breaking news
Chandrababu Naidu
-
మండలి నుంచి వాకౌట్కి కారణం ఇదే
-
‘ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నారు’
తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానన్న చంద్రబాబు హామీ ఉష్ కాకి అయిందని, 25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పైగా జగన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్టు చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు.అభ్యర్థులు కష్టపడి చదివి, ఉద్యోగం సాధిస్తే చంద్రబాబు తన గొప్పగా భజన చేసుకుంటున్నారని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. మెరిట్ లిస్టులో ఉన్న కొందరికి ఉద్యోగాలు రాకపోవటానికి కారణం ఏంటి?అని ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానమే చెప్పటం లేదన్నారు. ఫలితంగా తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయని, జగన్ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను జగన్ హయాంలో వచ్చాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలతో కలిపితే ఆరు లక్షల మందికి అవకాశం కల్పించారని, అయినా జగన్ ప్రచారం చేసుకోలేదని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.అయితే సీఎం చంద్రబాబు ఏమీ చేయకుండానే విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని, ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎ, ఐఆర్, పిఆర్సీ గురించి ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారని, పండుగలన్నీ వెళ్తున్నాయిగానీ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదుని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వాలంటీర్ల పనులను కూడా సచివాలయ సిబ్బందితో ఎందుకు చేయిస్తున్నారని చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. సెలవు రోజులు, రాత్రి సమయాల్లో కూడా పనులు చేయిస్తూ వేధిస్తున్నారని, ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దసరాలోపు ఉద్యోగులకు మేలు చేకూర్చకపోతే వారంతా రోడ్డెక్కటం ఖాయమని చంద్రశేఖరరెడ్డి హెచ్చిరించారు. -
యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందన్న చంద్రబాబు..
-
Kancharapalem: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరు వ్యాపారుల నినాదాలు
-
‘ చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నాశనం’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం. మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు. -
బాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి?: బొత్స
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలపై చర్చ సందర్భంగా గురువారం శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఒకరు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు(TDP Minister) అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నానాయాగీ చేశారు. అయితే వాటిని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్(MLC Ramesh Yadav) ఎన్నికల హామీలు ఇచ్చే సమయాన్ని ప్రస్తావిస్తూ.. ఆనాడు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. అయితే ‘సభాపతిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అంటూ అవమానిస్తారా?’ అని టీడీపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని.. ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను సీనియర్ నేత బొత్స సమర్థించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది?. కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలి. అని అన్నారు. దీంతో.. టీడీపీ మంత్రలు మరింత ఊగిపోయారు. ఈ తరుణంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు కలుగజేసుకున్నారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి మండలి కాసేపు వాయిదా వేశారు. ఆపై.. 👉విరామ సమయంలో ఎమ్మెల్సీలు మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. ‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ను ప్రతీసారి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. అందుకే ఇక నుంచి మా పంథా కూడా మారుతుంది. మండలిలో సెం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తాం. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని.. ఇక నుంచి ఇలాగే మాట్లాడతాం అని అన్నారు. 👉తాజా పరిణామాలపై మండలి చైర్మన్ మోషేన్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాద పాటించేలా మండలి సభ్యులు వ్యవహరించాలి. కొందరు సభ్యులు, మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తాం. గతంలో పదవులు, హోదాలలో పనిచేసిన వారిని గౌరవించుకోవాలి. ఒడిపోయినంత మాత్రాన గౌరవించకుండా మాట్లాడతాం అంటే సమంజసం కాదు. ఎవరూ ఎవ్వరినీ అగౌరవంగా మాట్లాడొద్దు అని సభ్యులకు సూచించారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: ఓజీ సినిమా కోసం అసెంబ్లీకి డుమ్మా! -
Kakani: కళ్ళు ఆర్పకుండా అలవోకగా అబద్ధాలు చెప్తాడు
-
విశాఖలో ఎలా అడుగుపెడతావో చూస్తాం.. తోపుడు బండి కార్మికుల హెచ్చరిక
-
చంద్రబాబు నీతులు చెబుతుంటే..
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం.... ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?.. ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!. టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో ఒక రౌడీషీటర్ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను రౌడీ అని, పేకాట క్లబ్లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???.. చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డిజిటల్ బుక్ సాక్షిగా తప్పు చేస్తే తాట తీస్తాం
-
డబ్బున్నోళ్లను ఏమి చేయలేరు.. పేదలపైనే వీళ్ళ ప్రతాపం.. కన్నీళ్లు పెట్టుకున్న వీధి వ్యాపారులు
-
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. కొత్త కుట్రకు బాబు ప్లాన్
-
YSRCP ఎమ్మెల్యేల కొనుగోళ్ల కహానీ.. చంద్రబాబు ఆడియో లీక్...
-
‘పవన్ సీజ్ ద షిప్’ ఏమైంది!?
సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కాకినాడలో బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ చేయాలని, సీజ్ ద షిప్ అంటూ గతంలో ఆదేశించారని, ఆ కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పెరిగిన బియ్యం అక్రమ రవాణాకు నమోదైన కేసులే అద్దంపడుతున్నాయన్నారు. కాకినాడ, విశాఖ పోర్టుల కేంద్రంగా పెద్దఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందన్నారు. మరో ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. పౌర సరఫరాలు, పోలీసు శాఖలోని కొందరు రేషన్ మాఫియాతో చేతులు కలిపారని, కాకినాడ పోర్టులో బియ్యం డంప్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.అనంతరం.. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దుచేశామన్నారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 2,438 కేసులు నమోదుచేసి 5 లక్షల క్వింటాళ్లకు పైగా బియ్యం స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలపై ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదన్నారు. తూమాటి మాధవరావు మాట్లాడుతూ లులుకు ఖరీదైన భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కల్పలతారెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికోలను శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. -
Big Question: ఓటుకు కోట్లు కేసులో బాబే కీలక నిందితుడు.. మత్తయ్య సంచలన లేఖ
-
బరి తెగించిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రెడ్బుక్ వేధింపులను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తీవ్రతరం చేసింది. అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టుల పరంపరకు తెగించింది. భావప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రకు ఈసారి సీఐడీని అస్త్రంగా చేసుకుంది. పక్కా పన్నాగంతో ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ ఒక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. సీఐడీ, డీజీపీ కార్యాలయాల పర్యవేక్షణలో బరితెగించి సాగుతున్న రెడ్బుక్ రాజ్యాంగ వేధింపుల కుట్ర ఇలా ఉంది... ఒకే ఒక ఎఫ్ఐఆర్... అన్ లిమిటెడ్ అక్రమ కేసులు రాష్ట్రంలో గతేడాది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజల భావ ప్రకటన హక్కును కాలరాయడమే పనిగా పెట్టుకుంది. ఏడాది కాలంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా ఏకంగా 282 పోలీసు కేసులు నమోదు చేయడంతోపాటు 84 మందిని అరెస్టు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాయి. పోలీసులను గట్టిగా మందలించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది.ఆ కుట్రలకు ఈసారి సీఐడీ విభాగాన్ని అస్త్రంగా చేసుకుంది. సోషల్ మీడియా పోస్టులపై ఈ నెల 9న సీఐడీ ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎవరిపై కేసు నమోదు చేశారన్నది స్పష్టం చేయకుండా ఫేస్బుక్ యూఆర్ఎల్, ఇన్స్ట్రాగామ్ యూఆర్ఎల్లను నిందితుల కాలమ్లో పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుతంత్రాన్ని స్పష్టం చేస్తోంది. అంటే తాము లక్ష్యంగా చేసుకున్న సోషల్ మీడియా కార్యకర్తల్లో ఎవర్నయినా అక్రమంగా అరెస్టు చేసేందుకే ఈ కుయుక్తి పన్నిందన్నది సుస్పష్టం. అక్రమ అరెస్టులకు తెగబడుతున్న సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత డీజీపీ కార్యాలయం, సీఐడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ అరెస్టులకు తెగబడటం మొదలెట్టాయి. డీఎస్పీలు, ఇతర అధికారులతో కూడిన ఈ బృందాలకు ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. డీజీపీ, అదనపు డీజీ(శాంతి భద్రతలు) ఈ వ్యవహారాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీసులకు కనీస సమాచారం లేకుండానే అక్రమంగా అరెస్టులకు తెగబడాలని కార్యాచరణ రూపొందించారు. ఈ అరాచక పర్వానికి ఈ ఘటనలే మచ్చుకు ఉదాహరణ.. గుంటూరులో నిర్బంధంలో సోషల్ మీడియా కార్యకర్త.. సోషల్ మీడియా కార్యకర్త పాలక ప్రతాప్రెడ్డిని గుంటూరులో బుధవారం అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఎవరు అదుపులోకి తీసుకున్నారు..? ఎక్కడికి తరలించారు? అనే కనీస సమాచారం కూడా లేదు. సోషల్ మీడియాలో ఏ పోస్టుపై అభ్యంతరంతో అదుపులోకి తీసుకున్నారో కూడా తెలియదు. సీఐడీ బృందాలుగా భావిస్తున్న అధికారులు గుంటూరు బస్ స్టేషన్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. సోషల్ మీడియా కార్యకర్త స్నేహితుడినీ.... సోషల్ మీడియా కార్యకర్తలనే కాదు.. వారి స్నేహితులను కూడా అక్రమంగా అరెస్టు చేస్తుండటం చంద్రబాబు సర్కారు పాశవిక విధానాలకు నిదర్శనం. నెల్లూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త భరత్ చంద్రను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు యత్నించారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ భరత్ సోదరి ప్రీతిని పది రోజుల క్రితం ఆత్మకూరు పోలీసుస్టేషన్లో సీఐడీ పోలీసులు నిర్బంధించారు. భరత్ తల్లి, అక్క, చెల్లెలు ఫోన్లు సీజ్ చేశారు. న్యాయవాదుల చొరవతో భరత్ సోదరి విడుదలయ్యారు. మహిళలను సైతం వేధిస్తుండటంపై నివ్వెరపోతున్నారు. భరత్ చంద్ర జాడ తెలియకపోవడంతో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురానికి చెందిన ఆయన స్నేహితుడు బులగొండ సాయి భార్గవ్ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేసేందుకు తెగబడటం విస్మయపరుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో స్నేహితులని, ఇద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలున్నాయనే సాకుతో ఆయన్ను సీఐడీ అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించింది.వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులో ఓ సోషల్ మీడియా కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ బృందాలు ప్రయతి్నస్తున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో అక్రమ అరెస్టులను మరింత తీవ్రతరం చేసేందుకు సీఐడీ సన్నద్ధమవుతుండటం ప్రజాస్వామికవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు బేఖాతర్.. హైకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన రెడ్బుక్ వేధింపులే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తోంది. హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయవద్దని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అటువంటి కేసుల్లో అరెస్టు చేస్తే రిమాండ్ విధించవద్దని కూడా న్యాయస్థానాలకు నిర్దేశించింది. ఈమేరకు ‘అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్’ కేసుల్లో విస్పష్టంగా పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో విరుచుకుపడింది. ఏడాది కాలంలోనే 253 అక్రమ కేసుల్లో 822 మందికి నోటీసులిచ్చింది. 86 మందిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ అక్రమ అరెస్టులపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ ఏడాది జూలైలో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సోషల్ మీడియా కేసుల్లో అక్రమ అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. అటువంటి కేసుల్లో రిమాండ్ విధించవద్దని మేజి్రస్టేట్లను ఆదేశించింది.ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ మేజి్రస్టేట్లకు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వీటిపై 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం, సీఐడీ విభాగం దీన్ని లెక్క చేయకుండా బరి తెగించాయి. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బీఎన్ఎస్ 35 (ఐపీసీ 41 ఏ) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా ఆ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. అక్రమ అరెస్టులతో అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టు సవేంద్రరెడ్డిని తాడేపల్లిలో అక్రమంగా అదుపులోకి తీసుకుని ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నించడం సర్వత్రా తీవ్ర విభ్రాంతి కలిగించింది. హైకోర్టు తక్షణం స్పందించడంతో ఆయన్ను పోలీసులు విడిచిపెట్టారు. -
రైతు ద్రోహి కాంగ్రెస్.. ప్రజా ద్రోహి బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుతాన్ని రైతు ద్రోహిగా, బీజేపీ సర్కార్ను ప్రజా ద్రోహిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకుందన్నారు. కానీ బిహార్ ఎన్నికల కోసం శ్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కరీంనగర్కు చెందిన వైద్యులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి బుధవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని, సూర్యాపేటలో గిరిజన యువకుడిపై థర్డ్ డగ్రీ ప్రయోగించారన్నారు. పోలీసుల దాష్టీకాన్ని ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెబుతున్న ‘మొహబ్బత్కీ దుకాణ్’అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు. గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ తీరని ద్రోహం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) బృందం సభ్యులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్లు అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లోకుర్తి నరేష్కు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదన్నారు. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రేవంత్.. మోదీ, చంద్రబాబుల కోవర్ట్ ‘ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే రేవంత్ తప్పు పట్టడం లేదు.. కానీ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యం. గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదు, నాయకులుగా మనమే విఫలమయ్యాం. ఎమ్మె ల్యే ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దీన్ని చూస్తే కొంచమైనా సిగ్గుగా లేదా చంద్రబాబు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబుకు అన్నా రాంబాబు సవాల్
-
YS Jagan: డిజిటల్ బుక్ ఏంటో చూపిస్తాం Get Ready..
-
Botsa: చరిత్ర హీనుడుగా మిగిలిపోతావ్.!
-
YSRCP పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు: వైఎస్ జగన్
-
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ PRC లేనట్లే!
-
జగన్ వస్తే భయం.. అసెంబ్లీలో చంద్రబాబు స్కెచ్
-
చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డిసెంబర్ 15 నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత:మామూలుగా ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్లు పాలన చేయడానికి ప్రజలు అధికారం ఇస్తారు. ఎవరికేదైనా మినహాయింపు ఉంటుందంటే, ప్రజలకు మంచి పనులు చేసినందు వల్ల, మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేసినందువల్ల మనకు ఉంటుందనుకున్నాం. ఆ దిశలో మార్పు ఉంటుందని కూడా ఆశించాం. కానీ, మనకే పరిస్థితి ఆ రేంజ్లో రివర్స్ అయినప్పుడు, చంద్రబాబు మాదిరిగా మోసాలు చేస్తూ, అబద్దాలు చెబుతున్న వ్యక్తికి తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెబుతారు.కాలం చాలా వేగంగా తిరుగుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు. మామూలుగా ఐదేళ్లు అంటే, చివరి ఏడాది ఎలక్షనీరింగ్ కింద తీసేస్తే నాలుగేళ్లు ఉంటుందనుకోవచ్చు. నాలుగేళ్లలో దాదాపు రెండేళ్లు పూర్తయ్యాయి. కళ్లు మూసితెరిచే లోగా మరో రెండేళ్లు పూర్తవుతాయి. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మామూలుగా రెండేళ్ల తర్వాత పరిపాలన ఎలా ఉందనేది చూస్తే ప్రజల్లో ఈ తరహా వ్యతిరేకత కనిపించేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మీద ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్న విషయమే.సంపద ఎవరికి సృష్టిస్తున్నారు?:ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు? వచ్చాక ఏం చేస్తున్నాడు? అనేది చూస్తే, ఈ మనిషి అప్పట్లో పదే పదే చెప్పిన మాటలు.. సంపద సృష్టిస్తానని చెప్పడం. ఇంకా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు, జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఎన్నికలప్పుడు ప్రతి మీటింగ్లో అదే చెప్పాడు.కానీ, ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటని చూస్తే.. సంపద సృష్టించడం అంటే, కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని. అదే తేటతెల్లం అయింది. అసలు రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తానన్న పెద్ద మనిషి వాటి సంగతి దేవుడెరుగు.. అంతకు ముందు మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములు కూడా పూర్తిగా రద్దయ్యి పోయి, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ప్రభుత్వం అనేది ఎలా ఉండాలి?:ఒక ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ఎవరైనా ఏమేం ఆశిస్తారు? ఆ ప్రభుత్వ కనీస బాధ్యతలు ఏవి అంటే.. ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యావ్యవస్థను ఇస్తుందని అనుకుంటాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, ఒక మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని అనుకుంటాం. రైతుకు అండగా, దండగా ఉంటుందనుకుంటాం. అలాగే ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పని చేయాలని, అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా కొనసాగాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనిపించేది తిరోగమనమే.‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’..!:ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ విద్యార్థిని కదిలించినా, ఏ నిరుద్యోగిని కదలించినా, ఏ యువకుడిని కదిలించినా, ఏ మహిళను కదిలించినా చివరికి ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా ఈ ప్రభుత్వం గురించి వారు చెప్పేది ఏమిటో తెలుసా?.. ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అని ప్రతి నోటా వినిపిస్తోంది. ఇది నిజంగా వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో 16 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు గతంలో మనం ఎప్పుడూ చూసుండం. కానీ ఇప్పుడు కనిపిస్తోంది.పథకాలు మాయమైపోయాయి:ఈమధ్య ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అనంతపురంలో విజయోత్సవ సభ అని పెట్టబోతున్నప్పుడు ఆ ప్రకటన ఇచ్చాడు. సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ అని ఒకటి ఈ మధ్యే చేశారు. అప్పుడు ఇలా ఈ మాదిరిగా వాళ్ల పాంప్లెట్ పేపర్లో అడ్వరై్టజ్మెంట్ ఇచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెట్టారు. అప్పుడు మనం ఏమనుకుంటాం.. అందులో చెప్పినవన్నీ అమలు చేశామని అనుకుంటాం కదా?. కానీ ఆ అడ్వరై్టజ్మెంట్లో ఏముంది? అంతకు ముందు ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఏముందో చూడాలంటూ.. (ఆ రెండు అడ్వరైటజ్మెంట్స్ పీపీటీలో చూపారు)రెండింటిలో తేడా చూస్తే.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి. ఎన్నికలప్పడు యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. అది మొన్నటి అడ్వరైటజ్మెంట్లో కనిపించలేదు. అలాగే ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. కానీ, తాజాగా ఇచ్చిన అడ్వరైటజ్మెంట్లో అవి కనిపించలేదు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా కనిపించలేదు.ఏ స్థాయిలో వీరి మోసం ఉందంటే, వీరు చెప్పే అబద్ధాలు ఎలా ఉన్నాయంటే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 16 నెలల తర్వాత కూడా అమలు చేయకపోయినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చేసేశామంటూ.. వాటికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్స్లోని అంశాలను మార్చివేశారు. బలవంతపు విజయోత్సవాలు జరిపించేసి.. అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేశారు. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో చాలా తక్కువగా ఉంటారేమో?. ఇంకా చెప్పాలంటే ఇలాంటోడు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు.ఇంటింటికీ బాండ్లు. సంతకాలతో ప్రతిజ్ఞలు:సూపర్సిక్స్, సూపర్సెవెన్ అంటూ, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఎంత మొత్తం ఎంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు.ఇంకా సంతకాలతో పంపించిన ప్రతిజ్ఞా పత్రంలో ఏమన్నారంటే..‘చంద్రబాబునాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024, జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు.ఇంకా ఏకంగా చెక్కు రాసినట్టుగా రాసేయడం.. ‘ఇదిగో అమ్మ మీ ఇంట్లో ఇద్దరున్నారు. మీ ఇంట్లో ఒక చదువుకున్న పిల్లాడు ఉన్నాడు. వాడికి నిరుద్యోగ భృతి కింద ఏటా రూ.36 వేలు, మీ ఇంట్లో రైతు ఉన్నారు. ఆయనకు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం‘ అని చెప్పారు. ఇంకా 2024లో టీడీపీ, జనసేన సంయుక్త కూటమి అధికారంలోకి రావడంతోనే మేమిద్దరం భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్ధానాలను అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి పరస్పర సహకారంతో సమన్వయంతో పని చేస్తామంటూ బాండ్లు ఇచ్చారు.కానీ.. వాస్తవంగా ఏం చేశారు?:అలా బాండ్లు, ప్రతిజ్ఞా పత్రాలతో ప్రజలను నమ్మించిన వారి మోసాలు అధికారంలోకి వచ్చాక ఏ స్ధాయిలో ఉన్నాయంటే, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో ఉన్న హామీలు అమలు చేయలేదు. కొన్నింటిని ఏదైనా కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎన్నికల్లో చెప్పినంత ఇవ్వలేదు.పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగుర కొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఈ పెద్దమనిషి ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికి మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు.మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ అబద్ధమే కనిపిస్తోంది చంద్రబాబు నాయుడిగారి పాలనలో.రైతులకు అంతులేని కష్టాలు:ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని వ్యవస్థలూ నీరుగారిపోయిన పరిస్ధితి కనిపిస్తోంది. రైతులు ఎంత దారుణ పరిస్ధితుల్లో ఉన్నారంటే, ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అయినా యూరియా దొరకని దుస్థితి. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. నేను అడుగుతా ఉన్నా. మనం ఉన్నప్పుడు గడిచిన ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా?. యూరియా దొరక లేదని ఏనాడన్నా ఐదేళ్లలో ఒక్కసారైనా రైతు క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా.యూరియా దొరక్క ఈరోజు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఉందంటే దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లనే. దళారీలతో వీళ్లే చేతులు కలిపి ప్రైవేటుకి కోటా పెంచేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇక పనిలో పని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఇంకా ఆర్బీకేలు లేవు. ఈ–క్రాప్ లేదు. మరోవైపు ప్రైవేటుకి యూరియా కోటా పెంచేశారు. దాంతో మార్కెట్లో యూరియా లేదు. వాళ్లు బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. రూ.266 ఉండే యూరియా బస్తాకు మరో రూ.200 ఎక్కువ ఇస్తే తప్ప యూరియా దొరకని పరిస్థితిలో ఇప్పుడు రైతుల బతుకులు దిగజారిన పరిస్థితి కనిపిస్తోంది.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో..:మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతుకు ఆర్బీకేల ద్వారా, ఈ–క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. గరిష్ట చిల్లర ధర (ఎమ్మెస్పీ) కన్నా ఎక్కువ ఇచ్చాం. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్సఫోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి.ఈ ధాన్యం ప్రజలు తినరట! అందుకే గిట్టుబాటు ధర రావడం లేదట!: కానీ, ఈరోజు చంద్రబాబునాయుడు వచ్చేసరికి పరిస్థితి మారింది. ధాన్యానికి ఎందుకు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు అని అడిగితే, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడిగితే ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు అంటాడు రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన ఇప్పుడు చెప్తాడు. ఈ ధాన్యమంతా కూడా ఇథనాల్ (లిక్కర్లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారని ఈయన అంటున్నాడు. అంటే దానర్థం ఏంటి. రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా. ధాన్యం పండించిన రైతుకి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు. మీరంతా పండించడం మానేయండి అని చెబుతున్నాడు.పోనీ ధాన్యం పరిస్థితి గురించి ఇలా చెబుతున్నాడనే అనుకుందాం. ఆయనొచ్చాక రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర వచ్చింది చంద్రబాబూ అని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నా. కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటో, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తోందా? అని అడుగుతున్నా. ఏ పంటకూ కనీస ధర రావడం లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ–క్రాప్ను నిర్వీర్యం చేయడమే.నాడు రూ.7 వేల కోట్లతో కొనుగోలు: నాడు మన ప్రభుత్వం సీఎం–యాప్ ఏర్పాటు చేసి ఆర్బీకే స్థాయిలో మనం జాయింట్ కలెక్టర్లను, మార్క్ఫెడ్ జాయింట్ ఎండీకి ప్రోక్యూర్మెంట్ బాధ్యతలు అప్పగించి, ఆర్బీకేల్లో పోస్టర్లు పెట్టి ఫలాన పంటకు ఈ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడంతో రాష్ట్రంలో ఏ పంటకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొంది.అధ్వాన్నంగా విద్యా రంగం:విద్యా రంగంలో ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితిని పక్కన పెడితే, నాడు–నేడు పనులు ఆగిపోయాయి, టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది.కూటమి పాలనలో త్రైమాసికానికి సంబంధించి ఫీజులు అందని పరిస్థితి నెలకొంది. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్కు సంబంధించి, ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.వసతి దీవెన బకాయిలు రూ.2200 కోట్లు:గత ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతిదీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఈరోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. చదువుకోవడానికి పిల్లలు ధైర్యం చేయడం లేదు. చదువుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు అందడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను చేర్పించుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇదీ విద్యారంగం పరిస్థితి.వైద్య రంగం నిర్వీర్యం:ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆరోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెల రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆసు త్రులకు వెళ్లలేని పరిస్థితి.ఆరోగ్య ఆసరా ఊసే లేదు:రోగికి చికిత్స తర్వాత విశ్రాతి సమయంలో, డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది పెద్ద సున్నా.మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం:ఒకవైపు వైద్య ఆరోగ్య రంగం అన్ని విధాలుగా నిర్వీర్యం కాగా, మరోవైపు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచన చేయండి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ గాని బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా?. అందుకోసమే దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు.అందుకే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం:ఆరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ కాలేజీని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంత మంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది.మిగిలిన వారికి కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వంటేజ్. రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఇలాంటి కార్యక్రమానికి చంద్రబాబు స్కామ్ల కోసం ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు.ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం:రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వ రాకముందే ప్రారంభోత్సవానికి అన్నీ సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా?. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు.రూ.2 లక్షల కోట్లతో అమరావతికి ప్రణాళికలు!:అమరావతిలో ఈ పెద్ద మనిషి చేస్తున్నది ఏంటి? చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే ఖర్చు అవుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు.ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని చంద్రబాబు ఎస్టిమేషన్ వేశాడు. మరీ ఈ రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? చేతిలో డబ్బు లేదు కానీ అమరావతికి రూ. 2 లక్షల కోట్లతో ప్రణాళికలు రూపొందించాడు. మరి ఇంత మంది పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి చంద్రబాబు దగ్గర డబ్బు లేదట!. చంద్రబాబు అసలు నీవు మనిషివేనా?. ఇదీ ఇవాళ రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయం పరిస్థితి. ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు.అంతులేని అవినీతి. యథేచ్ఛ దోపిడి:కూటమి పాలనలో అవినీతి గురించి ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›్జ, సిలికాన్, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే, ఎకరా భూమి 90 పైసలే. కరెంటు కొనుగోలుకు సంబంధించి మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60కి కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.ఏదీ చూసినా స్కామ్లే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ప్రభుత్వ ఖజానాకు రావడం లేదు. దారి మళ్లీ వీరి జేబుల్లోకి వెళ్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. మన హయాంలోలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా?. అందుకే ఇవాళ రాష్ట్ర ఆదాయం తగ్గి దివాళ తీస్తోంది.రూ.2 లక్షల కోట్ల అప్పులు:చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం అప్పు కేవలం 16 నెలల్లోనే చేశారు. కొత్తగా స్కీమ్లు లేవు, పాత స్కీమ్లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది. ఎవరి జేబుల్లోకి పోతోంది. అవినీతి ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్:చంద్రబాబు అనే వ్యక్తి తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ ఏదైనా జరుగుతుందంటే చాలు.. ఆ ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, దాంట్లో నుంచి డైవర్ట్ చేయడం. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి.మీరంతా గట్టిగా నిలబడాలి:‘మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. సజావుగా ఎన్నికలు జరుపుకునే పరిస్థితి అంత కన్నా లేదు. సజావుగా ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావాలని ఆయనకు కూడా తెలుసు. ఈ పెద్ద మనిషి సజావుగా ఎన్నికలు జరపడం లేదు కాబట్టే మీరందరూ ఇంకా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది.కార్యకర్తలే పార్టీకి బలం:మన పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయ్యింది. బహుశా మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడ ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైయస్ఆర్సీపీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డాం. ఆ స్థాయిలో మనం నిలబడగలిగామంటే దానికి కారణం కార్యకర్తలే. ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే.నేను ఈ గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తను, ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని, ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని, యువత అధ్యక్షుడిని, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని, ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజ స్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తరువాత చంద్రబాబు నాయుడు కాదు కదా? వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైయస్ఆర్సీపీపై పోటీకి కూడా పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి.అనుబంధ విభాగాలు కీలకం:ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రచర్ను చూస్తే ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్చార్జులు ఉన్నారు. వీరంతా కూడా డిస్ట్రీక్ట్ కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు. వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అ ధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి.వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు. అలా కమిటీలు వేసుకున్న తరువాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్ష్యాత్తు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారే రేపు పొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్లను ముందుర పెట్టి.. వాళ్ల ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను.అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలను వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు వేయండి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ స్థాయి కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ గురించి వివరించండి.గ్రామస్థాయిలో కమిటీలు. ఏర్పాటుకు టార్గెట్:తర్వాత గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు, ఎవరు మహిళా అధ్యక్షురాలు, ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు, ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు. ఎవరు బీసీ అధ్యక్షుడు, ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోండి. సంక్రాంతి కల్లా పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు.ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు, ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు చెబుతారు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. అంటే ఆ గ్రామంలోకి ఎటరవుతానే మీరు ఏడుగురి పేర్లు టకటకా చెబుతారు. గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి 8 మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఆ విధంగా మీరు ఆ 8 మంది పేర్లు టక టకా చెప్పగలిగారంటే.. మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే. ఇది మిమ్మల్ని ఎలక్షనీరింగ్ కు సన్నద్ధం చేయడం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ రైతు కమిటీలు, అనుబంధ కమిటీలు, యూత్, యూత్ కమిటీలు, మహిళా కమిటీలు, స్టూడెంట్స్ కమిటీలు, సోషల్ మీడియా కమిటీలు, బీసీ కమిటీలు, ఎస్సీ కమిటీలు చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్తో పార్టీ ఇచ్చే మెసేజ్తో ఏ కార్యక్రమాన్నైనా గ్రామంలో విస్త్తృతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో పది మందిని పేరు పెట్టి మీరు పిలవగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది.డిజిటల్ బుక్.. ఆవిష్కరణ.. లక్ష్యం:మన కార్యకర్తల కోసం ఒక కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్ ను ఈరోజు లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి db.weysrcp.comలో ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం వెబ్సైట్ లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డాటా.. ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి.రెండోది ఐవీఆర్ ఎస్ విధానం. ఒక ఫోన్ నెం: 040–49171718 అన్యాయానికి గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆ నెంబర్కు ఫోన్ చేసి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్కు ఫోన్ చేయగానే దశలవారీగా సమాచారం తీసుకుంటారు.డిజిటల్ బుక్ ఒక శ్రీరామరక్ష:ఈ డిజిటల్ బుక్.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు శ్రీరామరక్ష. మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసిన కేసుల మీద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా, రాష్ట్రంలో లేకపోయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసినవారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు దీని ద్వారా వేస్తాం. వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారు. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలి అన్న శ్రీ వైయస్ జగన్.. ఆ తర్వాత డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. -
ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు(YS Jagan) ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani). వైఎస్సార్సీపీకి(YSRCP) ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. చంద్రబాబు ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అని వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీదే గెలుపు. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు’.ఇక, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో(Tadepalle Central Office) జరుగుతున్న ఈ మీటింగ్కు రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)లు హాజరయ్యారు. -
ఈసారి తప్పించుకోలేవ్ బాబు.. ఓటుకు నోటు కేసులో సుప్రీంకు మత్తయ్య లేఖ
-
అప్పులపై కూటమి తప్పుడు ప్రచారం బట్టబయలు
ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదు వేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్న మాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియా వారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదువేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్నమాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఎపినే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రేదశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియావారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్ధిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఏపీ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈనాడు వంటి ఎల్లో మీడియా జగన్ హయాంలో అప్పు చేసినప్పుడల్లా అది ఎంత చిన్న మొత్తం అయినా, ఏపీ అప్పుల చిప్ప అయిపోయిందని, మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించేది. అలాగే వారి టీవీలలో విపరీతంగా ప్రసారం చేసేది. కాని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే కేవలం 15 నెలల్లోనే దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినా ఈ మీడియా కిమ్మనడం లేదు. పైగా దీనికి ఇదంతా రుణాల సమీకరణ అని ముద్దుపేరు పెట్టుకుని రాస్తున్నాయి. ప్రభుత్వం చూపించే లెక్కల ప్రకారం 1,17 లక్షల మొత్తం నిధుల రాష్ట్రానికి ఈ ఐదు నెలల్లో సమకూరితే అందులో సింహభాగం అప్పులే కావడం గమనార్హం. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాలు ప్రస్తుతం చేస్తున్న అప్పు గురించి నోరు ఎత్తడం లేదు. పైగా ఇప్పటికీ చంద్రబాబు ఆయా సభలలో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని అసత్య ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిస్థితిపై నెటిజన్లు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. జగన్ నెలకు 5500 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక.. చంద్రబాబు నెలకు 11వేల కోట్ల అప్పు చేస్తే సింగపూర్ అయినట్లా అని వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ లో తెలిపిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తీసుకోదలచిన అప్పుల్లో మూడింట రెండు వంతుల మేర అప్పుడే ప్రభుత్వం తీసేసుకుందని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ టైమ్ నాటి 2023-34 ఐదు నెలలతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 8752 కోట్ల రాబడి తగ్గిందని కాగ్ వెల్లడించింది. అలాగే అదే కాలానికి ప్రభుత్వం పెట్టే వ్యయంలో కూడా 10663 కోట్లు తగ్గిందని, దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై కనబడుతోందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి ,జగన్ టైమ్ నాటికన్నా, ఈ ఏడాది ఐదు నెలల్లో కేంద్రం నుంచి 16వేల కోట్ల ఆదాయం తక్కువ వచ్చిందని తేలుతోంది. ఆదాయం ఆశించినంత రాక రెవెన్యూ లోటు, అప్పుల వల్ల ద్రవ్య లోటు తీవ్రంగా పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఈ లెక్కలు గమనిస్తే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ ఆర్ధిక ఆరోగ్యం క్షీణించినట్లు కనబడుతుంది. రెవెన్యూ లోటులో దేశంలోనే నెంబర్ టు స్థానంలో ఏపీఉంది.మరో వైపు ప్రభుత్వం ఆయా రంగాలకు చెల్లించవలసిన బకాయిలు వేల కోట్లు ఉంటున్నాయి. ఉదాహరణకు ఒక్క ఆరోగ్యశ్రీ బకాయిలే 2700 కోట్లు అని స్వయంగా ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చిన్న,మద్య తరగతి క ఆంట్రాక్టర్ లకు ఆరేడువేల కోట్లు చెల్లించవలసి ఉందని కదనాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 30వేల కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. వీటితో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చలేదు. వాటిని అరకొరగా అయినా చేయాలంటే మరింత అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంది. ఈ దశలోజీఎస్టీ కొత్త సంస్కరణలు రావడం రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పైకి మాత్రం ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు చెబుతూ లోపల మాత్రం ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. తెలంగాణలోజీఎస్టీ మార్పుల వల్ల నష్టం ఏడువేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు.ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుని భారాన్ని రాష్ట్రాలపై మోపిందని, ఇందుకు నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో కూడా ఎనిమిదివేల కోట్లకుపైగా నష్టం ఉందని లెక్కలు కడుతున్నారు. అసలే రెవెన్యూ లోటుతో కింద, మీద పడుతున్న తరుణంలో ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆయా అధికారిక సమావేశాలలో వివిధ శాఖల బడ్జెట్లలో కోత పెట్టడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.ఈ క్రమంలో ముందుగా విద్య, వైద్య రంగాలను బలి చేయడానికి సన్నద్ధం అవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ టైమ్లో నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేస్తే, ఇప్పుడు దానికి దాదాపు మంగళం పలికినట్లేనా అన్న సందేహం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో విరాళాలు, ఆయా సంస్థల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పడమే నిదర్శనంగా ఉంది. అలాగే సంజీవని కార్యక్రమం చేపట్టడం, ఇతర పద్దతుల ద్వారా ఆరోగ్య శాఖ బడ్జెట్ లో 30 శాతం తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన ఆ మాట అన్నారంటే అధికారులకు పరోక్షంగా ఆ రకంగా కోతలు పెట్టమని చెప్పడమే కదా!. జీఎస్టీ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను గురించి వివరించాలని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. దానివల్ల నిజంగా జనానికి ఎంత మేలు కలుగుతుందో కాని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కోతల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందేమోనన్న భయం పలువురిలో వ్యక్తం అవుతోంది.ఆర్థికంగా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇబ్బందులు వస్తాయని ఆర్థిక మంత్రి, అధికారులు చెప్పినా, ప్రజా ప్రయోజనాల రీత్యా మద్దతు ఇవ్వాలని తాను తెలిపానని ఆయన అన్నారు. నిజానికి చంద్రబాబు వంటివారికి ఇవి నచ్చుతాయంటే అంతగా నమ్మలేం. గత అనుభవాలు ఈ విషయాన్ని చెబుతాయి. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, మోదీని ఈ మధ్య కాలంలో విపరీతంగా పొగుడుతున్న నేపథ్యంలో ఇంతకన్నా వేరే మార్గం చంద్రబాబుకు లేదన్న సంగతి బహిరంగ రహస్యమే. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా రాబడి తగ్గుతుండడంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలు కూడా ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని శాసనసభలోనే ఆయన వ్యాఖ్యానించడం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆరోగ్య బీమాపై పన్ను తీసివేసినందున రాష్ట్రానికి 800 కోట్లు ఆదా అవుతుందని ఆయన అన్నారు. బాగానే ఉంది. అలాంటప్పుడు ఆరోగ్య శాఖ బడ్జెట్ 30 శాతం తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చెప్పారో తెలియదు. వ్యవసాయం ఖర్చు తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు చెప్పేస్తున్నారు. ఒక పక్క తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, అల్లాడుతుంటే, వారికి ఆదాయం పెరుగుతుందని సీఎం అంటున్నారు. నిజంగా అలా జరిగితే సంతోషమే. కాని ఊహాజనిత అంశాల ఆధారంగా మాట్లాడితేనే సమస్య వస్తుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల కొన్నిటి ధరలు తగ్గి ప్రజలకు కొంత ప్రయోజనం ఉండవచ్చు. కాని దానితోనే ప్రజల జీవితంలో పెనుమార్పులు వస్తాయని అనుకుంటే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఇప్పటికే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయని చెబుతున్నారు. తద్వారా పన్ను రాయితీలు వచ్చినా, ప్రజలకు లభించేది పెద్దగా ఉండకపోవచ్చునని అంటున్నారు. మరో వైపు పోరాటా వంటి ఉత్తరాది ఆహార పదార్థాలకు పన్ను తీసి వేసి, ఇడ్లి, దోసె వంటి దక్షిణాది పదార్ధాలపై పన్నులు ఉంచడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. జీఎస్టీ రూపేణా ఇంతకాలం అధిక పన్నులు వసూలు చేసి, ఇప్పుడేదో తగ్గించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏతావాతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునే అవకాశం కనిపిస్తోందని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ ఝలక్
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసింది. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇప్పట్లో లేనట్టే.. పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) కప్పదాటు సమాధానం చెప్పారు.ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్సీపీ(YSRCP) ఎమ్మెల్యేలు ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డీఏ, బకాయిలపై ప్రశ్నించారు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు. ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, అకేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపక్ష ప్రశ్నలకు మంత్రి పయ్యావుల కేశవ్.. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీ అంశం పరిశీలనలో ఉందన్నారు. ఎప్పుడిస్తారు అనే సమాధానం చెప్పకపోవడం గమనార్హం.అలాగే, ఎంత ఇస్తారు అనేది కూడా మంత్రి పయ్యావుల చెప్పకుండా దాటవేశారు. అయితే, డీఏ బకాయిలు మాత్రం రూ.12,119 కోట్లు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు. ఈ సమాధానాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇది కూడా చదవండి: అయ్యా లోకేష్.. నా గోడు పట్టదా! -
Punyaseela: జగన్ వస్తే మీకు చుక్కలే మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది
-
KSR Live Show: చంద్రబాబు క్షమాపణ చెప్పు.. సీఎంకు సీఐ డిమాండ్
-
అంతా చంద్రబాబే చేశాడు.. ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు
-
మా ఎమ్మెల్యే ఎక్కడ?.. పవన్ పై తిరగబడ్డ ఉప్పాడ మత్స్యకారులు
-
KSR Live Show: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులు గురుశిష్యులే..!
-
పేదలపై బాబు బుల్డోజర్.. అక్కడికే వెళ్లి ఓట్లు అడుక్కున్నావ్.. కొంచమైనా సిగ్గు లేదా?
-
సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై న్యాయపోరాటానికి సీఐ జోగి శంకరయ్య ఉపక్రమించారు. వైఎస్ వివేకా హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను తాను ధ్వంసం చేసినట్టు, మృతదేహాన్ని తరలించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో,మీడియా సమావేశాల్లో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా తనను సాక్షిగా మాత్రమే పేర్కొంది గానీ నిందితుడిగా కాదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన పరువుకు భంగకరంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై శంకరయ్య పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు శాసనసభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు ఆయన ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రిపై ఓ సీఐ పరువు నష్టం దావా వేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి... సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య తన న్యాయవాది ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపించారు. వైఎస్ వివేకా హత్య ప్రదేశంలో ఆధారాలను తాను ధ్వంసం చేసినట్టు శాసనసభలో సీఎం మాట్లాడిన మాటలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. హత్య ప్రదేశంలో తాను రక్తం మరకలు తుడిచినట్టు, మృతదేహాన్ని తరలించినట్టు, పోలీసులు రాకముందే మృతదేహాన్ని ఐస్ బాక్స్లో పెట్టి అంత్యక్రియలకు తరలించేందుకు యతి్నంచినట్టు చంద్రబాబు శాసనసభలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏనాడూ తాను ఆధారాలు ధ్వంసం చేసినట్టు అభియోగం మోపలేదన్నారు. సీబీఐ తనను సాక్షి( ఎల్డబ్ల్యూ)గానే పేర్కొందని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక హత్య ప్రదేశంలో ఆధారాలను ధ్వంసం చేసినందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనకు సీఐ నుంచి డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను ఇప్పటికీ సీఐగానే ఉన్నానన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన చంద్రబాబు రెండు రోజుల్లో శాసనసభలోనూ మీడియా ముఖంగానూ తనకు క్షమాపణలు చెప్పాలని సీఐ శంకరయ్య డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు చంద్రబాబు రూ.1.45కోట్లు పరిహారంగా చెల్లించాలన్నారు. లేకపోతే ఆయనపై న్యాయపరమైన చర్యలు చేపడతానన్నారు. రికార్డుల నుంచి తొలగించాలి... తనను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలను శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని సీఐ శంకరయ్య స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ఈమేరకు స్పీకర్ను ఉద్దేశించి ఆయన రెండు లేఖలు రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తన రాజ్యాంగపరమైన, న్యాయపరమైన హక్కులకు భంగకరంగా ఉన్నాయన్నారు.రాష్ట్రంలో పోలీసు అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతోపాటు ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని సీఐ శంకరయ్య కోరారు. తనకు క్షమాపణలు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశించాలని కూడా ఆయన స్పీకర్ను కోరారు. -
సర్కారు ‘ఉక్కు’జిత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు కర్మాగారంపై చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి చట్టసభ సాక్షిగా బయటపడింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పట్ల బాబు ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఇంకోసారి తేటతెల్లమైంది. విశాఖ స్టీల్ పరిరక్షణ డిమాండ్తో వైఎస్సార్సీపీ శాసన మండలిలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టగా ప్రభుత్వం మద్దతు ప్రకటించకుండా దాటవేత ధోరణి ప్రదర్శించింది. పరిశ్రమలు, పెట్టుబడులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణే వైఎస్సార్సీపీ ధ్యేయమని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ డిమాండ్తో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్లో భారత ప్రభుత్వ వాటాను 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు, ప్రైవేటీకరణ ద్వారా నిర్వహణ నియంత్రణ బదిలీకి జరుగుతున్న యత్నాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను వెంటనే పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఉక్కు మంత్రిత్వ శాఖను కోరుతున్నాం. ప్లాంట్ లాభాల్లోకి తెచ్చేలా సొంత గనుల కేటాయింపు, ఆర్థిక పునర్నిర్మాణం వంటి ఇతర కార్యకలాపాలు వెంటనే చేపట్టాలి. ఈ మేరకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి.’ అని తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం, అన్ని రాజకీయ పక్షాలు తీర్మానానికి మద్దతు తెలపాలని బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్సీలను కోరారు. అంతకు ముందు స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి తాము మద్దతు తెలుపుతున్నట్టు బొత్స ప్రకటించారు. కేంద్రం ప్యాకేజీ కేటాయించినా స్టీల్ ప్లాంట్ అంశంలో ప్రస్తుతం సంభవిస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వంద శాతం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాము ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలపాలని లోకేశ్ను కోరారు. అయితే వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని లోకేశ్ పేర్కొన్నారు. తీర్మానాన్ని మార్చి పెట్టాలని డిమాండ్ చేశారు. తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకూడదనేది సర్కారు ఉద్దేశమైతే, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ తీర్మానం ఆమోదానికి మద్దతు ఇవ్వాలని బొత్స కోరారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించడమే కూటమి పార్టీల అజెండా అయినప్పుడు వైఎస్సార్సీపీ తీర్మానానికి ఆమోదం తెలపడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఓటింగ్ చేపట్టాలన్న బొత్స.. ఆమోదంవైఎస్సార్సీపీ తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఒప్పుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన తీర్మానంపై బొత్స డివిజన్(ఓటింగ్) చేపట్టాలని కోరారు. అనంతరం మండలి చైర్మన్ మోషేన్రాజు మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఆమోదం పొందింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం:బొత్స సత్యనారాయణమండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పరిశ్రమల మీద ప్రశ్నలు అడిగేతే ఎగతాళి చేస్తూ కూటమి సభ్యులు మాట్లాడారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల మీద ప్రశ్న వేస్తే వ్యక్తిగతంగా, ఇష్టానుసారం, నాయకుల మీద సందర్భం లేకుండా కూటమి నేతలు మాటా్లడారని విమర్శించారు. దానికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేసి వచ్చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రజలు చూస్తున్నారు. హుందాగా ఉండాలి. 2014–19 వరకూ, 2019–2024 వరకూ 2024 నుంచి గడిచిన 16 నెలల కాలంలో ఏం జరిగిందనే చర్చను సభలో పెట్టారు. గత ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే రిలయన్స్ అంబానీ, అదానీ వంటి వారు వచ్చారని మేం చెప్పాం. లులు గ్రూపునకు విశాఖ, విజయవాడలో స్థలాలను అప్పనంగా కట్టబెడుతున్నారు. కేంద్రంతో చర్చల తర్వాతే సింగపూర్ ఒప్పందం రద్దు చేశాం. ఆ ఒప్పందంలో చంద్రబాబుతో లాలూచీపడి ఏపీకి వచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్పై అక్కడి ప్రభుత్వమే చర్యలు తీసుకుంది. అదే చెప్పాం. టాటా చైర్మన్ వైఎస్ జగన్ హయాంలోనూ వచ్చారు. ఒప్పందం చేసుకున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంబోత్సవం చేస్తున్న పరిశ్రమలన్నీ వైఎస్సార్సీపీ హయాంలో శంకుస్థాపనలు చేసినవే. స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్లు ఇన్సెంటివ్ ఇవ్వడం ముదావహం. మేం స్వాగతిస్తున్నాం. కానీ దానిపై మాకు, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి. ఇదే విషయంపై తీర్మానం పెట్టాం. దీనికి మద్దతు తెలపడానికి కూటమి సర్కారుకు మనసు రాలేదు. ఇది చంద్రబాబు సరర్కారు ద్వంద్వ నీతికి నిదర్శనం. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతాం.’ అని బొత్స స్పష్టం చేశారు. -
చేసిందంతా చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: ‘అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు.. ఓటుకు కోట్లు కేసులో అతనూ కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్తోపాటు ఆయనదీ కీలకపాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. రూ. 5 కోట్లు ఆశ చూపాలని చెప్పా రు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేశ్ విజయవాడ తరలించారు. అత ని సన్నిహితుల సహకారంతో ఆరేడు నెలలు నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి.. విచారణ చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్కి నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్.. ఈ కేసులో చేసిన దారుణాలను వివరించారు. మంగళవారం ఆ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ (ఇన్వార్డ్)కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాల మేరకు.. చంద్రబాబు, రేవంత్లే పంపారు.. ‘ఓటుకు కోట్లు వ్యవహారంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లే నన్ను పంపారు. తీర్పును ప్రకటించే ముందు మరో సారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలని కోరుతున్నా. కేసులో నా ప్రమేయంతోపాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, అతని కుమారుడు, మంత్రి లోకేశ్ ను కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జీలు, న్యాయవాదులు, వారికి సహక రించిన ప్రతి ఒక్కరినీ నాతోపాటు సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు.. దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రూ. 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యరి్థకి ఓటు వేసేలా రూ. 5 కోట్లకు నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి, నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్తోపాటు భాగ స్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి’ అని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. రేవంత్ను సీఎంగా తప్పించండి.. ‘ఈ కేసు విచారణ సజావుగా సాగి, నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా, నిందితులందరినీ విచారించేలా మళ్లీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్సింహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువ. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు. దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదోవ పట్టకుండా, ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే.. ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు, ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలి’ అని మత్తయ్య కోరారు. లోకేశ్, అతని సన్నిహితులే నిర్బంధించారు ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ విశ్వప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు, మరికొందరు కారులో నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్లూ, చేతులూ కట్టేయడంతోపాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు. నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా.. నా కుటుంబానికి దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి, అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేశ్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. నేను ఎక్కడికీ వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్్కఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందర్నీ నిందితులుగా చేర్చి, విచారించాలి. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్మెంట్పై బలవంతంగా సంతకం పెట్టించారు. వందకు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్కు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్మెంట్పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమెడల, దమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు. లోకేశ్ టీం, టీడీ జనార్ధన్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు, అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో ‘‘పార్టీ ఇన్ పర్సన్’’గా పిటిషన్ వేశా. ఒక బాధ్యతగల పౌరుడిగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడుతున్నా. తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్గా అనుమతించండి’ అంటూ మత్తయ్య సీజేఐని అభ్యరి్థంచారు. -
ఓటుకు నోట్లు కేసులో చంద్రబాబుకు మత్తయ్య షాక్
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ రాశాడు. చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోట్లు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో మత్తయ్య పేర్కొన్నాడు.ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మత్తయ్య లేఖ కీలకంగా మారింది. లేఖలోని అంశాలను పిటిషన్ రూపంలో కోర్టులో ఫైల్ చేయనున్న మత్తయ్య తరఫు న్యాయవాది. -
చిరు వ్యాపారులపై కూటమి జులుం.. GVMC కార్యాలయం వద్ద YSRCP భారీ నిరసన
-
భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం: కాకాణి
-
ఏపీలో మెడికల్ కాలేజీలు, సర్కారీ వైద్యానికి చంద్రగ్రహణం
-
చిరు వ్యాపారుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: YSRCP
-
ప్రతిపక్ష నేత తన సొంత ఖర్చులతో ఎక్కడికెళ్తే మీడియాకేంటని ప్రశ్నలు
-
వ్యాపారుల జీవితాలను చీకటిమయం చేస్తున్న కూటమి ప్రభుత్వం
-
OG సినిమా కోసం మరో జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
-
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై జగన్ ఆందోళన
-
మన రైతులు పండించే ధాన్యం తినడానికి, ఎగుమతికి పనికిరాదు
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యం రకాలు తినడానికి, ఎగుమతి చేయడానికి ఉపయోగపడడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో ఆల్కహాల్ తయారీకి తప్ప మన ధాన్యం దేనికీ ఉపయోగపడదు’’ అని సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ‘‘రాష్ట్రంలో 14.90 లక్షల హెక్టార్లల్లో వరి పండిస్తుంటే 6.25 లక్షల హెక్టార్లలో బీపీటీ, 8.35 లక్షల హెక్టార్లల్లో స్వర్ణ, 30 వేల ఎకరాల్లో ఎగుమతి రకం సాగు చేస్తున్నారు.ఎప్పుడూ ఒక పంట వేసే నెల్లూరు జిల్లా వాళ్లు ఈ సారి రెండు పంటలు వేశారు. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నెల్లూరు ములగొలకలు కాకుండా వేరే రకం పండించారు. ఇలా రెండు పంటలు వేసి కొనాలంటే ఏం చేయాలో తెలియడం లేదు’’ అని అన్నారు. సోమవారం అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు మాట్లాడారు. ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రజల ఆహార అలవాట్లు మారాయని దీనికి అనుగుణంగా పంటల మారి్పడి జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకసారి వరి పండిస్తే రెండో పంటగా నూనె గింజలు, తృణధాన్యాలు సాగు చేయాలన్నారు. వరి సాగు నుంచి ఆదాయం ఇచ్చే ఉద్యాన, ఆక్వా రంగాల వైపు రైతులు మళ్లాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అక్టోబరు నుంచి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగం విలవిల్లాడుతోందని, దీనిపై కేంద్రంతో నిరంతరం చర్చిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. యూరియాకు ఆధార్ లింక్ రేషన్ బియ్యం ఇస్తున్నట్లే... వచ్చే సీజన్ నుంచి ఎరువులను కూడా ఆధార్ అనుసంధానంతో రైతుకు పంట చేల వద్దనే అవసరమైన మేర మాత్రమే అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పంటకు ఎంత ఎరువు అవసరమో ఆ మేరకే అందిస్తామన్నారు. యూరియా వాడకం తగ్గిస్తే కేంద్రం అందించే ప్రయోజనం బస్తాకు రూ.800 రైతుకే ఇస్తామని చెప్పారు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వడం లేదంటూ మాట్లాడుతున్నారని వారు ఖరీదైన సరి్టఫికేషన్ తిండి తింటూ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బాబు నిజ స్వరూపం బట్టబయలు వరి విషయంలో సీఎం వ్యాఖ్యలపై వ్యవసాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్లో వరి పంటకు చంద్రబాబు ఉరి వేస్తున్నారని మండిపడుతున్నారు. ‘వరి సాగు కరెక్ట్ కాదు. వర్షాధార పంట కావడంతో రైతులకు ఏమాత్రం లాభదాయకం కాదు. వచ్చే ఏడాది నుంచి ఒక పంట మాత్రమే వరి పండించేలా ప్రోత్సహిస్తాం’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్లో 54 శాతం, రబీలో 36 శాతం విస్తీర్ణంలో వరి సాగవుతోంది. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలో వరి విస్తీర్ణమే ఎక్కువ. ఖరీఫ్లో వరికి ప్రత్యామ్నాయం లేదు. అలాంటిది వరి వేయొద్దంటూ సీఎం మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరి లేకుంటే వ్యవసాయ రంగం కనుమరుగవుతుందని, రాష్ట్రమంతా ఉద్యాన పంటలు పండించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులు సహకరించవని చెబుతున్నారు. చంద్రబాబు ఆది నుంచి రైతు వ్యతిరేకే...! అధికారంలోకి వచి్చంది మొదలు చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు శాసనసభ వేదికగా... ఏడాదికి ఒకసారే వరి వేయాలని చంద్రబాబు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, మన ధాన్యం ఆల్కహాల్ తయారీకి తప్ప ఇంకెందుకు పనికిరాదనడం విభ్రాంతికరమని నిపుణులు అంటున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో అధికారంలో ఉండగా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... రైతులను మరోసారి దగా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవడమే’’ అంటూ బాబు చేసిన వ్యాఖ్యలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. దేశమంతా పెరుగుతుంటే.. మనదగ్గర తగ్గిస్తారా? పొరుగునున్న తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరి సాగు పెరుగుతోంది. అందుకు విరుద్ధంగా ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో విస్తీర్ణం తగ్గిపోతోంది. వరి సాగును లాభసాటిగా మార్చి ప్రోత్సహించాల్సింది పోయి ఈ పంట వేయొద్దు... మీకేమీ మిగలదంటూ చంద్రబాబు పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. వరి సాగులో యూరియా వాడకంతో కేన్సర్ కేసులు పెరుగుతున్నాయంటూ వివాదాస్పద ప్రకటన చేయడంపై వరి రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. అచ్చెన్నా.. ఇది తగునా? ‘‘రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. 10 రోజుల పాటు ఇబ్బంది ఏర్పడింది. యూరియా వాడకం వలన కేన్సర్ వస్తోందని హెచ్చరిస్తూ రాష్ట్రానికి ఎలాట్మెంట్లు తగ్గిస్తున్నామంటూ కేంద్రం ప్రకటించింది’’ అని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎంత అడిగితే అంత ఇస్తుంది కదా అని ఎరువులు అధికంగా వాడితే జబ్బులొచ్చి ప్రజలు చనిపోతారంటూ ఆయన చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పథకం ప్రకారమే నిర్విర్యం కూటమి ప్రభుత్వం వచి్చన దగ్గరనుంచి రాష్ట్రంలో వ్యవసాయం ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు.. 15 నెలలుగా ఏ ఒక్క పంటకు బీమా పరిహారం అందకుండా చేసింది. వరుస వైపరీత్యాలకు తోడు కరువు విలయతాండవం చేస్తున్నా పైసా ఇవ్వలేదు. ⇒ విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలతో పాటు సచివాలయాలను నిర్విర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాలకు కోత పెట్టారు. అదునుకు అందాల్సిన యూరియాను కావాలనే అందకుండా చేస్తూ సాగును చిన్నాభిన్నం చేశారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఎకరాకు అరకట్ట కూడా అందించలేకపోతున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిల్లాడి పోతుంటే వేడుక చూస్తున్నారే తప్ప ఆదుకునే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. ⇒ ధరలు పతనమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి కొని రైతులకు మద్దతు ధర కల్పించాల్సింది పోయి గాలికొదిలేసింది. మద్దతు ధరకు మించి ధర లభించే ఫైన్ వెరైటీలకు సైతం ప్రస్తుతం మద్దతు ధర కరువవుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. -
108 సర్వీసులకు బాబు సర్కారు ఉరి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ చేసినా 108 సర్విసు రాకపోవడంతో పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఆటోను ఆశ్రయించాల్సి వచి్చందని, చివరకు అందులోనే ప్రసవం జరిగిందని.. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జత చేసి చంద్రబాబు సర్కార్ అసమర్థతను నిలదీస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో తన ఖాతాలో సోమవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ప్రజల ప్రాణాలు పోతున్నాయ్ ⇒ ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్విసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోంది. నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచి్చంది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మృతి చెందింది. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంబులెన్స్లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలనే నిబంధన ఉంటే.. దాన్ని అధిగమిస్తూ 12–14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే.. 16–17 నిమిషాల్లోనే వచ్చేవి. గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన ఉంటే దాన్ని కూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఇప్పుడు ఎందుకు చేరుకోవడం లేదు? ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా! కలెక్షన్ల మీద మినహా ప్రజల పట్ల ధ్యాస ఉంటే కదా? -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రైతులకు కష్టాలే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతంచంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ను ఆనాడు పీఎం వాజపేయ్కు చెప్పి, వన్మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.1987లో ఎన్సీపీఏ డ్రిప్ ఇరిగేషన్ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది. - కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి. - మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి. - పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి. - సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి. - మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది. - ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు. - వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలివరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. యూరియాపై రెండు నాలుకల ధోరణియూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి. పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్ను దక్కుతుంది. ల్యాబ్లు, రీజనల్ కోడింగ్ సెంటర్లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేకౌలురైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
కుయ్.. కుయ్.. మూగబోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: 108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోతో సహా ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. ‘‘కుయ్.. కుయ్.. మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైఎస్సార్సీపీ హయాంలో అంబులెన్స్లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి...గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదు?. ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదు?. ప్రభుత్వం అన్నది పని చేస్తేనే కదా?. కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటేకదా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.కుయ్.. కుయ్.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయిప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు @ncbn ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం… pic.twitter.com/klxCNlRJnS— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025 -
నిన్నే నిరుద్యోగ భృతి పడింది.. OG టిక్కెట్ బుక్ చేసుకున్నా.. యువత సెటైర్లు
-
ఇప్పటికైనా మారండి.. కేంద్రంలో క్రెడిట్ కోసం బాబు అబద్ధాలు
-
అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) తప్పుడు ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్సీపీ హయాంలో అప్పు కేవలం 2,61,683 కోట్లు మాత్రమే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు, ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో అప్పులు 10-14 లక్షల కోట్లు అని టీడీపీ, జనసేన, పచ్చ మీడియా గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(payyavula keshav) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ హయాంలో 2,61,683 కోట్లు మాత్రమే అప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉన్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. కాగా, చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక, కార్పోరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో 1,09,217 కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో మొత్తంగా 3,70,900 కోట్లు అప్పులు తెచ్చినట్టు ప్రకటించారు. మరోవైపు.. 2024 ఎన్నికలు సమయంలో తెచ్చిన అప్పు సైతం ఇందులో కలిపి ఆర్థిక శాఖ లెక్కలను తాజాగా మంత్రి వెల్లడించారు.ఇది కూడా చదవండి: డొల్ల మాటలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు!అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో టీడీపీ, పవన్(Pawan Kalyan) కల్యాణ్ తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ హయాంలో 10 నుండి 14 లక్షల కోట్లు అప్పు చేసినట్టు పచ్చ మీడియా, చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల ఫేక్ ప్రచారం బట్టబయలు అయ్యింది. -
మోదీని మరోసారి అవమానించిన బాబు.. మీ శిష్యుడిని చూసి బుద్ధి తెచ్చుకో
-
డొల్ల మాటలు... ఊకదంపుడు ఉపన్యాసాలు!
ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలంటే.. ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షలు, లోటుపాట్ల సవరణ వంటిపై చర్చలు జరుగతాయని అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ తీరు వేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని కూడా ఆత్మస్తుతి, పరనిందకు వేదికలుగా మార్చేసుకుంటున్నారు. ఈ మధ్యే రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల కష్టాల గురించి కాకుండా రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలకే అధిక ప్రాధాన్యం లభించింది. ఒక పక్క రైతులకు యూరియా అందక నానా అగచాట్లూ పడుతూంటే.. టమోటా, ఉల్లి, తదితర పంటలకు తగిన ధరలు దొరక్క సతమతమవుతూంటే చంద్రబాబు వాటి గురించి కాకుండా దుష్ప్రచారం జరుగుతోందని ఒకసారి, అధికారుల వైఫల్యమని ఇంకోసారి మాట్లాడారు. జగన్ హయాంలో మాదిరిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలనో ఇంకో మార్గమో చూపాలి కదా? అదేది చేయలేదు బాబు. ఈ వైరుద్ధ్యం ప్రజల దృష్టిలో పడదన్నది ఆయనగారి ధైర్యం! ఈ సదస్సుల్లో ఒక విషయమైతే స్పష్టమైంది. జగన్ హయాంలో మాదిరిగా ప్రజాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలను ప్రోత్సహించరాదని చంద్రబాబు తీర్మానించుకున్నట్టు కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ బడ్జెట్లో 30 శాతం కోతకు, విద్యాసంస్థల బాగుకు విరాళాలపై ఆధారపడాలన్న ఆలోచనలను ప్రోత్సహిస్తూండటం ఇందుకు కారణం. మద్యం ఆదాయం 10.29 శాతం పెరిగిందన్న సమాచారం కూడా ఏమంత ప్రజానుకూలమైన విషయం కాదు. రాష్ట్రంలో హోం, రెవెన్యూ, మున్సిపల్ శాఖల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చంద్రబాబు ఈ సమావేశాల్లో ప్రకటించారు. పాలనపై పట్టు తప్పడం, రెడ్బుక్ రాజ్యాంగం పెచ్చరిల్లడం, టీడీపీ, జనసేన దౌర్జన్యాలు, కబ్జాకాండలు, ఇసుక, మద్య అక్రమ వ్యవహారలు కారణం కావచ్చ కానీ చంద్రబాబు వీటిని ప్రస్తావించడం లేదు. తనది రాజకీయ పాలనే అని బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. ఇది కాస్తా పార్టీ శ్రేణులకు గ్రీన్ సిగ్నల్లా మారిపోయింది. మరింత రెచ్చిపోతూ రాష్ట్రాన్ని అధ్వాన్న స్థితిలోకి నెట్టేశారు. పోలీసులు కూడా అధికారంలో ఉన్న పార్టీలతో ఒకలా.. ప్రతిపక్షాలతో ఇంకోలా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో భూముల రీసర్వే చేపడితే టీడీపీ, జనసేన ఎల్లో మీడియాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనర్థం వీరు గత ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేసినట్లే కదా? జగన్ సీఎంగా తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు వడివడిగా అడుగులేస్తున్న ఈ పరిస్థితుల్లో తాజాగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకో ఆందోళనకరమైన ప్రకటన చేశారు. పాఠశాలల మౌలిక వసతులకు అవసరమైన రూ.2820 కోట్లను ఎన్నారైలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీల నుంచి సేకరించాలని సంబంధిత శాఖ మంత్రి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. లీడ్ యాప్లో డోనార్స్ స్పాన్సర్షిప్ అనే ఆప్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఓకే అనుకుందాం. ఒకవేళ ఇంత మొత్తం విరాళాలుగా రాకపోతే? మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యావ్యవస్థను మరింత నీరుగారుస్తారా? ఆరోగ్య శాఖ సమీక్షలో రూ.20 వేల వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో 33 శాతం తగ్గించినా డబ్బు భారీగా ఆదా అవుతుందని చంద్రబాబు అన్నారట. సంజీవని కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని అంటున్నారు. ఆ మధ్య ఈ ప్రోగ్రాం గురించి చెబుతూ మనిషి కనీస ఆయుష్షు 120 ఏళ్లు అని అన్నట్లు వచ్చిన వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడేమో నిధులలో కోత పెట్టాలంటున్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2500 కోట్ల గురించి, నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె గురించి ఎందుకు మాట్లాడ లేదని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం అస్సలు దొరకదు. ప్రభుత్వానికి అందుతున్న దరఖాస్తుల్లో ఆరవైశాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవని చెప్పడం ద్వారా చంద్రబాబు గత ప్రభుత్వ సమర్థతను, ప్రస్తుత ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని బయటపెట్టుకున్నట్లు అయ్యింది. గతంలో రాష్ట్రమంతా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల పుణ్యమా అని ఎక్కడి సమస్యలక్కడే పరిష్కారమైపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సహజంగానే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుంది. రైతు సమస్యలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించే లక్ష్యంతో జగన్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసేసింది. ఫలితమే రైతుల ఇక్కట్లు! ఇన్ని అంశాలపై బహిరంగ చర్చ జరిపిన ఈ సదస్సులో శాంతి భద్రతల గురించి మాత్రం రహస్యంగా సమీక్షించారట. ఎందుకో మరి? పైకి ఒకలా..లోపల ఇంకోలా వ్యవహరించే తన వైఖరి బయటపడిపోతుందనా? సీఎం గారు నేరాలు 33 శాతం తగ్గాయని ఈ సమావేశాల్లో చెప్పారట. టీడీపీ, జనసేన నేతల అరాచకాలను అరికట్టేందుకు ఏం చేయాలన్నదానిపై కూడా అధికారులకు సలహా ఇచ్చారా? అలా చేయకుండా కేవలం రెడ్ బుక్కే ప్రాముఖ్యత ఇస్తూంటే శాంతిభద్రతల అదుపు ఎలా సాధ్యం? కలెక్టర్లు, జిల్లా ఎస్పీల ఈ సమావేశం జరుగుతున్న తీరుపై ఎల్లో మీడియా రాసిన ఒక వార్త మాత్రం ఆసక్తికరమైంది. ‘‘సారు మారారు..’’ అంటూ ఇచ్చిన ఒక కథనంలో చంద్రబాబు టైమ్ కీపర్ అవతారమెత్తారని చంద్రబాబును కొనియాడారు. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు పది లక్ష్యాలు పెట్టినట్లు ఎల్లో మీడియా రాసింది. ఇవి ప్రజలకు ఏ మేరకు ఉపయోగమో తెలియదు. జీఎస్పీడీపీలో 15 శాతం వృద్ది రేటు సాధించాలని నిర్దేశించారు కానీ... అది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుందన్నది మరిచినట్లు ఉన్నారు. ఎక్కువమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలని వర్క్ ఫ్రం హోం విధానాలు రావాలని బాబు గారు నిర్దేశించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో వర్క్ ఫ్రం హోం నిమిత్తం చంద్రబాబు ఆయా పట్టణాలకు వెళ్లి ఏమి చెప్పారో గుర్తు చేసుకోవాలి కదా! అదేమి చేయకుండా కలెక్టర్లను దానికి బాధ్యులను చేస్తే ఏమి ప్రయోజనం? ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ పానెళ్లు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని సీఎం సలహా ఇచ్చారు. సీఎం ఇతర మంత్రులు కూడా వీటిని వాడుతున్నారో లేదో తెలియదు. సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వాలట.అందులో పోలీసు వ్యవస్థ భాగస్వామి కావాలట. కొత్త, కొత్త పదాలు వాడడంలో మాత్రం చంద్రబాబు దిట్ట అని చెప్పాల్సిందే. ఈ సర్కులర్ ఎకానమీ ఏమిటో, అందులో పోలీసుల పాత్ర ఏమిటో జనానికి అర్థం కాదు. రోడ్లు, హైవేలు, పోర్టుల, రైల్వేలు, విమానాశ్రయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని అవన్ని వేగంగా జరిగేలా కలెక్టర్లు చూడాలట. నిధులు ఇస్తే ఆటోమాటిక్ గా సాగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. అమరావతిలో తప్ప మిగిలిన చోట్లకు ఏ మేరకు నిధులు కేటాయించారో చెప్పి ఉంటే బాగుండేది. సంక్షేమ పథకాలు నిరాటంకంగా క్షేత్రస్థాయికి వెళ్లాలట. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టో దగ్గర పెట్టుకుని వెల్ప్ ర్ పై తగు ఆదేశాలు ఇస్తే ఏమైనా చేస్తారు కాని రొటీన్ గా మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? వేగంగా అనుమతులు ఇవ్వాలని, శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని చెప్పడం బాగానే ఉంది. కాకపోతే ప్రభుత్వంలోని వారే వాటిని చెడగొడుతున్న సంగతిని విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి . అధికారులంతా ఫిట్ నెస్ తో ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీరు చెప్పినట్టు ముగ్గురు పిల్లల్ని కనాలంటే ఆరోగ్యం కావాలి కదా బాబు.. యువ డాక్టర్ సెటైర్లు
-
ప్రజా సొమ్ముతో జల్సా రాయుళ్లు
-
సంపద సృష్టి అంటే కార్పొరేట్ల ఆస్తులు పెంచడమా!?
సాక్షి, అమరావతి : చంద్రబాబునాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంపద సృష్టిస్తానని గొప్పలు చెబుతారని, వాస్తవానికి సంపద సృష్టించడం అంటే కార్పొరేట్ల ఆస్తులను పెంచడమా?.. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేట్కు అప్పగిస్తున్నారా? అంటూ పలువురు వక్తలు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటుచేయలేదని.. కానీ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలను మాత్రం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్పరం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. అలాగే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సులను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ప్రతిపక్ష టీడీపీ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ జీఓలను రద్దుచేస్తామని ప్రగల్భాలు పలికిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా ప్రైవేట్పరం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. సమావేశంలో వక్తలు ఇంకా ఏం మాట్లాడారంటే..సగం పూర్తయిన కాలేజీలూ పూర్తికాలేదని..గత ప్రభుత్వం చేపట్టిన 17 వైద్య కళాశాలలకుగాను ఐదింటిలో తరగతులు ప్రారంభించింది. పాడేరు, పులివెందుల కాలేజీల నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. గత ఏడాది పాడేరు కాలేజీలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే మిగతా కాలేజీలూ పూర్తయ్యేవి. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా.. కూటమి ప్రభుత్వం అడ్డుకుంది. పది కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు కట్టబెడుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయిన కాలేజీల్లో సైతం పక్కనున్న పునాదులను చూపించి అసలు పూర్తికాలేదన్నట్లు ప్రజలను మభ్యపెడుతోంది. ఏడాదికి రూ.600 కోట్లు కేటాయించినా ఐదేళ్లల్లో అన్ని పూర్తయ్యి పేద విద్యార్థులకు వైద్య విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం నేదురుమల్లి జనార్థన్రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతివ్వడంతో పెద్దఎత్తున ఉద్యమాలు జరిగి ఆయన పదవి పోయింది. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్యమాలే వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. ప్రజా ఉద్యమాలతోపాటు న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేసే ప్రయత్నాలు విరమించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్వహించడంతోపాటు న్యాయపోరాటం కూడా చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, వైద్యాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు. పీపీపీ ఆలోచనకు స్వస్తిచెప్పి 10 వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని, ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. అలాగే, ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)ను ప్రభుత్వమే నిర్వహించాలనే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఆరోగ్య బీమాను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సామాన్య ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని సమావేశం అభిప్రాయపడింది. ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అలా వెంకటేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి, పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు ఎంవీ రమణయ్యతో పాటు జాస్తి కిషోర్బాబు (సీపీఐ ఎంఎల్), పి. జమలయ్య (సీపీఐ)తదితరులు మాట్లాడారు.ప్రైవేటీకరణ సమస్య విద్యార్థులదే కాదు.. ప్రజలది కూడా..ఇక 15 నెలల ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన గమనిస్తే భూ పందారాలు తప్ప ఏమీలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయనున్న వైద్య కళాశాలలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ఆస్పత్రుల నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రైవేటీకరణ సమస్య కేవలం విద్యార్థులదే కాదు.. ప్రజలది కూడా. వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటే సేవా దృక్పథం.. ప్రైవేట్ చేతుల్లో ఉంటే వ్యాపార దృక్పథం ఉంటుంది. -
ఎక్కే విమానం.. దిగే విమానం!
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారిది ఒకే తీరు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. వారాంతం విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్నారనే చర్చ అటు టీడీపీ కూటమి వర్గాలో.. ఇటు అధికార వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ 15 నెలల్లో సీఎం చంద్రబాబు దాదాపు 70 సార్లు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. మంత్రి లోకేశ్ 77 సార్లు ‘ప్రత్యేక’ంగా ప్రయాణాలు చేశారని తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ప్రత్యేక’ ప్రయాణాలకు అంతేలేదు. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడిపారు. పట్టుమంటే పదిరోజులు ఆయన విజయవాడలో ఉన్న దాఖలాలే లేవని అధికారులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా చంద్రబాబు వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్కు వెళ్లి.. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో ఉండి కూడా చుట్టపుచూపుగా విజయవాడ వస్తున్నారంటూ అధికారులు వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది అదే తీరు.2019లో అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైతే.. కనీసం వారికి మనోధైర్యం కలి్పంచేందుకు కూడా చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి రాలేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2019 మే 30 నుంచి 2024 జూన్ 7 మధ్య రెండు మూడుసార్లు మాత్రమే హైదరాబాద్కు వెళ్లారని.. నిత్యం ప్రజలకు సుపరిపాలన అందించడానికే సమయం వెచి్చంచారని గుర్తు చేస్తున్నారు. లోకేశ్ 77 సార్లు హైదరాబాద్కు.. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు 77 సార్లు వెళ్లినట్లు టీడీపీ కూటమి, సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అంటే.. గత 15 నెలలుగా సగటున వారానికి ఒకసారి లోకేశ్ హైదరాబాద్కు వెళ్లి సరదాగా గడిపినట్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతేడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను చుట్టముట్టి.. విలయం సృష్టించి.. అపార ఆస్తి, ప్రాణనష్టం జరిగినప్పుడు కూడా లోకేశ్ హైదరాబాద్, ముంబయిలో ఉన్నారని ప్రజలు ఎత్తి చూపుతున్నారు.2014–19 మధ్య టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేశ్ ఇదే రీతిలో వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు రాష్ట్రానికి వచి్చంది వేళ్లపై లెక్కపెట్టవచ్చు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో మినహా లోకేశ్ మిగతా రోజుల్లో హైదరాబాద్కే పరిమితం అయ్యారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో టూర్లు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే... దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ అటు అధికార వర్గాలు.. ఇటు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉంటున్నారన్నది స్పష్టమవుతోంది. కలెక్టర్ల సమావేశం వంటి ముఖ్యమైన సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొడుతుండడం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.ఈ 15 నెలల్లో పవన్ విజయవాడలో ఉన్నది చాలా తక్కువని సోషల్ మీడియాలో, కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమా షూటింగ్లు, వ్యక్తిగత పనుల నిమిత్తం పవన్ కళ్యాణ్ రాజధానిలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా గడుపుతున్నారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారాహి యాత్ర సమయంలో మినహా మిగతా సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. -
నెహ్రూ ఫ్యూడలిస్ట్ అయితే చంద్రబాబు ఎవరు?
-
‘పవన్-ఉమా ఎపిసోడ్.. ఐటీసీ కోహినూర్లో ఏం జరిగింది?’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎపిసోడ్పై వైఎస్సార్సీపీ నాయకులు పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. అలాగే, పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చింది అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నీతులు చెప్పడమే కాదు ఆచరించాలి. సిద్ధాంతాలు, భావజాలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం ఎందుకు ప్రశ్నించారు. ఎందుకు అంత ఘాటుగా మాట్లాడారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి కంపు కొడుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకుని చేసిన వసూళ్లన్నీ ఒకే పార్టీకి దక్కాయి. అందుకే పొల్యూషన్ బోర్డు గురించి తెరపైకి తెచ్చారని చర్చ నడుస్తోంది.హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ సాక్షిగా ఏం జరిగింది. హైదరాబాద్లో ఆస్తులు సమకూర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. బోండా-పవన్ మధ్య నడిచిన మాటల యుద్ధం అంతా అవినీతి వ్యవహారానికి సంబంధించినదే. పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చింది. అందుకే చంద్రబాబు ఈ విషయాన్ని తొక్కిపెట్టారు. పొల్యూషన్ను కంట్రోల్ చేయాల్సిన బోర్డు అవినీతికి పాల్పడటమేంటి?. కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతోందని టీడీపీ నేతలే చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో నీతి వ్యాఖ్యలు చెబుతూ అవినీతికి పాల్పడటమేంటి?. పవన్ చెబితేనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ మాట వింటారని బోండా చెబుతున్నారు. పవన్.. కృష్ణయ్యకు ఏం చెప్పారో.. ఏం దిశానిర్ధేశం చేశారో సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు వెల్లడించాలి. బోండా ఉమా ప్రశ్నలకు పవన్కు అంత కోపం రావడానికి కారణమేంటి?. ఈ విషయంపై ప్రజలు లోతుగా ఆలోచించాలి. కృష్ణయ్య పెద్ద పెద్ద కంపెనీలను బెదిరిస్తున్నారు. తునిలో దక్కన్ కెమికల్స్.. లార్స్ ల్యాబ్తో పాటు మరికొన్నింటిని టార్గెట్ చేశారు. పవన్, కృష్ణయ్య దెబ్బకు పెద్ద కంపెనీలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోతున్నాయి. కృష్ణయ్య రాత్రి పూట తనతో సెటిల్ చేసుకోకపోతే తనిఖీలు చేయిస్తారు. ఫార్మా వేస్టేజ్ను సిమెంట్ కంపెనీలకు అమ్మి ప్రతీ రోజూ 30 లక్షలు సంపాదించాలనేది కృష్ణయ్య లక్ష్యం.ప్రీ ప్రోసెసింగ్ యూనిట్లకు కృష్ణయ్య వల్ల చాలా నష్టం. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల జీఎస్టీ నష్టం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. బోండా వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు?. నిబంధనలన్నీ పాటిస్తే కంపెనీలు ఉండవని పవన్ చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలు పాటించారని పవన్ ఒప్పుకున్నారు. ప్రజల జీవితాలకంటే పరిశ్రమలు మీకు ఎక్కువా?. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.100 కోట్లు దోచుకోవడానికే విజయవాడ ఉత్సవ్. అందరూ విజయవాడ ఉత్సవ్ లో పాల్గొనాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మీరు ప్రజలకు ఏం చేశారని ఉత్సవాల్లో పాల్గొనాలి. బుడమేరు వరదలో మునిగిపోయినందుకు పాల్గొనాలా?. ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చేరినందుకా?. ఈరోజు వరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా విజయవాడ ఉత్సవ్లో పాల్గొనలేదు. విజయవాడ ఉత్సవ్ మీద టీడీపీ ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది అని అన్నారు. -
సూపర్ సిక్స్ అంటే పేదవాళ్ళును ఏడిపించటమేనా..!
-
బాబు వల్లే పోలవరం ధ్వంసం.. ఫైల్ ఓపెన్ చేసిందెవరు?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్పై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు?. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తీసుకువచ్చింది వైఎస్సార్. కుడి కాల్వకు భూసేకరణ 10628 ఎకరాలు 2004 నుంచి 2014 మధ్య జరిగింది. ఎడమ కాలువకు 10343 ఎకరాల భూ సేకరణ కూడా ఇదే సమయంలో జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ను చంద్రబాబు ధ్వంసం చేశారు.పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం బాధ్యత. పోలవరం ప్రాజెక్ట్ను చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. సెప్టెంబర్ 8, 2016లో అరుణ్ జైట్లీతో చంద్రబాబు ఒప్పందం కారణంగా చాలా నష్టపోయాం. రూ.50వేల కోట్ల ప్రాజెక్ట్ను చంద్రబాబు రూ.20వేల కోట్లకు ఒప్పుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి చెప్పి రూ.48వేల కోట్లకు ఒప్పించాం. పోలవరంపై చంద్రబాబు తప్పుడు విధానాలు వల్ల చాలా నష్టం జరిగింది. పోలవరం కోసం వైఎస్ జగన్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్లారు. మూసేసిన పోలవరం ఫైల్ను వైఎస్ జగన్ ఓపెన్ చేయించారు.పోలవరంపై కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం లేదు. మేం సాధించిన డబ్బులే పోలవరం ప్రాజెక్ట్పై కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నారు. పోలవరం డబ్బులు అక్టోబర్ 2024లో వస్తే జనవరి 2025లో ఖర్చు చేస్తారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ 83 ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ చనిపోయే నాటికి 43 ప్రాజెక్ట్లు పూర్తి అయ్యాయి. ఆయన హయాంలో 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. హంద్రీ-నీవాపై చంద్రబాబు చాలా దారుణంగా అబద్ధాలు చెబుతున్నారు. హంద్రీ-నీవాపై సింహభాగం పనులు వైఎస్సార్ పూర్తి చేశారు. జల యజ్ఞంలో మిగిలిన పనులను వైఎస్ జగన్ పరుగులు పెట్టించారు’ అని తెలిపారు. -
తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్ధంగా వాడుకుంటున్నారు
-
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు
-
‘జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్.. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్థాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్సీపీ హయాంలోనే రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. తాను టీటీడీ చైర్మన్గా ఉన్న సయమంలో పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను అని సవాల్ విసిరారు. అలాగే, జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. మా పాలనలోనే రవి కుమార్ దొంగతనం బయటపెట్టాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవి కుమార్ చోరీ చేశాడు. రవి కుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి ఇచ్చారు. రవి కుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా?. కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా?. దమ్ముంటే, ధైర్యముంటే విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి. రవి కుమార్కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయి. మా బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు?. ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది.జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు. నేను ఉన్నప్పుడు పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను. దమ్ముంటే సీబీఐ చేత విచారణ చేయించండి. నిజాలు నిగ్గు తేలాలి అంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజీ ద్వారా బయటపెట్టాలి. కూటమికి తాబేదార్లుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామి వారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించాం. కోడిగుడ్డు మీద ఈకలు పీకడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి. బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులే జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన సీసీ కెమెరాలు పుటేజ్ బయట పెట్టాలి. లడ్డు విషయంలో జరిగిన తరహాలో సీబీఐ విచారణ జరిపించాలి. వందల కోట్లు మేము అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాము అని చెప్పిన బీఆర్ నాయుడు ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారు. 22-07-2025 రోజున శ్రీవాణి టికెట్ల ధరను రూ.2వేలకు పెంచడానికి తీర్మానం చేశారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నారు. పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి. వీఐపీ దర్శనాలు తగ్గిస్తున్నామని చెప్పి, ఇంకా పెంచుతూ పోయారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
బాబూ.. దసరాకు మొండిచెయ్యేనా!?
సాక్షి, అమరావతి: దసరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండిచెయ్యి చూపిందని.. శుక్రవారం జరిగిన కేబినెట్లో ఒక డీఏ, ఐఆర్ ఇస్తారని ఉద్యోగులందరూ ఎదురుచూసినా ఫలితం దక్కలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతోందని శనివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ, ఐఆర్ వంటి వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు.ఆయన ఇంకా ఏం తెలిపారంటే.. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి ఆశలు కలి్పంచింది. కానీ, అధికారం చేపట్టాక వారిని పూర్తిగా మర్చిపోయింది. పైగా.. రెగ్యులర్గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వడంలేదు. అలాగే, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి అస్సలు మాట్లాడటంలేదు. ప్రతీ పండక్కి ఉద్యోగులు ఎదురుచూడటం.. తర్వాత నిరాశ చెందటం పరిపాటిగా మారింది. నిజానికి.. 2019లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచి్చన 27 శాతం మధ్యంతర భృతిని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి 2019 జులై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ ఇచి్చంది. రూ.22 వేల కోట్ల బకాయిల ఊసేలేదు.. అలాగే, గత జులైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.22 వేల కోట్లు. అయితే, ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు అడిగినా ప్రభుత్వం పెండింగ్ బకాయిల వివరాలు వెల్లడించలేదు. ఇప్పుడా బకాయిలు రూ.30 వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. పాత బకాయిల్లో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు. ఇక ప్రభుత్వం మారగానే పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. ఇప్పటివరకు కొత్త కమిషనర్ను నియమించలేదంటే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్నచూపో అర్ధమవుతోంది. కేవలం 12వ పీఆర్సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయడానికే ప్రభుత్వం నియమించడంలేదు. ఉద్యోగులంతా పోరాటానికి సిద్ధం కావాలి.. అన్ని ఉద్యోగ సంఘాలు 15 నెలలుగా వివిధ రూపాలలో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పదు. సమస్యలపై పోరాటానికి సిద్ధంకావాలి. దసరాలోపు డీఏ, ఐఆర్, బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపొతే పండగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతాం. -
ప్రైవేట్ చేతుల్లోకి ఫైబర్నెట్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ఏపీ ఫైబర్నెట్ను.. 15 నెలల పాలనలో క్రమంగా బలహీనపరుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు దానిని ‘ప్రైవేటు’కు అప్పజెప్పబోతోంది. ఇప్పటికే అమలవుతున్న భారత్ నెట్–1తో పాటు భారత్నెట్–2 ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఫైబర్నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) తాజాగా టెండర్లు పిలిచింది. విశాఖ, చిత్తూరు జిల్లా్లల్లో భారత్నెట్–1 నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసి ఫేజ్–2కు ఇంటిగ్రేషన్ చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్–2 వ్యవస్థను ఏర్పాటు చేయడం, గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్నెట్లో పనిచేస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించింది. సాంకేతిక సిబ్బందికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం, సేవలను నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఫైబర్ నెట్ కనెక్షన్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు అనేకసార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. అలాగే జీవీ రెడ్డి కూడా ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇలా.. కుట్రపూరితంగా ఫైబర్నెట్ను నిర్వీర్యం చేస్తూ వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెడుతోంది. -
‘స్కిల్’లో అడ్డంగా దొరికింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా ఎక్కడలేని హడావుడి చేస్తోంది. పనిగట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వారుస్తోంది. జరగని స్కామ్ను జరిగినట్లు చూపడానికి కుట్రలు, కుతంత్రాలతో కుప్పిగంతులు వేస్తోంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటూ రోజుకో కట్టుకథ చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. చంద్రబాబు ఏరికోరి నియమించిన సిట్ దర్యాప్తులో ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేక పోగా, ఇప్పుడు ఈడీ పేరు చెప్పి దుష్ప్రచారంలో మరో అంకానికి తెర తీసింది. దుబాయ్లో డబ్బులంటూ హంగామా చేస్తోంది. లేని స్కామ్ను పట్టుకుని కక్ష పూరితంగా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో అసలు స్కామ్ అంటే ఎలా ఉంటుంది.. ఇదే చంద్రబాబు ముఖ్య నిందితుడిగా ఉన్న ‘స్కిల్’ కేసులో ఈడీ ఎలా కొరడా ఝుళిపించిందో.. అన్ని ఆధారాలతో నాటి సిట్.. చంద్రబాబు బండారాన్ని ఎలా బట్టబయలు చేసిందో గుర్తు చేసుకోవాలంటే ఆ కేసు మూలాల్లోకి వెళ్లాల్సిందే. ఆ కేసులో జైలుకు వెళ్లి, బెయిల్పై బయటకు వచ్చిన ఇదే చంద్రబాబు ఎన్ని శ్రీరంగ నీతులు చెబుతున్నా ఆయన ‘స్కిల్ క్రిమినల్’ అని సీఐడీ ఏనాడో తేల్చి చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అదే విషయాన్ని నిగ్గు తేల్చింది.రూ.370 కోట్ల అంచనాలు రూ.3,300 కోట్లకు పెంచేసి.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు అనంతరం డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆరి్థక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు.. గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు. చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు.ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. అందుకే టెండర్ల ప్రక్రియ అనేది లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్ టెక్కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. ఇక షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు నిధులు ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరఫున నిధులు ఎలా మంజూరు చేస్తామని తమ అభ్యంతరాలను పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీఎస్ఎస్డీసీ సీఈవో గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తర్వాత ఆ ఫైల్ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని పీవీ రమేశ్ ప్రత్యేక కార్యదర్శి సునీతకు తెలియజేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందులో సాఫ్ట్వేర్ కొనుగోలుకు రూ.56 కోట్లు చెల్లించారు., మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలో షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 2018లోనే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం» ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం 2018లోనే గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పూణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా అప్పటి సీఎం చంద్రబాబు ఏసీబీని అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు.» 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్లోని తమ ఎండీ సుమన్ బోస్ను ఆ పదవి నుంచి తొలగించింది. » ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు. » ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లుగా వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది. దీంతో ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది.స్కిల్ కుంభకోణంలో బాబు అరెస్టు.. రిమాండ్లో 52 రోజులు » ఈ కేసులో కీలక ఆధారాలు లభించడంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. » అప్పటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతోపాటు మరో 38 మందిని నిందితులుగా పేర్కొంది. 2023 సెపె్టంబరు 9న సిట్ చంద్రబాబును అరెస్టు చేసింది. ఆయన అవినీతికి ఆధారాలున్నాయన్న సిట్ వాదనతో ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది. అందుకే చంద్రబాబును రిమాండ్కు పంపింది. ఈ కేసులో చంద్రబాబు 52 రోజులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు. ఆ ముగ్గురే కీలకం..» 2014–19లో రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయ పన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసింది. ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. » చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి అయిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది. వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారవ్వడం గమనార్హం. 2024లో బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బాబు అవినీతిపై ఈడీ కొరడా» ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన ముడుపులు.. ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు వెళ్లాయి.. అక్కడి నుంచి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. » డిజైన్ టెక్కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెర్డ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. బాబు అవినీతిని కడిగిపారేసిన కాగ్» రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. » అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి, ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. -
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు అంటూ చురకలు అంటించారు.‘‘పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. తన పచ్చి అబద్దాల కోసం చనిపోయిన వాజపేయిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు శిలా ఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్సార్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్సార్. కానీ తానే చేసినట్టు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లటం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు. చంద్రబాబు అసమర్థ నిర్ణయాల వలనే పోలవరం ఆలస్యం అవుతోంది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే కట్టాల్సి ఉంది. కానీ కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరాన్ని తీసుకున్నారు. పోలవరాన్ని పేటిఎంలాగా వాడుకుంటున్నారని ప్రధాని మోదీనే చెప్పారు’’ అని అంబటి గుర్తు చేశారు.‘‘స్పిల్ వే నిర్మాణం చేసి నదిని డైవర్ట్ చేసిన ఘనత జగన్ది. 41.15 మీటర్లకే నీటిని నిలిపేందుకు చంద్రబాబు అంగీకరించారు. దీని వలన ఉత్తరాంధ్రకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. పోలవరం నిర్మాణంలో తప్పులు జరిగాయని సాక్షాత్తు అంతర్జాతీయ నిపుణుల కమిటీనే తేల్చి చెప్పింది. డయాఫ్రం వాల్ నిర్మాణం కూడా చంద్రబాబు హయాంలోనే డ్యామేజీ అయిందని కమిటీ చెప్పింది. మా హయాంలో వచ్చిన వరదల సమయంలో అద్భుతంగా పని చేశామని అదే నిపుణుల కమిటీ మా ప్రభుత్వాన్ని మెచ్చుకుంది. పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిన ఘనత వైఎస్సార్ది. ఆయన కృషిని జగన్ కొనసాగిస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు..కరోనా సమయంలో సైతం పోలవరాన్ని వేగంగా నిర్మాణం చేయించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. అది ఆయన కలలు కన్న ప్రాజెక్టు కాదు. అసెంబ్లీలో మాత్రమే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారు. కనీసం కేబినెట్ మీటింగ్లకు కూడా హాజరు కావటం లేదు. దీని వెనుక మర్మం ఏంటో పవన్కే తెలియాలి. డిప్యూటీ సీఎం సినిమాలో నటిస్తే టికెట్ ధర వెయ్యి చేస్తారా?. అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా?. ఈ దోపిడీ కరెక్టు కాదు. జనాన్ని పీక్కుతింటామంటే కుదరదు. ఎక్కువ మంది జనం చూస్తే డబ్బులు రావాలని కోరుకోవాలే గానీ ఇలా దోపిడీ చేయడం కరెక్టు కాదు. పరకామణిని వైఎస్సార్సీపీ వారు దోచుకున్నారంటూ లోకేష్ ట్వీట్ చేయటం అవివేకం. ప్రతిదానిలోనూ మేము ఉంటామని చెప్పటం లోకేష్కు అలవాటే. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా మూడేళ్లు కొనసాగిస్తారు. ఆ తర్వాత సంగతేంటో కూడా లోకేష్ గుర్తిస్తే మంచిది’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి: అవినాష్ రెడ్డి
-
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేస్తాం: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీపై పడి పచ్చమూక దోచుకుని తింటుందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ‘‘పేద విద్యార్థి వైద్య విద్యను అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చింది. అలాంటి మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ అంగట్లో పెట్టి అమ్ముతుందని సతీష్రెడ్డి దుయ్యబట్టారు. రైతులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అన్నారు. కనీసం ఇలాంటి ఒక హామీ ఇచ్చామన్న విషయం కూడా కూటమికి గుర్తు లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థలు నడపలేని పరిస్థితి. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్పై విష ప్రచారం చేయడమే కూటమి ఏజెండాగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ బంధువు అనిల్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడంటూ కూటమి ప్రభుత్వం లీకులు ఇస్తుంది. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి తీసుకున్న నోట్లపై పెద్ద డ్రామా చేశారు. ఏపీలో యూరియా కొరత తీవ్ర స్థాయిలో ఉంది. కూటమి ప్రభుత్వం పలుకుబడి అంతా వైఎస్సార్సీపీ నేతల పై కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు.’’ అంటూ సతీష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ భారతికి రెండు కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు.. దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా?.. నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారు.’’ అని సతీష్రెడ్డి పేర్కొన్నారు. ‘‘మద్యం ఏరులైపారుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం రేట్లు పెంచారు. నాడు-నేడు పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హాయాంలో ఏర్పాటు చేసినవే.. చంద్రబాబు నీ అబద్దాలు ఆపు’’ అంటూ ఎస్వీ సతీష్రెడ్డి నిప్పులు చెరిగారు. -
Visakha: కూటమి ప్రభుత్వంపై వీధి వ్యాపారుల మండిపాటు
-
చంద్రబాబూ.. ఆ అధికారం నీకు ఎక్కడిది?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం.. చంద్రబాబుకు ఎక్కడిది?. మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ కట్టించడం హర్షించదగినది అని ప్రశంసలు కురిపించారు.మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాల్లో పీపీపీ విధానం తీసుకురావడం సరైన విధానం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైద్య, విద్యా రంగాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వాళ్లకే లబ్ది జరుగుతుంది. 1972 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు.. కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూములను 95 పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు.P4 విధానాన్ని చంద్రబాబు విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి. UHI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టాలి. అమరావతిలో పెట్టేందుకు వీల్లేదు. టూరిజం పాలసీ ప్రకారం లులు కంపెనీలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు. లులు మీద ప్రేమతో ఆర్టీసీ స్ధలాన్ని 99 సంవత్సరాలకు ప్రైవేటు పరం చేశాడు. చంద్రబాబుకు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం ఎక్కడుంది?. విజయవాడలో లులు కంపెనీకి ప్రైవేట్ పరం చేసిన దానిపై సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను.చంద్రబాబుకు సానుకూలమైన పత్రికలోనే మట్టి దందా వార్తలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం బూడిద కంపెనీలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. గతంలో నీరు చెట్టు-కార్యక్రమంలో ఉన్న బాకీలు నేటి కూడా చంద్రబాబు చెల్లించలేదు. మంత్రి నారాయణ కళాశాలల్లో 10 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు పీఫోర్ విధానం అమలు చేయండి. గతంలో 75 ఏళ్లలో 2365 మెడికల్ సీట్లు ఉండేవి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు వల్ల 2550 మెడికల్ సీట్లు వస్తాయి’ అని తెలిపారు. -
బాబు ఆర్థిక విధ్వంసం.. టార్గెట్ 9 లక్షల కోట్లు..
-
పవన్ OG సినిమా టికెట్కి ఉన్న విలువ రైతు ప్రాణాలకు లేదా?
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే... ఉషశ్రీ చరణ్ ఉగ్రరూపం
-
బాబుకు అనుక్షణం భయం
-
ప్రజల కోసం పోరాటం.. ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం.. నెలకాకపోతే రెండు నెలల జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నడపలేదని 2014-19 మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేశారు. పేద పిల్లలు మెరుగైన వైద్య విద్యను అభ్యసించాలని ఆలోచన చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు.మాట తప్పిన లోకేష్ నాయుడు..కాలేజీల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక 50 సీట్లకు పేమెంట్ కోట కింద పెట్టారు. వైఎస్ జగన్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అధికారంలోకి రాగానే 150 సీట్లు 15 వేలకే అందిస్తామని లోకేష్ నాయుడు చెప్పాడు. కానీ, అసలు కాలేజీలనే నడపలేనని ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. నిరసనకు పర్మిషన్ అడిగాం ఇవ్వనన్నారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్తే లోపలేస్తామన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాడటం మా బాధ్యత. అందుకే ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టాం.జనసేన, టీడీపీ సంగతేంటి?రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారు. 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు పెట్టారని చెబుతున్నారు. ప్రజల కోసం మేము పోరాడుతున్నాం.. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబుకు నచ్చింది చేసుకోనివ్వండి. హత్యలు చేసి దొరికిపోయిన వాళ్లే నామోషిగా ఫీలవ్వడం లేదు. ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలి. ప్రజల కోసం పోరాడాం.. నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి. జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నాం. కృష్ణాజిల్లాలో జనసేన, టీడీపీ నేతల అరాచకాలపై ఇలాగే కొరడా ఝుళిపించాలని కోరుకుంటున్నాం.ఎస్పీకి సూచన..గత ఎస్పీ కారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రాజకీయ వ్యవస్థకు తలొగ్గారు. ఏకపక్షంగా వ్యవహరించడానికి అలవాటైపోయారు. గాడి తప్పిన పోలీసులను గాడిలో పెట్టండి. పాత అలవాట్లను వదిలించండి. స్టేషన్ ఆఫీసర్లు పేకాటను నడిపిస్తున్నారు. మర్డర్లు చేసే వారికి కొమ్ము కాస్తున్నారు. మరో స్టేషన్ ఆఫీసర్ పెద్ద ఎత్తున డీజిల్ మాఫియా నడిపిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో ఆయన నడుచుకుంటారు. మంత్రి గారి అనుచరులు తప్ప మరొకరు డీజిల్ అమ్మితే ఆయన ఊరుకోరు. నెలకు పది నుంచి 12 లారీల డీజిల్ అమ్ముకుంటున్నారు. పోర్టు దగ్గర్లో భూమిలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు తెలిసే ఇంతలా బరితెగించారు. బందరు వాళ్లను కాకుండా బయట నుంచి ఆఫీసర్లను పంపించండి మీకే తెలుస్తుంది. మీ చుట్టూ గాడి చెప్పిన వ్యవస్థను సరిదిద్దండి. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు. -
చేతకాని దద్దమ్మలు.. ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి కొడతారు
-
అధికారులే బాధ్యులు.. మాట మార్చడం చిటికెలో పని!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని, యూరియాతోపాటు మొత్తం 94,892 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు మూడో తారీఖున ప్రకటించిన బాబుగారు.. పదహారవ తేదీ వచ్చేసరికి యూరియా సరఫరాలో విఫలమయ్యామని, మానవ తప్పిదం జరిగిపోయిందని, అధికారులు తానిచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడంతోనే ఈ విపత్తు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో వాపోయారు! తద్వారా ఏం తేలింది? రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయనడం తన ఘనతగానూ.. లేమికి కారణం అధికారులదిగానూ తేల్చేసినట్ట అయ్యింది!యూరియా కొరత లేదని దబాయించినప్పుడు... వాస్తవపరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు బాబుగారు ఎంత హడావుడి చేశారని? వైఎస్సార్ కాంగ్రెస్ బుద్ది, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, దుష్ప్రచారం చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతోందని, వారు మనుషులా, పశువులా అని కూడా పెడబొబ్బలు పెట్టారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా.. ఖబడ్డార్! అని హెచ్చరించారు కూడా. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని రైతులు, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ హూంకరింపులన్నీ సోషల్మీడియాను బెదిరించేందుకే అన్నది స్పష్టం. టీడీపీకి వంతపాడే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికలలో యూరియాపై రైతులు పడుతున్న పాట్లను ఫోటోలతో సహా కథనాలు ఇస్తూంటే ఆ విషయం బాబుగారికి తెలియకుండా పోతుందా? స్టేట్ పేజీలలో తన బెదిరింపు ప్రకటనలకే టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇస్తుండడంతో అదే నిజమని జనం నమ్మాలని భావించారా అన్నది తెలియదు. యూరియా సమస్యపై నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. దాంతో ఇప్పుడు యూరియా సరఫరాపై ప్లాన్ ఇచ్చానని నాలుక మడతేశారు. అదేమిటో చెబితే అధికారులకు తెలిసేది కదా! టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడంతో రైతులకు ఈ కష్టాలొచ్చాయని అంటున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటలు వల్ల ప్రజలకు కేన్సర్వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించ లేదని, రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికార్లు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.ఇందుకు బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమోటా ధరలు కూడా పడి పోయాయని, ఈ టైమ్లో రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ లను కోరడం మంచిదే అయినా, కాని వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను కాల్వలలో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. . ఆయన చెబుతున్న సంగతులన్నిటికి కేవలం అధికారులే బాధ్యులా? అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనివ్వకుండా ప్రచారానికి వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు.దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమోటా, ఉల్లి పంటలు అధికం.ప్రతి నెల మొదటి తేదీన అదనపు ఫించన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగువేలు ఇవ్వడానికి హెలికాఫ్టర్ వేసుకుని జిల్లాలకు సి.ఎమ్. వెళుతున్నారు.అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య వంటివాటిపై ఎందుకు వీరు దృష్టి పెట్టలేదు? లేదా రాజంపేట, కర్నూలు, అనంతపురం వంటి చోట్లకు చంద్రబాబే వెళ్లారు కదా! ఈ మధ్య ఆయన బడ్డి కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు వెళ్లడం, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం వంటివి చేస్తున్నారు కదా! ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి వంటి పంటల ధరల గురించి తెలిసేది కదా! యూరియా అవసరమైన మేర వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు యూరియా వాడవద్దని, కాన్సర్ వస్తుందని చెబితే రైతులకు పుండుపై కారం చల్లినట్లు ఉండదా? అందుకే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వేస్తున్నారు. యూరియా వినియోగిస్తే కేన్సర్ వస్తుందని చెబుతున్నారు. మరి మద్యం తాగితే ఎలాంటి జబ్బు రాదా? దానిని ఎందుకు విచ్చలవిడిగా అమ్మిస్తున్నారని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. యూరియా వాడకపోతే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడు ఉన్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్దపడతారా? ఇలాంటి వాటిని ఎప్పుడు చెప్పాలి. సీజన్ రావడానికి నెలల ముందు కదా! అందుకు తగు ప్రత్యామ్నాయాలు ఏమిటో రైతులకు వివరించాలి కదా? అవన్ని వదలివేసి ఇప్పుడే ఏదో తెలిసినట్లు మాట్లాడితే రైతులు విశ్వసిస్తారా? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయల చొప్పున ప్రతీ రైతుకు ఇస్తామని చెప్పి, ఒక ఏడాదిపాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఐదువేలు ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తు ఉండదా? భూసార పరీక్షలు జరగలేదని ఆయనే చెప్పారు.అవి ఎప్పుడు జరగాలి. ఎందుకు జరగడం లేదు? దానికి ఆయన, వ్యవసాయ మంత్రి బాధ్యులు కారా? ఇలాంటి సమస్యలన్నిటిని తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతులకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పని చేయిస్తే, ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందా? లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేవా? కావా? ఆ ఐదేళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవావిధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! తప్పులేదు. గతప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తే దానిని కొనసాగించవచ్చు. అలా కాకుండా ద్వేషంతోనో, జగన్కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు మూడువేల కోట్లను కేటాయించి ఖర్చు చేసేది. మరి ఇప్పుడు ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? ఏది ఏమైనా ఒక సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. పది,పన్నెండు రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా ఇలాంటి అనుచిత మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీకు దమ్ము, ధైర్యం ఉంటే పాడేరు రండి..
-
Big Question: చంద్రబాబు దొంగ బుద్ది.. రంగంలోకి టీడీపీ మాఫియా
-
నన్ను చంపాలని చూస్తున్నారు..! రండి నా పవర్ ఏంటో చూపిస్తా..
-
ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధం.. బాబుకు YS జగన్ వార్నింగ్
-
Big Question: దసరా ఆఫర్! మెడికల్ కాలేజీలు ఫర్ సేల్
-
మద్యం డాన్.. మరో డ్రామా!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు బరితెగించి వ్యవహరిస్తోంది. టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన సిట్తో ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకోసం సాక్షులను, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాటి ఆధారంగానే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు డైరెక్షన్లో సిట్ ఎప్పటికప్పుడు వివిధ పాత్రలను తెరపైకి తెస్తూ నిరాధార అభియోగాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేసి బురద జల్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి దు్రష్పచారం చేశారు. టీడీపీ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అంతటితో చంద్రబాబు కుట్రలు ఆగలేదు... ఈ రెడ్బుక్ కుట్ర కేసులో రెండో అంకంగా.... నర్రెడ్డి సునీల్రెడ్డి నివాసంలో సోదాలతో మరో కట్టుకథ వినిపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, సజ్జల భార్గవ్రెడ్డి పేర్లను తెరపైకి తెచ్చారు. తాజాగా వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్లలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు శుక్రవారం సోదాలకు దిగారు. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వైఎస్ అనిల్రెడ్డి ఏనాడూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లోగానీ ఇతర అంశాల్లో గానీ ఆయన ఏనాడూ కల్పించుకోలేదు. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు వైఎస్ అనిల్రెడ్డి నివాసంలో సోదాలు చేయాల్సిందేనని సిట్ను ఆదేశించింది. ఇదే అదనుగా ఎల్లో మీడియా ద్వారా వైఎస్ కుటుంబంపై బురద జల్లాలన్నదే అసలు లక్ష్యం. రానున్న రోజుల్లో సిట్ ద్వారా రెడ్బుక్ కుట్రలకు మరింత పదును పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది.మద్యం కుట్రదారు చంద్రబాబే..ఇప్పటికీ బెయిల్పైనే ఉన్న బాబు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి ఈ కుట్రకు ఎందుకు పాల్పడుతోంది అంటే... అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి పాల్పడింది టీడీపీ ప్రభుత్వమే అన్నది వాస్తవం. రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. 2014–19లో టీడీపీ హయాంలో తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. 4,834 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు కట్టబెట్టారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును అడ్డగోలుగా తొలగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో దోపిడీకి తెరతీశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండి కొట్టారు. దీనిపై రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి టీడీపీ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు బృందం బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి సీఎం చంద్రబాబు తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పైనే ఉన్నారన్నది అసలు నిజం. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్రరెడ్బుక్ కుట్ర కేసు కోసం చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. ఈ కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కూటమి సర్కారు కుతంత్రం దాగుంది. ఆయన చెప్పని విషయాలను సైతం చెప్పినట్టుగా సిట్ తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అసలు ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు. లేదంటే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది. ఇక అసలు విషయం ఏమిటంటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశారు. ఇక కేశినేని చిన్ని బినామీ కంపెనీ ‘ఉర్సా ఐటీ సొల్యూషన్స్’కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీశారు. కేశినేని చిన్ని ముసుగులో ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడుతున్నారు. మరి రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. అంటే ఇదంతా చంద్రబాబు రెడ్బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని రూపొందించిన ఫైల్పై చంద్రబాబు, కొల్లు రవీంద్ర చేసిన డిజిటల్ సంతకాలు మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రపై 2023 అక్టోబర్ 28నసీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ -
మెడికల్ కాలేజీలపై ‘మండలి’లో ఆందోళన
సాక్షి, అమరావతి: పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి సమావేశంలో పట్టుబట్టారు. సమావేశాలు జరుగుతున్నంతసేపూ వారు పోడియం ముందే నిలబడి పెద్దఎత్తున నినాదాలు, ఆందోళన చేశారు. దీంతో శుక్రవారం గంటపాటు కూడా సభ జరగలేదు. వీరి ఆందోళనల మధ్యే ‘మండలి’ చైర్మన్ మోషేన్రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు. మధ్యలో రెండుసార్లు సభను తాత్కాలికంగా వాయిదా వేసి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వాయిదా తీర్మానం, తిరస్కరణ..అంతకుముందు.. ఉదయం సభ ప్రారంభం కాగానే ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ–పీపీపీ విధానం’ గురించి చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, సిపాయి సుబ్రమణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు.ఇందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాలంటూ పోడియం వద్దకు చేరుకుని ‘ప్రజారోగ్యం ప్రైవేటీకరణా.. పేదలు చదువుకునే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గు’.. వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విద్యా శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ బదులిచ్చారు. బీఏసీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుందాం.. అప్పటివరకు సభ్యులు సహకరించాలని చైర్మన్ సూచించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో, ఆయన సభను కొద్దిసేపు వాయిదా వేశారు.మళ్లీ అదే సీన్..అనంతరం.. ఉ.10.44కు సభ తిరిగి ప్రారంభమయ్యాక మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తిరిగి పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు కొనసాగించారు. ఇంతలో మరో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చైర్మన్ మోషేన్రాజు 11 గంటలకు మళ్లీ వాయిదా వేశారు. మండలి బీఏసీ సమావేశానంతరం సభ తిరిగి కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ..సభ తిరిగి మ.12.38కు ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద మళ్లీ తమ ఆందోళన కొనసాగించారు. మెడికల్ కాలేజీ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం బీఏసీ సమావేశంలో అంగీకరించిందని.. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేసినా వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ప్రశ్నోత్తరాల అజెండాల్లో ఉన్న అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఉంచాలంటూ చెప్పి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసినట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు చేరుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటికి టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లగా, వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ పోడియం ముందే ఉండిపోయారు. ఈ సమయంలో జీఎస్టీపై ప్రభుత్వ ప్రకటన చేసేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ యత్నించగా.. సభలో పరిస్థితులు చూసి సోమవారం ప్రకటన చేస్తానంటూ చెప్పారు. దీంతో.. మ.ఒంటిగంట ప్రాంతంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, ప్రత్యేకించి ‘సాక్షి’ మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో ‘సాక్షి’ మీడియా సంస్థతోపాటు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం ఎడిటర్స్ గిల్డ్ ఒక ఘాటు లేఖ రాసింది. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు అనంత్ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి కె.వి. ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఒక్క పత్రికపైనే ఎందుకు?ఒక రాజకీయ నాయకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు ఇతర మీడియా సంస్థలను వదిలిపెట్టి, కేవలం ‘సాక్షి’పై మాత్రమే క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని, నేర చట్టాలను ఎంపిక చేసుకుని ప్రయోగించడం పోలీసుల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పేర్కొంది. ఇది సాధారణ జర్నలిజంలో భాగమే అయినప్పటికీ, ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.వేధింపులు ఆపండి పత్రికలను అనవసరమైన, కక్ష సాధింపు ఫిర్యాదులతో వేధించకూడదని ఎడిటర్స్ గిల్డ్ హితవు పలికింది. పోలీసుల ప్రవర్తన నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే సంస్థలను భయపెట్టేలా ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి, భయపెట్టడానికి క్రిమినల్ చట్టాలను ఆయుధాలుగా వాడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పత్రికలు నిర్భయంగా విధులను నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పత్రికా స్వేచ్చపై దాడే: ఐజేయూ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతోనే సాక్షి దినపత్రిక, పాత్రికేయులను వేధిస్తోందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్సింగ్ జమ్ము శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు ఇటీవల తనిఖీలు చేయడం, ఆయనకు నోటీసులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పత్రికలను నియంత్రించాలని ఏ ప్రభుత్వం భావించకూడదన్నారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని బల్విందర్సింగ్ స్పష్టంచేశారు. కానీ, పత్రికలపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలను ఐజేయూ ఏమాత్రం ఆమోదించదని స్పష్టంచేశారు. -
ప్రాజెక్టులపై అబద్ధాల ప్రవాహం
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా.. జంకుగొంకు లేకుండా.. పచ్చి అసత్యాలు చెప్పడంలో తనను మించిన వారు ఉండరని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి చాటుకున్నారు! ఉమ్మడి రాష్ట్రంలోగానీ విభజిత రాష్ట్రంలోగానీ దాదాపుగా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని.. వాటిని తానే పూర్తి చేశానని సెలవిచ్చారు. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావిస్తేనే ఓ కమిటీ వేశారని.. దాని స్ఫూర్తితోనే ఆ ప్రక్రియ మొదలైందని చంద్రబాబు చెప్పడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 1996 లోక్సభ ఎన్నికలు, 1999 సార్వత్రిక ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పునాది రాయివేసి.. ఆ తర్వాత తట్టెడుమట్టి కూడా ఎత్తకుండా ప్రజలను వంచించారని గుర్తు చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ 1999 నుంచి 2004 మధ్య ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు చంద్రబాబు వేసిన పునాదిరాళ్ల వద్ద మొక్కలను నాటారని గుర్తు చేస్తున్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.లక్ష కోట్ల వ్యయంతో ఒకేసారి 83 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. 2009 నాటికే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గాలేరు–నగరి తొలిదశ, వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి.. పులిచింతల, సోమశిల, కండలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మంసాగర్లలో పునరావాసం, మిగిలిన పనులను పూర్తి చేసి గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు 2019–24 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్ నీళ్లందించారని గుర్తు చేస్తున్నారు. హవ్వ.. నవ్విపోదురుగాక..! » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి 1996 మార్చి 11న తానే భూమి పూజ చేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో 40 టీఎంసీల హంద్రీ–నీవాను 5 టీఎంసీలకు కుదించి తాగునీటి పథకంగా చేపట్టేందుకు 1999 ఎన్నికలకు ముందు మరో సారి పునాదిరాయి వేశానని చెప్పుకోలేకపోయారు. 1995 నుంచి 2004 మధ్య హంద్రీ–నీవా కోసం కేవలం రూ.13.75 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.. అదీ రెండు సార్లు శంకుస్థాపన, బహిరంగ సభలకు జనసమీకరణ, ఉద్యోగుల జీతభత్యాలకు చేసిన వ్యయమే. ఆ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక హంద్రీ–నీవా సుజల స్రవంతి పనులు చేపట్టి తన హయాంలోనే రూ.6,948.20 కోట్లు వ్యయం చేసి తొలిదశను పూర్తి చేశారు. రెండో దశలో 80 శాతం పూర్తి చేశారు. దాంతో 2012లో హంద్రీ–నీవా తొలి దశను అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తూ ఆ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించింది. శ్రీశైలంలో 795 అడుగుల నుంచే హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2007, ఆగస్టు 31న చేపట్టిన నాటి సీఎం వైఎస్ 2009 నాటికే 90 శాతం పనులు పూర్తి చేశారు. ఇదీ వాస్తవం. 2014–19 మధ్య హంద్రీ–నీవాకు టీడీపీ సర్కార్ రూ.4,182.68 కోట్లు వ్యయం చేసి.. జీవో 22(ధర సర్దుబాటు) పేరుతో కాంట్రాక్టర్లకు అదనపు నిధులు దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారని సాగునీటిరంగ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ హంద్రీ–నీవా సామర్థ్యం 40 టీఎంసీల కంటే అధికంగా తరలించి.. రాయలసీమను సస్యశ్యామలం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులను తరలిస్తామనే పేరుతో లైనింగ్ పనులు చేపట్టి, కాంట్రాక్టర్లకు నిధులైతే దోచిపెట్టారని.. కానీ ఇప్పటికీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు. » వెలిగొండ ప్రాజెక్టుకు 1996 ఏప్రిల్ 20న తాను భూమిపూజ చేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ భూమి పూజ సందర్భంగా నిర్వహించిన సభ కోసం రూ.పది లక్షలు ఖర్చు చేశారు. కానీ.. 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులో తట్టెడుమట్టి కూడా ఎత్తలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును చేపట్టి తన హయాంలో రూ.3,581.57 కోట్లు వ్యయం చేసి సింహభాగం పనులు పూర్తి చేశారు. కానీ.. 2014–19 మధ్య ఆ ప్రాజెక్టు కోసం రూ.1,414.51 కోట్లు వ్యయం చేసిన సీఎం చంద్రబాబు.. జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారని.. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల పేరుతో మరో రూ.66.44 కోట్లు దోచిపెట్టారని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ రూ.1,046.46 కోట్లు వ్యయం చేసి ఆసియాలో అతి పొడవైన రెండు సొరంగాలను పూర్తి చేశారు. కేవలం రూ.905 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు తరలించే అవకాశం ఉండేదని.. కానీ కమీషన్లు రావనే నెపంతో ఆ పనులు కూటమి సర్కార్ చేపట్టడం లేదని.. ఇప్పుడేమో 2026, జూలైకి పూర్తి చేస్తామని కొత్త పాట పాడుతున్నారని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. » తుంగభద్ర డ్యాం 19వ గేటు గతేడాది ఆగస్టు 10న కొట్టుకుపోతే.. ఆ డ్యాం భద్రతపై కేంద్రం నియమించిన ఏకే బజాజ్ కమిటీ.. కాలం చెల్లిన 33 గేట్లను మార్చాల్సిందేనని నిరుడు సెపె్టంబరు 10న నివేదిక ఇచి్చంది. తుంగభద్ర బోర్డు నిబంధనల ప్రకారం డ్యాం మరమ్మతులకు అవసరమైన నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత విడుదల చేయాలి.. ఆ తర్వాత వాటా నిధులను కర్ణాటక, తెలంగాణ విడుదల చేస్తాయి. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్ల మార్పునకు రూ.54.42 కోట్లను సకాలంలో విడుదల చేయలేదు. దాంతో ఈ ఏడాది ఆ డ్యాంలో గరిష్ట స్థాయిలో 105 టీఎంసీలు కాకుండా కేవలం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాల్సిన దుస్థితి ఉత్పన్నమైంది. దీని వల్ల ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. » వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తన సూచన మేరకే నదుల అనుసంధానంపై కమిటీ వేశారని.. దాని వల్ల నదుల అనుసంధానం ప్రక్రియ మొదలైందని సీఎం చంద్రబాబు సెలవివ్వడంపై సాగునీటిరంగ నిపుణులు నిర్ఘాంతపోతున్నారు. నదుల అనుసంధానం చేయడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేయడానికి, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి 1980 నాటికే ప్రణాళికను కేంద్రం రూపొందించిందని గుర్తుచేస్తున్నారు. ఆ ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారించి.. 2002లో నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని.. ఆ మేరకే నదుల అనుసంధానంపై కమిటీ ఏర్పాటుచేసి.. ఆ ప్రక్రియను కేంద్రం చేపట్టిందని స్పష్టం చేస్తున్నారు. » సాగునీటి ప్రాజెక్టులపై 2014–19 మధ్య తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,417 కోట్లు ఖర్చు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.28,376 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ.. జీవో 22, జీవో 63ల ద్వారా 2014–19 మధ్య వ్యయం చేసిన నిధుల్లో అధిక శాతం అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనం.. ఆ ఐదేళ్లలో కొత్తగా నీళ్లు ఇచ్చిన ఆయకట్టు 3.84 లక్షల ఎకరాలు మాత్రమేనని పేర్కొంటున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ సర్కార్ ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసిందని గుర్తు చేస్తున్నారు. పోలవరంలో విధ్వంసం సృష్టించింది చంద్రబాబే.. తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారు. 2009 నాటికే రూ.5 వేల కోట్లు వ్యయం చేసి, సింహభాగం భూసేకరణను పూర్తి చేసి, కుడి, ఎడమ కాలువలను అధిక శాతం పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రక్రియను పూర్తి చేశారు. విభజన నేపథ్యంలో ఆ ప్రాజెక్టును వంద శాతం వ్యయం భరించి తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2014, మే 28 పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేసింది. కానీ.. కమీషన్ల దాహంతో, కేంద్రం కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016, సెపె్టంబరు 7న చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మాన్యువల్ను తుంగలో తొక్కి.. కమీషన్లు అధికంగా వచ్చే పనులను చేపట్టారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ను 2018 నాటికే పూర్తి చేశారు.. అది అప్పట్లో వచ్చిన వరదలకే కోతకు గురై దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిచెబుతూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ఆ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. ఆ ఫలితంగానే రూ.12,157.53 కోట్లు విడుదలకు కేంద్రం అంగీకరించింది. 2014–19 మధ్య సీఎం చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుండా ఉండి ఉంటే.. 2022 నాటికే వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టును పూర్తి చేసేవారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు.. పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేసి, దాన్ని బ్యారేజ్గా మార్చేసి.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని పేర్కొంటున్నారు. -
నిరసన తెలిపే హక్కును కాలరాస్తారా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుతంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? ఎందుకు లాఠీచార్జ్ చేశారు? గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తారా? » మీరు స్కాములు చేస్తూ ప్రజల ఆస్తులైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచి వేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వెలుపల కూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసిస్తుంటే పోలీసులతో దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం? » మీరింతగా తెగబడినా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితోపాటు యువతీ యువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలో, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలో విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు ఉధృతంగా కొనసాగుతాయి. -
పీపీపీపై ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సామాన్యులకు వైద్య విద్యను దూరం చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జనం కదంతొక్కారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని.. జీవో 590ను రద్దు చేయాలని.. పీపీపీ బాబూ.. సిగ్గు సిగ్గు.. అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వైద్య సేవలను మెరుగుపర్చటం.. సామాన్యులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో నాటి సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు కాలేజీలు 2023–24 సంవత్సరంలోనే ప్రారంభించారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం అప్పటికే పూర్తయింది. గత ఏడాది పాడేరు మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. మిగతా పది మెడికల్ కాలేజీల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు మిగిలిన పనులను ఉద్దేశ పూర్వకంగా పూర్తి చేయలేదు. పది మెడికల్ కాలేజీలను ముడుపుల కోసం సన్నిహితులకు కట్టబెట్టేందుకు వాటిని ప్రైవేటీకరించాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యమం చేపట్టాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి టీడీపీ కూటమి సర్కార్ యధావిధిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ప్రయోగించింది. ఎక్కడికక్కడ అడ్డంకులువైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెడతామని వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించారు. నిర్బంధాలను ఛేదించుకుని.. బెదిరింపులకు బెదరకుండా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కదంతొక్కారు. ఈ ర్యాలీలకు సామాన్య ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. మెడికల్ కాలేజీల వద్దకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామన్య ప్రజలపై పోలీసులు లాఠీలను ఝుళిపించారు. పోలీసుల లాఠీల దెబ్బలకు జడవకుండా సర్కార్పై రణభేరి మోగించారు. ‘పీపీపీ వద్దు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముద్దు.. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటుపరం.. సామాన్యుడికి ఉన్నత చదువు దూరం..’ నినాదాలతో కూడిన ప్ల కార్డులతో ప్రజలు ర్యాలీల్లో కవాతు చేశారు. ‘ముడుపుల కోసం ప్రజల ఆస్తులు అమ్మేస్తారా సిగ్గు సిగ్గు.. సంపద సృష్టికర్త కాదు.. చంద్రబాబు సంపద దోపిడీ కర్త’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.వైఎస్సార్సీపీ నిర్వహించిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి ఎక్కడ చూసినా తండోప తండాలుగా జనం కదంతొక్కిన తీరు సర్కారు పెద్దల్లో గుబులు రేపింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు ఈ నిరసనలు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తోపులాటలు, నిర్బంధాలు» కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తోపులాటలు, అడ్డగింతలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి మెడికల్ కళాశాలకు వెళ్లే అన్ని రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. లాఠీలు ఝుళిపించారు. సామాన్య ప్రజలను సైతం అటువైపు వెళ్లనివ్వలేదు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. నగరంలోకి రానివ్వకుండా నగర శివార్లలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా జనం పాల్గొన్నారు. దీంతో 400 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.» పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమానికి భారీగా ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రజా పోరును అడ్డుకునే ప్రయత్నం చేశారు. మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులను అరెస్ట్ చేసి పోలీస్స్టేçషన్కు తరలించారు. గురువారం రాత్రి నుంచే పలువురు నేతలకు పోలీసులు నోటీసులు అందజేసి హౌస్ అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం మెడికల్ కాలేజీ వద్ద పార్టీ నేతలు, ప్రజలు కదం తొక్కారు. » రాజమహేంద్రవరం వైద్య కళాశాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యువత, విద్యార్థులు, వైఎస్సార్సీపీ నేతలు సమాయత్తమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లనిచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను పోలీసులు బలవంతంగా లాగేశారు. » పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ దగ్గులూరులో నిర్వహించిన ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మెయిన్ రోడ్డు నుంచి కళాశాల ఆవరణ వరకు కిలోమీటరు మేర ప్ల కార్డులతో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు వెల్లువలా తరలి వచ్చారు. » విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినా.. ‘చలో మెడికల్ కాలేజీ’ విజయవంతమైంది. అనకాç³ల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో గల మెడికల్ కళాశాల వద్ద ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఏలూరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు ఆందోళన నిర్వహించారు. కాలేజీకి నాలుగు వైపులా బారికేడ్లు పెట్టారు. 150 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలువరించారు. నంద్యాల్లో 1,500 మంది పోలీస్స్టేషన్కు తరలింపునంద్యాలలో ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన 1,500 మందిని బలవంతంగా జీపుల్లో, లారీల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, విద్యార్థులు, యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్ సమీపంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దద్దరిల్లిన మదనపల్లె, పులివెందులఅన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిరసన కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన ఆందోళనకు అనూహ్య స్పందన లభించింది. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో విద్యార్థి లోకం గర్జించింది. వైఎస్సార్సీపీ జిల్లా యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, వలంటీర్ విభాగాలు, అనుబంధ విభాగాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పులివెందుల మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. -
మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘చంద్రబాబూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం...మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో పాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు..@ncbn గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు… pic.twitter.com/EkqzMcG9cW— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2025 -
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదువైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారుప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలివైఎస్సార్సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు. -
Ambati: ప్రభుత్వానికి చాలా థాంక్స్ ఈ కార్యక్రమాన్ని మీరే సక్సెస్ చేశారు
-
Vidadala: కూటమి ప్రభుత్వం వల్ల సర్కార్ వైద్యం ప్రజలకు దూరమవుతుంది
-
Byreddy: ఎక్కడ పుట్టాడో నువ్వే అడుగు... పవన్ తో నన్ను తిట్టిస్తారా..
-
Perni Nani: ఇంట్లో పడుకుంటే పని అవ్వదూ... విలేకర్ ప్రశ్నకు పేర్ని నాని సమాధానం అదుర్స్
-
అప్పు చేసి అమరావతికి పప్పన్నమా?
ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టూ ఒక రోడ్డు వేసేందుకు పాతిక వేల కోట్లు ఖర్చు అవుతుందట. ఇంత మొత్తం పెట్టేందుకు కేంద్రం, రాష్ట్రం కూడా సిద్ధమేనట. ఈ భారీ ఖర్చుకు తోడు.. రాజధాని ప్రాంతాన్ని వరదనీరు ముంచేయకుండా ఉండేందుకు రెండు ఎత్తిపోతల పథకాలు. వీటి కోసం రూ.ఆరు వేల కోట్ల ఖర్చు! ఇంతింత ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద సామాన్యులకు చౌకగా వైద్యం అందించేందుకు పనికొచ్చే వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం పైసా లేకపోవడం విచిత్రమే! డబ్బుల్లేకే వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది పాపం!అమరావతిలో 34 వేల ఎకరాల రైతుల భూమి, ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో తెగ చెప్పేవారు.. ఇప్పుడేమో ఆ భూమి మున్సిపాల్టీ స్థాయిది అంటున్నారు. అంతర్జాతీయ నగరం కావాలంటే ఇంకో 44 వేల ఎకరాలైనా కావాలంటున్నారు. ఈ రెండు విషయాలను వింటే ఏమనిపిస్తుంది? ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతోందన్న అనుమానం వస్తుంది.రియల్ ఎస్టేట్ వారి ప్రయోజనాల కోసం, ప్రైవేటు పెట్టుదారుల లాభాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను విస్మరించిందన్న విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా అణ, కాణీలకు ప్రైవేటు వారికి కట్టబెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రైవేటు సంస్థలు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ,ప్రభుత్వం నుంచి రాయితీలు పొందితే ఫర్వాలేదు. అలా కాకుండా ఉత్తిపుణ్యానికి ప్రభుత్వ ఆస్తులు పొందడమే కాకుండా, రాయితీలు కూడా అనుభవిస్తే ప్రజలలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతుంది.విశాఖపట్నంలో రిషికొండపై కేవలం రూ.450 కోట్ల వ్యయంతో గతంలో ఉన్నవాటి స్థానంలో ఏడు కొత్త భవనాలను నిర్మిస్తే వృథా ఖర్చు, పర్యావరణానికి విఘాతమని విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట తీసేసుకున్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ విస్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. స్వభావరీత్యా అక్కడి భూమి భారీ భవనాల నిర్మాణానికి అనువు కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ... చంద్రబాబు ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ముందుకు సాగుతోంది.పరిపాలన కేంద్రమైన రాజధాని కోసం అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని అప్పట్లోనే చాలామంది చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు సరికదా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసేది. పోనీ.. అప్పట్లో తీసుకున్న ముప్ఫైవేల పైచిలుకు భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసిన రైతులకు ఇస్తామన్న భూమి ఇచ్చారా? ఊహూ లేదు. అలా చేసి ఇప్పుడు అదనపు భూమి కోసం అడిగితే రైతుల నుంచి అభ్యంతరాలు పెద్దగా వచ్చేవి కావేమో. ఒకపక్క అప్పుడప్పుడూ భూములు బలవంతంగా తీసుకోమని చెబుతూనే ఇంకోపక్క దానికి భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి అలవాటైపోయింది.తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్, హోటల్ యాజమాన్యం బలవంతంగా తీసుకుందని ఇద్దరు చిన్నకారు రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవగా భూములిచ్చేయమని సలహాలు పారేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్డీయే కూడా భూములను బలవంతంగా లాక్కొనేందుకు సిద్ధమవుతోంది రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులకు కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై విష ప్రచారం ఆరంభిస్తారు. అమరావతి దేవతల రాజధాని అని, రాక్షసులు కొందరు దానిని చెడగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మొదలు అందరూ విమర్శించడం ఆరంభిస్తారు.రైతుల పాట్ల మాటేమిటి అని ఎవరూ ప్రశ్నించకూడదు. లక్షల కోట్లు వ్యయం చేసి ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మించడం ఎలా సాధ్యమని చాలామందిలో అనుమానం ఉన్నా ఎవరికి వారు ఏమోలే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త, కొత్త ప్రతిపాదనలలోకి వెళుతుండడంతో గతంలో భూములు ఇచ్చిన వారిలో సందేహాలు, భయం మొదలయ్యాయి. దానికితోడు ఇప్పుడు ఇది చిన్న మున్సిపాల్టీ అవుతుందని సీఎం స్వయంగా అనడం మరింత నిశ్చేష్టులను చేస్తోంది.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నట్లు ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేస్తుందా? లేక ఒక నగరం నిర్మిస్తుందా? ఏది ఆచరణాత్మకం? మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాము అమరావతికి వ్యతిరేకం కాదని, వచ్చేసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడనుంచే పాలన చేస్తారని స్పష్టం చేశారు. అయితే లక్షల కోట్ల వ్యయం ఒకే చోట చేయడం కన్నా, అవసరమైన రాజధాని భవనాలు నిర్మించి, ఆ తర్వాత అభివృద్ది ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని అన్నారు. సజ్జల ప్రకటనను కూడా వక్రికరిస్తూ ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసింది. అది వేరే విషయం. సజ్జలకాని, బుగ్గన కాని చెప్పినట్లు ఒకే చోట లక్షల కోట్లు వ్యయం చేస్తే మిగిలిన రాష్ట్ర ప్రజల మాటేమిటి?ఆ ప్రాంతంలో అభివృద్ది సంగేతేమిటి? విశాఖలోని ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతూ అమరావతిలో మాత్రం కోట్ల రూపాయల ధరలు చెబితే పరిశ్రమలు ఎలా ఇక్కడకు వస్తాయి? అన్నది కూడా చర్చ అవుతుంది. అనంతపురంలో జరిగిన సభలో అమరావతి రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందుకోసం అప్పులు కూడా తీసుకు వస్తున్నామని ధైర్యంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆరువేల కోట్లు ప్రభుత్వం వద్ద లేకపోతే, అమరావతి రాజధానికి మాత్రం ఇన్నివేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి.రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం ఏపాటి తెలివైన పని. సభలు,ఉచిత ఉపన్యాసాలు ఇతర ప్రాంతాలకి, లక్షల కోట్ల ఖర్చు మాత్రం అమరావతికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రాంతీయ అసమానతలు ఏర్పడవా? ఆ తరహా చర్చ జరగడం ఏపీకి మంచిదా? పోనీ ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతోందా అంటే అదీ కనిపించడం లేదు. వారు ప్రభుత్వానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటివాటికి ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు.కేవలం బెదిరింపులు, పోలీసుల ద్వారా భయపెట్టి వేల ఎకరాలను సమీకరించుకోవాలనుకోవడం విపరిణామాలకు దారి తీయవచ్చు.వీటన్నిటిని గమనించి సమతుల్యతతో కూడిన సమిశ్ర అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఏపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు
-
ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక
-
కదం తొక్కిన వైఎస్సార్సీపీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం (చిత్రాలు)
-
రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..
-
ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
-
మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము
-
YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్ కాలేజీ
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహించబోంది. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదువైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందని ప్రైవేట్కు అప్పగించాలని నిర్ణయించడం దారుణంప్రైవేటైజేషన్ విధానాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వ్యతిరేకించాయిప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్కు మంచి పేరు వస్తుందని తట్టుకోలేకపోతున్నారుకూటమి నేతలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా?చంద్రబాబు మంత్రులు నాతో వస్తే మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో చూపిస్తావిజనరీ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు 5వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా?చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడుఅనిత ఇంఛార్జ్గా ఉన్న విజయనగరం, పాడేరు, నర్సీపట్నం కాలేజీలు నాతో అనిత వస్తే చూపిస్తాను15నెలల్లో మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమంత్రి సవిత మెడికల్ కాలేజేల వద్ద కామెడి స్కిట్స్ చేస్తున్నారుబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రూ. 50 కోట్లు కూడా విడుదల చేయించుకోలేకపోయారు.చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేస్తుంది.- వరదు కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లారాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కామెంట్స్పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్లచంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం -మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు ప్రకాశంచంద్రబాబుకి పేదలంటే అసహ్యంఅందుకే వైద్యం విద్య దూరం చేస్తున్నాడుమార్కాపురం కాలేజీ పూర్తి కాలేదు అంటున్న. కూటమి నాయకులు కళ్లు తెరుచుకొని చూడాలిఅమరావతి మీద ఉన్న శ్రద్ద మెడికల్ కాలేజీల మీదలేదుఅమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుందిమెడికల్ కాలేజీ అందరికీ ఉపయోగపడుతుంది - మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్కూటమి నేతలు కళ్లున్న కబోదిల్లా వ్యవహరిస్తున్నారుమార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా కాలేదో తెలుస్తుందిపదహారు సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం నేతలకు వెనకబడిన ప్రాంతం కనపడలేదుపేదవాళ్ల ఉసురు చంద్రబాబుకి తప్పదుకూటమి నేతలు కృరమృగాలులా ప్రవర్తిస్తున్నారు..ఎవడబ్బ సొత్తు అని ప్రయివేటు పరం చేస్తావ్ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడువందల కోట్లు ఖర్చుపెట్టలేని మీరు మీ విలాసాలకు మూడు హెలికాప్టర్స్ కావాలా?దోచుకోవడమే పనిగా పెట్టుకొని అన్నీ ప్రయివేటు పరం చేస్తున్నాడుఇంజన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతూ మట్టి నుండి ఆకాశం వరకూ దోచుకుంటున్నారు-యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ నంద్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు నిరసనగా ఛలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు30 పోలిస్ యాక్ట్ అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుప్రైవేటీకరణ దారుణమంటూ ఆందోళనకు వచ్చిన వారిని బలవంతంగా పోలీసుల జీపుల్లో , లారీల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలింపుమెడికల్ కళాశాలలే కట్టలేదు అని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయంఅరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ హెచ్చరించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంవైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్,సర్పంచ్ సుజిత్తో పాటు, మహిళలను, విద్యార్థులను,వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులుమడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపార్వతీపురం మన్యం జిల్లా:రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్ల:చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం-మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నమయ్యమదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేతీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీకి పిలుపు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి , మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి, షమీం అష్లాంఏలూరు జిల్లాకూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ..వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజ్ నిరసనకు పిలుపుఏలూరులో వైఎస్సార్సీపీ నేతల నిరసనను అడ్డుకున్న పోలీసులుజిల్లా పార్టీ కార్యాలయం నుండి మెడికల్ కాలేజీకి వెళ్తుండగా నిలిపివేసిన పోలీసులురోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులునిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులుశ్రీ సత్యసాయి జిల్లా:పెనుకొండ మెడికల్ కాలేజీ ని పరిశీలించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జక్కంపూడి రాజా, హిందూపురం సమన్వయకర్త దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీంవైఎస్సార్ జిల్లా:పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగపు నాయకులుఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని,పీపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్పేదలకు వైద్య విద్యా, వైద్యాన్ని దూరం చేసేందుకు పీపీపీ పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుందిడౌన్ డౌన్ సీఎం వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసననల్గొండ జిల్లామిర్యాలగూడ వద్ద గురజాల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులుగుంటూరులో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లా...ఆదోని మెడికల్ కాలేజ్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజ్ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన సంఘం నాయకులుమెడికల్ కాలేజ్ ప్రవేటికరణకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తు విద్యార్థులు,వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్ది సంఘాలుప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్దులుఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ బుట్టారేణుకా , మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,రాష్ట్ర నాయకురాలు ఎస్వీ విజయమనోహరి,విద్యార్ది ,యువజన నాయకులు విశాఖ :జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద aisf ధర్నా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్..విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి..ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం..మంత్రి లోకేష్ విద్యా రంగంలోని సమస్యలను గాలికి వదిలేసారు..యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..లోకేష్కి చేతనైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో నడపాలి..లేనిపక్షంలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యాలి.. అనకాపల్లి నర్సీపట్నంనర్సీపట్నం ఛలో మెడికల్ కాలేజీపై పోలీసుల ఆంక్షలునర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించకుండా భారీ కేడ్లు ఏర్పాటుమెడికల్ కాలేజీకి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న వైనంఛలో మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటున్న పోలీసులు..పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..మచిలీపట్నంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలుఛలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు,శ్రేణులపై ఆంక్షలుమచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్ , మొండితోక జగన్మోహన్ రావు , దేవభక్తుని చక్రవర్తి , వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలను అడ్డుకున్న పోలీసులుతమ వాహనాలను అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలుతూర్పుగోదావరి జిల్లా...ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ భరత్, వైఎస్ఆర్సీపీ శ్రేణులుమార్గాన్ని భరత్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుతూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంమాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ,జక్కంపూడి గణేష్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గూడూరు శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద బైఠాయించిన నేతలు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే మెడికల్ కాలేజీ సీటు కోటి రూపాయల పైన పలుకుతోందిఒక డాక్టర్ బయటకు రావాలంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు అవుతోందిఇంత ఖర్చుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదవగలరా?అందుకే జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారుఅలాంటి కాలేజీలను ప్రైవేటీకరణతో చంద్రబాబు పేదల ఆశలను నీరు గార్చారుమెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబుమెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరంచేసే వరకు ఆందోళనలు చేస్తాం - శివరామిరెడ్డి, ఎమ్మెల్సీపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారు వైఎస్సార్ కుటుంబం పేదల కోసం పాటు పడిందివైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పేరుతో ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారువైఎస్ జగన్ మెడికల్ కాలేజీలతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారుఅలాంటి వాటిని ప్రైవేటీకరణ సరికాదుపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారుపేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటం సబబు కాదుపీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తాం -బొమ్ము ఇజ్రాయిల్, ఎమ్మెల్సీచంద్రబాబు పేదల మీద కక్ష కట్టారుఅందుకే మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్నారుదీన్ని మేము వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం- సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను యధావిధిగా కొనసాగించాలి.మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదుచంద్రబాబు ఆలోచన స్వార్ధ పూరితమైనది.చంద్రబాబు ప్రభుత్వం వారి బినామీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తోంది.తమ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం సరికాదు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకువస్తాం -విక్రాంత్, ఎమ్మెల్సీ విడుదల రజినిని అడ్డుకున్న పోలీసులుచిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజిని ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపుచలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన మాజీ మంత్రి విడదల రజినిఅడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఏపీలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం లో విద్యార్థి ,యువజన విభాగాల కార్యకర్తలుపిడుగురాళ్ల, బాపట్ల మెడికల్ కాలేజీలకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి యువజన విభాగాల కార్యకర్తలుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వెళ్ళకూడదు అంటూ అంబటి రాంబాబుకు నోటీసులుపల్నాడులో మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంబూరు శంకర్రావు ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపుపిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంపౌండ్లోకి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని వెళ్లనివ్వకుండా బారికేడ్లు ఏర్పాటుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాందోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారుఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాంగతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదుప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరంఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాంకళ్ళుండి చూడలేకపోతున్న కూటమి ప్రభుత్వంఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..మేం ఎంత ఖర్చు చేశామో వాళ్ళే చెప్తున్నారుపీపీ అంటే దోపిడీ నా.. పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు..చేతకాకపోతే ఏదీ కాదు..ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి..- శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చరిత్ర హీనుడిగా చంద్రబాబు..చంద్రబాబు నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పుపేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రలుమూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా?జగన్ చరిత్ర సృష్టిస్తే.. బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు:::ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేదవాడిపై బాబు సర్కార్ కక్ష కట్టిందిపేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంపై ఆంక్షలు విధించారుబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చాడా?::: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అల్లూరి జిల్లా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు చలో మెడికల్ కాలేజీ కు వైయస్సార్సీపి పిలుపు.పాడేరు మెడికల్ కాలేజీను కాసేపట్లో సందర్శించనున్న వైయస్సార్సీపీ నేతలు..పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీకి వైఎస్సార్సీపీ నాయకులు.500 కోట్లతో 35 ఎకరాల్లో వైయస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభం.ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీ తరగతులు..చంద్రబాబు నిర్లక్ష్యం వలన 150 ఎంబీబీఎస్ సీట్లు, 50 సీట్లకు కుదింపువైయస్ జగన్ పాలనలో 70 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణంకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులుతూర్పుగోదావరి జిల్లా..వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద పోలీస్ కాపలానేతలను హౌస్ చేసిన పోలీసులు.. నోటీసులు అందజేతమాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపుఅమరావతిమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వాయిదా తీర్మానంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని తీర్మానంమరోవైపు.. వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీ నిర్వహణఅనంతపురం జిల్లా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన జ్వాలలునేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీశ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద కార్యక్రమంపెద్దసంఖ్యలో తరలివస్తున్న విద్యార్థులు, యువకులుచంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలుహాజరుకానున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిప్రకాశం జిల్లా ..మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడం పై నిరసన తెలుపునున్నా వైయస్సార్సీపీ నాయకులుఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన మార్కాపురం పోలీసులుచీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్యతూర్పుగోదావరి జిల్లా.ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీకర్నూలు జిల్లా ..ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు,మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్ని మెడికల్ కాలేజ్ ల వద్ద శాంతియుత నిరసనకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు,శాంతియుత నిరసన తెలపడానికి నంద్యాల మెడికల్ కాలేజ్ కి వెళ్తున్న రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే మీరు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి,సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు,సిద్దార్థ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమంహాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలుగత వైఎస్సార్సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టబోతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది కూడా.తాడేపల్లి.ఈనెల 19న వైయస్సార్సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమంతాడేపల్లి:తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’… pic.twitter.com/kE5cjf0dqE— YSR Congress Party (@YSRCParty) September 18, 2025 -
బాబూ.. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశావా..
-
Big Question: ఎవడి సొమ్ము ఎవడికి దానం? పీపీపీ ముసుగులో లక్ష కోట్లు నొక్కేందుకు ప్లాన్!
-
ప్రజల గొంతు వినిపించకూడదని వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
పేదల సొంతింటి కలకు తూట్లు పొడుస్తారా?
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా..? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా..? మా ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మలకు రిజి్రస్టేషన్ చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు..? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సిందిపోయి మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా?’ అని ప్రశ్నిం చారు.తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. పేదల కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని, వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ధర్నాలు, నిరసనలు, ఆందోళనకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్ జగన్ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు గారూ.. మీకు అధికారం ఇచ్చింది ⇒ పేదలపై కత్తి కట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజి్రస్టేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ⇒ చంద్రబాబు గారూ.. మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కానీ, మా ప్రభుత్వం వారి సొంతింటి కలను నిజం చేసేలా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో భూమి కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చు చేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5 లక్షల కోట్లపైమాటే.ఇంటి పట్టా విలువే ఒక్కొక్క రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షలు–రూ.15 లక్షల వరకు ఉంది. ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్ల కాలంలో కనిపించక పోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు. ⇒ మా ప్రభుత్వ హయాంలో మేము 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలు పెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతికాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. 2023 అక్టోబరు 12న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబు గారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా? ⇒ మా ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40 వేలు లబ్ధి కలగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15 వేలు సహాయం చేశాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8 లక్షలు కాక, మొత్తంగా రూ.2.7 లక్షల లబ్ధి చేకూర్చాం. దీంతోపాటు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబు గారూ? ⇒ కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం, కాలనీలు మురికి కూపాలుగా ఉండకూడదని నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, రోడ్లు తదితర వాటి కోసం దాదాపు రూ.3,555 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపు రూ.35,300 కోట్లు. ఈ 16–17 నెలల కాలంలో మీరెంత ఖర్చు చేశారు అని చంద్రబాబు గారిని సూటిగా ప్రశి్నస్తున్నాం. ⇒ మా ప్రభుత్వ హయాంలో ‘పేదలకు ఇళ్లు’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగం లేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50 వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తెచ్చారు. అంతటితో ఆగకుండా అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి, అక్కడ ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని అన్యాయం చేశారు.ఇది ద్రోహం కాదా? పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవడం కాదా? మిగిలిన పట్టాల్లో మీరు బాధ్యతగా ఇళ్లు మంజూరు చేయించి, కట్టించాల్సింది పోయి.. అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, రిజిస్టర్ అయిన ఆ పట్టాలను మీకు హక్కు లేకపోయినా కూడా వెనక్కి తీసుకోవడం దుర్మార్గం కాదా? మీ స్కాముల కొరకు ఆ స్థలాల్లో ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా చంద్రబాబు గారూ? ⇒ ఈ 16–17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పని తీరు సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క ఎకరం గుర్తించలేదు. ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లు మంజూరు చేయలేదు. పైగా ఇప్పుడు ఇచ్చిన వాటినే లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరో వైపు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదల కోసం అవసరమైతే దీనిపై న్యాయ పోరాటాలు చేస్తాం. వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు పిలుపునిస్తున్నా. -
Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం
-
మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? : వైఎస్ జగన్
-
చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అధోగతే: పేర్నినాని
-
ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట: వరుదు కళ్యాణి
-
చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్టు చేశారు. ‘చంద్రబాబు గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.చంద్రబాబుగారూ మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10లక్షలు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా? మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబుగారూ?చంద్రబాబుగారూ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు?మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా, చంద్రబాబుగారూ..!ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. .@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2025 -
Auto Drivers: ఎందుకు మేమంటే అంత చులకన చంద్రబాబుపై డ్రైవర్లు ఫైర్
-
Merugu Nagarjuna: మీకు చేతకాక కలెక్టర్లపై నిందలా.. పవన్ కళ్యాణ్,లోకేష్ ఎక్కడ?
-
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు అని అన్నారాయన. -
మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది. తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్ చేసింది.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ, ఎమ్మార్పీఎస్, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధం
-
మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్
-
దేవుడున్నాడు.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో
-
DSC అభ్యర్థుల ఎంపికలో భారీ కుట్ర
-
Big Question: మీ పాపాలకు అంతం అతి త్వరలోనే!!
-
‘కూటమి’కి కాసులు..పోతున్న ప్రాణాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీ కూటమి పార్టీల నేతల జేబులు నింపుతూ సంతోషాన్నిస్తుండగా, ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా, అడ్డూ అదుపు లేకుండా, నిబంధనలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ దోపిడీతో జనం అల్లాడిపోతున్నారు. అక్రమ రవాణా అదుపు తప్పుతుండటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నదులు, వాగులు, పొలాలను ఇష్టానుసారం కొల్లగొట్టి అధిక లోడుతో రోడ్లపై ఎలా పడితే అలా ఇసుకను రవాణా చేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం వందలాది ఇసుక లారీలు గ్రామ స్థాయి రహదారుల నుంచి జాతీయ రహదారుల వరకు యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. అనుమతి లేని రీచ్ల్లో తవ్వకాలు జరిపి, పర్మిట్లు కూడా సరిగా లేకుండా ఇసుక రవాణా చేస్తూ, అది కూడా రాంగ్ రూట్లో, ఎటు పడితే అటు ఈ వాహనాలు తిరుగుతున్నాయి. అక్రమ ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వందలాది లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలో లింగాయపాలెం వద్ద నావిగేషన్ ఛానల్ ముసుగులో ఇసుకను అడ్డగోలుగా తవ్వి అక్రమంగా రవాణా చేస్తుండటం విస్తుగొలుపుతోంది. అధికారంలోకి రావడంతోనే అక్రమాలు మొదలు » 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. » అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ అమ్మారు. తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. పొరుగు రాష్ట్రాలకూ తరలిస్తున్నారు. » ఎక్కడా ఇసుక ఉచితం అన్నదే లేదు. డబ్బు కడితేనే ఇసుక ఇస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో సైతం ఉచితంగా తీసుకెళ్లనివ్వడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలు కన్నా ఇప్పుడు అధికంగా అమ్ముతుండడం విశేషం. బెజవాడలో 22 టన్నుల లారీ ఇసుక రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారు.» గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారం చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు సూచనలను లెక్కే చేయడం లేదు. కార్మికులతో తవ్వకాలు చేయాల్సివుండగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. » అన్నిచోట్లా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోంది. కమీషన్లు చినబాబుకు ఠంచనుగా చేరిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక విధానం వల్ల ఏటా రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ ఆదాయం లేదు.. ప్రజలకు ఇసుక ఉచితమూ లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.ఇసుకాసురుల ధన దాహానికి నాడు 16 మంది రైతులు బలి అది 2017.. టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే నదిలోని ఇసుక తోడేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటకు సేద్యపు నీరు కొరత ఏర్పడుతోందని భావించి ఏర్పేడు మండలం మునగలపాళెం నుంచి సుమారు 50 మంది రైతులు, మహిళలు ఏర్పేడు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే ఏర్పేడు పోలీస్ స్టేషన్కు అప్పటి జిల్లా ఎస్పీ జయలక్ష్మి వచ్చారని తెలుసుకుని ఆమెకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్లారు. ఆమె కనీసం రైతులను కలవకుండా అక్కడే వారిని రోడ్డుపైనే నిరీక్షించేలా చేసి, బయటకు వచి్చ, వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఇసుక లారీ రైతుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘోరంలో 16 మంది రైతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ దినపత్రిక రిపోర్టర్ ఆరాసి బాలమురళి కూడా ఉన్నారు. మరి కొంతమంది చేతులు, కాళ్లు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారారు. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మునగలపాళెం చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అయితే ఈ దురాగతానికి కారణమైన ప్రధాన సూత్రధారులు టీడీపీకి చెందిన ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పేరం ధనంజయులునాయుడు, పేరం నాగరాజునాయుడు, చిరంజీవులు నాయుడు. ప్రస్తుతమూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.గోదాట్లో కలిసిపోతోన్న ప్రాణాలు» టీడీపీ ఇసుకాసురుల దెబ్బకు గోదారమ్మ విలవిల్లాడుతోంది. అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ధనార్జనతో గోదావరి నదిని గుల్ల చేస్తున్నారు. పి.గన్నవరం, అయినవిల్లి మండలాల్లో దోపిడీ పరాకాష్టకు చేరింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, కోటిపల్లి సరిహద్దులలో మాన్సాస్ ట్రస్టు భూముల్లోనూ ఇసుకదోపిడీ సాగుతోంది. » టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరుడు పృధ్వీరాజ్, మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అనుచరులు, జనసేన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అనుచరగణం ఇసుక అక్రమాలకు తెగబడుతున్నారు. » ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో గుంతలు పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. ముమ్మిడివరం మండలం శేరిల్లంక–సలాదివారిపాలెం మధ్య వృద్ద గౌతమిలో మే 26న ఒక శుభ కార్యక్రమానికి వచి్చన ఎనిమిది మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. » తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల–2, గాయిత్రి, కడియపులంక, తీపర్రు, పందలపర్రు,‡ పెండ్యాల, కొవ్వూరు ఇసుక ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. రోజుకు 600 లారీల ఇసుక తరలుతోంది.అంతటా అదే దందా» ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు తెలంగాణాకు తరలిస్తున్నారు. లారీకి రూ.60 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ర్యాంపులకు వెళ్లే దారులు అధ్వానంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. » ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రోజుకు వెయ్యికి పైగా ట్రాక్టర్లు, 100కు పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. రేయింబవళ్లు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నా అధికారులు అటు వైపు తొంగి చూడడం లేదు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. » శ్రీకాకుళం జిల్లాలో అక్రమార్కులకు ప్రభుత్వమే లైసెన్సు ఇచ్చినట్టుగా దందా నడుస్తోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ బాగోతం కొనసాగుతోంది. ఆమదాలవలస మండలం కొత్తవలసలో ఇసుక తవ్వకాలు అడ్డుకున్నారని ఏకంగా గ్రామస్తులపైనే దాడి చేసి కొట్టారు. పొందూరు మండలంలో ఇసుక అక్రమాలు అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. » రాయలసీమ జిల్లాలో అధికార కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. చిత్రావతి, పెన్నా, పాపాఘ్ని, తుంగభద్ర తీరాల్లో కూటమి నేతలు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. టీడీపీ తోడేళ్ల దెబ్బకు పెన్నాకు గర్భశోకంయథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణాడీసిల్టేషన్ పాయింట్ల వద్ద మాయాజాలం ఇసుక మాఫియాకు టీడీపీ నేతలు సోమిరెడ్డి, ఆనం, ప్రశాంతి అండదండలుసాక్షి ప్రతినిధి, నెల్లూరు: పెన్నమ్మ శోకిస్తోంది. అయినా జిల్లా అధికార యంత్రాంగానికి వినపడటం లేదు.. కనపడటం లేదు. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు అక్రమంగా సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో భవిష్యత్లో ప్రమాద ఘంటికలు మూగబోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో పెన్నా నదిపై నిర్మించిన నెల్లూరు, సంగం బ్యారేజీల భద్రత గాలిలో దీపంలా మారతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పెన్నా నదిని కుళ్ల»ొడిచి పగటి సమయాల్లో బహిరంగంగానే తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొంది ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేదల ప్రాణాలు తీస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంగం, సూరాయపాళెం, పోతిరెడ్డిపాళెం.. మూడు డీసిల్టేషన్ పాయింట్లతో పాటు పల్లిపాడు, అప్పారావుపాళెంలో రెండు ఓపెన్ రీచ్లకు అనుమతులు ఇచ్చారు. పర్యావరణ అనుమతులు లేనందున నదుల్లో యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ విధానానికి అనుమతులు రాలేదు. డీసిల్టేషన్ పాయింట్లలో దగ్గర నుంచి స్టాక్ పాయింట్ వద్దకు తెచి్చన ఇసుకను మాత్రమే లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. టన్నుకు రూ.250 వరకు ఖర్చవుతోంది. ఓపెన్ రీచ్ల్లో మాత్రం సెమీ మెకనైజ్డ్ పేరుతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. కానీ పెన్నా నదిలోనే భారీ యంత్రాలు పెట్టి నదిని తోడేస్తూ ఇసుక దోపిడీ చేశారు. జిల్లాలో ఎన్జీటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 15 వరకు పెన్నానదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ అడ్డగోలుగా తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు.అడుగడుగునా అక్రమాలు » డీసిల్టేషన్ పాయింట్ల వద్ద మాయాజాలం చేస్తున్నారు. పగటి సమయాల్లో మాత్రం డంపింగ్ యార్డు వద్ద లోడింగ్ చూపుతారు. కొండల్లా ఇసుక దిబ్బలు పేరుకుపోతుంటాయి. కానీ లెక్కల్లో మాత్రం రోజువారీ 100 టన్నులే పోతోందని చూపుతారు. రాత్రి వేళల్లో లోడింగ్ చార్జీలు రూ.7 వేలు వంతున తీసుకుని నది నుంచే లోడింగ్ చేస్తున్నారు. » సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండతో సూరాయపాళెం, విరువూరులో.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో పీకేపాడు, సంగం.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అండతో పోతిరెడ్డిపాళెంలో ఇసుక మాఫియా రెచి్చపోతోంది. » పెన్నా పరీవాహక ప్రాంతంలో దాదాపు 18 ప్రాంతాల్లో పొర్లుకట్టలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేసి ఇసుక రవాణా సాగిస్తున్నారు..» ప్రస్తుతం సోమశిల జలాలు విడుదల చేయడంతో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వచ్చే మాసం నుంచి వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది. సోమశిలకు వరదనీరు ప్రవాహం పెరిగితే నీరు నదిలోకి వదలాల్సి ఉంది. ఈ క్రమంలో పొర్లు కట్టలు తెగిపోవడంతో పలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. » అక్రమ రవాణా ద్వారా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. టీడీపీకి చెందిన ఇసుక మాఫియా నేతలు సొంతంగా పెద్ద సంఖ్యలో టిప్పర్లు కొనుగోలు చేసి పోలీసు, విజిలెన్స్, మైనింగ్ అధికారుల అండదండలతో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. » సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరువూరు ఓపెన్ ఇసుక రీచ్పై ఆంక్షలు ఉన్నప్పటికీ బిల్లులు ఇచ్చి మరీ ఇసుకను తరలిస్తుండటం విస్తుగొలుపుతోంది. -
హైకోర్టు అంటే లెక్కేలేదు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పయినా తమకు లెక్కేలేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాదాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. సోమవారం హడావుడిగా డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈవోలు, హెచ్ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదేస్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా.. పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లినా సింగిల్ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ మైలేజీ కోసం.. డీఎస్సీ ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా.. 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి డీఈవో నియామక పత్రాలు అందించేవారు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32 వేల మందిని ఈనెల 19న అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లోనే బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈవో, ఒక్కో హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా.. హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని విద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకురావొచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి బదులు మరొకరి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అవకాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ విషయం స్థానిక డీఈవోలకు తెలియజేయాలంది. -
కూటమి సర్కారు మద్యం విధానంలో భారీ అవినీతి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడంలో భారీగా అవినీతి జరిగిందని.. ఈ ప్రభావం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంపై తీవ్రంగా పడిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ కారణంగా రాబడి పెరుగుదల కేవలం 3.10 శాతానికే పరిమితం అయిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 6,782.21 కోట్లుగా ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రాబడి రూ.6,992.77 కోట్లు మాత్రమేనని రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ బుధవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మద్యం అమ్మకాల్లో సాగుతున్న దోపిడీని కడిగిపారేస్తూ.. సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్ ట్యాగ్తో జాతీయ మీడియాను జత చేస్తూ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఏమన్నదంటే... ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం, దుకాణాల సంఖ్యను పెంచడం, అక్రమ బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్లను తిరిగి ప్రవేశపెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. సహజంగా ఈ విధానపరమైన మార్పులు మద్యం వినియోగం భారీ పెరుగుదలకు దారితీసి... ఆ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదాయాలు పెరగాలి. ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి ఐదు నెలల్లో ఈ విధానపరమైన మార్పులన్నీ పూర్తిగా అమల్లో ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ మార్పులేవీ లేవు. కాబట్టి.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ఎక్సైజ్ ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కంటే గణనీయంగా ఎక్కువగా ఉండాలి. కానీ, గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లుగా ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరంలో అదే వ్యవధిలో రాబడి రూ.6,992.77 కోట్లు అని కాగ్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్నిబట్టి గత ఏడాదితో పోల్చితే ఎక్సైజ్ ఆదాయం కేవలం 3.10 శాతం మాత్రమే పెరిగింది. విధానపరమైన మార్పులు లేనప్పటికీ... సాధారణ సమయంలో సగటున పది శాతం ఆదాయాలు పెరగాలి. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల ఎక్సైజ్ ఆదాయం తగ్గి, ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇది మద్యం విధానంలో అవినీతిని ప్రస్ఫుటితం చేస్తోంది’’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది. -
బాకీలు.. బడాయిలే!
సాక్షి, అమరావతి: అప్పుల వృద్ధిలో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. 15 నెలలుగా రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన సంపద కూడా రాకుండా పోతోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి అమ్మకం పన్ను తిరోగమనమే గానీ పెరగడం లేదు. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. మరోవైపు సామాజిక రంగం, మూలధన వ్యయం భారీగా తగ్గిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల (2025–26 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) బడ్జెట్ కీలక సూచికలతో గణాంకాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించింది. అప్పులు చేయడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కాగ్ విడుదల చేసిన గణాంకాల మేరకు తొలి ఐదు నెలల్లోనే కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ను మించి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేసింది. సాధారణంగా రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం అంతకు ముందు సంవత్సరాలతో పోల్చితే పెరగాలి. అందుకు భిన్నంగా 2023–24 ఆగస్టు వరకు రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయంతో పోల్చితే 2025–26లో ఆగస్టు నాటికి బాబు పాలనలో రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం తగ్గిపోవడం గమనార్హం. రెవెన్యూ రాబడులు ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో రూ.8,752.11 కోట్లు తగ్గాయి. రాబడుల్లో 12.44 శాతం క్షీణత నెలకొంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. అస్తవ్యస్త పాలనతో రెవెన్యూ రాబడులు క్షీణిస్తున్నాయి. 2023–24 తొలి ఐదు నెలల కంటే బడ్జెట్ వ్యయం ఈ ఆర్థిక ఏడాదిలో రూ.10,663.43 కోట్లు తగ్గిపోయింది. » టీడీపీ కూటమి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి. 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే కేంద్ర గ్రాంట్లు ఏకంగా రూ.16,055.44 కోట్లు తగ్గాయి. అంటే ఏకంగా 83.70 శాతం క్షీణించాయి. 2023–24లో వచి్చనవి కూడా ఇప్పుడు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతోంది. » 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది అమ్మకం పన్ను రాబడి రూ.460 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను రాబడి 5.88 శాతం క్షీణించింది. » 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఇప్పుడు సామాజిక రంగ వ్యయం రూ.10,953.60 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 16.11 శాతం తగ్గింది. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై చేసే వ్యయాన్ని సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు. మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తగ్గుదల..అప్పుల్లో మాత్రం చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ ఆరి్ధక ఏడాది తొలి ఐదు నెలల్లోనే బడ్జెట్లో ఏకంగా రూ.55,932.68 కోట్ల అప్పులు చేసింది. నెలకు సగటున రూ.పది వేల కోట్లకు పైగా అప్పులు తీసుకుంటుండగా మూలధన వ్యయం కేవలం రూ.9,663.70 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. అదే 2023–24 తొలి ఐదు నెలల్లో వైఎస్సార్సీపీ హయాంలో మూలధన వ్యయం రూ.15,883.94 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి సర్కారు మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోంది. అది కూడా అటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా.. ఇటు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంపై అంతులేని రుణభారం మోపుతుండటంపై ఆర్థిక వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఎగబాకిన లోటురెవెన్యూ లోటు ఐదు నెలల్లోనే అదుపు తప్పింది. ఈ ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.33,185.97 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా తొలి ఐదు నెలల్లోనే ఏకంగా రూ.41,635.63 కోట్లకు ఎగబాకింది. ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో ద్రవ్యలోటు పెరిగిపోతోంది. రెవెన్యూ రాబడులు కోల్పోవడం, బడ్జెట్ వ్యయం కూడా తగ్గిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందనేందుకు సంకేతమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పదోన్నతుల్లో సర్కారు వక్రబుద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల్లో చంద్రబాబు కూటమి సర్కారు వక్రబుద్ధిని ప్రదర్శించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతా వారికి పదోన్నతులు కల్పించింది. అదీ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు నెలలు తరువాత. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు చాలా ఆలస్యమవుతున్నాయని గ్రహించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ పరిధిలో వివిధ హోదాల్లో 85 అదనపు పోస్టులు సృష్టించింది. ఈ అదనపు పోస్టుల వల్ల 2023 సంక్రాంతి రోజు ఒకేసారి 192 మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు తీసుకున్నారు. అందులో 50 మంది విభాగాధికారులు (సెక్షన్ ఆఫీసర్లు) సహాయ కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. సహాయ కార్యదర్శి పదోన్నతి పొందినవారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సహాయ కార్యదర్శుల పదోన్నతులపై కొందరు హైకోర్టులో ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో.. ప్రభుత్వం ఆ పదోన్నతుల ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. తర్వాత కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు పదోన్నతులు ఇచ్చుకోవచ్చని ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు పదోన్నతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి నాలుగునెలలు అవుతున్నా పదోన్నతులు ఇస్తే వెంకటరామిరెడ్డికి కూడా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తనను పక్కన పెట్టి మిగతా ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, తనకోసం మిగతా ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని వెంకటరామిరెడ్డి లేఖ ఇచ్చాక.. వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతావారికి పదోన్నతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సహాయ కార్యదర్శుల పదోన్నతులు ఇచ్చే తేదీ నాటికి అంటే 2023 జనవరి 13వ తేదీ నాటికి వెంకటరామిరెడ్డిపై కేసులు లేవు. నిబంధనల మేరకు.. 2024 ఎన్నికల సమయంలో పెట్టిన కేసులు 2023 నుంచే ఇచ్చే ప్రమోషన్లకు అడ్డంకి కాదు. కానీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు కోసమే పదోన్నతి ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఒక ఉద్యోగిపై ఇంతలా కక్షసాధించడం గతంలో ఎప్పుడూ చూడలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కె.వెంకటరామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారని, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నారని, ఆయనకు మినహా మిగతా 49 మందికి ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. క్రమశిక్షణ చర్యలు ముగిసిన తరువాత ఆయన కేసును విడిగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. -
అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు
-
ఏ ముఖం పెట్టుకుని ఈ సంబరాలు బాబూ: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవంతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలనను తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రకటనలతో కూటమి నాయకులు ప్రజల్ని ఇప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా ఇంకా రెట్టింపు ఇస్తామని 143 హామీలతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు తనని తిట్టుకుంటున్నారని తెలిసి కూడా ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్టు చంద్రబాబు 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో అనంతపురంలో హడావుడి చేశాడు.సూపర్ సిక్స్లో సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీఇచ్చాడు. ఈ పథకానికి రూ.10,800 కోట్లు అవసరం అనుకుంటే, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలిచ్చి చేతులు దులిపేసుకున్నాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 1.80 కోట్ల మంది మహిళలను వంచించాడు.ఆ లెక్కన ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి రూ.32,400 కోట్లు చొప్పున అవసరం అవుతాయి. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చెప్పి, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది మాత్రం అరకొరగా అమలు చేశాడు. ఆఖరుకి స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మొదలుపెట్టి కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేసి ఆంక్షలు విధించాడు. దీపం-2 పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గతేడాది ఒక్క సిలిండర్ ఇచ్చాడు.ఈ ఏడాది ఒక్క సిలిండర్ కూడా ఇచ్చింది లేదు. ఆ ఆరు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావాలంటే ఏడాదికి రూ.70 వేల కోట్లు కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి నేటికి 15 నెలలు గడిచిపోయాయి. వారిచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దాదాపు రూ. 90 వేల కోట్లు కావాలి. కానీ రూ. 12 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాల్లోనే ప్రదర్శించేవాళ్లం. ఆ విధంగానే ఆయా గ్రామాల్లో ఏ పథకానికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించే దమ్ము చంద్రబాబుకి ఉందా?50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ ఊసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా 15 నెలల్లో దాదాపు 5 లక్షల పింఛన్లు పీకేశాడు. ఇది కాకుండా మరో 7 నుంచి 10 లక్షల మంది పింఛన్లకు అర్హులై ఉండి దరఖాస్తు చేసుకున్నా వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీజుల కోసం కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు.ప్రభుత్వం దగ్గర రూ. 4500 కోట్లు లేవా?నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజి కూడా తీసుకురాలేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను మాత్రం కుట్ర పూరితంగా ప్రైవేటుపరం చేసి పేదలకు దూరం చేస్తున్నాడు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని వైఎస్ జగన్ కోరుకుంటే చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు తన వారికి ధారాదత్తం చేసేస్తున్నాడు. వైఎస్ జగన్ ప్రణాళిక ప్రకారం 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 2550 మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఏడాది కాలంగా ఆపేసి, సేఫ్ క్లోజ్ పేరుతో వాటిని మూసేశాడు.డాక్టర్లు కావాలనుకునే పేద విద్యార్థుల కలను చిదిమేశాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే 5 మెడికల్ కాలేజీలు నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రిలో పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి. రెండో విడతలో పాడేరులో 50 సీట్లతో క్లాసులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ మీద కోపంతో పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అసలు పనులే జరగలేదంటూ పిల్లర్ల దశలో ఉన్న భవనాల వద్దకు పోయి వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పక్కనపెట్టేశాడు. ఎందుకని అడిగితే వాటిని పూర్తి చేయాలంటే రూ. 4500 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని బీద అరుపులు అరుస్తున్నాడు. చంద్రబాబు చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ. 4500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారంటే ఈయన్ను విజనరీ అని ఎలా అనాలో అర్ధం కావడం లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రభుత్వ ఆస్తులను కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసే విధానాలను చూసి అసహ్యించుకుంటున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనతో చంద్రబాబు పాలననను పోల్చి చూస్తూ అసలైన విజనరీ జగనా, చంద్రబాబో ప్రజలు నిర్ణయానికొచ్చేశారు.రైతులను పట్టించుకోవడం మానేశారుకూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేశాడు. రైతులను చిన్నచూపు చూస్తున్నాడు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం ఇవ్వకుండా మోసం చేసిందే కాకుండా వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసేశాడు. గతంలో ఎప్పుడూ లేనిది రైతులు యూరియా బస్తా కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితులు తీసుకొచ్చాడు. యూరియా ఏదని అడిగిన రైతులకు రాజకీయాలు ఆపాదించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో కిలో ఉల్లి రూ.40ల ధర పలికితే నేడు రూ.3 లకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కిలో టమాట రూపాయిన్నరకి అమ్మాల్సి వస్తుంది. రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అరటి, పొగాకు, మిర్చి, మామిడి, చీనీ, వరి, శెనగ, వేరుశెనగ.. ఇలా రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వైఎస్ జగన్ ధరల పతనంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమీక్షల పేరుతో రెండురోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం తప్పించి రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యవసాయం అధోగతే అని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా చంద్రబాబు రైతు సమస్యలపై దృష్టిపెట్టాలి.వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారుప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక సందర్భం లేకపోయినా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్సార్సీపీని రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లిలా బురద రాజకీయాలు చేస్తారో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. షర్మిల, సునీతలను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ పూర్తి చేసి చార్జిషీట్ వేసిన తర్వాత కూడా పునర్విచారణ కావాలని కోరడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని టీడీపీ భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. వారికి ఆ ధైర్యం ఇచ్చింది చంద్రబాబు కాదా? అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సైతం అవినీతి సంపాదనకి డోర్లు తెరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలెక్షన్ కోసం ఏకంగా ఒక ఫ్లోర్నే కేటాయించారు. చంద్రబాబు ఇచ్చిన 143 హామీలన్నింటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్యారంటీ సంతకాలు చేశాడు. కానీ వాటి అమలు గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. స్పెషల్ హెలికాఫ్టర్లలో తిరిగే ఆయనకి ప్రజా సమస్యలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదు.చంద్రబాబుకి రాజ్యాంగం మీద గౌరవం లేదు..చంద్రబాబుకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు కాబట్టే 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. సమస్యల మీద చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు భయపడిపోతున్నారు. 11 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూసి 164 మంది భయపడిపోతున్నారు. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అనేక ప్రెస్మీట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. కానీ ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పే దమ్ము అధికార పార్టీకి లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడనిస్తారంటే ఎవరైనా నమ్మగలరా? -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విశ్వేశ్వర్ రెడ్డి కౌంటర్..
-
ప్రతి పేదవాడికి కావాల్సిందే విద్య, వైద్యం.. వాటినే చంద్రబాబు గంగలో కలిపేశారు
-
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు‘‘అసలు మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు, జగన్లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్ డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు. -
విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
వెంకయ్యా.. వెన్నుపోటు బాబును వెనుకేసుకు రావొద్దు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది. ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు లేదు. తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె. -
Jogi Ramesh: TDP నేతల అక్రమ బూడిద - తరలింపునకు వ్యతిరేకంగా ధర్నా
-
నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
DSC పోస్టుల భర్తీలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ
-
కర్నూలు జిల్లాలో రైతులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర
-
Pattikonda:పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పడుతున్న రైతులు
-
సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మెరిట్ను ఎలా విస్మరిస్తారు?
-
గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ఇచ్చినా మిమ్మల్ని తొలగించం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. వేతనాలు పెంచుతాం.. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తాం..’ ఇవీ కూటమి ప్రభుత్వం గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లకు ఇచ్చిన హామీలు. వీటిని సైతం కూటమి సర్కార్ చెత్త బుట్టలో పడేసి.. గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల బతుకులకు భరోసా లేకుండా చేసింది. అడవి బిడ్డలకు అక్షర వెలుగులు పంచుతున్న వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వారిని బయటకు పంపేస్తోంది. కూటమి ప్రభుత్వ దగాతో 1,143 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారబోతోంది. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది ఔట్సోర్సింగ్ విధానంలో 10 నుంచి 18 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా మార్చి.. ఉద్యోగ భద్రతకల్పించాలని కోరగా.. వాటిని నెరవేరుస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. దీంతో గతేడాది నవంబర్లో 45 రోజులపాటు ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో 1,143 గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్ల పోస్టులు చూపించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తాము అన్యాయమైపోతామంటూ ధర్నాలు చేశారు.ఈ నేపథ్యంలో వారితో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్ పద్ధతిలోకి మారుస్తామని నమ్మబలికి సమ్మె విరమింపజేశారు. అవే విషయాలను అసెంబ్లీలో సైతం మంత్రి సంధ్యారాణి స్పష్టంగా ప్రకటించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. వారిని తొలగించవద్దని ఆదేశాలివ్వగా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2026 వరకు వారిని కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది. మీరంతా బయటకు వెళ్లిపోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.మరీ ఇంత దారుణమా?డీఎస్సీలో పోస్టులు పేర్కొన్నప్పటికీ.. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తాన్న హామీ ఏమైందని గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు, లెక్చరర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు. మీ ఉద్యోగాలు తొలగించబోమని పదే పదే చెప్పిన ప్రభుత్వం.. 1,143 మందిని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో పోస్టులు భర్తీ అవుతున్నాయని.. ఇక మీరు బయటకు వెళ్లిపోవాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారని వాపోయారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శనఫీజు బకాయి చెల్లించకపోతే టీసీఇవ్వలేమన్న ఎస్వీ ఆర్ట్ కాలేజ్ అధికారులుతిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, హాస్టల్ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువీకరణపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్íÙప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
ఆది నుంచి దగా
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్ను పట్టించుకోకుండా అన్యాయం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధాన్యం మెలిక పెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్ 12న తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా, ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. రెండు రోజుల క్రితం ఫలితాలు ప్రకటించే దాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి.తప్పుడు లెక్కలు.. భర్తీ ప్రక్రియలో సాగదీతలు⇒ ‘మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యా శాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్లో 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు.⇒ గతేడాది డిసెంబర్ నాటికే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో ఆందోళన⇒ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. ఇలా కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.⇒ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది.ప్రశ్నల్లో తప్పులున్నాసరిచేయకుండానే ఎంపిక⇒ డీఎస్సీ ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యా శాఖ సరిచేయలేదు. అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించినా రెస్పాన్స్ షీట్లలో జవాబులు గుర్తించినట్టు లేకపోవడంతో ఖంగుతిన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 60 నుంచి 20 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా నమోదైంది.⇒ అభ్యర్థులు గుర్తించిన జవాబుకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్)తో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రకటించిన ఫైనల్ ‘కీ’లో అనేక లోపాలను అభ్యర్థులు గుర్తించారు. వాటికి ఆధారాలను సైతం విద్యా శాఖకు పంపించారు. కానీ ఆయా అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియలేదు.⇒ ఆపై మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సరి్టఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం.కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’⇒ ఒకే కేటగిరీకి చెందిన వారిలో వెనక ఉన్న వారికి తొలుత లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం.⇒ ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అంటున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు⇒ డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సరి్టఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు.⇒ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు.⇒ దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కల్పోయారు. ఇలా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అడుగడుగునా కుట్ర పూరితంగానే వ్యవహరించింది.⇒ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీపై 104 వరకు కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నప్పటికీ, అర్హత సాధించాక నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సోమవారం హడావుడిగా తుది ఫలితాలను ప్రకటించేసింది. ఆపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లగా చుక్కెదురైంది. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రతి దశలోనూ కుట్ర పూరితంగానే వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
మూడు శాఖలు..ముప్పు తిప్పలు!
సాక్షి, అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టినా ఇప్పటికీ కొన్ని శాఖలు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నాయని ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలకు రేటింగ్ ఇస్తున్నామని, ఇప్పటికీ ఈ మూడు శాఖలు పనులు కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు కావాలనే ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారని, అమెరికా నుంచి 750కిపైగా తప్పుడు పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రెండో రోజు మంగళవారం క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. సీనియర్ అధికారులు కూడా పని విధానం మార్చుకోవాలని, ఇకపై టెస్టుల్లో పాసైన వారినే కీలక పదవుల్లో కూర్చోబెడతానని సీఎం అన్నారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న యువ ఐఏఎస్ అధికారులను కీలక పదవుల్లో కూర్చోబెట్టినట్లు చెప్పారు. టీచర్ల దగ్గర నుంచి ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఐటీపై అవగాహన పెంచుకోవాల్సిందేనన్నారు. కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి క్షేత్ర స్థాయి సమాచారం కోసం కలెక్టర్లను నివేదికలు అడగకూడదని, కావాల్సిన వివరాలన్నీ ఆర్టీజీఎస్ నుంచే తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైల్స్ ఆడిటింగ్ చేస్తాం రెండు నెలల్లో ఫైళ్లన్నీ 100 శాతం ఆన్లైన్ చేయాల్సిందేనని, మానిప్యులేషన్కు తావు లేకుండా ఫైళ్లపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే క్షణాల్లో పట్టుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేలా బ్రాడ్ కాస్ట్ సిస్టమ్ను అన్ని కీలకప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే రివర్ఫ్రంట్ క్వాంటమ్ వ్యాలీ భవనాల డిజైన్లపై అభిప్రాయాలు చెప్పాలని కలెక్టర్లను కోరారు. 2027లోపు రీ సర్వే పూర్తవ్వాలి.. 2027 లోపు భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం ఆర్ఓఆర్కు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. గత ప్రభుత్వం భూములను కాజేయడానికి 22ఏ జాబితాలో పెట్టిందని విమర్శించారు. కుల ధ్రువీకరణ పత్రాలను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందో 22 నుంచి అక్టోబరు 22 వరకూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ ఆదాయం కొన్ని జిల్లాల్లో గణనీయంగా పడిపోవటానికి కారణాలను విశ్లేషించాలన్నారు. నేటి నుంచి 2 వరకూ స్వచ్ఛతాహీ సేవ జనవరి నుంచి వేస్ట్ (చెత్త) ఎక్కడా కనిపించకూడదని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు రాష్ట్రమంతా వర్తింప చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదని, ప్రజల ఆలోచనా విధానం కూడా మారేలా చూడాలన్నారు. స్వచ్ఛతాహీ సేవ సెపె్టంబరు 17 నుంచి అక్టోబరు 2 తేదీ వరకూ చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో ఘన వ్యర్ధాల షెడ్లు నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలన్నారు. 2029కి పచ్చదనం 39 శాతానికి పెరగాలన్నారు. యూరియాపై దుష్ప్రచారం.. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తేవాలని యత్నించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో విశ్లేషించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాలు 16 శాతం పెరిగాయని చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సైబర్ నేరాలతో ప్రజలు నెలకు రూ.30 కోట్లు నష్టపోతున్నారన్నారు. పోలీసులు మరింత అడ్వాన్స్గా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతి భద్రతలపై రహస్య సమీక్ష కలెక్టర్ల సదస్సుకు డుమ్మా కొట్టిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత నియోజకవర్గం ఆత్మకూరులో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన లేకుండానే దేవదాయ శాఖపై సమీక్షను చంద్రబాబు నిర్వహించడం గమనార్హం. ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ లండన్ పర్యటనలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిరోజు సదస్సుకు గైర్హాజరైన విషయం తెలిసిందే. కలెక్టర్ల సదస్సును లైవ్ టెలికాస్ట్ చేసిన ప్రభుత్వం శాంతి భద్రతలపై సమీక్షను మాత్రం రహస్యంగా నిర్వహించింది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోషల్ మీడియాలో తటస్థులు పెడుతున్న పోస్టులపై కేసులు పెట్టాలని ఈ రహస్య సమావేశంలో ఎస్పీలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎలాంటి వారిపైనైనా కేసులు మోపి జైల్లో పెట్టాలని, ఇతర మీడియాను పూర్తిగా అణగదొక్కాలని పరోక్షంగా సంకేతాలు ఇచి్చనట్లు సమాచారం. -
ధరల పతనంలో బాబు ‘రికార్డు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? » క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. -
సీఎం సార్.. ఇదిగో ప్రూఫ్ జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు
-
లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు