Chandrababu Naidu
-
‘ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, పదో తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలిచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా తమకు రావాల్సిన బకాయిలపై ఉద్యోగులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ, డీఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జగన్పై విషం చిమ్మారు2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్రధానంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పేద విద్యార్థులకు ఖరీదైన చదువులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎంతోమంది కూటమి నాయకులు వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు.ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాషకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. కూటమి అధికారంలోకి వస్తే సర్కారు బడుల్లో ఆనాడు అమలవుతున్న ఐబీ, టోఫెల్ విధానాలపై కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అమ్మ భాషను వైఎస్సార్సీపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీ మాతృ భాషకి వ్యతిరేకి అని మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రచారం చేశారు. తెలుగుభాషను విచ్చిన్నం చేస్తున్నామని అన్నారు. మాతృభాషకు ముప్పు ఉందని, మాతృ భాషలోనే బోధన కొనసాగాలని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయడానికి చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతుంటే చూసి ఓర్వలేని కూటమి నాయకులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయని కుట్రలు లేవు.ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందించాలని ముందుచూపుతో వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేడు హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఉన్నతంగా ఎదగాలంటే, నేటి సమాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిచేస్తూ 202-21లో ఆరో తరగతి వరకు మాత్రమే మొదటిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.ఆ తర్వాత ఒక్కో ఏడాది పదో తరగతి వరకు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులంతా వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నవాళ్లంతా ఇప్పుడు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి.జగన్ పాలనలో విద్యారంగంలో సంస్కరణలుపదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సర్కారు బడుల్లో వచ్చిన మార్కులతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఈ పిల్లలు ఇంతటి విజయాలు సాధించడానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన కష్టానికి ఫలితమేనని కూటమి నాయకులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు.తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్వీ వాటర్ ప్లాంట్లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్బీ ప్యానల్ బోర్డును లక్ష రూపాయలతో కొనుగోలు చేసి 62 వేల బోర్డులను ప్రతి క్లాసులోనూ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు లెక్కలు బాగా రావాలని పాల్ ల్యాబ్స్ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ను ప్రవేశ పెట్టడంతోపాటు 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లతో పాఠాలు చెప్పించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్యక్రమానికి వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచింగ్ మొదలు పెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది.కార్పొరేట్ స్కూళ్లకు చంద్రబాబు దాసోహంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వో ప్లాంట్ల నిర్వహణ గాలికొదిలేశారు. ట్యాబ్లు పాడైనా పట్టించుకోలేదు. ఆఖరుకి టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేదు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు. ప్రభుత్వ స్కూల్స్, విద్యారంగం గురించి కూటమి ప్రభుత్వంలో ఒక్క గొప్ప నిర్ణయం తీసుకున్న పాపానపోలేదు. ఇవేమీ చేయకుండానే కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు.వైఎస్ జగన్ అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైయస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్న చంద్రబాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమై వారి కోసం పనిచేస్తున్నాడే కానీ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.హామీలపై ప్రశ్నిస్తే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారుఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏలు ఇచ్చినా చంద్రబాబు మాత్రం 4 డీఏలు పెండింగ్లో పెట్టాడు. ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషనర్ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై యుద్ధం చేస్తే తప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు.పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో శాలరీ కోతలంటూ కూటమి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతోంది. ఏపీ హెచ్పీ అంటూ హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా ఉద్యోగాల జీతాలకు కోతలు విధిస్తామన్న హెచ్చరికలకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదు. అందరూ సంఘటితపై ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులను వైయస్సార్సీపీ ఆదుకుంటుంది. కూటమి పాలనపై సర్వేలు చేయించుకున్న చంద్రబాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని తెలిసి షాకయ్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మహానాడును నెల్లూరు జిల్లాకు చంద్రబాబు మార్చేశాడని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. -
చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు
-
జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్
-
ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?
-
పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: అకారణంగా తనని, తన కుటుంబాన్ని తిడితే ఊరుకోనిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ప్రెస్మీట్లో పోసాని మాట్లాడారు. నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. నాకు నచ్చిన పార్టీలన్నింటికీ సర్వీస్ చేశాను. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు ఆయనకూ సర్వీస్ చేశా. సినీ రంగానికి సేవల కోసమే నాకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. నిజం చెబితే ఎవరినైనా టార్గెట్ చేయడం సహజమే. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని తిడితే ఊరుకోను. నా కోపానికి ఎలాంటి హద్దులు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. -
వర్మ ఏంటి ఈ కర్మ.. ఇంచార్జి పదవి నుంచి తొలగింపు
-
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై టీడీపీ గుండాల దాడి
-
చంద్రబాబు అండతో భారీ భూ కబ్జా... గీతంకు హైకోర్టు నోటీసులు..
-
పవన్ ఫిర్యాదుతో వర్మకు బాబు వెన్నుపోటు
-
పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్వీఎస్ఎన్ వర్మ సైలెంట్గా ఉండిపోయారు. పవన్ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా. అయితే.. మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ భావోద్వేగంఈ నిర్ణయం వెలువడ్డాక వర్మ పిఠాపురం టీడీపీ ఆఫీస్కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా’’ అంటూ మాట్లాడారాయన.పిఠాపురంలో వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేయడంతో.. ఇప్పుడు ఆయన్ని ఇంచార్జ్ బాధత్యల నుంచి తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నియోజక వర్గంలో వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అధినేత కోసం వర్మ అంతలా ఆరాటపడితే.. పవన్ చెప్పుడు మాటలు విని ఇలా చేయడం ఏంటని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉండబోతోందా? అనే ఉత్కంఠ పిఠాపురంలో నెలకొంది. -
ఎర్రచందనం దొంగలతో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు.. Liveలో ఆధారాలు
-
ప్యాలెస్ కోసం నారా వారి స్కెచ్.. ఎర్రచందనం దొంగలతో బాబు, లోకేశ్
-
ప్రభుత్వ స్థలంలో టీడీపీ ఆఫీసు భూమి పూజ బాబుపై SV మోహన్ రెడ్డి ఫైర్
-
తమిళనాడు పరిస్థితే ఏపీ లో రిపీట్... TVK విజయ్ విజయంపై చింతా మోహన్ రియాక్షన్
-
YS జగన్ పై తప్పుడు కథనం జావా డిస్కవరీకు లీగల్ నోటీసులు?
-
తమిళనాడులో రివర్స్ అయిన చంద్రబాబు విజనరీ!
-
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు భారీ అవినీతి
-
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో ఆల్ టైం రికార్డు
-
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్టైం రికార్డు
సాక్షి,విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. మంగళవారం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. ఫలితంగా అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. స్వల్ప కాలంలో చంద్రబాబు పాలన అప్పు రూ.3,62,855 కోట్లకు చేరింది. తద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక అప్పులు చేసిన సీఎంగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3,62,855 కోట్లు అప్పు చేసింది. అంటే సగటున రోజుకి రూ.15,766 కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ.2,02,964 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు రూ.1,12,504 కోట్లు, రాజధాని అప్పులు 47,387 కోట్లుగా ఉన్నాయి. -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు. రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్బ్యాక్లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అలాంటప్పుడు ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా? ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి, మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్లో ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు తీర్చవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు. ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న విమర్శ ఉంది.ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది? టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది. చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు పాపం.. సీమకు శాపం
మార్కాపురం: చంద్రబాబు పాపం.. సీమకు శాపంగా పరిణమించిందని, రానున్న రోజుల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటి కోసం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా శైలజానాథ్, కారుమూరి, ఇతర వక్తలు మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లనుందని, దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి తానే చంద్రబాబుతో మాట్లాడి సీమ ప్రాజెక్టును ఆపించానని చెప్పారని, దీనిని బట్టి చంద్రబాబు రేవంత్తో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయం స్పష్టమైందని ధ్వజమెత్తారు. సీమకు అడుగడుగునా ద్రోహం చంద్రబాబు సీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారని, మెడికల్ కాలేజీలనూ పూర్తి చేయకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. నాడు శ్రీకృష్ణ కమిటీ దొనకొండను రాజధాని చేయాలని సిఫార్సు చేస్తే.. దానిని పక్కన పెట్టి తన బినామీలు, అనుచరుల కోసం అమరావతిని బాబు రాజధాని చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరితే పోలవరం నుంచి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు అందిస్తానని చెప్పడం ఎంత వరకు సబబని నిలదీశారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ సీమ హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. వెలుగొండ ప్రాజెక్టుపై బాబు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి, ఒంగోలు ఇన్చార్జిలు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, చుండూరి రవిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు మాట్లాడారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
అయ్యో ‘బాబు’!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ గెలుపొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు మద్దతుగా చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి అశి్వన్కుమార్కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు. -
అది రెడ్ బుక్ కాదు.. అది బ్లడ్ బుక్! తండ్రి కొడుకులపై రజిని ఫైర్
-
‘కట్టుకథలతో నాపై అట్రాసిటీ కేసు పెట్టారు’
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్లను కూడా రెడ్బుక్ వదల్లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు...ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు. -
రాజధాని అనేది ఫొటోలోనే.. నిజం అది మునిసిపాలిటీకి కూడా పనికిరాదు
-
‘చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదు’
సాక్షి, నెల్లూరు: ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ.. గుణపం పోటు పార్టీ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన వారిని మీ వెనుక వేసుకొని.. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడం కాదన్నారు. చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదని కాకాణి ఎద్దేవా చేశారు.గుణపం చంద్రబాబు చేతిలో పెడితే సింబాలిక్గా వుంటుంది. అమరావతిని గుణపంతో తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. దోపిడీ విజనరీతో అవినీతితో రాజ్యం ఏలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాలు పేరిట కాంట్రాక్టుల మాటున కొల్లగొడుతున్నారు’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి ధ్వజమెత్తారు. -
12 వేల కోట్లతో బుర్జు ఖలీఫా.. అమరావతిలో 3 బిల్డింగ్ కోసం 14 వేల కోట్లా?
-
నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది
-
పబ్లిసిటీ ఫుల్, సంక్షేమం నిల్ అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల పెన్షన్ పై లేదు
-
మా బాధ వినండి చంద్రబాబు.. రోడ్డెక్కిన YSRCP నేతలు
-
నీ అబ్బా సొత్తా అమరావతి.. అమరావతికి నేను వ్యతిరేకినే..!
-
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
జగన్ ప్రభుత్వమే బెటర్, మా టీడీపీ ప్రభుత్వంలో నాపైనే కేసులు, మద్యంలో అవినీతి బట్టబయలు
-
నాకు భయం లేదు, బాధ కూడా లేదు కేవలం ఆవేదన మాత్రమే
-
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి
-
సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు, విలేజీ సర్వేయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు లేని లోటును భర్తీ చేయడానికి 1.32 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను అడ్డంగా వాడుకుంటున్నారే తప్ప, కనీస హక్కులను పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, కనీసం బేసిక్ పే సవరణ కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.మరోవైపు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలో చేరిన తమకు మరుగుదొడ్లు, పెట్రోల్ బంకుల వద్ద డ్యూటీలు వేయడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అవకాశమే ఇవ్వడం లేదని పేర్కొన్నారు.పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, పదోన్నతులు కల్పించాలని.. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా, శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగులు ‘చలో విజయవాడ’, నిరాహార దీక్షలకు పూనుకుంటామని పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు
గంపలగూడెం: చంద్రబాబు, కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో పర్యటించి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆరా తీశారు. స్థానిక మార్కెట్యార్డులో వారాల తరబడి మొక్కజొన్న, ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడి చలించిపోయారు.అమ్మిరెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలంగాణలో మొక్కజొన్న క్వింటా రూ. 2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ రైతులకు రూ.1500 కూడా దక్కడం లేదన్నారు. ధాన్యం ఎక్కడపడితే అక్కడ రాశులు పోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను పట్టించుకునే నాధుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.రైతుల ఇబ్బందులు పట్టవా?సాగు ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర లేక.. చివరికి పండిన పంటలు సైతం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మలేసియా, సింగపూర్ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం తరలించడానికి వాహనాలు లేవు, సంచులు లేవు, రైతే ఖర్చు భరించి తరలించాలని అధికారులు సూచనలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆ మాటను నేడు నిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రి లోకేశ్ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అవినాష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరాటాలు చేస్తామన్నారు. ఆయన వెంట తిరువూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, ఉపాధ్యక్షుడు అత్తనూరి వెంకట శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్కుమార్, జెడ్పీటీసీ కోట శామ్యూల్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ అద్దాలకు రూ.2,540 కోట్లా!?
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ప్రజల కష్టార్జితాన్ని చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ.2,540 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తంచేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.18,500 వరకు ఖర్చుచేయడం ఏ రకమైన పాలనని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు తన అస్మదీయులకు సంపద సృష్టించేందుకు వేసిన నిరంతర దోపిడీ ప్లాన్ అని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్కు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని సజ్జల హెచ్చరించారు. ఆయనింకా ఏమన్నారంటే..చ.అడుగుకి రూ.18,500అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2,540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 వేల నుంచి రూ.14 వేలు అనుకుంటే.. మున్ముందు ఇది ఎంతకు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రాజధానిలో నిర్మాణం చేపడుతున్న 52 లక్షల చదరపు అడుగులకి ఈ నిర్మాణ ఖర్చు కూడా కలుపుతుంటే.. చదరపు అడుగుకి రూ.18,500 వరకు ఖర్చవుతుంది. అలాగే, పాలవాగును టవర్స్ మధ్యలో తిప్పుతూ కృష్ణానదిలో కలిపేలా డిజైనింగ్ చేస్తారట. ఆ డిజైనింగ్కు మరో రూ.వందో, రెండు వందల కోట్లో ఇస్తారు.రైతుల సందేహాలకు సమాధానంలేదుఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చుపెడితే నాలుగైదేళ్లలో పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బుల్లేవని చెబుతూ మరోవైపు.. అమరావతి కోసం ఇష్టారాజ్యంగా బరితెగిస్తున్నారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు మద్దతు ధరల కోసం నిధుల్లేవని చెబుతూ అమరావతి దోపిడీకి మాత్రం భారీగా నిధులు విడుదల చేయడం విడ్డూరం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. రెండో దశ భూములు తీసుకునే ప్రక్రియలో కూడా దోపిడీకి తెరలేపారు. కానీ, రైతులు తమ సందేహాలను అడిగితే వాటికి సమాధానంలేదు. పైగా.. తమకు కావాల్సిన వాళ్లకు, దగ్గరి వాళ్ల లేఅవుట్లకు మాత్రం ఎడాపెడా అనుమతులిచ్చేస్తున్నారు.అరెస్టులతో అణచివేయలేరుపూడి శ్రీహరిని సంబంధంలేని వ్యవహారంలో అరెస్టుచేశారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరు. మిమ్మల్ని రాజకీయంగా సమాధిచేసే శక్తి వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ఇక పేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడం చంద్రబాబుకు పేదలపై ఉన్న కక్షను తెలియజేస్తోంది. కాగా, మెంబర్షిప్, ఎస్ఐఆర్పై వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఫోకస్ పెంచాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ కీలక నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. -
‘అద్భుతం అంటూ నమ్మించి.. ఇలా దోచుకుంటున్నారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు. తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు. సజ్జల ఏమన్నారంటే.. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చిందిఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక జగన్, ఆయన కుటుంబ సభ్యులను దూషించారుమావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుందిఅది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయిందిఅందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారుఅమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపటమా?ఇది చూసి జనం బిత్తరపోతున్నారుబిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయిందిఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనంఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోందిఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదుపాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారటబిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంటదానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదుట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చునగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారుఅమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారుదీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదుగతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదుప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదుఅమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారురెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారుదానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదుకానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదుఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారుమెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదురైతులకు మద్దతు ధర లేదుఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవుకానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారుఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారుఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారురాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందిపేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారుచంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారువారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారుమేము అలాంటి వాటిపై స్పందించంప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాంఅసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారుపూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగిందిఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పిందిఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమేఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారుఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరుచంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాంఆ శక్తి వైఎస్సార్సీపీకి ఉందితిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధదేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇదిదినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదునెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారుఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారుధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్రఅందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారుఅంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు -
‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు. -
గొడ్డలి పార్టీ ఎవరిదో గూగుల్ ని అడిగితే సరి.. అడుగుదామా బాబూ ?
