Chandrababu Naidu
-
Chandrasekhar Reddy: లోకేష్ చాలెంజ్కి దిమ్మతిరిగే కౌంటర్
-
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్ నిరంకుశ వైఖరి’
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. -
కూటమి నేతల తీరు పట్ల ప్రజల ఆగ్రహం
-
బాబూ.. పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా?: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలాగే, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. కచ్చితంగా వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా పొందాలంటే 10 శాతం సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.చంద్రబాబు.. సంపద సృష్టిస్తా అన్నవ్ కదా ఏమైంది?. సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కూటమి చెప్పాలి. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటమా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. వైఎస్సార్ కృషి వల్లే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన దుర్మార్గుడు చంద్రబాబు. 45 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించిన ఘనత వైఎస్సార్దే. హంద్రీనీవా కాలువల వెడల్పు చేసిన తర్వాతే.. లైనింగ్ పనులు చేపట్టాలి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టి.. నిధులన్నీ అమరావతికే మళ్ళించటం ద్రోహం చేయడమే అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక 4 లక్షల ఉద్యోగాలిచ్చారట...
-
High Court: విచారణ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
వెండర్ విధానంపై మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన AP పంచాయితీ రాజ్
-
ఇదీ విజన్ అంటే!
విజన్ అంటే కళ్లార్పకుండా పదే పదే మాయ మాటలు చెప్పడం కాదని, అబద్ధాలతో ప్రజలను గందరగోళానికి గురిచేసి.. పబ్బం గడుపుకోవడం అంతకంటే కాదని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘విద్యుత్ ఒప్పందం’ సాక్షిగా నిరూపించారు. రాష్ట్రానికి అత్యంత చౌక ధరకే సౌర విద్యుత్ లభించేలా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ దిశగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా మార్గ నిర్దేశం చేయడమే కాకుండా వాటికి ఊతమిచ్చారు. ప్రధానంగా రైతన్నలకు 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ముందు చూపును గమనించి యూనిట్ కేవలం రూ.2.49 చొప్పున విద్యుత్ ఇస్తామని సెకీ ముందుకొచ్చి.. ఒప్పందం చేసుకుంది. దీనిపై కొందరు కారుకూతలు కూసినా, ఎల్లో గ్యాంగ్ మసిపూసి బురద చల్లినా ఎట్టకేలకు ‘ఆ ఒప్పందం’ సక్రమమే అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కుండబద్దలుకొట్టి స్పష్టం చేసింది. తద్వారా వైఎస్ జగన్ ముందు చూపు కొంత ఆలస్యంగానైనా ప్రశంసలందుకుంటోంది.సాక్షి, అమరావతి : గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు గత ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. భారీ పవర్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ను నిలపడంలో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతం అయిందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల పాలనలో కనీ వినీ ఎరుగని రీతిలో పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించడంతో పాటు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందించాలనే లక్ష్యంతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకూ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో ఏకంగా రూ.8,19,815 కోట్లతో 25 ఇంధన రంగ ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్(సెకీ)తో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం మేరకే ఇప్పుడు రాష్ట్రానికి తక్కువ ధరకే 4 వేల మెగావాట్ల విద్యుత్ వస్తోంది.గత ప్రభుత్వంలో భారీ ప్రాజెక్టులు, ఒప్పందాలు» గ్రీన్కో గ్రూప్ 5,230 మెగావాట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్(ఐఆర్ఈపీ)కు మన రాష్ట్రాన్ని ఎంచుకుంది. ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శరవేగంగా పనులు సాగుతున్నాయి. త్వరలోనే ప్రారం¿ోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 23 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వాతావరణంలో ఏటా 15 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.» రాయలసీమలోని నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు జగన్ భూమి పూజ చేశారు. మరో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) మధ్య ఒప్పందం జగన్ సమక్షంలో జరిగింది. » గ్రీన్కో దాదాపు 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ రూ.4,500 కోట్ల పెట్టుబడితో మరో 1014 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. » ఎకోరన్ ఎనర్టీ ప్రాజెక్టుకు సంబంధించి 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. » యాగంటిలో 1000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు మొత్తం దాదాపు 2 వేల మెగా>వాట్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్పీసీతో కలిసి నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు ఫీజుబులిటీ అధ్యయనం పూర్తయింది. ఈ ప్రాజెక్టు వల్ల 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్హెచ్పీసీతో మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులో కూడా కలిసి నడిచేందుకు గత ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.దేశంలోనే అత్యధిక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులుదేశంలోనే అత్యధికంగా 42,270 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ (పీఎస్పీ) ప్రాజెక్టులకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకొని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఫీజుబులిటీ అధ్యయనం జరిగింది. 20,900 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లు కూడా పూర్తి చేసింది. ఇందులో 16,180 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, థర్మల్ విద్యుత్ సామర్థ్యం కూడా వైఎస్ జగన్ హయాంలో 1600 మెగావాట్లు అదనంగా పెరిగింది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, డాక్డర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల ఉత్పత్తి మొదలైంది.బాబు పాలనంటేనే దోపిడీ ఓట్లేసి గెలిపిస్తే విద్యుత్ చార్జీలు పెంచమంటూ ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే రూ.15,485 కోట్ల చార్జీల భారాన్ని ప్రజలపై వేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అది చాలదన్నట్లు వచ్చే ఏప్రిల్ 1 నుంచి చిరు వ్యాపారులపై ‘టైమ్ ఆఫ్ డే’ పేరుతో అదనపు చార్జీల బాదుడుకు సిద్ధమైంది. నిజానికి చంద్రబాబు పాలనలో ఎప్పుడూ అటు ప్రజలను, ఇటు విద్యుత్ సంస్థలను దోపిడీ చేయడం పరిపాటిగా మారింది.చంద్రబాబు గత హయాంలో సౌర విద్యుత్ యూనిట్కు ఏకంగా రూ.6.99, పవన విద్యుత్ యూనిట్కు రూ.4.84 చెల్లించి కొనుగోలు చేశారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి సోలార్ విద్యుత్ యూనిట్ సరఫరా ధర రూ.5.90, పవన విద్యుత్ యూనిట్ రూ.4.63కు చేరింది. నిజానికి అప్పట్లో సోలార్ యూనిట్ రూ.2.44కు, పవన విద్యుత్ యూనిట్ రూ.2.43తో ఇతర రాష్ట్రాల్లో ఒప్పందాలు జరిగాయి. చంద్రబాబు చేసిన పని వల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్లు చొప్పున దశాబ్దాల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత విలువ ఆధారంగా ఈ మొత్తం భారం రూ.35 వేల కోట్లకు పైనే. ఈ విషయాన్ని దాచి అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి లోటు ఉందని టీడీపీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసింది.‘సెకీ’ విద్యుత్పై ‘ఎల్లో’ కుట్రలు రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సెకీ నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవక ధరతో.. యూనిట్ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ప్రధానంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టిఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు అండ్ గ్యాంగ్, ఎల్లో మీడియా కుట్రలకు పాల్పడ్డాయి. సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని, వైఎస్ జగన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్ను దూరం చేయాలని ప్రయతి్నంచాయి. కానీ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది.బాబు ఒప్పందాలతో 24 శాతం అప్పుల వృద్ధి రేటు చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), నిర్లక్ష్యం కారణంగా 2014–19 మధ్య విద్యుత్ సంస్థలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. డిస్కంలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. విద్యుత్ సంస్థల అప్పులు, బకాయిల భారం 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే (2019 మార్చి 31)నాటికి రూ.86,215 కోట్లకు పెరిగింది. అంటే ఏకంగా రూ.56,663 కోట్లకు ఎగబాకింది. దీంతో 2014–19 మధ్య వార్షిక అప్పుల వృద్ధి రేటు(సీఏజీఆర్) 24 శాతం పెరిగింది. జగన్ హయాంలో పెరిగిన అప్పుల వృద్ధి రేటు 7.28 శాతం మాత్రమే. 2020–22 మధ్య కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల అప్పులు భారీగా పెరిగినప్పటికీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమర్థ నిర్వహణ వల్ల ఇంత తక్కువ శాతం నమోదయ్యింది. డిస్కంల వార్షిక ఖర్చులకు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించలేదు. దీంతో ఐదేళ్ల టీడీపీ హయాంలో డిస్కంల నష్టాలు రూ.6,625.88 కోట్ల నుంచి రూ.28,715 కోట్లకు పెరిగాయి. -
బాబు సంపద సృష్టి.. మంగళవారం మరోసారి అప్పు.. ఈసారి ఎంతంటే?
సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి సున్నా. అప్పులు మాత్రం తెగ పెరిగిపోతున్నాయి. వారం వారం, నెల నెలా తెస్తున్న అప్పులతో ఏడాది తిరగకుండానే బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఏకంగా రూ.1,35,640 కోట్లు అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలు అమలు చేయడంలేదు. సూపర్6 లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి ఊసే ఎత్తడంలేదు. మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా 7.20 శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది.దీంతో బడ్జెట్ పరిధిలోనే మార్కెట్ రుణాల ద్వారా తెచ్చిన అప్పులు రూ.89,940 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం రూ.70 వేల కోట్ల అప్పు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. కానీ, ఆర్థికఏడాది ముగియడానికి నెల రోజులుండగానే బడ్జెట్లో చెప్పిన దానికన్నా అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ బయట కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. రాజధాని పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు మొత్తం రూ. 31 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకు ఉత్తర్వులనూ జారీ చేసింది. రాజధాని పేరుతో, కార్పొరేషన్లకు గ్యారెంటీల ద్వారా రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది. ఇవే కాకుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఏ ప్రభుత్వమూ ఇంత అప్పు చేయలేదు ఒక్క ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు బాబు బృందం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి భారీగా అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా నోరు మెదపడంలేదు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం జనవరికి రూ.10,853 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు తెలిపాయి. ఆస్తుల కల్పనకు ఖర్చు చేయకుండా, సూపర్ 6 హామీలూ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడంలేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. -
సంక్షేమం, అభివృద్ధి ఆ తరువాతే..!: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయటపడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి. అందుకే కేంద్ర సహకారంతోపాటు అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. -
మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
సాక్షి, అమరావతి : మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నా.. చేయలేమని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.వేరే రాష్ట్రాలనుంచి మిర్చి వస్తుంది కాబట్టి..మిర్చి విషయంలో మార్కెట్లో జోక్యం చేసుకోలేమని తేల్చేశారు. అదే సమయంలో ఇ-క్రాప్ ఆధారంగా రైతులవారీగా సబ్సిడీ ఆలోచన చేస్తామన్నారు. అదికూడా ఆలోచనలోనే ఉందన్నారు. అయితే, మరి అదే ఇ-క్రాప్ ఆధారంగా మార్కెట్లో జోక్యం ఎందుకు చేసుకోలేకపోతున్నారని, రైతుకు మంచి ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
సాక్షి,కాకినాడ: ‘ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అన్నా.. వైఎస్ జగన్ అన్నా భయమే.’ వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సభా మర్యాదలు చూస్తే చిత్రంగా ఉంది. సభా మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టుంది చంద్రబాబే. ఎన్టీఆర్ను పదవి లోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు.మాజీ గవర్నర్ నరసింహన్ చంద్రబాబును చూసి బిత్తరపోయారు. హరిచందన్ గవర్నర్గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏవిధంగా కించపరిచారో అందరికి తెలుసు. వీళ్లా సభలో వైఎస్సార్సీపీ గవర్నర్కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు. నిరనసగా వాకౌట్ చేసి వెళ్లి పోవడం చాలా కాలం నుంచి నడుస్తోంది. చాల పార్టీలు చేస్తున్నాయి. ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలుసుకోండి. గ్రూప్-2 అభ్యర్ధులైతే..తాము తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆబద్దాలు చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు అని తేలింది. ఒక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లి దానిని నిజమని నమ్మిస్తారు. ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లు కూటమీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడానికి సిగ్గులేదా?. గవర్నర్తో అబద్దాలు చెప్పించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నారు.వీసీలను రాత్రికి రాత్రి బెదిరించి రాజీనామాలను చేయించారు. దీనిపై విచారణ జరిపించండి. తొమ్మిది నెలల కాలంలో మీ అసలు రంగు బయట పడింది. ప్రతిపక్ష హోదా మీద పార్లమెంటు చట్టం ఏం చెప్పిందో తెలుసుకోండి.వైఎస్సార్సీపీ అంటే మీకు భయం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మీ పాలనను ఎండగడతారని భయం. 151 సీట్లు వచ్చినా..11 సీట్లు వచ్చినా టీడీపీ వైఎస్ జగన్ చూసి భయపడుతోంది. ఆ ఒకే ఒక్కడు 49% ఓటు బ్యాంక్ పొందారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే అని అన్నారు. -
ప్రతీ YSRCP కార్యకర్త, నేతలు జగన్కు సెల్యూట్ చేయాల్సిన రోజు ఇది
-
లోకేష్ వ్యాఖ్యలకు బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి
-
సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ సీపీ నేతలకు ఊరట
-
వైఎస్ జగన్కు ప్రభుత్వం భయపడుతోంది: హర్షకుమార్
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: గ్రూప్-2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ఈ విషయమై హర్షకుమార్ మంగళవారం(ఫిబ్రవరి 25) మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో రిలీజ్ చేసి గ్రూప్-2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారు.పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కంటే సీఎం చంద్రబాబు గొప్ప నటులు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రూప్- 2 అభ్యర్థులు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల గురించి ఎందుకు ప్రస్తావించలేదు. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయం. ఢిల్లీలో గతంలో మూడు సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రభుత్వం వైఎస్ జగన్ను చూసి భయపడుతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు’అని హర్షకుమార్ అన్నారు. -
చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి YSRCPకి అన్ని అర్హతలు ఉన్నాయి
-
ఏమ్మా షర్మిలా... షర్మిలపై సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు సర్కార్పై మిర్చి రైతుల ఆగ్రహం
సాక్షి, గుంటూరు: గిట్టుబాటు ధర లేక రైతులు పీకల లోతు కష్టాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించే ఇంటవెర్షన్ ధర వల్ల రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తేజ, డీలక్స్ లాంటి రకాలు 12000 నుంచి 12,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 11 871 కొనుగోలు చేస్తే తమకు ఎలా లాభమో ప్రభుత్వమే చెప్పాలంటూ రైతులు నిలదీశారు.‘‘చంద్రబాబు ఏసీ గదిలో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏంటి లాభం?. మిర్చి యార్డ్కి వచ్చి మా పరిస్థితి, బాధలు చంద్రబాబు వింటే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి 19000 నుంచి 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మిర్చి వెంట గిట్టుబాటు ధర రూ.20,000గా ప్రకటించాలి’’ అని మిర్చి రైతులు డిమాండ్ చేశారు.ప్రభుత్వం 20 వేలు రేటు ప్రకటించకపోతే ఎంత మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటారో తెలియదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఎందుకు మిర్చి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ప్రభుత్వం చేతకానితనం వల్లే మిర్చి పండించిన ప్రతి రైతు ఇవాళ అప్పుల్లో కూరుకుపోయాడు’’ అని రైతులు మండిపడ్డారు. -
ఏపీ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించిన చంద్రబాబు
-
సాక్షి టీవీ సహా 4 ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
-
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్కుమార్రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్రెడ్డి దుయ్యబట్టారు. -
Magazine Story: తాలిబన్లే సిగ్గుపడేలా
-
ఫైబర్ నెట్లో తారస్థాయికి చేరిన రచ్చ
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025.. Day 2 Live Updatesమంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స ఆగ్రహం👉వీసీలను ఒకేసారి రాజీనామా చేయించారు👉బలవంతంగా చేయించకపోతే దాని మీద లోకేష్ విచారణ కు సిద్ధమా👉విచారణ జరిపిస్తే.. మేము నిరూపిస్తాం👉విచారణ వేయడానికి ఎందుకు భయ పడుతున్నారుశాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ👉గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు👉ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి నారా లోకేష్👉నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదన్న మంత్రి నారా లోకేష్👉గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారన్న వరుదు కళ్యాణి👉తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం👉మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్షనేత బొత్స అభ్యంతరం👉మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం👉ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం👉ఎన్ డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారు👉కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం👉కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి👉వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మళ్లీ అభ్యంతరం తెలిపిన మంత్రి నారా లోకేష్👉మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం👉మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదన్న మంత్రి లోకేష్👉మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?👉మా మీద ఆధారపడలేదని చెప్తారా..?👉రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు...అదే మా సభ్యురాలు చెప్తున్నది👉2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?