Chandrababu Naidu
-
లోకేష్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: సతీష్కుమార్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్.. కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారు.. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..? అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ సతీష్కుమార్ రెడ్డి మండిపడ్డారు.‘‘అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా...?. మేము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..?. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..?. మహానాడులో వైఎస్సార్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది.. మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. ..ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..?. గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు. అది బలుపు కాదు వాపు.. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు..ఏంటి తడిసిపోయేది లోకేష్.. ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో.. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం... సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..?..లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..?. నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు.. అమరావతి వాళ్లే కడతారా..?. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది’’ అని సతీష్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. -
రేషన్ డీలర్లను టెర్రరిస్టులతో పోల్చిన చంద్రబాబు
సాక్షి, కోనసీమ జిల్లా: రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు ప్రజా వేదికలో ఎండీయూ ఆపరేటర్లను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు.. డోర్ డెలివరీ చేసిన వాళ్లు దుర్మార్గులు, మాఫియా అంటూ ప్రేలాపనలు చేశారు.‘‘వీళ్లు బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడకు తీసుకువెళ్లిపోయారు. కరుడుగట్టిన దుర్మార్గులు వీళ్లు. వేల కోట్లు ఖర్చు పెట్టే మాఫియాగా మారారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కొనే పరిస్థితికి వచ్చారు. వాళ్ల కొవ్వు ఎంతుందంటే నా దగ్గరకు కూడా వస్తున్నారు’’ అంటూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎండియూ ఆపరేటర్లను అవమానపరుస్తూ సీఎం మాట్లాడారు.రేషన్ డీలర్లను టెర్రరిస్టులతో పోల్చిన సీఎం.. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడమే లక్ష్యంగా చంద్రబాబు మాట్లాడారు. వాలంటీర్ల తొలగింపుపై ఒక్క ముక్క కూడా ప్రస్తావించని బాబు.. చేనేత మత్స్యకారులకు విస్తృతంగా సహాయం అందిస్తున్నామంటూ డాంబికాలు పలికారు.హ్యాండ్లూమ్ కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్లు విద్యుత్ పథకం అమలు చేయకపోయినా ఇస్తున్నట్లే మాట్లాడిన చంద్రబాబు.. కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లకు సోలార్ పవర్ ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవాలంటూ వేదికపైన కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. -
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!
పవన్ కళ్యాణ్కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
బాబుగారూ.. ‘టెన్త్’లో మీరు, మీ కొడుకు ఫెయిల్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్(Nara Lokesh) టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు సరైనవేనా? -
ఏడాది పాలన.. ప్రజలకు బాబు సర్కార్ వెన్నుపోటు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఏడాది పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధింపుతోనే గడిచిపోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యకర్మం పోస్టర్ను ఆయన విడుదల చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబు తీరును నిరసిస్తూ వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు... ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు నట్టేట ముంచుతున్నారన్నారు.తిరుపతి: ఎన్నికల హామీలపై కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని వైస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్ను భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష విడుదల చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అరాచకాలు, హత్యలు, అన్యాయాలు చేస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 800 మందిపై హత్య రాజకీయాలు చేశారు. 370 మంది పైగా చనిపోయారు. కూటమి నేతలు ప్రతి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పడు కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్ కేసు ద్వారా తప్పుడు కేసులు పెట్టి, నెలలు తరబడి జైల్లో పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అనాగరిక, అరాచక పాలన సాగిస్తోంది..ఏడాది కాలంగా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. గత మూడు నెలలు కాలంలో మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీపీ ఎన్నికలు ద్వారా బల ప్రయోగం ద్వారా లాక్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా అసంతృప్తితో ఉన్నారు. జూన్ 4 వ తేదీ వెన్నుపోటు దినgగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీ చేపడతాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరసన ర్యాలీలో ప్రజలు అందరూ స్వచ్చందంగా పాల్గొంటారు. కూటమి పాలనపై ప్రజలు అందరూ ఆగ్రహంతో ఉన్నారు’’ అని భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. -
‘లోకేశ్.. పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా.. విద్యార్థికి ఏదైనా జరిగితే?’
విశాఖపట్నం: కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్లా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను, ఏడాది పాలన తరువాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏ చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబుపత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్ళిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్దులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే....కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా ప్రదర్శించింది. కొత్త టెక్నిక్లతో లేనివి ఉన్నట్లుగా చూపించారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెట్టేందుకు మూడు రోజుల పాటు చాలా తాపత్రేయ పడ్డారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినం సందర్భంగా కార్యక్రమాలు చేసుకోవడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ తాను చేసిన పనులను చెప్పుకుంటుంది. కానీ టీడీపీ మాత్రం అధికారంలో ఉండి, ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీని ఆడిపోసుకుని ఆత్మస్తుతి-పరనిందకే పరిమితమయ్యారు. స్థాయిలేని వ్యక్తులతో సభ్యత లేకుండా మాట్లాడిన భాషను మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు.మహానాడు సాక్షిగా పథకాలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేం ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలం. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ ప్రాంతంలో కొత్త జిల్లాను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మరి ఎన్టీఆర్ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా కూటమి ప్రభుత్వం మారుస్తుందా? ఈ రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత సంకుచితంగా సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నారు?పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంపై సమీక్ష ఏదీ?పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశామా? 16వేల మంది తమ పేపర్లను కరెక్షన్ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలింది. గతంలో ఏ నాడైనా అయిదు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులకి కరెక్షన్లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా? మొదట ఇరవై మార్కులు వచ్చి, తరువాత రీవాల్యుయేషన్ తరువాత తొంబై మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు. దీనిని బట్టి చాలా దారుణంగా పదోతరగతి విద్యార్ధుల జవాబుపత్రాలను దిద్దారనేది అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా? గతంలో రోజుకు నలబై జవాబుపత్రాలను ఒకొక్కరికి ఇచ్చేవారు. కానీ తాజాగా వాల్యుయేషన్ చేసిన వారికి రోజుకు ఎన్ని జవాబుపత్రాలను దిద్దాలని ఇచ్చారో బయటపెట్టాలి. విద్యాశాఖ అసమర్థత కారణంగా విద్యార్ధులు ఎంత క్షోభకు గురయ్యారో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలి. ఈనాడు వంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఈ వ్యవహారాన్ని వక్రీకరించేలా ఎందుకు కథనాలు రాయిస్తున్నారో చెప్పాలి.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ఉర్సాకు ఎంతకు భూములు ఇచ్చారో బయటపెట్టాలి. కారుచౌకగా కట్టబెడుతున్నారన్న మా ఆరోపణలను వాస్తవం కాదని దమ్ముంటే నిరూపించాలి.ఈ రోజు ఈనాడు పత్రికలో ఇరవై శాతం ఇలాగే రీవాల్యుయేషన్లో మార్కుల్లో తేడాలు రావడం సహజమన్నట్లుగా వచ్చిన కథనం పూర్తి అవాస్తవం. ఏ ఏడాది అయినా అయిదు వేల మంది కంటే ఎక్కువ విద్యార్ధులకు రీవాల్యుయేషన్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు రాలేదు. ప్రతిఏటా కనీసం పద్నాలుగు రోజులు జవాబు పత్రాలను దిద్దేవారు. కానీ తాజాగా మాత్రం తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జవాబు పత్రాలను దిద్దేవారిపై పనిఒత్తిడిని పెంచారు. వాల్యుయేషన్ సెంటర్లు, టీచర్లను పెంచకుండా ఎక్కువ జవాబుపత్రాలను దిద్దాలని ఇవ్వడం వల్లే ఇటువంటి ఫలితాలు వెలువడ్డాయి.మహానాడులో రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వంలోని వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు ప్రకటించలేదు? అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తేదీలతో సహా ఎందుకు సంబంధిత మంత్రులు ఎందుకు వెల్లడించలేదు?ఏడాది కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మోసాన్ని ఎత్తి చూపుతూ జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలను కలుపుకుని ఆరోజు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నాం’ బొత్స తెలిపారు. -
బూట్ కాలితో తొక్కి లాఠీలతో ఆ కొట్టడం ఏంటి.. మీరు అసలు పోలీసులా, రౌడీలా
-
ఎన్టీఆర్ అసలైన వారసుడు జూనియరే
-
బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు. వైఎస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు(Chandrababu) దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం.రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. పబ్లిక్గానే బట్టల్లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు.. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారాయన. గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారాయన. ఇదీ చదవండి: కూటమివారి నవమోసాలు -
ఎంతకైనా తెగిస్తావా.. మహానాడుపై ఎన్టీఆర్ ఆత్మ ఘోష
-
బాబు కవరింగ్ భలే!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరంతా అదోటైపు!. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో.. దూషణలకు దిగుతారో ఆయనకే తెలియనట్లు ఉంటుంది వ్యవహారం. కావాలంటే తాజా మహానాడును ఉదాహరణగా తీసుకోండి. ‘ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తా’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏంటో.. దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి!. రాసిచ్చిన స్క్రిప్ట్లేమైనా చదువుతారేమో తెలియదు కానీ.. బాబు గారి ప్రసంగాలు వినేవారికి బీపీ పెరిగిపోవడమైతే గ్యారెంటీ!.2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదలుకుని ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న రోజులవి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదన్న గట్టి నమ్మకంతో చెలరేగి పోయారు బాబుగారు!. దేశ ప్రధానిని పట్టుకుని ఉగ్రవాది అన్నారు. ముస్లింలను బతకనివ్వడన్నారు.. అవినీతిపరుడన్నాడు.. ఇంకా ఏమేమో అనేశాడు! భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఏమి ఏలుతాడని ప్రశ్నించారు. ప్రధానిని ఉగ్రవాది అనడమేమిటా? అని అప్పట్లో అందరం బాధపడ్డాం. ఆ మాటకొస్తే మోదీ కూడా బాబు మాటలకు ధీటైన సమాధానమే ఇచ్చారు. అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ ఇక అస్సలు కలవలేవని అందరూ అనుకున్నారు. కానీ, ఐదేళ్లు గడిచేసరికి ఆ దూషణలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలూ మళ్లీ కలిసిపోయాయి. రాజకీయమంటే ఇంత నిస్సిగ్గుగా చేస్తారా? అని అందరూ అనుకునేలా చేశాయి. అప్పటిదాకా తిట్టిన బాబు నోరే పొత్తు కుదిరాక ఇంద్రుడు, చంద్రుడని ప్రశంసల రాగం ఎత్తుకుంది. మోదీ కూడా తన వంతుగా చంద్రబాబును భుజానికైతే ఎత్తుకున్నాడు!.ఈ సంగతి అలా ఉంచితే, చంద్రబాబు ఇప్పుడు ఉగ్రభాష వాడుతున్నారు. కాకపోతే ఈ సారి ఆయన గళమెత్తింది.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పైనే. పోటీదారు కనుక ఏవైనా విమర్శలు చేయవచ్చు. అందులోనూ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయం ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు లేదంటే.. ప్రజల అసంతృప్తి పెరిగి పరిస్థితులు జగన్కు అనుకూలంగా మారుతున్నాయన్న కోపమూ కారణం కావచ్చు. అయితే మాట్లాడే మాటలకు కొంత విచక్షణ ఉండాలి. జగన్ ఆర్థిక ఉగ్రవాది అనేందుకు ఆయనకున్న ఆధారమేమిటి?.2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పుల గురించి చంద్రబాబు ఎన్ని మాటలు మార్చారు?. ఒకసారేమో రూ.14 లక్షల కోట్లని.. ఇంకోసారి రూ.పది లక్షలు అని ఊరూరా అబద్ధాలు ప్రచారం చేసింది ఈయనే. కానీ, తాజా బడ్జెట్లో ఈ లెక్క కేవలం రూ.ఆరు లక్షల కోట్లేనని స్పష్టమైంది కదా?. ఈ మొత్తంలోనూ తాను గతంలో చేసిన అప్పులూ ఉన్నాయన్న విషయం కూడా చెప్పకపోవడం మోసం చేసినట్టే కదా?. జగన్ ముఖ్యమంత్రిగా సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. చంద్రబాబు ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేశారు కదా?. దీన్ని కదా అనాల్సింది ఆర్థిక ఉగ్రవాదం అని?. జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ఉగ్రవాదం అవుతుందా?. ఒకటి అర మాత్రమే అమలు చేసి అడిగిన వారిపై నోరేసుకోవడం ఉగ్రవాదం అవుతుందా?.చంద్రబాబు తన ప్రసంగంలో ఇంకో మాటా అన్నారు.. ఒకసారి గెలవడం.. ఒకసారి ఓడటం ఉండకూడదట. అలా అయితే అభివృద్ది జరగదట.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కూడా వక్కాణించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి.. ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయాలి.. ప్రజలను రెచ్చగొట్టాలి. హింసను సైతం ప్రేరేపించాలి.. అభాండాలు వేయాలి.. కార్యకర్తలను కేసులు పెట్టించుకోవాలని కూడా అంటారు. అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం వద్దు.. నియంతృత్వం కావాలి. తనను వ్యతిరేకించే పార్టీలను, మీడియాను అణచివేయాలి. ఏం చేసినా, చేయకపోయినా అంతా అభివృద్ది చేసేసినట్లు బాజా వాయించుకోవాలి. గతంలో ‘జయము, జయము చంద్రన్న’ అంటూ, లేక ఇప్పుడు ‘చంద్రబాబూ నువ్వే కావాలి’ అంటూ సినీ ఫక్కీలో పాటలు పాడించుకోవాలి. ఒక పార్టీనే అధికారంలో ఉండాలంటే ఆ స్థాయిలో పని కూడా చేయాలి కదా?.వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేస్తున్నారని గమనించి, అంతకు మూడురెట్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన సంక్షేమం ఇస్తానని, అసత్య వాగ్ధానాలు చేసి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా ఇచ్చేసినట్లు దబాయించినా జనం ఓట్లు వేయాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబు మామ ఎన్టీఆర్ను తోసేసి గద్దెనెక్కిన తరువాత ఎన్ని సార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు పాలనే సక్రమంగా ఉండి ఉంటే ఇన్ని రకాల పొత్తులు అవసరమై ఉండేవా? అన్నది ఆయన ఆలోచించుకోవాలి.అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. కానీ, తాను లేకపోతే అభివృద్ది ఉండదని ప్రజలకు చెప్పడం అంటే అతిశయోక్తులు చెప్పడమే. హైదరాబాద్ తానే అభివృద్ది చేశానని ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయిన 21 ఏళ్ల తర్వాత కూడా చెబుతున్నారంటే ఏమనాలి!. హైటెక్ సిటీ భవనం ఒక్క దానిని కట్టి ఆ ప్రాంతం అంతా తానే కట్టేశానని చెప్పగలిగిన సమర్థత ఆయనది. నిజానికి హైదరాబాద్ పడమటి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వమే. అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో మెహిదీపట్నం మీదుగా బీహెచ్ఈఎల్ వరకు హైదరాబాద్ రింగ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు పక్కన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. అయినా అంతా తన ఘనతని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైనవి వచ్చాయి. కేసీఆర్ పాలన సమయంలో పలు వంతెనలు, కొత్త ఐటి కంపెనీలు వచ్చాయి.ఏపీలో టీడీపీ పాలనకు, వైఎస్సార్సీపీ పాలనకు ఉన్న తేడాను కేస్ స్టడీ చేయాలని చంద్రబాబు అనడం బాగానే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోతో పోల్చుతారా? లేక చంద్రబాబు, జగన్ టైమ్లలో తెచ్చిన అప్పులతో పోల్చుతారా?. జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పోల్చుతారా?. జగన్ తెచ్చిన ఓడరేవులు, గ్రామ, గ్రామానా జగన్ నిర్మించిన భవనాలు, చంద్రబాబు టైమ్తో పోల్చుతారా?. విద్య, వైద్య రంగాలు ఎవరి కాలంలో ఎలా ఉన్నాయో పోల్చుతారా?. ప్రజల ఇళ్ల వద్దకు సేవలు అందించడంలో కూడా పోల్చవచ్చు!. సెకీతో చౌకగా రూ.2.49లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న జగన్ పాలనను, అధిక ధరకు రూ.4.60లకు కొనుగోలు చేసిన చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చుతారా?. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యయాన్ని కూడా కేస్ స్టడీగా తీసుకుంటే బాగానే ఉంటుంది.నీటిపారుదల రంగంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ హయంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా కేస్ స్టడీ చేయవచ్చు. ఇక్కడ ఒక్క సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి సుమారు 15 ఏళ్లు పాలన పూర్తి చేశారు. కానీ, వైఎస్సార్ ఐదేళ్లు, జగన్ మరో ఐదేళ్లు పాలన చేశారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేస్ స్టడీ చేస్తే నిజంగానే మంచి పరిశోధనే అవుతుంది. చంద్రబాబు వాదనలలోని డొల్లతనం, ఎన్ని రకాలుగా ఆయన మాటలు మార్చింది. ఆయన టైమ్లో జరిగిన అవినీతి, స్కామ్లు అన్ని విషయాలు బయటకు వస్తే ఆయనకే అప్రతిష్ట అవుతుంది.జనం ఎవరూ అడగరు కనుక మహానాడులో ఏవో ఉపన్యాసాలు చెప్పి, అవే నిజాలని ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాధ్యం కాకపోవచ్చు. చివరిగా ఒక మాట. ఈ మహానాడు జరిగిన తీరు ఎలా ఉన్నా ఎల్లో మీడియా మహానాడులో నాలుగు లక్షల మందికి మహా భోజనం అని ప్రచారం చేసింది. అది కూడా సరిగా జరగలేదని, చాలామంది భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారన్న మాట. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి సర్కారు వసూళ్ల పర్వం.. బేరంకుదిరితేనే బదిలీ
-
విశాఖలో కూటమి ప్రభుత్వ భూమాయ
-
బాబు ఏడాది పాలన.. అరాచకాల చిట్టా
-
‘నవ’ మోసాలు.. ఉపాధ్యాయుల వినూత్న ఉద్యమం
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు.. అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్కు మెయిల్స్, వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్రసూల్, సీఎస్పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్బాబు పేర్కొన్నారు. తొమ్మిది అంశాలివే..1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?
సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్ మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడింటిని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకేశ్ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శాఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొనేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలుగులో 97, ఇంగ్లిష్లో 81, గణితంలో 86, సైన్స్లో 97, సోషల్లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేశారు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్సీపీ ట్వీట్సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
వచ్చే మంగళవారం మళ్లీ బాబు సర్కారు అప్పు
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. జూన్ 3న ఒకేసారి రూ.7,000 కోట్ల అప్పునకు ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. తొమ్మిదేళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 11 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 13 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్ల అప్పు చేయనుంది. దీంతో కొత్త ఆరి్థక ఏడాది రెండు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.19,572 కోట్ల అప్పు చేసినట్లవుతుంది. -
ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది...అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మహానాడులో ఏఐ ఎన్టీఆర్తో పొగిడించుకుంటారా.. నిజంగా ఆయన బతికే ఉంటే..’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సంక్షేమ పథకాల అమలను అమలు చేయమంటే.. సినిమా డేట్స్ మార్చినట్లు మారుస్తున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఒక్కమాట మీద చంద్రబాబు ఏనాడూ నిలపడలేదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ఎవరు నడపబోతున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేశారని.. కేవలం మాటలు చెప్పి సీమ ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సీమ గడ్డకు మీరు చేసిన అన్యాయాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని కానీ, హైకోర్టు కానీ ఉండాలి. కానీ ఏదీ చేయకుండా మా ప్రాంత ప్రజలను మోసం చేశారు. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియో ద్వారా పొగిడించుకున్నారు. నిజంగా ఎన్టీఆర్ బతికి ఉంటే మీ గురించి ఏం మాట్లాడే వారో మీకు తెలియదా..?. సీమకు వచ్చిన అనేక ప్రాజెక్టులను కూడా చంద్రబాబు తరలించారు. మహానాడు సాక్షిగా రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి మీరు చెప్పిన హామీలు మర్చిపోయారా..?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘మీరు రాయలసీమ అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. హంద్రీనీవాను కూడా సకాలంలో పూర్తి చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం తలపెట్టారు. రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే కనీసం మా హైకోర్టును మాకివ్వాలి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తిరిగి మాకే ఇవ్వాలి. అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ అవసరాలు తీర్చాలి. 50 లక్షల చదరపు అడుగులతో రాజధాని అంటున్నారు. అమరావతి కోసం చేసే అప్పులు అందరూ తీర్చాలా?. మా సంపద తీసుకువచ్చి అమరావతిలో ఖర్చు చేయటం భావ్యమా..?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నలు గుప్పించారు. -
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
-
ఆలయ భూముల హస్తగతానికి కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దేవాదాయశాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయ స్థానాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన వారికి కారు చౌకగా దేవుడి భూములు కట్టబెట్టేందుకు సిద్దమైంది. దాతలు స్వామివారి నైవేద్యం కోసం ఆలయాలకు విరాళంగా ఇచ్చిన భూములను క్యాబినెట్ ఆమోదం లేకుండా, వేలం నిర్వహించకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో నచ్చిన వారికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు ఈ నెల 2న ప్రభుత్వం జీవో నంబర్ 139 విడుదల చేసింది.అంతేకాకుండా ప్రస్తుత లీజు దారులకు మరో 33 ఏళ్లు లీజు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానాల ఆదేశాలను లెక్కచేయకపోవడమే. దేవాదాయ శాఖ భూములను లీజుకు ఇవ్వాలంటే టెండర్ విధానం ద్వారా బహిరంగ వేలం నిర్వహించి ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికివ్వాలి. వ్యవసాయేతర భూములను 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వకూడదని కోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేవాదాయ శాఖ భూములను తన వారికి అప్పనంగా కట్టబెట్టేందుకు న్యాయస్థానాల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు.ధార్మిక సంఘాలను సంప్రదించలేదురాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన 4,244 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రూ. 5 లక్షల విలువ దాటిన పనులను నామినేషన్ పద్దతిన ఇవ్వకుండా గత వైయస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోంది. దేవుడి భూములు లీజుకు ఇవ్వాలంటే వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వేలం లేకుండా రూ. వేల కోట్ల విలువైన భూములను అప్పగించడానికి చట్ట సవరణ చేయడం దుర్మార్గం.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఆలయాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. హిందూ సమాజం, ధార్మిక సంఘాలను కనీసం సంప్రదించాలన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా చట్టసవరణ చేసేందుకు జీవో ఇస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ కుట్రను వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మఠాలు, సత్రాల పేరిట ఉన్న విలువైన భూములను సేవా సంస్థల ముసుగులో ఎలాంటి వేలం లేకుండా ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 139ని తక్షణం రద్దు చేయాలి. హిందూ సమాజానికి బ్రాండ్ అంబాసిడర్లంటే దేవాలయాల ఆస్తులను దోచుకోవడమేనా? ఒకవైపు ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతుంటే పట్టించుకోకపోగా మరో వైపు ఆలయాల ఆస్తులనే కాజేసే కుట్రలు చేస్తున్నారు. -
మహానాడు పేరుతో మహా మోసగాళ్ల పచ్చి అబద్ధాలు
-
లోకేష్ కు జాకీలు.. పాటలతో బాబుకు డప్పులు
-
మహానాడులో తెలంగాణ ముచ్చట ఎందుకు?: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనడం హాస్యాస్పదం అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం. టీడీపీ మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు?. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26వేలలోపే ఉంది. 2014 నుంచి ఆంధ్రలో చంద్రబాబు ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయం ఉంటే.. కేసీఆర్ పాలనలో 3.70 లక్షలకు వచ్చింది. చంద్రబాబు.. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే.. ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదు?. ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదా?. ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. ఎప్పటికైనా హైదరాబాద్కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా?. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
హైకోర్టు ఆదేశాల ధిక్కరణ.. వంశీ ఆరోగ్యంతో ఆటలు
-
చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో చంద్రబాబు పాలన అగమ్యగోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమని అన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారు. చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్నే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని చంద్రబాబు.. బనకచర్ల డ్యాం అంటూ ఊదరగొడుతున్నారు. కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు కాదు.. టీడీపీ నేతలు అవినీతి నిధులు పారిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి. ప్రజలను వంచించే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరు. నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
మహానాడులో ఘోరం.. ఎన్టీఆర్కు తీవ్ర అవమానం
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడులో ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘోర అవమానం జరిగింది. కార్యకర్తలను ఆకర్షించేందుకు మొక్కుబడిగా ఎన్టీఆర్ జపం చేసే చంద్రబాబు నాయుడు.. మహానాడులో ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు!. ఆయన మనవడు చనిపోతే.. కనీసం వేదికపై సంతాపం కూడా వ్యక్తం చేయలేదు!!. కడప వేదికగా జరిగిన మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చంద్రబాబు చేయలేదు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఎన్టీఆర్ ఏఐ వీడియోను తయారు చేశారు. ఇందులో ఎన్టీఆర్ మనసుకు, ఆయన ఉన్నప్పటి స్టేట్మెంట్లకు విరుద్ధంగా చంద్రబాబు పొడిగించుకున్నారు. భళా మనవడా.. అంటూ ఎన్టీఆర్ వారసుడు లోకేష్ అంటూ ఏఐ వీడియోలో చెప్పించుకుని ఆనంద పడ్డారు. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమై.. ట్రోలింగ్కూ దారి తీసింది. రాజకీయావసరం పడినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటారనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసు. పలు సందర్భాల్లో కంటి తుడుపు చర్యగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని పైకి మాట్లాడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో టీడీపీ భాగమైనప్పటికీ ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక, ఈ మహానాడుకు నందమూరి కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మహానాడుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా హాజరుకాలేదు(సినిమాలే ముఖ్యం అనుకున్నారేమో). అలాగే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా నందమూరి తారకరత్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. తారకరత్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. -
ఒకే కొడుకు కాబట్టి చంద్రబాబు బతికిపోయాడు: సీపీఐ నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఆసక్తికర కామెంట్ చేశారాయన. ‘‘కవిత అసలు ఎందుకు బయటకు వస్తోంది?. బీఆర్ఎస్లో డెమోక్రసీ లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబుకు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయాడు. ప్రాంతీయ పార్టీల్లో ప్రాపర్టీ, పలుకుబడి అంతా కుటుంబం కోసమే. పదవులు, ప్రాపర్టీల గొడవగా కవిత ఎపిసోడ్(Kavitha Episode) చూస్తున్నాం’’ అని అన్నారాయన. ప్రాంతీయ పార్టీల్లో డెమోక్రసీ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో అతి డెమోక్రసీ ఉంది. ఆ పార్టీ పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటుంది. ఇది పరిపాలనపై ప్రభావం చూపెడుతుంది. ఎన్నికైన సీఎంకు స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేగానీ పదే పదే పగ్గాలు పెట్టి లాగొద్దు’’ అని సూచించారు.ఆపరేషన్ కగార్పైనా స్పందిస్తూ.. చంపినంత మాత్రాన నక్సలిజం పోదు. ఇంకా పెరుగుద్ది. మనుషులను చంపగలరు గాని సిద్ధాంతాన్ని చంపగలరా?. ఇది అడవులను ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం’’ అని నారాయణ ఆరోపించారు. ఇదీ చదవండి: తప్పుడు కేసా? కాదా? అనేది మేం తేలుస్తాం -
కోవర్టులంటూ కొత్త కుట్ర రాజకీయం!
ప్రతిపక్ష పార్టీలపై కొత్త కొత్త ఆరోపణలు చేయడం.. ప్రతి చెడు ఘటనను కూడా వారికి ఆపాదించేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది కాబట్టి ఆయనకు ఈ పని మరింత సులువు అవుతుంది. తాజాగా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని కోవర్టులంటూ వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఇటీవలి మహానాడు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు తన పార్టీ అంతర్గత వ్యవహారాలనూ వైసీపీకి పులిమే ప్రయత్నం చేయడం ఆయన వక్రబుద్ధిని చెబుతోంది. ఈ మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కాస్తా హత్యలకూ దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, హత్యలకు పాల్పడ్డా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందంటూ ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను తమవారే హత్య చేస్తున్నారన్నది వారు కూడా ఊహించి ఉండరు.కొంతకాలం క్రితం ఒంగోలు ప్రాంతం మద్యం సిండికేట్, ఇతర దందాల్లో తలెత్తిన గొడవల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో స్థానిక టీడీపీ నేత చౌదరి హత్యకు గురయ్యారు. వెనుక ఉన్నది టీడీపీ వారేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ.. చంద్రబాబు స్వయంగా ఆయన అంతిమక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్బంలోనూ వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అప్పటికే టీడీపీ నేతల పాత్రను తేల్చేశారు. అయితే చంద్రబాబు అప్పుడైనా ఇలాంటి పనులకు పాల్పడరాదన్న హితవు పలకడానికి బదులు వారికి దన్నుగా నిలిచినట్లు వ్యవహరించారు. మాచర్ల వద్ద జరిగిన ఇంకో ఘటనలోనూ ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సరే పనికట్టుకుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై అసహ్యం కలిగే పరిస్థితి కల్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేబీఆర్ పేరు కూడా ఉన్నా పోలీసులు ఇంత అధ్వాన్నంగా వైసీపీ వారిపై కేసులు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ టీడీపీ వర్గాలలోని వారు గతంలో కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టీడీపీలో చేరారట.ఇంకో సంఘటనలో కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కోవర్టులంటూ ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ.. ఇది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలందరికి ముల్లులా గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నూజివీడు నుంచి గెలిచి మంత్రి అయిన కొలుసు పార్ధసారధి, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రభృతులు వైసీపీ నుంచి వెళ్లినవారే. వీరిలో కొంతమందికి చంద్రబాబు,లోకేశ్లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సహజంగానే కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది.అంతేకాదు..ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు రకరకాలుగా ప్రలోభ పెట్టో, లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో, ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా?అంటే అదేమీ లేదు. 2014-19 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ఇప్పుడు కూడా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తనపార్టీలో చేరిన వారంతా మంచి వారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. గతంలో తాను ఎవరినైతే తిట్టి ఉంటారో, వారు పార్టీలోకి రాగానే పవిత్రులైనట్లుగా ప్రసంగాలు కూడా చేస్తుంటారు.కోటంరెడ్డి ,గుమ్మనూరు, కొలుసు వంటి వారిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో తెలుసు. కాని వారిని టీడీపీలోకి తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అలా వచ్చిన వారిని కోవర్టులు అని అంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అరాచక శక్తులు ఏ స్థాయిలో ఉంది కూడా తెలియ చేసినట్లయింది. పైగా చంద్రబాబు తాను ఎవరిని నమ్మనని చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనను అంతగా నమ్మరు. కాని పరస్పర అవసరాల కోసం కలిసి ప్రయాణం చేస్తుంటారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ ఎప్పటి నుంచో ఉంది.గత చరిత్ర చూస్తే కోవర్టుల రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్దహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్ధులు తరచు వ్యాఖ్యానిస్తుండే వారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపే వారు.అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం ఉండేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే తనకు రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారని అంటారు.ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారని అంటారు. పార్టీ టిక్కెట్ల సమయంలో తన వర్గం వారిని వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి వద్దకు పంపించి ఆమెతో కూడా సిఫారసులు చేయిస్తుండేవారట. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కైవశం చేసుకున్న తర్వాత విపక్ష కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునే వారు. వైఎస్ జగన్ పై కాంగ్రెస్తో కలిసి సీబీఐ కేసు వచ్చేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అందరికి తెలిసిందే. మరి ఇవన్ని కోవర్టు రాజకీయాలో, కాదో చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి, రహస్య సమాచారం సేకరించే వారని, స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాలలో వాపోయారు. 2019లో ఓటమి తర్వాత తెలివిగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగానే ఆ నలుగురు పేరుకు బీజేపీ. సేవ చేసేదంతా చంద్రబాబు కోసమేనన్నది బహిరంగ రహస్యమే. తదుపరి పవన్ కళ్యాణ్ తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తిరిగి పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే కదా! ఇలా కోవర్టు రాజకీయం చేయడంలో చంద్రబాబు ఘనాపాటి. మరో సంగతి చెప్పాలి. ఎన్టీ రామారావు ఆత్మో, లేక మరొక పేరో తెలియదు కాని ఏఐ ఉపయోగించి చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్.ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారు. చంద్రబాబు సైతం ఎన్టీఆర్కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని, ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. తనను ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసినా, చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? అన్న విమర్శను వైసీపీ చేస్తోంది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు, లోకేశ్లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పని చేశారని చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఎఎస్లు చెబుతున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందని చెబుతుంటే దానికి భజంత్రి చేసిందే! ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు, లోకేశ్ లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇదే లాస్ట్ వార్నింగ్.. ఈసారి గీత దాటితే..!
-
బాబు సర్కార్ కొత్త స్కామ్.. దేవుడి భూములు స్వాహా..!
-
‘కూతురు కొడుకు ఎన్టీఆర్కు వారసుడా?’
సాక్షి, తాడేపల్లి: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప.. నారా లోకేష్ ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ..‘మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్.. ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు?. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్, ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నారు. ముంబై నుంచి సినీ నటిని రప్పించి, ఆమెతో ఆరోపణలు చేయించి.. ఆమెను అడ్డం పెట్టి జిందాల్ కంపెనీ రాకుండా తరిమేశారు’ అని విమర్శలు చేశారు.కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రష్టుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్ను తిట్టడానికే సరిపోయింది. టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. .@naralokesh ఎన్టీఆర్ గారి వారసుడిగా కాలేడు:మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్, ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు?నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన… pic.twitter.com/mpEcSgXMPT— YSR Congress Party (@YSRCParty) May 29, 2025పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’ అని మండిపడ్డారు. -
‘నారాయణ’ మంత్రం.. సర్కారు తంత్రం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలపై ప్రై‘వేటు’ వేసేందుకు ముందుగానే ప్రణాళికలు రచించి బంపర్ స్కామ్కు బాబు సర్కారు తెరతీయడం వైద్యవర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం పెట్టి లీజు పేరిట కారుచౌకగా కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేసిన విషయం తెలుసుకుని ప్రభుత్వ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కారుచౌకగా వచ్చే కళాశాలలను కైవసం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే పావులు కదిపారు. రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర వహిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ స్కామ్ నడిపేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. స్వతహాగా విద్యావేత్త అయిన ఆయనకు ఇప్పటికే స్కూల్స్, ఇంటర్ కాలేజీలతో పాటు మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలున్నాయి. ఆయన విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు మదనపల్లె కళాశాలలను కొన్ని నెలల ముందే సందర్శించారు. కళాశాలలో ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాలు, తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టళ్లు, ఆసుపత్రులను పరిశీలించి, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తాజాగా మరికొన్ని కళాశాలలను కూడా పరిశీలించినట్టు తెలిసింది.పీపీపీ పేరిట కొట్టేసేందుకు పకడ్బందీ వ్యూహం ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను నిలువు దోపిడీ చేయడం కోసమే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) స్కీమ్ పేరిట ప్రభుత్వం భారీ స్కామ్కు తెరలేపింది. ఇందులో భాగంగా ఇద్దరు ముఖ్యనేతలతో పాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం తమ బినామీలు, అస్మదీయులను అడ్డంపెట్టి కారు చౌకగా ప్రభుత్వ సంస్థలను కాజేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో నిర్వహణకు శ్రీకారం చుట్టారు. రూ.5 వేలకే 50 ఎకరాల భూమి లీజుకు ఇవ్వడమే కాకుండా, 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే గతేడాది జూన్లో ప్రభుత్వం కొలువైన వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ నిర్మాణాలను ఆపేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి 750 ఎంబీబీఎస్ సీట్లతో పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, పాడేరు, ఆదోని వైద్య కళాశాల ప్రారంభించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసినప్పటికీ సీట్లు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వచ్చిన సీట్లను సైతం రద్దు చేయమని కుట్రపూరితంగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి లేఖ రాశారు. పీపీపీలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేశారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీలో మాదిరిగా ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి నిరి్మ ంచిన వైద్య కళాశాలలను సగంలో ప్రైవేట్కు అప్పగించలేదు. కేవలం భూములు మాత్రమే లీజుకు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కళాశాలలు నెలకొల్పేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు మాత్రం 80 శాతం మేర నిర్మాణం పూర్తయి, చిన్న చిన్న సదుపాయాలు కల్పిస్తే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే కుట్రకోణం పూర్తిగా స్పష్టం అవుతోంది. -
చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు
సాక్షి ప్రతినిధి, కడప, అమరావతి: ఏడాదిలో చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు..! అంతా ఆత్మస్తుతి.. పరనింద..! వ్యవస్థాపకుడి కుటుంబాన్ని పక్కకునెట్టి.. సొంత కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు సీఎం ఎత్తులు..! ఇదీ టీడీపీ మూడు రోజులపాటు కడపలో నిర్వహించిన మహానాడు తీరు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేక పోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడ్డారు. వాగ్దానాలను నెరవేర్చలేని వైఫల్యాన్ని మరుగున పడేసేలా ప్రత్యర్థిపై దూషణలతో దాడికి దిగారు. మరోవైపు మహా నాడును.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసులు లేకుండానే నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ మహానాడులో బాలకృష్ణ కనిపించలేదు. దీంతో పూజించిన కేడర్ చేతులతోనే ఎన్టీఆర్ను ఛీ కొట్టించి ఆయన్నుంచి పార్టీని లాక్కున్న సీఎం చంద్రబాబు.. టీడీపీలో క్రమేపీ నందమూరి వంశానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నారా లోకేశ్ నాయకుడనేలా..మంత్రి నారా లోకేశ్ను పార్టీలో ప్రమోట్ చేసేందుకు నందమూరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు క్రమేపీ దూరం పెడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి దూసుకెళ్లిన జూనియర్ ఎన్టీఆర్కు మంచి స్పందన వచ్చింది. ఆయనను కొనసాగిస్తే తనయుడు లోకే‹శ్ రాజకీయ భవిష్యత్కు ఇబ్బంది అని చంద్రబాబు భావించారు. క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్ను దూరంపెట్టారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణను ముందుపెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ అవసరమూ తీరిందనే భావనతో తాజాగా మహానాడులో ఆయన కనిపించకుండా చేశారని అభిమానులు వాపోతున్నారు. టీడీపీ పూర్తిగా నారా వారిదేనని, ఎన్టీఆర్ వంశానిది కాదని కేడర్కు చెప్పేందుకే నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పరనిందలతో ఆత్మానందంకడప మహానాడులో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను అదే పనిగా దూషించడం, లేనిపోని నిందలు మోపి సంబరపడడానికే టీడీపీ నేతలు ఎక్కడ లేని ఉత్సాహం చూపారు. చంద్రబాబు, లోకేశ్ను ఆకాశానికి ఎత్తడం, చేయని పనుల గురించి అభూత కల్పనలతో గొప్పగా చెప్పుకొంటూ చంద్రబాబు ఆయన పరివారం ఆత్మానందం పొందింది. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించామంటూ ఊదరగొట్టడమే తప్ప కడప ప్రాంతానికి ఇన్నేళ్లలో ఏం చేశారో ఒక్కమాట చెప్పలేకపోయారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా ఏఐ వీడియో ప్రదర్శించడం బెడిసికొట్టింది. బాబు గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.తీర్మానాలు పోయి శాసనాలు వచ్చె..సాధారణంగా మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలు అంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి బాబు తన తనయుడు లోకేశ్తో చెప్పించారు. ఈ శాసనాలేమిటని తమ్ముళ్లు బుర్రగోక్కుంటూ చర్చించుకున్నారు. కార్యకర్తలే బలం అన్న రోజే బలవన్మరణ యత్నంఆరు శాసనాల్లో గొప్పగా చెప్పినవాటిల్లో కార్యకర్తే అధినేత. కానీ, అదే రోజు కడపలో మహిళా కార్యకర్త తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఎమ్మెల్యే మాధవి తమను అణచివేస్తున్నారని ఆమె బలవన్మరణానికి సిద్ధమైంది. దీన్నిబట్టి టీడీపీలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అర్థం పర్థం లేని శాసనాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత పదికి పైగా తీర్మానాలు చేసినా వాటిలో పస లేకుండాపోయింది.వాటిని ఎందుకు చేశారో, ఉద్దేశం ఏమిటో కూడా చెప్పలేకపోయారు. చివరగా రామ్మోహన్నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. గతంలో యనమల రామకృష్ణుడు ప్రతిపాదించేవారు. ఈసారి యనమల వేదిక మీద ఉన్నా.. రామ్మోహన్నాయుడుతో తీర్మానం చేయించి సీనియర్ల అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి భారీగా జనం వచ్చినట్టు చిత్రీకరించడం విమర్శలకు దారి తీసింది.టీడీపీ నేత ఫిర్యాదుతో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసుముందుగా వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకుని.. ఆపై ఫిర్యాదు తెప్పించుకుని కేసులు నమోదు చేస్తున్న అపఖ్యాతిని పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు మూటగట్టుకున్నారు. బుధవారం నమోదు చేసిన ఓ కేసులో వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల అదుపులో ఉండిపోయారు. కడపలో మహానాడు నిర్వహణను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. వారి దురుద్దేశం, దుశ్చర్యలను గమనించిన వైఎస్సార్సీపీ నేతలు మున్సిపల్ కమిషనర్, సబ్ డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో కోరారు. కానీ, దీనిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్సార్సీపీ కేడర్ వాటిని తొలగించింది. ఈ చర్యలో ఎలాంటి గొడవ, ఘర్షణ చోటుచేసుకోలేదు. తర్వాత కూడా టీడీపీ వర్గీయులు వైఎస్సార్ విగ్రహాలకు జెండాలు, తోరణాలు కట్టి సవాళ్లు విసిరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్లో టీడీపీ నేతలను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ వారికే వత్తాసు పలికింది. టీడీపీ నేతలు చెప్పగానే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసు ప్రతాపం చూపారు. అప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకపోగా, టీడీపీ నేత అక్కులగారి విజయ్కుమార్రెడ్డి నుంచి ఓ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారని సమాచారం. విజయ్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ వెంకటపతి తదితరులపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మంది బుధవారం రాత్రి నుంచి పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నారు. కోర్టులో హాజరుపరచకుండా గురువారం సాయంత్రం వరకు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసు స్టేషన్లు మారుస్తూ వారిని కొడుతూ వచ్చారు. దీంతో పులివెందుల పోలీసులు.. పసుపు నేతలు ఎలా చెబితే అలా ఆడుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
‘అప్పుడు చెంబెడు నీళ్లు.. మట్టి తెచ్చారు..ఈసారి అదీ లేదు’
నంద్యాల జిల్లా: టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించిన భజనకీర్తనలే చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదంటూ సీపీఎం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు విమర్శించారు. ఈరోజు(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ టీడీపీ మహానాడు మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని భజన కీర్తనలకే పరిమితమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడులకు లొంగిపోయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పజెప్పకుండా, ఏ విషయం తేలకుండా మిగిలిపోయిన ఆపరేషన్ సిందూర్ ను మహానాడు వేదికగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను, ఎన్టీఆర్ ను పొగిడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే చర్యలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ సమయంలో గతంలో నరేంద్ర మోదీ చెంబెడు నీళ్లు, మట్టి తెచ్చారు.ఈసారి అది కూడా తేలేదు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు లేవు. రూ. 1500 కోట్ల నిధులు లేవు. అలాగే వాగ్దానాలు నెరవేర్చలేదు.రాజధాని పేరుతో కార్పొరేట్ రాజధాని చేస్తున్నారు తప్ప.. ప్రజల రాజధాని కాదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మోదీని విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు మారిపోయింది. పవన్ ది నాలుక లేక తాటిమట్ట నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.. ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేశారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లొంగుబాటు రాష్ట్రానికి తీరని లోటు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని గాలికి వదిలేసి 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పడం ఏంటి?, టీడీపీ మహానాడు వైఫల్యాల పుట్ట. మహానాడులో ఇరగదీసింది ఏమీలేదు. మహానాడు ప్రజలపై భారం మోపేందుకు , పచ్చి అవకాశవాదంగా మార్చుకునేందుకు పెట్టారే తప్ప మహానాడుతో ఒరిగేదేమీ లేదు. అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదు’ అని హెచ్చరించారు. -
‘టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్’
తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారుమహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైఎస్ జగన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.వైఎస్ జగన్ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబేతాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్సార్ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్లో వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైఎస్ జగన్ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుపులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలోవైఎస్సార్సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు.గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబుహైదరాబాద్ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైఎస్సార్జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్సార్ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైఎస్సార్ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైఎస్ జగన్ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు’ అని గడికోట స్పష్టం చేశారు. -
మహానాడు కాదు.. అది ‘వెన్నుపోటు’ నాడు: లక్ష్మీపార్వతి
వికారాబాద్: కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రస్తుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్ను తిట్టడానికే సరిపోయింది’’ అంటూ లక్ష్మీపార్వతీ దుయ్యబట్టారు.‘‘టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే.. మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారు. పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్కి వారసుడు అవుతారు’’ అంటూ లక్షీపార్వతి ప్రశ్నించారు.‘‘వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్లారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు.. జగన్ను ప్రపంచమే మెచ్చుకుంది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన పీడ. మహానాడు కాదు అది.. వెన్నుపోటు నాడు. మహానాడు అట్టర్ ఫ్లాప్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారు. జిందాల్ కంపెనీ రాకుండా చేశారు. అవకాశం కోసం చంద్రబాబు, లోకేష్ పని చేస్తారు. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు...అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
పులివెందుల: కొనసాగుతున్న ‘కూటమి’ వేధింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 13 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల, వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్న(బుధవారం) సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు పెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏ తప్పూ చేయని వారిపై చేయిచేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను రెండు గ్రూపులుగా చేసిన పోలీసులు.. 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు మరో నలుగురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. -
వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు
-
చంద్రబాబు చెప్పేదానికి చేసే దానికి సంబంధం లేదు
-
ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు.. .. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?. చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు. ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు -
ఏఐతో బాబు సొంత డబ్బా.. సినిమా పరిశ్రమపై ఆగని పవన్ కల్యాణ్ వేధింపులు
-
బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!
ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్ సిక్స్ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.అలాగే కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే ఎందుకు ఎన్టీఆర్ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు విరాళాలు ఇస్తుంటే మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పేరుకే బాబు సీఎం.. కానీ నడిపించేదంతా..
-
మహానాడు పెద్ద డ్రామా: వైఎస్ జగన్
-
చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.కాగా, కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది. -
పదే పదే లోకేశ్ పాట!
సాక్షి, అమరావతి: కడప టీడీపీ మహానాడు ఆద్యంతం తన కుమారుడు లోకేశ్ని తన వారసుడిగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడ్డారు. లోకేశ్ బాగా చదువుకున్నవాడని, అన్ని విషయాలు తెలిసినవాడంటూ ఆయన గురించే తన ప్రతి ప్రసంగంలోనూ చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనే భవిష్యత్తు నాయకుడని పరోక్షంగా చెప్పారు.మాములుగా అయితే మహానాడులో ఎప్పుడూ వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీగా జరిగేది. కానీ, ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. లోకేశ్ని గొప్పవాడిగా చూపించే క్రమంలో సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి ఆయనతో చెప్పించారు. మొదటి రోజు చర్చంతా ఆయన చెప్పిన అంశాలపైనే జరిగేలా చూశారు. ఈ శాసనాలు లోకేశ్ ఆలోచనలని, వీటి ద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకూ రూట్ మ్యాప్ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈ శాసనాలు లోకేశ్ రూపొందించాడని, ఇవి అతని ఘనతేనని, వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు.నిజానికి ఈ శాసనాల్లో ఏమాత్రం కొత్తదనంలేదు. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయడం, తెలుగుజాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఏ రాజకీయ పార్టీ అయినా వీటి గురించే చెప్పడం సాధారణమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఉన్నది ఈ వర్గాలే. ఏం చేసినా ఆ వర్గాల కోసమే చేయాలి. అలాంటప్పుడు ఇందులో లోకేశ్ గొప్పదనం ఏమిటో పార్టీ శ్రేణులెవరికీ అర్థంకాలేదు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనబడుతోంది తప్ప అందులో కొత్త అర్థంకానీ, కొత్త విషయం కానీ లేదని వారంటున్నారు. లోకేశ్ కోసం డిమాండ్ల డ్రామా.. మరోవైపు.. లోకేశ్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు నేతలు అదే పనిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్జెంటుగా తనకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్న లోకేశ్ అది కుదరకపోవడంతో తెలంగాణలో కేటీఆర్ తరహాలో ఇక్కడ తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకుంటారని సీనియర్ నేతలు చెబుతున్నారు. అంటే.. ఆయన పదవి వ్యవహారం ఎప్పుడో నిర్ణయమైపోయింది. కానీ, ఇప్పుడు అందరి ఆమోదంతో దాన్ని ఇచ్చినట్లు చూపించాలి కనుక సీనియర్ నాయకులతో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్లు చేయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి వారిని లోకేశ్ దూరం పెట్టడంతో వారు ఆయన్ను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు మహానాడులో ఆయనకు అనుకూలంగా డిమాండ్లు చేసినట్లు కనబడుతోంది. మరోవైపు.. మహానాడులో అడుగడుగునా లోకేశ్ ఫొటోలను అత్యంత ప్రాధాన్యంగా ముద్రించారు. రామ్మోహన్తో రాజకీయ తీర్మానం.. యనమలకు ఝలక్.. చివరిగా.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. రాజకీయ తీర్మానాన్ని ఎప్పుడూ సీనియర్ నేతతో చేయించడం ఆనవాయితీ. గతంలో యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే వారు. కానీ, ఇప్పుడు రామ్మోహన్తో ఈ తీర్మానం చేయించి సీనియర్ల అవసరంలేదని చెప్పకనే చెప్పారు.తేలిపోయిన తీర్మానాలు.. ఇక రెండో రోజు రాజకీయ తీర్మానం సహా 15 అంశాలపై తీర్మానాలు చేసినా వాటిలో ఏమాత్రం పస లేకుండాపోయింది. వీటిలో ఒక్కటి తెలంగాణ తీర్మానం ఉండగా మిగిలినవన్నీ ఏపీకి సంబంధించినవే. తెలుగుజాతి–విశ్వఖ్యాతి, రాష్ట్రం–విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం, అభివృద్ధి వికేంద్రకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి–రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టు అభివృద్ధి, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమగ్ర సాగనీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి వంటి తీర్మానాలు చేసి వాటిపై అసత్యాలు, మాయమాటలు చెబుతూ నేతలు ప్రసంగించారు. -
మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత ఫైర్
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనల్లో కార్పోరేటర్లు, ధనవంతులు తప్ప సామాన్యులు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. సామాన్యుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ‘ఏపీ ప్రజలకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. గతంలో సోమవారం పోలవరం అని వారం వారం చంద్రబాబు తిరిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మంగళం పాడుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు. పోలవరం ఎత్తు తగ్గించి , పునరావాసం ఎగ్గొడుతుంటే ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. ప్రజల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు చంద్రబాబుపోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని మోదీ విమర్శించారు. పోలవరం పై చంద్రబాబు మహానాడులో తీర్మానం చేయాలి. బనకచర్ల - గోదావరి మీద ఉన్న శ్రద్ధ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పై లేదు. పోలవరమే ఇంతవరకూ పూర్తికాలేదు. 80 వేల కోట్లతో బనకచర్ల - గోదావరి ఎప్పటికి పూర్తిచేద్దామని అడుగుతున్నాను. కాంట్రాక్టర్లకు , రాజకీయ నాయకులకు లాభం చేకూర్చేందుకు బనకచర్ల - గోదావరి టెండర్లకు తొందరపడుతున్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. జూన్ 2 నాటికి 2 లక్షల 20 వేల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ఇస్తామన్నారు.ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి. టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేదు కానీ...భారీ అంతస్తులు భవనాలకు అనుమతిలిచ్చామని పేపర్లలో ప్రకటనలిస్తున్నారు. 22ఏ పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం
సాక్షి,వైఎస్సార్: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్
-
‘చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయం’
సాక్షి,తాడేపల్లి: పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారంటూ’ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారు?. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్యపోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్నారా?. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా?. ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అని ఎలా చెప్తారు?.అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడులాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా?. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా?. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు?. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు?. నారా లోకేష్ తన తాత ఖర్జూరనాయుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు?. ఇలాంటివేమీ మేము అడగ దలచుకోలేదు.రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని దియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలీదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదురాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది?. పోలీసులందరినీ వైఎస్సార్సీపీ నేతలను వేధించటానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను వాడటం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సరకాలంగా ఎందుకు అమలు చేస్తున్నారు?.పవన్ సినిమా వచ్చే ముందు ధియేటర్లలో విచారణ చేయటానికి సిగ్గు లేదా?’ అని వ్యాఖ్యానించారు. -
కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...
-
Ys Jagan: దమ్ముంటే ఆ ఒక్కటి చేసి చూపించు..!
-
కౌన్సిలర్లను భయపెట్టి.. ఇదీ ఒక రాజకీయమా బాబూ
-
కడపలో టీడీపీ మహిళా నాయకురాలు నిరసన
-
రీల్ Vs రియల్... AI తో బాబు మోసం
-
రాసిపెట్టుకోండి.. రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో.. వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు మన పార్టీ ఇన్ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రిని కాకాణిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారు.ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది అని అన్నారాయన. రిటర్న్ గిఫ్ట్ తప్పదుఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సమా రిటర్న్ గిఫ్ట్(return Gifts)లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించనవారినికూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానిక వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది’’ అని జగన్ అన్నారు.ఇదీ చదవండి: తెలుగు డ్రామా పార్టీ.. మహానాడుపై జగన్ సెటైర్లు -
మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)
-
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్ అన్నారు... చంద్రబాబు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లు, రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్సీ లేదు. మూడు డీఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, రాజధాని పనులు.. లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్ అన్నారు.క్లిక్ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన -
వంశీ తప్పు చేయలేదు.. బాబు బయటపెట్టిన నిజాలు
-
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్ ఉండి ఉంటేనా.. -
మహానాడుపై బాబుకు టీడీపీ మహిళా నేత లేఖ.. ఆవేదనతో టవర్ ఎక్కి..
సాక్షి, వైఎస్సార్: మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అనంతరం, సెల్ టవర్ ఎక్కారు సదరు నాయకురాలు. దీంతో, భారీగా పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.మహానాడు సందర్బంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన మీనాక్షి తన ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20ఏళ్లుగా పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవీ రెడ్డి గెలిచిన తర్వాత దళితురాలైన తనకు, ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. మహానాడుకు తన లాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు.టీడీపీకి ఎంతో సేవ చేసిన తమ లాంటి పార్టీ కార్యకర్తలను చంద్రబాబు, లోకేశ్ వరకూ రాకుండా మాధవీ రెడ్డి కోటరీ అడ్డుకుంటోందని ఆరోపణ చేశారు. నిజమైన కార్యకర్తలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ మనుగడే కష్టమన్నారు. తన లాంటి కార్యకర్తల గోడు మీకు తెలియాలనే ఆత్మహత్యకు పూనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కనీసం తన చావుతోనైనా మిగతా కార్యకర్తలకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం, కడపలో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ వద్దకు వెళ్లి.. టవర్ ఎక్కారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ నేత ఇలాంటి చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా! -
పవన్ కథ అడ్డం తిరిగింది.. మహానాడులో మాయమాటలు
-
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి. రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్ ఘోరంగా అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా.. -
ఏపీ పోలీస్, చంద్రబాబు కు విడదల రజిని వార్నింగ్
-
నా దారి దొంగదారి !
-
బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్
-
సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం
-
ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
-
రాష్ట్రంలో అరాచక పాలన
తెనాలి: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో దళితులు, మైనారిటీలు, బడుగులపై అరాచకాలు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అయ్యాయని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు నడి రోడ్డు పైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. వారు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగు వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు.రాష్ట్రంలో దళిత, మైనార్టీలకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెనాలిలో యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషం. వారు తప్పు చేస్తే, శిక్షించేందుకు న్యాయ వ్యవస్థ ఉంది. కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల పట్ల వ్యవహరిస్తున్న కర్కశత్వం తెనాలిలో ప్రతిబింబించింది. దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే దళితులపై దాష్టీకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పలుగులతో పొడిపించిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. దళిత ఐపీఎస్లు సునీల్కుమార్, సంజయ్ను రాజకీయ కక్షతో ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ పాలకులు ఎంతగా బరితెగించారంటే.. ఒక దళిత ఎమ్మెల్యేతో దళితులు గంజాయి తాగేవారు అనిపించారు. అణగారిన వర్గాల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరికి ఇది అద్దం పడుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో దళితుల మీద దాడి, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించడం, కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ దళిత వైద్యుడి చెంపపై కొట్టడం, నందికొట్కూరులో లాకప్ డెత్... ఇలా అనేక అకృత్యాలు చేశారు.రాజంపేట మున్సిపల్ చైర్మన్ రాంబాబును బహిరంగంగా అపహాస్యం చేయడం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితులను బహిష్కరించడం వరకు వారి అరాచకాలను ప్రజలు చూశారు. పల్నాడు జిల్లాలో దళిత మహిళను ఎగతాళి చేస్తే ఆత్మహత్యకు పాల్పడింది. సామాజిక సమస్యలపై స్పందించిన దళిత యువకుడిని రాజమహేంద్రవరం పోలీసులు దుస్తులు విప్పించి లాకప్లో పెట్టి అవమానించారు. రాజధాని ప్రాంతంలో భూములు లాక్కుని దళితులను వేధిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమ కేసులతో జైలుకు పంపారు.మదనపల్లెలో దళితుల నివాసాలపై దాడులు చేశారు. నగరిలో దళితులపై దాడులు చేసి వెలివేశారు. వీటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఇంత దారుణమైన దాష్టీకాలకు పాల్పడుతుంటే, ఏ ధైర్యంతో దళితులు, మైనారిటీలు, బడుగులు ఈ రాష్ట్రంలో బతకగలరు? తెనాలి ఘటనను చూసి దేశమంతా సిగ్గుపడుతోంది. బాధ్యులపై చర్యల కోసం న్యాయ పోరాటం చేస్తాం’ అని తెలిపారు.దళిత, మైనారిటీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తుంటే సహించం‘తెనాలిలోని ముగ్గురు యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణం. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోలీసులు ఇలాంటి దారుణాలకి పాల్పడ్డారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలు, బడుగులకు ఆత్మగౌరవంతో బతికే హక్కు లేదా? వారిని పశువులను కొట్టినట్లు నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఏ రాజ్యాంగం ఇచ్చింది?’ అని ఎమ్మెల్సీ అరుణ్కుమార్ నిలదీశారు.‘రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులు, మైనారిటీలను ఇలాగే హింసించాలని ఉందా? ఇంతటి అమానవీయ ఘటన జరిగితే కనీసం దళిత హోం మంత్రి కూడా స్పందించరా? యువకులను కొడుతుండగా వీడియోలు తీసి పోలీసులు ఎవరికి పంపారు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను చూసి దళితులు, మైనారిటీలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ఏడాదిగా ఇలాంటివి అనేక ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రతిపక్షంతో పాటు దళిత, మైనారిటీలకు కూడా వర్తింపజేస్తున్నారు. ఘటనకు కారణమైన పోలీసులపై విచారణ జరిపించాలి. భవిష్యత్తులో జరగవనే భరోసాను దళిత, మైనారిటీలకు కల్పించాలి’ అని అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.కూటమి పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం‘తెనాలి ఘటనను యావత్ ప్రపంచం చూసింది. మొత్తం సమాజమే భయాందోళనలకు గురయ్యేలా ఉంది. ప్రజలకు న్యాయ, సామాజిక రక్షణను కల్పించాల్సినవారే చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఎలాంటి అరాచకం ఏర్పడుతుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు రక్షణ, చట్టాలను కచ్చితంగా అమలు చేయాలనే అంశంలో ఎక్కడా గీత దాటలేదు’ అని అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం‘రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర కాదు హత్యాంధ్రప్రదేశ్గా మారుసున్నారు. రోజూ హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.. దళిత ద్రోహి ప్రభుత్వమిది. చంద్రబాబు స్వయంగా దళిత వ్యతిరేకి. తెనాలి ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి’ అని కొమ్మూరి కనకారావు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, వైఎస్సార్సీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, ఈదుమూడి డేవిడ్రాజు, ముదిగొండ ప్రకాష్, కాకుమాను రాజశేఖర్, తెనాలి నేతలు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, చింకా సురేష్ పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేశ్, షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అవే గొప్పలు.. అదే విద్వేషం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. సూపర్ సిక్స్ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ సిక్స్ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ సిక్స్ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషంచంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.తండ్రీ కొడుకులపై పొగడ్తలు ఎన్టీఆర్ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.‘మహా’కష్టాలు» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట » పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం » నిర్వాహకులపై బాబు సీరియస్ » మీడియాపై లోకేశ్ ఆంక్షలు సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్చాట్ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్లు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్ కేసులు రిమ్స్లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. -
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్
తాడేపల్లి: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై ఏపీ పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఎలా ఉల్లంఘిస్తుందో అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ వేదికగా ఆ యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు అపరిమిత అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చి భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. చట్ట పరంగా పాలనను సాగించడానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మానవ హక్కులను వారి రక్షణను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యధేచ్ఛగా అమలు చేస్తుంది. పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సిఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు. నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. భారత రాజ్యాంగాన్ని బాబు సర్కారు బహిరంగంగానే ఉల్లంఘించి అరాచక పాలన సాగిస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. జరగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేశారు వైఎస్ జగన్.The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections… pic.twitter.com/zqvwxWXolJ— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025 చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ -
విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన
-
పరాకాష్టకు రెడ్ బుక్ పాలన: విడదల రజిని
సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు...డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.కట్టుకథలతో కేసులో ఇరికించారు..మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు. -
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు: Sailajanath
-
టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్
సాక్షి అనంతపురం : టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది చంద్రబాబే.. టీడీపీకి వారసుడు ఎవరు?. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించారు.జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు.పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
ఏం సాధించారని ..మహానాడు సంబరాలు ?
-
షాడో సీఎం లోకేష్.. సకల శాఖ మంత్రిగా నియామకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీలో ఒకప్పటి క్రియాశీలక నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే తీసుకుంటున్నారా? లేక ఆయన ఇంకెవరైనా ఉన్నారా? అనే సందేహమూ వ్యక్తమైంది ఆయన్నుంచి!. అలాగే.. అమరావతి కోసం మరిన్ని భూములు సేకరించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం.. అదే సందర్భంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం!. వాస్తవానికి వడ్డే టీడీపీకి పెద్ద వ్యతిరేకి కాదు.. వైఎస్సార్సీపీ మద్దతుదారు కూడా కాదు. వయసు కారణంగా సీరియస్ రాజకీయాలు చేయని ఈయన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబు తెలివిపై అనుమానం వచ్చింది. ఆయనతో సంబంధం లేకుండా ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. అదెవరో చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు కానీ.. బాబుగారి సుపుత్రుడు, మంత్రి లోకేశ్ అన్నది బహిరంగ రహస్యమే!. ఇటీవలి పరిణామాలు, మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి!. చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నది నారా లోకేశ్(Nara Lokesh) అన్నది తాజా కథనాల సారాంశం. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం మొదలైంది కూడా లోకేశ్ నేతృత్వంలోనే అనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పేరుతో చెత్త ఏరివేత వంటివి ముఖ్యమంత్రి చూసుకుంటుంటే.. లోకేశ్ ఏమో తన శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకూ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం వడ్డే వంటి వారికి అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి!. గుంతకల్లు సమీపంలోని బేతేపల్లి వద్ద 22 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేయడం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉండగా ఆమోదం పొందింది. ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరుకుంది. అది వేరే సంగతి. ఈ ఇంధన ప్రాజెక్టుకు లోకేష్ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. అయినా ఇంత భారీ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుకు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన జరుగుతుంది. అందులోను చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కాని అక్కడకు ఆయన వెళ్లలేదు. అదే టైమ్ లో కర్నూలు వద్ద స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరుతో జరిగిన ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఊళ్లలో చెత్త ఎత్తుతున్నారా? అన్న ప్రశ్నలతోపాటు రోడ్లపై కూరగాయలు అమ్మే వారిని, బడ్డీ కొట్ల వారిని పలకరిస్తూ కాలక్షేపం చేయడం అందరిని విస్తుపరచింది. కొద్దిరోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ యూనిట్కు కూడా లోకేశే భూమి పూజ చేశారు. ఈ మధ్యకాలంలో లోకేశ్ తన ఇంటిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారట!. ఇందులో రాష్ట్రం అంతటి నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారట. మంగళగిరిలో తన పేరు మీద ‘‘మన ఇల్లు- మన లోకేశ్’’ ఒక కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఆర్థిక శాఖ విషయాల్లోనూ లోకేశ్ జోక్యం పెరుగుతోందని, నిధుల విడుదల వంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ఖరారు, ఇతర వ్యవహారాలు కూడా లోకేశే చూసుకుంటున్నారని సచివాలయం వెళ్లివచ్చిన ఒక ప్రముఖుడు చెప్పారు. సచివాలయంలో, పార్టీ కార్యాలయంలోనూ లోకేశ్ హవానే నడుస్తోందంటున్నారు. ఇక ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భార్య నారా బ్రాహ్మణితో ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.చంద్రబాబు మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నా లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కల్యాణ్ సైతం పన్నెత్తు మాట అనలేకపోతున్నట్లు ప్రచారం. తాను ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ అడ్డుపడ్డారని లోకేశ్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది మొక్కుబడి మాట మాత్రమే. చంద్రబాబు తన కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో లోకేశ్ను డిప్యూటీ చేసినా పవన్ చేసేదేమీ ఉండదు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఎవరైనా తనను కలిసేందుకు వస్తే చినబాబు (మంత్రి లోకేశ్)ను కలవమని చెబుతుండే వారు. విపక్షంలో ఉండగా లోకేశ్ ‘యువగళం’ యాత్రలో పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సొంతం పలు హామీలు గుప్పించారు కూడా. అయితే.. 2024లో అనూహ్యంగా అధికారం దక్కడంతో ఆయన రెడ్ బుక్ అమలుకు ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ హోం మంత్రి కాకపోయినా ఆ శాఖ మొత్తం ఆయన అధీనంలోనే ఉందని అంటారు. లోకేశ్ను ఇప్పటికే కొంతమంది సకల శాఖల మంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా మహానాడులో లోకేష్ను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా చేయవచ్చన్నది ఒక టాక్. అదే జరిగితే ప్రభుత్వంతో పాటు, పార్టీ కూడా పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే ఒక బ్రాండ్ అని లోకేశ్ చెబుతుండొచ్చు. కానీ.. ఆ పేరుతో ఆయన తన సొంత బ్రాండ్ను నిర్మించుకుంటున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో చంద్రబాబుపై కుటుంబపరమైన ఒత్తిడి ఉందని అంటారు. కానీ ఆయన ఎందువల్లో ఆ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయమూ ఉండి ఉండవచ్చు. పవన్ కల్యాణ్ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి చంద్రబాబు,లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కూడా సంతృప్తి చెంది.. ప్రభుత్వపరంగా ఏ అరాచకం జరుగుతున్నా, ఎన్ని తప్పులు చోటు చేసుకుంటున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్కు అధికారికంగా పట్టాభిషేకం జరగలేదు కాని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చంద్రబాబును నామమాత్రంగా చేశారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడం విశేషం.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహానాడు పనుల్లో అధికారులే పని వాళ్లు
-
అరాచకుల రాజ్యంలో 4 పాదాలపై నడుస్తోన్న అధర్మం
-
‘మహా’ డ్రామాలో అధికారులు, ఉద్యోగులే సమిధలు
సాక్షి, అమరావతి: టీడీపీ మహానాడు కోసం అధికార యంత్రాంగాన్ని ఇష్టానుసారం వాడుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోని అధికారులతోపాటు వైఎస్సార్ జిల్లా ఉద్యోగులను వారం రోజులుగా పూర్తిగా ఈ కార్యక్రమానికే ఉపయోగించుకుంటున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడును ఆర్భాటంగా నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అన్ని పనులు చేయించుకుంటున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ముఖ్య నేతలు, శ్రేణుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వారి కోసం కింది స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఓలు, సర్వేయర్లు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ఒక్కో ఎమ్మెల్యే దగ్గర ఇద్దరు ఉద్యోగులు మూడు రోజులపాటు ఉంటూ అవసరమైన సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇదే పనిలో నిమగ్నమై ఉంది. ఈ కార్యక్రమం కోసం మంత్రులు, ముఖ్యనేతలు పది రోజులుగా అక్కడే తిరుగుతుండటంతో అధికారులకు వేరే పని లేకుండాపోయింది. 18 తీర్మానాలు ఈ మహానాడులో 18 తీర్మానాలు చేయనున్నారు. ఏడాదిలో ప్రభుత్వ విజయాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అమరావతి నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, చంద్రన్న విజన్తో సంక్షేమ రాజ్యం, ప్రజాపాలనపై వైఎస్సార్సీపీ విష ప్రచారం వంటి తీర్మానాలు అందులో ఉన్నాయి. 18 తీర్మానాల్లో 14 ఏపీకి సంబంధించినవి కాగా.. 4 తెలంగాణవి పెడుతున్నారు. తొలి రోజు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ ఇచ్చి రెండో రోజు ఎన్నుకోనున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా చంద్రబాబును లాంఛనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. మూడవ రోజు మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహిస్తారు. -
ఏడాదిగా దగా.. ఏం సాధించారని సంబరాలు?
తాము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగించడంతోపాటు అంతకంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తానంటూ ప్రతి ఎన్నికల సభలోనూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏడాదిగా కొత్తవి ఒక్కటి కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.1.37 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. అన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదు. హామీలను ఎగ్గొట్టి.. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెడ్బుక్ కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు.ఇసుక,గనులు,మద్యం దాకా ఎల్లో సిండికేట్ సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది. టీడీపీ కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లను డీబీటీ రూపంలో వైఎస్ జగన్ నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకున్నారనే చర్చ గ్రామ గ్రామాన జరుగుతోంది. - సాక్షి, అమరావతి ఇది రద్దుల ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలను టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసింది. ఫీజుల పథకానికి చెదలు పట్టించింది. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసింది. చదువుకునే పిల్లలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులను మోసగించి వంచించింది. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి తమ సన్నిహితులు, బినావీులకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు.నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. 2023–24లోనే ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున అందిస్తామని నమ్మబలికారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని.. ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ అందచేస్తామని చెప్పారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.ఆడబిడ్డ నిధి కింద 19 – 59 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. వారు నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈమేరకు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ బాండ్లు పంపిణీ చేసి నమ్మించారు. సూపర్ సిక్స్తోపాటు మొత్తం 143 హామీలను టీడీపీ–జనసేన కూటమి ఇచ్చింది. వాటి అమలు బాధ్యత తనదేనంటూ పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తి మోసాలుగా మిగిలాయి. జాబ్ క్యాలెండర్ హుష్కాకి..వైఎస్సార్సీపీ హయాంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చారు. 2019–24 మధ్య శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఎంఎస్ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా జాబ్ కేలండర్ ఊసే లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు.సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయించి గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ దాదాపు 1,000 పోస్టుల భర్తీకి అనుమతించినా కూటమి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. డీఎస్సీ పేరుతో ఏడాదిగా డ్రామాలాడి విచిత్ర నిబంధనలతో అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని పరీక్షకు దూరం చేశారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విషం.. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేశారు. భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని, భూములకు రక్షణ లేదని, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చే క్రమంలో దేశంలోనే మొదటిసారిగా భూముల రీ సర్వే నిర్వహించింది. భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దీన్ని వేదికగా మార్చుకున్నారు.ఎడాపెడా అప్పులు.. రెడ్బుక్ టెర్రర్వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేసిందంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండివార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లు అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని చెప్పించారు. గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు.కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ఫ్రచారం చేసూ్తనే వచ్చారు. నిజానికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.7,21,918 కోట్లే. ఇందులో విభజన జరిగే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర అప్పు రూ.1,47,717 కోట్లు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లకు చేరుకుంది. అంటే 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా 22.63 శాతం అప్పులు పెరిగాయి (సీఏజీఆర్).వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు. అంటే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా సగటున 13.57 శాతం మాత్రమే అప్పులు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.1,37,546 కోట్లు అప్పు చేసింది. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 41 శాతాన్ని చంద్రబాబు కూటమి సర్కార్ ఒక్క ఏడాదిలోనే చేసింది. డైవర్షన్ పాలిటిక్స్..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ఎగవేత.. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. పచ్చమూకల నరమేథాన్ని దేశానికి చాటిచెప్పేందుకు గతేడాది జూలై 24న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగితే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లెలో అగ్ని ప్రమాదం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు.విజయవాడలో వరదల నియంత్రణలో కూటమి సర్కారు వైఫల్యంతో 50 మందికిపైగా బలయ్యారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టారంటూ దారుణమైన అబద్ధాలను చంద్రబాబు ప్రచారం చేశారు. తన వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ సెప్టెంబరు 18న సీఎం డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. మాఫియా రాజ్యం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది వర్షాకాల అవసరాల కోసం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పచ్చ ముఠాలు మాయం చేశాయి. ఉచితం ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున దోచేస్తోంది.గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ పెద్దలు దుష్ప్రచారం చేస్తూ నాడు అధికారులుగా పని చేసిన వారిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినావీులకు దోచిపెడుతున్నారు. ఊరూపేరూ లేని ఉర్సాకు 99 పైసలకే ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని విశాఖలో కట్టబెడుతున్నారు. లూలూ మాల్ పేరుతో విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూదోపిడీకి పరాకాష్ట.దుష్ప్రచార కుట్రలు బట్టబయలు..ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి 2.60 లక్షల మందిని నియమించారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే ఇంటివద్దే పెన్షన్ల నుంచి అన్ని రకాల పౌర సేవలను వలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించింది. కరోనా మహమ్మారి సమయంలో వలంటీర్ల సేవల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మారు. వలంటీర్ల ద్వారా 33 వేల మంది మహిళలను మాయం చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరాధార ఆరోపణలు చేశారు. అయితే 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 16న అసెంబ్లీలో వెల్లడించడం గమనార్హం.చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ 'బూటు' దెబ్బప్రశ్నించే గొంతులు నొక్కుతూ..చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 390 మంది హత్యలకు గురయ్యారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి 500 మంది నాయకులు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేశారు. జర్నలిస్టులపై 63 అక్రమ కేసులు బనాయించి 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి ఇద్దరిని జైలుపాలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాంగత ప్రభుత్వంతో పోల్చితే కూటమి సర్కారు పాలన ఏం బాలేదు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత లాంటి సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. చేయడానికి పనులు దొరకడం లేదు. ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. అది ఆచరణలో ఎక్కడా అమలు జరగడం లేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ వచి్చంది. 200 యూనిట్ల వరకూ విద్యుత్ను ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటి వరకూ ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇకపై వచ్చే నాలుగేళ్లలో ఇస్తుందనే నమ్మకం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు వచ్చి ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం. – బయ్యే నాగవిజయబాబు, శెట్టిపేట, తూర్పు గోదావరి జిల్లాకూటమి సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుతో పాటు శెట్టిపేట, తాళ్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద, కృష్ణాపురం, కొమ్ముగూడెం తదితర చోట్ల వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు ఇలా..⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు జ్యోతి కాలనీలో నివసించే దిద్దే ఆనంద్కుమార్ భవన నిర్మాణ కార్మికుడు. విధి వక్రీకరించి ఆర్నెల్ల క్రితం పక్షవాతం బారిన పడటంతో రెండు కాళ్లూ పనిచేయడం లేదు. వికలాంగ పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. ఏడాదిగా ఇలా ఎంతో మంది పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉంటున్న సీలి విజయకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా రుణం ఇవ్వడం లేదని, కనీసం డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదనగా చెబుతోంది. వలంటీర్గా పనిచేసే తన కోడలిని తొలగించారని, మనవళ్లకు అమ్మ ఒడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడాదిలో ఏమీ చేయని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో చేస్తుందని నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద గ్రామంలో పొలానికి నీరు పెడుతున్న ఈ రైతు పేరు యాతం రామాంజనేయులు. పంట కోత దశకు వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తడి అందక పంట ఎండిపోయింది. కౌలుకి తీసుకున్న మూడెకరాలకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున కట్టాలి. గతంలో రైతు భరోసా వచ్చేదని, ఎకరాకు రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు పైసా కూడా ఇవ్వలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.⇒ ‘గత ప్రభుత్వంలో నాకు చేయూత ఇచ్చేవారు. నా భర్తకు పింఛన్ వచ్చేది. నా కోడలికి అమ్మ ఒడి అందేది. నా మనవళ్లకు పుస్తకాలు, దుస్తులు ఉచితంగా ఇచ్చి మంచి భోజనం పెట్టేవారు. కరోనా సమయంలో వలంటీర్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలిచ్చింది. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు, ఒకటి ఇచ్చేశామంటున్నారు. కానీ నాకుగానీ, నా కోడలికిగానీ రాలేదు. మేమే కాదు మా ఊరిలో అందరం ఇలాగే బాధపడుతున్నాం. జగన్ ఉన్నప్పుడు రూ.10 వేలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆటోడ్రైవర్లు అంటున్నారు.’ – మణెమ్మ, తాళ్లపాలెం, తూర్పుగోదావరి జిల్లా. -
‘రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైఎస్సార్సీపీ లీగల్సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం కాకాణి గోవర్థన్రెడ్డిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీనాయక్తో తప్పుడు ఫిర్యాదు చేయించి, కేసు పెట్టించారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టవిరుద్దమైన అన్ని పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మీద అక్రమ మైనింగ్ అంటూ ఓ తప్పుడు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీని వెనుక కారణం ఏంటని చూస్తే పొదలకూరు దగ్గర క్వార్ట్జ్ మైనింగ్కి రుస్తుం మైకా అనే కంపెనీ లీజు హోల్డర్లు. వారికి 2009 నుంచి 2023 ఏప్రిల్ 1 వరకు లీజు గడువు ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వ పాలసీ మారిన తర్వాత తిరిగి ఎవరికీ లీజుకివ్వలేదు.అయితే అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధర్నాలు చేసి ఫిర్యాదులు చేస్తే, అప్పట్లోనే మైనింగ్ అధికారులు విచారణ చేసి ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదని నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అంశంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కాకాణి గోవర్ధన్రెడ్డిపై తాజాగా ఫిర్యాదు చేయించి కేసు పెట్టడం రాజకీయ కక్షసాధింపు కాదా?కుట్రపూరితంగానే అక్రమ మైనింగ్ కేసుకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం మొదలైంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 14, 2025లో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో అక్రమ మైనింగ్ చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో ముద్దాయిలుగా ముగ్గుర్ని చేరిస్తే వారందరికీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది. ఇందులో కాకాణి గోవర్థన్రెడ్డి పేరు ఎక్కడా లేదు. ఎఫ్ఐఆర్లో అదర్స్ ప్లేస్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేరును చేర్చారు. కొంతమందిని అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకున్నారు.మైనింగ్ చేసుకోండి, మీ వెనుక నేనున్నాను అని కాకాణి అభయం ఇచ్చినట్టుగా ఏ6 అరవిందకుమార్రెడ్డి అనే వ్యక్తిని బెదిరించి, కొట్టి ఆయనతో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత జూలై 2025న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో ఫిర్యాదు చేయించారు. కాకాణికి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో సెక్షన్లు మార్చి నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ తప్పుడు కేసులోనే ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులోనూ జరిగింది ఇదే. మొదట ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టయిన తర్వాత పీసీఐ యాక్ట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.పల్నాడు జంట హత్యలతో పిన్నెల్లి సోదరులకు ఏం సంబంధం?మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకులు బైకుపై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి చంపారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఈ దాడి జరిగిందని, దాడి చేసిన వారు కూడా టీడీపీ వారేనని ఎస్పీ ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇదే విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. కానీ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేకపోయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మీద అక్రమ కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వారిపై తప్పుడు కేసు నమోదు చేశారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై కూడా జేబీఆర్ (జూలకంటి బ్రహ్మారెడ్డి) పేరు కూడా ఉంది. హత్యను కళ్ళారా చూసిన మృతుడి బంధువు తోట ఆంజనేయులు సైతం టీడీపీ వారే చంపారని పోలీసులతో చెప్పారు. దీనికి సంబంధించి వారు మాట్లాడిన వీడియోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఇది అక్రమ కేసేనని రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెబుతారు.కల్తీ లిక్కర్ మరణాలను మద్యం కేసుకి లింక్ చేస్తున్నారుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలతో కొందరు చనిపోయారని టీడీపీ నాయకులు అసెంబ్లీలో ఆరోపిస్తే ఇదంతా అవాస్తవమని దానిపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ అంశాన్ని తీసుకొచ్చి కొత్తగా కేసులు నమోదు చేస్తున్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయారని కుటుంబసభ్యులే స్టేట్మెంట్ ఇచ్చినా, ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం వల్లే ఆ మరణాలు సంభవించినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తం 25 మంది చనిపోయినట్టు కొత్త కథలు రచించి భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై నాటి సీఎం జగన్ మాట్లాడుతూ సహజ మరణాలను కూడా కల్తీ లిక్కర్ మరణాలుగా మార్చి ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు.లిక్కర్ లో విషపూరిత అవశేషాలనున్నట్టు తప్పుడు ప్రచారంఏపీలోని మద్యం శాంపిళ్లను పరీక్షించిన ఎస్జీఎస్ లేబొరేటరీ అందులో విషపూరిత అవశేషాలున్నట్టుగా తేల్చిందని టీడీపీ నాయకులు విష ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున నేరుగా లేబొరేటరీకి లేఖ రాసింది. దీనిపై ఎస్జీయస్ లేబొరేటరీ స్పందించి తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని లిఖితపూర్వకంగా చెప్పినా ఇంకా అసత్యాలనే టీడీపీ ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని తమకు గిట్టని వారి మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.నడిరోడ్డుపై పోలీసుల అరాచకంరాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడి రోడ్డు మీదనే దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై మానవహక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. కూటమి నాయకులు ఏది చెబితే అది చేయడానికి పోలీసులు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ప్రజాస్వామ్య వాదులు మేథావులు ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. -
కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని MDUఆపరేటర్ల డిమాండ్
-
తప్పుడు కేసులకు భయపడం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తిరుపతి జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా అంత ఒక్కతాటిపై ఉండి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి అండగా ఉంటాం.. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవుతుంది. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్సీపీ నాయకులు భయపడరు. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది’’ అని అనిల్ చెప్పారు.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ జైలుకు పంపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారువెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. సీఎం చంద్రబాబును ఇళ్లకు పంపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఇల్లు సాధ్యం కాదని.., చంద్రబాబుకు మాత్రమే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రజలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారుఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ.. నిరాధారమైన ఆరోపణలతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడరు.ఎమ్మెల్సీ చంద్ర శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా చరిత్రలో తప్పుడు కేసులతో మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఘటన ఎప్పుడు జరగలేదు. జూన్ 4 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం బలంగా నిర్వహిస్తాం. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం -
YSRCP Leaders: మేము అధికారంలోకి వచ్చాక దీనికి రెట్టింపు తిరిగి ఇస్తాం
-
కాకాణి గోవర్ధన్రెడ్డి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం
-
ఏపీలో కక్ష రాజకీయాలు పరాకాష్ట్రకు చేరాయి :Merugu Nagarjuna
-
కల్పిత ఆధారాలతో అక్రమ కేసులు.. కక్ష కట్టి అరెస్ట్లు: మేరుగ
తాడేపల్లి: కల్పిత ఆధారాలతో తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్.. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలులో వేశారు. అధికారులను కూడా జైల్లో వేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారనే కారణంగా ఇప్పుడు కక్ష కట్టి అరెస్టులు చేస్తున్నారని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు.‘‘కాకాణి గోవర్ధన్రెడ్డిని ఏ4 గా నమోదు చేశారు. గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని కాకాణిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. పల్నాడులో జంట హత్యలు చేసింది టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీనే ప్రకటించారు. అయినప్పటికీ తిరిగి పిన్నెల్లి సోదరులపై కేసు పెట్టారు. ఎస్పీ మాటలనే అభాసుపాల్జేశారంటే ఎంతటి దారుణమైన వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చు. జంగారెడ్డిగూడెం మృతులను కూడా రాజకీయ కక్షసాధింపునకు వాడుకోవటం సిగ్గుచేటు’’ అని మేరుగ మండిపడ్డారు...ప్రజల కోసం పని చేయాలన్న ఆలోచనే ప్రభుత్వ పెద్దలకు లేదు. ప్రభుత్వ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరి, పొగాకు, మిర్చి, శనగ, పత్తి, మినుము.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేవు. జగన్ హయాంలో రైతుకు భరోసా ఉండేది. చంద్రబాబు ప్రభుత్వానికి రైతులంటే ఎంత మాత్రం లెక్కలేదు...వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తేగానీ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయలేదు. పొగాకు రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వైఎస్ జగన్ హయాంలో రూ.35 వేలు పలికింది. ఇప్పుడు కూలి ఖర్చులు కూడా రావటం లేదు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతుల్లో ధైర్యం కల్పించేందుకు 28న పొదిలి వెళ్తున్నారు’’ అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. -
బాబు పేపర్ లీకుల కుట్ర బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు
-
ప్రజల నుంచి 784 కోట్ల ఆస్తిపన్ను వసూలుకు కూటమి సిద్ధం
-
వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో యథేచ్చగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని... చివరికి డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జత్వానీ అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి పీఎస్ఆర్ని అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ మరొక కేసు ఆయనపై పెట్టారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్సీ నిర్వహించింది. కానీ అక్రమంగా చేశారంటూ కేసులు పెట్టారు’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.‘‘వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి. చంద్రబాబు 21 నోటిఫికేషన్లను సంబంధించి ఏమాత్రం ముందుకు తీసుకుపోవటం లేదు. ఇటీవల గ్రూపు-2 లో ఎన్ని అక్రమాలు చేశారో జనం చూశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా అన్ని నియామకాలు గొప్పగా జరిగాయంటూ కేంద్రమే మెచ్చుకుంది. చంద్రబాబు 1995లో సీఎం అవగానే టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయి. 1997లో ఇంటర్ పరీక్ష పేపర్లు లీకే చేశారు. 2017 లో కూడా నారాయణ విద్యాసంస్థల కోసం ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయి. ఆ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వార్తలు వచ్చాయి...పేపర్ల లీకేజీలో అప్పటి మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు పాత్ర ఉంది. అయినప్పటికీ వారిని చంద్రబాబు ఎందుకు అరెస్టు చేయలేదు?. 2022లో నారాయణ సంస్థల వారు ప్రశ్నాపత్రాల లీక్ చేయాలని చూస్తే జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అంత పకడ్బందీగా జగన్ పాలనలో పరీక్షలను నిర్వహించారు. చంద్రబాబు హయాంలో మూడు లీకులు, ఆరు అక్రమాలు ఉంటాయి. చివరికి హాఫ్ ఇయర్లీ పరీక్షా పత్రాలు కూడా చంద్రబాబు హయాంలో లీకయ్యాయిజగన్ హయాంలో ఆరి నెలలోనే లక్షా యాభై వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి అక్రమాలు లేకుండా నియామకాలు చేశారు. జగన్ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు వ్యవహరించాలి. ఇకనైనా ఆరోపణలను కట్టిపెట్టి కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ హితవు పలికారు. -
పవన్ ప్రకటన.. బలమా? లేక భయమా?
‘‘ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు గణనాథ’’ అని ఓ పాట ఉంది. ఇప్పుడు ఈ పాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా?. ఆయన ఇప్పుడు తన పదవిని ప్రజాసేవకంటే తన అహంకార ప్రదర్శనకు, వ్యక్తులు, సినీ పరిశ్రమను బెదిరించేందుకే ఎక్కువగా వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఆయన స్వయానా ముఖ్యమంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి మాత్రమే. రెండోది.. సినిమాటోగ్రఫీ ఆయన పరిధిలోకి రాదు. కాకపోతే ఆ శాఖ జనసేనకే చెందిన కందుల దుర్గేశ్ది. అంటే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులను హెచ్చరించారన్నమాట. ఈ అభ్యంతరకరమైన పని చేస్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదో సినీ పరిశ్రమను వేధించిందన్న అబద్ధాలను ప్రకటనలో జొప్పించారు. సినీ పరిశ్రమ వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవలేదన్నది ఆయన అభ్యంతరాల్లో ఒకటి. నిజానికి.. పరిశ్రమలో పలువురు ప్రముఖులతో (Cine Industry Biggies) చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. వారి సేవలను టీడీపీ బాగానే వాడుకుంటోంది. కానీ కొందరు కీలకమైన వ్యక్తులు పవన్ను మాత్రమే కలసివెళ్లారు. అయినా ఆయనలో ఏదో అసంతృప్తి! కృతజ్ఞత చూపడం లేదని ఇంకో మాట అన్నారు పవన్. ఇది అడిగి సన్మానం చేయించుకున్నట్లుగా ఉంది! తనకు తెలియకుండా ఎవరూ సినిమాలు తీయరాదన్నది పవన్ ఉద్దేశమా? లేక సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా తన చెప్పు చేతలలో ఉండాలని కోరుకుంటున్నారా? ఏది ఏమైనా... సినీ పరిశ్రమ మొత్తాన్ని బెదిరిస్తూ పవన్ బహిరంగ ప్రకటన జారీ చేయడం వారిని అవమానించడమే!. 👉వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సినీ పరిశ్రమ తన వద్దకు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సహా అందరినీ సాదరంగా ఆహ్వానించి, చర్చలు జరిపి, వారి కోర్కెలు తీర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పవన్ మాత్రం థియేటర్లలో సదుపాయాలు తనిఖీ చేస్తాం.. టిక్కెట్ రేట్ల పెంపుదల గురించి ఎవరూ తమ వద్దకు వ్యక్తులుగా రావద్దు.. ధరలు పెంచాక దానికి తగ్టట్లే ఆదాయం ప్రభుత్వానికి వస్తోందా? లేదా? అన్నది చూస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు. ఏది కరెక్ట్? పైగా.. పవన్ ఏ అధికారంతో ఇలాంటి ప్రకటనలు చేశారు? ప్రభుత్వ విధానాన్ని ఆయన చెప్పి ఉంటే.. వచ్చే నెలలో విడుదల కానున్న ఆయన సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)కు సంబంధించి రేట్ల పెంపుదల వ్యక్తిగతంగా కోరకుండా ఉంటారా?. ఇకపై ఆయా సినిమా విభాగాలతోనే మాట్లాడతామని పవన్ చెప్పిన మాట తనకు, తన సినిమాలకు కూడా వర్తిస్తుందా? లేదా?. తన సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారా?. థియేటర్ల వారు, డిస్ట్రిబ్యూటర్లు పర్సెంటేజ్ పద్దతి పెట్టాలని, అద్దె ప్రాతిపదికన అయితే తమకు నష్టం వస్తోందని అంటున్నారు. అందులో హేతుబద్దత ఎంత? సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఎవరినో దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఎందుకు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? సినిమా జయాపజయాలపై ఆందోళనతోనా?. 👉వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా ఫ్లాఫ్ అన్నారు. రాజకీయం, సినిమా కలిసినప్పుడు సహజంగానే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీని నోటికి వచ్చినట్లు దూషించి, పలు ఆరోపణలు గుప్పించినప్పుడు వారు చూస్తూ ఉండలేరు కదా!. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. మంత్రిగా ఉంటూ పూర్తిస్థాయిలో సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి ఒక్క పవన్ కల్యాణే!. కొన్నేళ్ల క్రితమే భారీ అడ్వాన్స్ లు తీసుకుని కొన్ని సినిమాలు చేయడానికి ఆయన ఒప్పుకున్నారట. కానీ పవన్ ధోరణితో ఆ నిర్మాతలు నిస్సహాయంగా మిగిలిపోయారని అంటారు. కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టిన నిర్మాతలు.. పవన్ రాజకీయాల కోసం ఏళ్ల తరబడి షూటింగ్లు చేయకుండా ఉండిపోవాల్సి రావడంతో వారు గగ్గోలు పెడుతూ ఉండొచ్చు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అవుతుండొచ్చు. వీటికి తోడు.. ఇటీవల సినిమా ఫంక్షన్లలో రాజకీయ ఉపన్యాసాలు జరుగుతుండడం.. దానిపై విమర్శలు, బాయ్కాట్ పిలుపులు వస్తుండడంతో నిర్మాతలూ నష్టపోయారు. ఆ మధ్య నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో మరో నటుడి సినిమా ఆర్థికంగా నష్టపోయింది. తాజాగా భైరవం సినిమా డైరెక్టర్ వైఎస్సార్సీపీని పరోక్షంగా విమర్శిస్తూ.. పవన్ను పొగుడుతూ చేసిన వ్యాఖ్య కూడా ఆ సినిమాపై వ్యతిరేక ప్రభావం చూపించేలా ఉంది. నిజానికి పార్టీలకు, కులాలకు అతీతంగా ఉండవలసిన సినిమా రంగం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారనిపిస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపనతో.. సినిమాలు, రాజకీయం కలసిపోవడం ప్రారంభమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశంతో కలిసిన తర్వాత అది మరింత చికాకుగా మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రాల్లో నటించారు. అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా నటించిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్! అధికారాన్ని అనుభవిస్తున్న పవన్కూ ఈ భయం (Pawan Cinema Fear) కూడా పట్టుకుని ఉండాలి!!.ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్ చెబుతోంది. ఇప్పుడు సినిమాలు బాగా నడిస్తే ఫర్వాలేదు. లేదంటే తన విలువ బాగా తగ్గే అవకాశం ఉంది. పవన్ ఎంత విధేయుడిగా ఉన్నా.. టీడీపీ వారు ఎక్కువమంది ఈయన వైఫల్యాన్నే కోరుకుంటూ ఉంటారు. అలాగైతేనే పవన్ తమకు అణగిమణగి ఉంటారన్నది వారి ఆలోచన. పవన్ దూషణల కారణంగా వైఎస్సార్సీపీ వాళ్లు ఆయన సినిమాను ఆదరించడం కష్టమే. బహుశా పవన్ను ఈ భయాలన్నీ వెంటాడుతున్నాయేమో!. ఈ దశలో సినిమా థియేటర్ల బంద్ చేస్తామని హెచ్చరించడం వెనుక ఏదో ఉందని భావించినట్లు ఉన్నారు. వెంటనే తన పార్టీకి చెందిన మంత్రి దుర్గేశ్తో ఒక ఆదేశం ఇప్పించారు. ఈ బంద్ పిలుపు వెనుక ఎవరు ఉన్నారో? కనిపెట్టాలని ఆయన హోంశాఖను కోరారట. బహుశా ఇలా బెదిరింపు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా పవన్ కల్యాణ్ తొందరపడి ఒక భారీ ప్రకటన జారీ చేశారు. ఎవరిమీద కోపం ఉందో నేరుగా చెప్పలేదు కానీ... పరోక్షంగా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. 👉ప్రముఖ నిర్మాత ఆయన బంధువైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, దిల్ రాజు వంటి కొద్ది మంది చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని చెబుతారు. అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు అర్జున్లతో పవన్కు అంత మంచి సంబంధాలు లేవన్న చర్చ కూడా ఉంది. అందువల్లే భయపడో? మరే కారణమో తెలియదు కాని అరవింద్ ఒక్కరే పవన్ కల్యాణ్కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. తనకు ఇప్పుడు థియేటర్లు లేవని చెప్పు కోవచ్చు కాని, పవన్ సినిమా విడుదలకు ముందు బంద్ అంటూ దుస్సాహసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది మరో నటనగా కనిపిస్తుంది. సినీ రంగంపై ఆధిపత్యం కలిగిన ఈ ముగ్గురు, నలుగురు థియేటర్లను లీజ్ కు తీసుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ లీజు అంశాలను కూడా ప్రస్తావించి వారు పన్నులు కడుతున్నారా? లేదా? థియేటర్లలో సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలను తనిఖీ చేయాలని ఆదేశించారట. ఇంత బహిరంగంగా సినిమా వారిని అదే రంగానికి చెందిన మంత్రి బెదిరించడం ఇప్పుడే చూస్తున్నాం. అంటే పవన్ తన సినిమా విడుదల టైమ్లో ఈ వివాదం రాకపోతే.. థియేటర్లు పన్ను కట్టకపోయినా, సదుపాయాలు కల్పించకపోయినా, తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మినా ఫర్వాలేదన్న మాట!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో ‘‘సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి, రేట్లు నిర్ణయించడానికి, మా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోవడానికి అనుతించకపోవడానికి నువ్వు ఎవరికి?’’ అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్... ఇప్పుడు వాటన్నిటినపై తనకే అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు?. గతంలో బ్లాక్ టిక్కెట్ల విక్రయం లేకుండా చూడడాన్ని కూడా ఆక్షేపించించడం విడ్డూరమే అనిపిస్తోంది. ప్రస్తుతం కౌంటర్లలో టిక్కెట్లు ఎంతకు అమ్ముతున్నారో కూడా చూడాలని అధికారులకు ఈయన చెప్పారట. పవన్ మరో విచిత్రమైన వాదన చేస్తున్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా కోసం ఆయన ఆలోచన చేస్తున్నారట. దాన్ని కూడా పట్టించుకోకుండా సినిమా వారు తనకు బంద్ అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారట. నిజానికి సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇదేమీ రెగ్యులర్గా పనిచేసే రంగం కాదు. పర్మెనెంట్ స్టాఫ్ కూడా ఉండరు. వీరి రెమ్యునరేషన్లపై ఎవరి కంట్రోల్ ఉండదు. పరిశ్రమ హోదా ఇస్తే ప్రభుత్వం నుంచి తమకు కావల్సినవారికి నిధులు ఇచ్చుకోవచ్చని ఎవరైనా చెప్పారేమో తెలియదు. ఏపీలో షూటింగ్ చేస్తే రాయితీలు ఇస్తామని జగన్ చెబితే తప్పని ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఏమీ చేయకపోగా.. వారి అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఏమిటో?. బంద్ ఆలోచన చేయడం లేదని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ ప్రకటించినా, పవన్లో ఏదో ఆందోళన ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకే అధికార దుర్వినియోగం చేస్తున్నారా?. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!
-
మేజిస్ట్రేట్ ముందుకు కాకాణి.. 144 సెక్షన్ అమలు..
కాకాణి అరెస్ట్ అప్డేట్స్..మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి రిమాండ్14 రోజుల రిమాండ్ విధించిన వెంకటగిరి కోర్టుకాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు తిరుపతి..వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ కోర్టులో కాకాణిని హాజరు పరిచిన నెల్లూరు పోలీసులు కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు కాకాణి..కాసేపట్లో నెల్లూరు డీటీసీ నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికాకాణిని హాజరుపరుచనున్న పోలీసులు.వెంకటగిరి మేజిస్ట్రేట్ ఆవరణలో 144 సెక్షన్ విధింపు. కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి..వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.చెముడు గుంటలోని డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లిన పోలీసులువైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్బుక్ పాలన పీక్ స్టేజ్కు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరాయి. ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్ చేస్తూ అరెస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు.👉పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.👉ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు.👉కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్ రోడ్డులోని కాకాణి గృహానికి చేరుకున్నారు. -
హామీలు గాలికి.. ప్యాలెస్లు పైపైకి
సాక్షి, అమరావతి: ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం చంద్రబాబు మరో రికార్డు సాధించారు! ఏడాదిగా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని ఆయన తనకోసం ఈసారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ ఆధునిక భవనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మదీనాగూడలో విలాసవంతమైన భారీ ప్యాలెస్, ఫామ్హౌస్లను ఏర్పాటు చేసుకున్న ఆయన తాజాగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలోని శివపురంలో రెండు ఎకరాల్లో నిర్మించుకున్న నూతన గృహం ఆధునిక భవంతిని తలపిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.ఇక ఇటీవలే అమరావతి ప్రాంతంలో 5.16 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా మరో నూతన గృహ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, పరిపాలనా నగరానికి ఆనుకుని ఉన్న ఈ ప్యాలెస్ను నిర్మించే బాధ్యతను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన కంపెనీకి అప్పగించారు. ఈ భూమి విలువ రూ.200 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉండవల్లిలోని కరకట్ట అక్రమ భవంతిని చంద్రబాబు తన నివాసంగా చేసుకున్న విషయం తెలిసిందే. -
మాయా వేదికపై ‘మహా’ డ్రామా!
సాక్షి, అమరావతి: కడప మహానాడు వేదికగా మరో కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతు న్నారు. 2023లో రాజమండ్రి మహానాడులో ప్రజలను మోసం చేసే మహా ప్రణాళికను ప్రకటించారు. ఇప్పుడు కడప మహానాడులోనూ అదే తరహాలో మరో కొత్త ప్రణాళిక విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి తన కుమారుడు లోకేశ్ను అందలం ఎక్కించే వేదికగా మహానాడును ఉపయోగించుకోవడానికి పకడ్బందీ వ్యూహ రచన చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న సూపర్ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించిన చంద్రబాబు.. మళ్లీ అదే తరహాలో తన కుమారుడి ద్వారా సూపర్ సిక్స్ విధానాలంటూ టీడీపీ శ్రేణుల్ని సంతృప్తి పరిచేందుకు కొత్త పల్లవిని వల్లె వేయించనున్నట్లు తెలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన, స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, అన్నదాతకు అండ, ఉన్నత స్థాయికి తెలుగు యువత, తెలుగు జాతి ఖ్యాతి’ పేర్లతో వాటిని రూపొందించినట్లు తెలిసింది. ఈ ఆరు విధానాలను పార్టీ కార్యకర్తల కోసం అమలు చేస్తామని మహానాడు వేదికపై ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ ‘సూపర్’ మోసం2023లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల తరహాలోనే మహానాడులో సూపర్ సిక్స్ విధానాల పేరుతో మాయ చేసేందుకు బాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు పేర్లతో వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇప్పుడు కొత్తగా సూపర్ సిక్స్ విధానాలంటే ఎవరు నమ్ముతారని టీడీపీ నేతకులే వ్యాఖ్యానిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలైన మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్..లలో ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. మహిళలకు ప్రతి నెలా రూ.1500, తల్లికి వందనం పేరుతో బడికెళ్లే పిల్లలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలంటూ చెప్పినా దేన్నీ ఇవ్వలేదు. రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆరి్థక సాయం చేస్తామని పట్టించుకోలేదు. నిరుద్యోగులకు రూ.20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇవేమీ అమలు కాలేదు.ప్రజల్లో ఆగ్రహం.. అందుకే ఆర్భాటం» కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క సంక్షేమ పథకం అందక పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. దీంతో వాళ్లను ఏదో ఒక రకంగా మాయ చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో చేసేసినట్లు, ఏడాదిలో అనేక విజయాలు నమోదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.» ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ సిక్స్ విధానాలను తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డబ్బులు లేవని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఏమీ ఇవ్వలేననే విషయాన్ని చంద్రబాబు నెమ్మదిగా చెప్పారు. బయట నుంచి చూసి అన్నీ చేయగలననుకుని హామీలు ఇచ్చానని, ఇప్పుడు ఎలా చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. » దీన్నిబట్టి హామీలపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు మహానాడులో తమ వైఫల్యాలు, హామీల అమలు ఊసే లేకుండా మాయ చేసేందుకు టీడీపీ పరివారం నిమగ్నమైంది. ఎల్లలు లేని ప్రచారం, సోషల్ మీడియాలో బజ్ సృష్టించి లబ్ధి పొందడంపైనే దృష్టి కేంద్రీకరించారు.» వైఎస్ జగన్ ఇస్తున్న పథకాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి.. ఆచరణలో ఏమీ చేయక పోవడంతో తాము చంద్రబాబు చేతిలో మరోమారు మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ మోసాలకు ఎల్లో మీడియా వంత పాడుతుంటే కనుక్కోలేని వెర్రి వాళ్లమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికే మరోసారి మాయా వేదిక సిద్ధమైంది. -
కుప్పంలో చంద్రబాబు భారీ ప్యాలెస్
-
మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం
సాక్షి, విజయవాడ: మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోంది. టీడీపీ నేతల ఒత్తిడితో కోవిడ్ అడ్వైజరీని వైద్య ఆరోగ్య శాఖ ఉపసంహరించింది. కేసులు నమోదు కానప్పుడు ఈ నెల 21న జాగ్రత్తలు కోసం వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాక కోవిడ్ అడ్వైజరీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేవలం మహానాడు కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టేలా నిర్ణయం తీసుకుంది.బహిరంగ సభలు, భారీ ర్యాలీలు, జన సమీకరణ చేపట్టొద్దని వైద్య ఆరోగ్య శాఖ 21న ఆదేశాలు జారీ చేసింది. 27, 28, 29న జన సమీకరణతో మహానాడు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడు కోసం ప్రజల సంరక్షణను పణంగా పెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు చూసి వైద్యులు నివ్వెరపోతున్నారు. -
వీడియో: టీడీపీ కీలక నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ
-
వీడియో వైరల్: టీడీపీ కీలక నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వీడియోతో సహా వైఎస్సార్సీపీ సంచలన ట్వీట్ చేసింది. టీడీపీ కీలకనేత టీడీ జనార్ధన్ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగింది. తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మినబంటు టీడీ జనార్ధన్ వచ్చారు. 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారు’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.‘‘విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు.. విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ నమ్మి.. దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇది నమ్మకం ద్రోహం కాదా?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది.విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు..మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశంతాడేపల్లి పార్క్ విల్లాలో..విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి13 నిమిషాల తర్వాత అదే విల్లాకు @ncbn నమ్మినబంటు టీడీ జనార్ధన్.… pic.twitter.com/XYgtZsJSE4— YSR Congress Party (@YSRCParty) May 25, 2025 -
చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు
-
చంద్రబాబు నీచ రాజకీయాలపై అంబటి ఆగ్రహం
సాక్షి,గుంటూరు: పోలీసుల్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. నిన్న (శనివారం) పల్నాడులో దురదృష్టకరమైన ఘటన జరిగింది. తెలంగాణలో హుజూర్ నగర్ జిల్లాలో ఓ వివాహానికి హాజరై బైక్పై గ్రామానికి తిరిగి వెళ్తున్న జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు వెల్దుర్తి మండలం బొదిలవీడు సమీపంలో ఓ స్కార్పియో కారు వీరి బైక్ను వేగంగా ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు.ఆధిపత్య పోరుతోనే హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే, టీడీపీలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడుకి అంట గట్టారు.హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉంది. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారు. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ఇరికించడం దారుణం.జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అనుకూల మీడియా సైతం టీడీపీలో ఆధిపత్య పోరువల్లే ఈ డబల్ మర్డర్ జరిగాయి’ అని వార్తలు రాశాయి. టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం?డెడ్ బాడీలు దొరికితే వైఎస్సార్సీపీ నేతలపైన పోలీసులు హత్య కేసులు నమోదు చేస్తారని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ అదే జరిగింది. ఆదిపత్య పోరు కారణంగా జవిశెట్టి సోదరులు హత్యకు గురైతే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవలే హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసు నమోదు చేసి, కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. గురజాల డీఎస్పీ జగదీష్ నీతి, నిజాయితీతో పని చేస్తే తాము చెప్పిన మాట వినలేదని ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసులు టీడీపీకి జేబు సంస్థగా పని చేస్తున్నారు. అక్రమ కేసులు నమోదు చేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు. -
పవన్ నోట.. పూటకో మాట..
పవన్ కళ్యాణ్కు రాజకీయం అబ్బకపోయినా దాన్నుంచి లాభాన్ని ఎలా పిండుకోవాలో మాత్రం బాగానే తెలుసు. అంటే పూటను బట్టి మాటను.. రోజును బట్టి అభిప్రాయం మార్చుకోవడంలో చంద్రబాబుకన్నా నాలుగైదు ఆకులు ఎక్కువే చదివేసారు పవన్. తనకు కులం మతం లేదని చెప్పే పవన్ మర్నాడే తాను యేసును నమ్ముతానని, తన బిడ్డలకు బాప్టిజం ఇప్పించానని చెబుతారు.తనకు కులం లేదని చెప్పిన మరుక్షణమే తనకు కాపులంతా మద్దతుగా ఉండాలని డిమాండ్ చేస్తారు. గతంలో ఎన్నోసార్లు తన పరపతిని ఇమేజీని తెలుగుదేశానికి తాకట్టు పెడితే టీడీపీ నాయకులు.. కార్యకర్తలు తన తల్లిని తిట్టారని ఆవేదన చెందుతారు. ఆ తరువాతి ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ చంక ఎక్కుతారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చి ఆంధ్రులను చిన్నచూపు చూసే ఢిల్లీ బీజేపీకి తాను ఎన్నడూ మోకరిల్లేది లేదని హుంకరిస్తారు.. ఆ తరువాత మళ్ళీ ఢిల్లీ వెళ్లి పెద్దల ముందు సాగిలపడతారు. తనను తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేస్తుంది ఎన్నోమార్లు వగచే పవన్ మళ్ళీ ఆ టీడీపీ మోచేతి నీళ్లు తాగుతున్నారు.. ఇప్పుడు కూడా తనలో స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్నట్లు మరోమారు రుజువుచేసుకున్నారువైయస్ జగన్ హయాంలో పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. పనిలోపనిగా సినిమా ఇండస్ట్రీకి సైతం గార్డుగా ఊహించుకునేవారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తే ఊరుకునేది లేదని.. ఆ వ్యవస్థ ఇక స్వయంచాలితం అని.. దాని వ్యాపారం.. సినిమాలు.. అనుమతులు.. టిక్కెట్ రేట్ల పెంపు వంటి వాటి అంశాలమీద ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని.. అసలు ఎవరైనా సినిమా వ్యాపారం జోలికి వస్తే ఊరుకోనని బీరాలు పలికారు. అంటే సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరు?. అంతా ఇండస్ట్రీ పెద్దల ఇష్టానుసారం జరగాలి తప్ప మధ్యలో ప్రభుత్వం ఎందుకు అనేది అయన ఉద్దేశ్యం.. పైగా నటులు ఎవరూ ప్రభుత్వ పెద్దలను నాటి సీఎం వైఎస్ జగన్ను కలవాల్సిన అవసరం లేదన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉండేది.ప్రైవేట్ పెట్టుబడి తోటి నిర్మాతలు సినిమా చేస్తా ఉంటే, గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తది??పరిశ్రమ పైన ఎందుకు నీకు అంత పగ?? ఎందుకు వాళ్లని బెదిరిస్తున్నావ్?? @PawanKalyan https://t.co/liTLIto3N3 pic.twitter.com/pvl62CyAwT— Monster🇮🇳 (@varmamaster7) May 24, 2025ఇపుడు అయన అధికారంలో ఉన్నారు.. చంద్రబాబు కేబినెట్లో నంబర్ టూ పాత్రలో.. డిప్యూటీ సీఎంగా పదవిలో ఉండేసరికి తనకు మళ్ళీ ఇండస్ట్రీనే గుర్తొచ్చింది. అసలు తాము ఎన్నికల్లో గెలిచాక తెలుగు సినిమా పెద్దలు.. నటులు.. నిర్మాతలు చంద్రబాబును కలవడానికి ఎందుకు రాలేదని పవన్ బాధపడిపోయారు. తన రాజకీయ యజమాని తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన ఇండస్ట్రీ పెద్దలను ప్రశ్నించారు.. అసలు మీకు కృతజ్ఞత ఉందా?. ఎన్నికల్లో గెలిచాక మీరు వచ్చి బాబును కలవాలని తెలియదా?. సినీ పరిశ్రమకు టీడీపీ ఎంతో చేసింది.. అలాంటిది మీరంతా వచ్చి చంద్రబాబును కలిసి మోకరిల్లాలని తెలియకపోతే ఎలా .. అంటూ ఏదేదో మాట్లాడారు. అంటే వైఎస్ జగన్ సీఎంగా ఉన్నపుడు మాత్రం సినీ పరిశ్రమ స్వతంత్రంగా ఉండాలి.. చంద్రబాబు గెలిస్తే మాత్రం వారంతా వచ్చి కలవాలి. మొత్తానికి రాజకీయం బాగా నేర్చి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు పవన్.. పూటకోమాట అంటూ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు -సిమ్మాదిరప్పన్న. -
కుప్పంలో నారావారి కోట
-
పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం
-
అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు
-
రేషన్ వాహనాలపై సర్కారు వేటు.. డ్రైవర్కు గుండెపోటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం తమ జీవనాధారాన్ని దూరం చేయడంతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాల(ఎండీయూ) డ్రైవర్లు, హెల్పర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఈ ప్రభుత్వం రోడ్డుపాలు చేస్తోందనే వేదనతో కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో రేషన్ వాహనంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గుంటూరుకు చెందిన డ్రైవర్(ఆపరేటర్) షేక్ ఇమ్రాన్ శనివారం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఇమ్రాన్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిది నెలల కిందటే అతని తల్లి మెహమూదాబేగానికి క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ఈ కుటుంబం మొత్తం రేషన్ వాహనంపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తోంది. ఇమ్రాన్ గుండెపోటుకు గురయ్యాడనే విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో రేషన్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు గుంటూరు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్తేజను కలిసి తమను కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చారు.నా బిడ్డను కాపాడండినా బిడ్డ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ వాహనం ఆపరేటర్గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి దానిపైన వచ్చే ఆదాయంతోనే మా కుటుంబం జీవిస్తోంది. నాకు 8 నెలల కిందటే క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేస్తున్నామని చెప్పిన వార్త విని నా బిడ్డ ఇమ్రాన్ తీవ్ర వేదనకు గురయ్యాడు. జీవనం కష్టమని బాధపడుతూ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్చాం. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల మా లాంటి నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నా బిడ్డ ఇమ్రాన్ను, మా కుటుంబాన్ని ప్రభుత్వమే కాపాడాలి.– మెహమూదాబేగం, ఇమ్రాన్ తల్లి మమ్మల్ని రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వంఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను జూన్ ఒకటో తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలపై ఆధారపడిన దాదాపు 18,500 కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. మాకు 2027 జవనరి నెల వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఆకస్మికంగా రద్దు చేయడం బాధాకరం. కూటమి ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – చుండూరు సాంబశివరావు, రేషన్ వాహనాల ఆపరేటర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడుఏలూరులో రేషన్ వాహనాల డ్రైవర్ల ధర్నాఏలూరు (టూటౌన్): కరోనా, వరదలు వంటి తీవ్ర విపత్తుల సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించిన తమను ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రే తొలగించడం దారుణమని రేషన్ పంపిణీ వాహనాల డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ డ్రైవర్లు, హెల్పర్లు శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ ముగ్గురు రేషన్ డీలర్లు చేసే పనిని తాము ఒక్కరమే చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారనే కక్షతోనే తమను పక్కన పెట్టాలని నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీరిలో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఉన్నారని తెలిపారు. తక్షణమే కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమ జీవనోపాధిని కాపాడాలని కోరారు. ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఇంటికి రేషన్ వద్దు.. మద్యం ముద్దు అన్నట్లు కూటమి ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, పి.కిషోర్, రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్.జయరాజు తదితరులు పాల్గొన్నారు.దొంగలుగా చిత్రీకరించడం బాధాకరంరేషన్ వాహనాల డ్రైవర్లను కూటమి ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం. మాకు నెలకు ఇచ్చే రూ.21 వేలతోనే వాహనం ఈఎంఐ కట్టుకుంటున్నాం. ఆయిల్ ఖర్చులు భరిస్తున్నాం. మిగిలిన డబ్బులతో మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పటి వరకు రేషన్ డీలర్లపై ఆరువేలకు పైగా 6ఏ కేసులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే రేషన్ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారో అర్థమవుతుంది.– అంబేడ్కర్, రేషన్ వాహనాల ఆపరేటర్ల సంఘం గుంటూరు నగర అధ్యక్షుడు -
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: కంబాల దిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా.. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.వైయస్ఆర్ జిల్లా, కంబాలదిన్నె గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.… pic.twitter.com/d7nJHV37Z6— Roja Selvamani (@RojaSelvamaniRK) May 24, 2025 -
లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్
-
Ding Dong 2.0: కామిక్ షో
-
‘ఆధారాల్లేవ్.. చేతులెత్తేసిన చంద్రబాబు ముఠా’
తాడేపల్లి: వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ముఠా చేతులెత్తేసిందని.. వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. మద్యం కేసులో కోర్టుల కంటే ముందే ఎల్లోముఠా విచారణ చేస్తోందన్నారు. ఆధారాలు ఉన్నాయని కాసేపు, చెరిపేశారని మరి కాసేపు అంటున్నారు. వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు రోజుకొక భేతాళ కథ అల్లుతున్నారు. 375 కోట్ల పేజీల డేటాను తొలగించారంటూ కొత్త కథ అల్లుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాల్లేకనే ఇలాంటి కథలు చెప్తున్నారు. కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు’’ అని పోతిన మహేష్ అన్నారు.‘‘నిజంగా డేటా డిలిట్ అయితే బేవరేజ్ కార్పోరేషన్ మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు?. కంపెనీల దగ్గర ఉండే డేటా కూడా మాయం అయితే మరి వాటిపై కేసులు పెట్టాలి కదా?. డిస్టిలరీలకు ముడి సరుకు విక్రయించే సంస్థల దగ్గరైనా డేటా ఉంటుంది. అది కూడా డిలిట్ అయిందా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. మద్యం క్రయ విక్రయాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే జరిగింది. అయినప్పటికీ అక్రమాలు అంటూ రోజుకొక కట్టుకథ అల్లుతున్నారు. జగన్ హయాంలో ఎలాంటి స్కాం జరగలేదని చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ తప్పుడు వాంగ్మూలాలతో అరెస్టులు చేస్తున్నారు’’ అని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్కాంలో రాజ్ కసిరెడ్డి కీలకం అని మొదట్లో అన్నారు. తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలకం అన్నారు. ఇప్పుడు మిథున్రెడ్డి కీలకం అంటున్నారు. తనకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు చూపమని మిథున్రెడ్డి సవాల్ చేస్తే ప్రభుత్వం స్పందించలేదు. మిథున్రెడ్డి కంపెనీలోకి ఐదు కోట్లు వచ్చాయని తప్పుడు కథనాలను ఎల్లో మీడియా రాసింది. మిథున్రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో రాబోతున్నదని ఆయనపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. కోర్టుల కంటే ముందే ఎల్లో మీడియా ట్రయల్ నిర్వహిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం 30 ఏళ్ల క్రితమే భూములు కొన్నది. ఈ 30 ఏళ్లలో 15 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఈ15 ఏళ్లలో కనపడని అక్రమాలు ఇప్పుడే ఎలా కనపడ్డాయి?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ఎల్లో మీడియా వార్తలు రాయటం, వెంటనే ప్రభుత్వం ఓవరాక్షన్ చేయటం పరిపాటి అయింది. సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఏంటని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మంత్రి కందుల దుర్గేష్ ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తోంది?. టీడీపీ నేతలే థియేటర్ల బంద్ వెనుక ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారు?’’ అని మహేష్ నిలదీశారు. -
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్
-
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు పీఎస్ నుంచి తరలింపు..
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థత గురయ్యారు. వంశీకి వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో, వంశీని కాసేపటి క్రితమే జీజీహెచ్కు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విచారణ పేరుతో పోలీసులు వంశీని కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న వంశీ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పచ్చ మీడియా పరిస్థితి.. మింగలేక.. కక్కలేక!
ఆంధ్రప్రదేశ్లో పచ్చమీడియా ఎప్పుడో దిగజారి పోయింది!. ఆ పతనం గురించి ఈరోజు ఇంకోసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం పెట్టి.. 2014-19 మధ్య, ఏడాదిగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణాలను, మద్యం దందాను ఆధారాలతోపాటు ఎండగడితే.. కూటమి ప్రభుత్వం కానీ.. దాన్ని మోస్తున్న పచ్చమీడియా కానీ సరైన సమాధానమే ఇవ్వలేకపోయింది!. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో జరిగిపోయిందంటూ హడావుడి మాత్రం మళ్లీ తలకెత్తుకుంది!. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలకు ఈ మీడియా నేరుగా సమాధానం ఇవ్వలేక చతికిలపడింది. మరీ ముఖ్యంగా మద్యం దందా గురించి!.తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే, ఏపీ సీఐడీ వద్ద జగన్ హయాంలో జరిగినట్లు చెబుతున్న స్కామ్లకు సంబంధించి రుజువులేవీ లేనట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఆ విషయం నేరుగా చెప్పలేక ‘వేల కోట్లు దోచేసి, ఆధారాలు చెరిపేసి..’ అంటూ ఓ అడ్డగోలు కథ చెప్పుకొచ్చింది ఆ పత్రిక!. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరక్కుండా కుట్ర పన్నారని, ఫోరెన్సిక్ రికవరికి కూడా వీల్లేకుండా చెరిపి వేశారని ఈ కథనం సారాంశం. వైఎస్సార్సీపీ మద్యం ముఠా 375 పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానమైన డేటాను నాశనం చేసిందని, ఫలితంగా దర్యాప్తునకు తీవ్ర అవరోధాలు ఎదురైనా సిట్ వాటిని అధిగమించిందని చెప్పుకొచ్చారు. ఏమన్నా అర్థం ఉందా! అసలు కేసు ఏమిటి? డేటా ఎందుకు ఉంటుంది?. ఉత్పత్తిదారుల నుంచి సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన డేటా కంప్యూటర్లలో నమోదవుతాయి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ కూటమి పెద్దలకు అది సరిపోలేదట. తప్పుడు కేసులతో అరెస్ట్ చేసిన వారి వద్ద కూడా సమాచారం ఏదీ దొరికి ఉండదు. దీంతో ఈ కొత్త కహానిని సృష్టించింది కూటమి!.రికార్డులన్నీ లభ్యమై ఉంటే కుంభకోణం మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చేవంటోంది ఆ పత్రిక. ఏతావాతా అర్థమయ్యేది ఏంటి? సీఐడీ కేసు ఓ కట్టుకథ అని! ఎల్లో మీడియా సాయంతో జగన్, వైఎస్సార్సీపీలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అని!. అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎలా మొదలైంది? ఎవరో దారిన పోయే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం.. ఏసీబీ ఆ వెంటనే రికార్డు సమయంలో ఏదో కనిపెట్టినట్లు నివేదిక ఇవ్వడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం.. వారితో బలవంతంగా ఏదో చెప్పించడం.. దాని ఆధారంగా మరికొందరి అరెస్ట్.. ఇలా సాగిపోయింది కేసు విచారణ. ఇక ఎల్లో మీడియా పాత్ర మొదలైంది కూడా ఇక్కడే. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మరో విశ్రాంత అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు తరువాత ఇక జగన్ అరెస్టే మిగిలిందంటూ ఊదరగొట్టింది.మద్యం కుంభకోణం లాభాలు విదేశాలకు తరలిపోయాయని ఒకసారి, బంగారం కొన్నారని రెండో రోజు.. ఆస్తులు కొన్నారని ఇంకోసారి, సంచుల్లో నగదు తరలించారని ఆ మరుసటి రోజు.. ఇలా రోజుకో రకమైన కథనాలు రాసుకుంటూ.. ఆఖరకు ఆధారాల్లేకుండా చేశారని ఏడుస్తోంది ఈనాడు! అసలు కుంభకోణమే లేనప్పుడు.. ఆధారాలెక్కడి నుంచి వస్తాయి? జగన్ హయాంలో ఏదో జరిగిందన్న అనుమానం ప్రజల్లో నాటడమే ఎల్లో మీడియా లక్ష్యమని దీంతో మరోసారి స్పష్టమైపోయింది. లేదంటే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన చంద్రబాబు వైఫల్యాన్ని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పచ్చ పత్రిక ఈ కుట్రకు తెరతీసి ఉండాలి. పచ్చ మీడియా పోకడలను మొదటి నుంచి నిశితంగా పరిశీలించడమే కాకుండా.. ఎప్పటికప్పుడు వాటిని ఆధారాలతోసహా ఎండగడుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం కుంభకోణం లోతుపాతులను, అసలు కర్తలెవరు అన్నది రుజువులతో సహా ప్రజలకు వివరించారు. ఈ కేసులోనే చంద్రబాబు బెయిల్పై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 2014-15లో కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అంగీకారం లేకుండా, మద్యంపై ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ చంద్రబాబు రద్దు చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా అప్పట్లో మద్యం విక్రయాలు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, ఇందులో అవినీతి ఉన్న సంగతిపై కేసు వచ్చిందని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే క్రమంలో మొత్తం టీడీపీ నేతలే వాటిని కైవసం చేసుకున్నారని, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారని, గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారని జగన్ సోదాహరణంగా వివరించారు. ఇక అనధికార పర్మిట్ రూము వేల కొద్ది బెల్ట్షాపులు, ఎమ్మార్పీకి మించి వసూళ్లు జరుగుతున్నాయని, ఇది అసలు మద్యం స్కామ్ అని జగన్ స్పష్టం చేశారు. తాము చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు తన హయాంలో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు అండ్ కో ఓ భేతాళ కథ సృష్టించారని తెలిపారు.జగన్ ఆరోపణలపై ప్రభుత్వ పరంగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. జగన్ను విమర్శించేందుకు కొందరు టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టినా నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. షాపులు ప్రభుత్వం నడిపితే స్కాం జరుగుతుందా? ప్రైవేటు వారికి అప్పగిస్తేనా? అన్న జగన్ ప్రశ్నకు నిశ్శబ్ధమే సమాధానం అవుతోంది. మద్యం రేట్లు పెంచి, డిమాండ్ తగ్గిస్తే డిస్టిలరీలు ముడుపులు ఇస్తాయా? లేక మద్యం రేట్లు తగ్గించి డిమాండ్ పెంచితే ముడుపులు వస్తాయా? అన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. తాను కానీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని కూడా జగన్ నిలదీశారు. ఆ అధికారులకు ఎక్సైజ్ శాఖతో సంబంధమే లేనప్పుడు వారెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు వారికి మద్దతిచ్చే ఎల్లోమీడియా ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఎదురుదాడి ద్వారానే తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి భిన్నంగా జగన్ చంద్రబాబు టైమ్లో కుంభకోణం ఎలా మొదలైంది? తన హయాంలో ఆ అవకాశం ఎందుకు లేకుండా పోయిందో చాలా స్పష్టంగా వివరించారు. జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా నానా రచ్చ చేసేదన్నది నిర్వివాద అంశం. కానీ వీసమెత్తు ఆధారమూ లేకపోవడంతో కొంతమందిని నిందితులుగా చేసి, బలవంతంగా వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుని ఎలాగొలా జగన్ను కూడా ఇరికించాలని చంద్రబాబు సర్కార్ వ్యూహం పన్నినట్లు తేలుతోంది. కాకపోతే నిందితుల వాంగ్మూలాలు కేసుకు సాక్ష్యాలు కావని సుప్రీంకోర్టు చెప్పడంతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్ల అయ్యింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..
-
లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..
-
అప్పుల కుప్ప అమరావతి
-
వల్లభనేని వంశీకి అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు
కంకిపాడు: విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండికానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశాడంట. అప్పుడేమో చంద్రబాబుకి.. లోకేష్ కి సమ్మగా ఉందంట.. ఇప్పుడేమో పగలదీస్తారంట. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరు. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవలేకుండా చేస్తున్నారు. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వాసుపత్రి నుంచి వంశీని పోలీసు స్టేషన్కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు.కంకిపాడు పీఎస్లో వంశీ విచారణ బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను శుక్రవారం కంకిపాడు పోలీసుస్టేషన్లో పోలీసులు విచారించారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. -
సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం
-
రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొంత ఇబ్బంది పడటం నిజమే. అయినా వారి త్యాగం ఊరికే పోదు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన చరిత్ర అమరావతిది. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని కడతాం. ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తే నీకు (మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి) వచ్చిన నష్టం ఏమిటి?’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం జన్పథ్–1లోని అధికారిక నివాసంలో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో వైఎస్ జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని, అలా రాకపోతే ఎలా.. అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాను కోరినట్లు చెప్పారు. ఏపీలో 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని, రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు తెలిపారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రక్షణ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు తెలిపారు. జగ్గయ్యపేట–డోలకొండ క్లస్టర్లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉందని, ఇక్కడ క్లస్టర్ను మిస్సైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం–బనకచర్ల ప్రతిపాదన రూ.80 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వివరించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని చెప్పారు. షార్, లేపాక్షి వద్ద స్పేస్ సిటీల అభివృద్ధి విషయంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలసి మాట్లాడానని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్’ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ పోషించగల పాత్రను వివరిస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు నివేదిక సమర్పించానని చెప్పారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ల పేర్లను ఈడీ ప్రస్తావించిన విషయంపై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా.. ‘అవునా? ఎప్పుడు? ఏమో మరి.. నాకు దాని గురించి తెలియదు’ అంటూ దాటవేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై కూడా తాను మాట్లాడనని స్పష్టం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. -
విద్యాసంస్థపై వేటు.. రెడ్బుక్ కాటు
సాక్షి టాస్క్ఫోర్స్: పిల్లలు చదివే పాఠశాలలనూ అధికార టీడీపీ నేతలు కక్షసాధింపునకు వాడుకుంటున్నారు..! విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుతున్నారు..! చిన్న రైతు స్థలాన్నీ వదలడం లేదు..! దళిత సర్పంచ్నూ దుర్భాషలాడుతున్నారు..! ఇదంతా మరెక్కడో కాదు.. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, సొంత జిల్లా చిత్తూరులో..కూటమి నేతల ఆగడాలకు అడ్డూఅదుపు ఉండడం లేదు..! తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకోవడం.. ఆస్తులపై దౌర్జన్యం చేయడం.. దుర్భాషలాడడం వారికి సాధారణమైపోయింది..! రోజురోజుకు అరాచకాలు శ్రుతిమించుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తొమ్మిదో వార్డు కౌన్సిలర్ హఫీజ్పై తాజాగా వేధింపులకు దిగారు. కుప్పంలో హఫీజ్కు హాకింగ్ ఇంటర్నేషనల్ పేరిట స్కూల్ ఉంది. దీనిని రెండేళ్ల కిందటే ఎస్ఎస్సీ నుంచి సీబీఎస్ఈకి మార్చుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ పాఠశాల 8, 9, 10 ఎస్ఎస్సీ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల మొత్తానికే పర్మిషన్ లేదని.. టీసీలు తీసుకెళ్లాలని డీఈవో ఆదేశించినట్లు దుష్ప్రచారానికి దిగారు. అసలు ఎస్ఎస్సీనే లేనందున.. కేవలం ఇబ్బందిపెట్టాలనే ఇలా హడావుడి చేసినట్లు స్పష్టమవుతోంది. తద్వారా.. ఈ పాఠశాలలోని 950 మంది విద్యార్థుల చదువులను, 150 మంది సిబ్బంది జీవితాలను దెబ్బతీస్తున్నారు. ఇక వైఎస్సార్సీపీ నాయకుడికి చెందిన రామకుప్పంలోని శాంతినికేతన్ స్కూల్కూ గుర్తింపు లేదని ప్రకటించారు. వాస్తవానికి ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్న పాఠశాల. అయినప్పటికీ ప్రభుత్వం ఇలా చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధంతరంగా గుర్తింపు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటనిప్రశ్నిస్తున్నారు.చంపేస్తా నా కొ..!చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఆకనంబట్టు దళిత సర్పంచ్ మణిని టీడీపీ నాయకుడు జయప్రకాష్నాయుడు తీవ్ర స్థాయిలో దూషించాడు. తమపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును ఉపసంహరించుకోవాలని మణికి ఫోన్ చేసి.. దుర్భాషలాడుతూ హెచ్చరికలు చేశాడు. కేసును వెనక్కు తీసుకోకుంటే కనిపించనచోటల్లా కొడతా, ఇంటికి వచ్చి కొడతా, కాళ్లూచేతులు తీసేస్తా, చంపేస్తా.. నా కొడకా అంటూ తిడుతూ బెదిరింపులకు దిగాడు. ‘‘ఎంపీడీవో ఆఫీసుకు రావొద్దు. ప్రభుత్వం మాదే. ఏం చేసినా ఎవరూ ఏమీ చేయలేరు. కనిపిస్తే కాళ్లు చేతులు తీయించేస్తా. నీ కొడుక్కి పెళ్లి కాకుండా చేస్తా’’ అంటూ బెదిరించారు. ‘‘రెడ్లు ఎవరూ నిన్ను కాపాడలేరు. శ్రీకాంత్రెడ్డిని కూడా కొట్టాం. ఏమీ చేయలేకపోయారు’’ అంటూ పత్రికలో రాయలేని విధంగా బూతులు తిట్టారు. ఎమ్మెల్యే తమవైపే ఉంటాడని, మా పార్టీ వాళ్లు ఎవరైనా సపోర్ట్ వస్తే వాళ్ల కథకూడా చూస్తానంటూ తిట్లు అందుకున్నారు. దళిత సర్పంచ్ మణిని టీడీపీ నేత జయప్రకాష్నాయుడు ఫోన్ చేసి బెదిరించిన సంభాషణ సోషల్మీడియాలో వైరల్ అయినా పోలీసులు స్పందించలేదు. దీనిపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.మామిడి చెట్లను కొట్టేసి అరాచకం..చిత్తూరు జిల్లా పుంగనూరులో 88 సెంట్ల భూమిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత ఓ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నాడు. ఇప్పటికే మూడుసార్లు ఆ కుటుంబంపై దాడికి యత్నించి గాయపరిచాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. మంగళం పంచాయతీ కంగానెల్లూరు గ్రామానికి చెందిన చిన్నరెడ్డెప్పకు 2.66 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సర్వే నంబర్ 241/3లో 88 సెంట్ల భూమికి చిన్నరెడ్డెప్ప తన పేరున పాస్ పుస్తకం పొందారు. మామిడి పంట సాగులో ఉన్న ఈ భూమిని ఎలాగైనా కలుపుకొనేందుకు టీడీపీ నేత పథకం వేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్నరెడ్డెప్ప కుటుంబాన్ని భూమిలోకి అడుగుపెట్టనీయడం లేదు. వెళ్లేందుకు ప్రయత్నించగా ఫిబ్రవరి 20న చిన్నరెడ్డెప్పను తీవ్రంగా గాయపరచడంతో ఆసుపత్రిపాలయ్యాడు. మొదట పోలీసులకు, అదే నెల 24న చిత్తూరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేవు. మరో రెండుసార్లు చిన్నరెడ్డెప్పపై దాడికి యత్నించినట్లు బాధిత కుటుంబీకులు వాపోయారు. తాజాగా శుక్రవారం పొలానికి వెళ్లిన చిన్నరెడ్డెప్పపై మళ్లీ దాడికి యత్నించాడని చెప్పారు. కోతకొచ్చిన మామిడి చెట్లను దౌర్జన్యంగా తొలగించారని తెలిపారు. -
కొండంత అప్పు.. బాబు ‘సెల్ఫ్’ డప్పు!
కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు.. మీరు మోసుకొస్తే చాలు.. నేను మోసేస్తా..! అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు! రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8 వేల ఎకరాలను విక్రయించి రూ.లక్ష కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని.. అందుకోసం మరో 44 వేల ఎకరాలకుపైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెబుతున్నారు!! రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు లక్ష ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘‘రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది..!’’ సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లను కేటాయించింది.రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.తాజాగా స్మార్ట్ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఇక అందులో నిర్మాణ పనులు చేపట్టి.. మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని.. ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజధానిపై లీకులు.. ఇన్సైడర్ ట్రేడింగ్! రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని.. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధాని అమరావతిని తలపించే రీతిలో ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిరి్మస్తానంటూ 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులిచ్చారు. ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ద్వారా తన బినామీలు, సన్నిహితులు కారు చౌకగా రైతుల నుంచి భూములు కాజేశాక రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలను సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములతో కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ.) రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు. కామధేనువు కాదు అప్పుల కుప్ప.. ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పులు ఓ చిన్న ఇల్లు కట్టాలన్నా ముందుగానే తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాంటిది ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే (నిధులున్నాయో లేదో చూసుకోకుండా) 2016–19 మధ్య రాజధాని ప్రాంతంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధి పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఇందుకోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్ల అప్పులు తెచ్చింది. అయితే 2019 మే నాటికి ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.28,047.82 కోట్లతో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు రద్దు చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. 2018–19 ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరలు పెద్దగా పెరగలేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105 శాతం పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు వెరసి రూ.31 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. అమరావతి కామధేనువు కాదు.. అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి! ఇకపోతే రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వడం గమనార్హం. మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా.. భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దాంతో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్ ప్రాజెక్టులు వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిరి్మంచాలని చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవంటూ.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో 44,676.64 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక ఆ భూముల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణంతోపాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి పెరిగే ధరలను (ఎస్కలేషన్) పరిగణనలోకి తీసుకుంటే అన్నీ కలిపి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని లెక్కగడుతున్నారు. అదంతా అప్పులు చేయాల్సిందే. వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందో ఊహించవచ్చు. ఆ అప్పు అంతా చివరకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతోనే తీర్చాల్సి ఉంటుందని తేటతెల్లమవుతోంది. అమరావతిపై బాబు డాబుసరి మాటలివిగో..‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. భూ సమీకరణ కింద తీసుకున్న భూములు.. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లుతోసహా అన్ని పోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వాటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి అందరికి ఆమోదయోగ్యమైంది. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ – 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ – 2024 జూన్ 19న సీఎం చంద్రబాబు‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ – 2024 జూన్ 20న సీఎం చంద్రబాబు -
ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? చంద్రబాబూ.. రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బాబు గారడీ మాటలకూ చేతలకు పొంతనలేదు
ఊళ్లలో పరిస్థితులు బాలేవు.. ఎక్కడా పైసా రాలడం లేదు.. చిన్న వ్యాపారాలు సాగడం లేదు.. ఆఖరుకు ఉపాధి హామీ పనులల్లో చేరి జాబ్ కార్డు తీసుకుని చెరువుపనులు చేస్తున్నా వేతనాలు రావడంలేదు. ప్రభుత్వం నుంచి కూడా రూపాయి లేదు. పిల్లాబిడ్డలతో ఎలా బతికేది. ఇక ఇక్కడ బతకడం కష్టమే.. పైదేశం పొతే అక్కడైనా తల్లినాలుగురం కూలీ నాలీ చేసుకుని కలోగంజో తాగొచ్చు.. పోదాం పదండి.. ఇదీ సగటు పేద కుటుంబంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ... ఎప్పుడూ జరిగేదే ఈసారి కూడా జరుగుతోంది.ఎన్నికలకు ముందు రకరకాల రంగురంగుల కరపత్రాలతో జనాన్ని నమ్మించి గెలిచి, తరువాత వారికి రంగుల చిత్రం చూపడం చంద్రబాబు నైజం. అయన గెలిచాక అయన అనుచరులు.. వందిమాగధులు బాగుంటారు.. రాష్ట్రం మొత్తం పస్తులుంటుంది. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వస్తూనే వాలంటీర్లు ఓ రెండులక్షలమందిని తీసేసారు.. అంటే ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఆధారంగా ఉన్న చిన్న ఆదాయం పోయినట్లే.. ఇప్పుడు తాజాగా రేషన్ బళ్ళను సైతం తీసేస్తున్నారు.. వీళ్ళొక పదివేలమంది. ఇలా రకరకాల శాఖల్లో వేలాదిమందికి ఉపాధికి గండి పడుతోంది. కొత్తగా పరిశ్రమలు రావడం మాట అటుంచి ఎక్కడికక్కడ చిన్న పరిశ్రమలు.. కుటీర పరిశ్రమలు మూతబడుతున్నాయి. ఊళ్లో ఏదో చిన్నా చితకా టీ దుకాణం పెట్టుకుందాం అంటే అవి కూడా సరిగా నడవడం లేదు. ఇంకేదైనా పెడదాం అన్నా డబ్బుల్లేవు.. నా దగ్గరే కాదు జనం దగ్గర పైసలు లేవు... ఎవరూ కాస్త ధారాళంగా వందనోటు మార్చేందుకు ధైర్యం చేయడం లేదు.. అవసరం అంటేనే ఆచితూచి మూడుసార్లు ఆలోచించి జేబులోంచి నోటు తీస్తున్నారు.. ఇక ఇక్కడ అందరిమధ్యా ఉంటూ పస్తులుండడం మేలన్న భావనకు వచ్చేసిన పెదాబిక్కీ జనం మద్రాస్.. ముంబై.. హైదరాబాద్.. విజయవాడ ఇలా ఎక్కడ పనిదొరికితే అక్కడికి కడుపు చేతబట్టుకుని వెళ్లిపోతున్నారు.రాయలసీమనుంచి ఎక్కువగా మద్రాస్.. బెంగళూర్ వంటి నగరాలకు చేరుతున్నారు. పాలనలోకొచ్చి ఏడాదైంది కదా తమ వీరత్వం గురించి జనం ఏమనుకుంటున్నారో అన్నది తెలుసుకునేందుకు గ్రామా సచివాలయాల ద్వారా సర్వ్ చేయించిన ప్రభుత్వానికి షాకిచ్చే ఫలితాలొచ్చాయి. ఈ ఏడాదిలో అక్షరాలా 12 లక్షలమంది జనం ఊళ్లొదిలి అన్నాన్ని వెళ్లిపోయారట. ఉన్నఊళ్ళో కష్టమో సుఖమో అందరిమధ్యా ఉందామనుకున్న వాళ్ళను సైతం ఈ చేతగాని సర్కారు ఉండనీయడం లేదు.ఇక్కడ ఉంటె గుక్కెడు గంజి.. పిడికెడు మెతుకులు కూడా దొరికే ఛాన్స్ లేదు. పోనీ ప్రభుత్వం అయినా ఏదో పథకం కింద పావలా ఇస్తుందనుకుంటే పన్నులు.. చార్జీల రూపంలో బాదడం మినహా పైసా ఇచ్చేరకం కాదని తేలిపోయింది. పోనీ వైఎస్ జగన్ మాదిరిగా ప్రభుత్వం అప్పుడో ఇప్పుడో పదో పరకో ఏదో పథకం కింద ఇస్తే దానికి తోడు ఏదో పనిచేసుకుని ఊళ్ళో ఉండచ్చు అనుకుంటే చంద్రబాబులో ఏ కోశానా ఆ ఆలోచన లేదు.. దీంతో పేద .. దిగువ మధ్యతరగతివాళ్ళు ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారు. వేరే ఊళ్ళో పస్తులున్నా.. కూలీ చేసుకున్నా ఎవరూ అడగరు... అవమానం లేదు.. అందుకే వెళ్ళిపోతున్నాం అంటూ కన్నీళ్లతో ఊరు విడుస్తున్న కుటుంబాలు అక్షరాలా 12 లక్షలని తేలింది.. ఇక బాబు పేదరిక నిర్మూలన ఆలోచనలు ఇంకెప్పుడు అమల్లోకి వస్తాయో.. పేదలు ఎప్పుడు కాస్త ఎదుగుతారో.. ఈలోపు ఎన్ని పేద ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో..-సిమ్మాదిరప్పన్న -
ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై, అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంల మీడియాతో మాట్లాడుతూ తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త హరికృష్ణను పోలీస్ స్టేషన్లో అత్యంత దారుణంగా పోలీసులు హింసించిన ఘటన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కోసం ఎంతగా దిగజారిపోయిందనేందుకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల కార్యకర్తల మాదిరిగా పోలీస్ అధికారులే వ్యవహరిస్తున్నారని, బాధితులే ముద్దాయిలుగా మారుతున్న దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివీస్ట్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా, వీఆర్లో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాటలు విని పోలీస్ అధికారులు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తూన్నారు. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు సుప్రీంకోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం నోటీస్లు ఇచ్చి, వివరణ తీసుకోవాల్సి ఉంటే వాటిని ఏ మాత్రం పాటించడం లేదు.ఈ కేసుల్లో అర్ధరాత్రి పూట అరెస్ట్లు చేసి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ కల్పనను రాత్రిపూట అరెస్ట్ చేసే సందర్భంలో తాను నైటీలో ఉన్నాను, చీర మార్చుకుని వస్తానని చెప్పినా వినకుండా పోలీసులు రౌడీల మాదిరిగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో పాలేటి కృష్ణవేణి అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కనీసం భోజనం కూడా పెట్టకుండా, మరుసటి రోజున కోర్ట్లో హాజరు పరిచారు. సాయంత్రం ఆరు గంటల తరువాత, ఉదయం ఆరు గంటల లోపు మహిళలను అరెస్ట్ చేయకూడదనే చట్టాలు ఉన్నా కూడా పోలీసులు చట్టాలను అతిక్రమిస్తున్నారు. రాజకీయ నాయకుల మెప్పుకోసం వారు ఏం చెబితే అది చేయడం జరుగుతోంది.దాచేపల్లిలో పోలీసుల దారుణంపల్నాడు జిల్లా దాచేపల్లిలో నిన్న హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్లో ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేకుండానే హరికృష్ణ హత్యాయత్నం చేశాడని రాసుకున్నారు. అంటే కుట్రపూరితంగానే హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారని తెలిసిపోతోంది. ఇది అన్యాయం అని గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి అడిగినా కనీసం సమాధానం చెప్పలేదు. మరో వైపు హరికృష్ణను రాత్రి పోలీసులు విపరీతంగా కొట్టడంతో కనీసం అతడు నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని పోలీసులు ఎంతగా హింసించారో వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మీడియా సమావేశం ద్వారా వాటిని ప్రజలు కూడా చూసేందుకు ప్రదర్శిస్తున్నాం.పోలీసులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రిమాండ్ రిపోర్ట్లో అరెస్ట్కు సంబంధించిన వివరాలను కూడా తప్పుగా నమోదు చేశారు. తాము హింసించడం వల్ల అతడు నడవలేని స్థితిలో ఉన్నాడనే దానిని కూడా కప్పిపుచ్చుకునేందుకు గతంలోనే హరికృష్ణ కాళ్లకు గాయాలయ్యాయని, అతడు దానికి చికిత్స చేయించుకోలేదని, తాము అరెస్ట్ చేసే సమయంలో అతడు పారిపోయే ప్రయత్నంలో పరుగులు తీసి పడిపోవడం వల్లే ఆ గాయాలు అయ్యాయని రిమాండ్ రిపోర్ట్లో పచ్చి అబద్దాలు రికార్డు చేశారు. కానీ బాధితుడు హరికృష్ణ మేజిస్ట్రేట్ ముందు తనను పోలీసులు హింసించడం వల్లే గాయపడ్డానని స్పష్టంగా చెప్పడంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు.దీనిపై సదరు పోలీస్ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తున్నాం. దాచేపల్లి సీఐ భాస్కర్రావు గతంలోనూ ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డారు. గతంలో పాలేటి కృష్ణవేణి అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ను కూడా ఇదే సీఐ అర్ధరాత్రి అరెస్ట్ చేసి, ఆమెకు కనీసం భోజనం కూడా పెట్టించకుండా, అసభ్యంగా మాట్లాడి వేధించడంతో ఆయనపై ప్రైవేటు కేసు కూడా వేయడం జరిగింది. అలాగే తాడికొండ సీఐ మొవ్వా వాసు, డీఎస్పీ మురళీకృష్ణలు కూటమి ప్రభుత్వంలో రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.మాజీ మంత్రి విడదల రజిని పట్ల సీఐ సుబ్బానాయుడు ఎంత దురుసుగా వ్యవహరించారో ప్రజలంతా చూశారు. ప్రభుత్వం చెప్పే దానిని తూచా తప్పకుండా, చట్టాలను ఉల్లంఘిస్తూ అమలు చేస్తామనే రీతిలో ఈ పోలీసుల వ్యవహారం ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలోకి రానివ్వకుండా జేసీ ప్రభాకర్రెడ్డి బెదిరిస్తున్నా, జిల్లా ఎస్పీ దానికి వత్తాసు పలుకుతున్నారు. తన గ్రామానికి వెళ్ళేందుకు పోలీస్ రక్షణ కల్పించాలని పెద్దారెడ్డి కోర్ట్ను ఆశ్రయించారు. పెద్దారెడ్డికి పోలీస్ రక్షణ ఇవ్వాలని జిల్లా ఎస్పీకి కోర్ట్ డైరెక్షన్ ఇచ్చినా కూడా పోలీసులు దానిని అమలు చేయడానికి సాకులు చెబుతున్నారు. మనంఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. -
Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు
-
‘వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం ద్వారా కూటమి ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారని, దానికి బదులివ్వలేక ఎల్లో మీడియా 'ఈనాడు' ద్వారా ఒక అబద్దపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు.బేతాళ కథల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్కు సంబంధించి కోట్ల పేజీల సమాచారంను డిలీట్ చేశారంటూ ఈనాడులో రాయించడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఒకవైపు డేటా మొత్తం నాశనం చేశారంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో డేటాను సేకరించామనడం చూస్తుంటే చేసిన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రికేయ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అలాగే తన ఎక్స్ వేదికగా కూడా ఆ ప్రశ్నలను సామాజిక మాధ్యమం ద్వారా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపించారు. వీటికి సమాధానాలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న బేతాళ కథలు, కాకమ్మకథలను కూడా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి, చట్టాలను ఉల్లంఘించి, దర్యాప్తు సంస్థలను చేతుల్లోకి తీసుకుని, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ నిలదీశారు.అసలు లిక్కర్ కుంభకోణంకు పాల్పడింది ఎవరూ, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరూ, వాటి సామర్థ్యంను పెంచింది ఎవరూ, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ప్రివిజైల్ ఫీజు కింద రూ.1300 కోట్లు మాఫీ చేసింది ఎవరూ, హేతుబద్దత లేకుండా సీఎంకు కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది ఎవరూ అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నోట్ ఫైళ్ళలపై సీఎంగా చంద్రబాబు, ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్లో ఎక్కడైనా మా సంతకాలు ఉన్నాయా అని నిలదీశారు.బదులివ్వలేక బురదచల్లే యత్నంవైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక ఎల్లో మీడియా ఈనాడును అడ్డం పెట్టకుని బురదచల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. మొదటి నుంచి వైఎస్సార్సీపీపై విషం చిమ్మడమే తన లక్ష్యంగా పెట్టకుని దిగజారుడు రాతలు రాసే పచ్చపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ వ్యవహారాల్లో మొత్తం డెటా డిలీట్ చేశారని, మెగా బైట్, జీబీ, టెర్రాబైట్ అంటే ఎంత, ఒక్కో దానికి ఎన్ని పేజీల ప్రింట్ బయటకు వస్తుందో చెబుతూ ఈ కథనంలో అనేక అబద్దాలను వండి వార్చారు. మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? దేనిని బట్టి లిక్కర్ స్కామ్ అంటున్నారని అడిగితే, దానికి సమాధానం చెప్పకుండా ఈనాడు పత్రిక వింత కథనాన్ని ప్రచురించింది. 375.80 కోట్ల పేజీల సమాచారంను తొలగించారని అత్యంత ఆశ్చర్యం కలిగించేలా తన కథనంలో ఆరోపించింది.అయినా కూడా ప్రభుత్వం అతికష్ట మీద బ్యాక్ ఎండ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ నిర్ధారించింది. తలాతోక లేకుండా ఈనాడు పత్రిక రాసిన ఈ కథనం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక వైపు మొత్తం సమాచారమే లేదంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో సమాచారం వచ్చిందని చెప్పడం వారి తెంపరితనంకు నిదర్శనం. ఏపీఎస్బీసీఎల్కు ఆయా సంస్థలు ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టం, ఒరాకిల్ ఫైనాన్సియల్, ఎస్ఏపీ వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపిలేట్ చేశారని రాశారు. ఈ సమాచారాన్ని బ్యాక్ ఎండ్లో వెరిఫై చేస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయని రాశారు. ప్రభుత్వ వద్ద ఎటువంటి సమాచారం లేకుండా, బ్యాచ్ఎండ్ నుంచి తమకు నచ్చినట్లుగా సమాచారంను తయారు చేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.సమాచారం డిలీట్ చేస్తే చర్యలేవీ?గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ వ్యవహారాల సమాచారంను అధికారిక ఫైళ్ళ నుంచే డిలీట్ చేస్తే, అందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ అధికారులు, లిక్కర్ సంస్థలపై సమాచారం డిలీట్ చేశారని ఎందుకు కేసులు నమోదు చేయలేదు? కోట్ల పేజీల సమాచారం నాశనం చేశారని చెబుతుంటే, ఈ ప్రభుత్వం దానిని ఎందుకు ఉదాసీనంగా వదిలేసింది? అంటే అసలు సమాచారంను నాశనం చేశారనేదే పచ్చి అబద్దం. ప్రభుత్వ విభాగాల్లో ఒకచోట కాకపోతే మరోచోట కచ్చితంగా సమాచారం ఉంటుంది. దానిని మొత్తంగా నాశనం చేశారంటే అందుకు ఎక్సైజ్ కమిషనర్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే తప్ప జరగదు. అలా జరిగితే ప్రభుత్వంకు చాలా సులువుగానే తెలిసిపోతుంది, మొత్తం వ్యవస్థపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేదీ లేకుండా కోట్ల పేజీల సమాచారం మాయం అనేస్తే ఎలా? ఈ మాత్రం కూడా ఈనాడు పత్రికకు తెలియదా?లిక్కర్ అవినీతిపై కూటమి నేతల తలోమాటవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ను జరిగినట్లుగా, దానిలో రూ.వేల కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఎన్నికల ముందు నుంచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కూడా కూటమి నేతలు మాట్లాడారు. ఇలా మాట్లాడిన ప్రతి నాయకుడు వారికి తోచిన రీతిలో లిక్కర్ అవినీతిపై లెక్కలు చెప్పారు. లిక్కర్ విధానంపై చంద్రబాబు 25.3.2022న మాట్లాడుతూ వైఎస్ జగన్కు లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.10వేల కోట్లు అని అన్నారు. ఆయన వదిన పురంధేశ్వరీ 09.10.24న మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో ఏటా రూ.25వేల కోట్లు జగన్ కు చేరాయని ఆరోపించారు.మంత్రి అచ్చెన్నాయుడు ఏడాదికి రూ.లక్ష కోట్లు అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.41వేల కోట్లు అని ఆరోపించారు. 25.7.2024న చంద్రబాబు అసెంబ్లీలో రూ.18 వేల కోట్లు నష్టం జరిగిందని, అదే రోజు పవన్ కళ్యాణ్ రూ.30 వేల కోట్లు దోచుకున్నారని అసెంబ్లీలో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ లోక్ సభలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో రూ.30వేల కోట్లు అవినీతి అని అన్నారు. ఎంపీ కృష్ణదేవరాయులు మాట్లాడుతూ రూ.18 వేల కోట్లు కుంభకోణం, దానిలో రూ.4000 కోట్లు దేశం దాటి పోయాయంటూ మాట్లాడారు. ఇలా కూటమి పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా లిక్కర్ పాలసీపై తలో విధంగా మాట్లాడారు. ఒకరు మాట్లాడే దానికి, మరోకరు మాట్లాడేదానికి పొంతన లేదు. అంటే నిజంగా లిక్కర్ స్కామ్ అనేదే లేకపోవడం వల్ల వీరంతా తమకు తోచిన విధంగా మాట్లాడారనే అర్థమవుతోంది. -
MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..
-
Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..
-
ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు
-
రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు
-
స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి
-
వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!
ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్ టిష్యూ పేపర్తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్కు భజన , వైఎస్సార్సీపీ, జగన్పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది. 👉వైఎస్ జగన్(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చంద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?. అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి!!. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అదే జరిగితే టీడీపీ క్లోజ్..!
-
‘స్కామ్స్టర్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. ఆపై స్కామ్ స్టర్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్ జగన్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025 -
25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి
-
Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం
-
తిరుమలలో మరో అపచారం
-
చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి ఊస్టింగా?
తిరుపతి మంగళం/తణుకు అర్బన్/బీచ్రోడ్డు (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసేందుకు కుట్రలు చేస్తున్నారని మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు మండిపడ్డారు.ఈ ఎండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఎండీయూ ఆపరేటర్లు ఉద్యమబాట పట్టారు. తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పేదవాడి ముంగిటకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోగత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు ఆపరేటర్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎండీయూ ఆపరేటర్లు జేసీకి, తణుకులో తహసీల్దార్ డి. అశోక్వర్మకు వినతిపత్రం అందించారు. -
న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం
‘‘అంతిమంగా న్యాయం, ధర్మం ఏవైపు ఉంటే దేవుడు ఆవైపు ఉంటాడు. న్యాయం, ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ, ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయించుకోవడానికి... ఇప్పుడు చేస్తున్న లిక్కర్ పాలసీని సమర్థించుకోవడానికి ఏ స్కామూ లేకపోయినా జరిగినట్లుగా చిత్రీకరించి, భేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం చేస్తే... దాంట్లో ధర్మం, న్యాయం లేనప్పుడు దేవుడు ఆశీర్వదించడు. చంద్రబాబు దుర్బుద్ధితో ఎంత చేసినా అది తాత్కాలికమే’’‘‘నేను విజయవాడలోనే ఉన్నాను. వారు రావాలనుకుంటే రావచ్చు.. ఎవరు ఆపుతున్నారు’’‘‘నీ ఇంటి దగ్గరికి బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే డీలర్ దగ్గరకి పోయి తీసుకోమంటే వారి టైమింగ్ ప్రకారం పోయి తీసుకునేందుకు ఉత్సాహం చూపుతావా. ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల వ్యవస్థపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది?’’‘‘ఇంటింటికీ రేషన్ డెలివరీ నిలిపివేయడంతో ఇప్పుడు బియ్యం కోసం రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే పోవాలి, ఆ రేషన్ డీలర్ తెలుగుదేశం పార్టీవాడు అయ్యుంటాడు. వైఎస్సార్సీపీ అనో ఇంకో పార్టీ అనో పోతే అతడు ఇవ్వడు. సతాయిస్తాడు. తన ఇంటికి రావాలి అంటాడు. సెల్యూట్ కొట్టాలంటాడు. అప్పుడే ఇస్తానంటాడు. ఎందుకొచ్చిన బాధలే అని వెళ్లడం మానేస్తారు. సో బియ్యం ఆటోమేటిగ్గా మిగులుతుంది. వీళ్లు చేసేది మాఫియా’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘వైఎస్సార్సీపీకి... వైఎస్ జగన్కు ఈ పోరాటాలు కొత్త కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి... నన్ను ఇబ్బందిపెట్టి, వేధింపులకు గురిచేస్తేనే వైఎస్సార్సీపీ పుట్టింది... పెరిగింది... ప్రజల ఆశీర్వాదంతో జగన్ అనే వ్యక్తి ఎదిగాడు... ఈ పోరాటాలు మాకు కొత్తేం కాదు. తప్పుడు కేసులకు అదిరేది లేదు... బెదిరేది లేదు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని, ఎన్ని కేసులు పెట్టి అణచివేయాలని చూసినా... చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తూ... ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... అక్రమ కేసులపై గళమెత్తుతూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలిచ్చారు. మద్యం కేసులో మిమ్మల్ని అరెస్టు చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటున్నారు కదా.. మీరేమంటారు అని అడగ్గా.. తాను విజయవాడలోనే ఉన్నానంటూ స్పందించారు. మద్యం డోర్ డెలివరీ.. ఇంటింటికీ రేషన్ రద్దు‘‘అసలు రేషన్ బియ్యం ఇంటింటికీ పంపిస్తేనే కనీసం చంద్రబాబు ప్రభుత్వం చేప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? మొదట సార్టెక్స్ బియ్యాన్ని వీళ్లు ఆపేశారు. క్వాలిటీ పెంచి మేం సార్టెక్స్ బియ్యం ఇచ్చాం. దానివల్ల నూకలు తక్కువ వచ్చేవి. మధ్యస్త, సన్నకార, స్వర్ణ బియ్యాన్ని మాత్రం సేకరణ చేస్తుండేవాళ్లం. దీంతో తినేవాళ్లు ఉత్సాహం చూపేవారు. వీళ్లెవరూ ఇబ్బందిపడకుండా ఇంటి వీధి చివరికి పోయి అక్కడే డెలివరీ చేసేవారు. సాయంత్రం పూట సచివాలయం వద్ద బండి పెట్టుకుని అందుబాటులో ఉండేవారు. ఎవరైనా బియ్యం తీసుకోలేకపోతే... ఈ వెసులుబాటు వల్ల ఇంటికే వచ్చి ఇస్తున్నందున తీసుకునేవారు.డోర్ డెలివరీ అనేది ఒక సర్వీసు. ఆ సర్వీసును తీసేయడం వీళ్లు చేసిన తప్పు. ఆ తప్పును సమర్థించుకుంటూ... ఆ తప్పును అంగీకరించకుండా, దానికి ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా... దాని మీద కూడా దుర్బుద్ధితో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ల సంకుచిత రాజకీయ మనస్తత్వానికి ఇది నిదర్శనం’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బియ్యం పంపిణీని నిలిపివేసి... మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.చంద్రబాబు, బినామీల భూముల ధరలు పెంచుకోవడానికే..‘‘విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్టుల మధ్య 40 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అన్నది వర్కవుట్ కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి.. చంద్రబాబు, బినామీల భూముల ధరలు పెంచుకుని.. ప్రయోజనం పొందడానికే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అంటూ మాటలు చెబుతున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ‘‘కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలు ఊసే లేదు. విద్యార్థులకు ఫీజులు అందడం లేదు.పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదు. 50 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం లేదు. హామీలు అమలు చేయడం లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. ప్రశ్నించే గొంతును నొక్కేసేందుకు రెడ్బుక్ రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.⇒ ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. తనపై నమోదైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. బెయిల్ నియమ, నిబంధలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందించారు. -
గజ దొంగల ముఠా దోపిడీ.. రాష్ట్రం అతలాకుతలం
సచివాలయం.. అసెంబ్లీ విషయానికి వస్తే ఇప్పటికే అవి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసులు కడతారట. వాటి కోసం 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణాలు చేస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ భవనాలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారు. వారు ఇప్పటికే 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో పని చేస్తున్నారు. మరి కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం ఎందుకు? అంటే, ఆ పనులు నిరంతరం జరగాలి. ఆ మేరకు కమీషన్లు రావాలి.ఇప్పటికే కట్టిన అసెంబ్లీ వ్యయం రూ.180 కోట్లు, సచివాలయ వ్యయం రూ.300 కోట్లు.. రెండూ గంగపాలైనట్లే. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు.. అలా మొత్తం రూ.600 కోట్లు వెచ్చించారు. కొత్త భవనాలు కట్టాలనుకున్నప్పుడు ఈ రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఈ నిర్ణయాలు సమంజసం అని ఎలా చెబుతారు? అప్పులు తెచ్చి భవనాలు కట్టి, ప్రజలపై భారం మోపడం ఎందుకు? ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.8,900. సాధారణంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.4,500 పెడితే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే ఫైవ్ స్టార్ వసతులతో భారీ అపార్ట్మెంట్లు దొరుకుతాయి.హైదరాబాద్లో ఇటీవల కొత్త సచివాలయం 8.58 లక్షల చదరపు అడుగుల్లో రూ.600 కోట్లతో కట్టారు. దాంతో పాటు, హెచ్ఓడీ ఆఫీసులు కూడా తరలించారు. మరి ఇక్కడ 53.57 లక్షల చదరపు అడుగుల భవనాలు ఎందుకు? అమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయం కూడా దారుణం. ఫోర్ లేన్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం కిలోమీటరు వ్యయం రూ.11.16 కోట్ల నుంచి రూ.14.42 కోట్లు ఉంటుంది. అదే అమరావతిలో కిలోమీటరు రోడ్డుకు రూ.50 - 60 కోట్లు ఖర్చు చేస్తున్నారు.రాజధాని అమరావతికి ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలు ఈ పెద్దమనిషికి సరిపోదట. ఇంకో 50 వేల ఎకరాలు కావాలట. ఇన్నిన్ని అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. విజయవాడృగుంటూరు మధ్య ఎన్హెచ్ దగ్గర్లో నాగార్జున యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడృగుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్లు ఏవో కట్టు. అప్పుడు గుంటూరుృవిజయవాడ కలిసిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. ఇదే చంద్రబాబు గతంలో అమరావతిలో నిర్మాణాలు చేసి, లంచాలు తీసుకుని దొరికిన సందర్భం ఉంది. అందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు కూడా ఇచ్చింది. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంది. కేసు ఎదుర్కొంటున్నాడు. అయినా ఏమాత్రం జంకు, బొంకు లేకుండా మళ్లీ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా దోపిడీతో రాష్ట్రం అతలాకుతలమైపోతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిందని, ఓ వైపు అప్పులు విపరీతంగా పెరుగుతుంటే.. మరో వైపు ఆదాయం తగ్గిపోతోందని ఎత్తి చూపారు. ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో ఎక్కడా ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జాడ కనిపించ లేదన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు సంపద సృష్టిస్తా.. సంక్షేమం పంచుతానని చంద్రబాబు గొప్పగా డైలాగులు కొట్టారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రజలను వంచించడం.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి బినామీలకు పంచి పెట్టడంతో సరిపోయిందన్నారు. ఇసుక నుంచి సిలికా వరకు సహజ వనరులను మింగేస్తున్నారని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వ పన్నులు, పన్నేతర ఆదాయం వృద్ధి చెందుతుంటే.. ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాబడి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని దుర్మార్గపు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో.. చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే 41 శాతం అప్పులు చేశారని ఎత్తిచూపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాణేనికి రెండో వైపు ఇలా..» రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై నాణానికి రెండో వైపున ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మన యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారిని రెండేళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాష్ట్రాన్ని గొప్పగా నడిపాం. అలా చేస్తూనే సంక్షేమం, అభివృద్ధి చూపాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. పెట్టుబడులు కూడా పెరిగాయి. » అదే చంద్రబాబు ఏడాది పాలన చూస్తే.. కాగ్ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. చంద్రబాబు పాలనంతా కూడా ఈ ఏడాది మోసాలతో సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగరగొట్టారు. రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్ఓఆర్).. పన్ను, పన్నేతర ఆదాయం రెండూ గమనిస్తే ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉంది. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్రేట్ కనిపిస్తోంది. అందుకు కారణం ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు తగ్గాయి. » ఇదే సమయంలో దేశంలో దాన్ని చూస్తే, గ్రాస్ టాక్స్ రెవెన్యూస్, నాన్ టాక్స్ రెవెన్యూస్లో ఏకంగా 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.36,97,545 కోట్లు. అదే గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.32,50,181 కోట్లు. మన రాష్ట్ర ఆదాయంలో అంత తక్కువ పెరుగుదలకు కారణం ఆ ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబునాయుడు, ఆయన గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్లడమే.విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి » రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని చెప్పడానికి మరో ఉదాహరణ యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఇది ఏకంగా రూ.11 వేల కోట్ల స్కామ్. యాక్సెస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్, వారి పీఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 10 కోట్ల యూనిట్లు, యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా 210 కోట్ల యూనిట్లు కొంటున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.4.60. అదే మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్ విద్యుత్ రూ.2.49 మాత్రమే. అంటే ఒక్కో యూనిట్కు చంద్రబాబు ప్రభుత్వంలో అదనంగా రూ.2.11 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 210 కోట్ల యూనిట్లకు రూ.440 కోట్ల చొప్పున 25 ఏళ్లకు పడే భారం రూ.11 వేల కోట్లు. » ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు తెలివిగా బీబీబీ (బండ్లింగ్, బ్యాంకింగ్. బ్యాలెన్సింగ్) అన్న ప్రస్తావన తెచ్చారు. అంటే 4 గంటల పీక్ అవర్ అని చెప్పి, మొత్తం 24 గంటలకు యూనిట్ రూ.4.60కి కొంటూ స్కామ్ చేస్తున్నారు. ఈ మధ్య సెకీ పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ విద్యుత్ ధర కేవలం రూ.3.53 మాత్రమే. వాటిలో ఎన్టీపీసీ, రిలయెన్స్ సంస్థలు ఉన్నాయి. ఆ ధర లెక్క వేసుకున్నా రూ.1.07 ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లే. ఆ విధంగా చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారు. స్కామ్లలో పరాకాష్ట.. అమరావతి నిర్మాణం» స్కామ్లలో పరాకాష్ట అమరావతి పనుల్లో అవినీతి వ్యవహారం. ఆ పనులకు సంబంధించి 2018లో టెండర్ల విలువ రూ.41,170.78 కోట్లు కాగా, అందులో అప్పుడు రూ.5,587.28 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా రూ.35,583 కోట్ల పనులు మిగిలాయి. వాటిని రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి ఇప్పుడు దోపిడీ చేస్తున్నారు. » అందుకోసం గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన జుడీషియల్ రివ్యూ విధానాన్ని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ స్కామ్లో తమ సదుపాయం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. మా హయాంలో అది లేదు. కానీ, చంద్రబాబు దాన్ని తీసుకొచ్చి, టెండర్ ఇవ్వగానే 10 శాతం అడ్వాన్స్ ఇచ్చి, అందులో 8 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ఐదు ఐకానిక్ టవర్లను ఒక్కో చదరపు అడుగు వ్యయం రూ.8,931తో నిర్మిస్తున్నారు. » సచివాలయం.. అసెంబ్లీలు ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసులు 53,57,389 చదరపు అడుగులతో నిర్మిస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ భవనాలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారు. ఈ లెక్కన కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం మీ కమీషన్ల కోసం కాదా? సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ.. అన్నీ అప్పులే » అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని అందరినీ మభ్య పెడుతూ, చంద్రబాబు చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్డబ్ల్యూ (జర్మనీ) బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల నుంచి రూ.21 వేల కోట్లు.. ఇలా ప్రస్తుతానికి రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో రూ.6 వేల కోట్లు కేటాయించారు. మరి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్?» ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలకు సంబంధించే ఈ మధ్య ఫైనాన్స్ కమిషన్కు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చి, రూ.77 వేల కోట్లు కావాలని అడిగారు. ఈ లెక్కన అమరావతి కోసం చేస్తున్న, చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకే అర్థమవుతుంది. ఇవి కాక మళ్లీ 50 వేల ఎకరాలు సేకరించి అమరావతిని విస్తరిస్తారట ఈ పెద్దమనిషి! అమరావతి విస్తరణకు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఈ పనులకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయే సరికి రూ.2, 3 లక్షల కోట్ల మొత్తం ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?» ఇన్నిన్ని అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. అయ్యా చంద్రబాబూ.. నీ సొంత లాభాలు పక్కన పెట్టి.. నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి. కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య ఎన్హెచ్ దగ్గర్లో నాగార్జున యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడ–గుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్లు ఏవో కట్టు. రీజనబుల్గా ఏదో సైజ్లో అయిపోతుంది. గుంటూరు–విజయవాడ ఎప్పుడైనా కలిసిపోతాయి. » ఇప్పటికే నువ్వు చేసిన పనికి విజయవాడ, గుంటూరుల్లో రియల్ ఎస్టేట్ ఢమాలైంది. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. మచిలీపట్నంలో పోర్టు కట్టాం. మెడికల్ కాలేజీ నిర్మించాం. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని కడితే రేట్లు పెరుగుతాయి.అప్పుల సామ్రాట్ చంద్రబాబు» మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల కన్నా 30 శాతం ఎక్కువ. ఇంకా మూల «ధన వ్యయం చూస్తే, మా హయాంలో చివరి ఏడాది ఆ మొత్తం రూ.23,330 కోట్లు కాగా, చంద్రబాబు ఏడాది పాలనలో అది కేవలం రూ.19,177 కోట్లు. అంటే మైనస్ 17.80 శాతం అన్నమాట. ఈ గణాంకాలన్నీ చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.» చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ (పవర్ సెక్టార్ నాన్ గ్యారెంటీ అప్పులు సహా) అన్నీ కలిపి ఉన్న అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు.» మా హయాంలో అప్పుల పెరుగుదల (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్–సీఏజీఆర్) 13.57 శాతం. అదే అంతకు ముందు రాష్ట్రం విడిపోయి 2014లో చంద్రబాబునాయుడు చేతికి అధికారం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,40,717 కోట్లు కాగా, ఐదేళ్లలో ఆ మొత్తం ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే చంద్రబాబు తన హయాంలో రూ.2,49,350 కోట్ల అప్పులు చేసి, ‘అప్పుల సామ్రాట్’ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన హయాంలో సీఏజీఆర్ 22.63 శాతంగా నమోదైంది. » 2019–24 మధ్య ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తం రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం ఈ 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేశారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో ఏకంగా 41 శాతం.. చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే చేశాడు. అప్పుల వివరాలు ఇలా..ఎస్డీఎల్ ఇన్స్యూరెన్స్ ఇన్ ఏప్రిల్–2025 : రూ.5750 కోట్లుఎస్డీఎల్ ఇన్స్యూరెన్సెస్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే–2025 : రూ.7 వేల కోట్లుఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీపీఎఫ్సీ: రూ.710 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మార్క్ఫెడ్: రూ.6 వేల కోట్లుఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్: రూ.2 వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీఎండీసీ బాండ్స్: రూ.3,489 కోట్లుబారోయింగ్స్ సెక్యూర్డ్ ఫర్ అమరావతి బై ఏపీ గవర్నమెంట్ : రూ.31 వేల కోట్లు మొత్తం అప్పు : రూ.1,37,576 కోట్లు. ఇందులో ఒక్క అమరావతి నిర్మాణం కోసం చేసిన అప్పు రూ.31 వేల కోట్లు.అప్పు కోసం రాజ్యాంగ ఉల్లంఘన » చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న 436 గనులపై ఉన్న హక్కులను ఏపీఎండీసీకి తీసుకొచ్చి, ఆ విలువను రూ.1.91 లక్షల కోట్లుగా వెల కట్టి, వాటిని తాకట్టు పెట్టి, బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. » రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అలాంటిది రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు ఇలా హక్కులు కల్పించడం రాష్ట్ర చరిత్రలో కాదు.. దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. ఇది చట్టరీత్యా నేరం. రాజ్యాంగ ఉల్లంఘనే.» ఆ విధంగా ఏపీఎండీసీ భవిష్యత్తును చంద్రబాబు అంధకారమయం చేస్తున్నాడు. ఏకంగా ఏపీఎండీసీని తాకట్టుపెట్టి అప్పులు తీసుకుని వచ్చి ఆ అప్పుల్ని డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండీసీని శాశ్వతంగా అప్పుల ఊబిలోకి నెట్టే కార్యక్రమం దగ్గరుండి చేస్తున్నాడు. అలా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏపీఎండీసీని ప్రైవేటుపరం చేసే పని చేస్తున్నారు.అసలు వీరు మనుషులేనా?ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం» మన ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు వక్రభాష్యం చెబుతోంది. ‘సెకీ’ ఒప్పందానికి సన్మానం అని కథనం. సెకీ చైర్మన్ను తొలగించడానికి కారణం, జగన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం అట! ఏపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం డిసెంబర్ 1, 2021 కాగా, ఇప్పుడు తొలగించిన సెకీ సీఎండీ జూన్ 13, 2023లో నియమితులయ్యారు. రామేశ్వర్ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి 2023లో సీఎండీగా వచ్చారు. అంతకు రెండేళ్ల ముందు మా ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆయన్ను తీసేస్తే మా ప్రభుత్వంతో ఏం సంబంధం? ఇదెలా ఉందంటే.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈనాడు స్థాయి టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కు తక్కువ అనిపిస్తుంది. అసలు వీరు మనుషులేనా? అంతా మాఫియా రాజ్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.» రాష్ట్రంలో స్కామ్లు దారుణంగా జరుగుతున్నా, ఎల్లో మీడియాలో అస్సలు కనిపించవు. ఉర్సా కంపెనీ. ఊరూ పేరూ లేదు. అలాంటి సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారు. దానికి కేబినెట్లో క్లియర్ చేశారు. ఆ కంపెనీ యజమాని నారా లోకేశ్కు స్నేహితుడు. ఇంకా లులూ సంస్థకు మాల్ కట్టడానికి రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇస్తున్నారు. దాన్ని ఎల్లో మీడియా చూపదు. రాయదు. ఈ రోజు రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్జ్ ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ. ఇసుకను మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. మేము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోందని 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ పెడితే, చంద్రబాబు అండ్ గ్యాంగ్ రెండు నెలల్లో మొత్తం దోచేసింది. సెకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ను రూ.2.49కు కొనుగోలు చేస్తూ 2021, డిసెంబర్ 1న ఒప్పందం చేసుకుంటే.. సెకీ ఎండీగా రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను 2023, జూన్ 13న కేంద్రం నియమించింది. ఈ లెక్కన సెకీతో వైఎస్సార్సీపీ కుదుర్చుకున్న ఒప్పందం వల్లే రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఎండీ పదవి నుంచి తొలగించిందనేది కేవలం దుష్ప్రచారం. -
‘చంద్రబాబు సర్కార్’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది...కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్ఆర్ అంజనేయులు, డీజే ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్పాల్ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana