breaking news
Chandrababu Naidu
-
NO.1 క్రిమినల్స్.! అంతా మనోళ్లే!
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గోపిరెడ్డి సంచలన విషయాలు
-
పబ్లిక్ టాక్: ఆ దొంగలే ఎంతో నయం!
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు. టెక్నాలజీ చాలా మందిని పట్టిచ్చేస్తోంది. కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి, దొంగచాటుగా, అప్పగించేసి, లెంపలు వాయించుకుని, క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే. ఆ యవ్వారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉన్నదని గ్రహించాల్సిందే. ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి.. మన రాజకీయ నాయకులందరికీ కానుకలుగా పంపాలని కంకణం కట్టుకోవాల్సిందే. ఇంతకీ ఏమిటీ తమాషా అనుకుంటున్నారా?.. అనగనగా బుక్కరాయసముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతుంటారు కదా.. అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు. కానీ.. కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు. ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈలోగా.. ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి, దానితో పాటు ఓ ఉత్తరం కూడా పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.హుండీ సొమ్ము దొంగిలించిన కాణ్నించీ.. మా యింట్లో పిల్లలకి ఆరోగ్యం బాగా లేదు. ముసలమ్మ సొమ్ము దొంగిలించి తప్పు చేశాం. అందుకే తిరిగి యిచ్చేస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులకు అయిన డబ్బు మాత్రం వాడుకున్నాం. క్షమించండి.. అని ఆ ఉత్తరంలో వారు వాక్రుచ్చారు. పోలీసులు తిరగొచ్చిన సొమ్మును లెక్కవేస్తే 1.86 లక్షల రూపాయల దాకా తేలింది. దొంగలెవరో కనిపెట్టాలని వెతుకుతున్నారు.పాపం.. ఆ ముసలమ్మ హుండీ దొంగల పశ్చాత్తామని, పాపభీతిని పక్కన పెడదాం. సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్లించుకుందాం. ఈ వార్త చదివితే.. ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా.. అని మనకు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారం దక్కింది.. ఉన్న కాడికి దోచెయ్యాలి.. జీవితంలో మళ్లీ అధికారం అనేది మన దాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంపరం పుట్టిస్తోంది. పబ్లిక్ టాక్ ఏంటంటే..ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటే.. చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం.. అప్పుడప్పుడూ రంకెలు వేస్తూ.. ‘లేస్తే మనిషిని కాదు.. ఖబడ్దార్’ అంటూ ఉంటారు. ఒకవైపు హామీల అమలులో విఫలమై.. ప్రజాసందోహంలో పరువు పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో.. మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటూ గెలవం అనే భయమే వారిని దోపిడీ వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి మొబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు, లిక్కర్ దుకాణాల్ని అయినవారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకుంటున్న మొత్తాలు, ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వాటితో ప్రారంభించి.. అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పశ్చాత్తాపం రావాలంటే.. వారికోసం ఎంత పవర్ ఫుల్ దేవుళ్లు... వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా.. దేవుళ్ల మహిమతో, ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా.. ఒక అమరావతి కాదు కదా.. పది అమరావతిలు, పది పోలవరం డ్యాములు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు.అయినా.. దొంగలకు ఉండే స్ఫూర్తి ఈ నాయకులకు ఎందుకుంటుంది? దొంగలు చాలా గొప్పవాళ్లు కదా? అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం, బుద్ధి.. అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.:::ఎం.రాజేశ్వరి -
Kiliveti Sanjeevaiah: RBK లు పెట్టి రైతులకు ఎలాంటి కష్టం రానివ్వలేదు..
-
బాబు మెడికల్ మాఫియా.. అమ్మేయడానికి మీరెవరు? బాబుపై మార్గాని సీరియస్
-
కర్నూలులో ఆటో డ్రైవర్ల భారీ నిరసన..
-
జగన్ వస్తారు.. వాటిని వెనక్కి తీసుకుంటాం.. మెడికల్ కాలేజీలు కొనేవారికి వార్నింగ్
-
‘రైతుల ఇబ్బందులు.. సీఎం మాట్లాడే బాష ఇదేనా?’
అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్
సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు. కిరణ్ రాయల్ తాజాగా ప్రెస్మీట్లో భూమన కరుణాకర్రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్ అన్నారు. -
బాబు బినామీల కోసం అమ్మకానికి మెడికల్ కాలేజీలు
-
నేర చరిత్రలో నెంబర్ వన్.. బాబు కేబినెట్ మంత్రులే!
-
నేనింతే ప్రశ్నిస్తే తాట తీస్తా..
-
బాబు మరో కుట్ర.. అమ్మకానికి మెడికల్ కాలేజీలు
-
వైద్య కాలేజీలు ఇక ప్రైవేట్ చేతుల్లోకే !
-
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం... రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
-
Big Question: చంద్రబాబుకు దమ్ముందా.. ABN రాధాకృష్ణ అరెస్ట్ ఎప్పుడు ?
-
Big Question: కేసులు పెట్టి లోపలేస్తాడంట! బెదిరిస్తున్నాడు భయ్యా..
-
విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే
సీతంపేట: ‘విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’ అని అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల నేతలు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుదే.ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకేమాటపై నిలబడ్డాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్కళ్యాణ్లు మోదీ ముందు సాగిలపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ఆధారపడి ఉంది. కేంద్రాన్ని విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా నిలదీసి తెలుగు ప్రజల సెంటిమెంట్ను గౌరవించాలి. ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, 1,400 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించినా, 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచినా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడామని పాలకులు చెప్పడం హాస్యాస్పదం.విశాఖ ఉక్కు కర్మాగారం గురించి దు్రష్పచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అనడం సరికాదు. ప్రధాని మోదీని ఒప్పించి ప్రైవేటీకణ ఆపే దమ్ము మాధవ్కు ఉందా?. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 12న విజయవాడలో సమావేశం పెట్టాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అని పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ జవాబు చెప్పాలి ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉప్పు, కారం తినడం లేదా? అని పవణ్కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఉప్పు కారం తింటున్నారో.. లేదో జవాబు చెప్పాలి. పవన్కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఆయన రుషికొండ భవనంలో పెచ్చులు ఊడిపోతున్నాయని మీడియాను తీసుకెళ్లి డ్రామాలాడటం హాస్యాస్పదం. స్టీల్ప్లాంట్ కార్మికులను తొలగిస్తే అడ్డుకోవాల్సిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు డబ్బులిచ్చి చాలామంది ఉద్యోగాల్లోకి వచ్చారని చెప్పడం దుర్మార్గం’ అని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జీవీఎంసీలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ప్రజాసంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏవీ వర్మరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, సీపీఐ ఎంఎల్, ఏఐటీయూసీ, స్లీట్ ప్లాంట్ గుర్తింపు సంఘం, వివిధ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు వై.కొండయ్య, గణేష్ పాండా, కె.దేవా, డి.ఆదినారాయణ, ఆర్.రవీంద్రనాథ్, ఏజే స్టాలిన్, ఎం.పైడిరాజు మాట్లాడారు. -
నేర చరితుల్లో నంబర్ వన్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధికంగా చంద్రబాబు మంత్రివర్గంలో నేర చరితులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో 96 % మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి రూపొందించిన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు 27 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మంత్రులకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు ఉండగా మంత్రి నారా లోకేశ్పై 17 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన టాప్ 10 అధికార పార్టీల ప్రజా ప్రతినిధుల్లో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.931 కోట్ల సంపదతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నారు.రూ.824 కోట్లతో మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నాలుగో స్థానంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రూ.542 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అతి తక్కువ ఆస్తులు కలిగిన వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15.38 లక్షలతో ఎనిమిదో స్థానంలో ఉండటం గమనార్హం.కేంద్ర మంత్రుల్లో బండి సంజయ్ టాప్.. కేంద్ర మంత్రుల్లో తెలంగాణకు చెందిన బండి సంజయ్ కుమార్పై 42, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై 3, నితిన్ గడ్కరీపై 10, కింజరాపు రామ్మోహన్ నాయుడుపై 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. హరియాణ, జమ్మూ–కశ్మిర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఒక్క మంత్రిపైనా కేసు లేదు. ⇒ తెలంగాణలో క్రిమినల్ కేసులకు సంబంధించి సీఎం అనుముల రేవంత్రెడ్డి (89), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (3), జూపల్లి కృష్ణారావు (3), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (6), దుద్దిళ్ల శ్రీధర్బాబు (5), గడ్డం వివేకానంద (5), కొండా సురేఖ (5), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (13), ఉత్తమ్ కుమార్ రెడ్డి (11), పొన్నం ప్రభాకర్ (7), సీతక్క (6) కేసులు ఉన్నాయి. -
ఏపీలో మెడికల్ కాలేజీల అమ్మకానికి గ్రీన్సిగ్నల్!
విజయవాడ: ఏపీలో మెడికల్ కాలేజీలు అమ్మకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు కేబినెట్. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి సిద్ధమైంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది. -
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
Sajjala Ramakrishna: విజయమ్మ విషయంలో లోకేష్ రాజకీయం..!
-
ఏపీ కేబినెట్కు యూరియా సెగ
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. -
బాబు సర్కార్కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
రైతుల నోట్లో మట్టి.. సిగ్గుపడండి సీఎం, డిప్యూటీ సీఎంకు ఇచ్చిపడేసిన RK రోజా
-
జగన్ తోనే అభివృద్ధి నిజం ఒప్పుకున్న బాబు
-
బాబు సర్కారుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
చంద్రబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే... రాంభూపాల్ రెడ్డి మాస్ కౌంటర్
-
Katasani Rambhupal: రైతులు ఎదురు తిరిగితే ఏం అవుతుంది బాబుకి తెలియాలి
-
ఇక చాలు.. చలనం లేదా నీకు! బాబుపై జగన్ సీరియస్
-
KSR Live Show: రైతుల కష్టాలపై రాజకీయ రాకాసులు..!
-
రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే మీలో చలనం లేదా చంద్రబాబూ?
-
బాబూ.. ఈ ఫొటో నకిలీ అని నిరూపించే దమ్ముందా?: వైఎస్సార్సీపీ సవాల్
సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సహా ఎరువులను సరఫరా చేయలేని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరిన ఫొటోలను పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి నకిలీవని నిరూపించగలరా? అని సవాల్ విసిరింది.‘రైతులకు ఎరువుల సరఫరా విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం ఆక్రోశం! రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంట! ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫస్ట్రేషన్! మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోల సర్క్యులేషన్! మరి ఈ ఫోటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోనే కాదు.. రైతులు క్యూలు కట్టిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు ఇక్కడ పెడుతున్నాం. చంద్రబాబు నిజాలకు పాతర వేసి, బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఇవాళ్టి దృశ్యాలివీ! చేతనైతే వీటిని నకిలీవని నిరూపించండి..!’ అని సవాల్ విసిరింది. రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం @ncbn ఆక్రోశం. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంట. ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫ్రస్టేషన్. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు చేసిన ట్వీట్ ఫొటో ఫేక్ అంటూ పచ్చసైకోల సర్క్యులేషన్. ఈ ఫొటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోయే… https://t.co/dkFKyEEYAv pic.twitter.com/HILCefZooJ— YSR Congress Party (@YSRCParty) September 3, 2025 -
Magazine Story: అన్నదాతల కడుపు కొడుతున్న రైతు ద్రోహి
-
ఇసుక.. సర్కారు మస్కా!
ఉచితం ముసుగులో అడుగడుగునా ఉల్లంఘనలు.. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా కూటమి పార్టీల నేతల జేబులు మాత్రం నిండుతున్నాయి.. మరోవైపు రెట్టింపు ధర చెల్లించి ప్రజలు ఇసుకను కొనుక్కోవాల్సి వస్తోంది.. కాదు, కూడదంటే ఎదురు దాడి.. వేధింపులు.. తప్పుడు కేసులు.. రాష్ట్రంలో ఇసుక విషయంలో జరుగుతున్నది ఇదే. ఈ విషయం ప్రజల్లో చర్చకు వస్తుండటంతో ఎప్పటిలాగే తమదైన శైలిలో కూటమి ప్రభుత్వ పెద్దలు విష ప్రచారానికి తెర లేపారు. దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లు రూ.100 కోట్ల జరిమానా సంగతి కప్పిపుచ్చుకోవడానికి కుప్పిగంతులేస్తున్నారు. ఇసుక ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారో చెప్పండన్న ప్రజల ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. సాక్షి, అమరావతి: ఉచితం ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగింది. వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎక్కడికక్కడ దోచేస్తూ మూడు జేసీబీలు.. ముప్పై టిప్పర్లుగా దందాను కొనసాగిస్తూ గతంలో అక్రమాలు జరిగాయంటూ విష ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా ఇసుక లభించక పోయినా, ప్రభుత్వానికి ఏమాత్రం ఆదాయం రాకపోయినా తన దందాను సమర్థించుకుంటోంది. పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. జేపీ వెంచర్స్ తమ వద్ద రూ.18 కోట్లు ఉంచాలని చెప్పిన విషయాన్ని చిలవలు పలువలుగా వక్రీకరించి జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం జరిగాయి. నాటి సీఎం చంద్రబాబు నివాసం వెనక భాగంలో కృష్ణా నదిని కొల్లగొట్టి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ధృవీకరించింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించడం తెలిసిందే.నాడు అక్రమ తవ్వకాలను బయటపెటి్టన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాఅప్పట్లో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నాయని, వాటిని వెంటనే నివారించాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ఎన్జీటీలో పిటీషన్ వేశారంటే ఇసుక అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో స్పష్టమవుతోంది. ఆయన స్వయంగా ఇక్కడ పర్యటించి అక్రమాలను కళ్లారా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కృష్ణా నది ప్రమాదంలో పడిందని ఆ తర్వాత ఎన్జీటీలో స్వయంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. స్థానిక పర్యావరణ వేత్త అనుమోలు గాంధీ ఇంకా పలువురు కూడా సీఎం చంద్రబాబు నివాసం వెనుక వెంకటపాలెం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల కృష్ణా నది ప్రమాదకరంగా మారిందని పిటీషన్లు వేశారు. అక్రమ తవ్వకాలు నిర్ధారణకృష్ణా నదిలో అక్రమ తవ్వకాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఎన్జీటీ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఉండవల్లి కరకట్టతోపాటు పలు ప్రాంతాలను పరిశీలించి, ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. చంద్రబాబు నివాసం పక్కనే కృష్ణా నది కరకట్టపై నుంచి నదిలోకి వెళ్లి నదీ గర్భంలో 25 మీటర్ల లోతుకు భారీ యంత్రాలతో తవ్వి ఇసుకను తీస్తున్నారని స్పష్టం చేసింది. డ్రెడ్జింగ్ ముసుగులో నిషేధించిన భారీ డ్రెడ్జర్లు, పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల నది కోర్సు ప్రమాదభరితంగా మారిందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అక్రమంగా తవ్విన ఇసుక నిత్యం 2,500 ట్రక్కుల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతోందన్న పిటీషనర్ల వాదన నిజమేనని తేల్చింది. 25 టన్నుల సామర్థ్యం గల ట్రక్కులో 40 టన్నుల ఇసుకను లోడ్ చేసి అమ్ముకుంటున్నారని స్పష్టం చేసింది. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా వేయాలని కమిటీ సూచించడంతో ఎన్జీటీ న్యాయమూర్తి రూ.100 కోట్ల జరిమానా విధించారు. ఎన్జీటీ జరిమానా వేసిన కొద్ది రోజులు తవ్వకాలు ఆగినా, మళ్లీ యథావిధిగా ఇసుక తవ్వకాలు సాగించి దందా కొనసాగించారు. వైఎస్ జగన్ హయాంలో పారదర్శక విధానం.. ప్రభుత్వానికి ఆదాయం 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇసుక అక్రమాలను నిరోధించేందుకు పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. ఉచితం మాటున అడ్డగోలు దోపిడీ ప్రస్తుతం ఉచితం మాటునే ఇసుక అమ్మకాలు జరుగుతుండగా, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఇసుక దోపిడీ అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు. అదేమంటే ఇది ఉచిత ఇసుక విధానం, డబ్బు కడితేనే ఉచిత ఇసుక ఇస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఇసుకను స్థానికులు ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పినా, టీడీపీ నేతలు అసలు ఎవరినీ రీచ్ దగ్గరకే రానీయడం లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలు కంటే కూడా అధిక ధరకు అమ్ముతుండడం గమనార్హం. విజయవాడలో 22 టన్నుల లారీ ఇసుక రూ.40 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వ రాకతో మళ్లీ అక్రమాలు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆయా ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్ముకున్నారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.రూ.100 కోట్ల జరిమానా విధించిన చోటే మళ్లీ అక్రమ తవ్వకాలు 2019 ఏప్రిల్లో చంద్రబాబు హయాంలో ఆయన ఇంటి వెనుక భాగంలో కృష్ణా నదిలో అక్రమాలకు పాల్పడినట్లు ఎన్జీటీ నిర్ధారించి, జరిమానా విధించిన చోటే ప్రస్తుతం అదే రీతిలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి. బల్లకట్టు నావిగేషన్ ఛానల్ ముసుగులో డ్రెడ్జింగ్ చేస్తూ అప్పటి మాదిరిగానే ఒక అనామక సంస్థకు టెండర్ కట్టబెట్టి చినబాబు మనుషులు నిత్యం వేలాది టన్నుల ఇసుకను కరకట్ట మీదుగా భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. రూ.వందల కోట్ల ఇసుకను తవ్వి అమ్మేసుకుంటున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. అదేమంటే అంతా సక్రమంగానే జరుగుతున్నట్లు గనుల శాఖ దబాయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అదే దందాూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక ముసుగులో అక్రమాల పర్వం యథేచ్చగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారం సాగిస్తున్నారు. » గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా అనుమతి లేని రీచ్ల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సి ఉండగా ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుక రూ.30 వేల నుంచి 60 వేల వరకు అమ్ముతున్నారు. » ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు నుంచి హైదరాబాద్కు, అనంతపురం జిల్లా సరిహద్దు నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్ని చోట్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు చినబాబుకు ఠంఛనుగా చేరిపోతున్నాయి. చినబాబుకు కప్పం కట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను కప్పిపుచ్చేందుకే జేపీ వెంచర్స్కు ఎన్జీటీ జరిమానా విధించిందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. -
AP: మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్మేందుకు కుట్ర
-
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
‘జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్కు భయం’
సాక్షి,గుంటూరు: 9వ తేదీన రైతుల తరుఫున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్నీ ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరుఫున వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో లోకేష్ పోస్టు చేసి ప్రేలాపనలు పేలుతున్నారు.లోకేష్.. మీ బాబాయిని సంకెళ్లతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు. దౌర్భాగ్యమైన పద్దతుల్లో చంద్రబాబు,లోకేష్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా వైఎస్ జగన్పై మీరు బురదజల్లే పనిలో ఉన్నారు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అధికారం శాశ్వతం కాదు. వైఎస్ జగన్ మీద బురదజల్లడం మానుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు,లోకేష్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. -
పవన్.. మీరు ఉప్పు, కారం తినడం లేదా?
సాక్షి,కాకినాడ: ఊగిపోయి మాట్లాడావు కదా.. ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ,లాభంలేదని చంద్రబాబు బుర్రలో ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా ఎందుకు దొరుకుంతుంది? కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా ఎందుకు దొరకడం లేదు. 9వ తేదీన రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం. ఆర్డీవో ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తాం. 32మంది బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కుపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. విశాఖ ఉక్కుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విశాఖ ఉక్కు గురించి సీఎం,డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు. పవన్ కల్యాణ్ ఉగిపోయి మాట్లాడావు కదా.. ఏమైందీ మీ పౌరుషం. ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యచరణ ఏంటీ? పవన్.. మీరు ఉప్పు కారం తినడం లేదా?. ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు. 15నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.2లక్షల కోట్లు అప్పు చేసిందని’ వ్యాఖ్యానించారు. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు ఎంపీ మిథున్ రెడ్డి నాతో ఏం చెప్పారంటే..
-
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
Amarnath: 5 సంవత్సరాల పరిపాలన ముందు.. నీ 30 సంవత్సరాల అనుభవం జీరో
-
Lakshmi Parvathi: వెన్నుపోటుకు 30 సంవత్సరాలు... అందుకే ఈ సంబరాలు
-
కంఫర్ట్ జోన్లోనే పవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య. చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది. 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు. ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు. చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నీ సవాల్ కి నేను రెడీ.. మైక్ ఇచ్చే దమ్ముందా..?
-
ఇదేం పరిపాలన అయ్యా.. బాబు, పవన్ కు పేర్ని కిట్టు ఛాలెంజ్
-
సీఎం అయ్యి వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తాడు.. బాబుకు అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
బాబు డైవర్షన్ డ్రామా.. జగన్ ప్రజల్లోకి వెళ్తే నా పరిస్థితి అంతే
-
జగన్ దమ్ము గురించి నువ్వా మాట్లాడేది
-
బాబు మరో రికార్డు.. అప్పుల్లో ఏపీ
-
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు. చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం
-
బాబు నీ సవాల్ కు నేను రెడీ.. ఆ దమ్ము నీకుందా
-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
‘ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది..’ – పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ ‘2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్సీపీ 35వేల మెజార్టీతో గెలిచింది’ – వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకనే ఓటు వేసుకునే స్వేచ్ఛను ప్రజలకు టీడీపీ కల్పించడం లేదని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అది మరోసారి స్పష్టమైందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల అరాచకాలు.. ఓటర్లను అడ్డుకుని టీడీపీ గూండాలు బెదిరింపులకు పాల్పడటాన్ని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లె వెళ్తూ నల్లపురెడ్డిపల్లె వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ గూండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయిన నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు పోలింగ్ రోజు అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అధికార పక్ష నేతల అరాచకాలను కళ్లకు కడుతూ గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇలాగే చేశారు.. ఆ తర్వాత టీడీపీ కొట్టుకుపోయింది..‘ఆ రోజు.. నల్లపురెడ్డిపల్లెలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసి పోలీసులను వాడుకుని టీడీపీ గూండాలు ఎలా జులుం చేశారో, ఏ రకంగా అన్యాయం చేశారో గ్రామంలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న పరిస్థితుల్లో... నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ జగన్ రుణపడి ఉంటాడు. మీ ఆప్యాయత, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.గతంలో 2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్సీపీ 35 వేల మెజార్టీతో గెలిచింది. అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినా దేవుడు అన్నీ చూస్తాడు. టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతాడు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది’ అంబకపల్లె చెరువు వద్ద జలహారతి.. వైఎస్సార్సీపీ కృషితో అంబకపల్లెకు కృష్ణా జలాలు చేరుకున్న నేపథ్యంలో అక్కడి చెరువు వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ జలహారతి ఇచ్చారు. ‘పాడా’ నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్పురం వద్ద భారీ సంపు ఏర్పాటు చేసి 4.5 కి.మీ. మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేయించారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తంచేశారు.అక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రహదారిపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. క్రేన్ సహాయంతో వైఎస్ జగన్కు భారీ గజమాల వేశారు. బాణాసంచా కాలుస్తూ డప్పుల దరువుతో గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరి అభిమాన నేతకు స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. కృష్ణా జలాల మ్యాప్ను వైఎస్ జగన్ పరిశీలించి చెరువు శిలాఫలకాన్ని ప్రారంభించారు. తరలివచ్చిన పులివెందుల పల్లెలు.. 47 కి.మీ. ప్రయాణానికి 6 గంటలుఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి అంబకపల్లెకు వైఎస్ జగన్ వస్తున్నట్లు తెలియడంతో ఆ మార్గంలోని పులివెందుల పల్లెలన్నీ రోడ్డుపైకి వచ్చి ఆయన కోసం వేచి చూశాయి. వీరన్నగట్టుపల్లెతో మొదలు పెడితే కుమ్మరాంపల్లె, చింతరాంపల్లె, వేంపల్లె, నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నగారిపల్లె, అయ్యవారిపల్లె, గొందిపల్లె, వి.కొత్తపల్లె, వేముల, భూమయ్యగారిపల్లె, వేల్పుల, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె, నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె తదితర గ్రామాల ప్రజలంతా సమీపంలోని రోడ్డుపైకి వచ్చి నిరీక్షించారు.దారి పొడవునా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ జగన్ ముందుకు కదిలారు. 47 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 6గంటలు పట్టడం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ఉ.9గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ అంబకపల్లెకు చేరుకునేందుకు సా.3 గంటలైంది. -
రాజధానికి అవసరమైతే భూసేకరణ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాజధాని మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా భూ సేకరణ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ 52వ సమావేశం జరిగింది. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా నదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి టూరిజాన్ని ఆకర్షించేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎనీ్టఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహదపడుతుందన్నారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలకు భూములిచ్చేందుకు సీఎం అంగీకరించారు. రాష్ట్రంలో మరో 4 పోర్టుల నిర్మాణం రాష్ట్రంలో 6 పోర్టులు ఉండగా.. లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి కోసం మరో 4 పోర్టులను ప్రభుత్వం నిరి్మస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈస్ట్కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. 62 కార్గో హ్యాండ్లింగ్ సంస్థల సీఈవోలతో జరిగిన సమావేశానికి హాజరై స్టార్టప్ స్టాళ్లను పరిశీలించారు. ఎరువుల విషయంలో ఆందోళన వద్దు ఎరువుల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై సీఎం బాబు సమీక్షించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
Ys Jagan: రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలేదు
-
బాబు విజన్.. ఒక్క రోజే రూ.5వేల కోట్ల అప్పు
సాక్షి,అమరావతి: తొలి అడుగు అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ, దీనికి విరుద్ధంగా ‘అప్పుల పాలనలో సర్కార్ అడుగులు’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కారు తీరు. మంగళవారం మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పుల సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2లక్షల వేల కోట్లకు చేరాయి.చంద్రబాబు సర్కార్ మంగళవారం మరో రూ.5వేల కోట్లు అప్పుగా తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులను సమీకరించింది. ఇలా 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.2 లక్షల 9 వేల కోట్ల అప్పు చేసింది. తద్వారా ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా అప్పులు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది.సూపర్ సిక్స్ ప్రధాన హామీలు అమలు చేయని చంద్రబాబు..రికార్డ్ స్థాయిలో అప్పులు తీసుకొస్తుంది. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్గా చంద్రబాబు ప్రభుత్వం నిలిచింది. -
సాక్షిపై దాడులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘తొలుత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. -
రైతుకు పీకల్లోతు నష్టం.. నీ హెరిటేజ్ కి మాత్రం కోట్లలో లాభం..
-
అర్ధరాత్రి ఆటోనగర్ సాక్షి ప్రధాన కార్యాలయానికి పోలీసులు
-
బాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా?: వైఎస్ జగన్
కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి, చీనీ బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమను సర్కార్ ఆదుకున్నదని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక, అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఎరువుల బ్లాక్ మార్కెట్ను ప్రొత్సహిస్తోంది. కానీ, మా హయాంలో ఏనాడూ ఎరువులు బ్లాక్లో అమ్మలేదు. ఇప్పుడు రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ క్వింటా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. ఉల్లికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ రూ.4 నుంచి రూ.12 వేలు క్వింటాల్ అమ్ముడుపోయింది. నేడు రైతుకు క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి కనీసం రూ.800 లకు కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్ బాగలేకపోతే క్వింటా రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటా నాలుగైదు వందలకు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2500 చొప్పున ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు కానీ, రైతుబజార్ల ద్వారా కానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరటేజ్లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. ఇదే రైతుకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి, చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35 కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి, ఇదీ ప్రభుత్వ పరిస్థితి. అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కనీసం రూ.3వేలకు కూడా కోసే వారు కనిపించడం లేదు. గత వైయస్ఆర్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30వేలకు రైతులు అమ్ముకున్నారు.యూరియా కూడా అందించలేకపోతున్నారువైయస్ఆర్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి లేదని.. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని.. తద్వారా కమీషన్లు, బ్లాక్ లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రెండు వందల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా హయాంలో రూ.265 రూపాయలకు యూరియా బ్యాగ్ లభించేది. తమ గ్రామంలోనే యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు రైతుకలు అందుబాటులో ఉండి పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వీరి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్లు రావని, బ్లాక్ మార్కెట్ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము ఇలా ఏ పంటచూసినా రేటు లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు పెట్టుబడి సాయం చూస్తే, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్ళకు ఇరవై వేల చొప్పున రూ.40 వేలు ఇవ్వాల్సి వున్నా ఇంత వరకు ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు’’ అని జగన్ మండిపడ్డారు. -
న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్!
ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్షీట్పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్షీట్లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది? చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది. స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కోర్టువారు సైతం ఈ అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్షీట్లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్లు, ఛార్జ్షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్హౌస్లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్చుప్! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. సిట్ వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన ప్రజలు
సాక్షి, అమరావతి సాక్షి, రాయచోటి: ‘‘తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మీలో రావాలి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఎమ్మెల్యేలైనా సరే తప్పు చేశారని భావిస్తే నిలదీయండి’’ అని సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించి సంక్షేమం అందిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి... సరిగ్గా 30 ఏళ్ల క్రితం తాను తొలిసారి సీఎంగా ప్రమాణం చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో సోమవారం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.అంతకుముందు ములక్కాయలపల్లెలో వృద్ధురాలికి పింఛన్ పంపిణీ, బోయినపల్లిలో ధోబీఘాట్ను సందర్శించి రజకులతో మాట్లాడారు. తర్వాత రాజంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 30 ఏళ్లలో ఏనాడూ తాను విశ్రమించలేదన్నారు. నిద్రలేచింది మొదలు మిషన్ తరహాలో పనిచేస్తున్నానని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్తో రక్తం పారిందని, నేడు నీళ్లు పారిస్తున్నానని పేర్కొన్నారు. కాగా, ప్రజా వేదికపై సీఎం ప్రసంగం జనంలో విసుగుతెప్పించింది. తన గురించి గొప్పలు పోవడం ప్రజల సహనానికి పరీక్ష పెట్టింది. దీంతో చాలామంది వెనుదిరిగారు. వలంటీర్లు చెబుతున్నా పట్టించుకోలేదు. ఖాళీ కుర్చీలు కనిపించాయి.గతాన్ని గుర్తుపెట్టుకోవాలి గతాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలని, ఆ స్ఫూర్తితో భవిష్యత్కు ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలని, నేటి అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 ఏళ్లు అయిన సందర్భంగా చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం పలువురు అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలనా అంశాలు, ప్రజా సేవల విషయంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సీఎం చంద్రబాబు తన అనుభవాలు పంచుకున్నారు. ఇన్పుట్ సబ్సిడీ విధానం తెచ్చింది నేనే.. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదని, భయపడితే అక్కడే ఆగిపోతామని సీఎం చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరవుండేదని, దీంతో నాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. తొలిసారి ఈ విధానాన్ని తెచ్చింది తానేనన్నారు. అవ్వను వెళ్లగొట్టేశారు.. తన మనుమరాలికి పింఛన్ రాకపోవడంతో సీఎంకు మొరపెట్టుకునేందుకు వచ్చిన అమ్మమ్మరాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటకు సీఎం చంద్రబాబు వస్తుండటంతో మానసిక వికలాంగురాలైన తన మనుమరాలికి పింఛన్ ఇప్పించుకుందామని వచ్చిన అవ్వను పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 23 ఏళ్ల ఆశా భాను పుట్టుకతో మానసిక వికలాంగురాలు. అయినా ఆమెకు పింఛన్ రావడం లేదు.సోమవారం రాజంపేట మండలం ములక్కాయపల్లెకు వస్తున్న సీఎం చంద్రబాబుకు విన్నవిస్తే న్యాయం జరుగుతుందని ఆ మానసిక వికలాంగురాలి అమ్మమ్మ ఆశపడింది. చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే ఇంటి వద్దకు వెళ్లింది. అయితే పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో పసిబిడ్డలా ఉన్న తన మనవరాలి చేతులపై మోసుకుంటూ రోదిస్తూ వెనుదిరిగి వెళ్లడం చూపరులను కలచివేచింది. -
మాట నిలబెట్టుకుంటారా.. లేదా?
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చినమాట నిలబెట్టుకోకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఓపీఎస్ పునరుద్ధరణ తమ భవిష్యత్తుకు, తమ కుటుంబ భద్రతకు తప్పనిసరని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఆరి్థకనష్టం కలిగించే సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది ఉద్యోగులు విజయవాడలోని ధర్నాచౌక్కు తరలివచ్చారు. ఓపీఎస్ పునరుద్ధరించాలని, చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ సభలో అతిథిగా పాల్గొన్న ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు పూర్తి సంఘీభావం తెలిపారు.సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేంతవరకు సీపీఎస్ ఉద్యోగుల ప్రతి ఆందోళనకు మద్దతు ఇస్తామని చెప్పారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి అంకితభావంతో సేవలందిస్తున్న ఉద్యోగులను మార్కెట్కి వదిలేయడం అన్యాయమని చెప్పారు. ఉద్యోగి ఎంత కష్టపడినా, చివరికి మార్కెట్ పరిస్థితుల మీదే అతడి వృద్ధాప్యం ఆధారపడుతోందని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే సీపీఎస్ ఉద్యోగులతో చర్చించి వారికి ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానాన్ని ప్రకటిస్తామని కూటమి హమీ ఇచ్చిందని, ఈ అంశాన్ని వారి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టారని తెలిపారు. కానీ 18 నెలలు పూర్తయినా ప్రభుత్వం చర్చల ప్రతిపాదనే చేయలేదన్నారు. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసేందుకు అనేకసార్లు ప్రయతి్నంచినా తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు.సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్.మరియదాసు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయలు చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సీపీఎస్ ఉద్యోగులకు అమలు చేస్తున్న అనేక మెమోలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తోందని చెప్పారు. పాత పెన్షన్ విధానం జీవితకాల భద్రతను కల్పించేదని, కొత్త విధానం మార్కెట్ ఆధారంగా ఉండటం వల్ల స్థిరత్వం లేదని పేర్కొన్నారు.జీతంలో భాగాన్ని ఉద్యోగులు స్వయంగా కాంట్రిబ్యూట్ చేయాల్సి రావడం, రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పెన్షన్ హామీ లేకపోవడం వల్ల కుటుంబ భవిష్యత్ అస్థిరంగా మారుతోందని చెప్పారు. సంవత్సరాల తరబడి సేవచేసిన ఉద్యోగులు వృద్ధాప్యంలో కనీస భద్రత కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పాండురంగశర్మ, హృదయరాజు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, సీపీఎస్ఈఏ నాయకులు రాజే‹Ù, రవికుమార్, అప్పలనాయుడు పాల్గొన్నారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఛలో విజయవాడలో భాగంగా ధర్నాచౌక్లో ధర్నా చేసిన తర్వాత అక్కడి నుంచి బందరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగులు కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. కానీ పోలీసులు.. ర్యాలీకి అనుమతి లేదంటూ ధర్నాచౌక్ నుంచి వారిని కదలనీయలేదు. దీంతో వేలాదిగా వచ్చిన ఉద్యోగులు అక్కడే నినాదాలతో హోరెత్తించారు. చెవిలో పూలతో టీటీడీ ఉద్యోగుల ధర్నా సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ తిరుపతి అన్నమయ్యసర్కిల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీటీడీ పరిపాలన భవనం వద్ద టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్, సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2004 తరువాత చేరిన ఉద్యోగులకు సీపీఎస్ విధానం వర్తిస్తుందంటూ పాలకులు ఉద్యోగుల మధ్య విభజన తీసుకొచ్చారని విమర్శించారు. ఆ చట్టంలోనే ప్రస్తుతం పాత పెన్షన్ స్కీమును ఎప్పుడైనా సమీక్ష చేస్తామంటూ హామీ ఇచ్చారని, అయితే ఈ విధానం ఆయా రాష్ట్రాల పరిధికి వదిలేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆవేదన చెందారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు నోరుమెదపడం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్, నైనార్ పద్మనాభం, ధారా రవికుమార్, ఆవుల నరే‹Ù, కిరణ్ కుమార్, పి దయాకర్, ఆర్ వేణుగోపాల్, కోనేటి బాలాజీ, ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి, ఇందిరా, ప్రతిభా భారతి, శకుంతల, గౌరి, డి యుగేందర్, ఎస్ వెంకటముని రాజు,పయ్యావుల రాజశేఖర్, బి.హనుమంత రెడ్డి, చలపతి పాల్గొన్నారు. -
TJR Sudhakar: ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
-
‘వెన్నుపోటుదారుడిని మహా నాయకుడిగా చెప్పుకోవడం సిగ్గుచేటు’
తాడేపల్లి : టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబని, వ్యవస్థలను మేనేజ్చేసి సీఎం అయిన నీచ చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. అధికార కూటమి కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనేనని, రాజ్యాంగ బద్ధంగా ప్రజల సమస్యలపై చర్చించే టైమ్ ఇవ్వమని అడుగుతున్నా చంద్రబాబు చలించడం లేదన్నారు. వైఎస్ జగన్ను చూస్తే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.‘కాంగ్రెస్ నుండి వచ్చిన చంద్రబాబు.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. భార్యతో రికమెండేషన్ చేయించుకుని టీడీపీలో చేరిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలు గెలిపించుకున్న ఎన్టీఆర్ని కుట్రతో పదవి నుండి తొలగించిన రోజు ఇది. అక్రమంగా పదవి పొందిన చంద్రబాబు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎలా పండుగ చేసుకుంటున్నారు?, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి రోజును పండుగ చేసుకోవాలంటున్న చంద్రబాబుకు మానవత్వం ఉందా?, అనాటి ఘోరం ఈనాటి తరానికి తెలియక పోవచ్చు. గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేల బలం చూపించకుండానే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. వెన్నుపోటుదారుడిని మహా నాయకుడుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు?, కాంగ్రెస్లో ఓడిపోయి ఎన్టీఆర్ దగ్గరకు కుట్రతోనే చేరారు. ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఆరోజు చంద్రబాబుకు మద్దతు లేదుఆ తర్వాత మరిన్ని కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో ఏం జరిగిందో దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయట పెట్టాలి. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని ఎన్టీఆర్ పదేపదే కోరినా స్పీకర్ యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని స్త్రీ లోలుడుగా ఎల్లోమీడియా చిత్రీకరించింది. కుటుంబ సభ్యులు కనీసం భోజనం కూడా పెట్టలేదు. సంప్రదాయాల ప్రకారమే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్వనాశనం చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టే ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉండనిచ్చారుదేశ చరిత్రలో వెన్నుపోటు అనే పేటెంట్ చంద్రబాబుకే ఉంది. ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇచ్చిన హామీలను అమలు చేయాలేనప్పుడు ఎందుకు ఇచ్చారు?, చంద్రబాబు అంటేనే ఫేక్ ఫేక్. రాజధాని రైతుల కడుపు కొట్టిన వ్యక్తి చంద్రబాబు. హైవే మీద నుండి రాజధానికి వెళ్లటానికి ఇప్పటికీ రోడ్డు లేదు ఎవరిని చూసినా చంద్రబాబు భయపడుతున్నారు. తనలాగే తనకు కూడా ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమోనని చంద్రబాబు భయపడిపోతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే సూపర్ సిక్స్ సహా అనేక హామీల గురించి ప్రశ్నిస్తారని చంద్రబాబుకు భయం’ అని విమర్శించారు. -
ఆడబిడ్డ ఏడుపు మీకు కనిపించట్లేదా ? సుగాలి ప్రీతి కేసుపై ఎక్కడ?
-
Vellampalli Srinivas: వరద బాధితుల పై లాఠీ ఛార్జ్ చేసిన ఘనత మీదే..
-
సంబరాల బాబూ.. బుడమేరు ప్రక్షాళన ఏమైంది?
సాక్షి, తాడేపల్లి: విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఏడాది గడిచినా నష్ట పరిహారం ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీశారన్న వెలంపల్లి, పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం సీఆర్డీఏకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సంబరాలు దేనికి చంద్రబాబూ..? చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు తాను తొలిసారి సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయిపోయిందని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు.గతేడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీట మునిగినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు నగరంలో తిరిగి ఫొటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గానీ ఏడాది పూర్తయినా బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదు.సీఎం అయ్యి 30 ఏళ్లయిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలి. గతేడాది వరదలొచ్చినప్పుడు బుడమేరు ఆధునికీకరణ పనులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. రాత్రింబవళ్లు అక్కడే నిద్ర చేసి వరద ముంపు సమస్యను పరిష్కరించానని ప్రచారం చేసుకున్న మంత్రి రామానాయుడు, బుడమేరు ఆధునికీకరణ పనులపై ఆ తర్వాత కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. బుడమేరు ప్రక్షాళన ఏమైందో ఆయన సమాధానం చెప్పాలి.రూ.6800 కోట్ల నష్టం జరిగితే.. ఏ మేరకు సాయం చేశారు..? వరదల కారణంగా నష్టపోయిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడామని, ఇంట్లో పాడైపోయిన ఎలక్రిక్ వస్తువుల కోసం ఎలక్ట్రిసిటీ కంపెనీలను సంప్రదించామని వారితో మీటింగ్లు పెట్టిన సీఎం చంద్రబాబు.. బాధితులకు మాత్రం పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. స్కూటర్లు, ఆటోలు కొత్తవి ఇవ్వలేదు సరికదా కనీసం ఉచితంగా రిపేర్ కూడా చేయలేదు. ఇంట్లో బురద కడగడానికి ప్రభుత్వమే మనుషులను పంపిస్తుందని చెప్పినా సొంతంగానే ఎవరికి వారే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సర్వే పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులను వదిలేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు డోర్ లాక్ అని రాసుకుని వెళ్లారు. మీ ఇళ్లలో వారం రోజులు నీళ్లు నిలవలేదు కాబట్టి సాయం ఇవ్వలేమని అడ్డగోలు కండిషన్లు పెట్టి వరద బాధితులను ఈ ప్రభుత్వం హేళన చేసింది.ప్రచారంలో మాత్రం డ్రోన్లతో ఇంటింటికీ సాయం అందించామని చెప్పుకున్నారు. సుమారు 2.68 లక్షల కుటుంబాలను వరద ముంచేసిందని దాదాపు రూ.6800 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. వరద బాధితుల సహాయార్థం దేశవిదేశాల నుంచి దాతలు స్పందించి దాదాపు రూ. 400 కోట్లకుపైగా విరాళాలు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. మరీ దారుణంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పెరుగన్నం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపించి కూటమి ఎమ్మెల్యే భారీగా దొచుకుతున్నారు. కుమ్మరిపాలెంలో వరద సాయం కోసం మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే దారుణంగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.విజయవాడను గాలికొదిలేశారు:పేరుకేమో అమరావతి రాజధాని, కానీ ఎక్కడా కాలవల్లో కనీసం పూడికలు తీయడం లేదు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్క సీఆర్డీఏకి మాత్రమే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థల సమస్యల మీద ఆయన ఇంతవరకు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పేరు చెబితే లిక్కర్ షాపులు తప్ప ఏ ఒక్క పథకం కూడా గుర్తురాదు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందని వినాయకుడి మండపంలో నిలబడి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. విజయవాడ వరదల పాపం చంద్రబాబుదే. ఆయన నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ మునిగిపోయింది. తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేశాడు. ఇప్పటికైనా బుడమేరు వాగును ప్రక్షాళన చేసి ఆధునికీకరణ పనులను తక్షణం పూర్తి చేయాలి. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. -
ఏడాది దాటినా తీరని బుడమేరు కష్టాలు..
-
దేవుడి ముందూ రాజకీయమేనా బాబు!
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భం ఏదైనా రాజకీయం మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించకుండానూ ఉండలేరు. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. వినాయక చవితి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా భక్తి పూర్వకంగా నేతలు పూజలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన ఇంట్లో పూజలు చేశారో లేదో తెలియదు కానీ.. విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. తప్పేమీ లేదు కానీ.. ‘దొంగ దండాలు పెట్టిన వారిని వినాయకుడు క్షమించడు. వాళ్ల సంగతి చూస్తాడు’ అన్నారట. ఎవరు దొంగ దండాలు పెడతారు?. జనాన్ని మోసం చేసేవారు కదా!. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని నేరవేర్చకుండా ప్రజలను ఆయన మోసం చేస్తుంటారని జగన్ తరచుగా చెబుతుంటారు.కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్ల కోతపై ఒక కామెంట్ చేస్తూ చంద్రబాబు జీవితం అంతా మోసాల మయం అని, మాట మీద నిలబడని వ్యక్తి అని ధ్వజమెత్తారు. బహుశా వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇలా విమర్శించి ఉండవచ్చు. ఎల్లో మీడియా ఈ కథనాన్ని కాస్తా చాలా ప్రముఖంగా ప్రచురించింది. వెళ్లిందేమో దైవ దర్శనానికి.. మాట్లాడిందేమో ఇలాంటి మాటలు! ఆయన ధోరణే అంత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తూంటారు. అందుకే సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎక్కడపడితే అక్కడ జగన్ నామ జపం చేస్తుంటారు. అవి అభ్యంతరకరమైన పదాలతో ఉండకపోతే ఆయనకు తృప్తిగా అనిపించదేమో మరి. పారిశ్రామికవేత్తల వద్ద కూడా జగన్ను భూతం అనడం చూస్తుంటే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం చంద్రబాబును పీడిస్తున్నట్లు ఉంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. సీఎం హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టమని తెలిసినా ఆయన పట్టించుకోకపోవడం!.గత ఏడాది ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినప్పటికీ.. చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే జగన్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఏకంగా 49 లక్షల ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంలతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడకుండా.. కేవలం జగన్పై విమర్శలకు మాత్రమే పరిమితం కావడాన్ని చూస్తే.. ఆ వ్యవహారాలన్నీ నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉండదేమో అన్న ఆందోళనతో జగన్ను బద్నాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. వైఎస్ జగన్ ఎప్పుడూ తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్తో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 150 హామీలు ఇచ్చినప్పుడు వాటి అమలు సాధ్యం కాదని జగన్ కుండబద్ధలు కొట్టారు. అలాంటి హామీలు తాను ఇవ్వలేనని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు వంద శాతం నెరవేర్చిన ఘనత జగన్ది. అందువల్ల ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్లు ఎప్పుడూ మేనిఫెస్టో ఊసే తీసుకురారు. పైగా హామీలు నెరవేర్చుతున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ మహిళలను ఊరించారు. తీరా చూస్తే కేవలం ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేశారు.అదే టైమ్లో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనలకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి, దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండీషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధులలోకి వచ్చి పోరాడారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. వీటిని ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగ దండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. జగన్కు దొంగ దండాలు పెట్టవలసిన అవసరం ఏముంది?. ఆయన ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఎక్కడకు వెళ్లినా పవిత్ర భావంతోనే ఉంటారు. చివరికి ఎవరి నుంచైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు.అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాన్ని దెబ్బతీశారు. అందువల్ల దైవ దర్శనానికి ఎవరు వెళ్లినప్పుడు చిత్తశుద్దితో నమస్కారాలు చేస్తారు? ఎవరు దొంగ దండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా జగన్ ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరు.చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలు ఉన్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారా అంటే అదీ అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండానే పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. చర్చికి వెళ్లి ఏసును నమ్మితే విజయమే అని అనగలరు. మళ్లీ ఆ మతాచారాలను పాటించే వారిలో కొంతమందిని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మతం పేరు పెట్టి విమర్శించగలరు. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని కామెంట్ చేశారు. ఇక జగన్ పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైమ్లో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటివారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతమనే కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.. -
నిరుద్యోగంలో మూడో స్థానంలో ఏపీ
-
వెన్నుపోటు అన్న పదమే వినబడకుండా...
నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. అందు కోసం ఆయన విద్యార్థి దశ నుంచే కలలు కనేవారు. చివరకు, ఇరవై మూడేళ్లుగా తాను కంటున్న కలలు నెరవేరే అవకాశం ఆసన్నమైంది. నమ్మిన మామగారికి వెన్ను పోటు పొడిచి, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు 1995 ఆగస్టు నెల చివరి తొమ్మిది రోజుల్లో అనూహ్యమైన విధంగా వ్యూహాలు పన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులను ఉచ్చులోకి లాగారు. వామపక్షాలకు సైతం ఎరవేసి, తన వైపు తిప్పుకున్నారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా, ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా, ‘వెన్నుపోటు’ అనే పదమే మీడియాలో కనబడకుండా పావులు కదిపి, తన మామగారిని పదవి నుంచి దింపి, తాను అందలం అందుకున్నారు.1995 ఆగస్టు 31 (గురువారం)ఎన్టీఆర్ ఆగస్టు 31న విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీ నామా చేశారు. ఆ రోజు ఉదయం ఆయన ఆదేశాల మేరకు సీఎం కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. రాజ్ భవన్కు వెళ్లేందుకు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ తన నివాసంలో బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ వంటి వారితో ముచ్చటిస్తున్నారు. వారితో మాట్లాడుతూనే ఎన్టీఆర్ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనను వెంటనే దగ్గరలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. తనను ఆస్పత్రిలో కలుసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనను గవర్నర్కు చీఫ్ సెక్రటరీ రాజాజీ తెలియజేశారు. అందుకు అంగీకరించిన గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి, ఎన్టీఆర్ను పరామర్శించారు. ఎన్టీఆర్ ఆయనకు రాజీనామా లేఖ అందించారు. (అయితే తాను గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వ లేదనీ, మంచంపై ఉన్న తన చేతిలోంచి గవర్నరే లేఖను తీసుకు న్నారనీ ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆయన మాటలను న్యాయస్థానం, ప్రజలు విశ్వసించలేదు.)కీలకమైన విశ్వాస తీర్మానం రోజున ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అభిమాను లనూ, మద్దతుదారులను విషాదంలో ముంచెత్తివేసింది. ధైర్యమే ఊపిరిగా, పోరాటమే నైజంగా తల ఎత్తుకుని బతికిన ఎన్టీఆర్ చివ రకు ఇలా అస్త్రసన్యాసం చేశారు.ఆ మరుసటి రోజు, అంటే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా పదవులు చేప ట్టారు. వీరిలో హరికృష్ణ కూడా ఒకరు. (అప్పటికి శాసనసభలోగానీ, శాసన పరిషత్తులో గానీ ఆయన సభ్యుడు కారు. నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. అయితే హరికృష్ణ మంత్రివర్గంలో కొనసాగడం ఇష్టం లేని చంద్రబాబు ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి, హరికృష్ణ పోటీ చేసేందుకు వీలులేని పరిస్థితులు సృష్టించారు. దీంతో హరి కృష్ణ మంత్రి పదవి ఊడిపోయింది.)పత్రికాధిపతి రామోజీరావు తన సతీమణితో కలసి ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ దంపతులను కలసి పరామర్శించారు. ఎప్పుడూ తెరవెనుకనే ఉండి కథ నడిపించే రామోజీరావు ఈసారి తెర ముందుకు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తననూ, తన భార్యనూ కించపరుస్తూ ‘ఈనాడు’లో కార్టూన్లు వేయించినా, తన ప్రతిష్ఠను మంట కలుపుతూ వార్తా కథనాలు ప్రచురించినా, అవేవీ మనసులో పెట్టుకోకుండా, రామోజీ దంపతులను ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించారు.ఇంత జరిగినా ఎన్టీఆర్ తన బాధను బయటకు కనిపించ నివ్వలేదు. రోజులాగే మరునాడు తెల్లవారుజామునే లేచి దైనందిన కార్యక్రమాలు ముగించుకుని, తనను కలవడానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్ రావు, సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్లతో సమా వేశమయ్యారు. ఆ రోజు సెప్టెంబర్ 1. అప్పటికి ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అది ఎన్టీఆర్కు ముఖ్యమంత్రిగా చివరి రోజు.అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసి ఉండాల్సింది: పాల్కీవాలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది నానీ పాల్కీవాలా... ఎన్టీరామారావుకు ఓ లేఖ రాశారు. అప్పటికి ఎన్టీఆర్ రాజీనామా చేసి రెండు వారాలైంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరినైనా ఆహ్వానించే అధికారం గవర్నర్కు ఉన్నా, అప్పటికే చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి అధ్యక్ష హోదాలో ఉన్న ఎన్టీఆర్ బహిష్కరించినందు వల్ల, అదే పార్టీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబును ఆహ్వానించటం చట్టరీత్యా తప్పని పాల్కీవాలా అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ రద్దుకు ఎన్టీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా ఒక ప్రహసనం, ఒక మోసమని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అభిప్రాయ పడ్డారు. ఆయన ‘ది హిందూ’ దినపత్రికలో 1995 సెప్టెంబర్ 4న రాసిన ఒక వ్యాసంలో బ్రిటిష్ పార్లమెంటరీ రాజకీయ సూత్రాలనే మనం పాటిస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.‘ది హిందూ’ దినపత్రిక 1995 సెప్టెంబర్ 1న రాసిన సంపాద కీయంలో... తెలుగుదేశం పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు చంద్రబాబుకి ఉన్నప్పటికీ, అంతకు ఏడాది ముందు 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారన్న సంగ తిని ప్రముఖంగా ప్రస్తావించింది.ఆగస్టు సంక్షోభం... ఉపసంహారంఎన్టీఆర్ జీవిత చరమాంకం ఎన్నో ఒడుదొడుకులకు లోనైంది. పిలిచి పిల్లనిచ్చి, పార్టీలో పదవులిచ్చి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే, అధికార దాహంతో అల్లుడు తనకే వెన్నుపోటు పొడవడాన్ని ఆ వృద్ధ నేత తట్టుకోలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి జవ జీవాలు ఊది, అఖండ విజయంతో అధికారంలోకి తీసుకువస్తే, చివరకు ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతం పార్టీలో ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను కన్నీరు పెట్టించింది. ఇక లక్ష లాది అభిమానుల సంగతి వేరే చెప్పాలా?దేవులపల్లి అమర్ (స్వీయ రచన ‘మూడు దారులు’ నుంచి...) -
విధానాలకు వెన్నుపోటు
తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో 1995 ఆగస్టు సంక్షోభాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు చంద్రబాబు చేసిన ద్రోహం అనే కోణం నుంచి చర్చించడం జరుగుతూ వస్తున్నదే. ఆ పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇందులో రెండవ కోణం కూడా ఉంది. అది ఎందువల్లనో చర్చలోకి రావటం లేదు. ఢిల్లీ స్థాయిలో గానీ, దేశవ్యాప్తంగా పరిశీలకుల దృష్టిలో గానీ ఎన్టీఆర్ ఒక సాధారణ ప్రాంతీయ పార్టీ నాయకునిగా మిగలలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పలుకుబడిలో ఉండిన ఒక రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని మొదటి సారిగా సృష్టించి స్థిరపరచటం, తద్వారా రెండు పార్టీల వ్యవస్థను సుస్థిరపరచటం వాటిలో మొదటిది. 1980ల నాటికి కాంగ్రెస్ గణనీయంగా బలహీనపడుతూ దేశమంతటా ప్రాంతీయ శక్తులు బలపడు తున్న దశలో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ని ఆ వరసలోకి తేవటం అందరి దృషినీ ఆకర్షించింది. తర్వాత, ఒక సినిమా నాయకుని పరిపాలన ఏ విధంగా ఉండగలదనే సందేహాలు కలుగుతుండగా ఆయన సంక్షేమ రాజ్యం, అప్పటికి 30 ఏళ్లకు పైగా సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నట్లు చెప్పుకునే కాంగ్రెస్ను మించి ప్రజల ఆమోదాన్ని పొందటం, అందుకు ఆధారప్రాయమైన పథకాలు, అవి లోపరహితంగా అమలు కావటం, పేదలు చిరకాలపు దారిద్య్ర రేఖ నుంచి క్రమంగా బయటపడుతుండిన సూచనలు పరిశీలకుల దృష్టిని ఆకర్షించాయి. మరో అంశం రాష్ట్రాల హక్కులకు సంబంధించిన ఫెడరలిస్ట్ వైఖరి. బలమైన ఫెడరలిస్ట్ వైఖరి తీసుకుంటూ ‘కేంద్రం మిథ్య’ అనే సాహసోపేత మైన ప్రకటనతో దేశంలోని ఫెడరలిస్టులందరినీ ఉలికిపడజేశారు. కాంగ్రెస్ అయితే ఆయనపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేసేవరకు వెళ్లింది. అయినా జంకలేదు. ఆయన రాజ కీయాలలో కొనసాగి ఉంటే కాంగ్రెస్ అనుసరిస్తుండిన యూనిటరిజానికి వ్యతిరేకంగా ఫెడరలిస్టు రాజకీయాలు మరెంతో బలపడి ఉండేవి. కాకతాళీయంగా ఇందుకు కొనసాగింపుగా ఎన్టీఆర్ అధ్యక్షునిగా, వీపీ సింగ్ కన్వీనర్గా 1989లో ‘నేషనల్ ఫ్రంట్’ ఏర్పడి కేంద్రంలో అధికారానికి కూడా వచ్చింది. ఫ్రంట్ మేనిఫెస్టోలో రాష్ట్రాల హక్కుల అంశాలు అనేకం ఉన్నాయి. అదే క్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం... పరమ సాంప్రదాయికుడు కావటమే గాక కాషాయ వస్త్రధారిగా మారి విమర్శలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, అప్పటి ‘జనసంఘ్’ పట్ల వీపీ సింగ్తో పాటు పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకుని తనను తాను సెక్యులర్ వాడిగా ప్రకటించుకోవటం! ఇవన్నీ ఎన్టీఆర్ వారసత్వంగా మిగిలి తెలుగువారి చరిత్రలోనే గాక దేశ చరిత్రలోనే మిగిలిపోయాయి. కాగా, ఈయనను దారుణమైన రీతిలో పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు విధానాలు ఏ విధంగా ఉండ వచ్చునని అందరూ ఉత్సుకతతో ఎదురుచూశారు. చంద్రబాబు అధికార గ్రహణ చేయడానికి మించి ఎన్టీఆర్ ఘనమైన వారసత్వానికి గ్రహణం కూడా పట్టిస్తున్నట్లు అందరికీ త్వరలోనే అర్థమైంది. ఇండియా వంటి వర్ధమాన దేశంలో సామాన్య ప్రజల కన్నా ధనిక వర్గాల ప్రయోజనాలు ముఖ్యమని భావించిన చంద్రబాబు, మొదటి నుంచే ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేశారు. కనీసం ఆ సిద్ధాంతం చెప్పే పెర్కొలేషన్ థియరీని అయినా పాటించక, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఒక్కటొక్కటిగా మంగళం పాడారు. సెక్యులరిజాన్ని వదిలేసి, అధికారం కోసం అవసరమైనప్పుడల్లా బీజేపీతో చేరుతూ అవకాశవాదిగా మారారు. ఫెడరలిస్ట్ శక్తులతో మైత్రి కూడా అదే విధమైన అవకాశవాదంగా మారింది. ఈ విషయాలన్నింటినీ గమనించినపుడు, చరిత్రలో ఎన్టీఆర్, చంద్రబాబుల స్థానాలు ఏ విధంగా మిగిలేదీ ఎవరైనా ఊహించగలరు. ఈ విధంగా 1995 నాటి సంక్షోభమన్నది కేవలం అధికార రాజకీయాల సంక్షోభ చరిత్రగా కాక, అంతకు మించి విధానపరమైన సంక్షోభంగా కూడా మిగులు తున్నది. దేశ రాజకీయాలకు చంద్రబాబు కాంట్రిబ్యూషన్ అది. ఒక మహానుభావుని ఆదర్శ రాజకీయాలు గాలిలో కలిసి, మరొక తరహా మహానుభావుని అధికార రాజకీయం రాజ్యమేలటం ఆ విధంగా మొదలైంది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చరిత్ర చెప్పని కథ
భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత విషాద దినంగా సెప్టెంబరు 1 మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి పెను మచ్చగా చంద్రబాబు సొంత మామని దించివేసి తనది కాని పార్టీకి అధ్యక్షుడైన రోజు ఇది. ముఖ్యమంత్రి పదవికి తనను తానే ప్రకటించుకున్న రోజు. 1995 సెప్టెంబరు 1ని ‘చీకటి దినం’ (బ్లాక్ డే)గా ఎన్టీఆర్ గారు ప్రకటించారు. ఈ ద్రోహాన్ని చూస్తే రాజకీయాలే సిగ్గుపడతాయి.చంద్రబాబు ఏ కాంగ్రెసు పార్టీ అండ చూసుకుని 1982లో ఎన్టీఆర్ను ఓడిస్తానని శపథం చేశాడో మళ్ళీ అదే కాంగ్రెసు పెద్దల ప్రలోభాలకు తలొగ్గి వైస్రాయి హోటల్ డ్రామా నడిపించి భారత ప్రధాని కాబోయే వ్యక్తిని అడ్డుకున్నాడు. ఇతడికి రాజకీయ గురువు రామోజీరావు గారనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పదవిలో ఉంటే 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయ నెక్కడ ప్రధాని అవుతారోనని వెరచిన కాంగ్రెసు పెద్దలు వ్యూహం పన్నారు. అందులో భాగంగానే... ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చెయ్యమని అడిగినా, వాళ్ళ మనిషి అయిన గవర్నర్ కృష్ణకాంత్ దానికి అంగీకరించ లేదు. అదే సమయంలో ఫోర్జరీ సంతకాలతో చంద్రబాబు ఎమ్మెల్యేలు పంపిన లేఖను అంగీకరించారు. చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి, దేవేంద్ర గౌడ్, అశోక గజపతిరాజు, కోటగిరి విద్యాధరరావు లను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే... ఆ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి ఎలా అధ్యక్షుడవుతాడు? పైగా నిస్సిగ్గుగా ఆగస్టు 27న పార్టీ నుండి ఎన్టీఆర్ను సస్పెండ్ చేశాడు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఉప ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మబలికి ఆయనను తాను ముఖ్య మంత్రి అయ్యాక, తీరా బయటకు పంపేశాడు.ఆగస్టు 26న వైస్రాయి హోటల్ దగ్గరకు వెళ్ళిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించటమనేది ఆయన్ని బతికుండగానే చంపేయటమే! చంద్రబాబు కుట్రల గురించి ఎన్టీఆర్ అప్పట్లో ‘వార్త’ పేపరుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చంద్రబాబు పార్టీని అక్రమంగా లాక్కున్నాడనీ, ఇలాంటి విశ్వాస ఘాతకు డిని చరిత్ర క్షమించదనీ అన్నారు. ఇలాంటి ఘాతుకాల పరంపర చంద్రబాబు జీవితంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అతని అబద్ధాలను పెంచి పోషించి ప్రజల మెదళ్ళలోకి బలవంతంగా ఎక్కించటానికి పెంపుడు కుక్కల్లా పచ్చమీడియా పనిచేస్తూనే ఉంది.ఆనాడూ, ఈనాడూ ఎన్టీఆర్ మీదా, లక్ష్మీపార్వతి మీదా వేయించిన కార్టూన్లు చూస్తే ‘ఈనాడు’ ఒక విష పత్రిక అనిపించక మానదు. కేవలం అధికారం కోసం ఒకరు, అధికారాన్ని నడిపించే రిమోట్ కోసం మరొ కరు ఎన్టీఆర్ను దారుణంగా చంపేశారు. చరిత్రనే తల్ల కిందులుగా చేసే రాతలు రాశారు. నిజానికి ఎన్టీఆర్ ప్రధానమంత్రి అవ్వకూడదనే కుట్రకు వీళ్ళు ఆజ్యం పోశారు. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక నెలకో, రెండు నెలలకో వాజ్పేయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ‘1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నిలబడితే మా మద్దతు ఇస్తాము’ అనేది ఆ ప్రకటన. దీంతో కాంగ్రెసు వాళ్ళతోపాటు రామోజీకీ కన్నెర్ర అయ్యింది. తన చేతిలో కీలుబొమ్మలా ఆడే చంద్ర బాబును తెచ్చుకుంటే తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా ప్రభుత్వాన్ని నడిపించవచ్చనే దుష్ట పన్నాగానికి తెరతీశారు.ఇన్ని అవమానాల మధ్య కూడా ఎన్టీఆర్ తలవంచలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అతని కుట్రలను, కుయుక్తులను ‘జామాతా దశమగ్రహం’ అనే ఆడియో కాసెట్ ద్వారా బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో విలేఖరి ఎన్టీఆర్ను ‘మీ అల్లుడి గురించీ, అతని మోసాన్ని గురించీ మీరు తెలుసుకోలేక పోయారు. అతడి అవినీతిని గురించి ఇప్పుడు చెబుతున్నారు. ఇన్నేళ్ళలో మీకు తెలియదా’ అని అడిగారు.అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ ‘అతడొక మేకవన్నె పులి. వెనక గోతులు తీసేవాడిని, వెనక నుండి పొడిచేవాడిని తొందరగా గుర్తించలేం. అందులో అల్లుడి రూపంలో, నా ఇంట్లోనే ఉన్నాడాయె!. ఎలా గుర్తించగలం? తెలుసు కునేసరికి చాలా ఆలస్యమయ్యింది’ అన్నారు. కాళిదాసు చెప్పినట్లు– ‘విష వృక్షో2పి సంవర్ధ్య స్వయం / ఛేత్తుం అసాంప్రతమ్’ – విత్తనం నాటేటప్పుడు తెలియదు. అది చెట్టయ్యాక చేదు ఫలాలనిస్తుందని! అయినా మమకారంతో ఆ చెట్టును నరకలేము కదా! అతని దుర్మార్గాలు కొంత తెలిసినా చంద్రబాబు పట్ల నా ఉదాసీన వైఖరి ఇలాంటిదే’ అన్నారు.చంద్రబాబు దుర్మార్గాలకు పరాకాష్ఠ (1996 జనవరి 17) ఎన్టీఆర్ పార్టీ డబ్బు మీద స్టే ఆర్డర్ తెచ్చి ఆయనకు రూపాయి కూడా అందకుండా చెయ్యటం! పర్యవసానం ‘సింహగర్జన’ ద్వారా తన గర్జనను వినిపించి అల్లుడి దుశ్చర్యలనూ, దుర్మార్గాలనూ ప్రజల్లోకెళ్లి ఎండగట్టాలనుకున్న ఎన్టీఆర్ అదే రోజు రాత్రి మరణించారు. అలా చీకటి భూతాలకు బలి సమర్పించినట్లయ్యింది. ఆయన మరణం అరాచక శక్తులకు మరింత ఊతమిచ్చింది. ఎన్టీఆర్ పోరాటం మధ్యలోనే ముగిసిపోయింది. ఆయన ప్రాణాలు తీసిన చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అవే అబద్ధాలను, దుర్మార్గాలను పచ్చ మీడియా అండగా కొనసాగిస్తూనే ఉన్నాడు.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
ఏపీలో అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు
-
సుగాలి ప్రీతి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ మోసం చేశారు
-
టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ: పేర్ని నాని సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా?. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిమా!. జనసేన సిద్ధాంతం అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేశారు.ప్రీతి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భూమి, ఇల్లు, ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి పవన్ కేకలు వేస్తూ మాట్లాడారు. ప్రీతి కేసును సీబీఐని అప్పగించాలని పవన్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయంలోనే నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలిప్రీతి హత్య విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును.. కానీ, ఆయనను ప్రశ్నించే ధైర్యం పవన్కు లేదు’ అంటూ విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. కూటమి వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. వీఆర్ఎస్ తీసుకోవడానికి మరో 1000 మంది ఉద్యోగులు రెడీ ఉన్నారు’ అని తెలిపారు. -
స్టీల్ ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది..స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటాము. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్సీపీ ధ్యేయం. మా పార్టీ కార్పొరేటర్ల పోరాటంతో GVMCలో స్టీల్ ప్లాంట్పై తీర్మానం చేయించారు.విశాఖ ఉక్కు ప్రజల అందరి హక్కు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే కూటమి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బయట పడింది. ప్లాంట్ కోసం కూటమి నేతలు గతంలో దొంగ దీక్షలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మొదటి నుంచి వైఎస్ జగన్ది ఒకే మాట.. ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పారు. ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారు.పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు కారం తినాలని మాట్లాడారు. ఈ రోజు ఉప్పు కారం ఎవరికి పంపుతారు. ఎవరు తినాలి ఉప్పు కారం.. అది పవనే చెప్పాలి. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రధాన మంత్రితో మాట్లాడలేదు. వైఎస్ జగన్ ధైర్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని మోదీని కోరారు’ అని గుర్తు చేశారు. -
Devineni Avinash: విజయవాడకు వెన్నుపోటు పొడిచి ఈ రోజుతో సంవత్సరం..
-
DSC Candidates: మెరిట్ ఉన్న.. నో కాల్ లెటర్
-
చంద్రబాబు వెన్నుపోటుకు థర్టీ ఇయర్స్
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు మోసగాడు.. నయవంచకుడు.. తండ్రిని జైల్లో పెట్టి, అన్నల్ని చంపించిన ఔరంగజేబు కంటే నీచుడు. నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తే తండ్రిలాంటి వాణ్ని నిలువునా మోసం చేశాడు. అతడిలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. మనిషిని కాదు.. పశువుని, నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తా, నమ్మిన వాళ్ల గొంతు కోస్తా అని చెప్పి నిరూపించుకున్న ఘాతకుడు.. చంద్రబాబు. దీన్ని చరిత్ర మరువదు. మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టి, అన్నల్ని చంపించాడు అని విన్నాం.అదేవిధంగా కేవలం పదవి కోసం తండ్రి లాంటి నాకు ద్రోహం చేశాడు. చంద్రబాబు ఏవిధంగా ఆత్మను అమ్ముకున్నాడో, ఏవిధంగా మానవత్వాన్ని చంపుకున్నాడో ఇదే నిదర్శనం. ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో.. ప్రజల మనసుల్లో పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం’.. ఇవి తన అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో వివరిస్తూ విఖ్యాత సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఎవరూ ఒడిగట్టని రాజకీయ మహాపాతకం.. ‘వెన్నుపోటు’కు చంద్రబాబు శ్రీకారం చుట్టి సోమవారానికి 30 ఏళ్లు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచే ఆ పదవి కోసం గోతి కాడ గుంటనక్కలాగా చంద్రబాబు మాటు వేశారు. తనకు బాకా ఊదే ఎల్లో మీడియాలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంపై నీచపు రాతలు రాయించారు. మందు, విందు, పొందు.. ఇలా తనకు మాత్రమే సాధ్యమైన ప్రలోభాలతో ఎమ్మెల్యేలకు ఎరవేసి వారిని తనవైపునకు తిప్పుకున్నారు.1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ఉన్న తన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని గుంజుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, పార్టీ ఆస్తులను కూడా లాక్కొని ఎన్టీఆర్ను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటేశారు. కుటుంబ సభ్యులనూ దూరం చేసి ఎన్టీఆర్ను తీవ్ర క్షోభకు గురిచేశారు. అయినా కసితీరక ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని ఎమ్మెల్యేలను అభ్యర్థించడానికి హైదరాబాద్లోని వైశ్రాయ్ హోటల్ వద్దకు వచ్చిన ఎన్టీఆర్పై తన అనుంగు ఎమ్మెల్యేలతో చంద్రబాబు చెప్పులదాడి చేయించారు.ఇలా అప్పటివరకు భారతదేశ రాజకీయ చరిత్ర ఎరుగని మహాకిరాతకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తన సొంత అల్లుడు చేసిన కుట్ర, వెన్నుపోటు, దారుణ అవమానాలను తట్టుకోలేక ఎన్టీఆర్ కొద్ది కాలానికే 1996, జనవరి 18న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. చంద్రబాబు చేసిన ఆ మహాకిరాతకం తెలుగు నేలపై ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. కపటత్వంతో ఎన్టీఆర్ పంచన చేరి.. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్నే ఓడిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి చిత్తుగా ఓడారు.. చంద్రబాబు. ఆ తర్వాత తనను మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీకి మొదటి వెన్నుపోటు పొడిచారు. ఆ పార్టీని వదిలేసి మామ ఎన్టీఆర్ పంచన చేరారు. తద్వారా తనకు ఎలాంటి విలువలూ లేవని.. అధికారం, డబ్బే ముఖ్యమని చంద్రబాబు చాటుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే.. చంద్రబాబు మాత్రం కృతజ్ఞత మరిచి తన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు.ఎన్టీఆర్కు 70 ఏళ్ల వయసులో కుటుంబం అండగా నిలవకుండా చేశారు. నందమూరి కుటుంబాన్ని మాయమాటలతో లొంగదీసుకుని తన వెన్నుపోటుకు వారిని పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, గుర్తును, పార్టీ ఆస్తులను కుట్రపూరితంగా సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు ప్రలోభాల వలలో పడ్డారని గ్రహించిన ఎన్టీఆర్.. వారికి నిజం చెప్పడానికి వైశ్రాయ్ హోటల్కు వెళితే ఎన్టీఆర్పై చెప్పులతో దాడి చేయించారు. త్మాభిమానం, ఆత్మగౌరవం నినాదాలతో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఈ దారుణమైన అవమానాన్ని తట్టుకోలేక కుంగిపోయారు.ఇంత చేసినా కసి తీరని చంద్రబాబు అసెంబ్లీలోనూ ఎన్టీఆర్కు మాట్లాడే అవకాశం కల్పించకుండా అడ్డుకున్నారు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్.. చంద్రబాబు కుట్రలకు కంటతడి పెట్టుకున్నారు. అదే క్షోభతో గుండెపోటుతో కన్నుమూశారు. తాను జీవించి ఉండగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబుని జామాత (అల్లుడు) దశమ గ్రహంగా తూర్పారబట్టారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్వెన్నుపోట్లు, మోసం, నయవంచన, కపటత్వం, కుటిలత్వం, హత్యా రాజకీయాలనే తన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్న చంద్రబాబు తనను ఒక విజనరీగా చూపించుకునేందుకు ఎల్లో మీడియాను ఉపయోగించుకున్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే ఈ మీడియా ఆయనను అభివృద్ధి ప్రదాతగా కీర్తిస్తూ నిత్యం ప్రజలను ఏమారుస్తూనే ఉంది. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ప్రజలను నిలువునా ముంచడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. వెన్నుపోటుకు చంద్రబాబును బ్రాండ్ అంబాసిడర్గా చెబుతారు.30 ఏళ్ల క్రితం సొంత మామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన బాబు ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ హామీల పేరుతో ప్రజలను నిలువునా వంచిస్తూనే ఉన్నారు. తన రాజకీయ పీఠాన్ని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలుగు రాజకీయాలనే భ్రష్టు పట్టించిన వ్యక్తిగా రాజకీయ విశ్లేషకులు చంద్రబాబును చూపుతారు. రాజకీయాలను హత్యలు, డబ్బు మయం చేసి, కుట్రలు, కుతంత్రాలతో అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా నీరాజనాలు అందుకుంటున్నారు.ఎన్టీఆర్కే కాదు కుటుంబ సభ్యులకూ వెన్నుపోటేఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులనూ వదల్లేదు. బావమరిది హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారిని ఆ తర్వాత పార్టీలో లేకుండా చేశారు. దగ్గుబాటి, ఆయన భార్య పురందేశ్వరి కాంగ్రెస్లో చేరిపోయారు. హరికృష్ణ కూడా చంద్రబాబు కుట్ర రాజకీయాలను అర్థం చేసుకుని అన్న తెలుగుదేశం పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్ పథకాలకూ తిలోదకాలు..వెన్నుపోటుతో ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబు తాను రాజకీయంగా తెరమరుగవుతున్న ప్రతిసారీ ఎన్టీఆర్ జపం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఎక్కడా, ఎందులోనూ ఆయన ఆనవాళ్లు లేకుండా చేశారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం, రెండు రూపాయల బియ్యం తదితర పథకాలను ఎత్తేశారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ జ్ఞాపకాలు లేకుండా చెరిపేశారు. ఇప్పుడు రాజకీయ అవసరాలకు మాత్రం ఎన్టీఆర్ పేరు, బొమ్మను వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ను పొగుడుతూ ఆయన గొప్పతనం గురించి చెబుతూ ఆయనను మించిన మహానటుడి పాత్ర పోషిస్తుండటంతో చంద్రబాబులో ఇంత మంచి నటుడు ఉన్నాడా అని టీడీపీ నేతలే నివ్వెరపోతున్నారు.ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్గా మళ్లీ కుట్రలు.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎదుర్కోవడానికి మళ్లీ చంద్రబాబుకు మళ్లీ ఎన్టీఆర్ కుటుంబం అవసరమైంది. ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ ప్రచారానికి వాడుకున్నారు. అవసరం తీరిపోయాక తన కుమారుడు నారా లోకేశ్కు పోటీ వస్తాడేమోనని తన ఎల్లో మీడియాలో నీచపు కథనాలు ప్రసారం చేయించారు. అంతేకాకుండా ఇటీవల అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్తో జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అసభ్య వ్యాఖ్యలు చేయించారు. ఇలా చివరకు జూనియర్ ఎన్టీఆర్ను కూడా తన కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు బలిపెడుతున్నారు.ఔరంగజేబును గుర్తు చేసిన చంద్రబాబుఆధునిక భారత రాజకీయాల్లో వెన్నుపోటు అంకానికి తెరలేపి ఔరంగజేబును చంద్రబాబు గుర్తు చేశారు. ఈ దారుణమైన అంశం చర్చకు రాకుండా బాబు అనుకూల మీడియా తొక్కేసింది. తద్వారా నైతిక విలువలను దిగజార్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా అఖండ మెజారిటీతో ఎన్నికైన ఎన్టీఆర్ను కూలదోయడంలో బాబు అనుకూల మీడియా కీలక పాత్ర వహించింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. సత్యం ముందుకు రాకుండా అసత్యాలను, పచారం చేస్తున్నాయి. – విజయబాబు, ఆర్టీఐ మాజీ కమిషనర్, మాజీ సంపాదకులు సీఎం పదవి కోసమే ఎన్టీఆర్ను దించేశారుచంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతోనే 1995లో ఎన్టీఆర్ను పదవి నుంచి దించేశారు. పార్టీని నిలబెట్టుకునేందుకే అలా చేశామని చెప్పుకుంటున్నా అది వాస్తవం కాదు. కేవలం తన కోసమే చంద్రబాబు ఇదంతా చేయించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు ఆయన్ను వదిలేసి మధ్యలోనే హైదరాబాద్ వెళ్లిపోయి వైశ్రాయ్ హోటల్లో మకాం వేశారు.అప్పట్లో మీడియాను మేనేజ్ చేసి తమ వద్దకు 40 మంది ఎమ్మెల్యేలు వచ్చారని, 50 మంది.. 60 మంది వచ్చారని ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని చూసి చాలామంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు తప్ప నిజంగా అంతమంది ఎమ్మెల్యేలు అక్కడ లేరు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వినియోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. – దారా గోపి, సీనియర్ జర్నలిస్టు, విజయవాడ ఎల్లో మీడియాలో ఎన్టీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయించి.. ఎన్టీఆర్ కేబినెట్లో ఉంటూనే తనకు అనుకూలంగా పత్రికల్లో కథనాలు వచ్చేలా, ఎన్టీఆర్ వ్యవహారాలపై లీకులు ఇస్తూ ఆయన ఇమేజీని చంద్రబాబు డ్యామేజీ చేసేవారు. ప్రభుత్వ పాలన సరైన దిశలో నడవడం లేదంటూ, లక్ష్మీపార్వతిని బూచిగా చూపించారు. ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుని వచ్చి.. ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్ కేబినెట్ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తే.. అప్పటి రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ సహకారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకున్నారు. స్పీకర్ యనమల రామకృష్ణుడు ఎలాగూ తన మనిషే కావడం చంద్రబాబుకు కలిసి వచ్చింది. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులను కూడా చంద్రబాబు మచ్చిక చేసుకున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
సీఎం సభకు రానంటే కుదరదు
కుప్పం: ‘అక్కా.. ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పి ముఖ్యమంత్రి కార్యక్రమానికి రాకుండా ఉంటే కుదరదు. ప్రతి గ్రూపు నుంచి పది మంది రావాల్సిందే. రాని వారి పేర్లు, వారి గ్రూపు పేర్లు రాసిచ్చేస్తా. ఎందుకంటే అన్నీ మేమే పెట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. వచ్చిన వారి ఫొటోలు టాబ్లో ఎక్కిస్తాను. రాని వారి పేర్లు రాసుకుంటాను’.. అంటూ అధికారులు మహిళా సంఘాలకు వాయిస్ మెసేజ్లు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో తమకు ప్రభుత్వ పథకాలు ఎక్కడ నిలిపేస్తారేమోనని మహిళలు ఆందోళనకు గురై సీఎం సభకు హాజరయ్యారు.ఇదీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో చోటుచేసుకున్న ఘటన. ఇక కుప్పం మండలం, పరమసముద్రం చెరువు వద్ద హంద్రీ–నీవా నీటి విడుదల సందర్భంగా సీఎం జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. ఏడాదిలోగా చిత్తూరుకు హంద్రీ–నీవా నీరిస్తామని, దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయని ఆయన తెలిపారు. హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా వస్తున్న 40 టీఎంసీల నీటితో 85% రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయన్నారు.ప్రాజెక్టు రెండు దశల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. ఈ సీజన్లో గోదావరి నుంచి 1,600 టీఎంసీలు, కృష్ణానది నుంచి 600 టీఎంసీల వరద జలాలు కడలి పాలయ్యాయని.. నదుల అనుసంధానం జరిగితే కరువు అనేది ఉండదన్నారు. తెలంగాణ కూడా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలుగు జాతికి తిరుగుండదన్నారు.రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదేనని చెప్పారు. ‘సీమ’ అభివృద్ధికి బ్లూప్రింట్ సిద్ధం చేసుకున్నానన్నారు. 2014–19 కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం తాను రూ.12,500 కోట్లు ఖర్చుచేస్తే తరువాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసిందన్నారు. ఇక వరి సాగు వద్దని.. దానివల్ల ఆదాయం లేనందున వాణిజ్య పంటలపై దృష్టిసారించాలని ఆయన సూచించారు.పులివెందుల, ఒంటిమిట్టలో రప్పారప్పా..కుప్పంలో వైఎస్సార్సీపీ రప్పారప్పా రాజకీయం చేయాలని చూస్తే, పులివెందుల, ఒంటిమిట్టలో అక్కడి ప్రజలు రప్పారప్పా రాజకీయం చూపెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం యజ్ఞంలా తాను ముందుకుపోతుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించి వారితో మాట్లాడారు. 60 ఏళ్లు నిండిన మహిళలు ఉచిత బస్సు ఎక్కి ఏ గుడికైనా వెళ్లేలా, అలాగే అన్న క్యాంటీన్లో ఉచితంగా భోజనంచేసి వచ్చే ఏర్పాట్లుచేస్తామన్నారు. ఆటో డ్రైవర్లతో కూడా ఆయన మాట్లాడారు. -
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతు కష్టాలు
-
క్రెడిట్ కొట్టేయగల సమర్థుడు చంద్రబాబు: అంబటి
కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదంటూ శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం. పని చేసేది ఒకరు.. క్రెడిట్ పొందేది మరొకరు. క్రెడిట్ను దొంగిలించగలిగిన సమర్థుడు చంద్రబాబు ఆరితేరారు. కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1989 నుంచి ఆయనే అక్కడ పోటీ చేస్తున్నారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్ నీళ్లు ఇచ్చారు. కానీ, చంద్రబాబు లైనింగ్ పేరిట సీఎం రమేష్ కంపెనీకి అప్పనంగా డబ్బులు ఇచ్చారు.. .. ప్రపంచంలోనే పోలవరం చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికి వదిలేశారు. రెండు కాపర్డ్యామ్లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు. ఆయన చేసిన పనికి అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే. చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన రామా నాయుడా? డ్రామా నాయుడా?. సరైన, సక్రమ పద్దతుల్లో పోలవరం నిర్మాణం జరగడం లేదు. డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. రాక్ తగిలే వరకు డయాఫ్రం వాల్ వేయాలి. కానీ, చంద్రబాబు నాయకత్వంలో 0.9 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆయన అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా వినడం లేదు. పోలవరం ప్రాజెక్టుపై మేం చర్చకు సిద్ధం.. ఇది సవాల్ కాదు చర్చకు రావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా’’ అని అంబటి అన్నారు. -
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత -
KSR Live Show: ఆటలో అరటిపండు.. పవన్ ను వాడుకుంటున్న చంద్రబాబు
-
అయ్యా చంద్రన్న.. బాబుపై ఆటో డ్రైవర్లు ఫైర్
-
మద్యం బార్లకు లక్కీ డ్రా.. టీడీపీ సిండికేట్ కుట్రలు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ కుట్రలు చేస్తోంది. మద్యం బార్లకు నేడు లక్కీ డ్రా ఉన్న నేపథ్యంలో దరఖాస్తులు రాకుండా టీడీపీ సిండికేట్ ప్లాన్ రచిస్తోంది. ఈ క్రమంలో మార్జిన్ పెంచుకునేందుకు బార్ల సిండికేట్ కొత్త ఎత్తుగడ చేసింది.వివరాల ప్రకారం.. ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ కుట్రలు చేస్తోంది. దరఖాస్తులు రాకుండా టీడీపీ సిండికేట్ కొత్త ప్లాన్కు దిగింది. బార్లకు దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంటోంది. కాగా, నిన్న రాత్రితో బార్ దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో, నేడు 840 బార్లలో 465 బార్లకు లక్కీ డీప్ తీయనున్నారు. 465 బార్లకు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తులను తగ్గించే ప్రయత్నం చేసి.. మార్జిన్ను పెంచుకునేందుకు పచ్చ నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇక, ఇప్పటికే సిండికేట్ కోసం ఒకసారి లాటరీని ఎక్సైజ్ శాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
రుషికొండ డ్రామా బట్టబయలు
-
కుట్ర అడ్డం తిరిగింది.. అడ్డంగా ఇరుక్కున్న బాబు.. పవన్
-
ఎటు చూసినా గుంతల రోడ్లే కనిపించడం లేదా బాబుగారు..?
-
బాబు సర్కారు మళ్లీ రూ.5 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీ వేలంను ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. రూ.1,000 కోట్ల అప్పు వచ్చే ఎనిమిదేళ్లలో తీర్చేలా, మరో రూ.1,000 కోట్ల అప్పు వచ్చే తొమ్మిదేళ్లలో.. రూ.1,500 కోట్ల అప్పు 11 ఏళ్లలో.. మరో రూ.1,500 కోట్ల అప్పు 12 ఏళ్లలో తీర్చేలా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. -
రోడ్లన్నీ గుంతలు.. వాహనాలు గంతులు
చంద్రబాబు ప్రభుత్వ బండారం రోడ్డున పడింది. సంక్రాంతికి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. నాలుగు నెలల్లో మళ్లీ సంక్రాంతి వస్తున్నా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో రోడ్లపై అసలు గుంతలు లేకుండా చేస్తామన్న ఎన్నికల హామీని రోడ్డుపాలు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు ప్రధానంగా రోడ్లపై టార్గెట్ చేసి ప్రచారం నిర్వహించారు. రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ఎంత ఖర్చు అయినా సరే రహదారులకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెప్పారు.తీరా అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సాక్షి బృందం విస్తృత స్థాయిలో పరిశీలించింది. ఏ రోడ్డు చూసినా గుంతల మయంగా కనిపించింది. అడుగడుగునా గుంతలు... కోసుకుపోయిన రోడ్లు, కాస్త వర్షానికే కొట్టుకుపోయిన రోడ్లు.. రాళ్లు తేలిన రోడ్లు.. రాష్ట్రం అంతటా ఇవే దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఇలాంటి రోడ్లపై గమ్యం చేరడానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతుండటం అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది.రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లపై గుంతలు పెరిగిపోయి.. వాహనాలు గంతులేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారుల్లో వాహనాలు కూరుకుపోయి కనిపించాయి. మరికొన్ని చోట్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి కళ్లకు కట్టింది. ఇంకొన్ని చోట్ల అయితే రహదారి ఉందో.. లేదో కూడా తెలియని దుస్థితి.ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లపై గుంతలు పూడ్చటం కోసం ప్రభుత్వం రూ.840 కోట్లు ఖర్చు చేశామని చెబుతోంది. అయితే ఇందులో వాస్తవంగా పదో వంతు కూడా ఖర్చు చేయలేదని ఆర్అండ్బి వర్గాల సమాచారం. మిగతాదంతా కూటమి పార్టీల నేతలే జేబులో వేసుకున్నట్లు తెలిసింది. ఇక పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. దారుణంగా మారిపోయాయి. రోడ్డుపై తారు అన్నదే కనిపించకుండా పోయింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆటోలు, కార్లు, లారీలు బోల్తా పడక తప్పదన్నట్లు రహదారులు రూపు మారిపోయింది. –సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎరుకుపాడు–గంపలగూడెం మధ్య ఏడాది క్రితం ఆర్ అండ్ బీ రహదారిని కొత్తగా వేశారు. నిన్నా, మొన్నటి వర్షానికే కొట్టుకు పోయింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం 75 త్యాళ్యూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాల సమీపంలోని వంతెన వద్ద కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి. ఎప్పుడు కుప్పకూలుతుంతో అన్నట్లుంది. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
కేసులతో వేధింపులు.. కూటమిని ప్రశ్నించడం ఆపేదిలేదు: భూమన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ పోలీసులు 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనే లక్ష్యాన్ని మరిచిపోయారని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లేని లిక్కర్ స్కాంను సృష్టించి.. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు.రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. అనంతరం, భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక నెపంతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైఎస్ జగన్ నైతికతను దెబ్బతీయ వచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను అరెస్టు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రశ్నించడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలందరినీ జైల్లో పెట్టినా ఏమాత్రం భయపడేది లేదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టిన మా మనో నిబ్బరాన్ని దెబ్బ తీయలేరు’ అని అన్నారు.మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైలు పాలు చేస్తోంది. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు పంపించింది. మిథున్ రెడ్డి కూడా ధైర్యంగా ఉన్నారు. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు’ అని తెలిపారు. -
సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటనకు నిరసన సెగ
-
ఎల్లో మీడియా సృష్టి అది.. బాబూ చూసుకోవాలి కదా!
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వార్తా కధనం వచ్చింది. అంతవరకు సంతోషమే. అదే రోజు, ఆ మరుసటి రోజు వచ్చిన కొన్ని వార్తలు చూస్తే ఆవేదన కలుగుతుంది. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, పెన్షన్ కోసం దివ్యాంగులు నానా అగచాట్లు పడుతున్న వైనంపై సచిత్ర కథనాలు వచ్చాయి. నిజంగా ఈ పరిస్థితి బాధాకరమే. అంతేకాదు.. పెన్షన్కు అనర్హులు అంటూ నోటీసు రావడంతో ఆందోళనకు గురైన దివ్యాంగ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం మరింత కలచివేస్తుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక నెలకొన్న దయనీయ పరిస్థితికి ఇది దర్పణం పడుతుందనుకోవాలి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పెన్షన్ దారుల విషయంలో, యూరియా సరఫరాపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారట. అలాగే అమరావతి మునిగిందని చెబుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇది మరింత విచారకరమని చెప్పాలి. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై, లేదా ఇబ్బందులపై వార్తలు వస్తే వాటిని సరిచేసుకోవాల్సిన ముఖ్యమంత్రి తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి ప్రకటనలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ గా కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ రెండు అంశాలకు సంబంధించి ఎల్లో మీడియా కూడా తమ జిల్లా పత్రికలలో పెన్షన్ దారులు పడుతున్న పాట్లు, యూరియా ఇక్కట్లు, అమరావతిలో వరద మొదలైన అంశాలపై కథనాలు ఇచ్చాయి.రాష్ట్రస్థాయిలో మాత్రం వాటిని కప్పిపుచ్చి చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అన్న వ్యాఖ్యకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల మొత్తాన్ని వారి వైకల్యాన్ని బట్టి ఆరువేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నికల హామీగా ఇచ్చాయి. ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంచినట్లు పెంచి, అనర్హుల పేరుతో చాలా మందిని ఆ జాబితా నుంచి తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పార్ధసారధి తదితరులు దివ్యాంగ పెన్షన్లు అనర్హులకు అందుతున్నాయని, పెన్షన్దారులలో దొంగలు ఉన్నారని ఆరోపిస్తూ స్పీచ్లు ఇచ్చారు. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఈ పెద్దలు కొందరు ఆరోపిస్తున్నారు. అంగవైకల్యంపై నోటీసులు వచ్చినవారికి వచ్చే నెల పెన్షన్ రాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఎవరైనా కోరి అంగవైకల్యం తెచ్చుకుంటారా? అలా అని చెప్పుకుంటారా?. కానీ, దురదృష్టవశాత్తు పాలకులు దివ్యాంగులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. వారి పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు.దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళనకు దిగుతున్నారు. వారు తమ వైకల్యాన్ని టీవీల ముందు చూపుతున్న వైనం ఆవేదన కలిగిస్తుంది. అయినా ఎల్లో మీడియా మానవత్వం లేకుండా పెన్షన్లపై ఫేక్ రచ్చ అంటూ వార్తలు రాసి చంద్రబాబును సంతోషపెడుతోంది. నిజానికి ఎల్లో మీడియా చేస్తున్న అబద్దపు ప్రచారానికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలలో పలచన అవుతుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ విషం అని ఈ మీడియా రాసింది. దివ్యాంగుల ఫించన్ల తొలగింపుపై అసత్యాలు అని సత్యదూరమైన వార్తలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఎల్లో మీడియా ప్రభుత్వంతో కుమ్కక్కైంది. ఇప్పుడు నిత్యం కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు చేస్తున్న ఆందోళన అబద్దమా?.శ్రీకాకుళంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా?. పోనీ ఎల్లో మీడియా పెన్షన్దారులకు జరుగుతున్న అన్యాయంపై రాయలేదా?. అంటే వారు తమ జిల్లా పత్రికలలో రాస్తున్నారు. ఉదాహరణకు ఆగస్టు 21న ఇదే ఆంధ్రజ్యోతి అన్నమయ్య జిల్లా పత్రికలో అర్హులకు అన్యాయం అని హెడ్డింగ్ పెట్టి ఒక పేజీడు వార్తలు రాసింది. అంటే ప్రభుత్వంపై వారు విషం చిమ్మినట్లేనని ఒప్పుకుంటారా?. లేక నిజమే రాశారా?. అలాగే చిత్తూరు జిల్లా ఎడిషన్లో వీరే రాసిన మరో వార్త ఏమిటంటే కొందరి పాపం.. వీరికి శాపం అని ఈ మొత్తం నెపాన్ని అధికారులు, డాక్టర్లపై నెట్టేసే యత్నం చేశారు. మంచానికే పరిమితమైన ఒక వ్యక్తికి నెలకు నాలుగు వేలే ఇస్తున్నారని ఇదే ఎల్లో మీడియా వారు ఫోటోతో సహా ప్రచురించారు. రెండు కాళ్లు పనిచేయకున్నా పూర్తిగా పెన్షన్ రద్దు చేశారని కూడా ఫోటోతో కూడిన మరో వార్తను ప్రచురించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది.సాక్షి పత్రిక రాసినా, వైఎస్సార్సీపీ విమర్శలు చేసినా, అవి ఫేక్ ప్రచారం అయితే మరి ఇదే విషయాన్ని ఎల్లో మీడియా రాస్తోంది కదా?. దానిని ఏమంటారు. రాష్ట్ర స్థాయిలో ఒకరకంగా, జిల్లాలలో మరో రకంగా రాస్తున్న టీడీపీ మీడియా ఫేక్ అవుతుందా? లేదా?. అన్నది వారే ఆలోచించుకోవాలి. సాక్షిలో వచ్చిన కధనాలు కాని, వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాని నిజం కాకపోతే ప్రభుత్వం ఈ దివ్యాంగుల పెన్షన్లను యధాతధంగా ఉంచుతామని ఎల్లో మీడియాకు ఎందుకు లీక్ ఇచ్చారో చెప్పాలి. అంగవైకల్యంపై సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై కేసులు పెడతామని మంత్రివర్గ సమావేశంలో బెదిరించడంతో వారు తమ వద్దకు వచ్చినవారికి ఎలాంటి అంగవైకల్యం ఉన్నా అనర్హులుగా ప్రకటించేశారట. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా!.ఇదే సందర్భంలో గతంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడానికి ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఇచ్చిన సర్టిఫికెట్ను వాడుకున్న విషయాన్ని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇక యూరియా సరఫరాపై కూడా ఇలాగే ఎల్లో మీడియా చేస్తోంది. రైతులు నిత్యం యూరియా కోసం క్యూలు కట్టి ఇబ్బందులు పడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అన్నారని ఎల్లో మీడియా రాసింది. మరో వైపు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిఘా పెట్టాలని కూడా ఆయన ఆదేశించారట. యూరియా సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు అదేమీ లేదన్నట్లు దుష్ప్రచారంగా కొట్టిపారేస్తే ఏమి ప్రయోజనం!. చెప్పులను కూడా క్యూలో ఉంచి రైతులు ఒక టైమ్ అంటూ లేకుండా ఎదురుచూపులు చూస్తున్న సన్నివేశాలు రాష్ట్రం అంతటా కనిపిస్తున్నాయి. పలు చోట్ల సొసైటీలలో, రైతు సేవా కేంద్రాలలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సమస్య ఉంటే దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాకుండా ఎలా మాయ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి ఎల్లో మీడియా డప్పులు వాయిస్తోంది.అమరావతి విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఒకవైపు పెద్ద పెద్ద మోటార్లతో వరద నీరు తోడే పనిలో కనిపిస్తుంటారు. మంత్రి నారాయణ వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నామని చెబుతారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వరద ఏమీ లేనట్లు మాట్లాడి అమరావతి మునగలేదని బుకాయిస్తుంటారు. టీడీపీ మీడియా అయిన ఆంధ్రజ్యోతి మరికొన్ని పత్రికలలో సైతం అమరావతి ప్రాంతంలో వరదవల్ల ఆయా గ్రామాలలో ప్రజలు పడిన పాట్లను వివరిస్తూ వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు కోపం ఎంతసేపు సాక్షిపై, వైఎస్సార్సీపీపైనే ఉంటుంది. ఏమి చేస్తాం. ఆయన ధోరణే అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విపక్షం ఆధారాలు లేకుండా విమర్శలు చేసే అవకాశం ఉందా?.టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా తప్ప మరే ఇతర మీడియా అయినా నిజం లేని వార్తలను సృష్టించే అవకాశం ఉందా? ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇందులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైనా సమస్యలపై వార్తలు వస్తే వెంటనే సంబంధిత శాఖలతో ఖండన లేదా వివరణ ఇవ్వాలని చెప్పేవారు. కాని ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే స్వయంగా ఆయనే సమస్యలపై అక్షర సత్యాలు రాస్తున్న మీడియాపైన విరుచుకుపడుతున్నారు. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జర్నలిస్టులను వేధిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు తనకు తాను ఎంత బలహీనుడుగా మారుతున్నారో ప్రజలకు చెప్పకనే చెబుతున్నారనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీ జాతకాలు నా దగ్గరున్నాయి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ జాతకాలు అన్నీ నా వద్ద ఉన్నాయి. ఎవరెవరు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. పదవి అనేది మనకు సేవ చేసేందుకు లభించిన అవకాశం. కానీ కొంత మంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. కనీసం మనల్ని నిలబెట్టిన కేడర్ను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది సరికాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కూడా ప్రకటిస్తా మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే నా తరహాలో నేను సరిదిద్దాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు విశాఖలో తలపెట్టిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తానని తెలపడంతో పాటు ప్రతీ ఒక్కరి పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక మెకానిజం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని.. వీటిని వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీ తీరు మారకపోతే నేను నా పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా చంద్రబాబు తరహాలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నామని తెలపడంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పడం గమనార్హం. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న సమావేశాల్లో మొదటిరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలే టాప్..!ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిపై భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. మైనింగ్ నుంచి పోస్టింగుల వరకూ.. ప్రతీ పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై నేరుగా కొంత మంది చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కేబినెట్ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిదిద్దుకోవాలని సూచించినట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పూర్తిస్థాయిలో అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మండలానికి ఒకరిని నియమించి వసూళ్లు చేపడుతుండగా.. మరో ఎమ్మెల్యే సోదరుడు మొత్తం పెత్తనమంతా చేస్తున్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే అందినకాడికి దండుకుంటున్నారని కూడా పక్కా సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేపై నేరుగా ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఆయన అల్లుడిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా పవన్ పేర్కొన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలుగురి ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిని వెలిబుచ్చినట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.చంద్రబాబు ఆదేశాలతోనే...!వాస్తవానికి గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమిలోని ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మందలించి పంపుతున్నానని.. బీజేపీ, జనసేన అధ్యక్షులు కూడా వారి ఎమ్మెల్యేలను పిలిచి తప్పులుంటే సరిచేసుకోవాలని చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ పీకారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలకు పనితీరు ఆధారంగా చంద్రబాబు తరహాలో రేటింగ్ కూడా ఇస్తానని చెప్పడం పట్ల జనసేన నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రతీ పార్టీ పనితీరుకు ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మరో పార్టీ స్టైల్ను ఫాలో కావడం మంచిది కాదు. చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆదేశించారంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఈ తరహాలో క్లాస్ పీకడం సరికాదు’ అని సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీ అధినేత నిరంతరం ఈ విధంగా సమావేశం కావడం మంచిదేనని.. కార్యకర్తలు చెప్పే సమస్యలు వింటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
బాబు తొలి సంతకం.. ఘరానా మోసం
-
చివరకి మమ్మల్ని బిచ్చగాళ్లును చేసావ్.. చంద్రబాబుని ఏకిపారేసిన ఆటో డ్రైవర్లు
-
చంద్రబాబు మోసాలపై.. జగన్ సంచలన పోస్ట్
-
Big Question: YS జగన్ పూజ చేస్తే మీకేంటి..? ఎందుకంత భయం..
-
Big Question: బాబు భూతం కథలు..
-
మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి.. ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్–7 అంటూ మహిళలందరినీ నమ్మించి.. గత ఏడాది జూన్ నుంచే వాటిని అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి.. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తకుండా వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. సవాలక్ష ఆంక్షలు పెట్టి.. హామీలకు కోతలు పెడుతున్నారు.. ఇది మోసం కాదా? దగా కాదా? అంటూ నిలదీశారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్ –7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచారు. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు. ⇒ ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?⇒ చంద్రబాబు గారూ.. మీరు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014–19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరకు వడ్డీ సైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్ల కాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. ⇒ మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు.⇒ చంద్రబాబు గారూ.. కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బ తీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?⇒ మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్ల మీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నా వడ్డీ కింద మరో రూ.5 వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చాం. అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం.ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మా చిత్త శుద్ధికి నిదర్శనం.⇒ మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ! -
కుప్పానికి కృష్ణాభిషేకం జగన్ హయాంలోనే
పలమనేరు, మదనపల్లె: తన సొంత నియోజక వర్గానికి కృష్ణా జలాలు తరలించానని నమ్మబలుకుతున్న సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ అసలు కుప్పం ఉప కాలువ పనులే పూర్తి చేయించలేదు. 2014–19 టీడీపీ పాలనలో చుక్క నీరైనా కుప్పం సరిహద్దును తాకలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే కుప్పం ఉప కాలువ పనులకు మోక్షం కలిగింది. పనులు పూర్తి చేయించి కృష్ణా జలాలను కుప్పానికి తరలించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. 2024 ఫిబ్రవరి 26న నాటి సీఎం వైఎస్ జగన్ స్వయంగా కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేశారు. రామకుప్పం మండలంలోని మద్దికుంట, వెరశిచెరువు, శాంతిపురం మండలంలోని చిట్టివానికుంటలకు కృష్ణా జలాలను తరలించి నింపారు. 2021లో వి.కోట మండలం వరకు నీటిని తరలించగా 2024లో కుప్పం వరకు నీటిని పారించి ప్రజలకు అంకితం చేశారు. ఉమ్మడి చిత్తూరుకు 6.4618 టీఎంసీల కృష్ణా జలాలు..కుప్పానికి కృష్ణా జలాలను అందిస్తామని మాట ఇచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమేరకు హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరందించి 91 చెరువులను సైతం నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 6.4618 టీఎంసీల కృష్ణా జలాలను తరలించింది. శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లె రిజర్వాయర్కు, అక్కడి నుంచి సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె జలాశయానికి చేరిన కృష్ణా జలాలను పుంగనూరు ఉపకాలువ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా దాహార్తి తీర్చారు. పుంగనూరు, కుప్పం ఉపకాలువల నిర్మాణం, ఎత్తిపోతలు, భారీ మోటార్లు.. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేయగా.. వాటిని గత ప్రభుత్వం మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయించింది. భూ సేకరణకు రూ.40 కోట్లు కేటాయించి 4.8 కి.మీ. పెండిగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్ నిర్మాణాలు, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు నిర్మాణ పనులు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ సొరంగం పనులు 45 మీటర్లు మేర పూర్తి చేయించి నీటిని తరలించింది.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వడివడిగా ఈ పనులన్నీ పూర్తి చేసి కుప్పానికి నీళ్లను అందించింది.చెర్లోపల్లెలో నిల్వ చేసిన నీటిని వదులుతూ..సిమెంట్ లైనింగ్ పేరిట నిధులు కొల్లగొట్టడం మినహా టీడీపీ కూటమి సర్కారు కుప్పానికి చేసిందేమీ లేదు. అంచనాలను అమాంతం పెంచేసి సీఎం రమేష్కు చెందిన కంపెనీకి లైనింగ్ పనులను అప్పగించింది. కుప్పం ఉపకాలువకు సంబంధించి బైరెడ్డిపల్లి మండలం తీర్థం నుంచి రామనపల్లి కాలువ మార్గంలో రాళ్లున్న చోట సిమెంట్ చల్లి వదిలేయడంతో అదంతా రాలిపోతోంది. ఇదే మార్గంలో బ్రిడ్జిలపై నిర్మించిన పైప్ లైన్లలో లీకేజీలు కనిపిస్తున్నాయి. తాతిరెడ్డిపల్లి వద్ద ఇంకా లైనింగ్ పనులు సాగుతున్నాయి. ఓ వైపు కాలువలో నీరు ప్రవహిస్తుంటే ఈ పనులు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో ఊహించవచ్చు. వి.కోట మండలం పోతనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో నీరు లీకవుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని చెర్లోపల్లి జలాశయ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా ఆ నీటినే ఇప్పుడు కుప్పానికి వదులుతూ శ్రీశైలం నుంచి సీఎం చంద్రబాబు విడుదల చేసిన జలాలు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది అందాల్సిన నీటిని కాంక్రీట్ పనుల పేరుతో అడ్డుకుని వాటినే ప్రస్తుతం కుప్పం తరలిస్తున్నారు. -
దశలవారీ లాటరీ.. గుట్టుగా దోపిడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మద్యం దందాను కొత్తపుంతలు తొక్కిస్తోంది. ప్రభుత్వ పెద్దల హైడ్రామాను కొనసాగిస్తూ బార్ల ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొత్తదారి కనిపెట్టింది. 2014–19లో చీకటి జీవోలతో ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి రూ.5,200 కోట్లు కొల్లగొట్టిన తీరు తెలిసిందే. ఈసారి సిండికేట్కు అడ్డగోలుగా 15 శాతం లాభాల మార్జిన్ పెంచేందుకు మరో అడ్డదారి కనిపెట్టారు. ఈ అడ్డదారితో సిండికేట్ మరింత భారీగా దోచుకునేందుకు రాచబాట వేయాలని నిర్ణయించింది. ఇందుకు.. బార్కు కనీసం నాలుగు దరఖాస్తులైనా రావాలనే నిబంధనను ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వ పెద్దల పక్కా పన్నాగంతోనే సిండికేట్ బార్లకు దరఖాస్తులు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోంది. గడువును శుక్రవారం వరకు పొడిగించిన తరువాత కొంతవరకు దరఖాస్తులు దాఖలు చేశారు. మొత్తం 840 బార్లలో గురువారం నాటికి వంద బార్లకు కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. చివరిరోజు శుక్రవారం మరో 50 బార్లకు కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలు చేయాలని సిండికేట్ వ్యూహం రచించింది. ఆ విధంగా దాఖలైన నాలుగేసి దరఖాస్తులన్నీ సిండికేట్ సభ్యులవే ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. ఈ నెల 30న 150 బార్లకు లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. ఆ బార్లను టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంటుంది. మిగిలిన బార్లకు సెప్టెంబర్ లో మరోసారి నోటిఫికేషన్ ఇస్తారు. అలా నాలుగైదు దశల్లో నోటిఫికేషన్లు ఇచ్చి.. ప్రతిదశలోను 150– 200 వరకు బార్లను టీడీపీ సిండికేట్కు కట్టబెడతారు. తద్వారా బార్లకు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపడం లేదనే కుట్రపూరిత వాదనను బలపరుస్తూ కథ నడుపుతారు. ఆ నెపంతో ఏం చేస్తారంటే.. నమ్మించే కథలు.. దరఖాస్తుల దాఖలుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు కాబట్టి.. బార్ల యజమానులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఓ ప్రతిపాదనను రూపొందిస్తుంది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతం ఉన్న 15 శాతం వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ)ను తొలగించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. అవసరమైతే ఆ 15 శాతం ఏఆర్ఈటీని బార్లతోపాటు రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం దుకాణాలకు సమానంగా సర్దుబాటు చేయవచ్చని కనికట్టు చేస్తుంది. మంత్రుల కమిటీనే ఆ మేరకు సిఫార్సు చేసినట్టు కథ నడిపిస్తుంది. వాస్తవానికి ప్రైవేటు మద్యం దుకాణాలకు ఇప్పటికే రెండేళ్లపాటు లైసెన్సులు జారీచేసేశారు. వారిపై కొత్తగా ఏఆర్ఈటీ విధించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసిన తరువాత ఆ అంశాన్ని పరిశీలించాలని మంత్రుల కమిటీ సూచిస్తుంది. అందుకు మరో ఏడాదికిపైగా సమయం ఉంది. అప్పుడు ఆ అంశాన్ని పరిశీలించవచ్చని కనికట్టు చేస్తారు. బార్లపై ఏఆర్ఈటీని తొలగిస్తారు. బార్ల యజమానులు యథావిధిగా ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకే మద్యం అమ్మకాలు కొనసాగిస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఖజానాకు 15 శాతం మేర గండిపడుతుంది.చీప్గా దండుకో..మద్యం సిండికేట్ దోపిడీకి మరో అవకాశాన్ని కల్పిస్తూ.. బార్లలోను చీప్ లిక్కర్ అమ్మకాలకు అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. చీప్ లిక్కర్ విక్రయాలతో ప్రభుత్వానికి పన్నుల రాబడి పెద్దగా లేదు. కానీ టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాలకు భారీ లాభాలు వస్తున్నాయి. అందులో మద్యం ధరలో లాభాల మారిŠజ్న్ అధికంగా ఉంది. అందుకే బార్లలో కూడా చీప్ లిక్కర్ అమ్మకాలను అనుమతించాలన్న సిండికేట్ డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ వాటా 30 శాతం ఉంది. నెలకు సగటున రూ.3 వేల కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటే అందులో రూ.900 కోట్ల మేర చీప్ లిక్కర్ ద్వారానే వస్తోంది. బార్లలోను అనుమతిస్తే చీప్ లిక్కర్ విక్రయాలు మరింతగా పెరుగుతాయి. సిండికేట్ లాభాల కోసం చీప్ లిక్కర్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వతీరు ఆందోళన కలిగిస్తోంది. చీప్ లిక్కర్తో మద్యం ప్రియులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాలేయం, ఉదరకోశ, మానసిక ఆరోగ్య సమస్యలు రాష్ట్రంలో పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. కానీ మద్యం సిండికేట్ దోపిడీకి వత్తాసు పలకడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఉద్దేశమేలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
‘విద్యుత్’ ఉద్యమంపై బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: బషీర్బాగ్ షహీద్చౌక్.. విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. 2000 సంవత్సరం ఆగస్టు 28న ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లో పోలీస్ కాల్పుల్లో ముగ్గురు నెలకొరిగారు. ఈ కాల్పుల ఘటనతో నాటి చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనకు ‘కౌంట్డౌన్’ మొదలైంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభు త్వం గ్రామీణ ప్రాంతాలు, రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి భయానక పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఆదు కునే దిశగా చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనేక జిల్లాల్లో కరువు తీవ్రత పెరిగినా పట్టించుకోలేదు. ఇదీ నేపథ్యం... ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ సంస్కరణల అమల్లో భాగంగా ప్రైవేటీకరణ విధానా లతో ప్రజలపై పెనుభారాన్ని పెంచేలా విద్యుత్ చార్జీలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిని వ్యతిరేకిస్తూ సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షపార్టీలు ప్రారంభించిన విద్యుత్చార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు, డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. వైఎస్ నిరవధిక దీక్షతో ప్రజా ఉద్యమంగా... కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్.రాజశేఖరరెడ్డి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. దీంతో ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకొని ప్రజాఉద్యమంగా రూపుదాల్చింది. చార్జీల పెంపుదల నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ సీఎం చంద్రబాబుకు నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ లేఖ రాశారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా చేపట్టిన ‘చలో అసెంబ్లీ’పై బషీర్బాగ్ చౌరస్తా వద్ద చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిరసనకారులు ముందుకు సాగే ప్రయత్నం చేయగా, పోలీసులు కాల్పులకు దిగడంతో రామకృష్ణ, విష్ణువర్దన్రెడ్డి, బాలస్వామి తూటాలకు బలయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం, పోలీసుకాల్పుల ఘటనలు పరోక్షంగా టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణమయ్యాయి.విద్యుత్ అమరవీరుల స్మారకార్థం ‘షహీద్చౌక్’ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. పాదయాత్రతో ప్రజల హృదయాల్లో నిలిచిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎల్బీస్టేడియంలో ప్రజల సమక్షంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అక్కడికక్కడే నిండు సభలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ను అమలు చేస్తూ తొలి సంతకంపై వైఎస్ సంతకం చేశారు. అనంతరం బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద పోలీసుకాల్పుల్లో ముగ్గురు మరణించిన చోట విద్యుత్ అమరవీరుల స్మారకార్థం ‘షహీద్చౌక్’ను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ప్రతీ ఏడాది ఆగస్టు 28న చంద్రబాబు పాలనలో కాల్పుల ఘటనను గుర్తు చేసుకుంటూ ముగ్గురు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, సంస్థలు నివాళులు అర్పిస్తూ వస్తున్నాయి. గురువారం షహీద్చౌక్ వద్ద విద్యుత్ అమరవీరులకు జోహార్ జోహార్, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ వామపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆనాటి విద్యుత్ ఉద్యమం నేటికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. -
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?చంద్రబాబు ఇంతమోసం చేసికూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరికి వడ్డీసైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్లకాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలిఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోతపెట్టారు.మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్లమీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నావడ్డీ కింద మరో రూ.5వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధికోసం చేయూత కింద ప్రతిఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750ల చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, మా చిత్త శుద్ధికి నిదర్శనం.చంద్రబాబు మీరు… కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్లకోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ!’ విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. .@ncbn గారూ మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2025 -
ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్రెడ్డి
సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు...వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం...రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. -
గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటం పాపం కాదా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కొన్నిసార్లు హిందూత్వవాదిగా, కొన్నిసార్లు లౌకికవాదిగా రంగులు మార్చుతారని.. పీఠాలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చేసి, తాను హిందూవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలోనే తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు.. అలాంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని గట్టిగా నమ్మిన మనిషి వైఎస్ జగన్.. ఆయన వినాయకుని పూజ చేస్తే చంద్రబాబు భయపడి పోయారు. ఆగమేఘాల మీద విజయవాడలో వినాయకుని దర్శనానికి వెళ్లారు’’ అని విష్ణు పేర్కొన్నారు...అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకుని డూండీ వినాయకుని దర్శనానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. దేవుడి చెంత కూడా రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. అందునా విష ప్రచారం చేయటానికి నోరు ఎలా వచ్చింది?. జగన్ హయాంలో వినాయకుని మంటపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్ ని తెచ్చాం. మా విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ మాపైనే విమర్శలు చేస్తున్నారు. రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల మోత ప్రజల మీద వేసి, వినాయక పందిళ్లకు ఫ్రీగా కరెంటు ఇచ్చామంటున్నారు...అసలు ఎన్ని పందిళ్లకు కరెంటు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. చంద్రబాబు వెళ్లిన వినాయక మంటపం నిర్వాహకులు ప్రజల నుండి ఎంత విరాళాలు వసూలు చేశారో చెప్పాలి. 2019-24 మధ్య జగన్ హయాంలో కాణిపాకం ఆలయాన్ని పునర్నిర్మించారు. బంగారు రథాన్ని కూడా జగన్ హయాంలోనే చేశారు. చంద్రబాబు హయాంలో తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగాయి. భక్తులు మరణించారు...తిరుపతిలో జగన్ వకుళమాత ఆలయాన్ని నిర్మాణం చేశారు. హిందూమతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్నో పీఠాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు ఆ పీఠాల భూములను లాక్కున్నారు. విశాఖపట్నంలో ఊరు, పేరులేని కంపెనీలకు వేల ఎకారలను ఇస్తూ, శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
పవన్పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. అలాగే, లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? అని అడిగారు. పవన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు.సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడుతూ.. నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా తరువాత ఈ కేసును పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సీబీఐ విచారణ జరిపించాలి. సేనతో సేనాని అంటున్నారు.. నా కూతురుకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎమ్మెల్సీ అనంత విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నాను.గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపైయిన్ చేస్తాం. నిరాహార దీక్షకి కూడా పూనుకుంటాం. ఎనిమిది సంవత్సరాలు అవిటి తనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా?. లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు?. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
KSR Live Show: ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. ఆటో డ్రైవర్ల బిక్షాటన
-
విద్యార్థులా?.. కూలీలా?
సాక్షి, మైదకూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తరగతి గదిలో కూర్చోవాల్సిన విద్యార్థులు.. రాళ్లు, మట్టి ఎత్తుతున్నారు. విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే వారితో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైదుకూరు మండలం జీవిసత్రం సమీపంలోని నంద్యాలపేట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.జడ్పీ పాఠశాలలో కొత్త బిల్డింగ్ పనుల సందర్భంగా విద్యార్థులతో రాళ్లు, మట్టి ఎత్తిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై విద్యార్థులు పేరెంట్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు, ఐసీడీఎస్, కార్మిక శాఖ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.This is totally unacceptable @ncbn garu.How can your govt allow such abuse of children studying in govt school?Is this how you expect the children to grow under your stewardship @naralokesh?Shameful to even say this. https://t.co/dJk7TmXslT— PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) August 27, 2025 -
Magazine Story: రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, జగన్ మీద విషం కక్కుతూ కుట్రలు
-
చంద్రబాబు బతుకంతా మోసమే అంటూ వైఎస్ జగన్ ట్వీట్
-
మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కారు దివ్యాంగుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పెన్షన్లను రద్దు చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వారికి దివ్యాంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులను సైతం లంచాలు తీసుకున్నారంటూ దారుణంగా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తూ మంగళవారం ‘ఎక్స్’లో చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీశారు.⇒ సీబీఎన్ గారూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని మీ పాలనా కాలంలో రోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలే కాదు.. అంతకు మించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమే కాదు.. తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటికీ కోతలు పెడుతున్నారు.⇒ చంద్రబాబుగారూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024 మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కానీ మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472 మాత్రమే. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?⇒ విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?⇒ దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్ల కోసం గతంలో ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశాం. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం.కానీ, మీరు వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారూ ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, మరి అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా?⇒ వీటి పరిస్థితి ఇలాఉంటే.. ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతి పెద్దమోసం. అది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ! -
చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వికలాంగుల పెన్షన్ కోతపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమేకాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారు. చంద్రబాబూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024, మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వం హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కాని, మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్లకోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరుచేసి, 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం. కాని, మీరు వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారికి వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు..@ncbn గారూ… మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్… pic.twitter.com/VUKFqePO92— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025..చంద్రబాబూ.. ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఈ గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాలకోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా? వీటి పరిస్థితి ఇది అయితే, ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతిపెద్దమోసం. ఇది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ!’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
తమలపాకుతో కొట్టినట్లు.. నెమలీకతో మొట్టినట్లు..!
మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు.. సెలబ్రిటీలతో ఫొటోలతో కాలం గడుపుతూ ఉంటారు.. ఇటు ఎమ్మెల్యేలు దాదాపుగా తమ నియోజకవర్గాలకు సీఎంలుగా భావించుకుంటూ ఏకంగా నియంతలుగా మరి చెలరేగిపోతుంటారు.. ఇది పలుసందర్భాల్లో రుజువైంది.ఇలా ఎమ్మెల్యేలు కట్టుతప్పి మీడియాకు.. ప్రతిపక్షాలకు వార్తంశంగా మారిన ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు సీరియస్ గెటప్ వేస్తారు. వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ అందరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. ఎమ్మెల్యేలు భయ పడతారు. సొంత పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో చంద్ర నిప్పులు అంటూ కథనాలు వస్తాయి.. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయాక మళ్ళీ అందరూ ఎవరి స్టయిల్లో వాళ్ళు జనం మీద స్వారీ చేస్తారు.. మళ్ళీ బాబుగారు ఆగ్రహం నటిస్తారు.. తమలపాకుతో తీవ్రంగా కొడతారు.. నెమలీకలతో మొట్టికాయలు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆ దెబ్బలకు తాళలేక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ కుయ్యో మొర్రో.. ఇక ముందు మేం తప్పులు చేయం అని ఎటెన్షన్ లోకి వస్తారు.. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా తనకుతాను మహరాజులా.. నియోజకవర్గానికి సర్వాంతర్యామిలా మారిపోయి అధికారం చెలాయిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెలు ఆదిమూలం , గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వంటివాళ్ళు మహిళలను వేధించే పనుల్లో బిజీ అయ్యారు. వారిమీద సొంతపార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే ఏకంగా ప్రభుత్వ సిబ్బందికి రాత్రిపూట ఫోన్లు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయన దెబ్బకు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు ప్రయత్నించారు.ఇక నిన్నగాక మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే తగిన మత్తులో ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ సిబ్బందిని తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టినా అయన చప్పుడు చేయలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించగా ఆ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఇక ఎచ్చెర్ల జనసేన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర రావు అయితే నియోజనవర్గంలోని ఏ వ్యాపార సంస్థనూ వదలడం లేదు.. నెలవారీ మామూళ్లు ఇవ్వకుంటే వ్యాపారాలు నడవదు అని బహిరంగ వార్ణింగ్ ఇస్తున్నారు. జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు నడవాలంటే నా కనుసన్నల్లో ఉండాలి అంటూ చెలరేపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపేవాళ్లు లేకపోతున్నారు.నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీయార్ మీద ఇష్టానుసారం మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అభిమానులు హైద్రాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు. ఇది పార్టీని ఇబ్బంది పెట్టింది. మరోవైపు ఈ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించాలని చినబాబు లోకేష్ నిర్ణయించారట.ఏకంగా చంద్రబాబు వార్నింగులనే పట్టించుకోని ఈ ముదురు ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రిని లెక్క చేస్తారా? ఆయన మాకన్నా ఏం ఎక్కువ.. అయన చెబితే మేం వినాలా.. అసలు మా జిల్లాలో పక్కజిల్లా మంత్రి పెత్తనం ఏమిటన్న ఉక్రోషంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇంచార్జి మంత్రి మాటలు ఖాతరు చేస్తారా అని పార్టీ ఇన్సైడర్ టాక్ నడుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కోకిలపూడి శ్రీనివాస్ కూడా గెలిచింది మొదటి సారి కానీ బండెడు ఆరోపణలు.. పుట్టెడు వివాదాలతో తులతూగుతున్నారు.ఇక పరిస్థితి చేయిదాటిపోతుంది జనంలో పార్టీ, ప్రభుత్వం పరువుపోతుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు సీరియస్ అవుతుంటారు.. ఇలా ఐతే ఉపేక్షించను.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను.. ఈ విషయంలో ఎవర్నీ క్షమించేది లేదని హెచ్చరిస్తారు.. కాదు కాదు.. హెచ్చరించినట్లు కలరింగ్ ఇస్తారు.. ఇటు ఎమ్మెల్యేలు కూడా బెదిరిపోయినట్లు నటిస్తారు.. అందరూ చాయ్ తాగి సమోసాలు తిని భుజమ్మీద చేతులు వేసుకుంటూ బయటకు వస్తారు.. మళ్లీయే ఎవరి దందాలు వాళ్ళవి. ఇలా ఉంటుంది బాబుగారి ఆగ్రహం.-సిమ్మాదిరప్పన్న -
‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’
సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్లకు జూనియర్,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. -
‘కుప్పానికి కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్దే’
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ హయాంలోనే హంద్రీ-నీవా పుంగనూరు వరకు పూర్తయ్యాయని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ భరత్. హంద్రీ-నీవా పేరుతో కుప్పం ప్రజల్ని చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కుప్పానికి కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్ది. జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్ళీ ప్రారంభించి తన ఖాతాలో వేసుకుంటున్నారు. కుప్పానికి నీరు రావటానికి కారణమైన హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించిన నేత వైఎస్సార్.ఆ తర్వాత కాలువల నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.రూ.293 కోట్ల కాంట్రాక్టును రూ.576 కోట్లకు పెంచి అవినీతి చేశారు.అయినా పూర్తి స్థాయిలో పనులు కూడా చేయలేదు.జగన్ సీఎం అయ్యాక మిగతా పనులు పూర్తి చేశారు.రామకుప్పం దగ్గర ఈ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు. జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్ళీ ప్రారంభించి ప్రచారం చేసుకుంటున్నారు.చంద్రబాబులాగ జగన్కు ప్రచార పిచ్చి లేదు. ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి నీరిచ్చిన ఘనత జగన్దేనని స్పష్టం చేశారు. -
ప్రశ్నించడమంటే ఇదేనా పవనూ: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుడ్డా రాజశేఖరరెడ్డ పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీశాఖ అధికారుపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు’’ అంటూ మాధవ్ మండిపడ్డారు.ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పని చేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను దూషిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు.బుడ్డా రాజశేఖరరెడ్డిని అరెస్టు కూడా చేయలేదు. పైగా తూతూమంత్రపు కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలు తప్ప అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ పదవి కి రాజీనామా చేయాలి. పోలీసులపై దాడి జరుగుతుంటే పోలీసు సంఘం ఏం చేస్తుంది?. ఇంతవరకు కనీసం నోరెత్తి ఎందుకు ప్రశ్నించలేదు. బుడ్డా రాజశేఖరరెడ్డి దౌర్జన్యాలకు చంద్రబాబు అవార్డు ఇస్తాడేమో?’’ అంటూ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు. -
కొత్త చట్టం అధికారపార్టీకి చుట్టమైతే?
నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్నది వారు విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకు వస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అనిపిస్తోంది. వినడానికి మాత్రం ఇది బాగుందే అనిపించవచ్చు. కాని పరిశీలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి అర్థమవుతుంది.ప్రధాని లేదా ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఎవరైనా ముప్పై రోజులు జైలులో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమాటిక్గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టాన్ని సడన్గా ఎందుకు తీసుకు వస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీయేతర పక్షాలు ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక ఝాడిస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీ(యూ)లు కూడా మథన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం చిత్తశుద్దితోనే చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.కాని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలికాలంలో పెడదోరణులు ప్రబలిపోయాయి.తమ ప్రత్యర్దులను ఎలాగైనా అణచివేయాలని, తద్వారా శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రాయం మన నాయకులలో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా ఫర్వాలేదు. అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాయన్నది దాని సారాంశం. దానివల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహనా రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగానే చించివేశారు. ఒక రకంగా ఇది తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లు కాదా! పైగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆ ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమలులోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష పడడంతో రాజ్యసభ సభ పదవి పోయింది. ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీనే ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్షకు గురి కావడం, ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు కావడం జరిగిపోయింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పునరుద్దరించుకోగలిగారు. అది వేరే సంగతి.రాహుల్ ఈ ఉదంతంలో తాను చేసిన తప్పుకు తానే బలైనట్లే కదా! ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా? ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ,అప్పుడు ఇదే చట్టం బీజేపీ ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా? అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, కొందరు మంత్రులను అరెస్టు చేశారు. డిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైలులో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడి అరెస్టు చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా కేబినెట్లో కొనసాగారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ను జైలులో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ ఉంది.నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై చిత్తశుద్ది ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్టు అని.. ఇంకా చాలాచాలా మాటలు టీడీపీ అధినేత, 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రబాబు దానిని తనకు ఏటీఎం గా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరపగా వివిధ కాంట్రాక్టు వ్యవహారాలలో రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని తేలినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది.అప్పటికే కేంద్రానికి చెందిన ఈడీ అదే కేసులో పలువురిని అరెస్టు చేసింది. చంద్రబాబు వరకు కేసును ఈడీ తీసుకు రాలేదు.ఈలోగా టీడీపీతో మళ్లీ బీజేపీ జత కట్టింది. మరి ఇప్పుడు ఆ ఆరోపణలు సంగతేమిటి? అసలు ఆ కేసులలో నిజానిజాలు ఏమిటి? అన్యాయంగా చంద్రబాబు మీద ఆ ఆరోపణలు చేశారా?లేక వాస్తవం ఉందా? అన్నది ప్రజలకు తెలియనవసరం లేదా? తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలా మంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇలాంటివాటి గురించి మోడీ జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీ(యూ)లను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.దానికి తగినట్లుగానే టీడీపీ లోక్సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. అంటే ఈ బిల్లుపై వారు లోపల భయపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. జేడీ(యూ) నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది.ఇండియా కూటమి లోనే అవినీతిపరులు ఉన్నట్లు తమ పక్షంలో ఎవరూ లేనట్లు మోడీ మాట్లాడినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందరిపై కేసులు పెడుతున్నారు? దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అలాగే ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం లోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎం లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.మరో ఉదాహరణ చూద్దాం. దశాబ్దాల కిందట కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో ద్వంద ప్రమాణాలు పాటించడం లేదా? సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీ(యూ) పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కోరింది.దానిని ఆఘమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేసేశారు. తమ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ ను కోరింది. మొత్తం టర్మ్ పూర్తయ్యింది కాని, ఆ పిటిషన్ను తేల్చలేదు. ఇంకా పలు ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2014-19 మధ్యకాలంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అటు శాసన వ్యవస్థలోను, ఇటు న్యాయ వ్యవస్థలోను పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే అంతకుముందు టర్మ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు.పైగా వారంతా బీఆర్ఎస్లో విలీనమైనట్లు ప్రకటించారు. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాలలోను పరిస్థితులు ఇలాఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందా అన్న భయం అందరిలో ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దొడ్డి దారిన టీడీపీలోకి ఎంట్రీ.... ఆ తర్వాత జరిగింది ఇదే..
-
AP: తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు.
-
సీఆర్డీఏలో కన్సల్టెన్సీల జోరు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం సాగుతోంది. సీఆర్డీఏలో ప్రతి ప్రాజెక్టుకూ కన్సల్టెన్సీలను నియమిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వెచి్చస్తోంది. ఇప్పటి వరకు రాజధాని ప్రాజెక్టుల పేరుతో కన్సల్టెన్సీలకు ఏకంగా రూ.220.74 కోట్లు చెల్లించేందుకు సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. జోన్ 2, 4, 6, 10ల్లో చేపట్టిన పనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్టస్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.49.95 కోట్లకు అప్పగిస్తూ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.జోన్ 12, 12ఏలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ బాధ్యతలను నిప్పాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.40.44 కోట్లకు అప్పగించింది. అమరావతి రాజధాని ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక నిర్వహణ కన్సల్టెంట్ను సీఆర్డీఏ నియమించింది. ఈ బాధ్యతను ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.11.44 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది.జోన్ 1, 7లో చేపట్టే మౌలిక ప్రాజెక్టు పనులు పర్యవేక్షణ బాధ్యతను నిప్సాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.26.85 కోట్లకు అప్పగిస్తూ ఆమోదం తెలిపింది. జోన్ 5లో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణను రూ.23.89 కోట్లకు అప్పగించింది. జోన్ 9లో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను యుఎస్ఐ అండ్ ఇన్ఫ్రాకు రూ.20.93 కోట్లకు అప్పగిస్తూ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు ప్రాజెక్టు పనులు పర్యవేక్షణను టీయూవీ ఇండియా లిమిటెడ్కు రూ.22.25 కోట్లకు అప్పగించ -
‘లక్షల కోట్లు అప్పులు చేస్తూ దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వలేరా?’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. ‘దివ్యాంగుల మీద చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వారికి పెన్షన్లు కట్ చేసి అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానసిక వైకల్యం ఉంది. అందుకే అడ్డగోలుగా పెన్షన్లు తొలగించారు. దేశ చరిత్రలో ఏనాడైనా ఈ స్థాయిలో పెన్షన్ల తొలగింపు జరిగిందా?, చంద్రబాబు మాత్రమే ఏకంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించి తన కర్కశత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లాలో రామలింగారెడ్డి మరణం ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కనీసం దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేరా?, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా?, ఉన్నవాటిని కూడా తొలగించి వారి ఉసురు తీస్తున్నారు. దివ్యాంగుల్లో కూడా కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు చూసి పెన్షన్లు ఇవ్వటం ఏంటి?, నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోంది. అలాంటి వారికి కూడా ఎలా పెన్షన్లు తొలగించారు?, గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లను కాదనటం ఆ డాక్టర్లను అవమానించటం కాదా?, వికలాంగులను తీసుకుని వస్తున్న మా పార్టీ నేత ఉషశ్రీ చరణ్ని పోలీసులు అడ్డుకున్నారు. మూడు హెలికాప్టర్ లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా?, తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దరించకపోతే ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
బాబు ముఠా బార్ల దందా.. టీడీపీ సిండికేట్కు కట్టబెట్టేందుకు కుట్ర
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో 840 బార్లలో 72 బార్లకే అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిల్లో 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ స్కెచ్ వేసింది. దరఖాస్తులు వేయకుండా టీడీపీ నేతల సిండికేట్ చక్రం తిప్పింది. కమిషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. రేపటితో బార్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండగా.. 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు దాఖలు కాకపోవడం చర్చాంశనీయంగా మారింది. -
చంద్రబాబు ఖద్దర్ షర్ట్ విప్పి చూస్తే... TJR సుధాకర్ బాబు షాకింగ్ నిజాలు
-
Eluru: ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా
-
‘ఏపీలో విద్య, వైద్యం పక్కకు పోయి.. మద్యం మాత్రం దొరుకుతుంది’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ఏపీలో విద్య, వైద్యం సంగతి పక్కకు పోతే మద్యం మాత్రం ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. మద్యం పాలసీతో పేదల జీవితాలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై విరుకుపడ్డారు. ‘ ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది.కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు తెచ్చారు. సాధారణ ప్రజలు తాగి రోడ్డున పడి జీవితాలను నాశనం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు విస్తృతంగా మద్యం పంపిణీ చేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. వీధివీధినా మద్యం షాపులే దర్శనమిస్తున్నాయి. చివరికి కిల్లీ కొట్లు, పచారీ షాపుల్లోనూ బెల్టుషాపులు పెట్టించారుమద్యం మహమ్మారి పేద, మధ్య తరగతి జీవితాలను నాశనం చేస్తున్నాయి. వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు ఇచ్చి అక్కడే ఫుల్లుగా తాగమని లైసెన్స్ ఇచ్చారు. పేద కుటుంబాలను నాశనం చేయటమేనా చంద్రబాబు విజనరీ అంటే?, చంద్రబాబు అంటేనే మాయా ప్రపంచమని నిరూపిస్తున్నారు. 4,380 పర్మిట్ రూంలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం అమ్ముతున్నారు. మద్యం మీద ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయమంతా చంద్రబాబు జేబులోకి వెళ్తోంది. జగన్ హయాంలో మద్యం ఆదాయం రాష్ట్ర ఖజానాకి చేరింది. చంద్రబాబు ప్రివలేజ్ ఫీజు పేరుతో రూ.1100 కోట్లు తమ నేతలకు దోచి పెట్టారు. కొత్తగా మరో 3,736 బార్లు టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు. కల్లు గీత కార్మికులకు ఇవ్వాల్సిన షాపులను కూడా టీడీపీ వారికే కట్టబెట్టారు. చేసిన స్కాం బయట పడకుండా ఉండేందుకు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు’ అని టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్ ను, ఆయన మాతృమూర్తిని దూషించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
-
Puttaparthi: ఈ బతుకు ఇంకెందుకు.. ఏదైనా విషం ఇచ్చి వికలాంగులను చంపేయండి
-
పుట్టపర్తిలో రెడ్బుక్.. ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వెళ్లిన ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు. -
20 ఏళ్లుగా వస్తున్న పెన్షన్ ను ఇప్పుడెందుకు కట్ చేసారు
-
విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఉంది.కోర్టుని నమ్మించి..వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి. -
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పేదల పొట్టకొట్టే దయలేని రిచ్ సీఎం
-
మనమంతా ఒక కూటమి.. మీకు నేను.. నాకు మీరు.. కలిసి దోచుకుందాం..!
-
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఠా బార్ల దందా... టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్ని బార్లను కట్టబెట్టే కుట్ర
-
Ambati Rambabu: అబద్ధాలు ఆడేందుకు చంద్రబాబు కొంచెం కూడా వెనుకడుగు వేయరు
-
పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి -
ఘనంగా ‘వైఎస్సార్సీపీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: న్యూఢిల్లీలోని "Constitution Club of India" లో ఢిల్లీ,ఎన్.సి.ఆర్ పరిధిలో నివాసం ఉంటున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో,వైఎస్సార్సీపీ సానుభూతి పరులతో జరిగిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ను లాంచనంగా ప్రారంభించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, నలుమూలల నుండి వచ్చిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఐటి వింగ్ ప్రెసిడెంట్ పోసింరెడ్డి సునీల్ రెడ్డి , రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం MP గురుమూర్తి మాట్లాడుతూ... TDP కూటమి ప్రభుత్వం జగన్పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వేదికగా తిప్పికొడతామని అన్నారు. అబద్ధం పైన పోరాటం లక్ష్యంగా ఢిల్లీ విభాగం పని చేస్తుంది అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ లో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తామని చెప్పారు.ఐటి వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ ..ఐటీ వింగ్ కార్యకలాపాలు ఢిల్లీలో కూడా మొదలుపెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో చేసిన ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో నిజాన్ని బలంగా పలికి, అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అలానే ఈ ప్రోగ్రాం దగ్గరుండి అన్ని చూసుకున్న వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు..ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి ఢిల్లీలో స్థిరపడి ఇన్ని సంవత్సరాలు అయినా రాష్ట్రానికి మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నినాదించారు.. అందరి కోరిక తప్పకుండా 2029 సంవత్సరంలో తీరుతున్నది అని విశ్వాసం నెలకొల్పారు.రానున్న రోజుల్లో ఐటి వింగ్ ఆధ్వర్యంలో అన్నీ మెట్రో నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్య మంత్రి చేసుకొనే ఒక బృహత్తర కార్యక్రమంలో ఐటి వింగ్ తన వంతుగా కృషి చేస్తోందన్నారు. మనకు 2024లో ఆశించిన ఫలితాలు రాకపోయిన ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో• రాష్ట్ర ఐటి విభాగం అధ్యక్షుడు: సునీల్ రెడ్డి•రాష్ట్ర ఐటి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు: విజయ్ భాస్కర్ రెడ్డి.ఎన్నారై UK కోఆర్డినేటర్ కార్తీక్ ఎల్లాప్రగడఎన్నారై కెనడా కోఆర్డినేటర్ వేణురాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి.రాష్ట్ర ఐటీ విభాగం భాగం అధికార ప్రతినిధి జగన్ పూసపాటి.ఢిల్లీ కార్యదర్శులు: శ్రీకాంత్, శామ్యూల్, జోగారావు, పెంచలయ్య, అనిల్, విష్ణువర్ధన్ , సదానంద్, మధుసూదన్.మరియు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. -
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం చంద్రబాబులో మొదలైంది
సాక్షి,రాజమండ్రి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘సూపర్ 6హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని?వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు,మాటలు చెబుతున్నాయి. 14 నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్లో ఇదే కనిపించింది. చంద్రబాబులో భయం మొదలైంది. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వల్లే వేస్తున్నారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓటు షేరు 23 సీట్ల గాను 39.17 గా ఉంది.2024లో 11 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఓటు షేర్ 39.37గా ఉంది. 23 సీట్లు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి వచ్చిన 11 సీట్లకే అధికంగా ఓట్ షేర్ ఉంది.వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది. వైఎస్ జగన్పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది. సింగపూర్ వెళ్లిన దావోస్ వెళ్లిన పెట్టుబడులు రాలేదు. జగన్ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.జగన్ మళ్ళీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీదే ఒప్పుకుంటున్నారు.పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్మార్గమే కారణం.పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చకి పిలిస్తే నేను సిద్ధం. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా రూ. 400 కోట్లతో డయాఫ్రం వాల్ ఎందుకు వేశారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా.రూ.950 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే. ఓటమి ప్రభుత్వం 15 నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతుంది.చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది. 14 నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు. -
Janatantram: కేంద్రం కొత్త బిల్లు.. బాబుకు చెక్ పెట్టేందుకేనా!
-
గడువు ముగిసింది.. ఇక ఉద్యమమే..
-
‘తిరుపతిలో భూ ఆక్రమణలు.. బాబు, బీఆర్ నాయుడికి బాధ్యత లేదా?’
సాక్షి, తిరుపతి: తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో భూ భాగోతానికి తెరతీశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరం. ఆలయ భూములను టూరిజానికి కట్టబెట్టడంపై మేము అభ్యంతరం తెలిపాం. అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోంది. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?.టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. ఇది పూర్తిగా ధర్మం మీద దాడి. వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకుంటారా?. అత్యంత పవిత్రమైన టీటీడీ ల్యాండ్ టూరిజానికి ఇవ్వడమేంటి?. మరెక్కడో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవొచ్చు కదా?. టీటీడీ బోర్డు మీటింగ్లో మా అభ్యంతరాలను తిరస్కరించారు. మే నెల ఏడో తేదీన జరిగిన బోర్డు మీటింగ్లో ఆగ మేఘాలపై సమావేశం నిర్వహించారు. అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని టూరిజంకు బదలాయించారు. 05.08.25 క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదంతో 07.08.25 జీవో ఇచ్చారు. అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ప్రాంతం 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారు. ఆ విలువైన 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు ఇవ్వాలని చూస్తున్నారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వొచ్చు కదా. మంత్రి రాసలీలలు గురించి మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు. నేను ఏ ఒక్క విషయం వక్రీకరించలేదు. టీడీపీ నేత సుధాకర్ రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
ABN రాధాకృష్ణ రుణం తీర్చుకోవాలి