👉గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి👉చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు👉కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు👉తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి👉సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?👉ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?👉అమ్మ ఒడి, రైతు భరోశా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?👉15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు👉60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు👉4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి👉గతం వై ఎస్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు👉తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సీని కూడా పూర్తి చేయలేదు👉జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు👉టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదుఏపీ శాసన మండలి:వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రులు👉4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు👉రైతులకు ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించకపోగా ఏదో చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.👉సూపర్ సిక్స్ వాగ్దానాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు.👉రైతులను మోసం చేశారు👉యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు👉మొదటి ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు👉గవర్నర్ ప్రస్తావనలో నిరుద్యోగ భృతి అంశం లేదు👉హామీలు అమలు చేసే ఆలోచనలో లేరు👉సాఫ్ట్వేర్ పితామహులం అని చెప్పే వీరు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని విమర్శిస్తున్నారు..👉ఏఐ ఉద్యోగాలు రావాలంటే తెలుగు మీడియంలో చదివితే వస్తాయా?👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తెలుగును అవమానిస్తున్నారంటూ అడ్డుపడిన హోం మంత్రి అనిత👉ఎమ్మెల్సీ మాధవరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్👉తిరిగి మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు👉తాను తెలుగు మీడియంలో చదువుకున్నాను👉ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగాలు చెబుతున్నానన్న మాధవరావు👉ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బాల వీరాంజనేయస్వామి డిమాండ్👉తాము తెలుగును కించ పరచలేదు.. గత ప్రభుత్వంలో ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత కల్పించాం..👉ఈ ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించామన్న ఎమ్మెల్సీ మాధవరావు👉పెన్షన్ నాలుగు వేలకు పెంచారు.. ఇచ్చే సంఖ్యలో కోత విధించారు👉ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు.. ఈ ఏడాది ఒక్క సిలెండర్ తో సరిపెట్టారు👉స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను గత ప్రభుత్వం కాపాడింది👉మెట్ట ప్రాంత రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు తెచ్చాం👉అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు ఎన్ఓసీ కూడా లేకుండా ప్రారంభం చేశారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ‘సాక్షి టీవీ’పై ఆంక్షలు👉‘సాక్షి టీవీ’ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట చరిత్రలో 4 ఛానళ్లపై నిషేధం విధించడం ఇదే ప్రథమం👉ప్రభుత్వ వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలుప్రారంభమైన శాసన మండలి సమావేశాలు👉వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్👉గవర్నర్ ప్రసంగంపై ప్రారంభమైన చర్చ👉ప్యానెల్ వైస్ చైర్మన్ లుగా పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, నిజాం భాషా, రమేష్ యాదవ్.మరికాసేపట్లోప్రారంభం కానున్న అసెంబ్లీ👉కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం👉సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం👉ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉన్నYSRCP ఎమ్మెల్యేలు👉 ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని MLA, MLCలకు వైఎస్ జగన్ దిశానిర్దేశంఅసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు👉నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు👉ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం కి ధన్యవాదాలు తీర్మానం పై చర్చ👉సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం👉ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పించారు. ఇప్పటికే కరెంటు ఛార్జీల పేరుతో చంద్రబాబు.. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారు. కానీ అసలు కరెంటు చార్జీలే పెంచలేదంటూ గవర్నరుతో అబద్దాలు పలికించారు. ఇటీవలే లిక్కర్ బాటిల్ పై రూ.10-20ల పెంచిన కూటమి ప్రభుత్వం.. అసలు లిక్కర్ రేట్లను పెంచలేదంటూ అసెంబ్లీలో గవర్నరుతో చంద్రబాబు అబద్దాలు వల్లెవేయించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలు ఎప్పటినుంచో గవర్నర్తో చెప్పించని ప్రభుత్వం.. 2047 నాటికి పేదలందరినీ కోటీశ్వరులని చేయిస్తానంటూ చెప్పించింది. అసెంబ్లీ సాక్షిగా గవర్నరుతో అబద్దాలు చెప్పించటంపై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. -
నషాళానికి పొలిటికల్ మిర్చి ‘ఘాటు’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు: మిర్చి రైతులను కూటమి సర్కార్ అనే తెగులు పట్టిపీడిస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు యమునా తీరు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మిర్చి క్వింటాల్కు మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా.. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ (ఎంఎస్ఐ) కింద రూ.11,781 మద్దతు ధర నిర్ణయించిందంటూ కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. వీరిద్దరి మాటల్లో ఎవరి మాట నమ్మాలి.. అసలు కేంద్రం ఎంతకు ఒప్పుకుందనే విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. తద్వారా మిర్చి రైతులను కూటమి సర్కార్ అయోమయంలోకి నెడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సీఎం ఒకలా.. మంత్రి మరోలాఈ నెల 21న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.10,025 కంటే ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ (ఐసీఏఆర్) కేంద్రమంత్రికి తేల్చి చెప్పింది. ఈ నెల 22న సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ‘ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాల్కు రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలుకు చేసేలా చర్యలు తీసుకుంటాం’ అంటూ డొంకతిరుగుడు సమాధానమిచ్చా రు.గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఎస్ఐ) ద్వారా క్వింటాల్కు రూ.11,781 మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది. 25 శాతం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది. అవసరమైతే కొనుగోలు మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. రైతులకు ఇది కేవలం ఊరట కాదు–బలమైన అండ’ అంటూ ఆయన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. సీఎం మాటలు ఒకలా ఉంటే.. కేంద్ర మంత్రి చేస్తున్న ట్వీట్లు మరోలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం నుంచి మాత్రం ఏవిధమైన స్పష్టత రాకపోవడంతో ఎవరి మాటను నమ్మాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.ఐసీఏఆర్ నుంచి స్పష్టత లేదుమద్దతు ధర రూ.11,781గా నిర్దేశించినట్టు గానీ.. 25 శాతం పంటను కొనుగోలు చేస్తామని, అవసరాన్ని బట్టి మరింత పెంచుతామనే విషయాలపై ఏవిధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంపై ఐసీఏఆర్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ హిమాన్షు పటాక్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ‘ఇటీవలే కేంద్ర మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. రైతులకు మేలైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా సమావేశం నిర్వహించారు.ఆయన సమావేశం తర్వాత కూడా దీనిపై ఎలాంటి పురోగతి లేదు’ అని ఆయన బదులిచ్చారు. రూ.11,781 మద్దతు ధర ప్రకటించారా అని ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేశారు. అధికారి మాటలను బట్టి చూసినా పెంపునకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కేంద్రం నుంచి రాలేదనేది స్పష్టమవుతోంది. రూ.10,025 కంటే ఒక్క రూపాయి పెంచాలన్నా.. కేబినెట్ ఆమోదం కావాల్సిందే. కేబినెట్ ఆమోదించకుండా రైతులను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇవ్వడంపై కూటమి నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హడావుడి తప్ప.. అడుగులేవీ?మిర్చి రైతులను ఆదుకుంటామని హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్ మిర్చికి గరిష్టంగా రూ. 28 వేలు రాగా.. ఈ ఏడాది రూ.13,500 దాటలేదు. అందులోనూ పది శాతం మిర్చికి మాత్రమే గరిష్ట ధర వస్తుండగా, మిగిలిన సరుకు రూ.ఐదారు వేలు దాటడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు విక్రయిస్తే రైతుకు ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టం రావడం ఖాయంగా కనపడుతోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో రకం, నాణ్యతను బట్టి క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ.13 వేల వరకు ధర పలుకుతోంది.గతేడాది ఫిబ్రవరిలో క్వింటాల్కు రూ.20 వేలు నుంచి రూ.28 వేలు పలికింది. గత ఐదేళ్లలో సగటు ధర రూ.22 వేలు తగ్గలేదు. గరిష్టంగా తేజ, 341, నంబర్–5 రకాలకు రూ.27 వేలు వరకూ, బ్యాడిగ రకానికి రూ.30 వేల వరకూ పలికింది. ప్రస్తుతం తేమ శాతం, తాలు సాకులు చూపి ధరలను మరింత తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తే ధరలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్కు కనీసం రూ.20 వేలు ప్రకటించాలని, అలా అయితేనే పెట్టుబడులు వస్తాయని రైతులు స్పష్టం చేస్తున్నారు.రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టంఒకటిన్నర ఎకరాల్లో డీలక్స్ రకం మిర్చి సాగు చేశాను. తామర పురుగు, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ మిర్చి పంటకు ఆశించడంతో ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఖర్చయ్యింది. మొత్తం కలిపి రూ.3.75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 15 క్వింటాళ్లు ఎరుపు కాయలు, మరో ఐదు క్వింటాళ్లు తెలుపు కాయలు వచ్చాయి. ఎరుపు కాయలు క్వింటా రూ.11 వేలు, తెలుపు కాయలు క్వింటా రూ.4 వేలు ధర పలికింది. దీంతో మొత్తం రూ.1.85 లక్షలు చేతికి వచ్చాయి. వీటిలో కమీషన్ వ్యాపారి ఎంత తీసుకుంటాడో తెలీదు. మొత్తమ్మీద ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు నష్టం వస్తుంది. – కె.శివప్ప, రైతు, దొడ్డిమేకల, కర్నూలు జిల్లాగిట్టుబాటు ధర కల్పించాలిపంటకు రకరకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లతామర, నల్లి, పచ్చ దోమ, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పురుగు మందులు పిచికారీ చేసేందుకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు పెరిగిపోయాయి. పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తులసీనాయక్, రైతు, గాడితండా, పల్నాడు జిల్లాధర పలికితేనే పెట్టుబడి వస్తుందినాలుగు ఎకరాల్లో పంట వేశాను. గతేడాది 25 క్వింటాళ్లు వచ్చిన పంట దిగుబడి తెగుళ్లు, వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికిన తేజ రకం కాయలకు ఇప్పుడు రూ.12 వేలు వేశారు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం. కనీసం క్వింటాల్ రూ.20 వేలకు కొంటేనే గట్టెక్కగలం. –భుక్యా శ్రీను నాయక్, రైతు, రేమిడిచర్ల, పల్నాడు జిల్లా -
జీవీ రెడ్డి ‘ఔట్’
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి(GV Reddy) వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన రాజీనామా లేఖను జీవీ రెడ్డి పోస్ట్ చేశారు. నాలుగు రోజుల కిందటే తీవ్ర ఆరోపణలు నాలుగు రోజుల క్రితం ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నాడంటూ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ సంస్కరణల్లో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు సంస్థ పని తీరు మెరుగుపరిచేందుకు చైర్మన్గా తాను తీసుకున్న నిర్ణయాలను ఎండీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఫైబర్ నెట్ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా, సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఐఏఎస్ అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్ష ణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. జీవీ రెడ్డి, దినేష్కుమార్ను మంత్రి బీసీ జనార్థన్రెడ్డి పిలిచి మాట్లాడారు. అన్ని ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన ఆధారాలు అందించలేకపోయారని సమాచారం. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించి నట్లు తెలిసింది.అసత్య ఆరోపణలు, అర్థంలేని మాటలతో పలచనకావొద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థను రూ.1,000 కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లడానికి కృషి చేస్తుంటే దానికి అడ్డుపడుతున్న అధికారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్నెట్ ఎండీ దినేష్కుమార్పై బదిలీ వేటుజీవీ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి కె. దినేష్కుమార్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం పెట్టుబడులు, మౌలి క వసతుల శాఖ కింద ఏపీ ఫైబర్నెట్ ఎండీగా ఉన్న దినేష్కుమార్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సోమవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆర్టీజీఎస్ సీఈఓ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ డ్రోన్ కార్పొరేష్న్ ఎండీగా నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బాధ్యతల నుంచి కూడా దినేష్కుమార్ను తప్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
GV Reddy : జీవీ రెడ్డి రాజీనామా వెనక అసలు కారణం అదే
సాక్షి, విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఫైబర్ నెట్ ఛైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి సోమవారం తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీరెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ వ్యక్తిగత కారణలతో కాదని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం. ఫైబర్ నెట్ ఛైర్మన్గా ఉన్నా సరే వేమూరి హరికృష్ణ మాట వినాలని జీవీరెడ్డికి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక, వేమూరి హరికృష్ణ మాట విననందుకు చంద్రబాబు, లోకేష్ తిట్టడంతో జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్నెట్లో ఎండీ దినేష్ కుమార్పై ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుండి తప్పించింది. జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది. -
రష్యా అల్లుడివి కదా అందుకేనేమో... రోజా దిమ్మతిరిగే కౌంటర్
-
‘రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా ’
తాడేపల్లి : ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజా(RK Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు ఆర్ కే రోజా. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్ కే రోజా.. ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్(YS Jagan) కే సాధ్యమన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే, దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సెటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఎదురుగా కూర్చొని ప్రశ్నించాలని రోజా సూచించారు. అసలు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘‘అసెంబ్లీ(AP Assembly Sessions)లో గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలు ఆడించారు సూపర్ సిక్స్ తోపాటు 143 హామీలను చంద్రబాబు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా 2047 గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన సిండికేట్ అయి లిక్కర్ మీద రేట్లు పెంచారు.. జలగల్లాగ పీల్చుతున్నారు. విద్యత్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. కానీ గవర్నర్ తో అసలు ఛార్జీలే పెంచలేదన్నట్టుగా మాట్లాడించారు. తల్లికివందనం కింద రూ.15 వేలు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల గురించి మాట్లాడటం లేదు.చంద్రబాబు, కరువు కవల పిల్లలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్నవాటినే తొలగించారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఏమీ లేకుండా పోయాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోనే తేల్చుకుంటాం . ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఏసీ పదవిని కూడా ఇవ్వలేదు. అంటే వారు చేసే అవినీతిని బయటకు రానీయకుండా చేసే కుట్ర చేశారు. టీవీ ఛానళ్లను కూడా అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వటం లేదు? , కూటమికి భజన చేసే ఛానళ్లకే అనుమతులు ఇస్తారా?, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు గ్రూపు-2 అభ్యర్థులు రోడ్డు మీద చెప్పులతో కొట్టుకున్నారు. ప్రజలతో కలిసే పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. మిర్చి రైతులను జగన్ కలిసేదాకా ప్రభుత్వం స్పందించలేదు. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గవర్నర్ మీద జగన్ కి గౌరవం ఉన్నందునే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొఙత డబ్బా కొట్టుకుంటున్నారు . అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం కూటమికే చెల్లింది’ అని రోజా ధ్వజమెత్తారు. -
రామోజీ ఫిలిం సిటీ గోడలు బద్దలు కొడతాం
-
GV Reddy: టీడీపీకి షాక్.. పార్టీకి జీవీరెడ్డి రాజీనామా
సాక్షి, విజయవాడ: టీడీపీకి ఆ పార్టీ నేత జీవిరెడ్డి షాకిచ్చారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.ఇటీవల, ‘తొమ్మిది నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మాత్రమే. మేం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. అంతేకాదు... ఉన్న కనెక్షన్లకు కూడా ప్రసారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు...’ అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ దినేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎండీ మరో ముగ్గురు అధికారులు భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్(బిజినెస్ హెడ్), శశాంక్ (ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్)లతో కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెరతీశారని ఆరోపించారు. సంస్థను చంపే కుట్రకు తెరతీసి రాజద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే భరద్వాజ, సురేష్, శశాంక్లను టెర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఏపీఎస్ఎఫ్ఎల్లో 410మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తే వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా జీఎస్టీ అధికారులు రూ.370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ చెల్లించదని, జీఎస్టీ పెనాల్టీకి కారణమైన ఎండీ దినేష్ కుమార్, ఈడీ(హెచ్ఆర్) రమేష్నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు. విజిలెన్స్ కమిటీ రూ.60 కోట్ల చెల్లింపులను నిలిపివేయాలని చెప్పినా.. వారు చెల్లించేశారని తెలిపారు. ఈ డబ్బులను కూడా వారి నుంచే రికవరీ చేస్తామన్నారు.దినేష్కుమార్, రమేష్ నాయుడుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్కు ఫిర్యాదు చేస్తానని, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని జీవీ రెడ్డి చెప్పారు. ఇప్పటి కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారాలు బాగున్నాయన్నారు. తాను అధికారులపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని, దీనికి, వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల నిర్వాకం వల్లే వైఎస్ జగన్మోహన్రెడ్డి నష్టపోయారన్నారు. ‘మరో ఆరు నెలల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ చనిపోతుంది. దీనికి కారణమైన మా ప్రభుత్వంలోని అధికారుల నిర్వాకం బహిర్గతం చేయకపోతే జీవీ రెడ్డి వల్లే సంస్థ మూత పడింది. కేబుల్ ప్రసారాలు ఆగిపోయాయి. తొలగించిన ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుని కొనసాగిస్తున్నారు.’ అని అనుకునే ప్రమాదం ఉందనే ఈ విషయాలను చెబుతున్నానని ఆయన వివరించారు. -
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని YSRCP నేతలు మండిపడ్డారు
-
ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచనతోనే కుట్రలు చేస్తున్నారు
-
అసెంబ్లీకి రమ్మంటారు వస్తే భయపడతారు: YS Jagan
-
ప్రజా సమస్యలపై పోరాటం దిశగా వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్ జగన్పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జాడలేని కార్మికులు ఏపీ ప్రజలపై పెనుభారం!
-
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: చంద్రశేఖర్
-
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మార్చి19 వరకు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Day-1 లైవ్ అప్డేట్స్అసెంబ్లీ రేపటికి వాయిదాగవర్నర్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయంమార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు.ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే: బొత్సఅసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం.సభలో రెండే పక్షాలు.. ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికారపక్షం.రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుంది. రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.కేంద్రంతో మాట్లాడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు.మరి ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి.కూటమి గ్యారెంటీ అంటేనే మోసం.అందుకే ప్రజల కష్టాలు చెప్పేందుకే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం.రైతుల కష్టాలు, సమస్యలపై పోరాడితే మాపై కేసులు పెడుతున్నారు.రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.తొమ్మిది నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీలపై ఎలాంటి చర్యలు లేవు.ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూశాకే మా తదుపరి చర్య ఉంటుంది.ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం.మిర్చీకి వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుందిమ్యూజికల్ నైట్ లకు ఎన్నికల కోడ్ వర్తించదా?.ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా?: చంద్రశేఖర్అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే చంద్రశేఖర్ కామెంట్స్..కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.ప్రతిపక్షం ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లే.అధికార మదంతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్న చేస్తున్నారు.అధికార పక్షానికి సమాధానం చెప్పే సత్తా లేదా?.మీరు చేసే దోపిడీని బయటపెడతామాని భయమా?.మా 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదా?.ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా?దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మీడియాపై నిషేధం విధించారు.41 ఓటింగ్ ఇచ్చారు ప్రజలు.. అంటే ప్రతిపక్షం అంటే ఇదేగా..6 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన పెట్టుకున్నారు..ప్రజా పద్దుల కమిటీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార పార్టీ వల్లే అనుమభవిస్తున్నారు..కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోందిప్రధాన ఛానల్స్ పై ఆంక్షలు పెట్టడమేంటిప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారునోటీసులు కూడా ఇవ్వకుండా నాలుగు ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..దేశ చరిత్రలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఉంటుందా?.ఎందుకు ఏపీలోనే ప్రతిపక్షాన్ని గుర్తించడం లేదు.కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తామనే కూటమికి భయం పట్టుకుంది.ఆ భయంతో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదాఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదునిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారునిత్యావసర ధరలు 60% పెంచారుప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుతొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారుచంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలిపథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారువైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేహోదా ఇచ్చే వరకూ పోరాడుతాంప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి: పెద్దిరెడ్డివైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.కూటమి ప్రభుత్వానికి, తాలిబన్ల పాలనకు తేడా లేదు. ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిష్కరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ నేతల నిరసనఅసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన నేతలు👉ప్రారంభమైన గవర్నర్ ప్రసంగంఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంప్రసంగం చదువుతున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: వైఎస్సార్సీపీ సభ్యులుఅసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనఅసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి.ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన👉 ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ జగన్కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ప్రధాన ప్రతిపక్ష హోదాపై స్పీకర్ను గట్టిగా నిలదీయాలని వైఎస్సార్సీపీ నిర్ణయంప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరనున్న జగన్ఆ సమయాన్ని హక్కుగా ఇవ్వాలని డిమాండ్👉కాసేపట్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతరం సభ వాయిదా పడనుంది. 👉అసెంబ్లీకి చేరుకున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీని తాకిన రెడ్బుడ్ రాజ్యాంగందేశం ఎన్నడూ, ఎక్కడా, ఏ అసెంబ్లీలోనూ లేని విధంగా మీడియా కవరేజీపై ఆంక్షలు.అసెంబ్లీ సమావేశాలకు నాలుగు టీవీ చానెల్స్పై ఆంక్షలు విధింపు.సాక్షితో పాటుగా మరో మూడు టీవీ చానెళ్లకు అనుమతి నిరాకరించారు.ఎలాంటి నోటీసులు లేకుండా టీవీ చానెళ్లపై ఆంక్షలు 👉 ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.👉25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.👉ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. -
అసెంబ్లీ సమావేశాల్లో సాక్షిపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఆ రాజ్యాంగం ఇప్పుడు అసెంబ్లీని సైతం తాకింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో టీవీ చానల్స్పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది.తమ అనుకూల మీడియాతో ఇష్టానుసారం కథనాలు ఇచ్చుకుంటున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది చంద్రబాబు సర్కార్. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ దూరంగా ఉండాలని నాలుగు టీవీ చానెల్స్పై ఆంక్షలు విధించారు. అందులో సాక్షినే ప్రముఖంగా ఉండడం ఎందుకో తెలిసిందే. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా మీడియాపై నిషేధం విధించగా, ఈ చర్యను పలువురు జర్నలిస్టులు ఖండిస్తున్నారు. -
వేల కోట్ల అప్పులతో అమరావతి నిర్మిస్తున్న కూటమి సర్కారు
-
గ్రూప్-2 అభ్యర్థులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది
-
రైతులకు ఇవ్వాల్సినవన్నీ గంగలో కలిపేశాడు.. చంద్రబాబుపై అంబటి ఫైర్
-
చంద్రబాబు మోసాలపై వైఎస్ జగన్ ఫైర్
-
చంద్రబాబు మోసాలకు గ్రూపు-2 అభ్యర్థులే ప్రత్యక్ష నిదర్శనం... న్యాయం చేస్తానంటూ నట్టేట ముంచాడు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
పోలవరానికి రూ. 2,700 కోట్లు అడ్వాన్స్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాపాల ఫలితంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోయి, కేవలం 41.15 మీటర్లేనని మరోసారి తేలిపోయింది. ఈ ఎత్తుతో ప్రాజెక్టు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కేవలం ఓ బ్యారేజిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నా, దానిని ప్రతిపాదిత ఎత్తు 45.72 మీటర్లకు పెంపునకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేమీ లేవు. దీంతో కేంద్రం కూడా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా నిధులిస్తోంది. ఆ ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం మరో రూ. 2,700 కోట్లు ఏపీ ప్రభుత్వానికి అడ్వాన్సుగా విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆర్థిక శాఖకు సిఫారసు చేశారు. దీంతో ప్రాజెక్టు ఎత్తు పెరగదన్న విషయం మరోసారి స్పష్టమైంది. కేంద్రం 2024–25 సవరించిన బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.5,512.50 కోట్లు కేటాయించింది. ఇందులో గతేడాది అక్టోబర్ 9న రూ.2,807.69 కోట్లు (రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు) విడుదల చేసింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా యూసీలు (వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మిగతా రూ.2,704.81 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.459.69 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపింది. అడ్వాన్సుకు యూసీలు పంపలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 36 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మిగతా నిధుల విడుదలకు జల్ శక్తి శాఖ సిఫారసు చేసింది. ప్రాజెక్టును 2026 మార్చికి పూర్తి చేయడానికి నిధుల సమస్య లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తే 119.40 టీంఎసీలు మాత్రమే నిల్వ చేయొచ్చు. దీనివల్ల వరద ఉన్నప్పుడు కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే.. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే అవుతుంది. -
కేంద్రం మూడో విడత ఇస్తోంది.. బాబు సాయం ఏదీ?
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చీరాగానే పీఎం కిసాన్ పథకంపై తొలి సంతకం చేసిన ప్రధాన మంత్రి మోదీ మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాలుగో రోజునే తొలి విడత సాయం పంపిణీ చేశారు. చెప్పిన సమయానికే రెండో విడతా ఇచ్చారు. ఇప్పుడు సోమవారం మూడో విడత సాయం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కానీ, అదే కూటమితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం అధికారంలోకి వస్తే ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని అటకెక్కించేశారు. రైతులను మరోసారి వంచించారు.పీఎం కిసాన్లో మొదటి స్థానంలో ఏపీపీఎం కిసాన్ పథకం తొలి విడతలో రాష్ట్రానికి చెందిన 40.91 లక్షల మంది అర్హులకు రూ.834.61కోట్లు కేంద్రం జమ చేసింది. రెండో విడతలో 41.84 లక్షల మందికి రూ.836.89 కోట్లు జమ చేసింది. మూడో విడతలో 42.04 లక్షల మంది అర్హత పొందగా, వీరికి రూ.840.95 కోట్లు జమచేయనున్నారు. ఈ నెల 24న బీహార్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ సొమ్ములు జమ చేస్తారు. గత మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించిన సాయంతో కలిపితే ఇది 19వ విడత సాయం. ఇలా మొత్తం రూ.17,219.45 కోట్ల మేర రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతున్నారు. గడిచిన ఐదేళ్లలో పీఎం కిసాన్ అమలులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది.ఆ రూ.1000 కోట్లు దేనికి ఖర్చు చేశారు ?ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ సూపర్ సిక్స్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు జమ చేయాల్సి ఉంది. 4 నెలలు ఓటాన్ అకౌంట్తో గడిపేసిన టీడీపీ ప్రభుత్వం నవంబర్లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. పీఎం కిసాన్ మూడో విడతతో కలిపి అన్నదాత సుఖీభవ ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో కొంతవరకైనా కష్టాల నుంచి గట్టెక్కవచ్చని రైతులు ఎదురు చూశారు. పీఎం కిసాన్ మూడో విడతా అందుతోంది. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అలాంటప్పుడు బడ్జెట్లో రూ.1,000 కోట్లు ఎందుకు కేటాయించారు? దేని కోసం ఖర్చు చేస్తారో చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్ జగన్ సాయంఏటా మూడు విడతల్లో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చీ రాగానే ఇచ్చిన హామీకంటే మిన్నగా ఏటా రూ.13,500కు సాయాన్ని పెంచి, తొలి ఏడాది నుంచే పంపిణీ ప్రారంభించి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రతీ ఏటా మే/జూన్లలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున 53.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ. 34,288.17 కోట్లు జమ చేసి అండగా నిలిచారు.ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సిందేరైతులను మభ్యపెట్టేందుకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆచరణలో పైసా కూడా విదల్చలేదు. ఇలాంటప్పుడు బడ్జెట్లో ఎందుకు కేటాయించారో సమాధానం చెప్పాలి. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రెండేళ్ల సాయం కలిపి ప్రతి రైతుకు రూ.40 వేల చొప్పున జమ చేయాలి. లేకుంటే రైతుల తరపున ఉద్యమిస్తాం.– జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంపెట్టుబడి సాయం అందక అగచాట్లుజగన్ ప్రభుత్వంలో ఏటా సీజన్కు ముందే పెట్టుబడి సాయం అందేది. ఈ ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. దీంతో సాగుకు పెట్టుబడి దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.3 నుంచి రూ.5కు వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేశారు. అయినా వైపరీత్యాల బారిన పడి, ఆశించిన స్థాయిలోదిగుబడులు రాలేదు. పంటకు మద్దతు ధరా దక్కక తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సాయమందించాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, ఉద్యోగులనే కాకుండా చివరకు గ్రూప్-2 అభ్యర్థులను కూడా చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేశారని ఆయన ఆక్షేపించారు. గత మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, వారికి న్యాయం చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు వారిని నట్టేట ముంచాడన్నారు. అభ్యర్ధుల విషయంలో లోకేష్, చంద్రబాబు తలోమాట మాడ్లాడుతున్నారని మండిపడ్డారు.ఇంకోవైపు గ్రూప్-2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్లు మీద కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంత సమన్వయ లోపం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామన్న మంత్రి లోకేష్.. ఇప్పుడు గ్రూపు-2 అభ్యర్థులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై గ్రూపు-2 అభ్యర్ధులకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసారు.ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. మరోవైపు ఆందోళన చేసిన అభ్యర్ధులపైన పోలీసుల లాఠీఛార్జీని తీవ్రంగా ఖండించిన ఆయన.. పోలీసులు అదుపులోకి తీసుకున్న అభ్యర్ధులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఉన్న ఉద్యోగాలను తీసేస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదన్నారు. వాలంటీర్లకు జీతం పదివేలు ఇస్తానని ప్రకటించి.. 2.5 లక్షల మంది ఉద్యోగాలను తీసేశారని మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట వైఎస్సార్సీపీ హయాంలో కల్పించిన శాశ్వత ఉద్యోగాలకు కోతపెట్టారని ఆక్షేపించారు. మరోవైపు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో 18 వేలమందిని, ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలోనూ ఉద్యోగాలు తొలగించడం దారుణమని వ్యాఖ్యానించారు. గ్రూపు-2 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. -
‘చంద్రబాబు మిర్చి రైతులను పచ్చిమోసం చేస్తున్నారు’
గుంటూరు రాష్ట్రంలో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న మిర్చిరైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు డ్రామాలతో కాలం గడుపుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలోని మార్క్ ఫైడ్ నుంచి మిర్చి కొనుగోళ్ళు చేయించకుండా, కేంద్రప్రభుత్వం కొనుగోళ్ళు చేయాలని చంద్రబాబు కోరడం అర్థరహితమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కూటమి ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేయలేదని, దీనిని బట్టే మిర్చి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం తెట్టతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా ఆయన ఏమన్నారంటే... రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో మిర్చిరైతులు సంక్షోభంలో ఉన్నారు, పెట్టుబడి వ్యయాలు పెరిగాయి, దిగుబడి తగ్గుతోంది, మిర్చి రేటు కూడా పడిపోతోంది, మార్కెట్ ఇంట్రవెన్షన్ లేకపోతే రైతులు దెబ్బతింటారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గారు మిర్చి రైతుల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో స్పందించింది. కనీసం ఇప్పటికైనా మిర్చిరైతుల సమస్యను గుర్తించి మద్దతుధరకు కొనుగోళ్ళు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. పైగా మిర్చి రైతులను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు డ్రామాలు ప్రారంభించారు.నాఫెడ్ ఎప్పుడైనా మిర్చికొనుగోళ్ళు చేసిందా?శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రాసిన లేఖలో గత ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.27వేల వరకు అమ్ముడుపోయింది. నేడు మిర్చిధర దారుణంగా పతనమైంది. వెంటనే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. అసలు మిర్చి కొనుగోళ్ళకు కేంద్రప్రభుత్వానికి ఏం సంబంధం? నాఫెడ్ ఎప్పుడైనా కొనుగోళ్ళు చేసిందా? మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్ళు చేయించడానికి ఉన్నా కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ కేంద్రం స్పందించి ముందుకు వస్తే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మిర్చీని వారికి విక్రయించండి.వైఎస్సార్సీపీ హయాంలో మార్కెట్ ఇంట్రవెన్షన్2021లో వైఎస్సార్సీపీ హయాంలో మిర్చిరేటు పడిపోయినప్పుడు క్వింటాకు రూ.7వేలు మద్దతుధర ప్రకటించాం. ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం మిర్చికి కనీసం రూ.14 నుంచి 15వేల రూపాయల వరకు మద్దతుధరను ప్రకటించాల్సి ఉంది. ఆనాడు వైయస్ జగన్ గారు రైతులపక్షన నిలబడి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించారు. రూ. 65వేల కోట్లను వెచ్చించి ధాన్యంను కొనుగోలు చేశాం. ఇతర పంటలకు సంబంధించి రూ.7800 కోట్లతో కొనుగోలు చేశాం. రూ.3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో అరటి, గుమ్మడికాయలను కూడా కొనుగోలు చేశాం. వ్యవసాయరంగంలో వైయస్ జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉండేలా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యదోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మల్లా ఐపీఎస్ అధికారులురేటులేక నష్టపోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ సీఎం వైయస్ జగన్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు సీఎం, వ్యవసాయ మంత్రులకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తే, కనీసం ఎందుకు అధికారులను అయినా పంపించలేదు? రైతుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రైతుల పక్షనా వారి బాధను అర్థం చేసుకునేందుకు వైయస్ జగన్ గారు గుంటూరు వెడితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇదే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే దానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరైనా దానికి కోడ్ వర్తించదా? రైతుల కోసం వెళ్ళిన వైయస్ జగన్, ఇతర వైయస్ఆర్సీపీ నేతలపైనా కేసులు పెట్టడం కక్షసాధింపు కాదా? భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక మాజీ సీఎంకు ఉన్న జెడ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన రోజున ఉపసంహరించారు. కుట్రపూరితంగానే భద్రతను తొలగించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ఇందుకు రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మలా ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి మేం సిద్దంగా ఉన్నాం.’అని అంబటి స్పష్టం చేశారు. -
కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ నిలదీశారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగులేమైనా బిక్షగాళ్ళా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కోసం పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు చాలా జీవితం కోల్పోతున్నారు. గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. కూటమి ప్రభుత్వమంటే పెద్ద అబద్ధం. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని కూటమి ప్రభుత్వం అవసరమా?. గ్రూప్-2 అభ్యర్థులను తీవ్ర కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. చిన్న అంశాన్ని తేల్చుకోలేక నిరుద్యోగులను బలిచేస్తారా?. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?. 40 ఏళ్ల సీనియర్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నా వినడం లేదంటాడు. సీఎం మాట ఏపీపీఎస్సీ ఛైర్మన్ వినకపోవడమేంటి?’’ అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘సీఎంగా చంద్రబాబు అన్ ఫిట్. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటున్నారు. లోపాలుంటే ఎందుకు సరిచేయలేకపోతున్నారు. వైఎస్ జగన్పై అపవాదు వేయాలని చూస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయ్యింది గాడిదలు కాస్తున్నారా? ఇన్ని రోజులూ. గందరగోళం సృష్టించడానికి కాదు.. మీకు అధికారం ఇచ్చింది. పది రోజుల నుంచి అభ్యర్ధుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎగ్జామ్కి ఒక రోజు ముందు నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరుసటిరోజు చంద్రబాబు ఆడియో లీక్ చేశారు. సీఎం మాట విననప్పుడు ఏపీపీఎస్సీ ఛైర్మన్ను తక్షణమే ఆమెను తొలగించండి’’ అంటూ జూపూడి ప్రభాకర్ అన్నారు.ఇంత గందరగోళం నడుస్తుంటే.. ఏపీపీఎస్ ఛైర్మన్ ఎందుకు నోరువిప్పడం లేదు. వైఎస్ జగన్ బయటికెళితే కేసు. ఆయనకి సెక్యూరిటీ తీసేస్తారు. నిరుద్యోగుల తరపున మాట్లాడితే అరెస్టులు. చిన్న సమస్యకు పరిష్కారం చూపలేనోళ్లు పోలవరం కడతారంట. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ స్వతంత్రంగా పనిచేసిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారు. నిరుద్యోగులు టెర్రరిస్టులు కాదు. ప్రభుత్వమే నిరుద్యోగుల గొంతు కోసేస్తే ఎలా?. నిరుద్యోగుల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతుంది.. ఉద్యమాన్ని చేపడతాం. చంద్రబాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’’ అని జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గ్రూప్-2 పై చంద్రబాబుకు అవగాహన లేదు: సలామ్ బాబు
-
నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ స్టూడెంట్స్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. గ్రూపు-2 అభ్యర్థులకు మేలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నియమించిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తొలగిస్తోంది. శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధిస్తోంది. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్నవి తొలగించటం అన్యాయం’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘గ్రూప్-2 అభ్యర్థలను నమ్మించి వారి గొంతు కోశారు. అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికి వారి జీవితాలను నాశనం చేశారు. ఈరోజు 92,250 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. వారందరి జీవితాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెలగాటమాడారు. నిరుద్యోగుల జీవితాలను సీఎం చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలి. లేకపోతే వైఎస్సార్సీపీ తరపున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’’ అని రవిచంద్ర హెచ్చరించారు. -
మిర్చి రైతులకు చేయూతపై ఎటూ తేల్చని ఏపీ సీఎం చంద్రబాబు
-
కూటమి.. చంద్రన్న పగ, దగ పథకాన్ని అమలు చేస్తోంది: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్.. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చంద్రబాబులాగా మోసం చేయడం వైఎస్ జగన్కు తెలియదని కన్నబాబు చెప్పుకొచ్చారు. గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా కురుసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘నాకు బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎంతో బలంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూశారు.ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. సినిమా హీరోలను మించి వైఎస్ జగన్కు జనాలు వస్తున్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ 60 ఇచ్చేవారు. రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది. ప్రజల కోసం పోరాడుతుంది. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు, నేతలు ఎందరో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో వలసలు సాధారణం. జగన్ సేన అన్ని పార్టీల సేనల కంటే బలంగా ఉంది. లక్షా 20వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏమి చేశారో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
టీడీపీ ఇసుక మాఫియా అరాచకం.. కర్రలతో దాడియత్నం!
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ నేతలపై ఇసుక మాఫియా దాడులు చేసింది. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో టీడీపీ ఇసుక మాఫియా దాడులకు తెగబడింది.వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామం వద్ద టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యదేచ్చగా ఇసుక అక్రమ రవాణాకు టీడీపీ నేతలు పాల్పుడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు జరుపుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపును వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఆముదాలవలస వైఎస్సార్సీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, పార్టీ నేతలు తాజాగా అనధికార ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి పరిశీలించారు. దీంతో, ఇసుక మాఫియా వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంది. టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అనంతరం, వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, టీడీపీ నేతలు జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో ఇష్టానుసారం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.ఈ సందర్భంగా చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా చేస్తూ టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన మాపై దాడులు చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో అనేక చోట్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలను దోచుకుంటున్నాడు. ఇసుక మాఫియా దాడులు చేసినా.. అక్రమ రవాణాపై పోరాడుతూనే ఉంటాం. రైల్వే బ్రిడ్జ్ ఆనుకొని 100 మీటర్ల దూరంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు. -
బాబుపై విక్రమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
లోకేష్, చంద్రబాబుపై గ్రూప్ 2 స్టూడెంట్ ఫైర్
-
నిస్సిగ్గుగా నిందలు.. ఇప్పుడేమంటావ్ బాబూ..?
-
నేడు యధాతథంగా గ్రూప్- 2 మెయిన్ పరీక్ష
-
గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
సాక్షి, విజయవాడ: ఏపీలో గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 175 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.శనివారం జరిగింది ఇదీ..గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్-2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. -
ఆంధ్రప్రదేశ్లో భూ దోపిడీకి ఇక రాజముద్ర... అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు.. సీఆర్డీఏకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశం
-
దొంగ ఓట్లతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ అడ్డదారులను తొక్కుతోంది. సాధారణ ఎన్నికలను తలపించేలా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ప్రలోభాలు, అడ్డగోలు వ్యవహరాలకు తెగిస్తోంది. ఉమ్మడి కష్ణా–గుంటూరు, తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. విద్యావంతులకు సంబంధించిన ఈ ఎన్నికను సైతం పూర్తి రాజకీయమయం చేసి ఆ స్థానాలను దక్కించుకునేందుకు బరితెగిస్తోంది. నిజానికి.. ఆ రెండు సీట్లూ విద్యావంతులు, మేధావుల వేదికగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థుల సిట్టింగ్ స్థానాలు. కష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీగా విద్యావేత్త కేఎస్ లక్ష్మణరావు నాలుగోసారి పోటీలో ఉన్నారు. తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు పదవీకాలం ముగుస్తుండడంతో ఆయన స్థానంలో పీడీఎఫ్ తరఫున దిడ్ల వీరరాఘవరావును పోటీకి దింపారు. ఈ పోటీకి వైఎస్సార్సీపీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో టీడీపీ ఇదే అదనుగా ఆ రెండు స్థానాలను అధికార బలంతో ఎలాగైనా చేజిక్కించుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కేఎస్ లక్ష్మణరావుకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ మాజీమంత్రి ఆలపాటి రాజా.. వీరరాఘవరావుకు పోటీగా కాకినాడ రూరల్ సీటు ఆశించి పొందలేకపోయిన పేరాబత్తుల రాజశేఖర్ను రంగంలోకి దించారు. శిబిరాలు పెట్టి ఓట్లు చేర్పించిన టీడీపీఎన్డీయే అభ్యర్థులుగా ప్రకటించిన వారి కోసం టీడీపీ నేతలు నాలుగు నెలలుగా నిబంధనలు మీరి పనిచేస్తున్నారు. మొదట నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ వీధివిధినా శిబిరాలు పెట్టి మరీ అడ్డగోలుగా ఓటర్లను చేర్పించారు. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు టార్గెట్లు పెట్టి నియోజకవర్గాల వారీగా తమకు అనుకూలంగా ఉండే ఓట్లను చేర్పించారు. ఈ టార్గెట్లు అందుకోలేకపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నేరుగా తిట్టిన సందర్భాలున్నాయి. టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, స్నేహితులు, సానుభూతిపరులు.. ఇలా ఎవరిని పడితే వారిని పెద్దఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్లుగా చేర్పించారు. ఒకరి పేరుతోనే పదుల సంఖ్య ఓట్లను చేర్చి దొంగ ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. మరోవైపు.. ఇతర గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు స్థానిక నేతల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల నేతత్వంలో కులాలు, వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు పెట్టి ప్రలోభాలకు గురిచేశారు. అలాగే, ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారంటూ ప్రతిరోజూ ఓటర్లకు వరుసగా ఐవీఆర్ఎస్ ఫోన్లు చేస్తున్నారు. చాపకింద నీరులా ‘పీడీఎఫ్’ ప్రచారం..మరోవైపు.. పీడీఎఫ్ అభ్యర్థులు లక్ష్మణరావు, వీరరాఘవరావు మాత్రం విద్యార్థులు, ఉద్యోగుల కోసం తాము చేసిన పోరాటాలు, వారి సమస్యలను ప్రస్తావిస్తూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలు, తటస్థులు, మేధావులు సైతం వీరికి మద్దతు పలుకుతున్నారు. కానీ, అధికారం అండ చూసుకుని దొంగ ఓట్లతో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోంది.ఒకే వ్యక్తి పేరుతో 14 ఓట్లుఈ క్రమంలో.. చాలాచోట్ల ఎన్డీయే అభ్యర్థులు చేర్పించిన దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. కష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లులో ఒకే వ్యక్తి పేరుతో 14 ఓట్లు జాబితాలో దర్శనమివ్వడం విశేషం. గురజ ప్రకాష్రాజ్ అనే వ్యక్తి పేరు పక్కన ఇంటి పేర్లు, తండ్రి పేర్లు మార్చి ఇష్టారాజ్యంగా ఓట్లు చేర్పించేశారు.అలాగే, తాడిగడపకు చెందిన చందు రాజారావు పేరుతో నాలుగు ఓట్లు చేర్పించారు. ఇలా ప్రతిచోటా టీడీపీ శ్రేణులు వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించాయి. ఇంటి పేర్లు, అడ్రస్లు మార్చి ఒకే వ్యక్తి పేరుతో తప్పుడు ఓట్లు నమోదు చేయించాయి. పోలింగ్ రోజున ఆ ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా వేసేందుకు నేతలు సిద్ధమయ్యారు. -
‘మిర్చి’పై ఎటూ తేల్చని సీఎం
సాక్షి, అమరావతి: ధర పతనమై ఇబ్బంది పడుతున్న మిరప రైతులను ఆదుకొనే విషయంలో సీఎం చంద్రబాబు ఎటూ తేల్చలేదు. ఆయన శనివారం సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ, మిర్చి ధర, కొనుగోళ్లపై రైతులకు స్పష్టత ఇవ్వలేదు. ఎగుమతిదారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సహకరిస్తే రైతులను ఆదుకుంటామని చెప్పారు. వారం, పది రోజుల్లో మరోసారి సమావేశమై, అప్పటికీ మిర్చి ధర పెరగకపోతే, ప్రభుత్వం నిర్దేశించిన క్వింటా ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామంటూ దాటవేశారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో కొనుగోళ్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో సీఎం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అసహనం వ్యక్తంచేశారు.సాగు ఖర్చులు ఏటా పెరిగిపోతున్నాయన్న రైతులుమిరప సాగుకు ఏటా పెట్టుబడి పెరుగుతోందని, ఎకరాకు రూ. 3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఖర్చవుతోందని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యార్డుకు తెచ్చిన పంటకు ఉదయం నిర్ణయించిన ధర, మధ్యాహ్నానికి క్వింటాకు రూ.500 చొప్పున వ్యాపారులు తగ్గిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగా లేదంటున్నారని వాపోయారు. ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికే ఎలా తగ్గుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. యార్డుకు టిక్కీలు తేవాలంటే లారీల కిరాయి ఖర్చూ ఎక్కువవుతోందని చెప్పారు. యూనియన్లో లేని లారీలను బాడిగకు తీసుకొస్తే, వాటి యజమానులను మిగతా లారీ యజమానులు బెదిరించి, కేసులు పెడుతున్నారని చెప్పారు. క్వింటాకు బోనస్ ప్రకటిస్తే రైతులకు మేలు జరుగుతుందని సూచించారు.క్వాలిటీ, ఎగుమతులు తగ్గాయన్న వ్యాపారులుప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంట క్వాలిటీ తగ్గిందని వ్యాపారులు చెప్పారు. కోల్డ్ స్టోరేజీల్లో గతేడాది పంట నిల్వ ఉండడంతో ఈ ఏడాది వచ్చిన పంటను నేరుగా యార్డుకు తెస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఎగుమతులు తగ్గడంవల్ల రాష్ట్రంలో మిర్చికి కొంత ధర తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో పండే మిర్చిలో 60 శాతం విదేశాలకు ఎగుమతి అవుతుందని, 410 మంది ప్రధాన ఎగుమతిదారుల్లో ప్రస్తుతం 250 మందే యాక్టివ్గా ఉన్నారని తెలిపారు. కృష్ణపట్నం కంటెయినర్ టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్లను అనుమతించాలని కోరారు.కిరాయి ఎక్కువ వసూలు చేసేలారీ యజమానులపై కఠిన చర్యలుమిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేయాలని, రైతుల ఫోన్లకు మెసేజ్లు పంపాలని అన్నారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలిచ్చేలా కృషి చేస్తానన్నారు. క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ఈ–క్రాప్లో నమోదైన రైతుల వివరాలు, యార్డులో పంటను అమ్ముకున్న రైతుల వివరాల ఆధారంగా సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. -
AP: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతం.. సీఎం డౌన్ డౌన్ అంటూ..
సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచేసింది. మెయిన్స్ వేయిదా వేస్తామని ఎమ్మెల్సీ చిరంజీవి ద్వారా అభ్యర్థులను ప్రభుత్వం నమ్మించింది. టీడీపీ నేతల మాటలు నమ్మి గ్రూప్-2 అభ్యర్థులు మోసపోయారు. పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు చేసినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు.విశాఖలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతమైంది. ఇసుకతోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఎం డౌన్ డౌన్ అంటూ గ్రూప్-2 అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా పోలీసులు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరుతున్నారు.కళ్లు తిరిగి పడిపోయిన గ్రూప్-2 అభ్యర్థిగ్రూప్-2 అభ్యర్థి శ్యామ్ కళ్లు తిరిగిపడిపోయాడు. శ్యామ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో అభ్యర్థి చిరంజీవి కూడా సొమ్మసిల్లి పడిపోయాడు. రోస్టర్లో సవరణలు చేశాకే పరీక్షకు హాజరవుతామని.. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం మా గోడు పట్టించుకోవాలని గ్రూప్-2 అభ్యర్థులు చెబుతున్నారు. విజయవాడ: రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి స్పష్టత ఇంకా రాలేదు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మూడు రోజులుగా ధర్నాలోనే ఉన్నామని గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని.. వాయిదా పడుతుందంటూ లోకేష్ చంద్రబాబు చెప్పారు. ఆ నమ్మకంతోనే ఎక్కడ వాళ్లం అక్కడే ఆగిపోయాం. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రోస్టర్ విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టాలి. రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టకపోతే మళ్లీ జ్యూడిషల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇంకో రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే గ్రూప్-2 ప్రిపరేషన్ కోసం ఇల్లు వదిలి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా రాయలేమని నాయక్ అన్నారు. -
గ్రూప్-2 వాయిదాపై చంద్రబాబు సర్కార్ డ్రామా
సాక్షి, విజయవాడ: పరీక్ష వాయిదా కోసం గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేసినా కానీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయని ఏపీపీఎస్సీ.. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం పంపింది. పరీక్ష నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులకు ఏపీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్-2 వాయిదాపై చంద్రబాబు సర్కార్ డ్రామాకు తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామా నడుపుతోంది.లేఖలు, ఆడియో లీక్స్ పేరుతో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారు. డ్యూటీ టైమింగ్స్ అయిపోవడంతో ఏపీపీఎస్సీ కార్యాలయం సిబ్బంది వెళ్లిపోయారు. కార్యాలయానికి తాళం వేసి ఉందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చి.. అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. విశాఖలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేశారు. ఇసుక తోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు. -
Ramoji Film City: ఫిలిం సిటీ గోడలు బద్దలుగొట్టి
-
Kakani : సెకీ నుంచి ఈ ఏడాదే 4వేల మెగావాట్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు
-
నీకు దమ్ము, ధైర్యం ఉంటే. .. చంద్రబాబు కుట్ర బయటపెట్టిన గౌతంరెడ్డి
-
ఫైబర్ నెట్ క్లోజ్ చేసేలా చంద్రబాబు కుట్ర: గౌతంరెడ్డి
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫైబర్ నెట్ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ఫైబర్ నెట్ కార్పోరేషన్(FiberNet Corporation) మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చాం. అలాంటి సంస్థని నాశనం చేసేందుకు కుట్ర పన్నారు. 2014-19లో చంద్రబాబు ఫైబర్ నెట్లో భారీగా అవినీతి చేశారు. అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించాం. చంద్రబాబు అక్రమాలు, అవినీతిని సీఐడీ నిరూపించిందిచంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే అవినీతి చేశారు. ఫైబర్ నెట్ లో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబు అవినీతి చేశారు. ఆ అవినీతిని జగన్ గుర్తించి విచారణ జరిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు అవినీతి(Chandrababu Corruption) చేసి అరెస్టు అయ్యారు. ఇప్పుడు.. తన మీద ఉన్న కేసులను చంద్రబాబు మాఫీ చేయించుకుంటున్నారు. అందులో భాగంగానే ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్నారు. సంస్థను పూర్తిగా క్లోజ్ చేసేలా కుట్ర పన్నారువైఎస్ జగన్ ప్రోత్సాహంతో మా హయాంలో రూ.190లకే ఇంటర్నెట్ ఇచ్చాం. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చర్యలు చేపట్టాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో కనెక్షన్లు ఇచ్చాం. అందుకే మా హయాంలో ఫైబర్ నెట్ లాభాల బాట పట్టి ఆదాయం పెరిగింది. ఏడాదికి 1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాం. కానీ.. చంద్రబాబు కుట్రతో ఫైబర్ నెట్ ని క్లోజ్ చేయబోతున్నారు. మా హయాంలో 20 లక్షల బాక్సులను కేంద్రం నుండి ఉచితంగా వచ్చేలా మేము ఏర్పాటు చేశాం. వాటిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చి ఫైబర్ నెట్ కి ఆదాయం పెంచాలి. అంతేగానీ సంస్థలను నాశనం చేయవద్దు. తనమీద ఉన్న కేసుని తప్పించుకోవటానికి చంద్రబాబు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేసును ఎదుర్కోవాలి. రైతుల కోసం మిర్చి యార్డుకు వెళ్లిన జగన్ పై కేసు పెట్టారు. మరి మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న చంద్రబాబు మీద ఎందుకు పెట్టలేదు?. ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మీడియా సంస్థలను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. -
‘దిశ’ పేపర్లు చించేసి ‘సురక్ష’ తెస్తున్నారా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ‘దిశ’ యాప్ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. రాష్ట్రంలో అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అమ్మాయిలపై జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ ‘దిశా’ యాప్ తెచ్చారు. దిశా యాప్ను కోటి యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ మహిళ, ఆడపిల్ల ఆపదలో ఉన్నా ఈ యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం కల్పించారు. క్షణాల్లోనే బాధితులను కాపాడిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేశారు.అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రజల నుండి తీవ్ర విమర్శలు వచ్చేసరికి మళ్ళీ సురక్ష పేరుతో యాప్ను తీసుకువస్తున్నారు. ఇప్పటికే దిశా యాప్, పోలీసు స్టేషన్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా వాడుకుని మహిళలను రక్షించండి. గతంలో ఈ యాప్ను తెచ్చినప్పుడు ఇప్పటి హోంమంత్రి అనిత పేపర్లను తగులబెట్టారు. ఇప్పుడు మళ్ళీ సురక్ష పేరుతో యాప్ని తెస్తున్నారు. జనసేన, టీడీపీకి చెందిన కొందరు నేతలు.. మహిళలపై అఘాయిత్యాలు పాల్పడ్డారు. వారిపై కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు. ఇటువంటి కూటమి పాలనలో మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది?’ అని ఘాటు విమర్శలు చేశారు. -
'జగన్ ' అంటే నమ్మకం కోల్పోయింది అధికారమే.. ప్రజాదరణ కాదు
-
రేవంత్ రెడ్డి కృష్ణా జలాలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: కవిత
-
చంద్రబాబు అంటే కరువు.. కరువు అంటే చంద్రబాబు.. రవీంద్రనాథ్ రెడ్డి సెటైర్లు
-
కాకమ్మ కథలు చెప్పొద్దు.. మీ ఇగో పక్కన పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయండి
-
రేవంత్ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది: కవిత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుట్టు చంద్ర బాబు చేతిలో ఉంది.. చంద్రబాబు జుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమమంలో పసుపు బోర్డును ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు నిజామాబాద్లో పర్యటించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘కవిత విషయంలో మాట్లాడవద్దని రేవంత్కు సుపప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ఆయన మారలేదు. మరోసారి కోర్టు చీవాట్లు పెట్టాలేమో. ఇక, ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ భేటీ అయిన తర్వాతే ఆంధ్రకు నీటి తరలింపు జరుగుతోంది. రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలోనే ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు జుట్టు ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ చేతిలో ఉంది. చంద్రబాబు ప్రతిపాదనపై సీఎం రేవంత్.. కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు.ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుపై కవిత స్పందిస్తూ..‘పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. పసుపు ధర రోజురోజుకూ పతనం అవుతోంది. 15వేల మద్దతు ధర ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. వ్యాపారులు సిండికేట్ అయి పసుపు రైతులను దగా చేస్తున్నారు. దీనిపై మార్చి ఒకటో తేదీ వరకు డెడ్లైన్ విధిస్తున్నాం. పసుపు క్వింటాలుకు పదిహేను వేల ధర ఇవ్వకుంటే రైతులతో కలిసి కలెక్టరేటును ముట్టడిస్తాం. పసుపు బోర్డు నామమాత్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. పసుపు క్వింటాల్కు 12వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నేతలు నిలబెట్టుకోవాలి. 12వేల కంటే ధర తక్కువగా వస్తే బోనస్ రూపంలో రైతులకు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.