-
చంద్రబాబు 'మెంటల్' అనగానే బాలయ్య వైపు తిరిగిన కెమెరా..!
-
కిల్లర్ పార్టీ ?.. 23 నెలల్లో 740 దారుణ హత్యలు
-
పెట్రోల్, డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న వాస్తవం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం దాన్నుంచి తప్పించుకొనేందుకు మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందన్న విషయం కేంద్ర ప్రభుత్వ లేఖలతో బయటపడింది. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్న పెట్రోల్ డీజిల్ కొరత వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఊరూవాడా తెలిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే రాజకీయ అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పెద్ద అంశంగా మారిందని, ఉన్నట్టుండి ఈ సమస్య రావడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. రాజధాని పనులు చేసే కాంట్రాక్టర్లకు రిటైల్ ధరలో బల్్కగా ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీలను ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించిందని ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చను కొంతవరకైనా నివారించాలంటే మంత్రులు మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్ సమస్య ప్రభుత్వం వల్ల రాలేదని చెప్పాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆయిల్ కంపెనీల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇందులో ప్రభుత్వం తప్పు లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది.ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయిల్ కొరత ఉందని బలంగా ప్రచారం చేయాలని, అప్పుడే ప్రజలు కొంత శాంతిస్తారని చెప్పినట్లు సమాచారం. రాజధాని పనులకు అవసరమైన ఆయిల్ సరఫరా చేయాలని కేంద్రానికి రాసిన లేఖలు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం రాసిన లేఖల వివరాలు బయటకు ఎలా వెళ్లాయనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ వివరాలన్నీ బయటకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఇలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.9 మంది మంత్రులు ఒకేసారి సింగపూర్ పర్యటనకు వెళ్లడం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, రాజధాని నిర్మాణాలకు అంచనాలకు మించి భారీ రేట్లతో పనులు చేస్తున్న అంశాలపై మంత్రులు స్పందించాలని చెప్పినట్లు తెలిసింది. ఎంత చెప్పినా కొందరు మంత్రులు ఇలాంటి విషయాలపై మాట్లాడటంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తమ వల్లే వచ్చిందని వైఎస్సార్సీపీ చెబుతోందని, దాని క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలు: సీఎంటీమ్ ఏపీ పనితీరు వల్లే తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు వచ్చిందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు గురువారం మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు. తొలుత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించారు. -
కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ
-
టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా
-
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంఅమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్లో వైఎస్ జగన్ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపుఏపీలో టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి 1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది. -
అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు
-
‘16 ఏళ్లలో ఒక్క కాలనీ అయినా నిర్మించారా?’
తాడేపల్లి : జగనన్న కాలనీలపై ఎల్లీ మీడియా తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఎల్లో మీడియా వాటిపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్.. స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్పై రోత రాతలు ఎందుకని నిలదీశారు. జగన్ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. కోటి మందికి నివాసం కల్పించారన్నారు. చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసినా ఒక్క కాలనీ కూడా కట్టించలేదు. 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం జగన్ది.చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా ఎవరొచ్చినా వాటిని చూపిస్తాం. కొత్తగా ఊర్లనే ఏర్పాటు చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఒక్క సెంటు స్థలం ఇచ్చారా?, ఇళ్ల స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని ఎల్లో మీడియాకు జగన్ విమర్శించే అర్హత ఉందా?, జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్ కట్టించిన ఇళ్లను చంద్రబాబు ఓపెన్ చేసి ఫోటోలు దిగారు. జగన్ క్రెడిట్ని చంద్రబాబు చోరీ చేస్తున్నారు’ అని విమర్శించారు. -
‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబుపై చింతా మోహన్ సెటైర్లు.. రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి పెడుతున్నావ్
-
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు. -
జనంలో జగన్ ట్రెండ్.. దారికొచ్చిన బాబు, లోకేష్
-
నేను అనుభవించినదానికి కంటే 10రేట్లు ఎక్కువ అనుభవించేలా చేయకపోతే
-
ఎరువు మొత్తం.. డీజిల్లో కాలిపోయిందిగా!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను పోస్టింగ్లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్ను వారికి ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం. సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్ను బల్క్లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే. తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు -
అరాచకం, అస్తవ్యస్త పరిస్థితులే బాబు సుపరిపాలన!
ఆంద్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి? పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి. రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
జయము జయము చంద్రన్న పేరడీ సాంగ్ పాడి బాబుని ఏకిపారేసిన సీదిరి అప్పలరాజు
-
ఫ్రీ బస్సు ఉత్తుత్తిదే..!
అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణమంటూ పథకాన్ని ఘనంగా ప్రారంభించినా..దానిలో చాలా కోతలు, నిబంధనలు పెట్టి దగా చేశారు. ఇప్పుడు ఉన్న బస్సులు కూడా మహిళలను ఎక్కించుకోకుండానే వెళ్లిపోతున్నాయి. మహిళలు ఉన్నచోట బస్సులు సరిగా ఆపడం లేదు. ఇందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనే తార్కాణం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడుకు చెందిన మహిళలు బుధవారం అనంతపురం వెళ్లడానికి గుత్తి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. బస్సులు పాయింట్లో ఆపలేదు. ఎదురు చూసిన మహిళలు ఆరా తీయగా బస్టాండ్ వెనుక వైపు నుంచే వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. మహిళలు ఉన్న చోట బస్సులు ఆపడం లేదని వరలక్ష్మి, లక్ష్మి తదితర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఫ్రీ బస్సు ప్రచారానికే పరిమితం కాకుండా.. మహిళలకు ప్రయోజనకరంఉండే విధంగా నడపాలని కోరారు. లేని పక్షంలో ఫ్రీ బస్సు ఎత్తేయండి అని మహిళలు వాపోయిన విషయాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
‘డీఎస్సీ డీల్స్’లో ప్రలోభాల పర్వం
సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్మైండ్’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్మైండ్’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు. మాస్టర్మైండ్ గేమ్లో చిక్కుకున్నశాప్ ఉన్నతాధికారులు డీఎస్సీ డీల్స్లో కీలకమైన ‘మాస్టర్ మైండ్’ గేమ్లో శాప్ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్మైండ్ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దుచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్ రూమ్ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి. -
పిఠాపురం వర్మపై దాడి.. సీఎం చంద్రబాబు రియాక్షన్
-
మాకు OCD, CCD వ్యాధుల.. మీకున్న వ్యాధి గురించి చెప్పమంటారా
-
‘బాబు రాజకీయ జీవితామంతా కుట్ర, వెన్నుపోటు’
సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. -
అమరావతికి డీజిల్ తరలింపు.. ఏపీలో మాత్రమే ఇంధన కొరత
-
అధికారం ఉందని అహం చూపిస్తే.. పిఠాపురం వర్మకు చంద్రబాబు వార్నింగ్
-
పిఠాపురం వర్మపై దాడి సీఎం చంద్రబాబు రియాక్షన్
-
24 గంటల డెడ్ లైన్.. పెట్రోల్ బంకుల వద్ద YSRCP ధర్నా..
-
కూటమి సర్కార్కు వైఎస్సార్సీపీ అల్టిమేటం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.డీజిల్ కొరత కారణంగా మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించిన కేటాయింపుల పట్టిలో రైతులకు, వ్యవసాయ రంగానికి స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రెస్మీట్లో వడ్డీ రఘురాం ఏమన్నారంటే..వ్యవసాయ రంగం అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపురాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాదేళ్ల మనోహర్కు రైతులకు కనిపించలేదా?గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఆక్వా రంగం ఎలా బాగుపడుంది?ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?చేపలను కార్గో విమానాల్లో పంపాలా?గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.కూటమి ప్రభుత్వానికి 24 గంటలే డేట్లైన్రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి తక్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు. -
‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
బాబుకు బెస్ట్ రిఫార్మర్ అవార్డు ఎలా..? చేసింది గోరంత..చెప్పుకునేది కొండంత
-
అన్ని నేనే చేశా.. సొమ్మొకడిది.. సోకొకడిది..!
-
‘కు’ సంస్కరణలే బాబు మార్కు!
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి. వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు. ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం. 1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు. ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది. చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది? అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు. ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీరజ్ మిట్టల్ ని కలిసినప్పుడు చెప్పిన మాటలు.. సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి
-
మళ్లీ ఫస్ట్ వస్తోంది.. ముందు నెల జీతాలే ఇవ్వలేదు...
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో మళ్లీ ఒకటో తేదీ వస్తోంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) విభాగంలోని సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికీ ఏప్రిల్ ఒకటో తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు.వీరికితోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పని చేసే 3,600 మంది.. డిగ్రీ కాలేజీల్లో పని చేసే 900 మంది.. పాలిటెక్నికల్ కాలేజీల్లో పనిచేసే 500 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం ఏప్రిల్ ఒకటిన అందాల్సిన వేతనాలు ఇంకా రానే రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికితోడు పాఠశాల విద్య పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్ ఒకటిన జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.50 వేల మందిపై తీవ్ర ప్రభావంమొత్తం వందకు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సెర్ప్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27 వేల మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు (వీవోఏ – యానిమేటర్లు) సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులతోపాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చి నట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. -
చంద్రబాబు రాక... అప్పన్న భక్తులకు అవస్థలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనానికి మంగళవారం సీఎం చంద్రబాబు రావడంతో పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించారు. దాదాపు మూడు గంటలు మండుటెండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సింహగిరికి వచ్చారు. ఆయన రావడానికి గంటన్నర ముందు నుంచే కొండపైకి వెళ్లే రెండు టోల్గేట్ల వద్ద భక్తులు, విధులకు హాజరుకావాల్సిన దేవస్థానం ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు.ఘాట్రోడ్డులో బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో దర్శనం చేసుకున్న భక్తులు సింహగిరిపై బస్టాండ్ ప్రాంగణంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు తిరిగి వెళ్లే వరకు క్యూలైన్లలో ఉన్నవారితోపాటు ఎక్కడ వారిని అక్కడే నిలిపివేశారు. అయితే, చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. మధ్యాహ్నం పవళింపు సేవ కావడంతో దేవస్థానం అధికారులు దర్శనాన్ని నిలిపివేశారు. చివరికి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. -
డేటా సెంటర్ సరే.. ఉద్యోగాల మాటేమిటి?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో అదానీ – గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోందని, కానీ ఆ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఎన్ని ఉద్యోగాలొస్తాయో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీ పశ్చి మ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అదానీ – గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రస్తావించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఈ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమితోపాటు రూ.22 వేల కోట్లు రాయితీలు ఇస్తోందని, ఇవేకాకుండా భారీ ఎత్తున నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత భారీ స్థాయిలో రాయితీలు ప్రకటిస్తున్నా, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దానిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఒప్పందం జరిగిన సందర్భంలో డేటా సెంటర్ ద్వారా 1.80 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు సహా మంత్రులు, కూటమి నాయకులు ప్రచారం చేశారని... అయితే ఒప్పందంలో మాత్రం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే అంశాన్ని గుర్తించి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీసినా.. కనీసం ఈ రోజు శంకుస్థాపన సందర్భంగానైనా సరే ఉద్యోగాల కల్పనపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 25 వేల ఉద్యోగాలు వచ్చేలా నాడు ప్రణాళిక ‘‘గత వైఎస్సార్సీపీ హయాంలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 130 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు ఉద్యోగాల కల్పనకు వారి నుంచి ప్రభుత్వం హామీ తీసుకుంది. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని నాడే(2021 మార్చి 9న) సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాం.డేటా సెంటర్తోపాటు ఐటీ పార్కు, రీక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా అదానీతో ఒప్పందం చేసుకున్నాం. ఆ మేరకు 25 వేల మందికి ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థను ఒప్పించాం. ఈ నేపథ్యంలోనే విశాఖలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశాం’ అని చెప్పారు. ‘‘డేటా సెంటర్ శంకుస్థాపన వేదిక మీద కూడా మంత్రి నారా లోకేశ్ రాజకీయాలు మాట్లాడటం ఆయన అల్పబుద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై గొడ్డలి, లడ్డూ అంటూ లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన అవివేకానికి నిదర్శనం’ అన్నారు. -
భూములిచ్చిన ఊరినే బంధించి!
సాక్షి, విశాఖపట్నం: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాగేసుకుని.. పైసా పరిహారం కూడా చెల్లించకుండానే భూములిచ్చిన ఊరిని పూర్తిగా బంధించి అదానీ గూగుల్ డేటా సెంటర్కు చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్లువాడలో నిరసన జ్వాలలు రగలకుండా నలువైపులా పోలీసుల్ని కాపలా పెట్టి.. అట్టహాసంగా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆంక్షల నడుమ నిర్వహించింది. తొలుత 30 వేల మంది స్థానిక ప్రజలతో భారీ బహిరంగ సభ నడుమ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి నలువైపులా పోలీసులను మోహరించి.. ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగ్బంధించారు. గెడ్డలు, వాగులు, వంకలు, చివరకు పొలాల్లోని మామిడి తోటలను కూడా వదలకుండా పోలీసులు పహారా కాశారు. తమ భూముల్ని బలవంతంగా లాక్కున్నారనే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకుండా నిర్బంధించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు పరాకాష్టగా మారింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ కార్యక్రమం వద్ద రైతులు నిలదీయాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రెండు రోజుల నుంచి తర్లువాడ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భూములిచ్చిన వందలాది మంది రైతులను దరిచేరనివ్వలేదు.శంకుస్థాపన కార్యక్రమం ముగిసే వరకు గ్రామం నుంచి ఎవరూ బయటకు రాకుండా.. బయటి వ్యక్తులు ఊరిలోకి వెళ్లకుండా అప్రకటిత నిర్బంధాన్ని విధించారు. పొలం పనులకు, తోటపనులకు వెళ్తామని వచ్చిన రైతుల్ని కూడా వెనక్కి పంపించేశారు. తర్లువాడ నుంచి కేవలం ఇద్దరు టీడీపీ నేతలకు మాత్రమే సభకు హాజరయ్యేందుకు పాస్లు ఇచ్చారు. ఏయూ విద్యార్థులు, ఐటీ సెజ్లోని కంపెనీల ఉద్యోగుల్ని సభకు తరలించారు. ప్రభుత్వ దమనకాండతో భీతిల్లిన రైతులు, గ్రామస్తులు నష్టపరిహారం చెల్లించే వరకూ గూగుల్ డేటా సెంటర్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
పక్క రాష్ట్రాల్లో లేని సమస్య మనకే ఎందుకుంది? ప్రభుత్వం నిద్రపోతుందా?
-
‘ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం’
తాడేపల్లి: పక్క రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ ఎక్కడ లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఏపీలోని పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ‘పెట్రోల్,డీజిల్ కొరతలో ఏపీలో ప్రజా జీవనం స్తంభించింది. ఏపీలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజులుగా పెట్రోల్ కొరత ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ కొరత లేదు.ఏపీలో పెట్రోల్,డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం. ఇక్కడ పానిక్ భయంతో.. 0 సంక్షోభం అంతా మీరు క్రియేట్ చేసిందే. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారు. సమస్య పరిష్కరించకుండా ఏదో మాట్లాడుతున్నారు. 24న సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అమరావతి పనులకు పెట్రోల్, డీజిల్ కేటాయించాలని కోరారు. ఇది చట్టానికి విరుద్ధమని ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. మరో 20 ఏళ్ల రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంలో బాబు సిద్ధహస్తుడు. డీజిల్ తీసుకురాని వాళ్లు.. పరిశ్రమలు ఏం తీసుకొస్తారు?’ అని ప్రశ్నించారు. -
తుఫాన్ ను అరచేత్తో ఆపే సత్తా ఉన్న నువ్వు... డీజిల్ కొరతను నివారించలేవా?
-
చంద్రబాబు కాదు.. చేతకాని బాబు బాబుపై మహిళల ఉగ్రరూపం
-
ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి వైఎస్సార్సీపీ వినూత్న నిరసన
-
ABN రాధాకృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చెయ్యాలి
-
బాబుకి బుద్ధి రావాలి... రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ వద్ద YSRCP భారీ నిరసన
-
చేతకాని దద్దమ్మలు, నారా లోకేష్ ఎక్కడికో పారిపోయాడు
-
బాబు చేతకాని పాలన.. ఇంధన కొరతపై జగన్ ఆగ్రహం
-
నకిలీ విజనరీ నిర్లక్ష్యం.. ఏపీలో ఇంధన కష్టాలు
-
కృత్రిమ ఇంధన కొరత సృష్టిస్తున్న.. బాబు పాలనపై జగన్ ఫైర్
-
పెట్రోల్ కొరతకు జగన్ కారణమంట చంద్రబాబుపై వెంకటరెడ్డి సెటైర్లు
-
బాబు క్యూ విజన్.. నలిగిపోతున్న ఏపీ ప్రజలు
-
కూటమి మొద్దు నిద్ర.. పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్సీపీ నేతల నిరసనలు
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిచ్చాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ నిరసనలకు సిద్ధమైంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసలను పిలుపునిచ్చింది.వైఎస్సార్ జిల్లా..ఏపీలో ఇంధన, గ్యాస్ కొరతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.కేంద్ర పెట్రోల్, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను కలిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఏపీలో ఏర్పడిన కృత్రిమ కొరత, దానికి గల కారణాలను వివరించిన ఎంపీవెంటనే కేంద్రం కల్పించుకుని ఇంధన, గ్యాస్ కొరతపై చర్యలు తీసుకోవాలని లేఖఈ కొరత వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, వ్యాపార వర్గాలతో పాటు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయని వెల్లడి.అన్ని రాష్ట్రాల్లో గ్యాస్, ఇంధనాన్ని పూర్తి సామర్ధ్యంతో నిల్వ ఉంచాలని కేంద్రాన్ని కోరిన అవినాష్ రెడ్డి.ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని కోరిన ఎంపీఆంధ్రప్రదేశ్లో దాదాపు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీనే పెట్రోల్, డీజిల్ కొరత రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి కొరతలేదు.ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం.. సరఫరాదారులతో కుమ్ముక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తోంది.కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కొరతకు గల కారణాలపై విచారణ చేపట్టాలని కోరిన అవినాష్.ప్రజలకు కొరత లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి. కర్నూలు జిల్లా..పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఫైర్రాష్ట్రంలో చేతకాని పాలన నడుస్తోందంటూ తీవ్ర విమర్శలుపక్క రాష్ట్రంలో లేని ఇంధనం కొరత మన రాష్ట్రంలో ఉండటాన్ని చేతకానితనం కాదంటారా?సమృద్ధిగా అన్ని పెట్రోల్ బంకులలో ఇంధనం ఉందని ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహంఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్ళు తెరిచి చూసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్పత్తికొండలో పెట్రోల్ బంకులలో నో స్టాక్ పరిస్థితులపై పరిశీలించిన శ్రీదేవి.తిరుపతి జిల్లారైల్వే కోడూరులో పెట్రోల్ డీజిల్ ఇక్కట్లు..మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసనలువాహనదారులకు మద్దతుగా రానున్న రోజుల్లో భారీ నిరసనలు చేస్తామని ప్రకటనపశ్చిమగోదావరి జిల్లాతాడేపల్లిగూడెంలో బంకుల వద్ద రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన.పెట్రోల్, డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు.కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడ..ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..కూటమికి ఓట్లు వేసిన వాళ్లను చంద్రబాబు మోసం చేశాడు..సామాన్యుడు బాధ పడుతున్నారు..రైతులు యూరియా కోసం, పింఛన్ కోసం వృద్ధులు, రేషన్ కోసం మహిళలు, గ్యాస్ కోసం క్యూలో ప్రజలు నిలబడుతున్నారుఓటమి ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళన చేస్తుంది..చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం..ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వలేక పోతుంది..చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుంది..ఈరోజు నేను ఆలోచించింది రేపు భారత్ ఆలోచిస్తుంది అని చంద్రబాబు చెపుతున్నాడు..మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు..జల్సా లకు, డబ్బా కొట్టు రాజకీయాలకు కూటమి నేతలు వున్నారు.పెట్రోల్ బంక్ వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజలు ఏ విధంగా బూతులు తిడతారో తెలుస్తుంది..జగన్ను చూసి పరిపాలన ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలిచేతగానితనాన్ని పక్కన పెట్టి పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలి..పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉంటేగా రేషన్ పద్దతి..రైతులు ఇబ్బందులు పడుతున్నారు..ఆటో వాళ్ళు, ట్రాక్టర్, రోజు వారి పనులు చేసుకొనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు..తాడేపల్లి..నేడు పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలురాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ నిరసన కార్యక్రమాలుగత ఆరు రోజులుగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు కొరతఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కార్ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా వాహనాలుకోత మిషన్లు రాక డెల్టాలో నిలిచిపోయిన వరి కోతలుడీజిల్ లేక 108 సేవలకూ ఆటంకాలుప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు దిగిన వైఎస్సార్సీపీ. -
99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఎండాడలో ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం సుమారు రూ.1,000 కోట్లకుపైగా విలువ కలిగిన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024–29 ప్రకారం ఇన్ఫోసిస్ లిమిటెడ్కు మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో ఇన్ఫోసిస్ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.దీంతోపాటు ఎండాడ వద్ద సర్వే నెంబర్ 175/పీలో మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్కు కేటాయించడానికి ఏపీఐఐసీకి బదలాయించాలని రెవెన్యూశాఖను కోరింది. ఈ క్యాంపస్కు అవసరమైన మౌలికవసతులను రూ.79 కోట్లతో ఏపీఐఐసీ, వీఎంఆర్డీఏ కల్పించనున్నాయి.2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆరేళ్లలో రెండు దశలను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుకు 100 శాతం గ్రీన్ఎనర్జీని అందించాలని ఇంధన శాఖను ఆదేశించింది. భూమి అమ్మకం ఒప్పందం కుదిరిన 120 రోజుల్లోగా అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏపీలో ఇంధన కొరత.. చంద్రబాబు సర్కారుపై వైవీ ఆగ్రహం
సాక్షి,కృష్ణా: కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణాజిల్లాలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.మచిలీపట్నం పోర్టు, రాష్ట్రంలో డీజిల్ , పెట్రోల్ కొరత పై చర్చించాం. దేశంలో ఎక్కడా లేనంత కొరత ఏపీలోనే ఉంది. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరత పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరగా పోర్టులు పూర్తిచేయించేందుకు పోరాటం చేస్తాం. ఎన్నికల నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం చాలా వేగంగా సాగింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు పోర్టులు,ఫిషింగ్ హార్బర్లు పూర్తయిపోతాయి.మే 5 నుంచి 10వ తేదీలోపు మచిలీపట్నం పోర్టును సందర్శిస్తాంపోర్టు అధికారులను అనుమతి కోరాం.అనుమతులు రాగానే తేదీని ప్రకటిస్తాం.రెండు లక్షల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తున్నారు. కేవలం పదివేల కోట్లు పోర్టులు,హార్బర్లకు ఖర్చు పెట్టలేరా . వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం పోర్టుల పనులు చేపట్టడం లేదు.రాష్ట్రంలో అన్ని పోర్టులు, హార్బర్లు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.. పోరాటం చేస్తాం’అని హెచ్చరించారు. -
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరతే అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచి పెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోలు బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. విత్తనాలు దగ్గర నుంచి వంట గ్యాస్ వరకూ ఇదే పరిస్థితి‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవం మీకు కూడా తెలుసు..వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని హెచ్చరించారు..@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.తాజాగా ఆ… pic.twitter.com/xLLCXcFuHr— YS Jagan Mohan Reddy (@ysjagan) April 27, 2026 -
TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్
-
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ తరపున హామీ ఇస్తున్నాం.ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్సీపీ పాలనే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు. -
ఏపీలో ఇంధన కొరత.. చేతులెత్తేసిన బాబు
-
ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని YSRCP నిర్ణయం
-
ABN రాధాకృష్ణకు నడి రోడ్డు మీద శిక్ష తప్పదు జగన్ వచ్చాక ఎవర్నీ వదలం
-
పెట్రోల్ బంక్ డీలర్లతో బాబు కుమ్మక్కు..! బ్లాక్ అమ్మకాలు..!
-
పిచ్చి కుక్కలు.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
-
అసమర్థులు కూటమిపై YSRCP నేతలు ఫైర్
-
ఆకు రౌడీలతో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుంది.. భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్
-
రండి రండి..వద్దు రావొద్దు : చంద్రబాబు
బి.కొత్తకోట: చంద్రబాబు తంబళ్లపల్లె టీడీపీ నేతలతో చెడుగుడు ఆడుతున్నారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం రండి రండి అని పలుకుతూనే.. వద్దు వద్దు అంటూ సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితిపై తంబళ్లపల్లె టీడీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో అప్పటి టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.గత ఏడాది అక్టోబర్ నుంచి పార్టీకి ఇన్చార్జి లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రెండు నెలల క్రితం అమరావతికి శంకర్ను, పార్టీ మండల అధ్యక్షులను చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన నివాసంలో సమావేశం నిర్ణయించారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కాదు, వెళ్లిపోండి అని సమాచారం అందడంతో వెళ్లిన వారంతా నిరుత్సాహంగా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది.శనివారం సాయంత్రం శంకర్, నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఆదివారం ఉదయం అమరావతి రావాల్సిందిగా పార్టీ నుంచి సమాచారం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆహ్వానం వస్తుందా అని కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు ఈ పిలుపు ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. అప్పటికప్పుడు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా అంతలోనే మళ్లీ కబురొచ్చింది. వద్దు వద్దు మీరు రాకండి.. మళ్లీ ఎప్పుడు వచ్చేది చెబుతామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో నాయకుల్లో ఉత్సాహం గంటల్లోనే నీరుగారిపోయింది -
కుప్పంలో షాకింగ్ ఘటన ఇద్దరు మహిళలపై.. ఐదుగురి దాడి
-
నీ అనుభవం ఎందుకూ పనికిరాదు, నీ కొడుకేమో కనబడట్లేదు..
-
‘రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. ఏబీఎన్ మూసివేత కోరుకుంటున్నారా?’
వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా, రాధాకృష్ణపై ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు సహా వినతి పత్రాలు అందజేస్తున్నారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భూమన కామెంట్స్..తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ అక్రమ కేసులు పెట్టారురాధాకృష్ణ వైఎస్సార్సీపీపై ఉలుకు పలుకు రాతల్లో రాసిన రాతలు పట్ల సభ్య సమాజం తలదించుకుంటోదిఆయన క్షమాపణ చెప్పకుండా, విచ్చలవిడిగా రాష్ట్రం మీదకు వదిలేస్తున్నారుమాపై విషపు రాతలు రాసే వారికి ఈ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందినేను నిజాయితీకి కట్టుబడి ఉన్నా అని సుద్దులు చెప్తున్న రాధాకృష్ణ..ఆయన మాటలపై ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదురాధాకృష్ణ వాడిన పద ప్రయోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాంవిశాఖ..విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు కామెంట్స్..రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపించలేదు.రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ నడుస్తోంది..ప్రజా సమస్యలను డైవర్షన్ చేయడం కోసం చంద్రబాబు తన అద్దె మైక్లను తెరపైకి తెస్తున్నారు.మావిగన్ అంశాన్ని పక్కతోవ పట్టించడం కోసం రాధాకృష్ణతో తప్పుడు రాతలు రాయించారు.మహిళలను కించపరిచే విధంగా చెత్త పలుకులో రాతలు రాయించారు..సభ్య సమాజం తలదించుకునేలా రాధాకృష్ణ రాతలు రాశారు..రాధాకృష్ణ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సమన్వయంతో వ్యవహరించాము.రాధాకృష్ణ పై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు..పోలీసుల అధికారి పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారు..రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలి..కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.పోలీసులు తీరుపై రాధాకృష్ణపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము.గుంటూరు..మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ కామెంట్స్...వైఎస్సార్సీపీ కార్యకర్తల సతీమణులు అవమానించిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి.ఇప్పటికే 175 నియోజకవర్గాలలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాంఇప్పటి వరకు రాధాకృష్ణపై ఒక కేసు కూడా నమోదు చేయలేదుపోలీసులు రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటుఅధికార పార్టీకి ఒకలా.. ప్రతిపక్ష పార్టీకి మరోలా పోలీసులు చట్టాన్ని అమలు చేస్తున్నారుఆంధ్రజ్యోతి అక్షరమే మా ఆయుధం అని చెప్పుకుంటుంది ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఆభరణంవెంటనే ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలిక్షమాపణ చెప్పని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏబీఎన్ క్లోజ్ అవుతుందివైఎస్సార్ జిల్లాజిల్లా ఎస్పీని కలిసి ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు కోరిన వైఎస్సార్సీపీ నేతలుజిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నార్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డినేతల కామెంట్స్..వైఎస్సార్సీపీ నేతలను నొటికొచ్చినట్లు మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న నేతలుఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీసం పోలీసు శాఖ స్పందించడం లేదు.ఆయన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్చిన్న సోషల్ మీడియా పోస్టులకే కేసులు కడుతున్న ప్రభుత్వం..రాధాకృష్ణపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించిన నేతలువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్రాధాకృష్ణ బూతు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాంకానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదువైఎస్సార్సీపీ వాళ్లు కేకు కోసినా.. మేక కోసినా కేసులు పెడుతున్నారుమాపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారుమా ఇంట్లో మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదుమేం ఇచ్చే వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారుమా వినతిపత్రం తీసుకోవడానికి సీపీ, డీసీపీ భయపడిపోతున్నారుమహిళలంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిపోలీసులు మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్..పోలీసులు మా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారుచంద్రబాబు, టీడీపీ నేతల ఇళ్లలో ఉన్నవారే మహిళలా?.మా ఇంట్లో వారు మహిళలు కాదా. అంబటి రాంబాబును అరెస్ట్ చేసినపుడు ఉపయోగపడిన చట్టం రాధాకృష్ణకు వర్తించదా?.రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయరుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..ఏబీఎన్ ఒక బూతు ఛానల్మా కుటుంబంలోని మహిళలను కించపరిచారుచంద్రబాబు, లోకేష్, పవన్, బీజేపీ నేతలకు నాదొక సూటి ప్రశ్నరాధాకృష్ణ మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా?చంద్రబాబు.. నిన్ను అన్నారో లేదో తెలియని మాటలకు గుక్కపెట్టి ఏడ్చావుగారాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేకపోయారుమేం శాంతియుతంగా నిరసన చేయడానికి వెళ్తే దాడి చేశారని విమర్శించారుచంద్రబాబు ఇదేనా నీ సంస్కారంచంద్రబాబు ఎల్లవేళలా అధికారంలో ఉంటారనుకుంటున్నారా?.రాధాకృష్ణ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలిలేకపోతే ఏదో ఒకరోజు రాధాకృష్ణకు నడిరోడ్డుపై శిక్ష తప్పదుమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలిరాధాకృష్ణ తప్పు చేసినా చంద్రబాబు, లోకేష్, పవన్, టీడీపీ మంత్రులు సమర్థిస్తున్నారుఏ మొహం పెట్టుకుని మీరు రాధాకృష్ణ వ్యాఖ్యలు సమర్థిస్తారురాధాకృష్ణను చూసి చంద్రబాబు భయపడుతున్నాడుఎక్కడ తన గురించి పేపర్లో రాస్తాడోనని చంద్రబాబు భయపడుతున్నాడుమహిళా బిల్లు వ్యతిరేకించిన ముఖ్యమంత్రితో ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారుమళ్లీ సిగ్గు లేకుండా మహిళా బిల్లు పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతామంటున్నారుఇప్పటికైనా రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిలేకపోతే పోలీసులు రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలి.మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..రాధాకృష్ణ పై ఫిర్యాదు తీసుకోవాలన్నా పోలీసులు భయపడుతున్నారుఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందిప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందితన కుటుంబ సభ్యులను ఏదో అన్నారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారుమీ ఇళ్లలో వారే మీకు మహిళలా?మా ఇళ్లలో వారు మహిళలుగా కనిపించడం లేదాతన తల్లిని ఏదో అన్నారని పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారుఇప్పుడు పవన్ ఏమైపోయారు?.మహిళలంతా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.విశాఖ..వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్..రాధాకృష్ణ ఒక బ్రోకర్.ఇటు వంటి బ్రోకర్ను బొక్కలో వేయాలి.చంద్రబాబు కొంతమంది పిచ్చి కుక్కలను తయారు చేస్తున్నారు..చంద్రబాబు తయారు చేసిన పిచ్చి కుక్కలు ఇష్టానుసారంగా మొరుగుతున్నాయి..మావిగన్కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది .మావిగన్ నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి. -
అధికారంలో ఉంటే ఇలా.. లేకపోతే అలా.. అప్పుల కుప్పలు.. జల్సా ట్రిప్పులు
-
24 గంటల్లో 2 హత్యలు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
బాబు.. అంత ద్వేషమెందుకు?
పుట్టినరోజు నాడైనా ఎవరికీ అపకారం చేయకూడదన్నది చాలామంది సెంటిమెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టిన రోజునే సచివాలయ ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఆ రోజున చేశారో తెలియదు కానీ.. ఈ చర్య వల్ల ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు పరపతి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులను పలు రకాలుగా వేధిస్తోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నా ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తున్న ఉద్యోగ నేతను డిస్మిస్ చేయడం ఏమిటని చాలా మంది మదనపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 200 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్ అధికారులను ఏదో నెపంతో జైళ్లకు పంపించారు. ఇదంతా కక్ష సాధింపు, రెడ్ బుక్ అరాచకాలలో భాగంగానే సాగుతుందన్న విమర్శలున్నాయి. కొంతకాలం క్రితం తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ చంద్రబాబుకు పరువు నష్టం నోటీసు పంపిన పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండి, అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొంత విశాల దృక్పథంతో పనిచేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయాలి. చంద్రబాబు గతంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదని చాలామంది అంటుంటారు. ఇంతకీ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న అభియోగం ఏమిటి? గత ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏవో కొన్ని బస్ డిపోలలో ప్రచారం చేశారట. ఇది అవాస్తవమని, ఆధారాలు చూపాలని ఆయన కోరుతున్నారు.బస్డిపో మేనేజర్లు కూడా ఈ మేరకు నివేదికలు ఇచ్చారని ఆయన అంటున్నారు. అయినా ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. దానికి కారణం ఆయన టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పదే, పదే ప్రశ్నించడమే కారణం. పోనీ తన హయాంలో ఉద్యోగ సంఘ నేతలను టీడీపీకి అనుకూలంగా వాడుకోలేదా అంటే శుభ్రంగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఉద్యోగ సంఘ అధ్యక్షుడుగా ఉన్న అశోక్ బాబు, తదితర ఎన్జీవో నేతలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన రాజకీయ విన్యాసాలు అన్నిటిలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన సమక్షంలోనే ప్రధాని మోడీని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయినా వారు తప్పు చేయనట్లు లెక్క. ఆ తర్వాత కాలంలో అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన టీడీపీలో కీలకమైన ఒక నేతగా ఉన్నారు. అంటే చంద్రబాబుకు, ఆయనకు మద్య క్విడ్ ప్రోకో జరిగినట్లు కాదా? ఉద్యోగులను ఎన్నికల సమయంలో ప్రభావితం చేయడానికి కొందరు నేతలు ఆ రోజులలో ప్రయత్నించారా? లేదా? అన్నది అందరికి తెలుసు.అయినా 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ వీరెవ్వరిపైన కక్ష సాధింపులకు దిగలేదు. అంతేకాదు.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడానికి గట్టిగానే కృషి చేసినా సంఘాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కృషి చేసింది తెలియదా? టీఏ, డీఏ లేటు అవుతోందని ఆరోపిస్తూ ఒక కానిస్టేబుల్ ముఖ్యమంత్రి జగన్ను దూషించిన ఘటనలో సస్పెండ్ అయ్యారు. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఇదే చంద్రబాబు ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరొకటి ఉంది. నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ అనే ఆయన టీడీపీ నేత ప్రోద్బలంతో ఆనాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపై విచారణ చేసి, కావాలని సుధాకర్ అలా దుష్ప్రచారం చేశారని నిర్ణయానికి వచ్చాక సస్పెండ్ చేసింది. దానిని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు.. సుధాకర్ మద్యం సేవించి విశాఖలో రోడ్డుపైన రచ్చ చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ కానిస్టేబుల్ చర్యను కూడా ముఖ్యమంత్రికే ఆపాదించి, చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఆ తర్వాత కాలంలో సుధాకర్ అనారోగ్యానికి గురై మరణించారు. అందుకు కూడా జగనే కారణం అంటూ అబద్దపు ప్రచారం చేశారు.అప్పుడేమో ఉద్యోగుల పట్ల ఎంతో సానుభూతి ఉన్నట్లు, వారికి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడేవారు. అధికారంలోకి రాగానే తనకు గిట్టని, తనను ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నేతను ఏకంగా ఉద్యోగాల నుంచే డిస్మిస్ చేశారు. వెంకట్రామి రెడ్డిని కంట్రోల్ చేస్తే ఇంకెవరూ మాట్లాడరన్నది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు. కాని దీనివల్ల చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా అప్రతిష్ట అయితే తప్పకుండా వస్తుంది. ఉద్యోగులకు కూటమి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నది వెంకట్రామిరెడ్డి వాదన. గతంలో ఎప్పుడూ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగులో లేవని ఆయన చెబుతున్నారు. జగన్ టైమ్లో వచ్చిన సచివాలయాలను ప్రస్తుతం స్వర్ణ గ్రామాల ఆఫీసులు అని పిలుస్తున్నారు. ఆ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను వేధిస్తున్నారని, వలంటీర్లు చేసే బాధ్యతలను ఈ ఉద్యోగులకు అప్పగిస్తున్నారని, చివరికి పార్కింగ్ ప్రదేశాల వద్ద కాపలా పెడుతున్నారని, వీధి కుక్కలను లెక్కించే పని వీరికి అప్పగిస్తున్నారని వెంకట్రామి రెడ్డి అన్నారు.ఈ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడితో గుండెపోటుకు గురైకాని, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కాని దాదాపు వంద మంది మరణించారని ఆయన చెప్పారు. వీటన్నిటిని ప్రస్తావిస్తున్ననందుకే ఆయనపై కక్ష కట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారన్నమాట. నిజానికి సరైన ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఆధారాలు చూపకుండా ఉద్యోగం నుంచి తీయరాదు. దీనిపై న్యాయ పోరాటానికి ఆయన సిద్దం అవుతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి. గతంలో చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో సోదాలు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని ఆ కేసు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు చేసుకోగలిగారని చెబుతారు. స్కిల్ స్కామ్ కేసులో విచారించడానికి సీఐడీ శ్రీనివాస్ను పిలిస్తే ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు వెళ్లిపోయారు. దాంతో గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ అభియోగాలన్నిటిని ఎత్తివేసి జీతం బకాయిలతో సహా చెల్లించి ఉద్యోగం ఇచ్చింది. ఇలా చేయడం చట్టబద్దమేనా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక పోలీసు ఉన్నతాధికారి అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళారు. అయితే ఆయన ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చేయలేదని ఏకంగా పోలీసునే కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. కాని తన మాజీ పీఎస్ విషయంలో ఎందుకు అంత ఉదారంగా ఉన్నారో ప్రజలకు తెలియదా?.అలాగే మరో పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హోదాలో ఉండి టీడీపీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించే వారు. ఈ సంగతి ఒక టీడీపీ ఎమ్మెల్యేనే పార్టీ సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు అప్పట్లో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతారు. అది తప్పు కాదా? అవన్ని ఎందుకు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, ప్రజలందరిని సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేశారు కదా! కాని ఆయనే స్వయంగా వైఎస్సార్సీపీ వారికి ఏ పనులు చేయవద్దని ఎలా అధికారులకు బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారు?. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెప్పడం ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. దేశ రాజ్యాంగం పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆయన కుమారుడు లోకేశ్ ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు. వెంకట్రామిరెడ్డి నిజంగానే వైఎస్సార్సీపీకి ప్రచారం చేసి ఉంటే తప్పే అయితే, అంతకు మించి వీరంతా తప్పు చేసినట్లు కాదా? ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ అరాచకాలు చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది.టీడీపీ వారు ఏ ఫిర్యాదు చేసినా ఆగమేఘాల మీద కేసు బుక్ చేసి వైఎస్సార్సీపీ వారిని, చివరికి జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తున్నారే. అదే టైమ్ లో వైఎస్సార్సీపీ వారు తమపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదే! మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరబడి టీడీపీ రౌడీలు, గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు. వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ఆరోపణ చేసి ఉద్యోగం నుంచి తీసివేసిన ప్రభుత్వం ఈ అకృత్యాలకు బాధ్యత వహించదా!. వీటన్నిటిని ప్రశ్నిస్తూ చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు అంటూ మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పటికైనా వీటన్నిటికి నైతికంగా, చట్టపరంగా జవాబివ్వక తప్పని రోజు ఒకటంటూ రాకుండా ఉంటుందా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టవర్లు దిగాల్సిన ఏపీ ‘క్వాంటమ్ టెక్’
ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీ అమలు చేయాలంటే, దాన్ని ప్రభుత్వ శాఖలు పాటించేట్టుగా చేయాలా,‘ప్రైవేట్’గా అయినా ఫర్వాలేదా అనే చర్చకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ ‘కూటమి’తో కలిశాక, ఈ ‘ప్రైవేట్’ ధోరణి మరింత స్పష్టంగా ఉంది. ఏదైనా ఇది ‘ప్రైవేట్’గా ఉందేమీ అనిపిస్తే... అది రాజధానికి కోసం కదా, అని ఎవరికి వారు జవాబు చెప్పుకోవలసి వస్తున్నది. అమరావతిలో ఇండియాలో తొలి ‘క్వాంటమ్ వ్యాలీ’ అన్నప్పుడు... ‘యూజర్లు’ రాష్ట్రంలో లేక దానిపై పెద్దగా చర్చకాలేదు. ఎక్కడైనా ఒక కొత్త ‘టెక్ ఫెసిలిటీ’ వస్తుందంటే, దానిపై స్పందించేది ‘యూజర్ల’ కంటే ముందు ఆ ‘ట్రేడింగ్ కమ్యూనిటీ’. మరి పరిశ్రమ రంగానికి ‘సీఐఐ’ లాగా సాఫ్ట్వేర్ రంగానికి ‘నాస్కామ్’ ఉన్నా దీనిపై దాని స్పందన లేదు. ఏప్రిల్ 14న ఏపీలో జరిగిన ఈ ప్రారంభానికి ఢిల్లీ ఐటీ మంత్రిత్వశాఖ నుంచి ఇద్దరు అధికారులు, చెన్నై ఐఐటీ నుంచి ఒక ప్రొఫెసర్ హాజరయ్యారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఇందులో ఉందని చెబుతున్నా, ‘నాస్కామ్’ ఊసు లేకపోవడంతో ఇది – ప్రైవేట్ యూనివర్సిటీల్లో ‘అకడమిక్స్’కే పరిమితమా అనే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం మంగళగిరి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనూ, గన్నవరం మేధా టవర్స్ హెచ్సీఎల్ టెక్నాలజీస్లోనూ ‘క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్’ ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రారంభానికి నాలుగు రోజులు ముందు సీఎంవో అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, పాత ‘క్లాసికల్ కంప్యూటర్ చేసేవన్నీ ‘క్వాంటమ్ కంప్యూటర్’ చేస్తుందనీ, కానీ ఇది వేగంగా ‘అపరేషన్స్’ పూర్తిచేస్తుందనీ, ఇది వచ్చాక కూడా పాత ‘కంప్యూటింగ్’ విధానం ఉంటుందనీ, కృత్రిమ మేధ, రక్షణ, కమ్యూనికేషన్, మెరుగైన హెల్త్ కేర్ టెక్నాలజీకి ఇది దోహదపడుతుందనీ అన్నారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు అంటే, అదెప్పుడు రావాలని కోరుకునేదే. అయితే, దేశంలోకి దీన్ని తెచ్చే ‘క్రెడిట్’ ముందు ఏపీ తీసుకోవాలి అనుకుంటే, క్షేత్రస్థాయిలో దీని వినియోగం (అప్లికేషన్) విషయంలో కూడా ప్రభుత్వం ముందుగానే కసరత్తు చేయాల్సింది. అప్రమత్తత ఉందా?ఇలా అనడానికి కారణం ఉంది. హెల్త్ కేర్ టెక్నాలజీ అన్నప్పుడు, మనకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వద్ద ‘కిడ్నీ’ రోగుల సమస్య ఉంది. మార్కాపురం వద్ద ‘ఫ్లోరైడ్’ సమస్య ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ‘డేటా’లో తేడాల విషయం తరుచూ కేంద్రం సమీక్షలకు గురవుతూ ఉంది. వీటిని ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ ద్వారా ‘రియల్ టైమ్’లో సరిచేయడానికి సమాంతర ప్రయత్నం జరిగితే, ‘అది పై నుంచి కిందికి’ అనే అనుసరణీయ సూత్రంవర్తించే నిర్ణయం అయ్యుండేది. ఇక్కడే మాట్లాడుకోవలసిన విషయం మరొకటి ఉంది. కొత్త ‘టెక్నాలజీ’ని తీసుకు రావడమంటే, ప్రభుత్వాలు ఎంత అప్రమత్తతతో ఉండాలో గ్రహించే సందర్భం కూడా అనుకోకుండా ఇదే తేదీల్లో సంభవించింది. జరిగింది ఏమిటి? ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) రంగంలో కీలక పరిణామంగా ‘ఆంత్రోపిక్’ తన కొత్త ఏఐ మోడల్ ‘క్లాడ్ మిథోస్ ప్రివ్యూ’ను ఐటీ మార్కెట్లోకి తెచ్చింది. ఇది అత్యంత శక్తిమంతమైన మోడల్ అని ఆ కంపెనీ చెబుతున్నది. అది నిజం కావొచ్చు, అయితే దీని అసాధారణ సామర్థ్యాలు సైబర్ భద్రతా ప్రమాదాలను పెంచే అవకాశముండటంతో, ప్రజలకు దీని విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోడల్ను విడుదల చేయకుండా ‘ఆంత్రోపిక్’ కంపెనీ ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అనే కొత్త ‘ప్రాజెక్టు’ను దీని పనితీరు మదింపు కోసం చేస్తున్నది. భారత ఐటీ రంగ ప్రధాన సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ‘నాస్కామ్’ పరిధిలో పనిచేసే ‘డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సీఈఓ వినాయక్ గాడ్సే దీని గురించి చెబుతూ – ‘సైబర్ దాడులకు ప్రభుత్వ శాఖల ఐటీ సిస్టం తేలికైన లక్ష్యాలు అవుతాయి. ఎందుకంటే, వాటి సెక్యూరిటీ సిస్టం కూడా పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, శాఖల మధ్య విస్తరించి పలు స్థాయుల్లో అది పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు. ఇది జరిగాక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్– ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంక్ చైర్మన్లు, ఎలక్ట్రానిక్స్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖాధికారులతో సమావేశమై ‘ఆంత్రోపిక్’ వల్ల మన బ్యాంకు లావాదేవీలకు వాటిల్లే సమస్య గురించి అప్రమత్తం చేశారు. ఎంతో రీసెర్చి దన్ను ఉండే కేంద్ర మంత్రిత్వశాఖ ఒక కొత్త ‘టెక్నాలజీ’ అమలుపై ఇలా ఆచితూచి అడుగులు వేస్తుంటే; ఏపీ సీఎం అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ కోసం రెండు ‘టవర్లు’ కడతాము అంటున్నారు. రాజధాని అంటే – ఏపీ సీఎం దృష్టిలో అది ప్రజల కోసమా లేక ‘కార్పొరేట్’ ప్రయోజనాల కోసమా అనే చర్చకు దారితీసే చర్యలివి. ఏప్రిల్ 14 అంటే, గతంలో డా‘‘ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఉండేవి. కానీ ఏపీలో అది– ‘వరల్డ్ క్వాంటమ్ డే’ అయింది. వ్యాసకర్త సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల వ్యాఖ్యాత -
దస్తగిరి హత్య కేసులో చంద్రబాబు మాట విని నవ్వులపాలైన ఎల్లో బ్యాచ్
-
పాలకుల నిర్లక్ష్యం.. దళారులదే రాజ్యం
ఉయ్యూరు/కంకిపాడు/తెనాలి: పాలకుల తప్పుడు విధానాలతో రైతులు, కౌలురైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ థావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో రెండో రోజైన ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. అశోక్ థావలే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు.దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయలేకపోవడంతో పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ రంగాలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు, కౌలురైతులు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.బలవంతపు భూ సేకరణను అడ్డుకుంటాంరాజధాని పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరానికి మించి ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని ఆలిండియా కిసాన్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ థావలే స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల అవగాహన సదస్సు ఆదివారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం గుడివాడలో నిర్వహించారు. తొలుత భూ సేకరణకు మార్కింగ్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.అశోక్ థావలే మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో కేవలం 70 మీటర్ల వెడల్పు అవసరమని చూపిన ప్రభుత్వం, భూసేకరణకు వచ్చేసరికి 250 మీటర్ల వెడల్పుకు మార్కింగ్ చేసినట్లు చెప్పారు. ఈ పరిణామాలతో పూర్తిగా రైతులు నష్టపోతారన్నారు. ప్రభుత్వంపై రైతులంతా సమష్టిగా పోరాడితే ఆలిండియా కిసాన్ మహాసభతో పాటు రైతు సంఘం అండగా నిలుస్తుందని వెల్లడించారు. సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె.అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రెడిట్ దోపిడీలో బాబు గిగా స్పీడ్!
సాక్షి, అమరావతి: మొన్న ఎన్టీపీసీ గ్రీన్ పవర్.. నిన్న రెన్యూ పవర్.. నేడు డేటా సెంటర్..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తున్నానంటూ రెండు రోజుల క్రితం రెన్యూ పవర్ శంకుస్థాపన సభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు తాజాగా తాను తెచ్చిన గూగుల్ డేటా సెంటర్తో విశాఖ విశ్వనగర మంటూ అనుకూల మీడియాలో ప్రచారానికి తెర తీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విశాఖలో అదానీ డేటా సెంటర్ సాకారం కాగా అందుకోసం 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం) కేబుళ్లు కోసం గత ప్రభుత్వం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాయడం తెలిసిందే.ఇప్పుడు అదే డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ అంటూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ దోపిడీకి పాల్పడుతోంది. అయితే అది అదానీ డేటా సెంటరే అని సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ ఇప్పటికే బయటపెట్టడంతో చంద్రబాబు సర్కారు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. డేటా సెంటర్పై గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగా అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను అదానీ, భారతీ ఎయిర్టెల్ గ్రూపుల భాగస్వామ్యంతో గూగుల్ ఏర్పాటు చేస్తోందని అంగీకరించడంతోపాటు భూములు అదానీ పేరిటే బదలాయించి ప్రోత్సాహకాలు సైతం కల్పిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనం.బాబు సమక్షంలోనే తేల్చేసిన అదానీ.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 14న ఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును ప్రస్తావించలేదు.అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ ఈ డేటా సెంటర్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. భారతీ ఎయిర్టెల్ గ్రూప్ కూడా ఈ డేటా సెంటర్లో తాము భాగస్వాములమంటూ ట్వీట్ చేసింది. గూగుల్తో కలిసి తాము రూ.15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించడంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.జీవో సాక్షిగా బండారం బద్ధలు.. చంద్రబాబు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో మీడియా సమక్షంలో ఎండగట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే గూగుల్తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని బయటపెట్టారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమేనని చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవో సాక్షిగా రుజువైంది.క్రెడిట్ చోరీని కప్పిపుచ్చేందుకు తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్ఫ్రా పేరుమీదకు బదలాయించడమే దీనికి తార్కాణం. ఒకపక్క కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020 నవంబర్లో విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్కు డేటా వచ్చేందుకు వీలుగా 3,900 కి.మీ. పొడవున సముద్ర గర్భంలో కేబుళ్ల ఏర్పాటుకు 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.వైఎస్ జగన్ కృషితో సాకారం.. గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అదానీతో జత కట్టడమే కాకుండా నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్ను 2022 అక్టోబర్ 11న లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్ కోసం గత ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్ను తాము నిర్మించడం లేదని.. దీన్ని అదానీ గ్రూపే చేపడుతోందని, అందువల్ల భూమిని కూడా అదానీ ఇన్ఫ్రాకే కేటాయించాలని కోరుతూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు లేఖ రాశారు.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ కృషితో సాకారమైన డేటా సెంటర్ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఎలా వేసుకున్నారో వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టిన విషయం తెలిసిందే. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్సీ కేబుళ్లు సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటుకు వైఎస్ జగన్ అంకురార్పణ చేశారు. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఏపీలో తీవ్రంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. అంగీకరించిన చంద్రబాబు
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు. ఏపీలో పెట్రో కొరతకు సంబంధించి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయన సమీక్షలో అధికారులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కంపెనీలు రిటైల్ ఔట్లెట్లకు ఇంతకు ముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీని ఫలితంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత కొనసాగుతోందన్నారు. అధికారులతో చెప్పిన దానితో ఏకీభవించిన చంద్రబాబు.. ఈ ఇంధన సంక్షోభాన్ని తొందరగా నిలువరించాలని చంద్రబాబు సూచించారు. కాగా, మూడు రోజుల నుంచి ఏపీలో పెట్రో కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నయార, రిలయన్స్, జియో బంకులకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శనివారం పెట్రోల్, డీజిల్ డిమాండ్ 34 శాతం పెరగగా, ఆదివారం 22 శాతం పెరిగింది.విజయవాడ నుండి తిరుపతి వరకు హైవేలలో అనేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.సమస్య ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు...టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు...తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్ రూమ్లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు. -
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్ జగన్ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోస్టుల భర్తీలో సర్కారు దొంగాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమని ఊదరగొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ససేమిరా అంటోంది. ఓ పక్క జాబ్ కేలండర్ అంటూ ప్రకటనలు చేసిన పాలకులు దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ‘నో’ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. దేవదాయ శాఖలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీచేయకుండా కేవలం 11 పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ శాఖలోని సిబ్బంది వేతనాలను దేవాలయాలపై వచ్చే ఆదాయం నుంచే చెల్లిస్తారు కాబట్టి వేతనాలకు నిధుల కొరత సమస్య ఉత్పన్నం కాదు. అయినా ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కారు అంగీకరించడంలేదు. కేవలం 11 పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతినిచ్చినట్లు సమాచారం. రెండేళ్లుగా గ్రూప్–3 కేడర్లో ఉన్న ఈ ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే వారి ఆశలకు ప్రభుత్వం గండికొడుతోంది. 140 పోస్టుల్లో 11కే అనుమతి.. దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, వెంటనే వివిధ కేడర్లలో 140 పోస్టులు భర్తీచేయాలని సంబంధిత శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏయే కేడర్లో ఎన్ని పోస్టులు అవసరమో వివరాలూ అందించింది. ఇందులో డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ గ్రేడ్–1) 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ గ్రేడ్–3) 104, జూనియర్ అసిస్టెంట్ 20 పోస్టులు భర్తీచేయాలని కోరింది. అయితే, ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అనుమతివ్వకుండా కేవలం డిప్యూటీ కమిషనర్ పోస్టులు 6, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఐదింటికి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.దీంతో ఇన్నాళ్లు ఈ కేడర్ పోస్టుల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఆశించిన నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. గతేడాది ఆగస్టులోనూ కేవలం ఏడు గ్రేడ్–3 ఈఓ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగా, వాటికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే, వీటిని ఇలా నేరుగా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులతో నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసినా ఇతర శాఖల్లోని సిబ్బందితో నింపేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది. డీఎల్, డీవైఈఓ ఫలితాల వెల్లడికి తాత్సారం మరోవైపు.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్లలో చాలావరకు పరీక్షలు పూర్తయినా ఫలితాలు విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. 2023 డిసెంబరులో 290 డిగ్రీ లెక్చరర్, 38 డీవైఈఓ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటికి 2024లో స్క్రీనింగ్, గతేడాది జూలైలో మెయిన్స్ పరీక్షలు పూర్తిచేశారు. తొమ్మిది నెలలవుతున్నా ఈ ఫలితాలు మాత్రం ప్రకటించడంలేదు. రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయని ఇంతకాలం ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. అయితే, గ్రూప్–1, 2 ఫలితాలు ప్రకటించిన ఏపీపీఎస్సీ డీఎల్, డీవైఈఓ ఫలితాలను విడుదల చేయలేదు. వాస్తవానికి.. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, విద్యాశాఖలో డీవైఈఓలు లేక ఎంఈఓలే ఇన్చార్జిలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పోస్టుల ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
టీడీపీ బాంబుల పార్టీనా..గునపం పార్టీనా ?
-
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. -
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను చంద్రబాబు.. రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్
-
నిరుద్యోగ భృతిపై విశాఖలో YSRCP భారీ ర్యాలీ
-
చేసేవన్నీ వాళ్ళ మంత్రులు, MLAలే.... కొంచెంకూడా సిగ్గుండదా..
-
మూడో కంటికి తెలియదు.. చేతికి మట్టి అంటదు.. అదే చంద్రబాబు విజన్
-
మద్యం అక్రమ కేసులో ఈడీ సోదాలు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, హైదరాబాద్లోని పలువురి నివాసాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి, మరికొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన సమీప బంధువు నివాసంలోనూ సోదాలు చేశారు. పది మంది ఇళ్లలో దాడులు జరిగాయి. అందరి ఇళ్ల వద్ద ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించడంతో వారు సోదాలు పూర్తి చేసుకుని వెళ్లారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు వారు అడిగిన డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిసింది. అడిగిందే అడుగుతూ రొటీన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో పెద్దగా ఏమీ లభించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ మద్యం విధానంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసిన క్రమంలో శుక్రవారం సోదాలు కొనసాగించారు. -
సర్కారు ఆస్పత్రుల్లో సంకటం
విజయవాడ జీజీహెచ్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూత వేటు దూరంలో ఉండే విజయవాడ జీజీహెచ్లో రోగులే సిరంజీలు, దూది, మందులు, సర్జికల్ పరికరాలను బయట కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు తీవ్ర కొరత పరిస్థితులు దాపురించాయి. ఆస్పత్రులకు ప్రభుత్వం సరిపడా మందులు, సర్జికల్స్ను సరఫరా చేయకపోవడంతో బయట కొనుక్కోవాలని సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. దీంతో దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న పదీ పరకా ఖర్చయిపోయి పరామర్శకు వచ్చిన బంధువులు, స్నేహితులను అప్పు కోసం చేయి చాపాల్సి వస్తోందని రోగులు, కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. పీహెచ్సీల్లో 214, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 417, జిల్లా, బోధనాస్పత్రుల్లో 712 రకాల చొప్పున మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏ ఒక్క చోటా నిర్దేశించిన మేరకు లేవు. ఇక వైద్య రంగంలో అత్యంత కీలకమైన బోధనాస్పత్రుల్లో 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. వీటికి కూడా తీవ్ర సంక్షోభం నెలకొంది. మందులు, సర్జికల్స్ కొరత నేపథ్యంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ విజయవాడ జీజీహెచ్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను పరిశీలించింది. చేతిలో చీటీలతో ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ వద్ద రోగులు, వారి సహాయకులు తండోపతండాలుగా క్యూ కట్టి కనిపించారు. బీపీ బిళ్లలు, నాజల్ డ్రాప్స్, సిరంజిలు, కాటన్, ఎగ్జామినేషన్ గ్లౌజ్లు, రక్త నమూనాలు సేకరించే ట్యూబ్లు, సర్జికల్, బ్లడ్ థిన్నర్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వివిధ రకాల మందులు బయట కొనుక్కోవాలని చీటీలు రాయడంతో రోగులపై రూ.300 నుంచి రూ.వేలల్లో భారం పడుతున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్లలో ఇదే దుస్థితి నెలకొంది. ఈ మందులు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీల్లో టిక్ పెట్టిన విజయవాడ జీజీహెచ్ సిబ్బంది » గుంటూరు జీజీహెచ్లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎస్సెన్షియల్ యాంటిబయోటిక్స్ కొరత వేధిస్తోంది. బీ–కాంప్లెక్స్, ఎకోస్ప్రిన్, మల్టీ విటమిన్ మాత్రలు సరిపడా ఉండటం లేదు. న్యూరాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో గతంలో నెల, రెండు నెలలకు సరిపడా ఇచ్చిన మందులను తీవ్ర కొరత నేపథ్యంలో ఇప్పుడు వారం, పది రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా సెకండరీ హెల్త్ ఆస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. » ఉత్తరాంధ్రలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా సక్రమంగా లేకపోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట శాపంగా మారుతోంది. డయాలసిస్ రోగులకు అవసరమైన కాల్సిట్రియోల్, ఫెబుక్సోస్టాట్, సోడియం బైకార్బొనేట్, కోర్తలిడన్, విటమిన్, టోర్సెమైడ్ లాంటి మందులను రోగులే బయట కొనుక్కోవ్సాలిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేజీహెచ్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. సర్జికల్స్ మెటీరియల్స్కు తీవ్ర కటకట నేపథ్యంలో గాయాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డ్రెస్సింగ్ కోసం అవసరమైన మందులు, సూదులు, కిట్స్ కూడా బయటకు రాస్తున్నారు. ఇమ్యూనోగ్లోబులిన్స్, వెంటిలేటర్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, గుండె వ్యాధులకు వాడే మందులకు కొరత ఏర్పడింది. కర్నూలు, అనంతపురం, తిరుపతిల్లోని బోధనాస్పత్రుల్లోనూ మందులు, సర్జికల్స్కు తీవ్ర కొరత ఉంది. సర్జికల్స్ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. » సీఎం సొంత జిల్లా చిత్తూరువ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో బీపీ, విటమిన్, విరేచనాలు, జలుబు, దగ్గు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం వాడే మందులకు కొరత నెలకొంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యల కోసం వాడే రాంటాక్ బిళ్లలు కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేక బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. » కుక్క కాటుకు పీహెచ్సీల్లో ఇచ్చే ఏఆర్వీ వ్యాక్సిన్తో పాటు క్యాల్షియం, విరోచనాలు, బీపీ, గ్యాస్ మాత్రలు, జలుబు, దగ్గు సిరప్ల నిల్వలు నామమాత్రంగా కూడా లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి గ్రామ స్థాయిలోని విలేజ్ క్లినిక్స్లోనూ నెలకొంది.సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఖాళీ..!చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. మందులు, సర్జికల్స్ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదని సూపరింటెండెంట్లు, వైద్య శాఖ పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం అదనపు బడ్జెట్ ఇవ్వడం లేదు. 2025–26లో కేటాయించిన బడ్జెట్ మూడు క్వార్టర్లకే ఖర్చయిపోవడంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని వైద్య శాఖ అభ్యర్థించింది. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా అదనంగా విదల్చకపోవడంతో ఇతర బడ్జెట్ను అరకొరగా సర్దుబాటు చేసి డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన పర్చేజ్ ఆర్డర్లను ఏపీఎంఎస్ఐడీసీ ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చింది. 2025–26 చివరి క్వార్టర్ మందులే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్(సీడీఎస్)కు పూర్తి స్థాయిలో చేరని దుస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేయాల్సిన సీడీఎస్లలో నిల్వలు తరిగిపోయాయి. ఏలూరు జీజీహెచ్లో మందుల కొరతపై ఇటీవల తీవ్ర వివాదం నెలకొంది. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్కు సంబంధించిన మందులు, సర్జికల్స్ సరఫరా కోసం మార్చి నెలలోనే ఇండెంట్లు తీసుకుని పీవో (పర్చేజ్ ఆర్డర్) జారీ చేయాలి. ఏప్రిల్ ముగుస్తున్నా ఇంకా ఇండెంట్లు తీసుకునే ప్రక్రియ ముగియ లేదు. రాష్ట్రంలోని అన్ని సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్స్)లలో శుక్రవారం నాటికి 712 రకాల మందులకు గాను 150–400 రకాలు నిల్వలు లేవు. పశ్చిమ గోదావరి సీడీఎస్లో 300 లోపు మందులే ఉన్నట్లు సమాచారం. సీఎం సొంత జిల్లాలోని చిత్తూరు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం సీడీఎస్లలో 400 లోపు రకాల మందుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆస్పత్రులకు మందుల సరఫరాలో సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కిడ్నీ బాధితులకు ఎంత కష్టం..ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో బాధితుల వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) కింద ప్రత్యేకంగా పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వాస్పత్రులకు నాణ్యమైన, ఖరీదైన మందులను సరఫరా చేసింది. కూటమి సర్కారు వచ్చాక సీకేడీ మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కో కిడ్నీ బాధితుడిపై మందుల కొనుగోళ్ల రూపంలో నెలకు రూ.15 వేల మేరకు భారం పడుతోంది. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పిన పలాస కిడ్నీ కేర్ సెంటర్ను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. మందులు, సర్జికల్స్ను సక్రమంగా సరఫరా చేయడం లేదు. డయలైజర్ల కొరత నెలకొంది. డయాలసిస్ రోగులు వీటిని బయట కొనుగోలు చేసేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. సప్లయ్ లేదంటున్నారు2019లో నాకు కిడ్నీ జబ్బు బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నా. గత ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేది. ఏడాదికిపైగా మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రుల్లో అడిగితే సప్లయ్ లేదంటున్నారు. కూలికి పోతే గానీ పూటగడవని పరిస్థితి మాది. బయట కొనేందుకు ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఎంతో కష్టంగా ఉంది. – కూర్మారావు, కిడ్నీ బాధితుడు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాప్రతిసారి బయటే కొంటున్నాంమా మనవడికి పుట్టుకతోనే కాళ్ల వంకర సమస్య ఉంది. చికిత్స కోసం తరచూ జీజీహెచ్కు వస్తుంటాం. ప్రతిసారి బాబుకు డ్రెస్సింగ్ మెటీరియల్ బయటే కొంటున్నాం. – మేరీ, మైలవరంబీపీ బిళ్లలు బయట కొన్నామా అమ్మ నరాల సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. విజయవాడ జీజీహెచ్లో అడ్మిట్ చేస్తే బీపీ బిళ్లలు బయట కొనుక్కోమని చీటీ రాసిచ్చారు. – సుబ్బారావు, మంగళగిరిపెద్దాస్పత్రిలోనూ అంతే..వారం కిందట వడదెబ్బ తగలడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లా. వైద్యులు రాసిన మందుల చీటితో కౌంటర్కు వెళితే రెండు రకాల మందులు బయట కొనుక్కోమన్నారు. స్థానిక పీహెచ్సీలో వైద్యం సరిగా లేదని వ్యయప్రయాసలకోర్చి పెద్దాస్పత్రికి పోతే అక్కడా అదే తంతు. – మహేశ్వరి, వీరకనెల్లూరు, చిత్తూరు జిల్లావిజయవాడ వన్టౌన్ గొల్లపాలెంగట్టులో నివసించే శ్రీనివాసరావు కార్పెంటర్గా జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య సమస్యతో విజయవాడ జీజీహెచ్కు రావడంతో సీటీ స్కాన్ చేశారు. రిపోర్ట్ ఆధారంగా వైద్యులు ఆరు రకాల ఔషధాలు సూచించారు. మందుల కౌంటర్కు వెళితే మూడు రకాలు బయట కొనుక్కోవాలని చెప్పారు. దీంతో జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ షాప్లో మందులు కొన్నాడు. ‘ఉచిత వైద్యం చేస్తారని ప్రభుత్వాస్పత్రికి వస్తే మందుల కోసం రూ.300కిపైనే ఖర్చయింది. సీటీ స్కాన్ ఫిలిమ్ కోసం మరో రూ.300 తీసుకున్నారు. రిపోర్ట్ వాట్సప్లో పెట్టిస్తే చాలని డాక్టర్ చెప్పారు. అలా పెట్టం అని రూ.300 వసూలు చేశారు. నా ఒకరోజు సంపాదన మందులు, రిపోర్టులకే ఖర్చయిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు లక్ష్మి స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. వ్యవసాయ కూలీ. కొన్నేళ్లుగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్న ఆమె భర్త రమణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వారం క్రితం విజయవాడ జీజీహెచ్లో అడ్మిట్ చేశారు. ‘కాళ్లావేళ్లా పడితే బుధవారం ఐసీయూకు మార్చారు. బీపీ బిళ్లలు కూడా బయటే కొన్నాం. ఇప్పుడు సిరంజీలు కూడా బయట కొనాలంటున్నారు. పొలం పనులు చేసుకుని జీవించే వాళ్లం. ఉచిత వైద్యం కోసం వస్తే మాతోనే డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు..’ అని బోరుమంది.కమీషన్ల రోగం..రోగుల ప్రాణాలతో చెలగాటం» రాష్ట్రవ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత » విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే.. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లు మరమ్మతులకు.. » కమీషన్లు ఇచ్చే కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వడానికి టెండరు ప్రక్రియ సాగదీతసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుతోంది. పేద రోగుల ప్రాణాల కంటే కమీషన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓ పక్క వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోపక్క కొత్తవి కొనుగోలు విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం జీజీహెచ్లోని అనస్తీషియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉంటే వాటిలో రెండు పనిచేయడంలేదు. దీంతో అత్యవసర కేసులను విజయవాడ జీజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు.అలాగే విజయవాడ జీజీహెచ్లో 80 వెంటిలేటర్ల అవసరం ఉండగా, 35 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని పనిచేయని దుస్థితి. తిరుపతి రుయాలో 120 వెంటిలేటర్లు ఉంటే 60 మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ 100 వరకూ వెంటిలేటర్ల అవసరం ఉంది. కర్నూలు జీజీహెచ్లో 369 ఉంటే, 191 పనిచేయడంలేదు. ఇక్కడ కొన్ని నెలలుగా 70 వెంటిలేటర్లు సమకూర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత బోధనాస్పత్రులను వెంటిలేటర్ల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తుంటే అస్మదీయ సంస్థలకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ఏడాదికి పైగా టెండరు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు సాగదీస్తున్నారు.తిరస్కరించిన కంపెనీల అర్హత కోసం..2024లో ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కి ప్రతిపాదనలు వెళ్లాయి. గతేడాది జనవరిలో టెండర్లు పిలిచారు. అయితే దానిని రద్దుచేశారు. అనంతరం.. గతేడాది డిసెంబరులో వెంటిలేటర్ల కోసం ప్రత్యేకంగా టెండరు పిలిచారు. బిడ్ల మదింపు అనంతరం అర్హత సాధించిన ఎనిమిది సంస్థల పరికరాలకు ఈనెల 7, 8 తేదీల్లో డెమో నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ తెచ్చిన పరికరాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇవి ప్రమాణాల మేరకు లేవని, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని వైద్యుల బృందం కుండబద్దలుకొట్టి తిరస్కరించినట్లు సమాచారం. అయితే, వైద్యశాఖ ఉన్నతాధికారే రీ–డెమో పెట్టి తిరస్కరించిన పరికరాలన్నింటినీ ఆమోదించాలని ఆదేశించారు. ఈనెల 28న రీ–డెమో నిర్వహణకు కార్పొరేషన్ సమాయత్తమైనట్లు సమాచారం. అవసరం లేకున్నా..కమీషన్ల కోసం గతేడాది పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ పరికరాలను అవసరం లేకపోయినా బోధనాస్పత్రులకు పెద్ద మొత్తంలో డంప్ చేశారు. రూ.9 కోట్లు విలువచేసే 80 పరికరాలను డీఎంఈ ఆస్పత్రులకు ఆర్డర్ పెట్టారు. వైద్యసేవలతో ఏమాత్రం ప్రమేయంలేని, కళాశాలల్లో కూడా డిమాండ్ లేని ఈఎన్టీ సిమ్యులేటర్ల కొనుగోలు రూపంలో మరో కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా ఒకే కంపెనీ పరికరాలను సరఫరా చేసేలా దాని అనుబంధ సంస్థలు రెండు టెండర్లు వేస్తే వాటిని ఆమోదించి, కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
జగన్ జగన్ అంటూ జపం నిద్రలో తండ్రీకొడుకు కలవరింతలు..!?
-
సెల్లెఫోన్ లైట్ల వెలుగులో రోగులకు వైద్యం
-
‘విద్యుత్ చార్జీలపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు’
తాడేపల్లి : విద్యుత్ చార్జీలపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ భాబు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు.. ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇది కాకుండా 23 నెలల్లోనే రూ. 20 వేల కోట్ల భారాన్ని జనం మీద మోపారని టీజేఆర్ విమర్శించారు.ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. చంద్రబాబు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా.. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారన్నారు. ‘విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ 2003లో మహిళలు ధర్నాకు దిగితే గుర్రాలతో తొక్కించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి మళ్లీ మాయమాటలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. విద్యుత్ కొనుగోళ్లలోనూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. సెకీ నుంచి వైఎస్ జగన్ 2.49 రూపాయలకు కొంటే.. చంద్రబాబు 4.49 రూపాయలకు కొన్నారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బయట పెడుతున్నారనే వైఎస్ జగన్ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు నిద్రలో కూడా జగన్ జపమే చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
నీ డప్పు ఆపు... ప్రజల కష్టాల వైపు కొంచెం చూడు...
-
ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారా?
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కథనమే ఇది. అందులోను ఎల్లో మీడియా ఈ రకమైన స్టోరీలు ఇచ్చిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు తగ్గించారని, ఏపీ ఆర్ధిక పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని, జాగ్రత్తపడకపోతే అధోగతే అంటూ టీడీపీ పక్షాన పనిచేసే ఆంధ్రజ్యోతి బానర్ వార్తను ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలలో ఆరు నెలలపాటు ముప్ఫై శాతం కోత పెట్టాలని , మూడు,నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఖర్చు తగ్గించుకుంటున్నట్లు కనిపించడానికి ఆ రాష్ట్రం ఈ చర్య చేపట్టింది. .తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం దీనిని క్లూగా వాడుకుని తన మీడియాకు ఒక లీక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.ఏపీలో ఆర్ధిక పరిస్థితి అంతంతేనని, అప్పుల భారం అదికం అవుతోందని,అందువల్ల ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని రాయండని ఎల్లో మీడియాకు పురమాయించి ఉండాలి.తదనుగుణంగా ఆ మీడియా రాజభక్తితో ఆ కధనాన్ని ఇచ్చి ఉండాలి. విశేషం ఏమిటంటే తమిళనాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేంద్రం సహకారంతో ఏపీ బుల్లెట్ వేగంతో అభివృద్ది చెందుతోందని చెప్పారని కూడా ఇదే ఎల్లో మీడియా రాసింది.చంద్రబాబు చెప్పినదానిలో వాస్తవం ఉంటే ప్రభుత్వం పక్షాన పేద ఏడుపులు ఏడుస్తూ ఎల్లో మీడియా ప్రజలను ఎందుకు భయపెట్టింది? చంద్రబాబు అబద్దం చెప్పినట్లా?లేక ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లా?ఇదే ఎల్లో మీడియా 2024 ఎన్నికల సమయంలో కూటమి మానిఫెస్టోకి భజన చేస్తూ అద్భుతం, అమోఘం, చంద్రబాబు సంపద సృష్టించగలరు.తద్వారా సూపర్ సిక్స్ హామీలతో సహా ఎన్నికల మానిఫెస్టో అంతటిని చిటికిన వేలుతో అమలు చేసేయగలరు అని ఎందుకు ప్రచారం చేశారు.అందులో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని, అంటే జీతాలు పెంచుతామని ఎందుకు హామీ ఇచ్చారు? ఉద్యోగుల ఇతర కోర్కెలను నెరవేరుస్తామని ఎలా చెప్పారు?ఇప్పుడేమో ఆర్ధిక క్రమశిక్షణ అవసరం అని సన్నాయి నొక్కులు ఎందుకు రాస్తున్నారు?ఇది ప్రజలను ,అందులోను ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం కాదా ?అన్న ప్రశ్న వస్తుంది కదా!ఉద్యోగుల జీతాలవల్ల ఆర్దిక భారం అధికంగా ఉందని చెప్పడం తో పాటు సంక్షేమ స్కీముల అమలు వల్ల కూడా బాగా ఖర్చు అవుతోందని, ఇందులో చాలా దుబారా ఉందని ఎల్లో మీడియా అంటోంది. ఇది చంద్రబాబు అభిప్రాయంగా తీసుకునే అవకాశం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది చేసినా ముందుగా ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంటుందా?నెగిటివ్ గా ఉంటుందా?అన్నది చూసుకుంటారు.మొదటిసారి సీఎం అయినప్పుడే ఆయన ఇలాంటి సర్వేలు చేసుకునేవారు.1996 ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేయకపోతే నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ గెలిస్తే సబ్సిడి బియ్యం ధర ఐదు రూపాయలు అవుతుందని ప్రచారం చేసేవారు. తమకు ఎక్కువ సీట్లు వస్తేనే మద్య నిషేధం కొనసాగించగలుగుతామని చెప్పేవారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తో దాదాపు సమానంగా టీడీపీ, సిపిఐ, సిపిఎమ్ కూటమికి సీట్లు వచ్చాయి. తర్వాత ఆయన రూటు మార్చారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త కధ ఆరంభించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, సబ్సిడి బియ్యం రేట్లు పెంచకపోతే ప్రభుత్వం భరించలేదని చెప్పేవారు. అంతకు ముందు ఎన్.టి.రామారావు అమలు చేసిన మద్య నిషేధాన్ని కొనసాగించలేమని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని, దానిని నియంత్రించలేకపోతున్నామని, ఆదాయం కూడా రావడం లేదని ప్రచారం చేశారు.ఎన్నికలకు ముందేమో ఎన్.టి.ఆర్ అనుమతించిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు.తద్వారా మద్య నిషేధం పై సీరియస్ గా ఉన్నట్లు చంద్రబాబు పిక్చర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాతేమో మొత్తం ఎత్తివేశారు.ఆ టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో!ప్రజాభిప్రాయ సేకరణలో తన వాదనకు అనుకూలంగా ఎక్కువమంది మాట్లాడేలా చూసుకునేవారు.తదుపరి జనం అంతా అలాగే కోరుకుంటున్నారని చెప్పి నిర్ణయాలను మార్చివేసేవారు. ఇదేకాదు.1999లో బిజెపితో కలిసి కూటమి కట్టడంతో మళ్లీ గెలవగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలపై సమీక్షలు చేసి,వాటిలో లాభాలు ఆర్జించని సంస్థలను మూసివేసే ప్రక్రియ ఆరంభించారు.ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశారు.అప్పుడు ప్రభుత్వరంగ సంస్థలు తెల్ల ఏనుగులుగా మారాయని, వృధా వ్యయం అని పబ్లిసిటీ చేసేవారు.ఆ సంస్థలకు ఉన్న భూములను ప్రైవేటువారికి అప్పగించేశారు.ఆ భూములను ఆ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నాయని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.ప్రభుత్వ ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారన్న భావన కల్పిస్తుంటారు.అప్పట్లో ఉద్యోగులు చంద్రబాబు పాలనపై మండిపడుతుండేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే చంద్రబాబు రిటైర్ మెంట్ వయసును 55 ఏళ్లకు తగ్గించబోతున్నారని ఉద్యోగులంతా నమ్మేవారు.నిజానికి ఆ ప్రతిపాదన లేదని అంటారు.కాని చంద్రబాబు ప్రభుత్వ సరళి చూశాక ఉద్యోగులంతా ఆ వదంతిని నమ్మారు.2004లో టీడీపీ ఓటమికి అది కూడా ఒక కారణం అయింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. వాటిలో విద్యుత్ రంగం ఒకటి.దానిద్వారా తనకు క్రెడిట్ వస్తుందని అనుకున్న చంద్రబాబు ఆ సంస్కరణలు అన్నీ తనవే అని ప్రచారం చేసుకునేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని అప్పటి ప్రతి పక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదిస్తే అలా చేస్తే తీగెలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని అనేవారు. తదుపరి వైఎస్ అధికారంలోకి రావడం, దానిని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఘనత తనదేనని కూడా చంద్రబాబు చెప్పుకునేవారు.తదుపరి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన కూడా ఉచిత విద్యుత్ ను కొనసాగించారు.అలా ఉంటుంది ఆయన తీరు.గత టరమ్ లో ఉద్యోగుల జీతాభత్యాలపై ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో ఆయన చేసిన సంభాషణ వీడియో బయటకు వచ్చింది.ఇద్దరూ కూడా ఉద్యోగుల జీతాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లుగా ఆ వీడియో ఉండడం రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేసింది.అధికారంలో ఉంటే సంస్కరణలు గురించి మాట్లాడే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫ్రీ అని, ఎక్కడలేని వాగ్దానాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర సుమారు 150 హామీలు ఇచ్చారు.వాటన్నిటి ఖర్చు ఏడాదికి లక్షన్నర కోట్లు అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు తాము సంపద సృష్టిస్తామని, వాటిని అమలు చేసి చూపిస్తామని గప్పాలు పలికేవారు.అధికారంలోకి వచ్చాక మాత్రం తెల్లముఖం వేసి వారి హామీలను నమ్మిన ప్రజలను వెర్రివాళ్లుగా చేశారు.ఇటీవల ప్రభుత్వ ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.అంటే జనాన్ని మానసికంగా తయారు చేయడం అన్నమాట.దాని కొనసాగింపుగా ఎల్లో మీడియా దీనిని భుజాన వేసుకుని సంక్షేమంలో చాలా వృదా అవుతోందని అనర్హులకు స్కీములు వెళుతున్నాయని ప్రచారం మొదలుపెట్టారు.అవన్ని అర్జంట్ గా మార్చేయాలని అంటున్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే ఇదే ఎల్లో మీడియా జగన్ పై శరాలను వదిలి, జాకీలుపెట్టి టీడీపీని లేపడానికి యత్నించింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే నిజంగానే ఆ హామీలన్నీ అమలు అవుతాయేమో అన్నంతగా నమ్మేలా ప్రచారం చేశారు. ఇప్పుడేమో యధా ప్రకారం వారి శైలిలో అదంతా వృధా ఖర్చు. వాటిలో కోత పెట్టాలి అంటూ వాదన తీసుకు వస్తున్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు టీమ్ కాని, ఎల్లో మీడియాకాని అమరావతిలో మాత్రం అప్పులు చేసి అయినా లక్షల కోట్లు వ్యయం చేయాలని చెబుతున్నారు.మరి అది ఎవరి ప్రయోజనాల కోసం?ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన హామీల గురించి అడగకుండా, పిఆర్సి, బకాయిల చెల్లింపు మొదలైనవాటి గురించి అడగకుండా ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైన బెదిరింపులు చేశారా అన్న అనుమానం వస్తుంది.జీతాలు ఇస్తే చాలు.. ఉద్యోగాలు ఉంటే చాలు అన్న అభిప్రాయం కలిగిస్తే ఏ ఉద్యోగ సంఘం నేత ఉద్యోగుల తరపున డిమాండ్ల ఊసెత్తడానికి గజగజలాడడానికి ఈ కధనాలు సృష్టించినట్లుగా ఉంది. ప్రజలు సంక్షేమ హామీల గురించి అడగకుండా రాష్ట్ర ప్రయోజనాలపైనే మాట్లాడుకోవాలన్నదే వీరి లక్ష్యం. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కూటమితో పాటు ఎల్లో మీడియా పనిచేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కధనాలను చూస్తే ఉద్యోగులతో పాటు ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారని అనుకోవల్సిందేనా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ఆర్ మరణంలో A1 ముద్దాయి చంద్రబాబు..!? నీ పాపాలకు
-
‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?’
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?.. ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏది చూసినా గిట్టుబాటు ధరల్లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా?. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే నేతలు కేంద్రం నుండి ఏం సహాయం పొందారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజా సమస్యలు పక్కన పెట్టి, తిరుమల లడ్డూపై సంవత్సరన్నర పాటు అనవసర వివాదం చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనపడటం లేదు’’ అంటూ సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ప్రజల ఆస్తుల్ని దోచుకోవటమే సంపద సృష్టా?. మావిగన్ ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా దూషణలు ఎందుకు?. రాయలసీమలో రైతులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కానీ అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు రాయలసీమలో ఖర్చు పెడితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే పెట్టటం అన్యాయం. అమరావతి అప్పులు రాయలసీమ వాసుల మీద పడుతున్నాయి. రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. దేవాదాయ భూములను కూడా పరిశ్రమలకు ఎలా ఇస్తారు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ పెద్ద దస్తగిరి కేసులో బాబు హత్యా రాజకీయం
-
వర్మ ప్యూజ్ పీకేసిన బాబు.. అయ్యో వర్మ.. ఏంటీ కర్మ
-
చంద్రబాబు దమ్ముంటే నేరుగా యుద్ధానికిరా.. సతీష్ రెడ్డి
వైఎస్సార్ జిల్లా, సాక్షి: టీడీపీ నేతలు అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలు, అజెండాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. పెద్ద దస్తగిరి కుమారుడి ఫిర్యాదుని కూడా పట్టించుకోకుండా ఈనాడు నీచ కథనాలు రాస్తుందని ఆరోపించారు. ఎల్లో పత్రికలు ఎక్కడికి పోతున్నాయి. ఏం రాస్తున్నాయని ప్రశ్నించారు.చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి నీచపు రాతలు రాస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్కు లింకులు పెడుతూ తప్పుడు కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు.. ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అని అందరికీ తెలుసన్నారు. తప్పుడు కథనాల ద్వారా కాకుండా దమ్ముంటే వైఎస్ జగన్ మీద డైరెక్టుగా యుద్ధం చేయగలవా చంద్రబాబు అని ప్రశ్నించారు. చంద్రబాబు పొలిటికల్ గేమ్ కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.చంద్రబాబు తన హామీల దృష్టి నుంచి ప్రజలను మళ్లించడానికే నీచపు రాజకీయాలు చేస్తున్నారని, మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు చంపుకుంటే పిన్నెళ్లి మీద కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు తప్పులు దేవుడు లెక్కిస్తున్నాడని దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానింద రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. రాష్టంలో జరిగే హత్యలకు ఏ1గా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టాలన్నారు. చంద్రబాబుకు సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెబుతారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. -
ఐసీయూలో ఆసుపత్రులు
-
కీర్తి చోరుడు బాబు.. మరో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను తమవిగా చెప్పుకుంటూ అభాసుపాలవుతున్నా.. రోజురోజూకూ మరింత దిగజారి కీర్తి చౌర్యానికి పాకులాడుతున్నారు. తాజాగా రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్ పెట్టుబడులు తామే తెచ్చామంటూ గొప్పలు పోతున్నారు. అయితే ఈ పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. రెన్యూ పవర్ సీఈఓ సుమంత్సిన్హా గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం అప్పటి సీఎం వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. వైఎస్ జగన్కు ధన్యవాదాలు ‘‘పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై వంటి అనుకూలమైన వ్యాపార వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 2050 నాటికి ఆగ్నేయాసియాలో ప్రవేశించే పెట్టుబడిదారులకి ఏపీ తొలి ప్రాధాన్యంగా మారాలని, పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే ప్రపంచ గమ్యస్థానంగా ఎదగాలని రాష్ట్రం ఒక దార్శనికతను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్లో నిన్న జరిగిన చర్చకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.’’ » ఇవి రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్సెస్ట్మెంట్ సమ్మిట్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం, గత ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం సామాజిక మాధ్యమం(లింక్డ్ఇన్) వేదికగా చెప్పిన మాటలు ఇవి. తండ్రీ కొడుకుల తీరు సిగ్గు..సిగ్గు వైఎస్ జగనే రెన్యూ పవర్ని తీసుకొస్తే.. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆ సంస్థను గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ నాటకంలో తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. కానీ నెటిజన్లు వాస్తవాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వారిని ట్రోల్స్ చేస్తున్నారు. -
అర్చకులపై రెడ్బుక్ టెర్రర్
సాక్షి, అమరావతి : రాజకీయాలకు తావే ఉండకూడని గుళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు రోజుల క్రితం టీటీడీ అనుబంధ ఒంటిమిట్ట ఆలయంలో పనిచేసే అర్చకులు వేద అశీర్వచనం చేయడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ పెద్దలు టీటీడీ ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించడం కలకలం రేపింది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టు బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చినా చర్యలు చేపట్టకపోగా కనీసం వివరణ కూడా కోరలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులపై చర్యలు చేపట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తిరుమల కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇటీవల కాలంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను సైతం దెబ్బతీసేలా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానే అర్చకులకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. దిగజారుడు రాజకీయం ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో టీటీడీ సహా వివిధ ఆలయాల నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ అర్చకులను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో ఓ మండల టీడీపీ నేత అనుచరులు ఒక ఎస్సీ యువకుడిపై దాడి చేశారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తమ్ముడు, మండల టీడీపీ నేతలు ఒంటిమిట్ట ఆలయ అర్చకులను కర్నూలు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఆఫీసుకు తీసుకెళ్లి.. ఆ అధికారికి వేద ఆశీర్వచనం చేయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలు.. అర్చకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేయడం తప్పన్నట్లు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కనీస ఆలోచన లేకుండా టీటీడీ పెద్దలు అర్చకులకు నోటీసులతో ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చేయలేదా? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అర్చకులు వివిధ సందర్భాల్లో వేద ఆశీర్వచనం ఇవ్వడం సాధారణం అని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అప్పటి టీటీడీ అ«ధికారులు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించడంతో పాటు వస్త్రం కూడా అందజేశారని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎవరికైనా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, అయినా అప్పుడు చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆ గౌరవం అందించడం కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపే అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. -
ఏఎన్యూని కొల్లగొడుతున్న చంద్రబాబు సర్కార్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) నిధులను చంద్రబాబు ప్రభుత్వం వాడేసుకుంటోంది. విశ్వవిద్యాలయం అభివృద్ధిని, అతిథి అధ్యాపకుల వేతనాలను పట్టించుకోని వర్సిటీ పాలకులు ప్రభుత్వ కటాక్షం కోసం సాగిలపడుతున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లను ప్రభుత్వానికి అప్పగించిన తాత్కాలిక పాలకులు మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాత్కాలిక పాలకుల తీరు విశ్వవిద్యాలయం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఉద్యోగులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వర్సిటీ అవినీతి ఊబిలో కూరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిధుల మళ్లింపే కారణమన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాధికారుల మౌఖిక ఆదేశాలను పాటిస్తూ.. తాత్కాలిక పాలకులు తమ పదవులను కాపాడుకునేందుకు ఇష్టారీతిన డబ్బును ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఎన్యూ ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఇచ్చినట్లు మార్చిలో జరిగిన వర్సిటీ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జనవరి 29న వెలువడినట్లు సమాచారం. నిధులను విడతలవారీగా ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేసినట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ డిపాజిట్పై 7.75 శాతం వడ్డీ వర్సిటీకి అందేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఫైనాన్స్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. మార్చి 30న జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశం రూ.3 కోట్ల లోటు బడ్జెట్కు ఆమోదం తెలిపింది. పీఎఫ్ అధికారులు రూ.6 కోట్లను సీజ్ చేసినప్పుడు ఆందోళన చెందిన వర్సిటీ అధికారులు, ఇంత పెద్ద మొత్తాన్ని ధారాదత్తం చేయడానికి పదవులే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఇంత రహస్యంగా నిధులను దారి మళ్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు నోరు విప్పడం లేదు. నిధుల కోసమే చూసీచూడనట్లు.. పీఎఫ్ బకాయిలు చెల్లించలేదని అడిగినా, లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా స్పందించని వర్సిటీ అధికారులు.. ప్రభుత్వానికి రూ.100 కోట్లను ఎలా ఇస్తారని వర్సిటీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్లో నియమితులైన ఉపకులపతి ఇప్పటికీ బాధ్యతలు స్వీకరించకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక కూడా నిధుల బదిలీనే కారణమని పేర్కొంటున్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవినీతి వంటి అనేక వివాదాలపైనా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడానికి ఇదే కారణమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.పదవుల కోసమే నిధులు ధారాదత్తం తాత్కాలిక పాలకులు తమ పదవులను కాపాడుకోవడానికి ఏఎన్యూ నిధులు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. అతిథి ఆధ్యాపకులకు జీతాలు మాత్రం సక్రమంగా చెల్లించడంలేదు. సుమారు 130 మంది అతిథి ఆధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసినా, కాసులు వసూలు చేసి కాపీ కొట్టిస్తున్నా, దళిత మహిళా అధికారులను వేధిస్తున్నా, మహిళా ప్రొఫెసర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పంతగాని రమేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏఎన్యూ గౌరవాధ్యక్షుడు -
నిరుద్యోగులకు వయోగండం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపుపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన పాలకులు, వారి వయో పరిమితి పెంపుపై మాత్రం స్పందించకపోవడంపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు 34 ఏళ్ల వయసు ఉండగా, ఈ పరిమితిని కొన్నేళ్లుగా 42 ఏళ్లకు పెంచుతున్నారు. అయితే, 2023లో సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్లకు 44 ఏళ్లకు పెంచాలని గత ప్రభుత్వంలో సీఎంకు నారా లోకేశ్ లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖలు రాశారు. ఎన్నికల సమయంలో లోకేశ్ నిర్వహించిన యువగళం సభల్లోనూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ అధికాకంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీ మేరకు వయసు పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిపై నిర్ణయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటికీ రెండు నెలలుగా అటు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని అక్కడి ప్రభుత్వం 46 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు భరోసా కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం గతేడాది ఇచ్చిన డీఎస్సీ–2025లో అభ్యర్థుల వయోపరిమితిని 44 సంవత్సరాలు చేసింది. కానీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం తప్పించుకుంటోంది. గతేడాది జూలైలో అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితి పెంచలేదు.హామీ విస్మరిస్తే ఊరుకోం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 47 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని లోకేశ్ ఎందుకు విస్మరిస్తున్నారు? రాష్ట్రంలో యూపీఎస్సీ మాదిరిగా ఏటా నోటిఫికేషన్స్ రావడం లేదు. కొన్ని నోటిఫికేషన్లపై న్యాయ వివాదాలతో ఏళ్ల తరబడి భర్తీ పూర్తి కావడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకోవాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. లేకపోతే నిరుద్యోగుల ఆందోళన తప్పదు. – ఎంబేటి రామచంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ ఏటా 75 వేల మందికి అన్యాయం ఏపీపీఎస్సీ ఓటీపీఆర్లో నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 75 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. రెండు నెలలుగా వయో పరిమితి పెంపుపై ప్రభుత్వంగానీ, గతంలో హడావుడి చేసిన నారా లోకేశ్గానీ స్పష్టతనీయడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీని నీరుగార్చిందన్న అపవాదును మూటగట్టుకొంది. దాదాపు 7 నెలలుగా సర్వీస్ కమిషన్కు రెగ్యులర్ చైర్మన్ను నియమించకుండా ఇన్చార్జితోనే నెట్టుకొస్తోంది. దీంతో కమిషన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అభ్యర్థుల వయోపరిమితిపై మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. -
హత్యా రాజకీయాలు.. దుష్ప్రచార కుట్రలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మరోసారి తన మార్కు హత్యా రాజకీయ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన ప్రతిసారి డైవర్షన్ కుట్రలో భాగంగా ఇటువంటి దుష్ప్రచారానికి తెర తీయడం తన నైజమని మరోసారి నిరూపిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా విభాగాల ద్వారా పక్కాగా దుష్ప్రచార పన్నాగం పన్నుతున్నారు. అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే ఈ హత్యతో వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించినా, టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం కొనసాగిస్తుండటం గమనార్హం. దస్తగిరి హత్య ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి దిగజారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరతీసిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి హత్యా రాజకీయాల బురద అంటించాలని యత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దాంతో చంద్రబాబు హత్యా రాజకీయాల చరిత్ర మరోసారి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.చంద్రబాబు దిగజారుడు రాజకీయం వైఎస్సార్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సవిత స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం ద్వారా ఈ పన్నాగం అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి, నిత్యానంద రెడ్డి అత్యంత సన్నిహిత మిత్రులు. సుదీర్ఘకాలంగా వారిద్దరూ వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా మెలుగుతాయన్నది వైఎస్సార్ కడప జిల్లాలో అందరికీ తెలిసిన వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరిస్తూ టీడీపీ ముఠా దుష్ప్రచారానికి పాల్పడుతుండటం గమనార్హం. నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అనే కొత్త ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఆస్తుల విషయంలో గొడవతోనే ఆయన్ను హత్య చేశారని నిధారార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కాగా ఆ ఆరోపణలను హతుడు దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించడం గమనార్హం. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని ఆమె తేల్చి చెప్పారు. అసలు తన భర్త పెద్ద దస్తగిరికి నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అయినా సరే టీడీపీ నేతలు రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు పేరిట కుతంత్రం ఈ హత్య కేసు దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నేతలను వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్సై రాజేశ్వర రెడ్డిలను హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్లో ఉన్న బాలస్వామిరెడ్డిని ఏరికోరి కడప డీఎస్పీగా నియమించారు. ఆ వెంటనే డీఎస్పీ బాలస్వామి రెడ్డి నేతృత్వంలో పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. బాధిత కుటుంబం అనే సానుభూతి కూడా లేకుండా హతుడు పెద్ద దస్తగిరి నివాసంలో సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వారిని వేధిస్తున్నారు. కానీ అందుకు పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు ఏమాత్రం సమ్మతించ లేదు. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేహత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఆయన హత్యా రాజకీయాల చరిత్ర తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసింది చంద్రబాబే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. తన ప్రభుత్వ హయాంలో ఇంకెంతగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం. విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండల వరకు.. అన్ని దారుణాల్లో చూపుడు వేలు చంద్రబాబు వైపే చూపిస్తోంది. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యటీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోలేదు. 1985 అక్టోబరు 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథరామ్ను దారి కాచి మరీ దారుణంగా దాడి చేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పినా సరే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం గమనార్హం. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథరామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యచంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజా రెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి, ఆయన వర్గీయులు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారు. వంగవీటి రంగా దారుణ హత్యవిజయవాడలో టీడీపీ అరాచకాలకు అడ్డుగోడగా నిలిచిన అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1988లో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను పాశవికంగా హత్య చేశారు. టీడీపీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నందునే చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ హత్యకు తెగబడ్డారని పరిశీలకులు స్పష్టం చేశారు. ఆ హత్యలో స్వయంగా పాల్గొని నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009 ఎన్నికల నుంచి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కూడా విశాఖ టీడీపీలో ఈయన కీలకమే. కాగా, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి నారాయణ రెడ్డితోపాటు మరొకరిని 2017లో బాంబులతో దాడి చేసి హత్య చేశారు. చంద్రబాబు అండతోనే అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబమే ఈ హత్యకు కుట్ర పన్నింది.ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించే వారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం. మహానేత వైఎస్సార్కే నేరుగా బెదిరింపు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి వరుసగా రెండోసారి సీఎం కావడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2009లో ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విస్మయ పరిచాయి. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’ అని చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని బెదిరించడం గమనార్హం. అనంతరం కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం చెందారు. దాంతో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన హెచ్చరికలను పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు కూడా. 2024 నుంచి రెడ్బుక్ అరాచకం 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెడ్బుక్ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండటం విస్మయ పరుస్తోంది. 20 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు 22 నెలల పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలిచింది. -
నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు
-
బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..
-
చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు


