Chandrababu Naidu
-
ఏపీ కొత్త రాజధాని MAVIGUN!
-
కిలోమీటర్ కు 170 కోట్లా..కొంచమైనా సిగ్గుందా బాబు
-
అమరావతి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు.అమరావతి బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారుబీజేపీ మాట మార్చింది.. చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. అనంతరం, లోక్సభలో సమాజ్వాదీపార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..‘ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి, ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదు. విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేది. అమరావతి పేరుతో భారీ ఎత్తున రైతుల నుంచి భూమి తీసుకున్నారు. రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చారా?. రైతులకు న్యాయం జరగాలి’ అని అన్నారు. -
బాబు చేసే దోపిడీకి.. వీరప్పన్ కూడా సరిపోడు..
-
గోల్డ్ బిస్కెట్లతో కడుతున్నావా? బాబుపై జగన్ సెటైర్లే సెటైర్లు
-
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
దేశంలోనే అతిపెద్ద స్కాంకు, కరప్షన్ కు బాబు క్యాపిటల్
-
స్కామ్లు రాజధాని అమరావతి..చంద్రబాబు కష్టపడి సాధించిన ఘనత
-
బాబు అమరావతి అవినీతి చిట్టా.. విస్తుపోయే షాకింగ్ నిజాలను బయటపెట్టిన జగన్
-
దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు.. స్కామ్ల రాజధాని. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాసరే ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకు రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు. కాంట్రాక్టర్కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు. టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు. ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు. జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు. ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.ఐదు టవర్లకు చదరపు అడుగుకు రూ.14795 ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారు. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ రూ.615 కోట్లతో కట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం రూ.970 కోట్లతో కట్టారు. మళ్లీ అసెంబ్లీ అంటూ రూ.1149 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ హైకోర్టు అంటూ రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కామ్ల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలడం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వల నుంచి వరదల వరకు ప్రతీచోటా బాబు అవినీతి జరిగింది. కొండవీటి వాగు-వారధి వరకు ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 170 కోట్లా?. మా హయాంలో ఫ్లైఓవర్ల కోసం కిలోమీటర్కి రూ.35 కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో కి.మీకి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు’ అని అన్నారు. -
మీ కుటుంబాల అడ్రస్ చెప్పమంటావా.. బాబు, పవన్, లోకేష్ కు ఇచ్చిపడేసిన జగన్
-
ఫస్ట్ 50వేల ఎకరాలకే దిక్కు లేదు.. 3 మరో 50 వేల ఎకరాలు బాబు టార్గెట్ 2 లక్షల కోట్లు..
-
అడ్వాన్సుల పేరుతో 8 వేల కోట్లు సర్వనాశం చేశాడు..
-
మీ కుటుంబాలు అన్నీ ఎక్కడున్నాయో నన్ను చెప్పమంటావా చంద్రబాబు వైఎస్ జగన్ షాకింగ్ నిజాలు
-
లోకేష్, పవన్ ఇప్పటికీ షటిల్ సర్వీసులే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్కు షటిల్ సర్వీసే చేస్తున్నారు. పవన్, లోకేష్ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండటం లేదు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. -
రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని మీ మంత్రులే చెప్పారు.. ఇప్పుడేమో డ్రామాలు
-
LIVE: YS జగన్ కీలక ప్రెస్ మీట్
-
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
-
బతుకులతో బాబు చధరంగం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మోసాలపై మొక్కజొన్న రైతులు కన్నెర్రచేశారు. బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కారు. తమ బతుకులతో చంద్రబాబు చదరంగమాడుతున్నారంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్చేశారు. విజయవాడలోని ఏపీ మార్క్ఫెడ్ కార్యాలయాన్ని మంగళవారం మొక్కజొన్న రైతులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పొగాకు వేయొద్దన్నారని.. మొక్కజొన్న వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని, కొనేవారూ లేక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు పంటను కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు మొక్కజొన్న రైతులు క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య మాట్లాడుతూ బాబు పాలనలో ఉల్లి మొదలు టమాటా వరకు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి రైతులు నిండా మునిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. కనీసం రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కని పంటలను కొనాలని డిమాండ్ చేశారు. దళారుల మాటున కూటమి నేతలే రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, ఏపీæ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, పలు జిల్లాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ జీఎంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.రూ.1.25 లక్షలు నష్టపోతున్నా ఐదెకరాల్లో మినుము, ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా, 3 క్వింటాళ్లకు మించి రాలేదు. మొక్కజొన్న మాత్రం 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచి్చంది. మినుము మద్దతు ధర రూ.8,575 కాగా, మార్కెట్లో రూ.7వేలకు మించి కొనేవారు లేరు. క్వింటాకు రూ.1600కుపైగా నష్టపోయాను. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్లో రూ.1500–రూ.1700 మధ్య పలుకుతోంది. దీంతో ఐదెకరాలకు రూ.1.25 లక్షలు నష్టపోతున్నా. – ఎ.రాజశేఖర్, లింగాల, నంద్యాల జిల్లాపెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు ఐదెకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 30–35 క్వింటాళ్ల మధ్య దిగుబడులొచ్చాయి. మార్కెట్లో క్వింటా రూ.1600 నుంచి రూ.1700 మధ్య కొంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. – మద్దిరెడ్డి వెంకటరెడ్డి, అనుమల్లంక, గంపలగూడెం, ఎన్టీఆర్ జిల్లా -
చంద్రబాబు సర్కారు.. కిక్కు బాక్సింగ్
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.చివరి రోజు ఆపసోపాలుఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
అమరావతి నాటకం.. చట్టబద్ధత బూటకం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతిని కప్పిపుచ్చుకోవడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా రాజధాని అమరావతికి ‘చట్టబద్ధత’ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో మరో అంకానికి తెరతీశారు. శనివారం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014కు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇక రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరంటూ తనకు తానుగా ఛాంపియన్గా చిత్రీకరించుకోవడానికి సీఎం చంద్రబాబు సినీఫక్కీలో డైలాగ్లతో చెలరేగిపోయారు.కేంద్రానికి సంబంధం లేకపోయినా..రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర, సంబంధం ఉండదు. ఇదే అంశాన్ని తేల్చిచెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది. టీడీపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన తీర్మానం మేరకు.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరణ చేసే బిల్లును పార్లమెంటులో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టనుంది.భవిష్యత్లో రాష్ట్ర రాజధాని అమరావతికి బదులుగా మరో నగరాన్ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి పంపితే.. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అమరావతికి చట్టబద్ధత అంటూ సీఎం చంద్రబాబు ఆడుతున్నది నాటకం తప్ప దానికి ఎలాంటి ప్రామాణికత లేదని తేల్చిచెబుతున్నారు. ‘డబ్బుల్’ ధమాకా..రాజధాని ప్రాంతంలో 2015లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరకే చంద్రబాబు బినావీులు, వందిమాగధులు భారీఎత్తున భూములు కాజేశారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ«దాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నాబార్డు, హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు ఇప్పటికే రూ.47,387 కోట్ల రుణం తెచ్చారు. ఆ రుణంతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టారు. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారు. రెండో విడత భూ సమీకరణకు సిద్ధమై..రాజధాని 29 గ్రామాలు.. 53,748 ఎకరాలకు (217 చ.కి.మీ.) పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు వెరసి ఏడు గ్రామాల్లో రెండో విడత 20,494 ఎకరాల్లో (82.9 చ.కి.మీ.) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వాటితోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు(626.67 చ.కి.మీ.) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూములను స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో అస్మదీయులకు కట్టబెట్టి భారీగా కాజేయాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.దీన్ని గ్రహించే రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు రావడం లేదు. తొలి విడత 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అమరావతికి చట్టబద్ధత డ్రామాకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రంరాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లుకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
మదనపల్లె: నాలుగుసార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించిన చిత్తూరు జిల్లా ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని రైతులను ప్రశ్నించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ లిఫ్ట్ రౌండ్టేబుల్ సమావేశంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా గోదావరి జలాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం ద్వారా కృష్ణా జలాలు రాయలసీమ రైతులకు అందకుండా చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం తప్ప ప్రేమ లేదన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి 40 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకునేలా కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టుపెట్టి అన్యాయం చేస్తుంటే రైతులు చూస్తూ ఊరుకుంటే ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి రైతులు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందన్నారు. లిఫ్ట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని వీటిని స్వయంగా తాము పరిశీలించినట్టు చెప్పారు. మిగిలిన పనులు పూర్తయితే రాయలసీమకు సాగు కష్టాలు తీరుతాయన్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తరలించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని, ఈ విషయం అక్కడ ప్రజలే చెబుతున్నారని అన్నారు. రాయలసీమ నిధులను ఎవరబ్బ సొత్తని అమరావతి రాజధాని కోసం తరలిస్తున్నారని ప్రశ్నించారు. చదరపు అడుగు నిర్మాణ ధర రూ.6,500 ఉంటే.. ఏ ధరలు పెరిగాయని రూ.11,500 పెంచి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.సీమకు ప్రమాద ఘంటికలురాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు సాధన కో–ఆర్డినేటర్ సాకే శైలజానా«థ్ మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అల్మట్టితో 200 టీఎంసీలు నిలిచిపోతాయని, కృష్ణాకు అందాల్సిన 100 టీఎంసీలు దక్కవన్నారు. అప్పర్ భద్ర, తుంగ ద్వారా 30 టిఎంసీల నీళ్లు ఆగిపోతాయన్నారు. ఈ జలాలు ఆగిపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిరాక ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. నీటి సమస్యపై మాట్లాడితే చంద్రబాబు నోరుమెదపరన్నారు. శ్రీశైలంలో మిగిలే 21 టీఎంసీల బురద నీళ్లే అంటున్న చంద్రబాబుకు ఆ బురదనీటి విలువ ఏమిటో తంబళ్లపల్లె, అనంతపురం ప్రాంతాల రైతులను అడిగితే తెలుస్తుందన్నారు. రాయలసీమకు నీళ్లు రావడం, పొలాలు పండటం చంద్రబాబుకు ఇష్టముండదన్నారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆర్.రమేష్కుమార్రెడ్డి, తిప్పారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ ఆహ్మద్ మాట్లాడుతూ.. రాయలసీమ పథకాన్ని పూర్తి చేయించుకునేందుకు చంద్రబాబు దిగివచ్చేలా పోరాటం సాగించాలన్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఆషా ప్రతినిధుల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చినా, మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. -
కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
-
అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్
-
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం
-
‘సీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు’
సాక్షి,అన్నమయ్య: భవిష్యత్లో రాయలసీమకు సాగునీరు,తాగునీరు తీవ్ర ఇబ్బందులు రాబోతున్నాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి నీళ్లు రావడమే కష్టంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లో 1996 ఆలమట్టి రిజర్వాయర్గా ప్రారంభమై 200 టీఎంసీ వరద నీరు నిల్వ స్థాయికి చేరింది.అప్పర్ భద్ర, తుంగ భద్ర నీళ్ళు 30 టీఎంసీ నిల్వ చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులది. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు తీసుకుని వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేస్తూ, శిష్యుడుకు తాకట్టు పెట్టాడు.90 శాతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయి.840 అడుగులు దగ్గర పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నది నుండి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పూర్తి చేయాలి.రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.వైఎస్సార్సీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది.పోలవరం ఎడమ పనులు పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు ఆన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.15 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అమరావతిలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టులో కాలువలు ఎత్తు తగ్గించాడు.రాయలసీమ నుంచి కర్నూలు హైకోర్టు తీసుకుపోయారు, ఎయిమ్స్ ను తరలించుకుపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను వెంటనే పూర్తి చేయాలి’అని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీలకు షాక్.. ఉచిత విద్యుత్ కట్..!
-
Butta Renuka: ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు.. నీ కుట్రలకు ఎవ్వరూ భయపడరు
-
కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి
-
Magazine Story: బాబు అప్పు ఏపీకి ముప్పు
-
ఖాళీ కుర్చీలు జనాలు లేని సభలు కూటమి పతనం మొదలైంది
-
వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
సాక్షి, అమరావతి: అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసియేషన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రాట్యూటీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్లైన్స్ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.మార్చి 2న వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీకి పాల్పడ్డారని, నాయుడుపేట సభలో ఆయన చెప్పిన అబద్ధాలే అందుకు నిదర్శనమని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది అయితే.. వారికి రూ.12 వేల కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్రెడ్డిదని ఆయన గుర్తుచేశారు. అయినా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారని, నాయుడుపేటలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎవరు మంచి పని చేసినా దానిని తన ఖాతాలో వేసుకోవడం, తప్పు జరిగితే అధికారులు, ప్రతిపక్షాల మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కాకాణి ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్లు నిర్మించామని చెబుతున్న చంద్రబాబు 2014–19 మధ్య ఎన్ని స్థలాలిచ్చారు? ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు కట్టించామంటూ పచ్చి అబద్ధం చెప్పారు. గతంలో మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాక పంపిణీ చేయకుండా ఆగిపోయిన వాటిని ఇవాళ పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరుచేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. రెండు లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉండగా మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని నిరూపించేందుకు మేం సిద్ధం. 2019–24 మధ్య నిరుపేదలకు దాదాపు రూ.32 వేల కోట్ల విలువైన 72 వేల ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టిన చరిత్ర వైఎస్ జగన్దే. టిడ్కో ఇళ్లు ఇచ్చిందీ వైఎస్ జగనే.. 2024 ఫిబ్రవరిలో 1.25 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. వాటికి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన చరిత్ర జగన్దే. అలా 1,43,600 ఇళ్లను అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీన్ని చంద్రబాబు కాదని చెప్పగలరా? ఇంకా 365 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.25 వేల చెల్లింపుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అలాగే, 430 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 74,312 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.50 వేల చెల్లింపుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం 25 లేఅవుట్లలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో పేదలు ఉండకూడదంటూ ఆర్–5 జోన్లో మొత్తం 50,793 ఇళ్ల పట్టాలను రద్దుచేసింది.టిడ్కో ఇళ్లలో చంద్రబాబు అవినీతి.. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగింది అవినీతి మాత్రమే. ముడుపులిచ్చిన కాంట్రాక్టర్లకు ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అలాగే, లబ్ధిదారులపై విపరీతంగా భారం మోపారు. ఇలా టిడ్కో ఇళ్ల మీద రూ.8,929 కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవమా కాదా చంద్రబాబు చెప్పాలి. -
ఖాళీ కుర్చీలు.. బాబు సభ అట్టర్ ఫ్లాప్
-
చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్ ఫ్లాప్
నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్ఫ్లాప్ అయ్యింది. -
బాబు ఆలోచన విధానమే దోపిడీ మేం వస్తే మీకేంటి ఇబ్బంది..
-
నీకెందుకు ఈ బ్రతుకు ..!
-
మీడియాకు చంద్రబాబు సుద్దులు.. ఎల్లో మీడియాకు ఇచ్చిపడేసిన నాగార్జున యాదవ్
-
పడిపోతున్న పల్లీ ధరలు.. పట్టించుకోని బాబు సర్కార్
-
అమరావతి ముందు సింగపూర్ దేనికి పనికిరాదు.. భూములు ఇవ్వండి.. నిండా మునగండి
-
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
ఉగాదులు వెళ్లినా.. ఉషస్సులేవీ?
సాక్షి, విశాఖపట్నం: పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మారుస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీవితాల్లో వెలుగులు నింపకుండానే సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి 2 లక్షలకు పైగా కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం.. మళ్లీ అందులో వడపోత కోసం రీ–సర్వే పేరుతో పేదోడి ఇంటిపై బంగారు కత్తి వేలాడదీసింది. ఫలితంగా ఆ సంఖ్యను లక్షకు కుదించేసింది. 2024 అక్టోబర్లో పీ–4 ప్రారంభించినప్పుడు.. ‘వచ్చే ఉగాది నాటికి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారు. ఇప్పటికి రెండు ఉగాదులు గడిచిపోయినా ఆ కుటుంబాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. సర్కారుపై నమ్మకం లేని సంపన్న వర్గాలు మొహం చాటేస్తున్నాయి. దీంతో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులైనా మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతూ మార్గదర్శులను ఎంపిక చేసినా.. ఈ పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరిట హడావుడి చేస్తుండటం కొసమెరుపు. పేదలను ఆదుకునేందుకే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్(పీ–4) విధానాన్ని తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు, మొదటి 20 శాతం ఉన్న సంపన్న కుటుంబాల ద్వారా సాయమందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీనిపై మంత్రులు, అధికారులు సమీక్షల పేరిట మొదట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే సచివాలయాల వారీగా సర్వేలు నిర్వహించి, జిల్లాలో లక్షకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరికి సంపన్నుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామంటూ 2024 ఆగస్టులోనే మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా భరోసా దక్కలేదు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరకపోవడంతో పేద వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది. స్క్రిప్ట్డ్ సక్సెస్ స్టోరీలు విఫలమైన పథకాన్ని విజయవంతమైనట్లు చూపడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని కుటుంబాలకు.. వేదికపై ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? అనే అంశాలపై ముందుగానే శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల మంది మార్గదర్శులు ఉంటే, కేవలం 20 మందికి మాత్రమే అవార్డులు ఇస్తుండటం చూస్తుంటే.. అసలు ఆ కుటుంబాలకు ఎంతమేర సాయం అందుతుందో అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా పీ–4 విఫలమైందని స్పష్టమవుతున్నా, సంబరాలు చేసుకోవడంపై జిల్లా అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని భావించిన నిరుపేదలకు నిరాశే మిగులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహిస్తే ప్రజల ముందు అభాసుపాలవుతామని కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వడపోతలతో పేదల సంఖ్య తగ్గింపు2024 అక్టోబర్ 2న పీ–4ను ప్రారంభిస్తూ, 2025 ఉగాది నాటికి బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వం పునఃసర్వే పేరుతో పదే పదే వడపోతలు చేస్తూ లబి్ధదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. ఫలితంగా మొదట గుర్తించిన భారీ సంఖ్య కాస్త ప్రస్తుతం 1,05,126 కుటుంబాలకు పడిపోయింది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శులుగా సంపన్నులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై నెట్టింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 7 వేల మంది మార్గదర్శులను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సాయం చేసే విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సంపన్నుల నుంచి స్పందన లేకపోవడంతో.. కనీసం ప్రజాప్రతినిధులైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. విఫల పథకానికి విజయోత్సవాలా? పీ–4 పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా, కాగితాలపై కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అధికారులే ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని చేతులెత్తేసినా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. జిల్లాలో గుర్తించిన 1,05,126 కుటుంబాల్లో కేవలం 66 వేల కుటుంబాలనే దత్తత తీసుకోవడం పథకం డొల్లతనాన్ని చాటుతోంది. పోనీ వారి జీవితాల్లో అయినా.. మార్పులు తీసుకొచ్చారా అంటే అదీ లేదు. లక్షకు పైగా కుటుంబాలకు కేవలం 7 వేల మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. ఇందులోనూ కొందరు వ్యాపారవేత్తలను బలవంతంగా మార్గదర్శులుగా చేర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నీ వికృత చేష్టలన్ని బద్దలైపోద్ది.. నాకు ఎల్లో మీడియా ఉందని రెచ్చిపోతే..
-
తిరుపతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ దందా..
-
దిగజారిన వేరుశనగ ధర
సాక్షి, అమరావతి: వేరుశనగ పంట చేతికొచ్చేవేళ పతనమైన ధరలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల్లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ ప్ర«ధానంగా ఖరీఫ్ పంట. ఖరీఫ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25–30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15–20 క్వింటాళ్లకు మించటంలేదు. ఓ వైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న రైతులకు పతనమైన ధరలు అశనిపాతంగా మారాయి. క్వింటా వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట రూ.5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. నాణ్యత లేదనే వంకలతో కోతలుకాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతులను బెదరగొడుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపులేని దళారులు, వ్యాపారులు ప్రస్తుతం నాణ్యత, పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కళ్లాల వద్దకు రాశుల్లో వందగ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలను తూకం వేసి నాణ్యత పర్సంటేజ్ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు.పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంటున్నారు.నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు రాష్ట్రంలో వేరుశనగ రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కనీసం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పంటలకు మార్కెట్లో ధరల్లేనప్పుడల్లా ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వేరుశనగను కనీస మద్దతు ధరకు కొనాలి.– పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఆవిర్భావ సభలో... అంతులేని అబద్ధాలు
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే.. » మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు. » అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. » దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు. » సూపర్సిక్స్తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్హిట్ చేశామని చెప్పుకున్నారు.» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.రాజధాని రైతులపై కపట ప్రేమ.. మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ జగన్పై మళ్లీ విషం.. మరోవైపు.. వైఎస్ జగన్పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు. -
పునర్విభజనలో 50 శాతం సీట్లుపెరుగుతాయి
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను అమలుచేయలేరని అనుకున్నారని.. కానీ, తాను చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 21 నెలల్లో కొత్తగా ఐదు లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారుచేశామన్నారు. ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని తమ విధానమని.. త్వరలో అమరావతి రాజధానిపై కేంద్రం చట్టం చేస్తుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కావడంవల్లే కొందరికి నచ్చలేదని విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రధాని మోదీని తీసుకొచ్చి ప్రారంబోత్సవం చేస్తామన్నారు. నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలి పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలని, లేకపోతే వారికి పార్టీలో స్థానం ఉండదని.. భవిష్యత్తులో బాగా చేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతారని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గాల పునరి్వభజనతో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయన్నారు. సీట్లు పెరిగితే కొత్తవారికి పదవులు లభిస్తాయన్నారు. పదవుల్లో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించి, ఇప్పుడు ఆవిర్భావ వేడుకల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు క్రెడిట్ చోర్ అని దుయ్యబట్టారు. టీడీపీ, ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా తుంగలోకి తొక్కి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని క్రమశిక్షణ లేని పార్టీగా, నైతిక విలువలు లేని పార్టీగా మార్చింది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించవద్దని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనతో చంద్రబాబు ఎక్కడా, ఏ విషయంలోనూ సరితూగరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వేడుకలు చేసే అర్హత లేదు.. కామపిశాచుల్లా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతలను ఒక్కరినైనా సస్పెండ్ చేశారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు. పొత్తుల కోసం అంటకాగిన పార్టీగా టీడీపీని మార్చేసిన చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనులు లేవని, బాబు జీవితమంతా అబద్ధాలతోనే బతుకీడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వ పనితీరు మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును తాను మనిషిగా కూడా గుర్తించటం లేదని, జీవిత చరమాంకంలో ఉన్న బాబు ఇకనైనా మారాలని హితవు పలికారు. -
ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..
-
వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్
-
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
11 నుండి 170కు.. ఎలా వస్తామో చూద్దురు కానీ
-
అమరావతిపై పెట్టింది తీర్మానం మాత్రమే.. బిల్లు కాదు.. ముందుది ముసళ్ల పండగ
-
ఏం ప్లాన్ వేశావ్ బాబు.. రాజధాని వెనుక ఇంత స్కామా..?
-
బాబు కుట్రలో భాగమే.. కార్టూన్ బరితెగింపు
సాక్షి, అమరావతి: విలువల వలువలు ఏనాడో విడిచేసిన ఈనాడు పత్రిక.. చంద్రబాబు ప్రయోజనం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధమని మరోమారు రుజువు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడానికి తహతహలాడే ఎల్లో మీడియా.. రాజధాని ముసుగులో మరోమారు దిగజారింది. రాజధాని అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం అనే దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసే రీతిలో ఓ దిగజారుడు కార్టూన్ను ఈనాడు పత్రిక శనివారం ప్రచురించింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తన మార్కు పాత్రికేయ కుతంత్రానికి తెగబడింది. ఆనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కోసం అనేక దిగజారుడు కార్టూన్లను ప్రచురించిన ఈనాడు పత్రిక అలాంటి దిగజారుడు కార్టూన్తో శనివారం పసుపు విషాన్ని పత్రికలో చిమ్మింది. ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్ చూసి ఆ పత్రిక పాఠకులే కాదు తెలుగు పాఠకులంతా ఛీత్కరించినట్లు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన నిరసనలే నిదర్శనం. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. రాజధాని కట్టలేకే కార్టూన్ కుట్రలు రాజధాని నిర్మాణంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దుష్ప్రచార కుట్రకు తెగబడింది. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అనే అవాస్తవాన్ని పదే పదే ప్రచారం చేయాలన్న కుతంత్రంలో భాగంగానే ఈనాడు ఈ కార్టూన్ను ప్రచురించింది. దురుద్దేశపూరితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కార్టూన్ ప్రచురించింది. వైఎస్ జగన్గానీ వైఎస్సార్సీపీ గానీ రాజధానిగా అమరావతిని ఏనాడూ వ్యతిరేకించనే లేదు. మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే తమ ధ్యేయమని విస్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు రాజకీయ కుట్రకు కొమ్ముకాసేందుకే 2019–24 వరకు ఈనాడు పత్రికతోపాటు పచ్చ మీడియా అంతా గగ్గోలు పెట్టి దుష్ప్రచారం సాగించింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజధానిగా అమరావతిని వైఎస్సార్సీపీ వ్యతిరేకించలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణం చేయాలనే డిమాండ్ చేస్తోంది. కానీ దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా సరే రాజధాని అమరావతి నిర్మాణంలో ఎటువంటి కదలికా లేదు. రూ.20వేల కోట్లకుపైగా అప్పులు చేసినా సరే రాజధాని నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో బరితెగించి అవినీతికి పాల్పడుతోంది. టీడీపీ దోపిడీకి అమరావతి కామధేనువుగా మారిందన్నది స్పష్టమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపించేందుకే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోంది. రాజధాని నిర్మాణానికి 30ఏళ్లు పడుతుందని చెబుతోంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా వందేళ్లు పడుతుందని ఏకంగా బ్రిజేష్ కుమార్ కమిటీకి చంద్రబాబు ప్రభుత్వం నివేదించడం గమనార్హం. అంటే మాస్టర్ప్లాన్లో పేర్కొన్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం తమ తరం కాదని చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఇదే సమయంలో అమరావతి పేరిట రెండో దశ, మూడో దశ భూసేకరణ పేరుతో చేస్తున్న హడావుడితో అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ‘అమరావతిపై అసెంబ్లీ తీర్మానం’పేరిట కొత్త నాటకానికి తెరతీసింది. అదే అదనుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో సిండికేట్ ఈ దుష్ప్రచారానికి తెగబడింది. ఎన్టీఆర్పైనా దిగజారుడు కార్టూన్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలో భాగస్వామి అయిన ఈనాడు పత్రిక ఆనాడు కూడా ఇలాంటి దిగజారుడు కార్టూన్లనే ప్రచురించింది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రోజూ కార్టూన్లు ప్రచురించింది. ‘ఆయనకు తెలివి లేదు... రోజూ గంటకు మించి ఆలోచించ లేరు... ఒంటిపై బట్టలు కూడా సరిగా వేసుకోలేరు’ అనే రీతిలో దిగజారుడు కార్టూన్లు ప్రచురించడం గమనార్హం. ఎన్టీ రామారావు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతిపై కూడా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్లు పాత్రికేయ ప్రమాణాలను అథఃపాతాళానికి దిగజార్చాయి. ఆ దంపతులు ఇద్దర్నీ కించపరుస్తూ ప్రతి రోజు కార్టూన్లు ప్రచురించి ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకువచ్చే దుష్ప్రచార కుట్రను బరితెగించి సాగించింది. కార్టూన్లలో ముఖ్యమంత్రిని ఏకంగా అర్ధనగ్నంగా చూపిస్తూ ఈనాడు పత్రిక తన కుట్రను పతాకస్థాయికి తీసుకువెళ్లింది. ఆ విధంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కేవలం 9 నెలల్లోనే భారీ కుట్రకు తెగబడ్డారు. అనంతరం 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి కుట్రకు సహకరించిన ఈనాడు రామోజీరావుకు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. ఎన్టీరామారావు ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించింది. తద్వారా రామోజీ ఫిల్మ్సిటీ వ్యాపార ప్రయోజనాలకు సహకరించింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ అసైన్డ్ భూముల ఆక్రమణ తదితర అక్రమాలకు అడ్డే లేకుండాపోయింది. ఆనాడు ఎన్టీరామారావు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన నాటి ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్కు చంద్రబాబు ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవిని ఇవ్వడం గమనార్హం. పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈనాడు పత్రిక కార్టూన్ ప్రచురించడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈనాడు ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈనాడు పత్రికపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. -
రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం
నెల్లూరు రూరల్: రైతులను మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వరి కోతలకు ముందు పుట్టి ధాన్యం (845 కేజీలు) ధర రూ.22 వేలు ఉందని అధికారులు చెబితే.. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం ధరల పతనం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ పార్టీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివుని నర్సింహారెడ్డి, ఇతర నాయకులు, రైతులతో కలిసి శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాకాణి మాట్లాడుతూ.. మిల్లర్లు చేస్తున్న దోపిడీలో అధికారులు, మంత్రులు, పాలకులు వాటాలు పంచుకుంటున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులను ఆదుకుంటామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లాలో రబీ సీజన్లో 20 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంటే.. కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు టార్గెట్ ఇవ్వడం చూస్తే.. రైతులను ఏ విధంగా మోసం చేస్తోందో అర్థమవుతోందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2.5 శాతం మాత్రమే ధాన్యం కొంటున్నారని, మిగిలిన 97. 5 శాతం దళారులు, మిల్లర్లు దోచుకుపోతున్నారన్నారు. తేమ పేరిట 90 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు నిబంధనల ప్రకారం 17 శాతం కంటే ఒక శాతం అధికంగా తేమ ఉంటే క్వింటాల్కు ఒక కేజీ లెక్కన తరుగు కింద అదనంగా తీసుకోవాల్సి ఉండగా.. పుట్టికి 90 కేజీల అదనపు తరుగు తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన గన్నీ బ్యాగులు అందజేసి, అన్ని సదుపాయాలు కల్పించామని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. చంద్రబాబు రూ.500 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.24 వేలు ధర వస్తే.. అది జగన్మోహన్రెడ్డి గొప్పతనం కాదని, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ధరలు పెరిగాయని టీడీపీ నేతలు, పచ్చమీడియా దు్రష్పచారం చేశాయన్నారు. ఈ రోజు ధరలు పడిపోతుంటే ఇరాన్ యుద్ధం వల్ల అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం తక్షణమే అధికారులు స్పందించి, మద్దతు ధర అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
2028 నాటికి అమరావతి పూర్తి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ 2028 నాటికి పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మాదిరి ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అనుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని.. యుమునా నది పవిత్ర జలాలను, పార్లమెంట్లోని పవిత్ర మట్టిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. అమరావతి స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) ప్రాజెక్టు అని పునరుద్ఘాటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్–5(2)ను సవరిస్తూ కొత్తగా ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చడంతో పాటు సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలను కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ సీఎం చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై సభలో జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు జవాబిస్తూ.. అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరని, అంగుళం కూడా కదిలించే పరిస్థితి రాదన్నారు. ‘ఏపీకి ఒక్కటే రాజధాని. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దృఢత్వం వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆంధ్రప్రదేశ్ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తాం’ అని తెలిపారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.అమరావతిలో ఆదాయం సృష్టిస్తాం‘నాలుగోసారి సీఎం అయ్యా. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నా లక్ష్యం ఒక్కటే. ఆ రోజు సైబరాబాద్ను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశా. ఈ రోజు అమరావతిని అలా చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కు ఏపీ దేహం అయితే అమరావతి గుండె. నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగౌరవంగా చెప్పుకునేలా తయారు చేసే బాధ్యత మనందరిది. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. ఇక్కడ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఇక్కడి ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి తెస్తాం. దేశంలో ఇప్పుడున్న నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి భవిష్యత్ నగరం. వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేస్తాం. ప్రపంచంలో, దేశంలో ఎన్ని లేటెస్టు టెక్నాలజీలు ఉన్నాయో అవన్నీ తెస్తాం. రాష్ట్రాన్ని విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. మూడు మెగా సిటీలు అభివృద్ధి చేస్తాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తాం. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో తెలియదు. తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు’ అని చంద్రబాబు అన్నారు. కేంద్రహోంశాఖకు తీర్మానం కాపీ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానం కాపీని అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శనివారం సాయంత్రం కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి, ఏపీ సీఎస్కు పంపారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల విభాగం (ఐ అండ్ పీఆర్) ఒక ప్రకటన విడుదల చేసింది. -
అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
-
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
‘మరి వైజాగ్లో ఐటీ కంపెనీలకు ఎలా అనుమతిస్తున్నారు?’
కాకినాడ: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్ను వదిలేసి వచ్చి అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పుకొచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఎవరిని మభ్య పెట్టడానికి అసెంబ్లీ లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేయడం వెనుక కారణాలు ఏంటని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇంత వరకు ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి పేరుతో కట్టు కధలు చెప్పి రానున్న మూడేళ్ళు గడిపేయడానికి ఈ డ్రామా అని ధ్వజమెత్తారు కురసాల. మీరు మళ్ళీ అధికారంలో ఉంటామన్న నమ్మకం మీకు లేదా?, రైతులకు ఒక్క రిటన్ బుల్ ఫ్లాట్ ఇచ్చారా?, రాజధాని రైతు చనిపోతే కనీసం మీరు పరామర్శించారా?, చారిత్రాత్మక రాజధాని అని మీరు చెప్పినప్పుడు సమిధలు అవుతున్న రైతులను పరామర్శించరా?, ఇప్పటికీ రాజధానికి సరైన కనెక్టింగ్ రోడ్డులు ఉన్నాయా?, కనీసం ఆస్తులు ఉండీ అమ్ముకునే దుస్ధితి అమరావతి రైతులకు లేదు. రాజధానికి అప్పులు ఎక్కడ నుండి తెస్తున్నారో తెలియదు. రాజధాని భవనాలకు అడుగు నిర్మాణానికి రూ. 11 వేలు అవినీతి కాదా?, డిజైన్లకు కొత్తగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇడ్లీ పాత్ర..ఉప్మా గిన్నెల్లా భవనాలను డిజైన్ చేయించారు.రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతిని సెల్ప్ ఫైనాన్స్ నగరం అని చెప్పి ఇప్పటి వరకు నిధులు ఏమైనా సమీకరించారా?, రాజధాని లో ఇవాళ్టీకి భూములు తుప్పలుగా ..పరలు పరలుగా కనిపిస్తున్నాయి.హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ అమరావతిని బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. అమరావతి ని ఒక మహ నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఎవరికీ లేదు.అప్పుడు సునామీలన్నారు.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు అనుమతి ఎలా?రాష్ట్రంలో అతి పెద్ద సిటీ వైజాగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వైజాగ్ను పరిపాలన రాజధాని చేస్తానంటే.. సునామీలు వస్తాయని టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించింది. మరీ వైజాగ్లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఏలా అనుమతి ఇస్తున్నారు. అమరావతి మీరు క్రియేట్ చేసిన ఇల్యూజన్లా కనిపిస్తుంది.అమరావతిని ఎవరికి స్వర్గంలా చేసేందుకు నిర్మిస్తున్నారు. అమరావతి లో పేదలకు చోటు లేదా? ఎవరి కోసం నిర్మాణం’ అని ప్రశ్నించారు. -
‘అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు’
విశాఖ: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేకే రాజు ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. అమరావతిని వైఎస్ జగన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రూ. 50 వేల కోట్లు తెచ్చారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ పోరంబోకు, స్థానిక సంస్థల భూములు విద్యా సంస్థలకు ఇవ్వకూడదని తీర్పు ఉంది. ఆక్రమించిన భూమిలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. కూటమి పాలనలో విశాఖలో జరిగిన భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరిపించాలి. జోడుగుళ్ళ పాలెంలో రూ. 50 కోట్లు విలువ చేసే 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కులను కూటమి నేతలు కబ్జా చేస్తున్నారు.’ అని మండిపడ్దారు. -
ఓటేసి తప్పు చేశాం... చంద్రబాబుపై తిరగబడుతున్న సొంత నియోజకవర్గ ప్రజలు
-
ఏపీలో గ్యాస్ కొరత... దాన్ని కూడా సంపద సృష్టిగా మార్చిన బాబు
-
పరిశ్రమలపై కక్షసాధింపు.. పేదలపై ధరల పిడుగు
-
‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశి్నస్తూ డీపీఆర్ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ముగింపు..మళ్లీ మొదటికే కథ! మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. డబుల్ డెక్కర్తోనే అసలు సమస్య విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్ మెట్రో డీపీఆర్ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా డబుల్ డెక్కర్ కారిడార్ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది. మరోసారి డీపీఆర్లో మార్పులకు..! విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ దెబ్బతింటుందని కేంద్రం తేలి్చచెప్పింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకైనా డబుల్ డెక్కర్ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది.డబుల్ డెక్కర్తో ‘డబుల్’ భారంవిశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్ కంటే.. ప్రస్తుత ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ఏడీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్ డెక్కర్ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్ లైన్ల మారి్పడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. -
చిత్త కార్తె కుక్కలాగా మహిళలపై ఎగబడుతున్న చర్యలు తీసుకోరా?
-
వంటింట్లో 'వార్'!
సాక్షి, అమరావతి: ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం సామాన్యుడి వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకూ భగ్గుమంటూ జనం నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిక్కులు చూస్తోంది. గత 22 నెలలుగా నూనె రేట్లు కాక రేపుతున్నాయి. ప్రతి నెలా భారీగా పెరగడమేగానీ స్వల్పంగా కూడా దిగొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతుండగా గ్యాస్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు సర్కారు పీఠం ఎక్కిన తర్వాత గ్యాస్ రేట్లు రెండు సార్లు పెరగడంతో జనంపై ఏకంగా రూ.110 భారం పడింది. గ్యాస్ కోసం 10–15 రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో మండుటెండల్లో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వరదలు, అకాల వర్షాలు, కరువు దెబ్బకు పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. మార్కెట్లో చూస్తే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ పనులు లేక.. చేతిలో చిల్లి గవ్వలేక.. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో పేదలు విలవిల్లాడుతుంటే చంద్రబాబు సర్కారు వేడుక చూస్తోంది. 60 శాతానికిపైగా పెరిగిన నూనెల ధరలు.. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఏపీలో వంట నూనెల ధరలు సెగ పుట్టిస్తున్నాయి. గత 22 నెలలుగా పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశనగ నూనె రేట్లు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. పది రోజుల క్రితం సన్ఫ్లవర్, పామాయిల్ రేట్లు లీటరుకు రూ.15–25 వరకు పెరిగాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగిన నూనె రేట్లు.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితుల్లోనూ ఆకాశాన్ని తాకుతుండటం గృహిణులను కన్నీళ్లు పెట్టిస్తోంది. 2024 ఏప్రిల్లో లీటర్ వేరుశనగ నూనె రూ.167.87 కాగా ఇప్పుడు రూ.210–22 ఉంది. గతంలో పామాయిల్ రూ.89–91 ఉంటే ఇప్పుడు రూ.131–140 ఉంది. సన్ఫ్లవర్ గతంలో రూ.112 ఉంటే ఇప్పుడు రూ.180–190కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. పామాయిల్ ఏకంగా 60 శాతం, సన్ఫ్లవర్ 63–70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం రేట్లు పెరిగాయి. వీటితోపాటు ఆవనూనె, సోయా, వనస్పతి రేట్లు కూడా దిగి రావట్లేదు. ఫలితంగా మధ్య తరగతి కుటుంబాలు వంటలను కుదించుకుంటున్న పరిస్థితి. గ్యాస్ కొరతకు తోడు నూనె రేట్లకు భయపడి ఒంటి పూట వంటలు వండుకోవడం గమనార్హం. ఉడకని పప్పులు.. తగ్గని రేట్లు.. వంట నూనెలకు తోడు పప్పు దినుసుల రేట్లు పేదింటి కుటుంబాలకు పెను భారంగా మారుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా, తెలంగాణతో చూసినా ఏపీలోనే రేట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో కందిపప్పు రూ.120–150, గోధుమ పిండి రూ.71–100, మినçప్పప్పు రూ.146–150 పైగా పలుకుతోంది. పెసలు సైతం కిలో రూ.160, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగపప్పు రూ.128కి తగ్గట్లేదు. నిత్యం కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే దినుసుల్లో ఎండు మిర్చి రూ.200–390, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.219–250, అల్లం రూ.109–150, కారం రూ.500(ప్రీమియం), సాధారణం రూ.200కిపైగా, ఇంగువ 100 గ్రాములు రూ.200 వరకు ఉంది. పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు గానీ మార్కెట్లో కొనుగోలుదారులు కూరగాయలను ముట్టుకుంటే మండుతున్నాయి. టమాటా రైతుకి కిలో రూ.3 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో రూ.20–25 చొప్పున వినియోగదారులు కొనాల్సి వస్తోంది. అరటి సైతం రైతుకు కిలో రూ.5 మాత్రమే దక్కుతుంటే బయట డజను రూ.100 పలుకుతోంది. వేసవిలో పండ్లలో అధికంగా తీసుకునే కర్బూజా రైతుల నుంచి కిలో రూ.3–4 చొప్పున కొంటుంటే బయట కాయ ఏకంగా రూ.20–30 ఉంటోంది.చివరికి కరివేపాకు సైతం కిలో రూ.180 పలుకుతోంది. పచ్చి మిర్చి రూ.79, క్యాప్సికం రూ.75, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ఇవన్నీ పండించిన రైతులకు పదో పరకో దక్కుతుంటే పచ్చ సిండికేట్ మార్కెట్లో వినియోగదారుల జేబులను గుల్ల చేస్తోంది. బియ్యం.. బాబోయ్! అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లో బియ్యం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వరి పండించే రైతులకు 75 కిలోల బస్తాకు రూ.1,100–1,500 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో వినియోగదారుడు 26 కిలోల బస్తా రూ.1,600 పెట్టి కొనాల్సి వస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే బస్తాకు రూ.300 దాకా రేట్లు పెంచారు. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.80 నుంచి రూ.110–150కి పెరిగాయి. దావత్ బియ్యం అయితే కిలో రూ.230కిపైగా ఉంది. వాస్తవానికి గత నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచారు. క్వింటాకు ఏకంగా రూ.400పైనే బాదారు. హోల్సేల్ నుంచి మార్కెట్లోకి వచ్చే సరికి కర్నూలు సోనా 26 కిలోల బస్తా రకాన్ని బట్టి రూ.1,599, రూ.1699కిపైగా ఉంటోంది. ఇష్టానుసారం బియ్యం రేట్లను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. కోడి మాంసం కిలో రూ.420 రాష్ట్రంలో పౌల్ట్రీ రంగంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుణ్యమా అంటూ గుడ్డు రేటు భారీగా పతనమై పౌల్ట్రీ రైతులను ముంచేసింది. మరోవైపు కోడి మాంసం రేటు రూ.400–420కి ఎగబాకి వినియోగదారులకు షాకిచ్చింది. చివరికి కోడి మాంసాన్ని ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్ కవర్లు, పెళ్లిళ్లలో వేసే విస్తరులు, గ్లాసుల రేట్లకు కూడా రెక్కలు రావడం చంద్రబాబు సర్కార్ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్రీ పాయింట్లో కూరల ధరలు రూ.5–10 వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వంట చేసుకోలేక.. బయట కొనుక్కొని తినలేక సగటు జీవి నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోంది.రేషన్లో కందిపప్పు కట్.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల రేట్లు అమాంతం పెరుగుతుంటే.. పేదలకు ఇచ్చే రేషన్ మాత్రం కుంచించుకుపోతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తూ రేషన్ వ్యవస్థను దిగజార్చింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సమర్థంగా అందిస్తే చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా ఆ వ్యవస్థనే రద్దు చేసింది. బియ్యం నాణ్యతకు తిలోదకాలిచ్చి అక్రమ రవాణాకు గేట్లు తెరిచింది. ఫలితంగా పేదలు తినాల్సిన బియ్యం వారి ఇళ్లకు చేరకుండా దొడ్డిదారిన పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ఇక మార్కెట్లో కందిపప్పు రేటు అందనంత ఎత్తులో ఉంటే చౌక దుకాణాల ద్వారా ఇవ్వకుండా మంగళం పాడేసింది. గోధుమ పిండిని సైతం అర్ధంతరంగా నిలిపివేసింది. కిలో రూ.20 చొప్పున జిల్లా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించి చేతులు ఎత్తేసింది.పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాల్సిన రాగులు, జొన్నల పంపిణీని సైతం గాడి తప్పించింది. సబ్సిడీపై ఇచ్చే నూనెలను సైతం ఎత్తేసింది. ఎన్నికల ప్రచారంలో రేషన్ దుకాణాల ద్వారా ఏకంగా 18 రకాల నిత్యావసరాలను ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేసింది. రేషన్లో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం, అరకొర పంచదార మినహా చంద్రబాబు సర్కారు పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు. గ్యాస్ కోసం క్యూ కట్టి..ప్రజలకు బూటకపు కబుర్లు చెప్పి మోసం చేయడంలో తాను దిట్ట అని చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ఒకవైపు గ్యాస్ సంక్షోభం ముంచుకొస్తుంటే ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ప్రకటనలు గుప్పించి చేతులు దులుపుకొన్నారు. కూటమి సర్కారు వచ్చాక వంట గ్యాస్ రూ.110 పెరిగింది. కమర్షియల్ గ్యాస్పై తాజాగా రూ.115 చొప్పున పెంచడంతో పాటు ఆంక్షలు విధించడంతో హోటల్ రంగం కుదేలైంది. వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ విషయంలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల పాటు గ్యాస్ బుకింగ్ వ్యవధిగా నిర్ణయించారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు బుకింగ్ కోసం ప్రయత్నిస్తే 35 రోజుల తర్వాతే బుకింగ్లు చేసుకోవాలని మెసేజ్లు వస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకున్న 10–15 రోజుల తర్వాత కూడా ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. సాధారణ రోజుల్లో వచ్చే స్టాకు కంటే ఇప్పుడు 20 శాతం తగ్గించి ఇస్తుండటం, పెండింగ్ డెలివరీలు పెరిగిపోవడంతో ఏజెన్సీలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇదే అదనుగా చంద్రబాబు అనుకూల ఏజెన్సీలు దొడ్డిదారిన గ్యాస్ను బ్లాక్మార్కెట్కు తరలిస్తూ దండుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం సిలిండర్లతో మండుటెండలో క్యూలలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది. -
‘మాయ’ఫెస్టోలు!
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ గుర్తుండేలా సెక్రటేరియట్లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్ టీవీలు, గ్రైండర్లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం. -
అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్
-
వైద్య విద్య అందించలేని తండ్రీకొడుకులు బాబు,లోకేష్ పై AISF నేతలు ఫైర్
-
నీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరాకులా.. చంద్రబాబు సిద్ధంగా ఉండు..
-
మంత్రి మాటలతో అడ్డంగా బుక్కైన బాబు.. అమరావతి డ్రామా
-
ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిపేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) గురువారం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకు మించిన భారంగా మారిందని నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు తేల్చిచెప్పారు. ఒకటో తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టీమేటం ఇచ్చారు.చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు అనధికారికంగా బోర్డులు తిప్పేసిన దుస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రుల మెట్లెక్కే పేదలను అటు నుంచి అటే వెనక్కు పంపేసే దయనీయ పరిస్థితులు ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో సేవలు నిలిపేస్తున్నట్లు ఆశ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వన్టైమ్ సెటిల్మెంట్ అని చెప్పి మొండిచెయ్యి 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నెట్వర్క్ ఆస్పత్రులు పలు దఫాలుగా సమ్మెలోకి వెళ్లాయి. గతేడాది అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. విజయవాడ ధర్నాచౌక్లో ధర్నాకు సైతం దిగారు. అప్పట్లో వారితో చర్చలు జరిపి బకాయిలున్నింటినీ వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని ప్రభుత్వం నమ్మించింది. దీంతో యజమానులు సమ్మె విరమించారు. ఆ తర్వాత వారికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నాం, బకాయిలు తీర్చేస్తామని కాలయాపన చేసింది. బకాయిలపై స్పందించని ప్రభుత్వం.. మరోవైపు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసి, బీమా విధానం అమలుకు ప్రభుత్వం పూనుకుంది. బీమా కంపెనీ ఎంపికకు టెండరు కూడా పిలవడంతో తమ బకాయిల సంగతి తేల్చాలని, బీమాలో ప్రొసీజర్ల రేట్లు పెంచాలని హైకోర్టును సైతం యజమానులు ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వంపై యజమానులు బకాయిలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి. కోర్టు ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు ఇటీవల ఆశ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పా టు, ప్రొసీజర్ రేట్లు పెంచాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు ఆస్పత్రుల యజమానులు వెల్లడించారు. -
బాబు సర్కారు మళ్లీ అప్పు.. నేడు మరో రూ.3,400 కోట్లు
సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.7,300 కోట్లు అప్పు తెచ్చి రికార్డులను తిరగరాస్తోంది. మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3,900 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మళ్లీ శుక్రవారం మరో రూ.3,400 కోట్లు అప్పు చేస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,400 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. ప్రభుత్వం 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 18 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,400 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం చేయనున్న అప్పులను ఆర్బీఐ ఈ నెల 24వ తేదీనే నోటిఫై చేసింది. అయితే ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ను నోటిఫై చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏపీ చేయనున్న అప్పులను కూడా ఆర్బీఐ బుధవారం రాత్రి నోటిఫై చేసింది. కాగా, నేడు(శుక్రవారం) చేయనున్న రూ.3,400 కోట్ల అప్పుతో కలిపితే... చంద్రబాబు ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,40,621 కోట్లకు చేరనుంది. అంటే.. సగటున నెలకు రూ.15,482.77 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు అప్పు చేసింది. -
కడప స్టీల్ పై బాబు నాటకం
-
అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి
-
శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.
-
అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం
-
కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు... మాకు ఆకలేస్తే అడగాల్సింది మిమ్మల్నే కదా..
-
‘అమరావతి కోసం తీర్మానం అనేది బాబు డ్రామా’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను పూర్తిగా మభ్యపెట్టడానికి చేస్తున్న సరికొత్త ఎత్తుగడ అని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి కోసం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టడంపై చంద్రబాబు సర్కార్కి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరెవరు అడ్డంకులు సృష్టించారో చంద్రబాబు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి అంతా చేసేశానని చెప్పుకోవడమే లక్ష్యమని, అయితే శాసన మండలిని సమావేశపరచకుండా ఎందుకు ఉంచుతున్నారో కూడా సమాధానం చెప్పాలన్నారు. మండలిలో వైఎస్సార్సీపీ బలం ఎక్కువగా ఉందని... అమరావతిలో చంద్రబాబు అవినీతి, వ్యవహరిస్తున్న తీరును గట్టిగా ప్రశ్నిస్తారనే భయంతోనే మండలిని సమావేశపరచడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్మించి, ప్రజలకు వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని, రాజధాని అంశాన్ని శాశ్వత కామధేనువుగా మా ర్చుకుని అవినీతి యజ్ఞం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఇంకేమన్నారంటే..జగన్ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు... అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ జగన్ వ్యతిరేకం కాదు. 2019లో అధికారంలోకి రాకముందే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అవినీతి, దోపిడీ పైనే మా అభ్యంతరం. బాబు చెబుతున్నదానినిబట్టే రాజధానిలో కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. 2014–19 మధ్య ఐదేళ్లలో బాబు ఖర్చు చేసింది రూ.5వేల కోట్లే. ఇప్పుడు కూడా కొత్త నిర్మాణాలు ఏమీ చేపట్టలేదు. పాత బిల్డింగులే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చాక కూడా ఏమీ చేయడం లేదు. కొత్త నిర్మాణాలంటూ ఇప్పుడు చదరపు అడుగుకు రూ.19వేల వరకూ పెంచారు. మళ్లీ డిజైన్ల పేరిట రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2018లో టెండర్లు ఖరారై, పనులు ప్రారంభమైన వాటికి కూడా మళ్లీ టెండర్లు పిలిచారు. అమరావతిని ఏటీఎం, కామధేనువుగా మార్చారు. రాజధాని రైతుల సమస్యలను ఇప్పటికీ పరిష్కరించ లేదు. పిల్లల పెళ్లిళ్లు కూడా రైతులు చేయలేకపోతున్నారు. అమరావతి పనుల్లో పారదర్శకత ఏదీ? అమరావతి పనులు ఎక్కడా జరగడం లేదు. ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదు. ఈ విడతలో రూ.9వేల కోట్లు తెచ్చి, రూ.5వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అమరావతికి వ్యతిరేకం అని ముద్ర వేస్తున్నారు. అమరావతి ఏపీలో భాగం కాదా? మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయకుండా, రెండో విడత పేరుతో మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతిలో పాత బిల్డింగులు తప్ప.. కొత్తగా చంద్రబాబు ఏం కట్టారు?. రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీకోసం ఏమైనా చేశారా? ఇప్పటికీ కరకట్ట రోడ్డే కదా గతి. వెస్ట్రన్ బైపాస్ పూర్తిచేసింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే కదా? పనులు ఏమీ చేయకపోయినా, ప్రజలను నిరంతరం భ్రమల్లో పెట్టాలన్నదే చంద్రబాబు ప్లాన్. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ అమరావతి విషయంలో వివరాలు ప్రభుత్వం బయట పెట్టగలదా? అమరావతి పేరు మీద అప్పులు తెస్తున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారు, కమీషన్లు కొట్టేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను మాత్రం అభివృద్ధి చేయడం లేదు. చంద్రబాబు గతంలో చెప్పిన హైపర్ లూప్ ఏమయ్యింది? అమరావతిలో ఒలింపిక్స్ ఏమయ్యాయి? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అట.. అమరావతి పనుల కమీషన్లకు సంబంధించే చంద్రబాబుకు ఇన్కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. రూ.2వేల కోట్ల అవినీతిపై ఆ రోజు ఇన్కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు కమీషన్లు, లంచాలు వెళ్లాయని ఆ నోటీసుల్లో ఉంది. ఈ నోటీసులపై విచారణ ఆగిపోయింది. అమరావతిలో చంద్రబాబు అవినీతికి ఈ నోటీసులే నిదర్శనం. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటున్నారు. అదెలా చేస్తారో తెలియదు. లక్ష కోట్ల అప్పును ఎకరాల ధరతో విభజిస్తారట. మరి నిజంగా అక్కడ అంత ధర ఉందా? చంద్రబాబు అక్కడ భూమిని గజం రూ.7,500 చొప్పున తన కోడలి పేరుతో కొన్నాడు. ఆ ప్రకారం చూస్తే ఎకరం రూ.4 కోట్లు మాత్రమే అవుతుంది. మరి 8 వేల ఎకరాలు, రూ.4 కోట్ల చొప్పున లెక్కిస్తే ఎంత అవుతుంది?. అందుకే మళ్లీ చెబుతున్నాం. మా పార్టీకి కానీ, మా నాయకుడికి కానీ ఒకటే స్థిరమైన అభిప్రాయం. మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు. రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అమరావతిలో సామాన్యులు, నిరుపేదలు ఉండే పరిస్థితి ఉందా? చివరకు అక్కడ పేదలకు ఇచ్చిన ప్లాట్లు కూడా రద్దు చేశారు కదా? అక్కడ ఆర్గానిక్గా ఎలా, ఎప్పుడు డెవలప్ అవుతుంది? అక్కడికి ప్రజలు ఎప్పుడొస్తారు? ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది?నాడు ఇంటర్నేషనల్ సిటీ .. ఇప్పుడేమో మున్సిపాలిటీ అట! ఆ రోజు అదే అమరావతిని ఇంటర్నేషనల్ సిటీ అన్నారు. అప్పుడు 33 వేల ఎకరాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు మరో 30 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కావాలంట. ఎందుకయ్యా అంటే, ఇప్పుడున్న భూమితో కేవలం మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అంటున్నారు. సింగపూర్ మాదిరిగా ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే, మళ్లీ 30 వేలకు పైగా ఎకరాలు కావాలని చెబుతున్నాడు. దీంతో రైతులకు అనుమానం కలుగుతోంది. ఒకవేళ మీరు ఒకేసారి వేల ఎకరాలు అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరొస్తారు? అంత మొత్తం ఎవరు పెట్టుబడి పెడతారు? ఇంకా, మీరు అనుకున్న ధర వస్తుందా? ఈలోగా వడ్డీలు ఎంత పెరుగుతాయి? రుణాలు తిరిగి ఎలా చెల్లిస్తారు?. ఇవన్నీ గట్టిగా నిలదీస్తాం కాబట్టే, అమరావతిపై తీర్మానం కోసం మండలిని సమావేశపర్చడం లేదు. -
ఎవరికీ ‘చెప్పు’కోలేక..!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యా మిత్ర కిట్లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా.. -
అభివృద్ధి లేదు సంక్షేమం లేదు... లక్షల కోట్లు అప్పు ఏం చేస్తున్నట్టు?
-
కష్టాన్ని'కట్టె'బెట్టి!
కర్నూలు(సెంట్రల్)/కర్నూలు(అగ్రికల్చర్): వంట గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. వేల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ప్రజలకు కష్టాన్ని కట్టబెట్టి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పశ్చియాసియాలో యుద్ధం రెండువారాలుగా జరుగుతుండటంతో గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. కట్టెల పొయ్యి వాడటానికి వంట చెరకు అందడం లేదు. ఏదో విధంగా కష్టపడి వాటిని సాధిస్తే.. ఈ కట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. బిల్లులు చూపాలని అటవీ అధికారులు అడుగుతున్నారు. కేంద్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండగా.. గ్యాస్ కొరతను తీర్చి ప్రజలకు అండగా నిలవాల్సి ఉంది. సీఎం చంద్రబాబు ఈ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. పట్టణాల్లో మూతపడిన హోటళ్లు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 100 హోటళ్లు మూత ఉమ్మడి జిల్లాలో చిన్న, పెద్ద హోటళ్లు 600 ఉన్నాయి. కర్నూలు నగరంలో వీటి సంఖ్య 225 వరకు ఉంది. పశి్చయాసియాలోయుద్ధ మొదలైన వెంటనే హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కర్నూలులో 20 వరకు చిన్న, పెద్ద హోటళ్లు మూతపడ్డాయి.ఉమ్మడి జిల్లాలో 100 హోటళ్లు మూతపడటంతో వాటిలో పనిచేసే 10 వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. హోటళ్లు మూత పడటంతో వాటికి అద్దెలు చెల్లించడం కూడా కష్టమవుతుందనే ఆందోళన నిర్వాహకుల్లో వ్యక్తం అవుతోంది. గ్యాస్ కొరత కారణంగా వంట చెరుకుకు డిమాండ్ ఏర్పడింది. యుద్ధానికి ముందు టన్ను వంట చెరుకు ధర రూ.5000 వరకు ఉండగా నేడు రూ.10 వేలకు చేరింది. కరోనా కాలంలో ఎంతో మేలు! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా వచ్చి ప్రపంచం మొత్తం లాక్డౌన్ ప్రకటించింది. ఎగుమతులు, దిగుమతులు బంద్ అయ్యాయి. కరోనా కారణంగా అప్పట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఒక్క రోజు, రెండు రోజులు కాదు... రెండు నెలలకుపైగా లాక్డౌన్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది. అప్పట్లో అందరికీ గ్యాస్ అందింది. ధరలు అదుపులోనే ఉండేవి. బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా? కర్నూలు జిల్లాలో 42 గ్యాస్ ఏజన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.68 లక్షల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కనెక్షన్నుల ఉన్నాయి. రోజుకు 11 వేల సిలిండర్లను డెలివరీ చేయవచ్చు. ఇదే సమయంలో రోజుకు 16 వేల సిలిండర్ల ప్రకారం గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిల్వలు ఉన్న సమయంలో డెలివరీ నెమ్మదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయా అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం అదేమి లేదని, బుకింగ్ ఎక్కువ మంది చేసుకుంటుండడంతో ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. అయితే బుక్ చేసిన సిలిండర్లలో దాదాపు 80 వేలు వెయిటింగ్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ ఇవ్వొద్దు!పశి్చమాసియా యుద్ధంతో గ్యాస్ దిగుబడులు పడిపోయిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే గ్యాస్పై కేంద్రం ఆంక్షలు విధించింది. గతంలో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకు సిలిండర్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకు సిలిండరు అనే విధానానికి మంగళం పలికారు. వంట చెరకు అందుబాటులో ఉంటుందని వాడుకోవాలని సూచించారు. అయితే జిల్లా అధికారులు మాత్రం వంటకు కట్టెల వినియోగం వద్దు అని చెబుతున్నారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్, ఎలక్ట్రికల్ స్టౌలు వినియోగించాలని సూచిస్తున్నారు. గ్యాస్ రాదు.. కట్టెల పొయ్యి వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. జనజీవనం సాగేదెలా అని మహిళలు ఆందోళన చెందుతున్నారు. కట్టెల పొయ్యిమీదనే వంటఆదోని సెంట్రల్: గ్యాస్ కొరతతో ఆదోని పట్టణంలోని కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిపై భోజనాలను చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పౌర సరఫరాల అధికారులు హోటళ్లపై దాడులు చేసి గృహాలకు వినియోగించుకోవాల్సిన దాదాపు 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. మూతపడిన టీస్టాల్ పత్తికొండ రూరల్: గ్యాస్ సరఫరా మందగించడంతో టీ, టిఫిన్ సెంటర్లు, భోజనం హోటళ్లు మూతబడ్డాయి. చిన్నాచితక హోటల్ నిర్వాహకులు గత కొన్నిరోజుల క్రిందటే మూసివేశారు. కొన్నిరోజుల నుంచి సమస్య తలెత్తినా ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇక నిర్వహణ చేతకాక హోటల్లు సర్దుకుని మూతేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుతెరువు నిమిత్తం వచ్చిన రాజస్థాన్ హోటల్ నిర్వాహకులు హోటల్ సర్దుకుని వారి ప్రాంతానికి తరలివెళ్లారు.డిమాండ్కు సరిపడేంత సరఫరా కర్నూలు జిల్లాలో తగినన్ని గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జిల్లాలో 11 వేల సిలిండర్లు నిల్వ ఉన్నాయి. వీటికి అదనంగా మరో 7 వేల సిలిండర్లు వచ్చాయి. ప్రతిరోజు సగటున సుమారు 10 వేల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి. – నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు పన్ను మినహాయింపులు ఇవ్వాలి కరోనా సమయంలో కూడా మేం ఇంత ఇబ్బంది పడలేదు. మొదటిసారిగా హోటళ్లు నడుపలేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ దొరకడం లేదు. కట్టెల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం చొరువ తీసుకొని పన్ను మినహాయింపులు ఇవ్వాలి. పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు మనుగడ కోల్పోకుండా చూడాలి. – ఎం.విజయ తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి, హోటల్స్ అసోసియేషన్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల్లేవ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందించాలి. బయట కొనుగోలు చేసే పరిస్థితి వారికి రాకూడదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇది తూచా తప్పకుండా పాటించింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో తీవ్ర మందుల కొరత ఏర్పడింది. డ్రగ్ స్టోర్స్లో 700 రకాలకు పైగా మందులకు గాను 300 నుంచి 450 రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా రోగులపై మోయలేనంత ఆరి్థక భారం పడుతోంది. రాష్ట్రంలో చిన్నా, పెద్ద అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి రాజ్యమేలుతోంది. సీఎంగా చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్నిచోట్లా నిర్దేశించిన మేరకు మందులు, సర్జికల్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండటంలేదు. ఇప్పుడీ సమస్య మరింత తీవ్రమైంది. మందుల కొనుగోలుకు అదనపు బడ్జెట్ ఇవ్వాలని వైద్యశాఖ కోరితే అదనంగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విదల్చలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ క్వార్టర్కు సంబంధించిన మందులు, సర్జికల్స్ మార్చినెల ముగుస్తున్నా ఆస్పత్రులకు చేరలేదు. ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కనీసం దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న సమస్యలకు సైతం పేదలు మందులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.కనికరంలేని సర్కారు.. రాష్ట్రవ్యాప్తంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సెకండరీ హెల్త్, డీఎంఈ తదితర ఆస్పత్రుల్లో మందుల కోసం ఏటా రూ.700 కోట్ల మేర బడ్జెట్ అవసరమవుతుంది. 2025–26 సంవత్సరానికి రూ.600 కోట్ల మేర మాత్రమే కేటాయించారు. ఈ అరకొర బడ్జెట్ డిసెంబరు నాటికే ఖర్చయిపోయింది. దీంతో అత్యంత కీలకమైన డీఎంఈ పరిధిలోని టెరిషరీ కేర్ ఆస్పత్రులకు జనవరి నుంచి మందుల కొనుగోళ్లకు బడ్జెట్లేని హీన పరిస్థితి. ఈ క్రమంలో.. మందులు, మెడికల్ ఆక్సిజన్ కొనుగోలుకు అదనంగా రూ.112 కోట్ల బడ్జెట్ కావాలంటూ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైల్ను ప్రభుత్వం వివిధ కొర్రీలతో తిప్పి పంపినట్లు తెలిసింది. ఈ కొర్రీలకు బదులిస్తూ వైద్యశాఖ రెండోసారి ఫైల్ను పంపగా, నిధులు మంజూరు చేయకుండానే ప్రభుత్వం గత నెలలో ఫైల్ను మళ్లీ వెనక్కి పంపడంతో వైద్యారోగ్య శాఖాధికారులు తలలు పట్టుకున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల బడ్జెట్ను సర్దుబాటు చేసుకున్నారు. పేదల ఆరోగ్యంపట్ల కనికరం లేకుండా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ఆ ప్రభావం నాలుగో క్వార్టర్ మందుల సరఫరాపై పడింది. ఫిబ్రవరి నెలలో పీఓ.. సాధారణంగా.. ప్రభుత్వాస్పత్రులకు నాలుగు క్వార్టర్లుగా ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది. ప్రతి క్వార్టర్ ప్రారంభానికి ముందు నెలలోనే సరఫరా సంస్థకు పర్చేజ్ ఆర్డర్ (పీఓ) ఇస్తుంటారు. ఈ క్రమంలో.. ప్రస్తుత నాలుగో క్వార్టర్ పీఓలు గతేడాది డిసెంబరులో ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం అదనపు బడ్జెట్ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. చివరికి.. ఫిబ్రవరి నెలాఖరులో ఎంఎస్ఐడీసీ పీఓలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పటివరకు నాలుగో క్వార్టర్ మందులు, సర్జికల్స్ను సరఫరా సంస్థలు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీసీ)లకు పంపలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్స్లో 700 రకాలకు పైగా మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. 300 నుంచి 450 రకాల మేర మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సీడీఎస్లలోనే మందుల నిల్వలు లేవు.కిడ్నీ రోగుల తీవ్ర అవస్థలుప్రభుత్వం మందులు, సర్జికల్స్ సరఫరా చేయకపోవడంతో వైద్యులు సూచించిన మందులను బయట కొనుగోలు చేసుకోవాలంటూ సిబ్బంది రోగులకు చీటీలు రాసిస్తున్నారు. మరోవైపు.. కిడ్నీ రోగులకు ప్రాణాధారమైన కంటిన్యూయస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) బ్యాగుల సరఫరా కొన్నినెలలుగా ఎంఎస్ఐడీసీ నుంచి పూర్తిగా నిలిచిపోయింది. డయాలసిస్లో రక్తంలోని వ్యర్థాలను వడగట్టేందుకు ఈ బ్యాగ్లు ఉపయోగపడతాయి. ఇంతటి కీలకమైన సీఏపీడీ బ్యాగులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాలని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500కు పైగా విలువచేసే ఈ బ్యాగులు నిత్యం కొనాలంటే రూ.వేలల్లో ఖర్చుచేయాల్సి వస్తోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లా సహా, వివిధ జిల్లాల్లోని సెకండరీ హెల్త్, పీహెచ్సీల్లో బీపీ, షుగర్ మందులకు కొరత ఏర్పడింది. చివరికి.. దగ్గు, జలుబు, జ్వరం సిరప్లకు కూడా దిక్కులేదు. -
Andhra Pradesh: 28న శాసనసభ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ ఈ నెల 28న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేరుతో బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. 28వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దానిని కేంద్రానికి పంపించి.. పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే.. దానిపై తప్పనిసరిగా కేంద్రం స్పందిస్తుందనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శాసనసభలో మాత్రమే తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. మండలిలో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉండడం.. ఆ పార్టీ సభ్యులు రాజధాని రైతుల సమస్యలపై ప్రశ్నిస్తుండడంతో కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరచి.. తీర్మానం చేయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు కేబినెట్ సమావేశంసీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
హాజరు లేకున్నా.. బిల్లులు చెల్లింపు
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోతున్నారు. కల్లబొల్లి మాటలతో పెద్ద మొత్తంలో కమీషన్లు కొల్లగొట్టడమే ధ్యేయంగా ఏకంగా కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టి కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెడుతున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సేవల కోసం కుదర్చుకున్న ఒప్పందాలను అతిక్రమించి అధ్వాన్నమైన సేవలు అందిస్తున్న ఏజెన్సీలకు అక్రమంగా రూ.కోట్ల బిల్లులు చెల్లించేస్తున్నారు. సెక్యూరిటీ సంస్థలకు నెలకు రూ.8 కోట్లకుపైగా, శానిటేషన్కు రూ.14 కోట్లపైనే ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపుల్లో నిబంధనలకు అధికారులు పాతరేశారు. కేవలం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ మౌఖిక ఆదేశాలతో నిబంధనలు సడలించి అక్రమ చెల్లింపులు చేసేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు అద్దం పడుతోంది. తక్కువ హాజరుకు పూర్తి బిల్లులు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ సేవల నిర్వహణ కోసం కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. సీఎం బంధువు సంస్థతోపాటు, కీలక నేతకు కోరినంత కమీషన్ ఇచ్చేలా ఎంవోయూ కుదుర్చుకున్న ఏజెన్సీలకే అప్పట్లో కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఏజెన్సీల ఎంపికలోనే కాకుండా, వారికి బిల్లుల చెల్లింపుల్లోను ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని బహిర్గతం అయింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నిబంధనల్లో రెండు రకాల ఏజెన్సీల సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) హాజరు 95 శాతం, ఆపైన ఉంటేనే నెలవారీ వంద శాతం చెల్లింపులకు అర్హత ఉంటుంది. హాజరు శాతం కంటే తక్కువ ఉంటే.. తగ్గిన హాజరు ఆధారంగా చెల్లింపుల్లో కోత పెట్టాలి. ఉదాహరణకు 75 శాతం హాజరు ఉంటే బిల్లులు 75 శాతం మాత్రమే చెల్లించాలి. గతేడాది జూన్లో సెక్యూరిటీ, అక్టోబర్లో శానిటేషన్ ఏజెన్సీలు సేవలు ప్రారంభించాయి. అన్ని ఏజెన్సీల సిబ్బంది హాజరు ఇప్పటి వరకూ వంద శాతం చెల్లింపులకు అనుగుణంగా 95 శాతం నమోదు కాలేదు. దీంతో తమకు రావాల్సిన బిల్లుల్లో భారీగా కోతలు పడతాయని భావించిన ఏజెన్సీలు ఎఫ్ఆర్ఎస్ నిబంధన నుంచి సడలించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో బిల్లుల్లో భారీ కోతలు పడితే తమకు వచ్చే కమీషన్లలోనూ కోతలు విధిస్తారని నేతలు భావించారో ఏమో కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టేశారు. ఏజెన్సీలకు హాజరు శాతంతో పనిలేకుండా గతేడాది డిసెంబర్ వరకూ చెల్లింపులు చేసేయాలంటూ గతేడాది నవంబర్ 12 డీఎంఈ అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో సౌరభ్గౌర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ మీటింగ్ మినిట్స్ ఆధారంగా జూన్ నుంచి నవంబర్ వరకూ సెక్యూరిటీ, శానిటేషన్ సంస్థలకు ప్రభుత్వం చెల్లింపులు కూడా చేసేసింది. బరితెగింపునకు పరాకాష్ట వాస్తవానికి సెక్యూరిటీ, శానిటేషన్ సేవలు మ్యాన్పవర్తో ముడిపడిన అంశం. ఇవేమీ భవన, ఇతర ప్రాజెక్ట్ల నిర్మాణం వంటి సేవలు కాదు. మిషనరీ, నిపుణులైన అధికారులు, కారి్మకులను ఇతర ప్రాంతాల నుంచి మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆస్పత్రుల్లో అప్పటి వరకూ పాత ఏజెన్సీలో పనిచేసిన సిబ్బందే మెజారిటీ శాతం కాంట్రాక్ట్ మారిన అనంతరం కొత్త ఏజెన్సీకి మారిపోతారు. ఈ క్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ కోసం ప్రభుత్వం జీవో ద్వారా ఇచ్చిన పాలసీలో ఎక్కడా కొత్త కాంట్రాక్ట్ సంస్థలకు కొద్ది నెలల పాటు నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. అంటే సదరు సంస్థలు సేవలు ప్రారంభించిన రోజు నుంచే ఎఫ్ఆర్ఎస్ ఇతర నిబంధనలు అమలులోకి వస్తాయన్నమాట. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ సంస్థలు కోరుతున్నాయని నోటి మాటపై నిబంధనలు మినహాయింపు ఇవ్వడం కాంట్రాక్ట్ నిబంధనలను వంద శాతం అతిక్రమించడమే అవుతుంది. సాధారణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన అంశాల్లో మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే తిరిగి ప్రభుత్వం జీవో/అధికారిక సర్క్యులర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్లకు ఆర్థికంగా మేలు చేస్తూ మీటింగ్ మినిట్స్ రూపంలో ఆదేశాలు ఇవ్వడం, దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా నిధులు చెల్లింపులు చేయడం ద్వారా భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపింది. సీఎం బంధువు సంస్థకు 61 శాతం హాజరే ప్రభుత్వం నిధులను దోచిపెట్టడం కోసం తెచ్చిన సడలింపులతో ఏకంగా 61 శాతం ఎఫ్ఆర్ఎస్ హాజరుతో అట్టడుగు స్థాయిలో ఉన్న సీఎం బంధువు సంస్థ పద్మావతికి భారీ మేలు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ జోన్–3(రాయలసీమ) జిల్లాల్లోని డీఎంఈ ఆస్పత్రుల్లో శానిటేషన్ సేవల్లో ఉంది. గతేడాది నవంబర్ నెలలో 1,800 మంది మేర సిబ్బంది ఎన్రోల్ అయినప్పటికీ హాజరు మాత్రం 61 శాతమే నమోదైంది. ఇంత ఘోరమైన పనితీరు కనబరిచిన పద్మావతి సంస్థకు హాజరు సడలింపు ద్వారా ప్రభుత్వం భారీ మేలు చేసిపెట్టినట్టు వెల్లడవుతోంది. సెక్యూరిటీ, శానిటేషన్ సంస్థల పనితీరుకు ఆస్పత్రుల్లో ఇచ్చే స్కోర్ ఆధారంగా ప్రభుత్వం నవంబర్ వరకూ బిల్లు చెల్లించినట్లు కలరింగ్ ఇస్తున్నారు. దీనికోసం ఏజెన్సీల నిర్వాహకులు సూపరింటెండెంట్స్, ఇతర అధికారులను మేనేజ్ చేసుకుని భారీ స్కోర్ పొందినట్టు తెలుస్తోంది. స్కోర్ల జారీ అంశంలో జరిగిన స్కామ్ కూడా ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేతో బట్టబయలైంది. -
తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..
-
కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!
-
యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి
-
జగన్ గుడ్ న్యూస్.. 263 MLA సీట్లు .. 38 MP సీట్లు
-
‘పచ్చ పత్రికల కథనాలే బదిలీలకు ప్రామాణికమా?’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకథలే అన్నట్టు వ్యవహరిస్తూ... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు.రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...బాబు హయాంలో ప్రతి గడపకీ కక్ష రాజకీయమే..వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది. 151 పైగా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా.. కుమారుడు లోకేష్, భాగస్వామి పవన్ కళ్యాణ్, లేదా అధికారులు వెన్నుపోటు పొడుస్తారని భయపడున్నట్టున్నారు. మీ పాలన దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు సాగుతోంది.జరగని మీటింగ్పై బాబు ఉలికిపాటు..రాష్ట్రంలో నేను నిప్పులాంటి నాయకుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు... ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా తడబాటు పడుతూ తప్పుడు అడుగులు వేస్తున్నారు. నెల్లూరులో ఓ మాజీ అధికారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడికి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వస్తే... ఆయన్ను నీలకంఠారెడ్డి కలిసారని, కొంతమంది ఐఏఎస్ లతో జవహర్ రెడ్డి మీటింగ్ పెట్టారని ఓ ఎల్లో మీడియా పత్రికలో కట్టుకథను వండి వార్చితే.. దాన్ని ఆధారంగా చేసుకుని నీలకంఠా రెడ్డి ని ఎలా బదిలీ చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు?అసలు జవహర్ రెడ్డి నెల్లూరే వెళ్లనప్పుడు ఐఏఎస్ లతో ఎలా సమావేశం నిర్వహిస్తారు? ప్రభుత్వం ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు విలువ లేకుండా ఇంటి చాడీలకు ఎందుకు విలువనిస్తున్నారు? పీఎస్ ఆర్ ఆంజనేయలు, పీవీ సునీల్ కుమార్, జాషువా, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా, సంజయ్, నాయక్ వంటి అధికారులు చేసిన పాపం ఏంటి?గత ప్రభుత్వంలో పనిచేస్తే వారి మీద ఈ విధంగా దాడి చేస్తారా? మీ ఇంటి దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదు కదా? వాళ్ల తల్లిదండ్రుల రక్తం కష్టంతో ఉన్నత చదువులు చదువుకుని దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లను మీ రాజకీయ వేధింపులకి బలి చేయడం ఎంత వరకు సమంజసం? వైఎస్ జగన్ హయాంలో హుందాతనం..వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హయాంలో పనిచేసిన వ్యక్తులను పదవుల్లో కొనసాగించామే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు. ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్, కృష్ణబాబు, ప్రద్యుమ్న, సతీష్ చంద్ర వంటి మీ దగ్గరపనిచేసిన అధికార్లకు కూడా మా ప్రభుత్వ హయాంలో అత్యున్నత మైన బాధ్యతలు అప్పజెప్పి కంటిన్యూ చేశాం. మంచి శాఖల్లో పోస్టింగులిచ్చి.. వారి సేవలను దేశానికి ఉపయోగపడేలా మేం చర్యలు తీసుకుంటే.. మీరు ఒట్టి మాటలు, టిష్యూ పేపర్లలాంటి మీ కరపత్రికల్లో వండి వార్చిన కథనాలను ఆధారాలుగా చేసుకుని జీవోలు మార్చుతున్న వైనం చూస్తుంటే చంద్రబాబు చేస్తున్నది పాలనే కాదన్న విషయం సుష్పష్టంగా అర్థం అవుతోంది.గతంలో తన పాలనలో అవినీతి చక్రవర్తి అని ముద్రవేసుకున్న చంద్రబాబు ఈ దఫా పాలనలో అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఎస్బీ నుంచి డీఐజీ వరకూ అదే విధంగా ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రతివారినీ కేసులతో వేధిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇవన్నీ చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతున్నాయి.అనుభవం ఉన్న అధికారులను అణగద్రొక్కుతూ, అడుగులుకు మడుగులు ఒత్తుతున్న అధికారులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. అవినీతి అధికారులకా గత చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు మరలా ఇవాళ పెత్తనం చలాయిస్తున్నారు. గతంలో బాబు పాలనలో జరిగిన స్కాముల్లో ఆ అవినీతి అధికారులంతా పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నవాళ్లే.బాబు పాలనలో కక్ష సాధింపులు..ఇవాళ చంద్రబాబు తనమీదున్న కేసులను ఎలాగూ కొట్టేయించుకుంటున్నాడు. తాను చేస్తున్న అవినీతి అంతా అధికారులతో చేయిస్తున్నాడు. పాలన పూర్తిగా గాలికొదిలేశాడు. బ్యూరోక్రసీని బలిపశువును చేసి... అందులో అధికారులను సమిధిలుగా మార్చుతున్నాడు. చివరకు పక్కరాష్ట్రానికి వెళ్లి పనిచేస్తున్న అధికారుల మీద కూడా కక్షకా ద్వేషాలు చూపిస్తున్నాడు. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజ్యంలా.. అధికార ప్రభుత్వంలో తమ కులంలో ఉన్న కొంతమంది అధికారులే పెత్తందారులగా చలామణీ అవుతున్నారు. నీలకంఠారెడ్డిని బదిలీ చేయడానికి ప్రభుత్వం చూపిస్తున్న కారణం, జరిగిన సంఘటన రెండూ సంబంధం లేని ఘటనలే.పుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తాను చేసిన అతి ప్రవర్తనను నీలకంఠారెడ్డి ఖండించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. పూర్ణచంద్ర రావు వెనుకున్న లోకేష్, తన సామాజికవర్గం చెందిన వాడు కావడంతోనే... నీలకంఠా రెడ్డిపై జులుం ప్రదర్శించారని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, సీఎం చంద్రబాబులు సకల విఫల శాఖా మంత్రులగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ.. అధోగతి పాల్జేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యుద్ధం పేరుతో బాబు మోసం జగన్ కీలక వ్యాఖ్యలు
-
మా ప్రభుత్వం దోచేస్తుంది.. ఆధారాలు బయటపెట్టిన కొలికపూడి
-
కూటమికి ఝలక్.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూటమి సర్కార్ టార్గెట్గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో, కొలికపూడి పోస్టు చర్చనీయాంశంగా మారింది.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తాజాగా బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందించారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్గా ఏర్పడి బెల్టు షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎమ్మార్పీపై 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 వసూలు చేస్తున్నారంటూ పోస్టులో తెలిపారు. లిక్కర్ సిండికేట్తో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు పాటించడం లేదు. గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ బెల్ట్ షాపుల దందా కొనసాగుతోందన్నారు. దీంతో, కొలికపూడి పోస్ట్ మరోమారు చర్చనీయాంశంగా మారింది. -
బాబుకు బిగ్ షాక్ కరకట్ట ఇల్లును ముట్టడించిన ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్.....
-
టాటా.. బైబై.. ఉస్తాద్ రొట్టె కొట్టుడు డైలాగ్స్
-
హామీల ఎగవేత అప్పుల మోత
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదనే ఆవిరి చేస్తూ తాజాగా మంగళవారం 7.88 శాతం వడ్డీతో మరో రూ.3,900 కోట్లు బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో ఈ ఆర్థిక ఏడాది ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులతో చరిత్ర సృష్టించారు. తాజా అప్పుతో 22 నెలల పాలనలో చంద్రబాబు బడ్జెట్లో చేసిన అప్పులు ఏకంగా రూ.1,86,164 కోట్లకు చేరాయి.వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు మరో రూ.1,51,057 కోట్లకు ఎగబాకాయి. దీంతో బాబు పాలనలో మొత్తం అప్పులు రూ.3,37,221 కోట్లకు చేరాయి. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్య కృత్యంగా టీడీపీ కూటమి సర్కారు పాలన సాగుతోందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు. -
ఇంటర్ కొత్త సిలబస్ కార్పొ‘రేట్’కు కాసుల పంట
సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు తమ ఆ«దీనంలో ఉన్న సంస్థలకు పలురకాలుగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఓ ప్రైవేట్ సంస్థకు మేలు చేకూరుస్తూ, కోట్లాది రూపాయల విలువైన ముద్రణ టెండర్ను కట్టబెట్టడం వింతగా మారింది. ఇందుకోసం తెలుగు అకాడమీని సైతం బలి పశువును చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం రూ.10 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో ఉన్న వీజీఎస్ ముద్రణా సంస్థ కోసం టెండర్ నిబంధనలు మార్చి ఇంటర్మీడియెట్ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు అప్పగించారని, ఇందుకోసం విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచే ప్రక్రియ నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే జరిగిందంటే..! 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ సిలబస్ మారింది. తొలుత మొదటి సంవత్సరం సిలబస్ను మార్చారు. 2026–27లో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. కొత్త పుస్తకాల ముద్రణను తెలుగు అకాడమీ ద్వారా రూ.19 కోట్ల కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్ సంస్థలు టెండర్లు ద్వారా పొందాయి. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకుండానే సిలబస్ సాఫ్ట్ కాపీలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం గమనార్హం. దీని వెనుక వీజీఎస్ ముద్రణా సంస్థ ఉన్నట్టు గుర్తించిన తెలుగు అకాడమీ సదరు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిబంధనలకు పాతర.. గత ప్రభుత్వంలో పుస్తకాల ముదణ్రను ఐదు నుంచి ఆరు సంస్థలకు అప్పగించేవారు. ఇందుకోసం సంస్థల చరిత్ర, పనితీరుతో పాటు వాటిపై ఉన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునే కాంట్రాక్టు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకతకు పూర్తిగా తిలోదకాలిచ్చి అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్ సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలనే మార్చినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా 2026–27 ఇంటర్మీడియెట్ రెండో ఏడాదిలో కొత్త సిలబస్తో రూ.19 కోట్లకు పుస్తకాల ముద్రణను వీజీఎస్కు 70 శాతం, విక్రమ్కు 30 శాతం కాంట్రాక్టును వారం రోజుల క్రితం అప్పగించింది. తెలుగు అకాడమీ సిద్ధం చేసిన సిలబస్ సాఫ్ట్ కాపీలను ఆయా సంస్థలకు అందించారు. రెండు రోజుల్లోనే ఫిజిక్స్, గణితం, మరికొన్ని సబ్జెక్టుల పుస్తకాల సాఫ్ట్ కాపీలు వాటా్సప్లలో హల్చల్ చేశాయి. అప్పటికే అవి పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలకు చేరిపోయాయి. తెలుగు అకాడమీ చరిత్రలో కాపీరైట్ పుస్తకాల కాపీలు ముద్రణకు ముందే కార్పొరేట్ సంస్థలకు వెళ్లిపోవడం దురదృష్టకరం. సాఫ్ట్కాపీలు అందించిన సదరు సంస్థలకు రూ.10 కోట్లు లబ్ధి చేకూరినట్టు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు బుట్టదాఖలు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందిన ముద్రణ సంస్థలు మెటీరియల్ను ఇతరులకు విక్రయించడం లేదా ఇవ్వడం, చేరవేయడం చట్టరీత్యా నేరం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ముద్రణ కాంట్రాక్టును దక్కించుకుని, మరోపక్క ముద్రణకు ఇచ్చిన సిలబస్ సాఫ్ట్ కాపీలను కార్పొరేట్ విద్యాసంస్థలకు అమ్ముకున్నారు. ఇంటర్ పుస్తకాల ముద్రణ దక్కించుకున్న వీజీఎస్ సంస్థ గతంలో కూడా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీఈఆర్టీ సిలబస్ను ప్రైవేటు స్కూళ్లకు అమ్ముకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ ముద్రణా సంస్థపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, ఆ కంపెనీకి మేలు చేసేందుకు ఏకంగా నిబంధనలే మార్చారు. దీంతో ఆయా సంస్థలు కాంట్రాక్టు దక్కించుకోవడంతో పాటు కాసుల వేటలో పడ్డాయి. -
ఎంబీబీఎస్ ‘ఫీ’టముడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు వైద్య విద్య మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేట్ వైద్య కళాశాలలే కాకుండా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పద్మావతి కాలేజీలోనూ ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ఐదేళ్ల ఫీజులను బలవంతంగా వసూలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలను తుంగలో తొక్కి మరీ ధార్మిక సంస్థ కర్కశంగా వ్యవహరించడంపై విద్యార్థు లు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఐదో టర్మ్ ఫీజు కట్టడానికి గడువు విధించి, ఆలోపు చెల్లించకపోతే రోజువారీ పెనాల్టీ విధిస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హెల్త్ వర్సిటీ తీర్మానమూ బేఖాతర్ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేళ్లు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు విద్యార్థులు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల్లో నడిచే వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని గత ప్రభుత్వం జీవో–146ను విడుదల చేసింది. నాలుగున్నరేళ్ల ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఇటీవల హెల్త్ వర్సిటీ కార్యవర్గమూ తీర్మానించింది. అయినా ఐదేళ్ల ఫీజు చెల్లించాలని ఈ నెల 14న పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా ఆదేశాలు జారీ చేశారు. ఐదో టర్మ్(ఏడాది)ఫీజు చెల్లించడానికి బుధవారం(మార్చి 25) చివరి గడువు విధించారు. ఇదేమి అన్యాయమని తల్లిదండ్రులు ప్రశ్నించినా ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని కళాశాల అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. కోర్టు ఉత్తర్వులున్నా.. వైద్య కళాశాలలు నాలుగున్నరేళ్లకే ఎంబీబీఎస్ ఫీజు వసూలు చేయాలని కోర్టులు సైతం ఇప్పటికే పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులనూ పద్మావతితో పాటు, రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలు బేఖాతరు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్ సమయంలోనే చివరి ఏడాది పూర్తి ఫీజు చెల్లించాలని షరతు పెడుతున్నాయి. అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్నా.. చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కళాశాలలను నియంత్రించాల్సిన హెల్త్ వర్సిటీ చోద్యం చూస్తోంది. -
ఉద్యోగుల పాలిట రు‘బాబు పాలన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. ఛీత్కారాలు, వేధింపులు, పనిభారంతోపాటు దాడులు, దాష్టీకాలకు బలవుతున్నారు. తాజాగా తిరుపతిలో సచివాలయ ఉద్యోగిపై జరిగిన దాడే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులను నియమించారు. వారిని ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములను చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేలా రోజూ స్పందన కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగులకు సమాజంలో గౌరవప్రతిష్టలు పెరిగాయి. ఆ ఐదేళ్లు పైరవీలు, పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించడంతో ఉద్యోగులకు ప్రజల్లో మర్యాద పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక స్పందన రద్దుతోపాటు సర్కారు విధానాల వల్ల ప్రజల నుంచి సచివాలయ ఉద్యోగులు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ నేతల వేధింపులకు బలవుతున్నారు. సర్వేలు, పన్ను టార్గెట్లతో ప్రజల్లో ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం తరచూ సర్వేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచింది. దీంతో ఇంటింటి సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లాల్సి వస్తోంది. అడిగిన సమాచారమే మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. దీంతో ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావం పెరగడంతోపాటు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. తాజాగా పన్నుల వసూళ్లు టార్గెట్లు పెట్టి మరీ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతోపాటు వసూళ్లు చేయకపోతే సంజాయిషీలు, చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. బలవంతపు వసూళ్లకు పురిగొల్పింంది. తమపై ఉన్న ఒత్తిడితో ఉద్యోగులు పదేపదే ఇంటింటికీ వెళ్లి పన్నులు అడుగుతుండడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తిరుపతి నగరంలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడికి ఇదే కారణమని చెబుతున్నారు. సర్కారు విధానాల వల్ల ఉద్యోగులు వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంబద్ధ ప్రశ్నలతో చికాకు.. సర్వేల పేరుతో ప్రభుత్వం రూపొందించే అసంబద్ధ ప్రశ్నలు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనికితోడు ప్రతిసారీ ఓటీపీలు అడుగుతుండడంతో ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహానికి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారు.కుక్కల లెక్కలకూ వాళ్లే.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కల లెక్కలూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. మరుగుదొడ్ల వద్ద విధులూ కేటాయిస్తోంది. ఇప్పుడు పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి వంద శాతం వసూలు చేయాల్సిందేనని రుబాబు చేస్తోంది. దీంతో పని ఒత్తిడి ఎక్కువై ఉద్యోగులు మరణిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో దాడులు, దాష్టీకాలకు గురవుతున్నారు. దీనికి సర్కారు విధానాలే కారణం. తిరుపతిలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఒత్తిడి, ప్రజల వ్యతిరేకతతో.. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత మధ్య సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు. తిరుపతిలో విధి నిర్వహణలో ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నాగార్జునపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలి. – ఎం.డి.జానిపాషా, బి.అంకమ్మరావు, గ్రామ/వార్డు సచివాలయం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
మళ్లీ భారీగా అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు చేసింది. ఇవాళ (మార్చి 24న) రూ.3,900 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరణ చేసుకుంది. గత మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. వారం తిరగకుండానే మళ్లీ రూ.3,900 కో అప్పు తెచ్చింది. చంద్రబాబు పాలనలో అప్పుల్లో నెంబర్ వన్గా ఏపీ తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అప్పు రూ.3,37,221 కోట్లకు చేరింది. 22 నెలల్లోనే ఇన్ని కోట్ల అప్పు చేసింది. రూ.1,86,164 కోట్ల బడ్జెటరీ అప్పులు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.1,03,670 కోట్లు అప్పు, అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పులు తీసుకుంది. -
సేవ్ ఏపీ ఫైబర్ నినాదాలతో దద్దరిల్లిన బాబు కరకట్ట
-
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్ మండిపడ్డారు.‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంగయ్య అమిత్షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్ చోరీ: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్కు అలవాటుగా మారిపోయిందని.. నిన్న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. గతంలో ఆర్సెలార్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకు రావడానికి వైఎస్ జగన్ కృషి చేస్తే.. పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీ:మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఈ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసింది 2022లో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ అనేది ఒకసారి వీళ్లంతా గుర్తుచేసుకోవాలి. విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ టేకోవర్ చేసుకున్న ఎస్ఆర్ ప్లాంట్ విస్తరణ కోసం దావోస్లో జగన్గారితో లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్యమిట్టల్ ఒప్పందం చేసుకున్నారు.దీంతో పాటు కర్నూలులో గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకూ అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్ ప్రాజెక్టులో ఆర్సెలార్ భాగస్వామి అయింది. ఈ పెట్టుబడులతో పాటు కొత్త స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్గారు కోరడంతో మిట్టల్ సముద్ర తీరం వెంట భూములు కేటాయిస్తే తప్పకుండా ప్లాంట్ పెడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, నేను కూడా ఉన్నాం. మిట్టల్ సంస్థకు భూమి కేటాయించాలని జగన్ చెబితే.. మేం కాకినాడ, మూలపేట పోర్టు, నక్కపల్లి రూపంలో మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఇందులో కంపెనీ ప్రతినిధులు 2024 ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల మధ్య నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉంటుందని ఎంచుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ సంగతేంటో చెప్పండి?:అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా.. హిమాచల్ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. వారు భూములు కావాలంటే అందుబాటులో ఉన్న భూములు ఇవ్వొచ్చు. కానీ, అలా కాకుండా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించారు. దానివల్లే బల్క్డ్రగ్ ముందుకు సాగలేదు.ఇంకా బల్డ్ డ్రగ్ పార్క్ వల్ల జబ్బులు వస్తాయని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారం వల్ల కూడా అది ముందుకు సాగడం లేదు. కేంద్రం, రాష్ట్రాలతో పోరాడి తెచ్చిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ముందుకెళ్లకపోవడానికి కూటమి పార్టీలే కారణం. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ స్లీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎందుకు శ్రద్ధ లేదు?:అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఎన్ని? అవి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీ పచ్చ మీడియాలో 20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో మీరు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే 10 వేల మంది ఉపాధి పోయింది. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఇప్పుడు మాత్రం వచ్చే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పటివరకూ మీరు అధికారంలో ఉండాలి కదా..రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిశ్రమలు:గతంలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని, అవి ఇప్పుడు తిరిగి వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అచ్యుతాపురంలో కోకా కోలా కంపెనీ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులకు ఓ దండం అని చెప్పి భూమి వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. ఇలా ఈ 20 నెలల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులే. అల్ట్రాటెక్, ఎల్ అండ్ టీ, భారతీ సిమెంట్స్.. ఇలా రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీతో సక్రమంగా పని చేయించుకునే పరిస్ధితి లేదు.పక్కనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో యూబీ బీర్ ఫ్యాక్టరీని స్కిట్లు వేసుకునే ఎమ్మెల్యే తనకు కప్పం కడితే తప్ప పని చేయకుండా అడ్డుకుంటున్నారు. జిందాల్ సంస్ధ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని వస్తే, ఊరూపేరు లేని ఓ సినీ నటిని తీసుకుని వాళ్లను వెళ్లగొట్టారు. మీ పాలనలో మీ భూములు వద్దని వెనక్కి వెళ్లిపోయిన కంపెనీల లిస్ట్ నేను బయటపెడతా, దానిపై సమాధానం చెప్పండి. జగన్గారి హయాంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే, అది వదిలేసి పారిపోయిన కంపెనీల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో పారిపోయిన కంపెనీల సంగతేంటో చెప్పండి.పరిశ్రమలు తెచ్చిన జగన్పై దుష్ప్రచారాలు:విశాఖలో రహేజాతో కలిసి ఇనార్బిట్ మాల్కు నాడు జగన్ శంకుస్థాపన చేశారు. దాన్నే నిన్న (సోమవారం) ప్రారంభించారు. అదీ మా కమిట్మెంట్. విశాఖకు ఇనార్పిట్ మాల్ ఓ ల్యాండ్ మార్క్. విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇనార్పిట్ మాల్ ప్రత్యేకత వేరు. దానికి శంకుస్థాపన చేసింది జగన్. ఈ ప్రభుత్వం తరుచూ మా చిన్నప్పటి నుంచి వింటున్న లులూ మాల్ను ప్రస్తావిస్తుంది. ఈ లులూ మాల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. మేం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అంటే, అదే వారికీ మాకూ తేడా. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడమో చేయాలని ప్రభుత్వాన్ని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
జ్యూస్ ప్యాకెట్లతో పరుగో పరుగు.. చంద్రబాబు సభలో గందరగోళం
-
చంద్రబాబు దిగిపో.. కూటమికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు
-
శాశ్వత భవనాల నిర్మాణం పేరుతో నారా వారి భారీ స్కాం..?
-
యూట్యూబర్లకు నోటీసులు.. TDP తప్పులను ప్రశ్నిస్తే జైలుకే
-
చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాడేç³ల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు. జిల్లాల స్థాయిలో టాస్్కఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలని, వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం పది రోజులకు ఒకసారి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, విద్యారి్థ, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టం, ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తెలియజేయాలని, అల్మట్టి ఎత్తుపెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం తదితర అంశాలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసే బాధ్యతను మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు అప్పగించారు. సమావేశంలో పార్టీ నాయకులు సాకే శైలజానాథ్, ఎస్వీ సతీష్రెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, కాటసాని రామ్భూపాల్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మలసాని మనోహర్రెడ్డి, జిన్నూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ద్రోహి బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు మండిపడ్డారు. విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం సర్కారు తీరుపై గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన సీహెచ్వోలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీహెచ్వోలు మాట్లాడుతూ రాత్రిపూట ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు పేరిట ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేని ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలు అన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కోసం వెంటనే కమిటీని వేయాలని, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సౌకర్యాన్ని తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్చేశారు.అద్దె భవనాల్లో కొనసాగుతున్న విలేజ్ క్లినిక్స్కు మూడు నెలల అడ్వాన్స్ రెంట్ చెల్లించాలని కోరారు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో యజమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. సీహెచ్వోల ధర్మ పోరాటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎ.వి. నాగేశ్వరరావు, ఐద్వా నేత రమాదేవి సంఘీభావం తెలిపారు. అనంతరం నాగేశ్వరావు మాట్లాడుతూ సీహెచ్వోల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ సర్కారు ఉద్యోగ ద్రోహి అని అభివర్ణించారు.రాత్రి ఎనిమిది గంటలకు హాజరు వేయాలని ప్రభుత్వమే కార్మీక చట్టాలను అతిక్రమించడం తగదన్నారు. రమాదేవి మాట్లాడుతూ రాత్రి హాజరుతో ముడిపెట్టి ఇన్సెంటివ్స్లో కోతలు పెట్టి చిరుద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి సీహెచ్వోల ఉద్యోగ క్రమబద్ధికరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీహెచ్వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రియాంక మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రేమ్, సంయుక్త కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సిద్దు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి’
తాడేపల్లి : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దీనికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జిల్లాల స్ధాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలి. వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం, పది రోజులకోసారి జిల్లా స్ధాయిలో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్ధి, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలి. రాయలసీమ జిల్లాలలో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై వివరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్లలో కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్ళాలి. అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, రైతాంగానికి వచ్చే సమస్యలు తదితర అంశాలపై ఆయా జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
‘వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి’
విశాఖపట్నం: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడ్డారు. ఈరోజు( సోమవారం, మార్చి 23వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. వైఎస్ జగన్ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్పై అభాండాలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సహనంగా ఉన్నా అబాండాలు వేస్తూనే ఉన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. ప్రెస్మీట్లు పెట్టి అసత్యాలు చెబుతున్నారు. సొంత అన్నను దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ చేతులు కలుపుతారా?,ఇంత ప్రేమగా చెల్లెళ్లను చూసుకొనే అన్న ఎవరైనా ఉన్నారా?, మీపై ప్రేమతో జగన్ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? , బాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ను ద్వేషించే చంద్రబాబుతో మీరు స్నేహం చేస్తున్నారు.చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా?, మీకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా?, తెలంగాణ పార్టీ పెట్టి కడదాకా అక్కడే ఉంటా అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను విడిచిపెట్టేది లేదన్నారు. కానీ అక్కడ పార్టీ మూసేసి ఇక్కడకు వచ్చారు’ అని మండిపడ్డారు వరుదు కళ్యాణి.జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి.. వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడిగితే చెబుతారని వరుదు కళ్యాణి సవాల్ చేశారు. ‘ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. మీ తప్పుడు ఆరోపణలకు మేం సమాధానం చెబుతున్నాంఆయన సహనాన్ని మీరు బలహీనతగా తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. వైఎస్ జగన్ చెల్లెలు కదా అని సహనంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. ఎవరి డైరక్షన్లో మీరు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. అవినాష్రెడ్డి, రాచమల్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలేవి?, వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత మీకు లేదా?, వైఎస్ జగన్పై దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నిలదీశారు. -
‘రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?’
తాడేపల్లి : రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాధ్. రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందకంత ద్వేషం అని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘ వైఎస్ జగన్ రూ. 900 కోట్లతో 90 శాతం ఆల్రెడీ పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. తెలంగాణాకు మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆల్మట్టి నిర్మాణంతో ఇప్పటికే ఏపీకి, రాయలసీమకు అన్యాయం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ నీటిని నిల్వ చేస్తున్నారు. రాష్ట్రమంతటా నీటి కొరత ఏర్పడుబోతోంది. రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. ఏయిమ్స్, గ్రామీణ బ్యాంకు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటివన్నిటినీ చంద్రబాబు తరలించుకుపోయారు. రాయలసీమ మీద చంద్రబాబుకు ప్రేమ లేదనటానికి ఇదే నిదర్శనం. అసలు చంద్రబాబు రాయలసీమకు ఏం న్యాయం చేశారో చెప్పాలి?, వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రైతులన్నా ప్రాజెక్టులన్నా ఎందుకంత ద్వేషం?, పొరుగు రాష్ట్ర సీఎం వద్దన్నారని రాయలసీమ లిఫ్టును ఆపటం ఏంటి?, తెలంగాణ, కర్నాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలి’ అని డిమాండ్ చేశారు. -
నాడు అభివృద్ధికి రూపం .. నేడు దుబారాకు కలరింగ్!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా తక్కువ. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.ఆ భవనాలపై వికృత రాజకీయంరాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు. అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు. -
పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..
-
విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ
-
మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
-
బాబు సభతో ముచ్చెమటలు.. పదో తరగతి విద్యార్థుల అవస్థలు
సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబు సభ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను తరలించడం వల్ల సాధారణ ప్రయాణికులు, ముఖ్యంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, బస్సుల కోసం గంటల కొద్ది బస్ స్టాప్ల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది.అర కొర బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో, గుంపుల మధ్య, రద్దీగా ఉన్న వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. పరీక్ష సమయానికి ఆలస్యమవుతుందనే భయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.ప్రభుత్వ స్కూల్స్కు సెలవుచంద్రబాబు సభతో నర్సీపట్నంలో ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అయితే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం సాధారణంగా కొనసాగాయి. దీంతో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు బస్సుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. -
అప్పులు తెచ్చి.. అడుగడుగునా దోపిడీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు దుబారా వ్యయానికి హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణ పనులు మరో నిదర్శంగా నిలుస్తున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీటీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులను రూ.556 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఇక ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు రూ.424.34 కోట్లతో చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లకు.. అసెంబ్లీ నిర్మాణ పనులు రూ.724.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థలకు సీఆర్డీఏ అప్పగించింది.. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే.. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు, అసెంబ్లీ నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లకు చేరుకుంది.దీంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం అసెంబ్లీ భవనానికి రూ.10,244.07, హైకోర్టు భవనానికి రూ.7,286.03కి పెరిగింది. గతంలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు సగటున రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుగు వ్యయం రూ.19,183కు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.తాజాగా రూ.556 కోట్లు..హైకోర్టు భవనాన్ని ఏజీసీ ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్ను రూపొందించింది. ఈ భవన పనులను రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతులతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ కోట్ చేసి టెండర్ దక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో పేర్కొన్నారు. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్న మాట. తాజాగా.. ఈ భవనం పనులకు రూ.556 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో హైకోర్టు భవన నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు చేరుకుంది. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,244.07అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్, 3 అంతస్తులు (బీ+జీ+3)లో 11,21,975 చ.అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థే రూపొందించింది. ఈ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.4.48 శాతం అధిక ధరకు అంటే.. రూ.617.33 కోట్లకు ఎల్అండ్టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. తాజాగా.. ఈ పనులకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లన్నమాట. అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.10,244.07కు చేరుకుంది.అసలే అప్పులు.. ఆపై దుబారా..ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను చంద్రబాబు ప్రభుత్వ రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఖర్చంతా వృథానే. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. అవసరమైన మేర కంటే భారీగా నిర్మిస్తుండటం వల్ల భవనాల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది.కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో ఫైవ్స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తోనూ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించదని గుర్తు చేస్తున్నారు.అలాంటిది రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయం ఎక్కడా లేనట్లు చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తుండడం చూస్తుంటే నీకింత.. నాకింత అన్నట్లుగా దోచుకోవడానికేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. బీఆర్ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు. -
రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?
-
ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదు: సీపీఐ నారాయణ
సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదంటూ మండిపడ్డారు.పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు...కోటి మంది భారతీయులు గల్ప్ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు -
బీఆర్ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్ నాయుడుకు అటెండర్ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.కీలక సమావేశంలోనే బీఆర్ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.బీఆర్ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్ ఐదో తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ బరితెగించింది.కూటమి ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు మరో స్టేజ్కు చేరుకున్నాయి. అధికార అండతో కోర్టులో కేసు ఉండగానే యాజమాన్యం నిర్మాణాలను ప్రారంభించింది. అయితే, గీతం అక్రమ నిర్మాణాలవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలోని 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో గీతం యాజమాన్యం నిర్మాణాలు చేపట్టింది. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభించింది. అధికార అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఆక్రమిత భూముల్లో ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక, ఇప్పటికే గీతం కబ్జా భూములను 22-ఏ జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల 5000 కోట్ల విలువైన భూమి అడ్డదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ జరిగింది. -
BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా
-
మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు
-
ఏపీలో సైదాపురం గనుల లీజుకు కూటమి సర్కారు సై... ఎన్జీటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు
-
బల్క్ డ్రగ్ పార్కుకు ‘ఉక్కు’తాడు
సాక్షి, అమరావతి: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి దక్కించుకున్న బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. ఈ పార్కు కోసం గత ప్రభుత్వం సేకరించిన 2,000 ఎకరాల్లో 783.74 ఎకరాలు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్కు కేటాయించడం ద్వారా ప్రాజెక్టును వివాదాల సుడిగుండంలోకి నెట్టేశారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23న భూమిపూజ చేయనున్నారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్ పార్కును బాబు సర్కారు నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం వివాద రహితంగా భూసేకరణ పూర్తిచేసినా..! ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి కేటాయించిన భూమికి బదులుగా బల్్కడ్రగ్ పార్కుకు 790 ఎకరాలు భూమిని మత్స్యకార గ్రామాల్లో బాబు సర్కారు కేటాయించినా.. అక్కడ మత్స్యకారులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బల్క్ డ్రగ్ పార్కు ప్రశ్నార్థకంగా మారింది. తొలుత నక్కపల్లి వద్ద బల్్కడ్రగ్ పార్కును అనకాపల్లి, నక్కపల్లి మండలాలకు చెందిన రాజయపేట, డీఎల్ పురం, వేంపాడు, బుచ్చిరాజు పేట, చందనాడ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ భూమిని రాజయపేట, డీఎల్పురం, వేంపాడు, బుచిరాజుపేట, చందనాడ, పెద్దతీర్నాలా సీహెచ్ లక్ష్మీపురం, ఉపమాక, ఎన్నర్సాపురం, గుడివాడ గ్రామాల పరిధిలోకి మార్చారు. గత ప్రభుత్వం వివాద రహితంగా భూ సేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియనూ పూర్తి చేసింది. ఈ లోగా ఎన్నికలు రావడంతో నిర్మాణ పనుల ప్రారంభం ఆగింది. ఈ ఏడాది మార్చి నాటికి బల్్కడ్రగ్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఒక తట్టెడు మట్టి ఎత్తకపోగా చంద్రబాబు సర్కారు మొత్తం ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందాలంటే ఈ ప్రాజెక్టును ఈ నెలలోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ భూసేకరణ కూడా పూర్తి కాకపోవడంతో ఈ గడువును మరో ఏడాది అంటే వచ్చేఏడాది మార్చి వరకు పెంచాలంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మిట్టల్ కోసం విశాఖ ఉక్కు ప్రయోజనాలూ తాకట్టు మిట్టల్ స్టీల్పై ఉన్న విపరీతమైన ప్రేమతో విశాఖ స్టీల్ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారు. విశాఖ ఉక్కుపై తన అక్కసును పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు ముగింపు సమావేశంలో విశాఖ స్టీల్పై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఒంటికాలిపై లేచారు. విశాఖ స్టీల్ కారి్మకులను పనిదొంగలని అభివరి్ణంచారు. పనిచేయకుండా కూర్చొబెట్టి జీతాలు ఇవ్వాలా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు విశాఖ ఉక్కుకు సొంత ఇనుప గనుల గురించి ఏనాడూ కేంద్రంతో చర్చలు జరిపి ఒప్పించని చంద్రబాబు ప్రైవేటు సంస్థ అయిన మిట్టల్ స్టీల్ కోసం నేరుగా ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మిట్టల్ స్టీల్కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించుకున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగనంత స్పీడ్గా అనుమతులన్నీ మంజూరు చేయించి రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచి్చనట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబిచ్చారు. అంతేకాదు మిట్టల్ స్టీల్ కోసం కాకినాడ గేట్వే పోర్టు అభివృద్ధినీ పణంగా పెట్టి అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద సముద్రపు ఒడ్డు నుంచి 2.9 కిలోమీటర్లలోపు క్యాపిటివ్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి బాబు సర్కారు అనుమతించింది. ఒక్క మిట్టల్ స్టీల్ కోసం బల్్కడ్రగ్ పార్కు, కాకినాడ గేట్వే పోర్టులను పణంగా పెట్టడమే కాకుండా అనుమతుల దగ్గర నుంచి గనుల కేటాయింపు వరకు ప్రత్యేక దృష్టి సారించిన దాంట్లో పదో శాతం శ్రద్ద విశాఖ స్టీల్పై పెట్టి ఉంటే విశాఖ స్టీల్ ఇప్పటికే స్వయం ప్రతిపత్తి సంస్థగా ఎదిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. -
ఏపీఐఐసీ దైన్యం.. ప్రైవేటుకు దాసోహం
సాక్షి, అమరావతి : ఐటీ కంపెనీల ముసుగులో ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు ఏపీఐఐసీ సేకరించిన విలువైన భూములపై పడింది. అనేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో ఘన చరిత్ర ఉన్న ఏపీఐఐసీని ‘రియల్’ దోపీడి సంస్థగా మార్చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం పేదల నుంచి కారు చౌకగా సేకరించిన భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు చౌకగా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏపీఐఐసీ.. ఆ పని వదిలేసి, సేకరించిన భూములను సైతం ప్రభుత్వ పెద్దలకు చెందిన బినామీ రియల్ ఎస్టేట్ సంస్థలు, రహస్య భాగస్వాములకు ధారాదత్తం చేయనుంది. తాజాగా ఇప్పటికే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నాయుడు పేట, కొప్పర్తి, మాచర్ల, నందిగామ వంటి చోట్ల రూ.కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 14 చోట్ల 4,109.01 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ఏపీఐఐసీ ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అత్యల్పంగా కొప్పర్తిలో 100 ఎకరాలు, అత్యధికంగా నాయుడుపేటలో 500 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనుంది. పారిశ్రామిక పార్కులు, పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు కట్టిన సంస్థలే కాకుండా, రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రైవేటు పార్కుల పాలసీ ముసుగులో తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే ఈ నిబంధనల ఉద్దేశమని వారు స్పష్టం చేస్తున్నారు. ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పార్కుల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమిని కేటాయించాల్సి ఉంటుంది. పారిశ్రామిక పార్కుల పేరిట దళితుల నుంచి భారీ ఎత్తున భూమిని సేకరించి, ఇప్పుడు వాటిని గంపగుత్తగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా ఆ రిజర్వేషన్కు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. ఐదు తొలగించి.. నాలుగు చేర్చి.. గతేడాది ఆగస్టులో ఏపీఐఐసీ 15 చోట్ల ప్రైవేటు పార్కుల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచింది. కానీ అందులో పేర్కొన్న కొన్ని ప్రాంతాల భూములపై రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో టెండర్ల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, తాజాగా టెండర్లను పిలిచింది. ఉదాహరణకు జగ్గయ్యపేట వద్ద ఉన్న జయంతిపురం వద్ద 498.93 ఎకరాల భూమిలో ప్రైవేటు పార్కు అభివృద్ధి కోసం టెండర్లు పిలిచారు. కానీ ఈ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి అత్యంత దగ్గర బంధువులు కన్నేశారు. దీన్ని ప్రైవేటు పార్కుల లిస్టులో పెట్టడంతో వారి నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో తొలగించారు. ఇదే రీతిలో ఒత్తిడి రావడంతో అచ్యుతాపురం (280.55 ఎకరాలు), రౌతు సురమాల (481.50 ఎకరాలు) కోసలనగరం (500 ఎకరాలు), చిలమత్తూరు (124.36 ఎకరాలు) భూములను తాజాగా టెండర్ల లిస్టు నుంచి తొలగించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా నాయుడుపేట(500 ఎకరాలు), కొప్పర్తి (100 ఎకరాలు), పామూరు (458.07 ఎకరాలు), మాకవారిపాలెం (198.42 ఎకరాలు) వచ్చి చేరాయి. గతంలో టెండర్లు పిలిచిన వాటిని ఎందుకు తొలగించారు.. ఇప్పుడు కొత్త వాటిని ఏ విధానంలో చేర్చారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన వివరణ లేదు. ఏపీ ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ 2024–29 పేరిట 14 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయడానికి ఏప్రిల్ 22 ఆఖరు తేది అని మాత్రమే పేర్కొన్నారు. -
దేవుడి భూములకు బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా దేవాలయాలకు చెందిన విలువైన ఆస్తులపై దృష్టి సారించింది! ప్రముఖ దేవాలయాలకు చెందిన అత్యంత విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ.. పవిత్ర ప్రాంగణాల్లో వ్యాపార కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది! ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతించడం ద్వారా విచ్చలవిడి ధోరణికి తెర తీస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే 2024 ఆగస్టు 27న పెద్ద ఆలయాల పరిసరాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇటీవల ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ దేవుడు భూములను 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈవోలను ఆదేశించారు. ఆరు ఆలయాల వద్ద.. మద్యం, మాంసం సరఫరా జరిగే ప్రైవేట్ హోటళ్లను ఆలయాల వద్ద అదికూడా దేవుడి భూములను లీజుకిచ్చి అనుమతించడం పట్ల దేవదాయశాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల వద్ద అర ఎకరం నుంచి ఎకరం చొప్పున ప్రైవేట్ హోటళ్లకు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే వీటిల్లో విజయవాడ దుర్గ గుడి మినహా మిగిలిన ఆరు చోట్ల భక్తుల కోసం ఆయా ఆలయాల నిధులతో నిరి్మంచిన గదులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో చోట వందకు పైగా అద్దె గదులున్న దేవాలయాలున్నాయి. భక్తులకు అన్ని రకాల వసతులతో ఏసీ గదులు అందుబాటు ధరలో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని కాదని ప్రైవేట్ హోటళ్ల నిర్మాణాలకు అనుమతించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వేలం లేకుండా కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే..! దేవదాయశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, సత్రాల పేరిట 4.45 లక్షల ఎకరాల భూములు ఉండగా 2.11 కోట్ల చదరపు గజాలు (4,355 ఎకరాలు) ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. 33 ఏళ్ల లీజుకు అప్పగించడం అంటే హోటళ్ల నిర్మాణం జరిగాక ఇక ఆ భూములు తిరిగి దేవాలయాల ఆ«దీనంలోకి వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది. వేలం విధానంలో కాకుండా లీజు ద్వారా కేటాయించడంతో టీడీపీ పెద్దల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని పేర్కొంటున్నారు. 2014–19 మధ్య కూడా చంద్రబాబు ఇదే రీతిలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసమంటూ విశాఖ పరిధిలోని దేవదాయశాఖ భూములకు బేరం పెట్టింది. రూ.వంద కోట్లకు భూములను విక్రయించినా విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదు. -
‘అరటి’పై బాబు కోతలే!
‘అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రాయలసీమ అరటిని ముంబై, కోల్కత్తా లాంటి జాతీయ మార్కెట్లకు తరలించేందుకు లాజిస్టిక్స్ ప్లాన్ సమర్ధంగా అమలు చేశాం. రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయడంవల్ల రైతులకు గరిష్ట ధరలు లభిస్తున్నాయి. అన్నదాతకు గిట్టుబాటు ధర దక్కేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..’ – సీఎం చంద్రబాబు‘హ్యాపీ ఫార్మర్ – హ్యాపీ ఏపీ..’ గత ప్రభుత్వ పాలనలో నష్టపోయిన అరటి రైతులకు మన కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వచ్చాయి. మార్కెట్ పరిస్థితులను గాడిలో పెట్టడం వల్ల క్వింటాల్కు రికార్డు స్థాయిలో ధరలు లభిస్తున్నాయి. రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే మా ధ్యేయం. గతేడాది నష్టాల నుంచి అన్నదాతలను బయటపడేశాం..’ – మంత్రి నారా లోకేశ్సాక్షి, అమరావతి: ధరలు కొద్దిగా పెరిగితే చాలు.. ‘మా చొరవతోనే రైతుకు భారీ ధరలు‘ అంటూ ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం అరటి ధరలు మరోసారి పాతాళానికి దిగజారిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు అంతా తమ గొప్పతనం అంటూ ఊదరగొడుతూ.. రేట్లు పతనమైతే ప్రకృతి వైపరీత్యం.. అంటూ వారిని గాలికొదిలేస్తుండడం గమనార్హం. కోతకొచ్చాక కొనేవారు లేక.. రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఇక్కడ జీ–9 వెరైటీ సాగవుతుంది. ఇదంతా పూర్తిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. గతంలో ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు కాగా పెరిగిన ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీ, రవాణా ఖర్చులతో ప్రస్తుతం రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షలు వరకు వ్యయం అవుతోందని అరటి రైతులు చెబుతున్నారు. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తుండగా 53 శాతం రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. అనంతపురం, నంద్యాల జిల్లాలలో టిష్యూ కల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు డిసెంబర్ నుంచి మార్చి వరకు వస్తుండగా, వైఎస్సార్ కడపలో జనవరి నుంచి మే వరకు దిగుబడులు వస్తాయి. రెండో పంటగా పిలకల ద్వారా సాగైన అరటి జూలై నుంచి డిసెంబర్ వరకు వస్తుంది. 2023–24లో టన్ను రూ.30 వేలకు పైగా పలికిన అరటి గతేడాది రూ.వెయ్యికి దిగజారడంతో అరటి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం టన్ను నాలుగైదు వేలకు మించి పలకని దుస్థితి నెలకొంది. ధర లేక, కొనేవారు లేక పంటను కొంతమంది రైతులు మేకలు, పశువుల మేతకు వదిలేస్తుంటే.. మరికొందరు తోటల్లోనే వదిలేస్తున్నారు. ఇంకొందరైతే కూలీ ఖర్చులు కూడా దక్కడం లేదన్న ఆవేదనతో తోటలను దున్నేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు.. అరటి ధర ఒకటి రెండు రూపాయలు పెరిగినప్పుడు.. విదేశాలకు పంపిస్తున్నాం.. రైతులను రాజులుగా చేస్తున్నాం.. అంటూ ట్వీట్లు వేసే ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ధరలు పతనమై రైతులు రోడ్డున పడితే ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి గాలికిఎగిరిపోయింది. అరటి సహా మొక్కజొన్న, జొన్న, సజ్జలు ధరలు పతనమైనా మార్కెట్లో జోక్యం చేసుకుని పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యాపారుల మధ్య పోటీ పెంచాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరాచేస్తే రైతులు కొంత మేర గట్టెక్కుతారనే స్పృహ లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దలు ట్వీట్లు, స్టేట్మెంట్లతో కాలక్షేపం చేయకుండా తక్షణమే మార్కెట్లో జోక్యం చేసుకొని టన్ను కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో అరటికి మహర్దశ వైఎస్ జగన్ హయాంలో దేశంలోఎక్కడా లేని విధంగా అరటికి ప్రత్యేకంగా మద్దతు ధర ప్రకటించడమే కాదు.. ఏటా పంట మార్కెట్కు వచ్చే ముందే ధరలను పర్యవేక్షిస్తూ ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలిచారు. ఇలా దాదాపు 12వేల టన్నులకు పైగా అరటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకి ఏటా కిసాన్ రైళ్లు నడిపి ఎగుమతులను ప్రోత్సహించారు. 2014–19మధ్య చంద్రబాబు హయాంలో 23 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగితే.. వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య ఏకంగా 3 లక్షల టన్నులకు పైగా సౌదీ అరేబియా, కువైట్, కతార్, బహ్రెయిన్, యూఏఈ, యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతి కావడం గమనార్హం. 2018–19లో టన్ను రూ.5 వేలకు మించని ధర 2023–24లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.32 వేలకు పైగా పలికింది. వైఎస్సార్ సీపీ హయాంలో అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్పోర్టు ప్రమోషన్ అవార్డు–2020, ద బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డ్స్– 2022 లాంటి పలు పురస్కారాలు రాష్ట్రానికి లభించడం అరటి రైతుల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.ప్రభుత్వం స్పందించడం లేదు.. ఐదెకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. గతేడాది వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంట తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఏడాది పంట కోతకొచ్చినా కొనేవారు లేరు. స్థానిక మార్కెట్లో టన్ను రూ.5 వేలకు మించి పలకడం లేదు. అయినకాడికి తెగనమ్ముకుందామనుకున్నా కొనేవారు లేరు. ప్రభుత్వం స్పందించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బాబా హుస్సేన్, అరటి రైతు, మురారి చింతల, వైఎస్సార్ జిల్లాపతనమైనా పట్టించుకోరేమి? అరటి ధరలు పెరిగినప్పుడు మావల్లే అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ధరలు పతనమైతే కన్నెత్తి చూడడం లేదు. ధరలు పతనమైనా పట్టించుకోరేమి? 4 ఎకరాల్లో అరటి వేశా. ప్రస్తుతం పంట పక్వానికి వచ్చింది. వ్యాపారుల చుట్టూ రోజూ ప్రదక్షిణ చేస్తున్నా కొనే నాధుడు కరువయ్యాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అరటి రైతులకు నష్టాలు తప్పవు. – భాస్కరరెడ్డి, అంకేవానిపల్లె, వైఎస్సార్ జిల్లాపైసా పరిహారం రాలేదు.. అరటి రైతులు రెండేళ్లుగా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. గతేడాది గాలివాన, వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం రాలేదు. మరొక వైపు ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాది పంట కోత దశలో ఉన్నప్పుడు ధరలు దిగజారిపోయాయి . చిన్నపాటి గాలి వాన వస్తే పక్వానికి వచ్చిన పంట తుడిచిపెట్టుకుపోతుంది. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. –నాగార్జునరెడ్డి, లింగాల, వైఎస్సార్ జిల్లా -
అప్పుల్లో నెల నెలాభివృద్ధి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు నెల నెలా అప్పులు చేయడంలో భారీ వృద్ధి నమోదు చేస్తూ, మరో వైపు రెవెన్యూ రాబడుల్లో నెల నెలా అథమ స్థాయికి దిగజారిపోతోంది. అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు బడ్జెట్ కీలక సూచికలపై కాగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికే బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది అంటే మార్చి ఆఖరు నాటికి రూ.79,926 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్ అంచనాల్లో పేర్కొనగా, ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.94,393 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్ అంచనాలను మించి రూ.14,467 కోట్లు అప్పు చేసింది. మరో పక్క రెవెన్యూ రాబడుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోంది. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి నాటికి వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రాకపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెవెన్యూ రాబడులు 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,52,820 కోట్లు రాగా, ప్రస్తుత ఆర్థిక ఏడాది (2025–26) ఫిబ్రవరి నాటికి రూ.1,49,546 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రెవెన్యూ రాబడుల్లో రూ.3,274 కోట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా ఎంతో కొంత మేర రెవెన్యూ రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్థికంగా దిగజారిపోతున్న రాష్ట్రం రెవెన్యూ రాబడులు తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతోందని స్పష్టం అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటి నుంచి ప్రతి నెలా అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం, ఇతర పన్నులు, డ్యూటీలు రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. అమ్మకం పన్ను రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,860 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,304 కోట్లు మాత్రమే. అంటే రూ.556 కోట్లు తగ్గిపోయింది. ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.6,549 కోట్లు వస్తే, 2025–26లో అదే సమయానికి రూ.4,955 కోట్లే వచ్చాయి. అంటే రూ.1,594 కోట్ల రాబడి తగ్గిపోయింది. పన్నేతర రాబడి 2023–24 ఫిబ్రవరి నాటికి రూ.6,740 కోట్లు వస్తే, 2025–26 ఫిబ్రవరి నాటికి రూ.5,067 కోట్లే వచ్చాయి. రూ.1,673 కోట్లు రాబడి తగ్గిపోయింది. కేంద్ర గ్రాంట్లలోనూ విఫలంకేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం బాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్ర గ్రాంట్లను రాబట్టడంలో విఫలమైంది. 2023–24 ఫిబ్రవరి నాటికి కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.29,589 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి అవి రూ.14,737 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.14,852 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు చెందిన సామాజిక రంగ వ్యయం కూడా చంద్రబాబు హయాంలో తగ్గిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి సామాజిక రంగ వ్యయం రూ.1,16,413 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,02,423 కోట్లే ఉంది. అంటే సామాజిక రంగ వ్యయం రూ.13,990 కోట్లు తగ్గిపోయింది. మరో పక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు రూ.60,812 కోట్లకు, ద్రవ్యలోటు రూ.91,310 కోట్లకు చేరినట్లు కాగ్ తెలిపింది. -
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్ సిండికేట్ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు.. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన టీవీ5 అధినేత బీఆర్నాయుడి రాసలీలలు బయటపడి వేంకటేశ్వరస్వామి భక్తులంతా ఛీకొడుతుండడం మరోవైపు.. అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ఈ విమర్శల జడిలో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎవరూ ఈ విషయాలపై మాట్లాడకుండా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోని అన్ని వేదికలలోనూ హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పేర్లు కనబడకుండా చేయడానికి మాస్టర్ప్లాన్ వేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈనెల 3న ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో కూడా బీఆర్ నాయుడు, హెరిటేజ్ లపై ఏ విధమైన ప్రచారం చేయకూడదని, ఎలాంటి పోస్టులు ఉన్నా తొలగించాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేర్లు కనపడితే చాలు, వెంటనే రిమూవ్ చేయాలంటూ ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. వేదిక ఏదైనా సరే.. బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేరుతో ఆ పోస్టులు ఉంటే ఆయా సంస్థలకు నోటీసులు పంపి, బలవంతంగా పోస్టులను డిలీట్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఈ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు..ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే సాకుతో సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నేరుగా వారికి మెయిల్స్ చేయడంతో పాటు, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. అందులో వేలాది మంది పేర్లను, ఐడీలను పేర్కొంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలంటూ.. సబ్జెక్ట్, కంటెంట్ తో సంబంధం లేకుండా హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పదాలు ఉంటే చాలు, వీడియో అయినా, పోస్ట్ అయినా, పోస్టర్ అయినా, మీమ్ అయినా, నాలుగు అక్షరాలైనా సరే.. డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. చివరికి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోలు కూడా డిలీట్ చేయాలంటూ నోటీసులిస్తున్నారంటే సోషల్ మీడియా దెబ్బకు ప్రభుత్వ పెద్దలు ఎంతలా భయకంపితులు అవుతున్నారో అర్థమవుతుంది. మరింత మందికి తెలియకూడదనే..ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం.. ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై పోస్టులు, వీడియోలు, మీమ్స్ వెల్లువెత్తాయి. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేసిన బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. కానీ, తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపులకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక హెరిటేజ్ విషయంలోనూ ప్రభుత్వం నిజాలు బయటకు రానీయకుండా అడ్డుకుంటోంది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ ఇష్యూ, అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం, వీఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ కు సంబంధాలు బయటపడటంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తింది. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టులన్నీ డిలీట్ చేయిస్తోంది. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ మాట్లాడిన మాటలు పోస్టు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి డిలీట్ చేయించారు.భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట..వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా దాడికి పాల్పడుతోంది. అన్యాయాలపై, దుర్మార్గాలపై వాయిస్ వినిపించకుండా చేస్తున్న దాడి అత్యంత దారుణం. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న ఇలాంటి పరిణామాలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, నోటీసులు, పోస్టుల తొలగింపు ముమ్మాటికీ నియంత పాలనకు నిదర్శనం. – కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది -
మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?
-
జగన్ ప్రభుత్వమే బాగుండేది కొంపముంచిన అకాల వర్షాలు కూటమిపై రైతుల ఆగ్రహం
-
LG కంపెనీ కోసం గొల్లపాళ్యంలో కూటమి బలవంతపు భూసేకరణ
-
BR నాయుడుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు?
-
బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా?
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
చంద్రబాబు పరిస్థితి మన్మధుడు సినిమాలో బ్రహ్మనాదంలా... బాబుపై జడ శ్రవణ్ సెటైర్లు
-
టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
బాబు తిరుమల టూర్ లో BR నాయుడు ఎక్కడ?
-
సినిమాలో బ్రహ్మానందం రాజకీయాల్లో చంద్రబాబు...
-
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?
-
చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
ముస్లింలకు తోఫా కాదు.. ధోకా
సాక్షి, అమరావతి : ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మరోసారి ధోకా ఇచ్చారు. గత ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండానే, ఇటీవల ఇఫ్తార్ విందులో అన్నీ చేసేసినట్టు అబద్ధాలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ముస్లింలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలను కూడా తానే చేసినట్టు బాబు క్రెడిట్ చోరీకి పాల్పడిన తీరును ముస్లిం నేతలు తప్పు పడుతున్నారు. ఇమామ్కు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచింది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించి, ముస్లింల పక్షాన ఉన్న వైఎస్ జగన్ తన హయాంలో వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్వహించి, అన్యాక్రాంతమైన వాటిని కాపాడి, వేలాది వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేయించారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు వివిధ పథకాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.20,863.40 కోట్ల లబ్ధి చేకూర్చారు. తద్వారా ముస్లింలను రాజకీయంగా, ఆరి్థకంగా, సామాజికంగా ముందుకు నడిపించారని ముస్లిం సమాజం చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన దగాను గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మోసాలివీ» మసీదులకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇస్తామన్న హామీ ఊసేలేదు. » ఇమామ్, మౌజన్లకు నెలల తరబడి గౌరవ వేతనాలు పెండింగ్. బక్రీద్, రంజాన్ ముందు హడావుడిగా అరకొరగా విడుదల. » 22 నెలలుగా 1,500 మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం దరఖాస్తులు పెండింగ్. » గత ప్రభుత్వ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డు రద్దు. నూతన వక్ఫ్ బోర్డులో మతపరమైన సాహితీ వేత్తలకు ఇవ్వాల్సిన డైరెక్టర్ పోస్టులను టీడీపీ నేతలకు కట్టబెట్టిన వైనం. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రాజమహేంద్రవరానికి చెందిన ముస్లిం ప్రతినిధి. » కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు పలికిన చంద్రబాబు సర్కారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా అన్యాక్రాంతం చేసేందుకు ఆస్కారం కల్పిస్తూ.. మరోవైపు వాటిని రక్షిస్తున్నట్టు బిల్డప్. » అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి.. ఏడాది తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదం. మరో ఆరు నెలలకు తీరుబడిగా జీఓ ఇచ్చి.. ఇస్తామన్న రూ.100 కోట్లు ఇప్పటి వరకు కేటాయించలేదు. » రాష్ట్రంలో ఈద్గాలు, ఖబర్స్తాన్లకు భూములు కేటాయింపు, ముస్లింలకు ఆటోనగర్ల ఏర్పాటు హుళక్కే. » 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు సైతం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చెల్లించలేదు. » హజ్ యాత్రకు వెళ్లిన వారికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చి.. 2025లో వెళ్లిన వారందరికీ కాకుండా విజయవాడ నుంచి వెళ్లిన వారికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. » మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. » చంద్రన్న పెళ్లి కానుక, ఇస్లామిక్ బ్యాంక్, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్, విదేశీ విద్య పథకం తదితర హామీలు అమలు చేయకుండా మరో సారి మోసం చేశారు. -
మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అట్టుడికి పోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్రా మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ప్రభుత్వం అండ చూసుకుని మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన గ్రామ పెద్దలను తాళ్లతో నిర్బంధించి ఆరా తీయడంతో సర్కారు ద్రోహం బయటపడింది.ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకువచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే.. ఆంధ్రా, తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా, ఆంధ్రా మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లు (500 సీసీ) జిల్లాలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతోపాటు పలువురు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. కానీ ఆ నాలుగు బోట్లను మాత్రం వదిలి పెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఐదు నెలలుగా మత్స్యకార యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒకమాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాలుపంచుకున్నారు. తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీ డీల్ » ఇటీవల బోగోలు మండలం జువ్వలదిన్నెకు ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావడం.. ఆ తర్వాత నాలుగు రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న నాలుగు బోట్లను రహస్యంగా వదిలేయడం జరిగిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగి్నతో రగిలిపోతున్నారు. » టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం పెద్దలకు భారీ మొత్తం చేతిలో పెట్టి, మత్స్యకారుల నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను విడిపించినట్లు తెలుస్తోంది. ఇదంతా టీడీపీ పెద్దల కుట్ర కోణంతోనే జరిగిందని తీర ప్రాంతంలో ఉన్న దాదాపు 114 గ్రామాల మత్స్యకార ప్రజలు మండిపడుతున్నారు. బోట్లు వదిలేసిన వారిని నిర్బంధించిన మత్స్యకారులు » అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెంకు చెందిన గ్రామ పెద్ద కాపు, ఆయన ఇద్దరు కుమారులతోపాటు బోగోలు మండలం బంగారుపాళెంకు చెందిన మరో కాపును మత్స్యకారులు, ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.» మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచి్చనట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసు అధికారులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని ఆ గ్రామాల మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.తరచూ జరిగేది ఇదేతీరంలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మత్స్యకారులు తరచూ తమిళ జాలర్లతో బతుకు పోరాటం చేస్తున్నారు. వీరు వేటాడిన మత్స్య సంపదను రెప్పపాటులో తమిళ మత్స్య దొంగలు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి దోచుకుపోతున్నారు. తమిళనాడులోని వ్యాపారులు కొందరు అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు. నిబంధనల ప్రకారం తీరానికి 12 నాటికల్ మైళ్ల అవతల కాకుండా కేవలం 5 నాటికల్ మైళ్లలోపు వేట సాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ నుంచి ప్రకాశం జిల్లా కొత్త పట్నం వరకు తమిళ మత్స్యకారులు దూసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతం గోవిందరావు పట్టపుపాళెం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో తమిళ మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు.


