు కూడా మీకు లేదు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి, గుండ్లకమ్మ ప్రాజెక్టులు, నెల్లూరుకు చెందిన సోమశిల, నెల్లూరు బ్యారేజీ ఈ ప్రాజెక్టులు వేటి మీద మీరు ఆలోచన చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి,కొత్త రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసానని చెప్పుకోవడానికి తప్ప... రాయలసీమకు, రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదు.అన్ని ప్రాంతాలు బాగుండాలన్న తపనతోనే..మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు సమానమని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు 825 అడుగులులోపే 8 టీఎంసీలు ఒకేసారి తీసుకుంటున్నారు కాబట్టి... రాయలసీమలో కూడా వ్యవసాయానికి మేలు చేస్తూ.. స్టెబిలైజ్ చేయడానికి వాళ్లతో పాటు మనకూ సమాన అవకాశం ఉంటే భవిష్యత్తులో కలిసి నీటిని పంచుకునే ఆవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. మీరు మాత్రం ఆ ప్రాజెక్టును బలహీనపరుస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ ను అర్ఱం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరగకూడదనే..శ్రీశైలం రిజర్వాయర్ పుల్ లెవల్ కి రావాలంటే ఎన్ని క్యూసెక్కులు నీళ్లు రావాలి, ప్రతి సంవత్సరం అలా నీళ్లు రాని పరిస్ధితులలో ఎగువనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నీటి వినియోగానికి ఎక్కువ అవకాశాలున్నాయి. శ్రీశైలం నుంచి ఎస్ ఎల్ బీ సీ, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తెలంగాణా 820 అడుగులు లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. మరీ అన్యాయంగా 780 వరకు పవర్ జనరేషన్ కోసం 4 టీఎంసీలు రోజూ కిందకు వదిలేస్తున్నారు.ఇవన్నీ సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. ఈ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా నేరుగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు పనిచేస్తుంది. నీటి ప్రవాహం తక్కువగా 70వేలు, 80 వేలు క్యూసెక్కులు వచ్చినప్పుడు ఒకేసారి వాళ్లు 8 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, మనకు అదే లెవల్ లో 3 టీఎంసీలు కెపాసిటీతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంతిమంగా అన్ని ప్రాంతాలు బాగుంటాయి. కానీ చంద్రబాబు గారూ మీకు ఆ ఆలోచన లేదు.పోలవరాన్నీ నిర్వీర్యం చేసిన చంద్రబాబు..ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మీరు నిర్వీర్యం చేశారు. గతంలో ఎంతో కష్టంతో వైయస్సార్ ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి.. కేంద్ర ప్రభుత్వం కట్టకుండా అడ్డుకుని బలవంతంగా లాక్కుని ప్రాజెక్టుని అవినీతి మయం చేశారు.కాపర్ డ్యామ్ మందు కట్టి.. నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రమ్ వాల్ కడితే నాణ్యతతో వచ్చేది. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ముందు కట్టడంతో కాపర్ డ్యాంలో నీళ్లు ప్లో అరికట్టలేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పోలవరం ఆలస్యమయ్యేలా చేసింది మీరు కాదా చంద్రబాబూ?దివంగత నేత వైయస్సార్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఆ తర్వాత వైయస్.జగన్ హయాంలో ప్రాజెక్టు నిధులు, ఆర్ అండ్ ఆర్ కోసం కేంద్రాన్ని ఒప్పించి జీవో సైతం విడుదల చేయించి, స్పిల్ వే సహా నిర్మాణం చేపట్టారు. మీ అనాలోచిత నిర్ణయం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు. మీ వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారకులయ్యారు. కమిషన్ల కోసం మీ కక్కుర్తే ఇందుకు కారణం. 3 వేలకు 33 వేల క్యూసెక్కులకు తేడా తెలియదా?మచ్చుమర్రి చంద్రబాబు చేశాడు.. దాని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న పత్రికలు అసులు ఆ ప్రాజెక్టు జీవో ఎప్పుడు వచ్చిందో చూడాలి. దానిలో ఎంత నీరు తీసుకోవచ్చో చూడండి. 834 అడుగులు వద్ద మల్లెల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే... మచ్చుమర్రికి మాత్రం 790 అడుగుల వద్ద కేవలం 0.31 టీఎంసీ అంటే 3 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే 33 వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఆలోచన లేకుండా పోయింది. ముచ్చుమర్రి అనేది కేసీ కెనాల్, హంద్రీనీవాకు సమాంతర కాలువ ఉంది. అదే రాయలసీమ లిఫ్ట్లో 33 వేల క్యూసెక్కుల కోసం జరిగిన కాలువలు ఎలా ఉన్నాయి?పనులెంత జరిగాయో చూడండి? నీళ్లు లిఫ్ట్ చేసిన తర్వాత 33వేల క్యూసెక్కుల నీరు పోవడానికి కాలువలు ఉండాలి. ఈ కాలువలు కూడా పోతిరెడ్డిపాడు దాటిన తర్వాత బనకచర్ల క్రాస్ ముందు కలుస్తుంది. పోతిరెడ్డి పాడు నుంచి బనకచర్ల క్లాస్ వరకు ఉన్న కాలువ కూడా 80వేలక్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా కాలువలు వెడల్పు చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ప్రాజెక్టు చేసినప్పుడు.. హంద్రీనీవా స్థాయిని పెంచాలని కాలువల సామర్ధ్యం 3300 క్యూసెక్కులుంటే దాన్ని 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా వెడల్పు చేశారు.ఉద్యమానికి సిద్ధమైన రాయలసీమ..విధ్వంసం చేయాలన్న ఆలోచనే మీది. ఏ ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన మీకు లేదు. ఖరీఫ్ లో వేగంగా నీళ్లు వచ్చినప్పుడు దిగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఇక్కడ రైతుల పంటలను కాపాడ్డం కోసం, వాళ్లు కూడా సరైన సమయంలో పంటలు పెట్టుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ పని జరుగుతుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమ గుండె చప్పుడు. దయచేసి ఈ ప్రాజెక్టు అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్లు కూడా హేళనగా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ, అమరావతి, గోదావరి, ఉత్తరాంధ్రా ప్రాంతం ఏదైనా రైతులందరూ బాగుండాలన్నదే మా విధానం.మేం రైతుల పక్షాన నిలబడతాం. ఇవా అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా, గుంటూరు రైతులకు నష్టం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులిచ్చి ఆల్మట్టి ఎత్తు పెంచే నిర్మాణ పనులు మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అంతే తప్ప కేవలం వ్యక్తిగత లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరైన విధానం కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే పనిచేస్తోంది. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు. ఉప్పెనలా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాయలసీమ నుంచి చంద్రబాబు తరలించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.రాజధాని పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..దీంతో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తూ మరలా రాజధాని అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు. రాజధానికి మేం వ్యతిరేకం కాదు. అక్కడ రైతులకు మంచి జరగాలన్నదే మా విధానం. తొలివిడతలో రాజధానికి భూమిలిచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన ఓరైతు మంత్రి సమక్షంలో గుండాగి చనిపోయారు. వారికి అండగా నిలబడాలన్నదే మా విధానం. వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండో విడత భూసేకరణకు వెళ్లడాన్ని మేం తప్పుపడుతున్నాం.దయచేసి రాజకీయ కోణంలో విమర్శలు చేసి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ను రద్దు చేయడం ముమ్మాటికీ తప్పు. ఏడాదిలోగా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి.. తక్షణమే పూర్చి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి చేస్తుందన్ని స్పష్టం చేసిన శ్రీకాంత్ రెడ్డి ప్రజలను మాత్రం అబద్దాలతో తప్పుదోవపట్టించొద్దని హెచ్చరించారు. అలా చేస్తే టీడీపీ ప్రజా ప్రతినిధులను చరిత్ర క్షమించదని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
నెల్లూరులో టెన్షన్ టెన్షన్ సంకెళ్లు వేసుకుని విద్యార్థుల ఆందోళన
-
లోకేష్.. హెరిటేజ్ ఆస్తులను రూపాయికి ఇస్తారా?: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రజల ఆస్తిని దోచుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘మచిలీపట్నంలో మా పార్టీ ప్లాన్ పెట్టుకుంటే కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులు పార్టీ టీడీపీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కోర్టులు తీర్పునిచ్చినా.. నాకు మంత్రి కొల్లు రవీంద్రే ఎక్కువ అన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జైలులో వేస్తా జాగ్రత్త అని మండిపడ్డారంటే మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు అర్ధం అవుతుంది.ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే తీసేస్తారు ఇలాంటి వాళ్లని. ప్రజల ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తాననడం సిగ్గుచేటు. జనం ఆస్తి కాబట్టి మదం ఎక్కి మాట్లాడుతున్నారు.. హెరిటేజ్ ఆస్తులను అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తారా?. లోపల ప్రోడక్ట్స్ పావలాకి ఇస్తారా?. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా?. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.వైఎస్ జగన్ మాటలను అసహ్యంగా వక్రీకరిస్తున్నారు. మీ సొమ్ము కాదు కాబట్టి జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. మీ ఆస్తులు ఎక్కడైనా హైవేలపైనే ఎందుకు కడుతున్నారు. రెట్టింపు అయ్యేందుకా?. జనం సొమ్ము నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టి తగలేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మాణం చేసుకుంటారని జగన్ అన్నారు. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయడం నీటిని తోడే దానికి వందకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొంటామంటున్నారు.. మరి దాని కోసం కోట్లు తగలేసే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారు. జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు నోరు తెరుస్తారా?. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్దాలు మాట్లాడితే నోరు మెదపరా?. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబుకు చెంపపెట్టు.. టీడీపీ గుట్టురట్టు
-
ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారం అనుకున్నారా.. ఏకిపారేసిన సాకే శైలజానాథ్
-
Kakani: దొంగతనం ఏలా చెయ్యాలో బాబు దగ్గర నేర్చుకో.. సోమిరెడ్డికి చెమటలు
-
KSR Show: జగన్పై పిచ్చి రాతలు ఎల్లో మీడియాకు ఇచ్చిపడేసిన తోపుదుర్తి
-
Sailajanath : క్యాపిటల్కి డెఫినిషన్ కూడా తెలియదు.. ఎలా సీఎం అయ్యావ్ చంద్రబాబు
-
Vellampalli Srinivas: పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం... కొంచమైనా సిగ్గుందా చంద్రబాబు
-
చంద్రబాబుపై కొండా రాజీవ్ ఫైర్
-
జగన్ పేరు వింటే మూడు సార్లు బాత్రూం కి వెళ్లే మీరు..
-
మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్సార్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు‘‘తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా?. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల టు టౌన్ సీఐ శ్రీరాములు..వైఎస్సార్సీపీ కార్యకర్త మణిని కొట్టారు.బీఎన్.ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టకడుతున్నాం. లేదంటే మాకు జైళ్లే అవాసకేంద్రాలుగా మారేవి. మా సవాల్ ను స్వీకరించాలి.. మొత్తం ఆ సీసీ పుటేజ్ బయట పెట్టాలి. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ ఏం చేస్తోంది?. బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం తాగి పడేసి బాటిల్స్ అవి. నీకు లక్షలు, వేల కోట్లు ఎలా వచ్చాయి? కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాల్ విసురుతున్నా.. మేము హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధం’’ అని భూమన తేల్చి చెప్పారు.‘‘మీరు అరెస్ట్ చేసినా నా గొంతు ఆగదు.. తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాము. మీరు చేస్తున్నా ఘోరాలు, నేరాలు ప్రజలకు తెలియజేస్తాం. పోలీసులు బలి పశువులయ్యారు. సీఐ శ్రీరాములు చేసినది తప్పు.. తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులను పంపించి భయభ్రాంతులు చేశారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కరెంటు చార్జీలు తగ్గించడం వెనుక బయటపడ్డ బాబు మోసం
-
ఈ జగన్ మనల్ని వదలడు.. సైలెంట్ గా ఫ్లైటెక్కి ఉస్కో !
-
భోగాపురం అసలు కథ ఇది.. క్రెడిట్ దొంగ చంద్రబాబు
-
టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం
-
బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా
-
సంక్రాంతి పండుగ వేళ మందు బాబులకు చంద్రబాబు షాక్
-
అమరావతి రైతులతో బాబు గేమ్.. YS జగన్ ఆగ్రహం
-
ప్రజలకు సంజీవని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
బాబు అవినీతి, క్రెడిట్ చోరీపై దుమ్ముదులిపిన జగన్
-
మాది సంక్షేమ క్యాలెండర్..బాబుది అప్పుల క్యాలెండర్
సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి, దాన్ని క్రమం తప్పకుండా అమలు చేశాం. అదే ఇప్పుడున్న చంద్రబాబు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దునుమాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రెండేళ్లు కూడా తిరక్కముందే రూ.3.02 లక్షల కోట్లు.. అంటే తాము ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లోనే చేసేసిందంటూ కాగ్ నివేదికల్లో గణాంకాలను చూపుతూ కడిగిపారేశారు. ఇన్ని అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రజలకేమైనా మేలు చేశాడా? అంటే అదీ లేదన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేకుండా పోయాయని, వైఎస్సార్సీపీ హయాంలో అమలైన పథకాలన్నీ రద్దు చేసేశారని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ గాలికి పోయాయని ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులకు దిక్కులేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపుగా రూ.30 వేల కోట్లు బకాయి పడిందని చెప్పారు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇక సరెండర్ లీవుల గురించి చెప్పాల్సిన పనే లేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..ఆశ్చర్యం కలిగించేలా అప్పులు ళీ చంద్రబాబు పదే పదే తప్పులు చేస్తూ.. మరో వైపు దు్రష్పచారం చేస్తుంటారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మేర అప్పులు చేసేశారని ఎన్నికలకు ముందు దు్రష్పచారం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబును ఎవరైనా గిల్లినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసినా, ఉద్యోగులు సమ్మెల్లోకి వెళ్లినా మళ్లీ మనమే గుర్తుకొస్తాం. అసెంబ్లీలో ఒకటి చెబుతారు. ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి చూపుతారు. బహిరంగ సభల్లో ఇంకో మాట మాట్లాడతారు.⇒ 2014లో బాబు గద్దెనెక్కే నాటికి ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకున్న అప్పులు, హామీ లేని రుణాలు అన్నీ కలిపి రూ.1,40,717 కోట్లు ఉన్నాయి. ఈ అప్పులు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.3,90,247 కోట్లకు చేరాయి. ఈ లెక్కన ఆయన రూ.2,49,530 కోట్లు అప్పు చేశారు. అంటే.. చంద్రబాబు సర్కార్ హయాంలో రుణాల సగటు వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 22.63 శాతం నమోదైంది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,31,671 కోట్లు అప్పు చేశాం. ఈ లెక్కన గమనిస్తే అప్పుల్లో సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే ఉంది.ప్రజలపై విపరీతంగా బాదుడు ⇒ చంద్రబాబు ఓ వైపు అప్పులు చేస్తూనే, మరో వైపు ప్రజల మీద విపరీతంగా బాదేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లపాటు కరెంటు చార్జీలు పెంచనని చంద్రబాబు అన్నారు. కానీ, రెండేళ్లు కూడా గడవకుండానే ఏకంగా రూ.20,135 కోట్ల కరెంటు చార్జీలు బాదారు. ట్రూ అప్, ఇంకా రకరకాల చార్జీల పేరిట భారం మోపుతున్నారు. ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఫ్యూయల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్మెంట్ – ఎఫ్పీపీసీఏ) కింద 2024 నవంబర్ 29న రూ.9,412 కోట్లు, 2024 అక్టోబర్ 25న మరో రూ.6,072 కోట్లు, 2025 సెపె్టంబర్ 27న మరో రూ.1863 కోట్లు, ప్రొవిజనల్ ఎఫ్పీపీసీఏ చార్జెస్ కింద మరో రూ.2,787 కోట్లు వెరసి రూ.20,135 కోట్ల విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు. ⇒ రిజిస్ట్రేషన్ చార్జీలు 50% పెంచారు. దీంతో భూములు కొనాలంటేనే షాక్ కొట్టే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు తాగే తాగునీటిపైనా చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా కొత్తగా వాహనాల కొనుగోళ్లపై రోడ్ సెస్ వేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. వాళ్లు తగ్గించిన పన్ను మొత్తాన్ని రహదారి సుంకం రూపంలో వీళ్లు మళ్లీ వేస్తున్నారు. అన్ని రకాల రోడ్లకూ టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే, రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది.⇒ మేము చేసిన రూ.3.31 లక్షల కోట్ల అప్పుల్లో రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద ప్రజలకు అందించిన ఘనత మాది. డీబీటీ కింద ఎవరికి ఇచ్చామో పేరు, ఆధార్, బ్యాంక్ ఖాతాతో సహా పూర్తి వివరాలు అందిస్తాం. మేం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, కేవలం రెండేళ్లు కూడా తిరక్కుండానే బాబు రూ.రూ.3,02,303 కోట్లు అప్పు చేశారు. అంటే మేం ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం ఇప్పటికే చేసేశారు. మరోవైపు వచ్చే మూడు నెలల కాలంలో మరో రూ.11 వేల కోట్లు అప్పు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముందు ప్రతిపాదన పెట్టారు. అప్పులు తేవడంలో ఓ పద్ధతి పాడు లేకుండా పోయింది. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. ⇒రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ ఇలా ప్రతిదీ కుంభకోణం అయిపోయింది. రాష్ట్రంలో గ్రామ గ్రామాన మద్యం మాఫియా కనిపిస్తోంది. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రూపంలో కుంభకోణాలు చేస్తున్నారు. ప్రతి ఊళ్లో రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు దర్శనమిస్తున్నాయి. ఏ పనికి అయినా సరే కింది నుంచి పైదాక లంచం ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. - వైఎస్ జగన్ -
భూ దోపిడీ.. క్రెడిట్ చోరీ..
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భారీగా భూ దోపిడీకి పథకం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎయిర్పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిందేమీ లేకపోగా.. ఎవరో చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ, నిస్సంకోచంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 15 వేల ఎకరాల భూమి కావాలన్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 5 వేల ఎకరాలు అని చెప్పారన్నారు.దీంతో ప్రజలు ఆయన చిత్తశుద్ధిపై అనుమానంతో భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో ఏకంగా 130 కేసులు దాఖలు చేశారని చెప్పారు. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. నాడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎయిర్పోర్టుకు కనీస అనుమతులు తేవడంలో దారుణంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో విశ్వాసాన్ని నింపి, కోర్టు కేసులను పరిష్కరించి 2,700 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. భూ సేకరణకు రూ.960 కోట్లు ఖర్చు చేశాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. అంతర్జాతీయంగా చూసినా 2,500 ఎకరాల్లో బ్రహ్మాండమైన విమానాశ్రయం ఏర్పాటవుతుంది. మేం ప్రభుత్వంపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. సమయాన్ని వెచ్చించి.. శ్రమించి విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.కనీసం కనెక్టివిటీ రోడ్డూ పూర్తి చేయలేదు..భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు (ఆ వీడియోను ప్రదర్శించారు). కానీ, ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు కనీసం ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారు.రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నా చంద్రబాబు రోడ్డు పనులను చేయకుండా గాలికొదిలేశారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు. త్వరలో భోగాపురం నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సరైన రోడ్లు లేవు. చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి మాత్రం తామే విమానాశ్రయాన్ని నిర్మించినట్లు బిల్డప్ ఇస్తారు. వీళ్లు కనీసం ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా? భూ సేకరణ చేశారా? కనీసం ఇప్పుడు జరగాల్సిన పనులైనా చేయించారా? చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. తన కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండానే క్రెడిట్ కొట్టేస్తారు! ఎవరో పని చేస్తే.. ఆ క్రెడిట్ తీసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి సంకోచం లేకుండా చోరీ చేసేస్తారు.బాబు అనుమతులు కూడా తేలేకపోయారు..నాడు చంద్రబాబు హయాంలో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. అయినా కూడా.. భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు, ఎన్వోసీలు తేలేకపోయారు. ఆ ప్రాజెక్టు అనుమతులు అన్నీ మేమే తీసుకొచ్చాం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్లు (రక్షణ శాఖ విభాగాలు) ఎక్కువగా ఉన్నందున ఎయిర్పోర్టుకు ప్రత్యేక అనుమతులు అవసరం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. నేను స్వయంగా ప్రధానిని కలిసి లేఖలు ఇచ్చా. అనేక సార్లు విజ్ఞ్ఞప్తి చేశా.అందుకే.. మా హయాంలోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీసీఏఎస్ (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవివేషన్ సెక్యూరిటీ), రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ ఎన్వోసీ, అన్ని బ్యాంకుల ఫైనాన్షియల్ క్లోజర్ పర్మిషన్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అవసరమైన అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. కోవిడ్ లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ధృడ సంకల్పంతో ముందుకెళ్లాం. ఆ తర్వాత 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది.⇒ భోగాపురం ఎయిర్పోర్టుకు మా హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది. ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు.. కనీసం ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.⇒ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు. – వైఎస్ జగన్ -
ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనమే!
కడప రూరల్: ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే పతనం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ముందు సీఎం చంద్రబాబు ఒక డీఏ ఇచ్చి పండుగ చేసుకోమని చెప్పారని, ఆ ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు దాదాపు రూ.34 వేల కోట్ల బకాయిలు ఉంటే చంద్రబాబు రూ.210 కోట్లను రెండు విడతలుగా ఇస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారన్నారు. పోలీసులకు 6 సరెండర్ లీవులను పెండింగ్ పెట్టిన ఘనచరిత్ర చంద్రబాబు సర్కారుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 11వ తేదీ వరకు జీతాలు పడని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి ఏ వైరస్ సోకింది? గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదిలోనే అమలు చేసిందని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ఇపుడు రాష్ట్రానికి ఏ వైరస్ సోకిందని హామీలు నెరవేర్చడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారన్నారు. ఈ ప్రభుత్వానికి పీఆర్సీని నియమించే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఐఆర్, డీఏ ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ పథకం సక్రమంగా అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఉద్యోగులపై వేధింపులు సైతం ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు 158 యాప్లను ఒక్క యాప్గా చేయడం దారుణమన్నారు. సంక్రాంతిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాల ద్వారా సాధించుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య కో–చైర్మన్ లెక్కల జమాల్రెడ్డి, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, వల్లెం శివశేషాద్రిరెడ్డి, వల్లెం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
తొలి దశకే దిక్కు లేదు.. మళ్లీ రెండో దశా?
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూసమీకరణ కింద తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేయకుండా... రెండో దశలో 50 వేల ఎకరాలను ఎందుకు సమీకరిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం ఓ స్కామ్ అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. రాజధాని తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే రెండో దశ భూ సమీకరణ చేస్తుండడంపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. ‘‘చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు.అనంతరం తొలి దశలో 50 వేల ఎకరాలు సమీకరించారు. ఆ భూముల్లో రాజధాని నిర్మించాలంటే తాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు అవసరమని గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. రెండో విడతలో 50 వేల ఎకరాలు తీసుకుంటే, వాటిలో సదుపాయాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మరో రూ.లక్ష కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.అంటే, రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పటికీ తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఏ హామీలను అమలు చేయలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టాలి. కేవలం చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారు’’ అని మండిపడ్డారు. రాజధాని ఓ పెద్ద స్కామ్ రాజధాని నిర్మాణ పనుల్లో అంచనా వ్యయాలు భారీగా పెంచేసి, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని, రాజధాని ఓ పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని పునరుద్ఘాటించారు. విజయవాడ–గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో రాజధాని నిర్మించి ఉంటే ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెందేదని వివరించారు. మీ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీకంటే చంద్రబాబు ఎక్కువ అప్పులు చేస్తోంది. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమౌతుంది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మీరే చెప్పండని వైఎస్ జగన్ అన్నారు. దక్షిణ సుడాన్, సోమాలియానో అవుతుందని అన్నారు.ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లు రాకపోవడం సంతోషకరం. ప్రైవేటీకరణపై న్యాయ పోరాటం చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7న) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాం. దాన్ని కోర్టు ఆమోదించింది. ప్రభుత్వానికి నోటీసులిచ్చింది’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘కట్టినవి, దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నవి, సగం పూర్తయినవి... ఉచితంగా ఇవ్వడమే కాక, రెండేళ్ల పాటు నడిపేందుకు సంబంధించిన జీతాలు సంవత్సరానికి రూ.60 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి చంద్రబాబు ఇస్తాడంట.ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ సిబ్బంది.. జీతాలు ఇచ్చేది ప్రభుత్వం.. కానీ, లాభాలేమో ప్రైవేటు వ్యక్తలకంట. ఇది స్కామ్ కాకపోతే ఏంటి? ఇలాంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములవుతారా?’’ అని ప్రశ్నించారు. ‘‘తొలుత కిమ్స్ వాళ్లు టెండర్ వేశారని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. కిమ్స్ వాళ్లు అదేమీ లేదు. ఆ స్కాముల్లో మాకు సంబంధం లేదని వెనక్కి తప్పుకొన్నారు. వీళ్లకు ఏం చేయాలనో దిక్కు తెలీలేదు. ఎల్లయ్యతోనో, పుల్లయ్యతోనో, వంట మనుషులతోనో టెండర్లు వేయిస్తున్నారు.వాళ్లకైనా సరే నేను ఇస్తానంటున్నాడు చంద్రబాబు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘‘ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది... అక్కడ 13 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మొన్ననే ప్రారంభించారు. కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే దరఖాస్తులు పెట్టుకుంటే ఇస్తారు. అదొక పద్ధతి. భూములు కొనుక్కో, భవనాలు కట్టుకో, అన్ని రకాలుగా చేసుకో, ప్రభుత్వం నీకు సహకరిస్తుంది. ఇదొక పద్ధతి. కానీ, ఈ మాదిరిగా స్కాములు చేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం కట్టిన భవనాలను ప్రైవేటువాళ్లకు ఊరికే ఇచ్చేయడం, సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం వంటివి ఎవడూ చేయడు. ఏ ప్రభుత్వమూ చేయదు’ అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
మా హయాంలోనే పారిశ్రామిక వృద్ధి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అదానీ డేటా సెంటర్.. గూగుల్.. భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో చంద్రబాబు క్రెడిట్ చోరీ తెలిసిందే. ఆయన ఇంకో అడుగు కూడా ముందుకేసి.. మా హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారంటూ నిరంతరం బురదజల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..! దీనికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, డజన్ల కొద్దీ అబద్ధాల ఫ్యాక్టరీలైన వాళ్ల సోషల్ మీడియా వంత పాడుతోంది..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.నిజాలు గడప దాటేలోపే.. చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న ఆ తప్పుడు ప్రచారాలను బద్ధలుకొడుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 డిసెంబర్ 11న ఒక నివేదిక విడుదల చేసిందని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే.. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచిందని, దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్గా ఉందని గుర్తు చేశారు.‘మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12 శాతం ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87 శాతం మాత్రమే. అంతేకాదు.. మా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానంలో, దక్షిణాదిలో మళ్లీ మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96 శాతం అయితే ఏపీలో 11.14 శాతం ఉంది. అయినాసరే చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు బెదిరి పారిపోతున్నారు..’ అని పేర్కొన్నారు. కప్పం కడితేనే పరిశ్రమల మనుగడ.. సజ్జన్ జిందాల్, అరబిందో, మైహోమ్స్ సిమెంట్స్, శ్రీసిమెంట్స్, రామ్కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, షిర్డీసాయి.. వీళ్లందరూ చంద్రబాబు ఏలుబడిలో పరిశ్రమలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా.. కప్పం కట్టకపోతే పరిశ్రమలను నడిపే పరిస్థితి ఉందా? చంద్రబాబు ఈమధ్య మరో డ్రామా మొదలు పెట్టారు. కొత్త ఏడాది వేడుకలకు ఆయన, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో ప్రజలకు ఎలాగూ తెలియదు. పైపెచ్చు వీళ్ల పర్యటనను దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఎల్లో మీడియా కొత్త కొత్త సెన్సేషనల్ అబద్ధాలను క్రియేట్ చేస్తోంది. పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ తీసుకొస్తోంది. అదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే. రియాలిటీ కాదు. ఎంఎస్ఎంఈల్లో 32.79 లక్షల ఉద్యోగాలు కల్పించాం వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే దాని ద్వారా 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఇది మేం చెబుతున్నది కాదు.. ఆ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్లోనే ఉంది. చంద్రబాబు ఇచి్చన ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు కేవలం దాదాపు 9.50 లక్షలు మాత్రమే. మరి ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? ఎవరి హయాంలో పారిశ్రామిక వేత్తలకు ఊరట, భరోసా లభించింది? కమీషన్లు ఇస్తేనే ప్రోత్సాహకాలు! పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ విభాగంలోనే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా పెండింగ్ పెట్టారు. ఆ ప్రోత్సాహకాలు ఇచ్చే నాథుడు లేడు. పట్టించుకునే నాథుడు కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇవ్వాలంటే.. రెండు బకెట్లు పెట్టారట! ఒక బకెట్లో.. 30 శాతం ఎవరు కమీషన్ ఇస్తే వారి పేరు పెడతారట! రెండో బకెట్లో న్యూట్రల్గా (తటస్థం) కనిపించడానికి కేవలం 20 శాతం మాత్రం పెడతారట! కొంతమందిని ఎంపిక చేసి 20 శాతం సొమ్ము ఇస్తారట! ఇలా ప్రోత్సాహకాల్లోనూ దోపిడీ చేస్తుంటే ఇంకేం పరిశ్రమలు వస్తాయి? చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు! సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు.. తదితర రియల్ ఎస్టేట్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి వేలం లేకుండానే భూములు ఇచ్చేస్తోంది. పొరుగున తెలంగాణలో చూస్తే ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరా భూమి రూ.170 కోట్లు పలికింది. గుజరాత్లోనూ ఇలానే ప్రభుత్వం వేలంలో భూమిని కేటాయిస్తూ ఖజానాకు నిధులు సమకూర్చుకుంటోంది. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు దోచిపెడుతున్నారు. ఎకరా రూ.50 కోట్లు విలువైన భూములను కేవలం రూ.1.50 కోట్లకే ఇచ్చేశారు.సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్కు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్కు 10 ఎకరాలు.. రహేజాకు అయితే మరీ 99 పైసలకే కట్టబెట్టేశారు. ఒకవైపు ఎలాంటి వేలం లేకుండానే భూములు కారుచౌకగా ఇవ్వడమే కాకుండా.. మరోవైపు ల్యాండ్ యూజ్ (భూమి వినియోగం) 40–50 శాతం మిక్స్డ్ యూజ్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చారు. మరోవైపున వీళ్లు బిల్డింగులు కడితే.. ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు తిరిగి ప్రభుత్వమే వెనక్కి డబ్బులిచ్చేలా భారీ స్కామ్కు తెరదీశారు. ఇది నిజంగా బొనాంజా కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి ఎవరైనా ఈ మాదిరిగా ఇస్తారా? విశాఖలో లూలుకు రూ.2 వేల కోట్ల భూమి విశాఖపట్నంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 14 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లూలు గ్రూప్నకు లీజుకిచ్చారు. ఎలాంటి టెండరూ లేదు.. ఎలాంటి వేలం లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్లు మాల్ కట్టుకోవడానికి ఇచ్చేశారు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో 16 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడుతోంది. ఆంధ్రాలో మాత్రం ఉచితంగా, వేలం లేకుండా చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. అహ్మదాబాద్లో లూలుకు కేటాయించిన భూమి వేలంలో రూ.519 కోట్లు ధర పలకడంతో పాటు రికార్డు స్థాయిలో రూ.31 కోట్లు స్టాంపు డ్యూటీ కింద వచ్చిందంటూ ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటోంది. (ఆంగ్ల పత్రిక కథనాన్ని చూపించారు)⇒ చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు...⇒ వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఈ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్లోనే ఉంది.⇒ ఇటీవల ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్గా ఉంది. మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12% ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87% మాత్రమే. మా ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96% అయితే ఏపీలో 11.14% ఉంది. అయినా చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. – వైఎస్ జగన్ -
మందుబాబులకు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో బార్లు, మద్యం దుకాణదారులకు భారీగా లబ్ధి చేకూరుస్తూ, రాష్ట్ర ఖజానాకు పెద్ద గండికొట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం... మద్యం సీసాపై (బీరు, వైన్ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దుకాణదారుల మార్జిన్ కమీషన్ను 14 శాతం నుంచి 15 శాతం చేసింది. బార్లపై ప్రస్తుతం ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును తొలగించింది.ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. బార్ల వ్యాపారానికి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో వారికి ప్రోత్సాహంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను రద్దు చేశామని చెప్పారు. దీంతో బార్ల యజమానులకు రూ.340 కోట్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. మద్యం బాటిల్పై ఎంఆర్పీ రూ.10 చొప్పున, దుకాణదారులకు విక్రయాల మార్జిన్ మనీ కమీషన్ ఒక శాతం పెంచ డం వల్ల రూ.195 కోట్లు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఇక 14 శాతం నుంచి మార్జిన్ కమీషన్ను 15 శాతం చేయడం ద్వారా రూ.337 కోట్లు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి చెప్పారు. అంటే, సీసాపై రూ.10 పెంపుతో వచ్చే రూ.1,391 కోట్ల ఆదాయంలో ఈ మూడు మినహాయించగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి రూ.519 కోట్లకు పరిమితం కానుంది. మరికొన్ని నిర్ణయాలు...⇒ రూ.10 లక్షల వరకు నామినేషన్పై సాగునీటి పనులు ⇒ సాగునీటి రంగంలో నామినేషన్పై ఇచ్చే పనుల పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు ⇒ ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదించిన ట్రూ అప్ చార్జీలు డిస్కమ్లకు 6 వాయిదాల్లో తిరిగి చెల్లింపు. ⇒ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి చుట్టూ 5 కి.మీ.లలో నిర్దేశిత పర్యాటక కేంద్రాలలో స్థానంతో సంబంధం లేకుండా 3 స్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్లలో, ప్రస్తుత పరిమితులకు అదనంగా మైక్రో బ్రూవరీలకు అనుమతి. ⇒ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి రూ.5 వేల కోట్ల జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ అప్పునకు ప్రభుత్వ గ్యారెంటీ. గతంలో జల్ జీవన్ మిషన్కు అప్పు పరిధి రూ.10 వేల కోట్లు కాగా, దానిని రూ.12 వేల కోట్లకు పెంచుతూ ఆమోదం. ⇒ ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రూ.250 కోట్ల మూలధన వ్యయంతో సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు. ⇒ నామినేషన్ ఆధారంగా నాన్ క్యాప్టివ్ వాణిజ్య కార్యకలాపాల కోసం మంజూరు చేసిన లీజుల విషయంలో, సంస్థ అంచనా వనరుల విలువలో ఐదు శాతం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిన వాయిదాలలో కచ్చితంగా చెల్లించాలి. అదనంగా, లీజు మంజూరు చేసే ముందు సంస్థ మూడేళ్ల సీనరేజీ రుసుమును తొలుతే చెల్లించాలి. దీనికోసం మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్–1966ను సవరించడానికి ఆమోదం. ⇒ ఏపీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భవిష్యత్ డిమాండ్ను తీర్చడానికి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయడానికి ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.1,500 కోట్ల రుణ మంజూరు. ⇒ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు విజయవాడ ఎస్బీఐ నుంచి రూ.2 వేల కోట్ల టర్మ్ రుణానికి ఆమోదం. -
మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బార్లు, మద్యం షాపులను ఇప్పటికే తమ తాబేదర్లకు ఇష్టారాజ్యంగా కేటాయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దానికి కొనసాగింపుగా మరో అంకానికి తెరలేపింది. వారికి మరింత లబ్ధిచేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. 2014–19 మధ్య మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును యథేచ్ఛగా రద్దుచేసి ఖజానాకు గండికొట్టినట్లుగానే ఇప్పుడు బార్లపై ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్ఈటీ)ని చంద్రబాబు సర్కారు తాజాగా తొలగిస్తూ వారికి బంపర్ ఆఫర్ ఇస్తూ నాటి మద్యం కుంభకోణానికి అవలంబించిన విధానాన్నే తిరిగి లిఖిస్తోంది.అలాగే, టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ముకాయడమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాక్ ఇస్తూ వాటి ధరలను బాటిల్పై రూ.10 చొప్పున పెంచింది. ఇలా.. మద్యం సిండికేట్కి ఏటా రూ.500 కోట్ల వరకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగిస్తూ.. మరోవైపు ధరల దరువుతో మద్యం ప్రియులపై ఏటా రూ.3 వేల కోట్ల మోత మోగిస్తోంది. మంత్రి మండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వ తాజా మద్యం కుంభకోణం కథాకమామిషు ఇది.రూ.2 వేల కోట్ల సిండికేట్ దోపిడీకి పచ్చజెండా..ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ఎల్లో సిండికేట్ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కారు మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతమున్న 15 శాతం ఏఆర్ఈటీని రద్దుచేసింది. దీంతో.. ప్రభుత్వ ఖజానా ఆదాయానికి ఏటా రూ.340 కోట్లు గండిపడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ, వాస్తవానికి రూ.500 కోట్ల వరకు గండిపడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు మేర ప్రభుత్వం నష్టపోనుంది. అంటే.. టీడీపీ సిండికేట్ గల్లా పెట్టే మరో రూ.2 వేల కోట్లతో కళకళలాడనుంది. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దు దందా..2014–19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దుచేసి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ముకాసింది. ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే 2015లో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దుచేస్తూ 216, 217 పేరుతో రెండు చీకటి జీఓలు జారీచేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. తద్వారా టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టారు.ఆ తర్వాత ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు పలువురిపై ఐపీసీ, సెక్షన్లు–166, 167, 409, 120 (బి) రెడ్విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు–13(1), (డి), రెడ్విత్ 13 (2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై దాదాపు మూడేళ్లు బయట ఉన్నారు. ఆ కేసును ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేయడం గమనార్హం. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ కేసును అటకెక్కించింది. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని వేధించి బెంబేలెత్తించింది. ఆయనపై కేసులు నమోదుచేసి లొంగదీసుకుంది.మరోవైపు.. ఈ కేసులో ఆధారాల్లేవని సీఐడీ న్యాయస్థానానికి నివేదించింది. ప్రభుత్వ వేధింపులతో వాసుదేవరెడ్డి అందుకు వంతపాడారు. దాంతో ఆ కేసును మూసివేశారు. ప్రసుతం అదే రీతిలో ఏఆర్ఈటీని రద్దుచేసి మరోసారి మద్యం సిండికేట్ దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రెడ్కార్పెట్ వేసింది.మద్యం ప్రియులకు ధరల షాక్..ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రూ.99 మద్యం తప్ప మిగిలిన అన్ని రకాల మద్యంపై ధరల మోత మోగించింది. సీసాపై రూ.10 చొప్పున పెంచింది. తద్వారా మద్యం ప్రియులపై ఏడాదికి రూ.1,391 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ, ఈ బాదుడు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.రాష్ట్రంలో నెలకు సగటున రూ.3 వేల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. వాటిలో బీరు విక్రయాలు రూ.వెయ్యి కోట్లు కాగా.. మద్యం విక్రయాలు రూ.2 వేల కోట్లు. మద్యం విక్రయాల్లో రూ.99 మద్యం సీసాల వాటా 30 శాతం ఉంది. మిగిలిన 70 శాతం విక్రయాలు అంటే రూ.1,200 కోట్ల మేర మద్యం విక్రయాలపై ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. ఆ ప్రకారం నెలకు రూ.250 కోట్ల వరకు మద్యం ప్రియులకు షాక్ తగలనుంది. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్ల భారం పడనుందన్నది సుస్పష్టం. -
రాయలసీమ ఆశాదీపం
రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆశాదీపం అయ్యింది. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరిపి ఈ పథకాన్ని నిలిపివేయించానని ప్రకటించడం, సీమ ప్రాజెక్టులను అక్రమమైనవిగా అభివర్ణించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాయలసీమ నీటి హక్కుల వెనుక ఉన్న భౌగోళిక, సాంకేతిక వాస్తవాలను నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.కేటాయింపులుండీ వాడుకోలేక...రాయలసీమ దాహార్తిని తీర్చే క్రమంలో గాలేరు–నగరి, హంద్రీ –నీవా, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎస్సార్బీసీ, గుండ్రేవుల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దాదాపు 144.7 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చట్టబద్ధంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. ప్రస్తుతం సీమలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యం 100 టీఎంసీల కంటే తక్కువగానే ఉంది. సరైన కాల్వల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏటా కేవలం 50 నుంచి 60 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. అంటే, తమకు దక్కాల్సిన వాటాలో సగం కూడా వాడుకోలేక పోతున్న ఈ ప్రాంతంపై ‘జల దోపిడీ’ చేస్తున్నారనే నిందలు వేయడం అత్యంత విచారకరం.రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాధారమైన పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి వంటి మలుపులకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రధాన వనరు. గతంలో శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలుగా ఉండేది. కానీ తీవ్రమైన పూడిక పేరుకుపోవడం వల్ల అది ప్రస్తుతం 200 టీఎంసీల లోపుకు పడిపోయింది. దీనికి అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖాళీ చేయడం వల్ల జలాశయం మట్టం వేగంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలల తరబడి వచ్చే కృష్ణా, తుంగభద్రల ప్రవాహాలు ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే పరిమితమవు తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం ఉండాలి. పూడిక, విద్యుత్ అవసరాల కారణంగా ఈ మట్టం నిర్వహించడం అసాధ్యంగా మారుతోంది, ఫలితంగా వరద జలాల మీద ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ– నీవా వంటి ప్రాజెక్టులకు గండం ఏర్పడుతోంది.పథకం ఆవశ్యకతవరద సమయంలో కృష్ణా నది నుంచి సుమారు 700–800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి ఉన్న పరిమితులను అధిగమించేందుకు, కేవలం వారం పది రోజులు మాత్రమే లభించే వరద సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం సాధ్యమవుతుంది.ముచ్చుమర్రి వంటి ఎత్తిపోతల కేంద్రాలకు అనేక సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ముచ్చుమర్రి నుంచి నాలుగు రోజులు నిరంతరాయంగా నీటిని తోడితే కానీ ఒక టీఎంసీ నీరు రాదు. 40 టీఎంసీల లక్ష్యంతో నిర్మించిన హంద్రీ–నీవాకు ఇది ఏమాత్రం సరిపోదు. అలాగే మల్యాల నుంచి నీటిని తీసుకోవాలంటే కనీసం 842 అడుగుల మట్టం అవసరం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని రూపొందించారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుంచి నీటిని లిఫ్ట్ చేసే పథకాలను నిర్మించుకుంది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తన చట్టబద్ధమైన వాటాను వినియోగించు కోవడానికి 800 అడుగుల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసు కోవడం ఏమాత్రం అక్రమం కాదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది ఏపీ ప్రాథమిక హక్కు కూడా!శాశ్వత పరిష్కారంరాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే అది గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు వెన్నెముకగా మారుతుంది. పోతి రెడ్డిపాడు ద్వారా ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి రిజర్వాయర్ల ముంపు సమస్యలను పరిష్కరించి, అక్కడ 35 టీఎంసీల నీటిని నిల్వ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవాతో అనుసంధానం చేస్తే, చిత్తూరు జిల్లాలోని మదన పల్లి డివిజన్ నుంచి కుప్పం వరకు గాలేరు–నగరి నీటిని సరఫరా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది. ఇది రాయలసీమ కరవు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా మారుతుంది.ఈ పథకానికి అనుమతులు సాధించడం అసాధ్యమైన పని కాదు. సీడబ్ల్యూసీ నియమించిన కమిటీలు ఒక కీలకమైన సిఫార్సు చేశాయి: డ్యామ్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు. శ్రీశైలం సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు తగ్గిపోయిన వాస్తవాన్ని ప్రభుత్వం సమర్థంగా వాదించాలి. శ్రీశైలం భద్రతను, తగ్గిపోయిన నిల్వ సామర్థ్యాన్ని సాధికారిక సంస్థల ముందు నిరూపించగలిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సులభమవుతుంది.తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజ నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే నెపంతో ప్రాజెక్టు అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ వాదనకు ఆయుధంగా మారుతుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకానికి మిగిలి ఉన్న అనుమతులను తీసుకురావడానికి, పెండింగ్లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.శ్రీశైలం ఎగువ భాగం నుంచి నీటిని తీసుకోవడం సీమ ప్రజల ప్రాథమిక హక్కు అని జాతీయ వేదికలపై గట్టిగా వినిపించాలి. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ కేవలం ఒక ఇంజినీరింగ్ నిర్మాణం కాదు, అది సీమ రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. ఈ పథకం కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
రాజధాని చంద్రబాబు జాగీరు కాదు: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు జాగీరు కాదని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాయలసీమకు అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే కదా అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి.. మీకు అనుకూలంగా ఉండే చోట కాదంటూ హితవు పలికారు.మాజీ మంత్రి సాకే శైలజానాధ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని చంద్రబాబు జాగీరు కాదు. దాని గురించి మాట్లాడితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. ఏమీ చేయలేని వారే కోపపడుతుంటారు. రాయలసీమను అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాజధానిలో మా రాయలసీమ చెమట, రక్తం కూడా ఉంటుంది. అలాంటి రాజధానిని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సహించం. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే. దాదాపు వెయ్యి కోట్లు నీటిని ఎత్తిపోసేందుకే ఖర్చు చేశారు. అమరావతిలో బిల్డింగుల నిర్మాణానికి చాలా ఖర్చు ఎక్కువ అవుతోంది.చంద్రబాబు పుణ్యమా అని రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయాడు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి. మీకు అనుకూలంగా ఉండే చోట కాదు. ఎకరా అభివృద్దికి రెండు కోట్లు చొప్పున మౌళిక సదుపాయాల ఖర్చు చేస్తారా?. మీరు తెచ్చే అప్పులకు ప్రతి ఏటా పదహారు వేల కోట్లు వడ్డీలే కట్టాలి. ఇదంతా రాష్ట్రమంతా భరించాలి. ఇది ఎవరి సొమ్ము?. నారాయణ కాలేజీల నుంచి డబ్బు తెస్తున్నారా?. రాజధాని గురించి ఎవరూ అడగటానికి వీల్లేదా?. రెండు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లు కట్టాల్సి ఖర్మ ఏంటి?. ప్రజల కోసం జగన్ మాట్లాడితే మీకు ఎందుకు కోపం వస్తోంది?. రాయలసీమకు నష్టం చేయవద్దని చెబితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. చంద్రబాబు కట్టేది నీళ్లలో తేలియాడే నగరమా?. సమాధానం చెప్పలేకనే చంద్రబాబుకు కోపం వస్తోంది.అమరావతిలో వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం చేస్తారా? అది సాధ్యమయ్యే పనేనా?. ఆల్రెడీ ఉన్న గన్నవరం ఎయిర్పోర్టును ఏం చేస్తారు?. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్టు దాన్ని కూడా నిలిపేస్తారా?. మునిగిపోయే ప్రాంతంలో ఎవరూ ఇల్లు కూడా కట్టుకోరు. మరి రాజధానిని ఎలా కడతారు?. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. మరి ఇప్పటి వరకు ఏ సెల్ఫ్ ఫైనాన్స్తో కడుతున్నారు?. అమరావతిలో కడుతోంది రాజధాని కాదు, లిఫ్టు ఇరిగేషన్లే. వడ్డమానులో భూ సమీకరణకు వెళ్తే రైతులు ఛీ కొట్టారు. భూములు ఇవ్వకపోతే లాగేసుకుంటామని బెదిరిస్తారా?. అందుకే రామారావు లాంటి రైతులు చనిపోతున్నారు. రాజధాని అందరిదీ, అదేమీ చంద్రబాబు జాగీరు కాదు. రాజధాని విషయంలో దేవతా వస్త్రాలు కట్టుకున్నట్లు వ్యవహరించవద్దు. అప్పులు తెస్తూ రుణ సమీకరణ అంటూ కొత్త పదాలు చెబుతున్నారు. ప్రజలు లేని రాజధానిని కడుతున్నారు. మీ రాజధాని కోసం మా చెమట, రక్తాన్ని ధారపోయవద్దు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవటానికి అదేమీ మీ ఇంటి విషయం కాదు. రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతుల తరపున పోరాడుతాం. రానున్న రోజుల్లో రాజధాని గురించి అందరూ మాట్లాడతారు’ అని వ్యాఖ్యానించారు. -
ఏపీలో మద్యం ప్రియులకు షాక్
సాక్షి, విజయవాడ: మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ నుంచి మద్యం ధరలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బాటిల్ పై ఏకంగా రూ. 10 ధర బాదుడుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో మధ్యం ధరలు తగ్గిస్తానని మద్యం ప్రియులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా బాదుడుకు సిద్ధమయ్యారు. గతంలోనూ బాటిల్పై రూ.10 పెంచి.. ఇప్పుడు మరోసారి అదీ పండుగపూటనే పెంచాలని నిర్ణయించారు. దీంతో ఏడాదికి రూ.1,391 కోట్లు మందు బాబులపై భారం పడనుంది. ఈ నిర్ణయం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(IMFL), ఫారిన్ లిక్కర్ (FL)కు వర్తింపజేయాలని భావిస్తోంది. దీంతో.. 70 శాతం మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి. లిక్కర్ సిండికేట్కి దాసోహం.. లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కు అయిన చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సిండికేట్కు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేయాలని నిర్ణయించారు. దీంతో.. ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్కి లబ్ధి చేకూరనుంది. గత చంద్రబాబు పాలనలోనూ.. ప్రివిలైజ్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ దఫా కూటమి ప్రభుత్వంలో ఏఆర్ఈటీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రులపై మళ్లీ సీరియస్మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్ అయ్యారు. మంత్రులెవ్వరూ ఏ పని చేయడం లేదని.. తమ పని తీరు మార్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేనే నెలకు రెండు, మూడుసార్లు పార్టీ ఆఫీస్కు రావాల్సి వస్తోంది. వినతులు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడ్డవారి వివరాలు ఇవ్వడం లేదు. పార్లమెంట్ కమిటీలు కూడా నేనే పూర్తి చేశానంటే జిల్లా మంత్రుల పనితీరు ఏంటో అర్థమవుతోంది’’ అంటూ ఎప్పటిలాగే అసంతృప్తిని మంత్రులపై నెట్టేశారాయన. -
Special Report: 20 TMC నీటితో ఏం చేయొచ్చో తెలుసా..?
-
బాబును నిలదీసిన అమరావతి రైతులు
-
చంద్రబాబు, లోకేష్ లండన్ టూర్ వైఎస్ జగన్ సెటైర్లు
-
రాజధానిలో రెండో దశ భూ సమీకరణ.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్..‘రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు?. ఈ లక్ష ఎకరాల్లో మౌళిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారు?. తాను, తన బినామీలు దోచుకోవటానికే చంద్రబాబు భూములు సేకరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: క్రిడెట్ చోరికి బాబు పడరాని పాట్లు: వైఎస్ జగన్ -
చంద్రబాబుది విలన్ క్యారెక్టర్.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
KSR Comment: లోకేష్ భవిష్యత్తు కోసం ఏపీ తాకట్టు!
-
బాబుకు భయపడి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు ఇదిగో కేంద్రం ఇచ్చిన రిపోర్ట్
-
YS Jagan: భోగాపురం కోసం క్రెడిట్ చోర్....ఎంత కష్టం వచ్చింది బాబు
-
YS Jagan : రాయలసీమ ఇరిగేషన్ అవసరం లేదంటూ..
-
తప్పేముంది సామీ.. మంచిదే కదా.. రిపోర్టర్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్
-
బాబు, రేవంత్ చీకటి ఒప్పందం నిజాలు బయటపెట్టిన జగన్
-
రిపోర్టర్ ప్రశ్నకు వైఎస్ జగన్ ఫన్నీ రిప్లై
-
నేను ఆరోజే చెప్పా, 2026లో తొలి ఫ్లైట్ ఎగురుతుందని
-
‘బాబు హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నాయి’
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశశ్రామిక వేత్తలు పారిపోతున్నారని ప్రచారం చేశారు. మా హయాంలో కాదు.. చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇదే విషయాన్ని ఆర్బీఐ కుండబద్దలు కొడుతూ డిసెంబర్ 11,2025న ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది.ఈ సందర్భంగా.. తమ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లాయని చంద్రబాబు అండ్ కో చేసిన విష ప్రచారాన్ని ఖండించారు.ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్టులో.. మా హయాంలో మానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో తయారీ రంగంలో భారత్లోనే రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం.ఇది వాస్తవం. కానీ చంద్రబాబు ఏమంటారు. ప్రతిరోజు తనకున్న పైశాచికానందంతో మాపై టన్నుల కొద్ది బురద జల్లుతుంటారు.వాస్తవం ఏంటంటే?చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారన్నది వాస్తవం.పేర్లు చెబుతా రాసుకోండి. సచిన్ జిందాల్,మైహోం సిమెంట్స్,శ్రీ సిమెంట్స్,రామ్కో సిమెంట్స్,దాల్మియా సిమెంట్స్,భారతి సిమెంట్స్తో పాటు ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా,ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరు’ అని తెలిపారు. ప్రెస్ మీట్లో ప్రదర్శించిన ప్రెజెంటేషన్ డాక్యుమెంట్స్ కోసం 👉.. జగన్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి -
బాబు రెండు బకెట్ల స్కీమ్ అంటా.. జగన్ సెటైర్లే సెటైర్లు
-
భోగాపురంలో వీళ్ళ ఎలివేషన్స్ చూడాలయ్య.. ఏకిపారేసిన వైఎస్ జగన్
-
కుప్పానికి నీళ్లు ఇచ్చింది మనం.. వాళ్లని కూడా బాబు మోసం చేశాడు
-
చిత్తూరులోనే పుట్టి పెరిగావు.. కొంచమైనా సిగ్గు లేదయ్యా చంద్రబాబు
-
ఆ 20 టీఎంసీల నీళ్లుంటే...
‘‘ఆ... ఏమవుతుంది? 20 టీఎంసీలే కదా? దానికే అంత పెద్ద రాద్ధాంతం చేస్తారా’’, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలివి. పద్నాలుగేళ్లకుపైగా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడంపై రాజకీయ నేతలే కాదు.. వ్యవసాయ, ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనిషి జీవితానికి అత్యంత ప్రాథమికమైన అవసరం నీరు అన్నది ఆయనకు తెలియదని కాదు కానీ.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించి రాయలసీమ ద్రోహి అనిపించుకోవాల్సి వస్తుందన్న భయంతో సమస్యను చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేసినట్టుగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఇరవై టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు సాక్షి.కాం ఒక ప్రయత్నం చేసింది. వివక్ష, పక్షపాతాలకు తావులేకుండా ఉండేందుకు ఇదే ప్రశ్నను కృత్రిమ మేధకు వేసింది. కృత్రిమ మేధ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది...అంతకంటే ముందు అసలు 20 టీఎంసీల నీళ్ల లెక్క ఒక్కసారి చూద్దాం. ఇంగ్లీషులో వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులను క్లుప్తంగా టీఎంసీ అంటున్నాము. లెక్క ఏమిటంటే.. వందకోట్ల ఘనపుటడుగుల నీళ్లు. ఒక్కో ఘనపుటడుగులో 28.3 లీటర్లు. అంటే ఒక టీఎంసీ = 2831.68 కోట్ల లీటర్లు. ఇరవై టీఎంసీలంటే.. కొంచెం అటు ఇటుగా 56600 కోట్ల లీటర్లన్నమాట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఇంత మొత్తంలో నీళ్లు వాడుకోగలిగితే ఏమవుతుందంటే...వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తే...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అందుకునే 20 టీఎంసీల నీటిలో అరవై శాతం అంటే 12 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుంటే ఎంత భూమి సాగు చేయవచ్చో తెలుసా? సుమారు 1.5 లక్షల ఎకరాలు! రాయలసీమ తరువాత అత్యంత కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లాకు ఈ నీరు చేర్చామనుకుందాం. ఎకరాకు సీజన్కు 12 లక్షల లీటర్లు అందించడం ద్వారా సుమారు లక్ష ఎకరాల్లో వరి, మిగిలిన నీటితో పత్తి, పప్పు ధాన్యాలు పండించవచ్చు. ఎన్ని రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుంచి, పేదరికం నుంచి బయటపడతాయో మనమే ఊహించుకోవచ్చు. పన్నెండు టీఎంసీల నీరు వ్యవసాయనికి కేటాయించగా మిగిలిన ఎనిమిది టీఎంసీలను తాగునీటికి, పరిశ్రమల అవసరాలకు వాడుకోవచ్చు. చెరిసగం చేద్దాం...మొత్తం 20 టీఎంసీల నీటలో వ్యవసాయానికి, పరిశ్రమలకు చెరి సగం నీళ్లు కేటాయించారనుకుందాం. పది టీఎంసీలతో సుమారు రెండు కోట్ల మందికి ఏడాది పొడవునా మంచినీరు ఇవ్వవచ్చు. విజయవాడ లాంటి నగరం ప్రస్తుతం రోజుకు 50 కోట్ల లీటర్లు ఖర్చవుతున్నట్లు అంచనా. 10 టీఎంసీలు విజయవాడకు మాత్రమే కేటాయిస్తే మూడేళ్లపాటు నీటి కొరత అస్సలు ఉండదు. ఇలా కాకుండా... కడప, అనంతపురం లాంటి రాయలసీమ పట్టణాలకు కేటాయిస్తే.. తాగునీటి అవసరాలు తీరడమే కాదు.. భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరుగుతుంది. తాగునీటికి పది టీఎంసీలు పోగా మిగిలిన నీటిలో ఆరు టీఎంసీలు సాగుకు, నాలుగు టీఎంసీలు తాగునీటికి ఇస్తే.. రాయలసీమ జిల్లాల్లో కనీసం యాభై వేల ఎకరాల్లో పచ్చని పంటలు పండుతాయి. అందరికీ సమపాళ్లలో ఇస్తే...సాగు, తాగు నీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు కూడా సమప్రాధాన్యం ఇచ్చి చూస్తే... ఎనిమిది టీఎంసీల సాగునీటితో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు లక్ష ఎకరాల్లో పండించవచ్చు. అదే సమయంలో కోటీ ఇరవై లక్షల మంది దాహార్తిని ఏడు టీఎంసీల నీటితో పూర్తి చేయవచ్చు. అలాగే 5 టీఎంసీలతో పారిశ్రామిక వృద్ధికి కారణం కావచ్చు. విశాఖపట్నం ఫార్మా, స్టీల్ పరిశ్రమలు ప్రస్తుతం రోజుకు పది కోట్ల లీటర్ల నీరు వాడుతున్నట్లు అంచనాలున్నాయి. ఐదు టీఎంసీల నీటితో ఏడాది పాటు ఈ అవసరాలు తీరతాయి. రిజర్వాయర్ల రీఛార్జ్ కోసం...???రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఏటా ఇరవై టీఎంసీల చొప్పున అందే నీటిని నేరుగా వెలిగొండ, పెన్నా బేసిన్ లోని రిజర్యావర్లలో నింపామని అనుకుందాం. సుమారు 43 టీఎంసీల సామర్థ్యమున్న వెలిగొండ ప్రాజెక్టు సగం వరకూ నిండుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 600 గ్రామాలకు తాగునీటి నిరంతర సరఫరా సాధ్యమవుతుంది. బంగాళాఖాతంలోకి వృథాగా కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. నిత్యం కరవు కాటకాలతో సమస్యలు ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయి -
సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వ్యాఖ్యలు.. సాకే శైలజనాథ్ అదిరిపోయే కౌంటర్
-
భోగాపురం ఎయిర్పోర్ట్కు అన్ని అనుమతులు తెచ్చింది మేమే: వైఎస్ జగన్
తాడేపల్లి: భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి క్రెడిట్ చోరీకి చంద్రబాబు పడరాని పాట్లు పడతున్నారని వైఎస్సారసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు తొలుత 15 వేల ఎకరాలు.. ఆ తర్వాత 5 వేల ఎకరాలు బాబు కావాలన్నారని, ఆ ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు కూడా ఉంటే వాటి అన్నింటినీ అధిగమించి దానికి తాను శంకుస్థాపన చేశానన్నారు వైఎస్ జగన్ఈ రోజు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాకే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేశామన్నారు. ‘భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణకు రూ. 960 కోట్లు ఖర్చు చేశాం. మేం వచ్చాక భోగాపురం కోర్టు కేసులు పరిష్కరించాం. మా హయాంలోనే నిర్వాసితులకు భూములు కేటాయించాం. భోగాపురం నిర్వాసితులకు కాలనీలు కట్టాం. అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా అనుమతులు తెచ్చకోలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అన్ని అనుమతులు తెచ్చాం. కోవిడ్ కష్టాలలో కూడా ఎయిర్పోర్ట్ పనులు ఆగలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్కు నేనే శంకుస్థాపన చేశారు. 2026లో మొదటి విమానం ల్యాండింగ్ అవుతుందని ఆనాడే చెప్పా’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
నీ ఆటలు సాగవు.. తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు, లోకేష్పై నిప్పులు చెరిగిన జూపూడి
-
YS Jagan: ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయాడు
-
సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర హీనుడు చంద్రబాబు
-
రేవంత్ చెప్పింది నిజమే.. నిజం ఒప్పుకున్న బాబు?
-
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్పై దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నేడు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు. చంద్రబాబు చరిత్ర హీనుగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ చెప్పారు. రాయలసీమ లిప్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. రాయలసీమ లిఫ్ట్పై వాస్తవాలు అందరికి తెలియాలి. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారు. అంటే.. వీళ్లకి రేవంత్కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ సీమ, నెల్లూరుకు సంజీవిని. వీళ్ల మాటలు చూస్తుంటే మనుషేలా అనిపిస్తుంది. చంద్రబాబు క్లోజ్డోర్ మీటింగ్లో అడిగినట్లు.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రే చెప్పారు. చంద్రబాబది ఒక విలన్ క్యారెక్టర్.చంద్రబాబు అండ్ కో బరితెగించి మాట్లాడటం చూస్తుంటే.. రేవంత్తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లుంది. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారు’ అని ధ్వజమెత్తారు.పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే.. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడుకు 7వేల క్యూసెక్కులు రావాలంటే.. 854 అడుగుల ఎత్తులో నీళ్లు తోడుకోవాలి. పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి.పోతిరెడ్డిపాడు నుంచి 2,3సార్లే నీటిని తీసుకున్నాం. కల్వకుర్తిని 25 నుంచి 50 టీఎంసీఎలకు పెంచారు.పాలమూరు-రంగారెడ్డి,డిండిని డిజైన్ చేశారు.ఎస్ఎల్బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తోడుకోవడానికి నిర్మాణాలు, అదనంగా మరో టీఎంసీ తరలింపునకు కూడా తెలంగాణ ప్రణాళికలు. 770 అడుగల నుంచే ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా.. మరో 4 టీఎంసీలు ఎడాపెడా తోడేసుకుంటున్నారు. రోజుకు మొత్తం 8 టీఎంసీలు తెలంగాణ తోడుకుంటుంది’ అని స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో,వీడియోలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు నోరు మెదపలేక రాషష్టట్రాన్ని తాకట్టు పెట్టారు. కల్వకుర్తి,ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి,డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవు. ఈ పనులు ఆపాలని 2021 అక్టోబర్లో ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెలంగాణకు ఎన్జీటీ రూ.920 కోట్ల పెనాల్టీ వేసింది. శ్రీశైలంలో 777 అడుగుల దగ్గరే తెలంగాణ నీళ్లు తోడుకుంటుంటే.. ఏపీ మాత్రం 834 అడుగుల దగ్గర నీళ్లు తోడుకునే పరిస్థితి. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టంశ్రీశైలానికి ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుకుంటుంది?.సీమ సస్యశ్యామలం కోసమే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం. 800 అడుగుల్లో రోజుకు 3 టీఎంసీలు తోడుకునేలా డిజైన్ చేశాం. రూ. వెయ్యి కోట్లు ఖర్చుచేసి పనులను పరుగులు పెట్టించాం. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ను అడ్గుకోవడానికి చంద్రబాబే స్వయంగా కేసులు వేయించారు. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టం. రాయలసీమకు చంద్రగ్రహణం పట్టింది. చంద్రబాబే దగ్గరుండి రాయాలసీమ లిఫ్ట్ను ఖూనీ చేశారు. 22 టీఎంసీలకు లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి,జ్ఞానం ఉందా?’ శ్రీశైలం నీళ్లను 500 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంకు ఇచ్చాం. రాయలసీమకు నీళ్ల కేటాయింపుల మేరకు లిఫ్ట్ ప్రాజెక్ట్.ఆంధ్రా, తెలంగాణ ప్రజలు అన్న దమ్ములం. ఏపీ ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సి ధర్మం ఉంది. తప్పును సరిదిద్దుకోకపోతే చరిత్రహీనులవుతాం. పాలకులు భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైందేనా?.సీమ ప్రాజెక్టులకు ఫుల్గా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. చంద్రబాబు తప్పును మేం సరిదిద్దుతూ వచ్చాం. సీమ ప్రాజెక్టులకు ఫుల్గా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. మేం వచ్చాక కెనాల్ల సామర్ధ్యాన్ని కూడా పెంచాం. మేం వచ్చాక పూర్తిస్థాయిలో గండికోటలో నీళ్లు నిల్వ చేశాం. బ్రహ్మంసాగర్లో మేం వచ్చాకే 17 టీఎంసీలు నిల్వ చేశాం.బాబు హయాంలో ఏనాడూ నీళ్లు నిల్వ చేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత మాదే. సోమశిలలో 78,కండలేరులో 68 టీఎంసీలు నిల్వ చేశాం. పులిచింతలలో కూడా మేం వచ్చాకే 45టీఎంసీలు నిల్వచేశాం. అలాంటి ప్రాజెక్టు పూర్తయితే నాకు పేరొస్తుందని ఆపేశారని’ అన్నారు. -
బాబు.. మౌనమేల నోయి..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి చాలాకాలం క్రితం అన్నమాట ‘కేంద్రం మిథ్య’ అని! అప్పటి ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారిని కూడా విధానపరంగా ఎదిరించిన చరిత్ర ఆయనది. అయితే... అదే తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని సీఎం అయిన చంద్రబాబు మార్కు రాజకీయం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఏ ఎండకు ఆ గొడుగు అనే సామెతను గుర్తు చేస్తుంది ఈయన వ్యవహారం. ఒకట్రెండుసార్లు బాబుగారు కేంద్రాన్ని విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి లెండి. నిధుల పంపిణీలో దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి ఆయన గళమెత్తారు. కానీ ఇప్పుడు అదంతా గతం. 2024లో గద్దెనెక్కింది మొదలు చంద్రబాబు నాయుడు బాగా బలహీనపడినట్లు కనిపిస్తున్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధుల విషయంలోనే రాష్ట్రానికి భారీగా కోత పడుతున్నా కిమ్మనలేకపోతున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే.. ఈ విషయంపై జనసేనతో కలిసి కేంద్రానికి వత్తాసుపలకడం! విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని తరచూ జగన్ను విమర్శించిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి! పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి తనకు ఇద్దరు ఎంపీలున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవటీకరణను అపేసేవాడినని బీరాలు పలికారు కూడా. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 17 మంది ఎంపీల మద్దతుంది. కానీ వీళ్లు ఈ అంశంపై గళమెత్తితే ఒట్టు!కొంచెం గతంలోకి వెళదాం... నరేంద్ర మోడీతో చెడిన తరువాత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఏమన్నారో గుర్తు చేసుకుందాం. అమరావతికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని, ఏపీకి మరిన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా.. పనికి ఆహారం పథకం కింద ఏకంగా యాభై లక్షల టన్నుల బియ్యం తీసుకొచ్చానని బాబు చెప్పుకునేవారు. బాబుగారి పలుకుబడి అంత అని టీడీపీ ప్రచారం చేసుకునేది. ఇదే బియ్యం పార్టీ నేతల అక్రమార్జనకు దారి తీసిందన్నది వేరే సంగతిలెండి. కానీ ఇప్పుడేమైందో మరి? కేంద్రం కొత్త విధానాలు రాష్ట్రాలకు నష్టం చేస్తున్నా నోరెత్తలేకపోతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతంతమాత్రం నిధులే వస్తున్నా కేంద్రం బాగా సహకరిస్తోందని చెప్పుకునే దుస్థితి ఎందుకో? కేంద్రం నుంచి రూ.34 వేల కోట్ల సాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేస్తే, తొమ్మిది నెలల్లో కేవలం రూ.ఏడు వేల కోట్ల వరకే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ వాటా 75 శాతం నుంచి 40 శాతానికి కుదించుకుంది. గ్రామీణ సడక్ యోజన, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లోనూ రాష్ట్రం వాటాను నలభై శాతానికి పెంచారు.పి.ఎమ్. ఫసల్ భీమా స్కీమ్ లో గతంలో ఏభై శాతం చొప్పున కేంద్ర,రాష్ట్రాలు భరించేవి.కాని ఇప్పుడు రాష్ట్రమే 75 శాతం ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని ఫలితంగా రాష్ట్రాలపై ఆ మేరకు అధిక బరువు పడుతుంది. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మగాంధీ పేరును తొలగించడంపై.. కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం వాటా తగ్గడంపై కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బాబు మౌనం పలు సందేహాలకు కారణమవుతోంది. ఈ మార్పుల వల్ల ఏపీకి మాత్రమే ఏటా సుమారు రూ.4500 కోట్ల వరకూ భారం పడుతుందని అంచనా. అయినాసరే.. టీడీపీ, జనసేనలు ఈ మార్పులను వ్యతిరేకించలేదు. కాకపోతే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో అభ్యంతరం మాత్రం చెప్పారట. మార్పులు స్వాగతిస్తూనే ఆర్థిక పరిస్థితి రీత్యా ఏపీకి వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారట. జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ఇలా కోరడం సమంజసమేనా? జనసేన ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తెలిపారట. వైసీపీ ఎంపీ వైసిపి అవినాశ్ రెడ్డి మాత్రం ఉపాధి స్కీమ్ ఎత్తివేతకు కుట్ర జరుగుతోందని ధైర్యంగా విమర్శించారు.కొత్త చట్టం పేదల పొట్ట కొడుతుందని హెచ్చరించారు. బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడింది స్పష్టంగా తెలుస్తోంది కదా!విశాఖ స్టీల్, ఇతర అంశాల విషయంలోనూ టీడీపీ, జనసేనల తీరు ఇలాగే ఉంది. మోడీగారికి చాలా పనులు ఉంటాయని, అన్నిటికి ఆయనను ఇబ్బంది పెట్టలేమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. జగన్ ప్రభుత్వ కాలంలో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చినా, ఏపీకి నష్టం జరుగుతుందనుకుంటే ప్రధానికి, కేంద్ర మంత్రులకు నిర్మొహమాటంగా తెలిపే వారు. విశాఖలో జరిగిన ఒక సభలో ప్రధాని మోడీ సమక్షంలోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని గట్టిగా కోరిన విషయం తెలిసిందే. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరారు. కానీ ఇప్పుడు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రూ.ఎనిమిది వేల వరకూ తగ్గుతుందన్న అంచనాలు వచ్చినా కిమ్మనలేదు ఈ పార్టీలు. ఈ అంశాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించి రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఎంతో సీనియర్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం ఈ డిమాండ్ చేయలేకపోయారు. పైగా మోడీ మెప్పుదల కోసం అన్నట్టు.. రేట్ల తగ్గింపు తరువాత కూడా ఏపీలో జీఎస్టీ ఆదాయం బాగా పెరిగిందంటూ సభలు పెట్టారు.తాజాగా తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు సెస్ల భారం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహానాల లైఫ్ట్యాక్స్పై పది శాతం అదనపు సెస్ అలాంటిదే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మౌనం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. డిమాండ్లు పెడితే బీజేపీ పెద్దలు అవమానిస్తారన్న సందేహమా? లేక... తనపై ఉన్న కేసుల భయమా? అదీ కాదంటే పుత్రరత్నం భవిష్యత్తు కోసం రాజీ పడుతున్నారా? ఇదీ కాదంటే.. ఎలాగూ అమరావతి కోసం అప్పులు చేసుకునేందుకు ఉదారంగా అనుమతిస్తున్నారు కాబట్టి.. అలా ముందుకెళదాం అనుకుంటున్నారా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
ఇంట్లో దోమలను చంపలేడు కానీ పొలుసు పురుగును డ్రోన్ తో చంపుతాడు అంట
-
హైదరాబాద్ నడిబొడ్డున బయటపెడతా.. ఏంటి తమాషాలా..
-
ఎన్ని ప్రాణాలు పోయినా.. ఐ డోంట్ కేర్! నాకు భూములు కావాల్సిందే!!
-
రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు శాపనార్థాలు... సరైన అనుమతులు లేకుండా లిఫ్ట్ ప్రారంభించారంటూ పోలవరం సాక్షిగా అక్కసు వెళ్లగక్కిన ఏపీ సీఎం
-
పోలవరంపై వ్యాఖ్యలు.. చంద్రబాబుకు అంబటి చురకలు
సాక్షి, తాడేపల్లి: ప్రాజెక్టులను నిర్మించిన చరిత్ర చంద్రబాబుకి లేదని.. అలాంటిది కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తాను ఎందుకు తీసుకున్నారో ఇప్పటికైనా చెప్పాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. పోలవరంపై చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై అంబటి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. ‘‘డయాఫ్రమ్ వాల్ కొట్టకుపోవడానికి వైఎస్సార్సీపీనే కారణమంటూ చంద్రబాబు చెబుతున్నారు. పదే పదే అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధాని మోదీనే అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో.. ఆంధ్రా ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు. రాయలసీమ ప్రజల గుండెలపై చంద్రబాబు కొట్టారు’’ అని అంబటి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘డయాఫ్రమ్ వేయాలంటే కాపర్ డ్యామ్స్ కట్టాలన్న జ్ఞానం కూడా చంద్రబాబుకి లేదు. అలాంటప్పుడు కాపర్ డ్యాం వేయకుండా ఢయాఫ్రం ఎలా వేశారో ఆయన సమాధానం చెప్పాలి. నది డైవర్ట్ చేశాం, స్పిల్ వే పూర్తి చేశాం.. కాపర్ డ్యామ్స్ కట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. అలాంటిది జగన్ 2 శాతమే పూర్తి చేశారని అబద్ధాలు చెబుతున్నారు. ఆ అబద్ధాతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.ప్రాజెక్టులను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. పోలవరం అనేది వైఎస్సార్ కలల పంట. కానీ, చంద్రబాబు పట్టిసీమను కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి కట్టారు. పోలవరం ఎత్తును 45.72 నుండి 41.15 కు కుదించారు. పోలవరాన్ని బ్యారేజ్ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనవసరమని చంద్రబాబు అంతకుముందు ఎందుకు చెప్పలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతే అనవసరమని గుర్తొచ్చిందా?.. ఏపి ప్రజల హక్కును తాకట్టు పెట్టి తెలంగాణతో సత్సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో పంపి కుళ్ళు రాజకీయాలు చేస్తుంది చంద్రబాబే. తెలంగాణలో టిడీపీ బలపడటం కోసమే ఏపి, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు.మేం రెడీపోలవరంపై చర్చుకు మేం సిద్ధం. మీ జలవనరుల శాఖా మంత్రిని పంపించండి అని చంద్రబాబుకు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ‘‘రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే ఆ డిమాండ్ సరైంది కాదని మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు లక్ష ఎకరాల్లో రాజధానిని కట్టాలనుకోవడమే దురదృష్టకరం. అంత కెపాసిటీ మన రాష్ట్రానికి లేదు. అంత నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. కృష్ణా నది మట్టం కంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం దుర్మార్గం.చంద్రబాబు తాను దోచిన డబ్బుల్లో సగం పవన్ బ్రదర్కు ఇస్తున్నారు. ఆ డబ్బుల లెక్కలు చూసేది లోకేషే. చంద్రబాబు పాలనపై ఏడాదిన్నర లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. జగనే బెటర్ ప్రజలు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ వస్తాడని అందరు అనుకుంటున్నారు అని అంబటి అన్నారు. -
లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు
-
ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....
-
తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పై నోరువిప్పని సీఎం చంద్రబాబు
-
అసలు విషయంపై మాట్లాడని చంద్రబాబు
ఏలూరు, సాక్షి: నీళ్లపై రాజకీయాలు వద్దంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు.. అసలు విషయంపై స్పందించలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించినట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ సీఎం పెదవి మాత్రం విప్పలేదు. పోలవరం సమీక్ష పనుల తర్వాత నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. నీటి రాజకీయాలంటూ ఏవేవో అంశాలపై మాట్లాడారు. అయితే.. కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. క్లోజ్ రూమ్లో తమ మధ్య భేటీ జరిగిందని రేవంత్ చెప్పగా.. ఆ గదిలో ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో చంద్రబాబు చెప్పలేకపోయారు. అలాగే తెలంగాణ ఒత్తిడికి ఎందుకు తలొగ్గారో అనే అంశంపై కూడా నోరు తెరవలేకపోయారు. అయితే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాత్రం తప్పుడు ప్రచారం చేశారు. సీమ రైతుల ఆందోళనను లెక్క చేయని చంద్రబాబు.. అసలు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్న ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్నగర్కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి నేనే ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు?. ఈ మధ్య కొందరి మాటలు చూస్తే.. రాజకీయాలు నాకే అర్థం కాలేదు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా? ఆరోజు మంజీరాకు నీళ్లు తీసుకెళ్లారు.. అప్పుడు స్వాగతించాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. పూర్తి చేసుకోండి. దేవాదులకు మేం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుంది. మిగిలిన నీరు సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టం. కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని భావిస్తున్నారు.సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకుంటే లాభాలు ఉంటాయి..నష్టాలు ఉంటాయి’’ అని చంద్రబాబు చెప్పారు. -
Satish Reddy: కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి
-
చంద్రబాబు పై బీజేపీ, జనసేన సీరియస్... ప్రజల ప్రాణాలతో ఆటలు వద్దు....
-
రెచ్చిపోయిన రేవంత్...దిక్కు తోచని స్థితిలో ఈనాడు.. ABN
-
లోకేష్.. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తారా?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఖాళీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు అని హెచ్చరించారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాపై నియంత్రణ పేరుతో గొంతులు నులుమాలంటే కుదరదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం(రెడ్బుక్ రాజ్యాంగం) చేస్తారా?. దీనిపై ప్రజా పోరాటం చేస్తాం. అసలు సోషల్ మీడియా మీద సమీక్షలు, చర్యలకు మంత్రి లోకేష్కు ఏం అర్హత ఉంది?. సకల శాఖా మంత్రిగా లోకేష్ వ్యవహరించటం సబబు కాదు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా?.వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించటానికే సోషల్ మీడియా నియంత్రణా?. సాక్షి మీడియా, ప్రశ్నించే గొంతులను నులుమేయటమే మీ పనా?. ఆర్టికల్-19కి విరుద్ధంగా వ్యవహరించే వారందరిపై చర్యలు తీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబాలపై ఐ-టీడీపీ పెడుతున్న పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు?. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పేరుతో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించినా కేసులు పెట్టటం ఏంటి?. ఐ-టీడీపీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై కోర్టుకు వెళ్తాం. లోకేష్ గురివింద గింజ సామెత లాగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఏపీలో అమలు చేయని వైనంపై కోర్టులోనే తేల్చుకుంటాం. అభ్యంతరకర పోస్టులన్నీ టీడీపీ సోషల్ మీడియా నుండే వస్తున్నాయి. లోకేష్ ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు, రేవంత్ కలిసి రాయలసీమ గొంతు కోశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై కడప డీఆర్సీ సమావేశంలో వైఎస్సార్సీపీ గళమెత్తింది. ఇంచార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో ఇరిగేషన్పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఆ అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు. అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. డీఆర్సీ సమావేశంలో అంతా ఆత్మ స్తుతి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు.‘‘రాయలసీమ ఎత్తిపోతలపై చర్చిస్తే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఓ వైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ. 950 కోట్లు ఖర్చు చేశారు. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవచ్చు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు రిజెక్ట్ చేశారు..పొత్తులో ఉన్న బాబు ఆ అనుమతులు తీసుకురావడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. పైగా దాన్ని రేవంత్, చంద్రబాబు కలిసి కుట్ర చేసి పక్కన పెట్టారు. సీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు రావడం లేదు. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ నిరర్థకమని ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 800 అడుగుల్లో మనమూ నీళ్ళు తీసుకునే అవకాశం ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్లే వస్తుంది. చంద్రబాబు వెంటనే పర్యావరణ అనుమతులు తీసుకురావాలి. రాయలసీమ ఎత్తిపోతల పనులు ముందుకు కొనసాగించాలి. ఈ ప్రాజెక్ట్ చేపట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రాయలసీమ రైతులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగించాలి’’ అని అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
తోపుదుర్తి ఆధ్వర్యంలో YSRCP లోకి చేరిన రాప్తాడు టీడీపీ నేతలు
-
Vijayananda : ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి బయటకు రండి చిత్తూరు మామిడి రైతుల కష్టాలు
-
Koramutla Srinivasulu: రాయలసీమకు ఒక చరిత్ర ఉంది.. మొత్తం సర్వనాశనం చేసావ్ చంద్రబాబు
-
రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగు నీటి ప్రాజెక్టులన్నీ చంద్రబాబు మూలనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేశారు. కమీషన్ల కోసమే రూ.8 వేల కోట్ల బిల్లులు ఇచ్చారు. అంతే తప్ప ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు’’ అని సతీష్రెడ్డి పేర్కొన్నారు.‘‘2020లోనే రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి రామానాయుడు అబద్దాలు చెప్తున్నారు. మీ ప్రభుత్వం దగ్గరే ఉన్న ఎంబుక్లూ చెక్ చేసుకుంటే మంత్రికి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన పనులకు కమీషన్ల కోసం బిల్లులు మంజూరు చేశారే తప్ప ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాదు. కమీషన్లు తీసుకుని రూ.8 వేల కోట్లు రిలీజ్ చేశారు. రూ.1100 కోట్లతో కుప్పం వరకు నీటిని తీసుకెళ్లే పని జగన్ ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు ఆపేశారు. మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా చేశారు. దీనివలన చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది’’ అని సతీష్రెడ్డి నిలదీశారు.‘‘తెలంగాణ కృష్ణా జలాలను తరలించుకు పోతుంటే.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదు?. 800 అడుగుల్లో ఉన్న నీటినే తెలంగాణ తీసుకెళ్తోంది. మరి రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదు. కొన్ని దశాబ్ధాలుగా దుర్భిక్షం అనుభవిస్తున్న రాయలసీమ మీద వైఎస్సార్, జగన్ ప్రేమ కనపరిచారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన నేత వైఎస్సార్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలతో చంద్రబాబు కుట్ర బయట పడింది’’ అని సతీష్రెడ్డి దుయ్యబట్టారు.‘‘రేవంత్ చెప్పింది అబద్దమైతే చంద్రబాబు ఎందుకు ఖండించలేదు?. చంద్రబాబు అసమర్థత వలనే రాయలసీమ ప్రాజెక్టులు ఆగిపోయాయి. చంద్రబాబు వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ప్రజల అభీష్టం కూడా తెలుసుకోవాలి. హెచ్ఆర్ఎస్ఎస్ కాలువ లైనింగ్ పనులు తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకేమీ జరగటం లేదు. ఆ లైనింగ్ పనులను ఆపాలని రైతులు కోరినా పట్టించుకోవటం లేదు. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అందవని రైతులు వాపోతున్నారు’’ అని సతీష్రెడ్డి చెప్పారు. -
Sake Sailajanath : సీమ ద్రోహి చంద్రబాబు.. బాబు సమాధానం చెప్పాలి
-
సీమ ద్రోహి.. ఢిల్లీకి రేవంత్ సూట్ కేసులు
-
7 గ్రామాల్లో 16 వేల ఎకరాల స్కామ్
-
శిష్యుడి మాటకు గురువు తలూపుతున్నారా?
ఎల్లో మీడియాకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకోపక్కేమో తమకు అత్యంత ప్రియుడైన తెలుగుదేశాధిపతి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబును చిక్కులే పడేసేలా వ్యాఖ్యానిస్తే.. సమర్థించుకోలేక, విమర్శించనూ లేక అల్లల్లాడిపోతోంది ఈ పచ్చమీడియా! తన విజ్ఞప్తితోనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని రేవంత్ చెప్పడం.. ఏపీలో తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియాకు కూడా దిక్కుతోచటం లేదు.రేవంత్ రెడ్డిని విమర్శించే ధైర్యం తెలుగుదేశం పార్టీ ఎటూ చేయదు. వంతపాడే జనసేన, బీజేపీలు కూడా కామ్గానే ఉన్నాయి. రహస్య విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చి మూడు రోజులు అవుతున్నా చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలను నేరుగా ఖండించలేకపోయారు. నష్టం కొంత తగ్గిద్దామనుకున్నాయేమో.. ఎల్లో పత్రికలు రేవంత్ వ్యాఖ్యలను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేశాయి. చంద్రబాబుకు నష్టం జరిగే సమాచారాన్ని ఎడిట్ చేసి కనీ కనిపించకుండా వేసి ఏపీ పాఠకులను మోసం చేశాయి.సాక్షి మీడియా మాత్రమే రేవంత్ ప్రకటనను యథాతథంగా ఇచ్చింది. విశ్లేషణలు అందించింది. సాక్షి, సోషల్మీడియా చురుకుగా ఉండటంతో చంద్రబాబు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమకు ఎంత అన్యాయం చేసింది అర్థమైంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఈ ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన సహజ ధోరణిలో జగన్ వల్లే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆగిందంటూ దిక్కుమాలిన వాదన తెరపైకి తెచ్చింది. ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్లో 'చచ్చినా, బతికినా తెలంగాణ కోసమే’ అన్న శీర్షికతో రేవంత్ వ్యాఖ్యలను ప్రచురించింది.ఇందులో రాయలసీమ లిఫ్ట్ను తానే ఆపు చేయించానన్న అంశానికి ప్రాధాన్యమివ్వలేదు. లోపల పేజీలో మాత్రం కొద్దిగా రాసింది. అందులో కూడా జగన్ ప్రస్తావన తెచ్చింది. పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి జగన్ను ప్రోత్సహిస్తే తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆపించానంటూ రేవంత్ చేసిన కామెంట్ను ముద్రించారు. తెలంగాణలో కనీసం లోపలి పేజీలోనైనా వేశారు.. ఈనాడు ఏపీ ఎడిషన్లో వేసినట్లు కనిపించలేదు. కాని మరుసటి రోజు మాత్రం మంత్రులు సవిత, రామానాయుడుల ప్రకటనలను మొదటి పేజీలో ప్రచురించారు.కాగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రేవంత్ అబద్దాలు చెప్పారని చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈనాడు మీడియా చంద్రబాబు పట్ల స్వామిభక్తి చూపింది. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే అని ఏపీ మంత్రి సవిత ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే 2020లో ఎత్తిపోత పనులు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలుగా ఈ ఉదంతాన్ని కొట్టిపారేశారు. అంతే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేకపోయారు. దీనినిబట్టి టీడీపీ కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా వెల్లడైంది. ఈ పథకంపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది తెలంగాణ టీడీపీ సహకారంతోనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్జీటీ వ్యతిరేక ఆదేశాలు ఇచ్చినా జగన్ వ్యూహాత్మకంగా పనులు కొనసాగించారు. దాంతో అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో జగన్ అంటే పడని శక్తులు ఎన్జీటీకి మళ్లీ మళ్లీ ఫిర్యాదులు చేశాయి. ఈలోగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 19 నెలలు అయినా ఈ స్కీమ్ అడుగు ముందుకు కదల్లేదు. ఎందుకిలా అన్నదానికి ఈ మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా! ఆ ఊసే లేకుండా వారు స్టేట్ మెంట్ ఇచ్చారు.కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్నామని ఊదరగొట్టే ఈ నేతలు, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెచ్చి ఉండాలి కదా!అవేమీ చేయలేదంటే ఈ పథకాన్ని ఆగినా, రాయలసీమకు నష్టం జరిగినా ఫర్వాలేదన్నట్లే కదా అన్న ప్రశ్నకు ఏమి జవాబు ఇస్తారు? రేవంత్ డిమాండ్ కు తలొగ్గినట్లే అవుతుంది కదా! ఒకవేళ జగన్ పై ఇలాంటి ఆరోపణ వచ్చి ఉంటే తెలుగుదేశంతోపాటు ఎల్లో మీడియా ఎంత రచ్చ చేసి ఉండేవో ఊహించుకోవచ్చు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా రాయలసీమకు జగన్ ద్రోహం చేశారంటూ ఒక తప్పుడు ఆరోపణ చేశారే తప్ప, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. రేవంత్ చాలా స్పష్టంగా ఏకాంత సమావేశంలో చంద్రబాబును ఒప్పించానని వెల్లడించారు. తనపై గౌరవంతోనే చంద్రబాబు ఈ స్కీమ్ పనులు నిలిపివేశారని అన్నారు. కావాలంటే కమిటీగా వెళ్లి చూడవచ్చని తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అయినాసరే... టీడీపీ నేతలు, మంత్రులు మొక్కుబడిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమా? కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ కాని, ప్రజాసంఘాలు కాని చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ స్కీమ్ పనులు కొనసాగాయనేందుకు వైసీపీ నేత సతీష్ రెడ్డి రికార్డులు చూపించారు. వైసీపీ బృందం ఒకటి లిఫ్ట్ స్కీమ్ ప్రాంతానికి వెళ్లి జగన్ టైమ్లో జరిగిన పనులు ప్రజలకు తెలియచెప్పింది.అలాగే నమస్తే తెలంగాణ పత్రిక గతంలో ఆ ప్రాంతానికి వెళ్లి జగన్ ఈ స్కీమ్ పనులు ఆపలేదని, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన నాటికి 14 శాతం పనులు జరిగితే, ఆ తర్వాత 85 శాతం జరిగాయని ఆ రోజుల్లో తెలిపింది. ఏపీ మంత్రులు ఈ విషయాలను కప్పిపుచ్చుతూ ప్రకటనలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అప్పట్లో ఈ స్కీమ్ను ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆపలేదంటూ కొన్ని వార్తలు ఇచ్చిన క్లిప్లింగ్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ మీడియా కూడా జగన్పై ద్వేషంతో రాయలసీమకు నష్టం చేయడానికి వెనుకాడలేదన్నమాట.ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో దీనిపై మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు చెబుతారని లీక్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక 'సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని పెద్ద హెడింగ్ పెట్టి తన పాఠకులను, ఏపీ ప్రజలను మోసం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఈ పత్రిక రేవంత్ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఒక్క ముక్క కూడా ఏపీ ఎడిషన్ లో ప్రస్తావించినట్లు కనిపించలేదు. ఆ తర్వాత రోజు మాత్రం తాటికాయంత శీర్షిక పెట్టి జగన్ పై బురద చల్లేందుకు యత్నం చేసింది. రేవంత్ ప్రకటనతో ఏపీలో చంద్రబాబుకు తీరని నష్టం జరిగిందని గమనించిన ఈ ఎల్లో మీడియా మొత్తం ఇష్యూని జగన్ పై నెట్టేసి టీడీపీని రక్షించాలని విఫల యత్నం చేసింది.అనుమతులు లేవు.. డీపీఆర్ లేదు.. అయినా జగన్ 2020లో ఈ ప్రాజెక్టును చేపట్టారని ఈ పత్రిక రాసింది. పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయంటూ రాశారు. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద చల్లి రాజకీయ లబ్దిపొందేందుకు వైసీపీ ఎత్తు అని ఎల్లో మీడియా ఆరోపించింది. అయినా వాస్తవాలు వెల్లడవడంతో ఆ ఎత్తు చిత్తయిందని ఈ పత్రిక అభిప్రాయపడింది. అది నిజమే అయితే ఇంతగా కంగారు పడుతూ జగన్కు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది. అసలు ఈ వివాదానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కదా! ఆయనను ఎందుకు ఒక్క మాట అనలేదు?జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ పనులను చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఎన్ని ఎత్తులు వేసింది తెలియచేస్తూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. అటు రేవంత్ తోను, ఇటు చంద్రబాబుతోను ఈనాడు యజమాని కిరణ్ కు, ఆంద్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు ఉన్న సంబంధాలు అందరికి తెలిసినవే. వారి వ్యాపార ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో దానిని కవర్ చేయడానికి జగన్ పై తోసేయాలని కుట్ర చేస్తున్నారు.ఇదే టైమ్ లో ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ స్కీమ్ అంటూ విపరీతంగా ప్రచారం చేసి, సడన్గా దానిని ఆపేసి పోలవరం-నల్లమల సాగర్ స్కీమ్ అంటూ కొత్త గాత్రం ఎందుకు ఎత్తుకున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా! ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ తో ఏర్పడిన సంబంధ బాంధవ్యాల రీత్యా చంద్రబాబు ఆయన మాట కాదనలేని పరిస్థితి ఏర్పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.ఆ కేసు వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలుకుని చంద్రబాబు ఏపీకి వెళ్లిపోతే, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ఏకంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నే నీరుకార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. అంటే గురువును శిష్యుడే శాసిస్తున్నారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీ శిష్యుడి కోసం రాయలసీమ గొంతు కోస్తే.. మేము ఊరుకోం!
-
జన్మభూమికీ వెన్నుపోటు
-
క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..
-
పురిటిగడ్డకు బాబు వెన్నుపోటు!
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల అభివృద్ధి.. ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదన్న నిజం మరోసారి తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయించానని.. ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత శనివారం చేసిన వ్యాఖ్యలను ఇప్పటివరకు చంద్రబాబు కనీసం ఖండించలేదు. ఇక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ తాజాగా మంగళవారం స్పష్టం చేయించడం ద్వారా.. తెలంగాణ సీఎం రేవంత్ చెప్పింది నిజమేనని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులు నిలిపివేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే కాదు.. జన్మనిచ్చిన రాయలసీమకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ అటు ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమామహేశ్వరావుతో ఇటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు.ముమ్మాటికీ సీమ ఎత్తిపోతల గేమ్ ఛేంజర్..శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ఈ క్రమంలో విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ సాధించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. 2014 నుంచి శ్రీశైలంలో నీటి మట్టం కనీస స్థాయికి 854 అడుగులకు చేరకున్నా.. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా సరే తెలంగాణ సర్కార్ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపలేదు. శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడారు. ఇక 2016–17లో శ్రీశైలానికి 337.95 టీఎంసీలు వచ్చినా.. తెలంగాణ 800 అడుగుల నుంచే యథేచ్ఛగా నీటిని తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 67.44 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాల రూపురేఖలను మార్చేస్తుందని.. ఆ జిల్లాల అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. మంత్రి నిమ్మల చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి కూడా హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల అని స్పష్టం చేస్తున్నారు. గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించిదెవరు బాబూ..?రాయలసీమ ఎత్తిపోతలను రూ.3,307.6 కోట్ల అంచనాతో వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్కు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం హంద్రీ–నీవాలో అంతర్భాగంగా చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా అదే గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో వాదించారు. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడికి పర్యావరణ అనుమతి ఏదీ..?రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్ జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిందని.. అందువల్లే ఆ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయంటూ మంత్రి నిమ్మల ఏమాత్రం పసలేని వాదన చేస్తున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది. నిజానికి రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలుత నివేదిక ఇచ్చింది.జగన్ హయాంలో సీమ సుభిక్షం..నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించి సమస్యలను పరిష్కరించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. తెలుగుగంగ లింక్ కెనాల్ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ఇక గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి.. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది. -
నారా వారి పాలనలో.. నారీ విలాపం
మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగికదాడులు చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు బడిలో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోయింది. వీటికి తోడు బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై అకృత్యాలకు సంబంధించి గత రెండేళ్లలో జిల్లాలో 1564 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మహిళలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మరింతగా దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. ఆ తరువాత వరుసగా బాలికల మీద లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు రక్షణ కలి్పంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహిళల సంగతి సరే సరి. ప్రతి రోజూ అదనపు కట్నం కోసమో, ఇతరత్రా కారణాలతో మహిళల మీద నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళా హోం మంత్రి పాలనలో కూడా మహిళలకు రక్షణ లేకుండాపోవడం బాధాకరమని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు ఇద్దరు మహిళలపై అఘాయిత్యం.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకాశం జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజూ ఇద్దరు మహిళలు ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారు. కట్నం కోసం హతమార్చడం కావచ్చు, అదనపు కట్నం కోసం వేధింపులు, గృహహింస, ఇతరత్రా కారణాలతో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి 2024లో 475 కేసులు నమోదు కాగా, 2025లో 440 కేసులు నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో 915 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళల హత్యలు, కిడ్నాపులు వంటి కేసులు 2024లో 274 నమోదు కాగా, 2025లో 180 కేసులు నమోదవడం గమనార్హం.మొత్తం మీద మహిళలకు వ్యతిరేకంగా 2024లో 855 కేసులు, 2025లో 709 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ రెండేళ్లలో 1564 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్కటే ప్రతి రోజూ రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. పోలీసు స్టేషన్ గడప తొక్కని కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఊహించడం కష్టం. మహిళల రక్షణ కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ను మూలనడేసిన చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చింది. శక్తి యాప్ను నామమాత్రంగా మహిళల ఫోన్లలో డౌన్లోడ్ చేసి ఇక దాని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ యాప్ వల్ల మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. బాలికలకు రక్షణేది.. జిల్లాలో బాలికల మీద లైంగికదాడులు పెరిగిపోయాయి. బాలికల మీద ఈ రెండేళ్లలో 177 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది పోలీసు రికార్డులు పరిశీలిస్తే నాలుగు రోజులకో బాలిక మీద లైంగికదాడి జరిగినట్లు తెలుస్తోంది. పిక్కిలి ఆంజనేయులు అనే టీడీపీ నాయకుడు యర్రగొండపాలెం మండలంలోని ఒక గ్రామంలో కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తినుబండరాల కోసం దుకాణానికి వెళ్లిన 9, 8 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలను మాయమాటలతో మభ్య పెట్టి దుకాణం వెనకకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.కురిచేడు పరిసరాలకు చెందిన ఒక 16 ఏళ్ల బాలికను రాగుల శ్రీను అనే కామాంధుడు మాయమాటలతో నాగార్జున సాగర్కు తీసుకెళ్లి లాడ్జిలో నిర్బంధించి ఐదు రోజుల పాటు లైంగికదాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టకుండా రాజీ చేసేందుకు ప్రయతి్నంచారు. దళిత సంఘాలు రంగంలోకి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో మోసం..ఆత్మహత్య.. ఇటీవల నగరానికి చెందిన ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎంటెక్ చదువుకున్న బాలిక నగరానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సదరు యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడగడంతో నీ కులం వేరు మా కులం వేరు అంటూ మొహం చాటేశాడు. యువకుడి ఇంటికి వెళ్లిన యువతిని నెట్టివేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ ఘటనలోనూ యువకుడి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అరెస్టు చేయడం లేదని దళిత సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.బిలాల్ నగర్లో బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు నగరంలోని బిలాల్ నగర్లో ఒక బాలికను వేధిస్తున్నట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే మీ కోసం వేదికలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశాడు. డీఎస్పీని కలిసి తన కూతురికి రక్షణ కలి్పంచడమంటూ వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకోవడానికి బడికి వెళితే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చదువుకోడానికి బడికి వెళ్లినా రక్షణ లేకుండా పోయిందని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు పట్టణంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. అదే పాఠశాలలో చదువు చెబుతున్న ఒక ఉపాధ్యాయుడు వీరి మీద కన్నేశాడు. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులను సాయంత్రం స్కూలు వదిలిన తరువాత కూడా వేచి ఉండమని చెప్పాడు. విద్యార్థులందరూ వెళ్లి పోయాక ఆ చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన చూసి భయపడిపోయిన చిన్నారులు ఇంటికి వెళ్లి జరిగింది చెప్పడంతో కేసు నమోదు చేయడమే కాకుండా కీచక గురువును సస్పెండ్ చేశారు.మద్య నిషేధం చేయడం ఒక పరిష్కారం ఇటీవల కాలంలో మద్యం తాగడం ఎక్కువైపోయింది. ప్రభుత్వం టార్గెట్ విధించి మరీ తాగిస్తున్నారు. గ్రామా ల్లో బెల్ట్ షాపులు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. చిన్నపిల్లలు సైతం మద్యం తాగుతున్నారు. దీంతో పాటుగా అశ్లీల చిత్రాల ప్రసారం మితిమీరింది. మద్యపానాన్ని నిషేధించాలి. విష సంస్కృతిని కట్టడి చేయకుండా మహిళలపై హింసను అరికట్టడం అసాధ్యం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వాలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. – బి.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మహిళలు, బాలికలపై దాడులు పెరగడం ఆందోళనకరం రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగిక దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చివరికి పాఠశాలల్లో కూడా బాలికలకు రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? గ్రామగ్రామానికి మద్యం అందుబాటులోకి రావడంతో మహిళలపై హింస కూడా పెరిగింది. గృహహింస గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదన్నట్లుగా తయారైంది. మహిళల సాధికారిత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం మహిళ రక్షణ గురించి నోరుమెదపడం లేదు. – ఎం.విజయ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుఆగని బాలికలు, మహిళలు మిస్సింగ్లు... జిల్లాలో బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు రికార్డుల ప్రకారమే గత ఏడాది కాలంలో 136 మంది బాలికలు, 264 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అయితే పోలీసుల అప్రమత్తత కారణంగా ఈ కేసుల్లో 90 శాతానికి పైగా ట్రేస్ చేశారు. అయినా కొంతమంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. 2024 జూన్లో మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ శివారులోని కపిల్ లేఔట్ వద్ద సింగరాయకొండకు చెందిన 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. తొలుత ఈ బాలిక మిస్సింగ్ అయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం చేసి హతమార్చినట్లు నివేదిక రావడంతో పోలీసులు విచారణ కొనసాగించారు. ఏడాదిన్నర తరువాత 2025 డిసెంబర్ 31న నిందితులను అరెస్టు చేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో బాలిక కుటుంబ సభ్యులు నరకం అనుభవించారు. -
చంద్రబాబు సీమ జల ద్రోహి
కర్నూలు (సిటీ): రాయలసీమ నీటి కష్టాలను తొలగించే లక్ష్యంతో వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఇలా చేసింది. కానీ, దీనిపై పచ్చిగా అబద్ధాలు ఆడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలినుంచి రాయలసీమ అంటే చంద్రబాబుకు వివక్షేనని విమర్శించారు. తన కోరిక మేరకే రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబు ఆపేశారంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దివంగత సీఎం వైఎస్ చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకు చంద్రబాబు కుట్రలకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్లో రేవంత్తో చేసుకున్న ఒప్పంద వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ హయాంలోనే 85% పనులు పూర్తి‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 881 అడుగుల పైన ఉంటేనే రాయలసీమకు తీసుకెళ్లే పరిస్థితుల్లో అవసరమైన మేర తరలించలేక ఏటా సీమలో పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ను ప్రతిష్ఠాత్మకంగా చేపడితే, చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 85 శాతం పనులు పూర్తిచేసింది. చంద్రబాబు సర్కారు ఏర్పడి 19 నెలలైనా పనులు అంగుళం కూడా కదల్లేదు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి బాబు ప్రజలను మభ్యపెట్టారు. కానీ, రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబు చేసిన దగా, వంచన బట్టబయలైంది. ఆయన ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సీమ లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలి’’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకొంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే సీమ రైతులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, సాగునీటి నిపుణులు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.నంద్యాల జిల్లాలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశం వద్ద వైఎస్సార్సీపీ నేతలు కేసులు వేయించి.. పనులు నిలిపివేశారురాయలసీమలో కరువు శాశ్వత నివారణకు వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ చేపట్టారు. తెలంగాణ అడ్డుచెప్పినా జగన్ దృఢ సంకల్పంతో ముందుకుసాగారు. ఈ ప్రాజెక్టు ముందుకుసాగితే జగన్కు మంచి పేరు వస్తుందని.. పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు కుట్ర చేసి పనులు నిలిపివేశారు. –కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడుఅమరావతి మీదున్న శ్రద్ధ సీమ మీద లేదా?చంద్రబాబుకు అమరావతి మీద ఉన్న శ్రద్ధ రాయలసీమ ఎత్తిపోతల మీద లేదు. సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎత్తిపోతలు చేపట్టిన విజనరీ జగన్. కేసులతో అడ్డుకుని కుట్రలు చేసిన చరిత్ర చంద్రబాబుది. సీమ ఎడారిగా మారుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుసీమను నాశనం చేసే కుట్రసాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. ఓటుకు నోటు కేసుకు భయపడి సీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టుపెట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో సీమను నాశనం చేసే కుట్రకు తెరలేపారు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి, అనంతపురంరేవంత్తో కలిసి ప్రతిపక్షంలో ఉండగానే కుట్రరైతుల కన్నీరు తుడిచే అద్భుత ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పనులు మొదలుపెట్టి 85 శాతం పూర్తిచేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా... రేవంత్తో కలిసి ఈ లిఫ్ట్ పనులను ఆపాలని కుట్ర చేశారు. సీఎం అయ్యాక పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపి నిలిపివేశారు. – దారా సుధీర్, నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిఆ నీటిని సీమకు వాడుకుంటే తప్పేంటి?దివంగత సీఎం వైఎస్... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన తర్వాతే మైలవరం రిజర్వాయర్కు నీరు చేరింది. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టులలో సమృద్ధిగా నీరు ఉంటోంది. నీరు లేకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది. వృథాగా సముద్రంలో కలిసే నీటిని సీమకు వాడుకుంటే తప్పేంటి? – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ, కడపసీమ ప్రజలు చంద్రబాబును క్షమించరురేవంత్రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. క్లోజ్డ్ రూమ్ మీటింగ్ ఒప్పందాలను బయట పెట్టాలి. పుట్టిన ప్రాంతానికి అన్యాయం చేసేలా కుట్రలు చేస్తున్న బాబును సీమ ప్రజలు క్షమించరు. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీఆ జీవో అమలు చేయలేదు2004లో సీఎం కాగానే సీమ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి వైఎస్సార్ రైతు బాంధవుడిగా నిలిచారు. తండ్రిని మించి..పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని జగన్ 80 వేల క్యూసెక్కులకు పెంచారు. సీమ లిఫ్ట్ చేపట్టి రోజుకు 3 టీఎంసీలను తరలించేలా పనులు చేపట్టారు. మిగిలిన పనులను బాబు నిలిపేశారు. శ్రీశైలం కనీస నీటిమట్టం జీవోను అమలు చేయాలని ఆయనను నేను కోరినా పట్టించుకోలేదు. – శిల్పాచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలంబాబు ఎప్పుడూ సీమకు మేలు చేయలేదు..రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైఎస్..పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు విస్తరించే పనులు చేపడితే దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు దీక్షలు చేయించారు. బాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి సీమకు మేలు చేయలేదు. పైగా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. – వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ, అనంతపురంరైతులు, ప్రాజెక్టుల గురించి బాబు ఆలోచించరుచంద్రబాబు ఏనాడూ రైతులు, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించరు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబుశ్రీశైలం నీటి వాటాను తెలంగాణకు తాకట్టు పెట్టాడు. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపడుతున్నా నోరు మెదపడం లేదు. – శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నంద్యాల‘సీమ ఎత్తిపోతల’తో ప్రయోజనం లేదుమంత్రి నిమ్మలసాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించేలా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని.. అందులో కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు దక్కేది 66 శాతం అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు. ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేÔ>లు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్జీటీ మళ్లీ విచారించి రూ.2.65 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చు వృథాగా జరిగినట్లు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వృథా అని అనడం లేదని కానీ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 కొత్త రిజర్వాయర్లు..గత ప్రభుత్వ హయాంలో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్ట్ (అంచనా వ్యయం రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముదివేడు రిజర్వాయర్ (అంచనా రూ.500 కోట్లు, ఖర్చు రూ.167.97 కోట్లు), నేటిగుంటపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.571 కోట్లు, ఖర్చు రూ.494 కోట్లు), ఆవులపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.482 కోట్లు, ఖర్చు రూ.28 కోట్లు) అనే 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారన్నారు. -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
‘భోగాపురం ఎయిర్పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్గారు, అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు.ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం కాలేదని, రోడ్ అలైన్మెంట్కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఏం మాట్లాడారంటే..:తప్పుదోవ పట్టిస్తున్న కూటమి నేతలు:ఉత్తరాంధ్ర ప్రజలను గత కొంతకాలంగా కూటమి నేతలు అబద్ధాలు, అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ జరిగిన సందర్భంగా, దీనంతటికీ తామే కారణమని చంద్రబాబు, లోకేష్ తదితరులు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది, అంతటితో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమే కాదు.జగన్ వల్లనే భోగాపురం ఎయిర్పోర్ట్:2019లో జగన్ సీఎం కాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్లారు. 2020లో ఎయిర్పోర్టు నిర్మాణ ఒప్పందాలు, 2021లో భూసేకరణ ప్రారంభం, 2022లో ఎన్వోసీలు, 2023 జనవరిలో భూసేకరణ పూర్తి చేసి, అదే ఏడాది మే 3న పనులు ప్రారంభించారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని అప్పుడే టైమ్ ఫ్రేమ్ ఇచ్చారు. పనుల్లో జీఎంఆర్ సంస్థ కూడా ఎక్కడా అలక్ష్యం చూపలేదు. మరోవైపు జగన్ చొరవతో వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డు సహా, అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు.ఎయిర్పోర్టుకు రోడ్ కనెక్టివిటి ఏదీ?:ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామని చెప్పుకుంటూ, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, నిజానికి నాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాఖ నుంచి ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో విశాఖ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు పక్కా రోడ్ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరి దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఏం సమాధానం చెబుతారు?.ఇప్పుడు విశాఖ, భోగాపురం మధ్య ఒక్క రోడ్డు మాత్రమే ఉండగా, ఆనందపురం జంక్షన్లో తీవ్ర ట్రాఫిక్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, డీపీఆర్, అలైన్మెంట్ ఇప్పటివరకు సిద్ధం కాలేదు. అనుమతులూ తీసుకోలేదు. అయినా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కెకె రాజు దుయ్యబట్టారు. -
Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు
-
NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు
-
Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం
-
ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
-
YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..
-
ఇవాళ మంగళవారం.. దేశంలోకెల్లా ఏపీ సరికొత్త రికార్డు!
సాక్షి, అమరావతి: ఇవాళ మంగళవారం. షరా మామూలుగా కూటమి సర్కార్ చేయాల్సింది చేసింది. అయితే తాజా అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తిరగకుండానే.. ఏపీ అప్పు రూ.3 లక్షల కోట్లకు చేరింది. వారం కిందటే రూ.4 వేల కోట్ల అప్పు చేసిన బాబు సర్కార్(డిసెంబర్ 31 నాటికి 2,93,269 కోట్ల అప్పులు).. ఇవాళ మరో రూ.6,500 కోట్ల అప్పు తెచ్చింది. తద్వారా అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ, అత్యధిక అప్పులు చేస్తోన్న సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. వీటిల్లో.. బడ్జెటరీ అప్పులు రూ. 1,71,637 కోట్లు కాగా, . బడ్జెట్ బయట అప్పులు రూ.1,27,632 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.81,597 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.77,040 కోట్లుగా ఉంది. ఆ అప్పుల చిట్టాను ఓసారి పరిశీలిస్తే.. డిసెంబర్లో.. డిసెంబర్ 2న తెచ్చిన అప్పులు రూ.3,000 కోట్లుడిసెంబర్ 30న తెచ్చిన అప్పు రూ.4,000 కోట్లుజనవరి 6న తెచ్చిన అప్పు రూ.6,500 కోట్లుబడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా రూ.80,245 కోట్లు అప్పుఏపీ మార్క్ ఫెడ్ 19,900 కోట్లుజలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లుఏపీఎండీసీ 9,000 కోట్లుఏపీఐఐసీ 8,500 కోట్లుపౌరసరఫరాల సంస్థ 7,000 కోట్లుఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లుఏపీ బెవరేజస్ కార్పొరేషన్ (బాండ్లు) 5,750 కోట్లుఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్ పి డిసి ఎల్ 5,473 కోట్లునాబార్డు నుండి డిస్కమ్స్ 3,762 కోట్లుఎస్ బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లుబ్యాంకుల నుండి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లుఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లుఅమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులుప్రపంచ బ్యాంకు, ఎడిబి ద్వారా 15,000 కోట్లుహడ్కో ద్వారా అప్పు 11,000 కోట్లుఎన్ ఏ బి ఎఫ్ డి ద్వారా 7,500 కోట్లునాబార్డు ద్వారా అప్పు 7,387 కోట్లుకే ఎఫ్ డబ్ల్యూ అప్పు 5,000 కోట్లుఏ పీపీ ఎఫ్ సీఎల్ 1500 కోట్లుజగన్ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారంగత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లప్పులు చేసిందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లుగా చెప్పారు. చివరాఖరికి.. జగన్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3,39,580 కోట్లు మాత్రమేనని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని స్వయంగా ఆర్థిక మంతత్రి పయ్యావుల అసెంబ్లీలో చేసిన ప్రకటన బాబు దుర్మార్గమైన ప్రచారాన్ని బద్ధలు కొట్టింది. -
తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. ఒక్క మాటతో బాబు చాప్టర్ క్లోజ్
-
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: వైఎస్సార్సీపీ
సాక్షి, నంద్యాల జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ను వైఎస్సార్సీపీ నేతలు సందర్శించారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతరెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, సమన్వయ కర్త దారా సుధీర్ పరిశీలించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది వైఎస్ జగన్ కల.. 2020లో రాయలసీమ ఎత్తిపోతలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. రూ.3,207 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టారు. చీకటి ఒప్పందం చేసుకునే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీమకు చంద్రగ్రహణం లోక్ సభలో అవినాష్ రెడ్డి ఫైర్
-
‘మా ప్రభుత్వం వస్తే అధికారులు పదింతలు చెల్లించుకుంటారు’
సాక్షి,నెల్లూరు: చంద్రబాబు,లోకేష్కు అధికారులు భజన బ్యాచ్లా తయారయ్యారు. మా ప్రభుత్వం వచ్చాక అధికారులు పదింతలు చెల్లించుకుంటారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించారు.అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతలు తన్నుకుని హత్యలు చేస్తున్నారు. ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ భోజనం పెట్టడం లేదు. గుర్తుంచుకోండి తిరిగి మా ప్రభుత్వం వచ్చాక అన్నీ తిరిగి ఇస్తాము. అధికారులు నేతలకు, లోకేష్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేడు రాష్ట్రంలో గంజాయి, మహిళలపై దాడి, హత్యా రాజకీయాలు చేస్తుంది టీడీపీ. రాష్ట్ర పరువును గంగపాలు చేశారు. సంపద అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. నేటితో 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. అభివృద్ధి శూన్యం, సంక్షేమం జీరో. తాజాగా రాయలసీమ ప్రాంత వాసులకు వెన్నుపోటు పొడిచాడు. రాయలసీమ కరువు పరిష్కారం అయిన లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపివేయించాను అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో చంద్రబాబు ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈ ఘోరానికి ఒడిగట్టాడు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారు. బోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరిగి దిగారు.ఎన్నికలకు ముందు రాయి వేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. స్వయంగా జీఎంఆర్ కంపెనీ తెలిపింది వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం జరుగుతుంది అని..2019లో కుప్పంలో ఎయిర్ పోర్టుకు చంద్రబాబు వేసిన రాయి సంగతి చూడండి. రామ్మోహన్ నాయుడు మైకుల ముందు హీరో.. చేసేది అంతా జీరో. పిన్నెల్లి రామకృష్టారెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సూచించారు. -
KSR LIVE Show : అవసరానికో వేషం బాబాలను మించిపోయిన బాబులు
-
చంద్రబాబు ప్రతినెలా అప్పులు చేస్తున్నారు: వెంకయ్యనాయుడు
-
సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం.. ఇదిగో సాక్ష్యం
-
పవన్కి మొరపెట్టుకున్నా..! బ్లోఅవుట్ వెనుక అనుమానాలు
-
రేవంత్ మాట.. బాబు గుట్టు!
కాలం కలిసిరాకపోతే తాడే పామవుతుందట. పాపం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిప్పుడు ఈ సామెతను పదే పదే తలచుకుంటూ ఉండి ఉంటారు. ఎందుకంటే... పోతిరెడ్డిపాడు వద్ద గత ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన కోరిక మీద చంద్రబాబు నిలిపివేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఆ రాష్ట్ర శాసనసభలోనే ప్రకటించారు. కావాలని చెప్పారో, క్రెడిట్ కోసం చెప్పారో, అనుకోకుండా చెప్పేశారో తెలియదు కాని... ఈ నిజం కాస్తా చంద్రబాబు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేసింది. తెలంగాణ ప్రజల మెప్పు కోసం లేదంటే బీఆర్ఎస్పై పైచేయి కోసం రేవంత్ అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడంతో చంద్రబాబు కాస్తా రాయలసీమ ద్రోహిగా ముద్రపడిపోయారు. రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృథా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని నమ్మిన గత ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వరద వచ్చినప్పుడు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీనిపై తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు అప్పట్లోనే విమర్శలు చేసినా జగన్ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. తమకు కేటాయించిన నీటిలోనే తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు వాడుకుంటే మంచిది కదా అని వాదించేవారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నట్లే తాము కూడా అదే 800 అడుగుల నీటి మట్టం వద్ద నీటిని తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించేవారు.నిజానికి పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టమేమీ ఉండదన్నది నిపుణుల అభిప్రాయం.కాకపోతే నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పడినట్లు ఈ స్కీమ్ను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందన్నది తెలంగాణ అభ్యంతరం. అయినా ఏ రాష్ట్రం అయినా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అదే రీతిలో జగన్ రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఆ తరుణంలో రేవంత్ రెడ్డే అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమందితో ఎన్జీటీకి ఫిర్యాదు చేయించారని అనేవారు. టీడీపీ అనుకూలంగా ఉన్నవారే ఈ స్కీమ్పై ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ వచ్చేది. ఏడువేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా తాగు నీటి అవసరాల పేరుతో ఈ స్కీమును కొనసాగించారు. దాదాపు 85 శాతం పనులు పూర్తి చేయించారు. అంతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి, టీడీసీ. జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ కు గ్రహణం పట్టినట్లయింది. కేంద్రంలో కూడా ఇదే కూటమి పాలిస్తున్న నేపథ్యంలో స్కీమ్ను కొనసాగించి ఉంటే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. కాని ఆ పని చేయకపోగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. పర్యావరణానికి సంబందించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించలేదని ఫలితంగా అనుమతులు రాలేదని, దానివల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లోక్సభలోనే చెప్పారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం అలా చేసిందన్నదానికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. రేవంత్, చంద్రబాబులు ఏకాంతంగా భేటీ అయి తీసుకున్న నిర్ణయమట. తనమీద గౌరవంతో చంద్రబాబు ఈ పని చేశారని రేవంత్ చెప్పారు. ఇది రేవంత్ మీద గౌరవంగా చూడాలా? లేక రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది కొరవడడంగా చూడాలా? అందరూ వీరిద్దరి సంబంధంగా చూస్తారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో టీడీపీ తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. రేవంత్ను కాంగ్రెస్ లోకి పంపడం మొదలు, ఆయన ముఖ్యమంత్రి అవడం వరకు చంద్రబాబు పాత్ర ఉందని చాలామంది చెబుతుంటారు. తాజాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో సైతం తెలుగుదేశం పార్టీ మాత్రం తన మిత్రపక్షమైన బీజేపీకి కాకుండా కాంగ్రెస్కే అనుకూలంగా పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. రాజకీయంగా ఇంతగా కలిసిపోయిన చంద్రబాబు, రేవంత్లు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తే ఫర్వాలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ప్రభుత్వం నడుస్తోందని అనుకునేవారు. తాజాగా ఈ రేవంత్ ఈ సమాచారం వెల్లడించడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ చెప్పినట్లు ఏపీలో చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన కలుగుతుంది. అందులో ఇది ఒకటి. కాకపోతే ఈ రహస్యం రేవంత్ చెప్పేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. దీనివల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రేవంత్ ఈ గుట్టు విప్పడం విశేషం. ఏపీ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపేయడం వెనుక కారణాలేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుందని ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు ఈ అంశంలో చంద్రబాబు తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. కొందరైతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, రేవంత్కు 2009 నుంచి సంబంద బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.అయినా చంద్రబాబు ఆ కేసులో ఇబ్బంది పడకుండా రేవంత్ సహకరించారని చెబుతారు. అప్పటి నుంచి వీరి మధ్య దోస్తి బాగా కుదిరిందని రాజకీయవర్గాలు నమ్ముతాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నాయి. కారణం ఏమైనా చంద్రబాబు ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడానికి కూడా సిద్దపడడంం దారుణమనిపిస్తుంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు జవాబు ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ ఒక విజన్తో రాయలసీమ అభివృద్దికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం ఎంతసేపు రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారన్న విషయం మరోసారి తేటతెల్లమవుతుంది. పైకి మాత్రం రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెబుతుంటారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఇరిగేషన్ స్కీమ్ తీసుకురాలేదు. ఉన్నవాటిని పూర్తి చేయలేదు. ఎన్నికల సమయాలలో మాత్రం శంకుస్థాపనల హడావుడి చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు ఇలాగే పలు స్కీమ్లకు శంకుస్థాపనలు చేసి పట్టించుకోకపోతే అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2002 ప్రాంతంలో శిలాఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చి నిరసన తెలిపారు. తదుపరి తాను సీఎం అయ్యాక ఆయన చేపట్టిన తొలి కార్యక్రమం జలయజ్ఞం. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వివిద ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఈ దశకు రావడానికి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్ధ్యం 44వేల క్యూసెక్కులకు పెంచడానికి పనులు ఆరంభిస్తే తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన తెలిపింది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు వారినెవరిని వారించ లేదు. తదుపరి జగన్ ముఖ్యమంత్రి అయి తీసుకువచ్చిన రాయలసీమ లిఫ్ట్కు చంద్రబాబే నిలిపివేశారంటే ఏమనుకోవాలి. ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు నీటిని మసర్ధంగా వాడుకోవాలని అంటూంటారే ఎందుకు చెబుతున్నారా అన్న సందేహం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం బోధపడినట్లయింది. తెలంగాణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ఒక సంగతి అయితే, ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు మంగళం పలకడం మరో ఎత్తు. గోదావరి-బనకచర్ల స్కీమ్ అని కొన్నాళ్లు హడావుడి చేశారు. దాంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని భ్రమలు పెట్టడానికి యత్నించారు.తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించగానే, దానిని మానుకుని ఇప్పుడు గోదావరి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు అంటూ కొత్త గాత్రం అందుకున్నారు. ఇది కూడా సుమారు అరవైవేల కోట్ల ప్రాజెక్టు అట. ఇది ఎప్పుడు ఆరంభం అవుతుందో, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం తెలిపింది.నిజానికి ఈ భారీ స్కీమ్ లపై చంద్రబాబుకు నమ్మకం ఉండి చేపడుతున్నారని చెప్పజాలం.కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఇతరత్రా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుంటారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబుకు గతంలో అసలు భారీ నీటి ప్రాజెక్టులంటే పెద్దగా నమ్మకం లేదు. ఎన్నికలలో అవి ఫలితాలు ఇవ్వవన్నది ఆయన భావన. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న దివంగత నేతలు ఎర్రా నారాయణస్వామి, వడ్డి వీరభద్రరావు వంటి వారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకోసం ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు మాత్రం కిమ్మనే వారు కారు. వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు సాకారం అవడం ఆరంభం అయింది. ఏది ఏమైనా రాయలసీమ ప్రజలకు రేవంత్ చెప్పిన విషయం పిడుగుపాటు వంటిది.అదే టైమ్ లో టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్న సంగతి నిర్దారణ అవుతుంది.ఈ కూటమిని రాయలసీమ ప్రజలు ఇంకా క్షమిస్తారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
-
భోగాపురం ఎయిర్పోర్టు ఘనత ముమ్మాటికీ జగన్దే
మహారాణిపేట: భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్దేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సోమవారం మద్దిల పాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్టు నిర్మాణంలో చంద్రబాబు కంట్రిబ్యూషన్ ఏమీలేదని విమర్శించారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా భోగాపురం క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు.భూసేకరణ, అనుమతులు, ఆర్థిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేద్దామని అప్పట్లో బాబు శంకుస్థాపన చేశారో తెలీదని విమర్శించారు. 2019లో వైఎస్ జగన్ హయాంలోనే ఎయిర్పోర్టు కోసం భూసేకరణతోపాటు అన్ని అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదేరోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. అందులో భాగమే ఆదివారం జరిగిన విమాన ల్యాండింగ్ ట్రయల్ రన్ అని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదే జగన్ విజన్కి తార్కాణమన్నారు. నిర్వాసితులకూ వైఎస్సార్సీపీ హయాంలో న్యాయం చేస్తూ.. నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండుచోట్ల కాలనీలు నిరి్మంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో జగన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రీల్స్ రామ్మోహన్ను పంపిస్తే ఆయనేమో తన ఘనతగా తాను సాధించినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు. విజయవాడ విమానాశ్రయాన్ని ఏళ్లతరబడి కడుతున్నారని, మరి దానిని రామ్మోహన్నాయుడు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకోవడం వారికి అలవాటు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కుప్పంలో ఎయిర్ పోర్టు మాటేమిటి? ‘అమరావతిలో కొత్తగా ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్ నిరి్మస్తామని బాబు అంటున్నారు. ఇంకా వింటే పోర్టు కూడా కడతామని చెబుతారు. మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. అది ప్రారంభమైందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి హాజరైన కేంద్రమంత్రి గడ్కరీని ఒప్పించి ప్రకటన చేయించాం. ఈ ఘనత జగన్కే దక్కుతుంది. భోగాపురం విమానాశ్రయానికి ఆరులేన్ల జాతీయ రహదారి ఏమైపోయింది.బాబు అధికారంలోకి రాగానే మెట్రో, పోర్టు, ఎయిర్పోర్టు అని చెప్పడం పరిపాటిగా మారింది. విశాఖ మెట్రో గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫీజుబులిటీ రిపోర్ట్ లేదు, మరోసారి పంపించాలని చెప్పింది. దీన్నే చంద్రబాబు 2029 ఎన్నికల వరకు తిప్పి.. ఎన్నికల ముందు టెంకాయ కొడతారు. అమరావతిలో మాత్రం ఆవకాయ్ అంటారు. ఏ ప్రాజెక్టుకైనా ముందు టెంకాయ్ నాదే అనడం బాబు అలవాటు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ్.. ఆంధ్రాకు అప్పులు, చంద్రబాబు గొప్పలు తప్ప ఇంతకుమించి ఈ రెండేళ్లలో సాధించిందేమీ లేదు’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు. విజన్ అంటే జగన్.. భజన అంటే బాబు‘విజన్ అంటే జగన్, భజన అంటే చంద్రబాబు అన్న విషయం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పబ్లిసిటీ తప్ప మరోకటి లేదు. ఏ చానెల్ పెట్టినా బాబుకు జాకీర్ హుస్సేన్ని మించి తబలా కొట్టేవాళ్లు తయారు అయ్యారు. ఇంత డప్పు కొట్టినా.. రాష్ట్రం మాత్రం అప్పులపాలైంది. రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ రోజు జగన్కి ఇచ్చిన మాట ప్రకారం జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాంత ప్రజల ఆశలను నిజం చేసింది. ఆ సంస్థకు ధన్యవాదాలు’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. -
జగన్ శ్రమ ఫలితమే ‘భోగాపురం’
చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర అంతా అసత్యాలు, బురిడీ, మాయమాటలు చెప్పటమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టం, ఆలోచన, శ్రమతోనే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు కట్టారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు ట్రైల్ రన్ అనంతరం ప్రెస్ మీట్లో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రామ్మోహన్నాయుడు దేశం మొత్తం సిగ్గుపడి తలవంచుకునేలా ఇండిగో వ్యవహారంలో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టుకు, చంద్రబాబుకు ఏం సంబంధం? అని సూటిగా ప్రశి్నంచారు. సోమవారం మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు 15 వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్పోర్టు నిరి్మస్తామంటూ మభ్యపుచ్చి, చివరకు ఒక ఎకరా కూడా చేతికి రాకుండానే గతంలో అధికారంలో ఉండగా ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 14వ తేదీన రాయి వేశారు. ఇదే రీతిలో డ్రామాలాడుతూ బందరు పోర్టుకు 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్ పటిష్ట ప్రణాళికా, చర్యలతో ఏడాదిలో బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో అది కూడా తామే కట్టామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు.నిజానికి గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2,200 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో భూసేకరణ పూర్తి చేశారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నగదు చెల్లించి వారికి కాలనీలు కూడా ఏర్పాటు చేసిన తరువాతే 2023లో శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఆరు లేన్ల రహదారి ఎన్హెచ్–16ని కలిపే విధంగా నిరి్మంచాలని, అందుకు రూ.6,600 కోట్లు మంజూరు చేయాలని ఆ సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరి అందుకు ఒప్పించారు. ⇒ భోగాపురం ఎయిర్పోర్టును తామే నిరి్మంచామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అదే నిజమైతే 18 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్టు నిర్మాణం ఎలా సాధ్యం? ఎవరో చేసిన పనులను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేయడమే చంద్రబాబు నైజం. తాము తీసుకువచ్చిన పరిశ్రమలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో వెళ్లిపోయాయని చంద్రబాబు, లోకేశ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అలాగైతే భోగాపురం ఎయిర్పోర్టు ఎందుకు వెళ్లలేదు? ⇒ రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహిస్తామని చంద్రబాబు సర్కారు చెబుతున్నా టెండర్లు ఎందుకు రావట్లేదు? ఆదోని మెడికల్ కళాశాలకు టెండరు వచ్చిందని, కిమ్స్ హాస్పటల్ మేనేజ్మెంట్ దాన్ని దాఖలు చేసిందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. అయితే కిమ్స్ ఆస్పత్రి ప్రతినిధులు తాము ఆ టెండరు వేయలేదని చెప్పారు. దీనిపై విలేకరులు మంత్రి సత్యకుమార్యాదవ్ను ప్రశ్నిస్తే.. ఆసుపత్రి నిర్వాహకుడు ప్రేమ్చంద్ షా దాఖలు చేశారని చెబుతున్నారు. నిజానికి దేశంలోని 26 కిమ్స్ ఆస్పత్రుల్లో ప్రేమ్చంద్ షా పేరుతో గుండె వైద్యనిపుణులు ఎవరూ లేరని మా పరిశీలనలో తేలింది. మరి ప్రేమ్చంద్ షా ఎవరు? ఆయన టెండరు వేసినట్లు, ఆయనెవరో ఆధారాలతో చెప్పే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? ⇒ ఎన్నికల ముందు రూ.15 వేలు ఫీజుతోనే మెడికల్ విద్య సీట్లు కళాశాలల ద్వారా అందుబాటులోకి తెస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమ్మకానికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. మాయమాటలు చెప్పటం ఆయనకు అలవాటైపోయింది. ప్రభుత్వ వైద్యం బాగోదని.. ప్రైవేటు వైద్యం మాత్రమే బాగుంటుందని చెప్పిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా? ⇒ తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని, ప్రతి ఇంటి నుంచి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో కరెంట్ మీటర్లు పెడితే బద్దలు కొడతామని అన్న తండ్రీ, కుమారుడు ఇప్పుడు అవే మీటర్లు బిగిస్తున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం ఏకంగా రూ.10 వేలకు పెంచి ఇస్తామని నమ్మబలికి చివరకు ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకటి రెండు నెలలు మినహా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు వేయటం లేదు? సీపీఎస్ను రద్దు చేస్తామన్న వాగ్దానం ఏమైంది? డీఏ, ఎరియర్స్ ఇవ్వకపోగా పీఆర్సీ కమిషన్ను కూడా నియమించలేదు. ఐఆర్ కూడా ప్రకటించకుండా గోరుచుట్టు మీద రోకటి పోటులా ఉపాధ్యాయులకు ‘టెట్’ పెడుతున్నారు. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్లు సంవత్సరానికి మూడుసార్లు చెల్లించాల్సి ఉండగా, గత ప్రభుత్వంలో నిల్వ ఉంచిన సొమ్ము మినహా 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. హోంగార్డులకు జగన్మోహన్రెడ్డి హయాంలో జీతం పెంచారు. ఆ తరువాత మీరు ఒక్క రూపాయి అయిన జీతం పెంచారా? ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ కునారిల్లుతోందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వ్యాఖ్యానించటం నిజం కాదా? పోలీసులు కూడా ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది. ⇒ వైఎస్ జగన్ తన కుమార్తె వద్దకు లండన్ వెళితే రూ.12 కోట్లు ఖర్చు చేశారని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, లోకేశ్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బాలి, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లి తిరిగి రావడానికి ఎంత ఖర్చు అవుతోంది? పోలీసులకు పెట్రోల్ ఖర్చులు ఇవ్వలేని వారు వీటికి రూ.కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చేసిన దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. ఎవరో చేసిన పని తన ఖాతాలో వేసుకుని, తానే చేసినట్లుగా గొప్పలు చెప్పుకోవటం మానుకుని ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించటంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ⇒ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా, తలకిందులుగా తపస్సు చేసినా.. జనబలం, గుండెబలం ఉన్న జగన్ను ఏమీ చేయలేరు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ను ప్రజలంతా తమవాడిగా, ఇంట్లో మనిíÙగా గెలిపించుకోవటం ఖాయం. ⇒ చంద్రబాబు ప్రభుత్వం పలు సంస్థల పేరుతో వేల ఎకరాలు కేటాయింపులు చేస్తున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా స్థాపించకపోవటం ప్రజలను మోసం చేయటమే. సింగపూర్లా అమరావతి నిర్మాణం చేస్తామని ప్రభుత్వ పెద్దలు మాయమాటలు చెబుతున్నారు. మంత్రి నారాయణ మాత్రం రోజూ తుమ్మ చెట్లు నరుకుతున్నామని చెప్పటం మినహా ఇంతవరకు చేసిందేమీ లేదు.⇒ విదేశాల నుంచి తీసుకువచ్చిన ప్రతినిధులతో సమ్మిట్లు నిర్వహించి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. హోటళ్లలో వంటవారిని తీసుకొచ్చి సూటు బూటు వేస్తున్నారని తెలంగాణ మాజీ సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధపడటం విడ్డూరంగా ఉంది. -
‘ఎత్తిపోతా’రు తస్మాత్ జాగ్రత్త
తిరుపతి అర్బన్/చంద్రగిరి: తెలుగు రాష్ట్రాల సీఎంలు, గురుశిష్యులు సీమను ఎడారిగా మార్చడానికి చీకటి ఒప్పందాలకు తెగబడ్డారని కర్షకులు కన్నెర్రజేశారు. చంద్రబాబు సర్కారుపై భగ్గుమన్నారు. ఎత్తిపోతారు తస్మాత్ జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల రక్షణలో భాగంగా రైతులు సోమవారం ఉద్యమబాట పట్టారు. సోమవారం తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డెక్కారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద బైఠాయించి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు అండగా రాయలసీమ ఉద్యమకారుడు, శ్వేత మాజీ డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మద్దతుగా నిలిచారు.‘చంద్రబాబు నోరు విప్పు–సీమ ప్రజలకు సమాధానం చెప్పు’ అనే నినాదంతో తిరుపతి కలెక్టరేట్ వద్ద నల్ల చొక్కాలు ధరించి, ఖాళీ బిందెలను చేతపట్టుకుని నిరసన గళం వినిపించారు. ప్లకార్డులతో సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శిష్యుడు రేవంత్రెడ్డి మీకు వెన్నుపోటు పొడిచారా...? లేదా ఇద్దరూ కలసి సీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారో స్పష్టంగా ప్రజలకు చెప్పాలంటూ నినదించారు.ఆ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తడంతో పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. జులుం ప్రదర్శించారు. మహిళలపైనా దురుసుగా ప్రవర్తించారు. లాగిపక్కన పడేశారు. ఈ సందర్భంగా జై జగన్... నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్స్టేషన్కు తరలించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. సీమ ద్రోహి సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి సీఎం చంద్రబాబు... అంటూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, రాయలసీమ ఉద్యమకారుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి మండిపడ్డారు. సైంధవుడు వలే చంద్రబాబు సీమ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంల చీకటి ఒప్పందాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్రాయలసీమ–ఎత్తిపోతల పథకానికి రూ.7వేల కోట్లు కేటాయింపులు చేసి శ్రీశైలం, తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని అందించాలని సంకల్పించారని గుర్తుచేశారు.ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవం పోస్తుందని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు లేకపోవడంతోనే మదనపల్లె, తంబళ్లపల్లి, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి పుణెకు రైతులు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని పేరుతో అమరావతి భూములు లాక్కున్నట్లుగా ప్రాజెక్టులను తెలంగాణకు దోచిపెట్టి సీమను ఎడారిగా మార్చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీమకు అన్యాయం చేస్తుంటే ఊరుకోబోమని, రైతుల్లో రగిలిన చైతన్యస్ఫూర్తితో మహోద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా..? : ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రజల హక్కులను కాపాడేందుకు శాంతియుత నిరసన చేస్తున్న ఉద్యమకారులను అడ్డుకోవడమే కాకుండా, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద భూమన అభినయ్రెడ్డితోపాటు రైతులను పోలీçÜులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న గురుమూర్తి వెంటనే తిరుచానూరు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు.పోలీసుల అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే అభినయ్రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం తిరుచానూరు పోలీసులు భూమన అభినయ్తోపాటు 29మందిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. సాక్షి ఫొటోగ్రాఫర్పై పోలీసుల దౌర్జన్యం విధినిర్వహణలో భాగంగా రైతుల శాంతియుత నిరసన, ఉద్యమకారుల అక్రమ అరెస్టులకు సంబంధించిన ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మోహన్కృష్ణపై మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ వద్ద మెడపట్టి బయటకు లాగేశారు. దీంతో మోహన్కృష్ణ, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఆగ్రహించిన సీఐ సునీల్కుమార్ స్టేషన్లో ఉన్న ఫొటోగ్రాఫర్ను నెట్టుకుంటూ వచ్చి బయటకు తోసేశారు.ఆపై డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో మోహన్కృష్ణను పోలీసులు స్టేషన్లో రెండు గంటలకుపైగా నిర్బంధించారు. సమాచారం అందుకున్న జర్నలిస్టు సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు చేరుకుని డీఎస్పీతో మాట్లాడారు. పోలీసు చర్యలను ఖండించారు. ఫలితం లేకపోవడంతో విషయాన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఎస్పీ దృష్టికీ తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఫొటోగ్రాఫర్ను విడిచిపెట్టారు. -
రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు
సాక్షి, అమరావతి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’’ అని అన్నారు.‘‘ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం... ఎంపీపీ ఎన్నికలో వారిని ఓటు వేయకుండా ఆపడమే.ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో... పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. మౌన ప్రేక్షకుల్లా ఎన్నికల అధికారులు ‘‘రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల కిడ్నాప్, వారిపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వీనియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారింది అన్న విషయాన్ని చాటుతోంది’’ అని జగన్ అన్నారు. -
సీమ ఎత్తిపోతలకు చంద్ర ‘గ్రహణం’.. !
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ.. తడారిన గొంతులు తడిపేందుకు.. తెలుగుగంగ, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ) కింద 9.6 లక్షల ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’ పట్టుకుంది! ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్ 5న.. 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. దాని పర్యవసానంగానే గతేడాది ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్సభలో గతేడాది మార్చి 19న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రస్తావించి చంద్రబాబు సర్కార్ తీరును కడిగిపారేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్తో కేసు.. ఓటుకు కోట్లు కేసు భయంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టడంతో 2014–19 మధ్య ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని తడారిన గొంతులను తడపడం, ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను రూ.3,707.06 కోట్ల వ్యయంతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీ (చెన్నై బెంచ్) లో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ, పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు గత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. 22.54 శాతం పనులు పూర్తి చేశారు. చీకటి ఒప్పందంతో పనులు నిలిపివేతసీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీన్ని బట్టి తెలంగాణలో రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను మళ్లీ తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. ఈ చీకటి ఒప్పందం కుదరడం వల్లే.. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ కావాలనే ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిచిపోవడానికి పర్యావరణ అనుమతి రాలేదనే సాకులు చూపడానికే చంద్రబాబు సర్కార్ ఈఏసీకి వివరాలు అందజేయలేదని స్పష్టం చేస్తున్నారు. -
చంద్రబాబు అప్పులపై వెంకయ్యనాయుడు హాట్ కామెంట్స్!
సాక్షి,అమరావతి: చంద్రబాబు చేస్తున్న అప్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ‘చంద్రబాబు ప్రతినెలా చేస్తున్న అప్పులు సీఎం కట్టాలా? మంత్రులు కట్టాలా? ఆర్ధిక శాఖ కట్టాలా?.ఈ అప్పులన్నీ ప్రజలే కట్టాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి. విద్య,వైద్యం ఉచితంగా అందించాలి. నిరుపేదలకు మాత్రమే ఉచిత బస్సు సదుపాయం కల్పించాలి. మిగిలిన వారికి రద్దు చేయాలి’అని పిలుపు నిచ్చారు. -
ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి దౌర్జన్యం.. వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ఎంపీపీ ఉప ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం దౌర్జన్యం. ఒక చిన్న ఎంపీపీ ఉప ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది.‘ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలంలో, ఎంపీపీ ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న మా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం, ఆ ఎంపీపీ ఉప ఎన్నికలో వారు ఓటు వేయకుండా ఆపడమే. అలా ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. తద్వారా ప్రజల గొంతును అణచి వేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో, పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో విఫలమవుతున్నారు’.Even in a small MPP election, the way democracy is being brutally murdered exposes the extreme high-handedness of the TDP and the dangerous nature of the coalition government led by @ncbn, who has reduced elections to a show of force instead of a democratic process.In Udayagiri… pic.twitter.com/aVzxEkRijx— YS Jagan Mohan Reddy (@ysjagan) January 5, 2026‘రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహల్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. మా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అలా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిల్చి, అక్కడ ఎంపీపీ ఉప ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’.‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. ఇంకా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఉప ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే, ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తోంది.. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారింది.. అన్న విషయాలను తేటతెల్లం చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. -
Bhogapuram Airport: ఏది కడితే అది నాదే...2029 వరకు ఇదే పాట
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు షో చేశారు
-
భోగాపురంలో రామ్మోహన్ షో.. బాబు తీరు అలా?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కృషితోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ ఆలోచన, కష్టంతోనే భోగాపురం ఎయిర్పోర్టు వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు తీరుతో భారత్ పరువు పోయిందని విమర్శించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురంలో ఎయిర్పోర్టులో ట్రయిల్ రన్ జరిగింది. విమానం రన్ వే మీద ఆగడం రామ్మోహన్ నాయుడు బిల్డప్ ఇచ్చాడు. హైదరాబాద్, భోగాపురంలో చంద్రబాబే ఎయిర్పోర్టులు కట్టారంటూ రామ్మోహన్ మాట్లాడుతున్నాడు. ఇండిగో అంశాల్లో భారతదేశం సిగ్గు పడుతుంది. ప్రపంచం ముందు భారత్ తలదించుకుంది. అది ఎవరి వల్లనో అందరూ గుర్తు పెట్టుకుంటారు.భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబుకి అసలు సంబంధం ఏంటి?. 2019 ఎన్నికల ముందు దిగిపోతూ శిలాఫలకం పెట్టాడు. ముందు 5 వేల ఎకరాలు అని.. తర్వాత 15వేల ఎకరాలు అని చంద్రబాబు అన్నాడు. ఒక్క ఎకరం కూడా భూమి తీసుకోకుండా శిలాఫలకం వేసి చంద్రబాబు దిగిపోయాడు. బందర్ పోర్టుకి 33వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చి 7వ తేదీ శంకుస్థాపన చేసారు. జగన్ రాకపోతే భోగాపురం ఎప్పటికీ మొదలయ్యేది కాదు. 2200 ఎకరాలు ఎయిర్పోర్టుకి చాలు అని.. భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చి.. కాలనీ నిర్మించి 2023లో శంకుస్థాపన చేశారు..జగన్ కష్టార్జితమే భోగాపురం.. అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్పోర్టు రైతుల త్యాగాలతో నిర్మాణం అవుతుందని.. 2026లో ప్రారంభం అవుతుందని వైఎస్ జగన్ చెప్పారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్పోర్టుకి 6600 కోట్లతో ఆరు వరుసల జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ ప్రకటించారు. 18 నెలల్లో భూ సేకరణ చేసి ఎయిర్పోర్ట్ కట్టగలరా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఎవరో చేసిన పని తన అకౌంట్లో వేసుకోవడం కూటమి నేతలు నేర్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా కట్టారు?. మీరు ఫొటోలు దిగే ఎయిర్పోర్టు జగన్ కష్టార్జితం. జగన్ మళ్ళీ రాడని, భూస్థాపితం చేశామని కూటమి నేతలు చెపుతున్నారు. మరి మెడికల్ కాలేజీకి ఎందుకు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అసమర్థ పాలన అని చెప్పుకునే మీకు అధికారంలో ఉండే అర్హత ఎక్కడ ఉంది?. చంద్రబాబు చెప్పిన సొల్లు మాటలు ఇవే. కరెంట్ ఛార్జీలు పెంచమని, ప్రతి ఇంటి నుండి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పాడు. మీటర్లు బద్దలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అదే మీటర్లు బిగిస్తున్నారు. వాలంటీర్లకి 10వేలు ఇస్తామని చెప్పారు.. వాలంటీర్లు లేకుండా చేశారు..మెడికల్ కాలేజీలు తీసుకోవాలని అనుకొనే వాళ్లను చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని జగన్ చెప్పాడు. ఎకరం భూమి రూపాయికి, ఆసుపత్రి ఫ్రీ.. రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా ముందుకు రాలేదు. టెండర్లు ఒక్కడు కూడా వేయలేదు. కానీ ఆదోనికి ఒక టెండర్ వచ్చిందని సంకలు గుద్దుకున్నారు. రెండు రోజుల్లోనే టెండర్ మేము వేయలేదని కిమ్స్ చెప్పింది. ప్రేమ్ చాంద్ షాకి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు సత్యకుమార్ ప్రకటించాడు. కిమ్స్ 26 ఆసుపత్రిలో ప్రేమ్ చాంద్ షా అనే వ్యక్తి లేడు. ఉన్నాడని ఆధారాలతో నిరూపించగలడా?. లక్ష కోట్లు ఆస్తులు దోచేస్తున్నారు..అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. నీళ్లు తోడం అని ప్రతీ మూడు నెలలకు నారాయణ చెపుతున్నారు. ప్లాట్స్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాటి సింగపూరు వాళ్ళు ఏమైపోయారు?. సింగపూర్ అమరావతి కట్టినట్లు ఉంది.. మెడికల్ కాలేజీల పరిస్థితి. నూతన సంవత్సర వేడుకలకు విదేశాలు పోతారు.. మీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?. పోలీస్ వాహనాలకు డీజిల్ ఇచ్చారా? ఒక్క పైసా కూడా నేటికి ఇవ్వలేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పింది. ఏదో ఒక రోజు పోలీసులు చంద్రబాబుపై సహాయ నిరాకరణ చేస్తారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమే. చంద్రబాబు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు.. వచ్చిన ఆదాయం ఏం చేశారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. -
Payakaraopet: హోంమంత్రి అనితకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ
-
కొబ్బరి కాయ కొట్టడం తప్ప.. నువ్వు చేసిందేమీ లేదు బాబూ
-
సూట్ కేసులతో.. రహస్యంగా విదేశాలకు?
-
Purushotham : చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే లేదంటే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే
-
SV Mohan: చంద్రబాబు 14 ఏళ్లలో సీమకు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన చేయలేదు
-
Vishweshwar: బాబు నిర్వాకం వల్ల సీమ ఎడారిగా మారుతుంది..?
-
Bukkacherla : అసెంబ్లీ సాక్షిగా బాబు బండారాన్ని బయటపెట్టిన రేవంత్ రెడ్డి..
-
రేవంత్ రెడ్డికి పన్నీరు, రాయలసీమకు కన్నీరు బాబును ఏకిపారేసిన భూమన
-
పట్టాభిషేకం పంచాయితీ కోసమేనా విదేశీ పర్యటన?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన సహజంగానే అనేక ప్రశ్నలకు తావిస్తుంది. పర్యటించరాదని కాదు కానీ గతంలో వీరిద్దరూ వైఎస్ జగన్ లండన్ టూర్పై పిచ్చి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరకు ఈ రహస్య పర్యటన కాస్తా చంద్రబాబును రాష్ట్ర ప్రజల దృష్టిలో అభాసుపాలు చేసింది. కొందరు చేసిన పాపాలు ఎక్కడకు పోతాయి అని వ్యాఖ్యానిస్తున్నారు కూడా. అధికారిక హోదాలో సీఎం లేదా మంత్రులెవరైనా విదేశీ పర్యటనకు వెళుతూంటే ముందుగానే టూల్ షెడ్యూల్ విడుదలవుతుంది. కొన్నిసార్లు ఈ పర్యటనల్లో ప్రభుత్వ అధికారులూ పాల్గొంటూంటారు. పర్యటన వ్యక్తిగతమైందైనా ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు, లోకేశ్ల టూర్ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉండవచ్చు కానీ.. వ్యక్తిగత పర్యటనైనప్పటికీ ఏపీ ప్రజానీకానికి తెలియచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు పెద్దగా విలువలేకుండాపోయిందని, చంద్రబాబు మరీ ముఖ్యంగా లోకేశ్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ గోప్యంగా వారం రోజుల విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో ఉన్నప్పటికీ టెలికాన్ఫరెన్స్ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దుతున్నారని ఎల్లోమీడియా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ.. ఎక్కడున్నారో మాత్రం చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్ తన కుతుళ్ల గ్రాడ్యుయేషన్ ఉత్సవాలకు లండన్ వెళితే చంద్రబాబు చేసిన విమర్శలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు. కన్న కూతుళ్లను చూడాలన్న అభిమానం పుట్టింది. ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. అక్కడ విమానం లాండింగ్ ఉండాలంటే విమానానికి గంటల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే దగ్గర, దగ్గర రూ.30 - 40 కోట్లు మీ డబ్బు ఖర్చు పెట్టి, కూతుళ్లను చూడడానికి వెళ్లాడు’’అని ఆరోపించారు. లోకేశ్ కూడా ‘‘రూ.12 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లాడు. హాలిడేకి వెళ్లాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళతాడు. లండన్ వెళ్లి ఎక్కడ పడుకుంటాడు అని నేను అడిగానా? ఏ హోటల్కు వెళ్లాడని నేను అడిగానా?’’ అంటూ అనుచిత భాష వాడారు. ఖర్చు విషయంలో చెరోమాట మాట్లాడటం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. వాస్తవం ఏమిటంటే అప్పట్లో జగన్ లండన్ వెళ్లింది తన సొంత డబ్బుతో. ప్రభుత్వ సొమ్ముతో కానేకాదు. కానీ ఆ టూర్ సమయంలో ఎడాపెడా తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు రహస్య టూర్ను సమర్థించుకోలేక నానా పాట్లు పడుతోంది. టీడీపీ సోషల్ మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అప్పట్లో నీచంగా ధంబ్ నెయిల్స్ పెట్టారు. ‘‘జగన్ ప్రత్యేక విమానంలో ఏమీ తీసుకువెళ్లారు?’’ ‘‘ఆ సూట్ కేసులలో ఏముంది? డబ్బు తరలించారా?’’ ‘‘మధ్యలో విమానం ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది?’’ ‘‘ఆ దీవుల్లో బ్లాక్ మనీ దాచుకోవచ్చని వెళ్లారా?’’ అంటూ ఇలా రకరకాలుగా కథనాలు వండి వార్చారు. మెయిన్ మీడియాలో సైతం ఈ అంశాలపై చర్చలు జరిపారు. జగన్కు ఎల్లో మీడియా వేసిన ప్రశ్నలన్నీ ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ లకు కూడా వర్తిస్తాయి కదా! వాటి గురించి మాట్లాడలేకపోయారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆరుసార్లు, లోకేశ్ తొమ్మిదిసార్లు విదేశీ యాత్రలు చేశారు. పెట్టుబడుల కోసం అని చెబుతున్నా, ఇంకేదో కారణం ఉంటుందన్నది పలువురి సందేహం. టీడీపీ విశ్లేషకులు ‘‘జగన్కు చెప్పి వెళ్లాలా? అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ.. ఆ తరువాత కానీ జగన్ సీబీఐ కోర్టు అనుమతితోనే టూర్ వెళ్లారు. లండన్ ఎయిర్ పోర్టులో వైసీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన వారు, అభిమానులు పలువురు ఆయనకు స్వాగతం చెప్పారు. కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాపరికం ఏదీ లేదు. అయినా ఎల్లో మీడియా ప్రజలలో అనుమానాలు వచ్చేలా పిచ్చి వార్తలు ప్రచారం చేసింది. వదంతులు సృష్టించడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఇప్పుడు పరిస్థితి చూడండి. కొత్త సంవత్సరం రావడానికి మూడు రోజుల ముందే లోకేశ్ విదేశీయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్లారు.వారెందుకు వెళ్లారు? అక్కడ ఏమి చేస్తున్నారో చెప్పలేని స్థితి. కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్లారని ప్రచారం జరిగింది. అదే నిజమైతే అమరావతి, ఏపీ, విశాఖ లేదా తిరుపతి వంటి నగరాలలో వేడుక చేసుకోకుండా విదేశాలకు వెళ్లడంపై విమర్శలు వస్తాయి. అయితే చంద్రబాబు, లోకేశ్లు లండన్ కే వెళ్లారా? సింగపూర్కు వెళ్లారా అన్నది తెలియదు. తనకు వెంటనే పట్టాభిషేకం జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని, అందుకే ఆ పంచాయతీ కోసం విదేశాలకు వెళ్లారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి విదేశాలకు వెళ్లారా అని మాజీ ఎమ్మెల్యే సుధాకర బాబు నిలదీశారు. సీఎం పదవి ఇవ్వలేదని అలిగి లోకేశ్ ముందే విదేశానికి వెళితే, అతనిని బుజ్జగించడానికి చంద్రబాబు వెళ్లారా అని మరో నేత నాగార్జున యాదవ్ అడిగారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లారా? లేక హెరిటేజ్ డబ్బుతో వెళ్లారా? అన్నది ఎందుకు చెప్పడం లేదని ఆయన అన్నారు. ఈ ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నది వేరే విషయం. జగన్ టూర్కు రూ.నలభై కోట్ల ఖర్చయి ఉంటుందని చంద్రబాబు ఆరోపించినందున, ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిన తమ టూర్కు అంతే ఖర్చు చేశారా? ఇంకా ఎక్కువ చేశారా? జగన్ను ఉద్దేశించి అప్పట్లో అనుచితంగా వ్యాఖ్యానించిన లోకేశ్కు కూడా ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవుతుంది కదా! గతంలో చంద్రబాబు, లోకేశ్లు ఎలాపడితే అలా అసభ్యంగా మాట్లాడితే, జగన్ మాత్రం ఆ విధంగా ప్రస్తావించకపోవడం సంస్కారయుతంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా చంద్రబాబు, లోకేశ్ల రహస్య విదేశీ యాత్ర వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కాని,తెలుగుదేశం పార్టీని,ఎల్లో మీడియాని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారా వ్యాఖ్యాత. -
చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత
-
డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!


