breaking news
Chandrababu Naidu
-
స్టార్ట్.. యాక్షన్.. కట్!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి లోకేశ్లు పాల్గొన్న మెగా పేరెంట్–టీచర్ సమావేశం అచ్చం సినిమా షూటింగ్ను తలపించింది. దర్శకుడు మైక్ పట్టుకుని క్లైట్ ప్లీజ్.. స్టాండ్ బై.. యాక్షన్.. కట్.. అన్నట్లు ఆద్యంతం పక్కా స్కిట్గా నడిచింది. ముఖ్యమంత్రి ఈ పాఠశాలకు వస్తున్నారని తెలియడంతో ప్రత్యేకంగా సెట్ వేశారు. పిల్లలతో ముందుగా అనుకున్న ప్రకారం కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఓ వర్గం మీడియాను మాత్రమే లోపలికి అనుమతించారు. ఏం మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలి.. అన్న దానిపై కొందరిని ముందుగానే ఎంపిక చేసి, రిహార్సల్ చేయించి మాట్లాడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జ్ అద్భుతంగా ఉందని.. త్వరలో వాళ్ల నుంచి తాను నేర్చుకునే రోజు వస్తుందని చెప్పారు. ప్రస్తుత విద్యా విధానం బాగుందన్నారు. గతంలో చాలా యాప్లు ఉండేవని.. ఇప్పుడు అలాంటి ఇబ్బందులని్నంటినీ తొలగించామని తెలిపారు. స్టూడెంట్స్ ఇన్నో వేటర్స్ పార్ట్నర్ షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏర్పాటు చేస్తామని, వంశధార–పోలవరంను అనుసంధానించి ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ లీప్ యాప్ గురించి ఎవరికీ తెలియదని చెప్పారు. కాగా, స్కూల్ కమిటీ చైర్మన్ రవి కుమార్ వైఎస్సార్సీపీకి చెందిన వారని వేదికపై స్థానం కల్పించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.65 లక్షలతో నాడు–నేడు కింద సమకూర్చిన వసతుల ఆనవాళ్లు కనిపించకుండా అలంకరణ చేయడం చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తుపోయారు. విద్యా రంగాన్ని దిగజార్చి.. మళ్లీ పీటీఎంలా?సాక్షి, అమరావతి: సాధారణంగా సినిమా షూటింగ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లకు సెట్టింగ్లు వేయడం చూస్తాం.. కానీ పిల్లలు చదువుకునే పాఠశాలలోనే ఏకంగా సెట్టింగ్ వేసి చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు. అక్కడ పీటీఎం నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. అధికారంలోకి వచి్చన నాటి నుంచి గత 19 నెలలుగా సర్వం భ్రష్టు పట్టించి విద్యా సంస్కరణలను చంద్రబాబు నీరుగార్చారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈవెంట్లు నిర్వహిస్తుండటం పట్ల తల్లిదండ్రులు, విద్యావేత్తలు విస్తుపోతున్నారు. అసలు చంద్రబాబుకు విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది? ఆయన రాగానే స్కూళ్లలో నాడు – నేడు నిలిపివేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు ఒక్క ఆలోచన కూడా చేయలేదు. ఆయన ఒక్కటీ చేయకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాఠశాలల్లో నాడు – నేడు ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడితే దాన్ని కొనసాగించకుండా నిలిపివేశారు. విద్యా సంస్కరణలన్నింటినీ ఆపివేశారు. గోరుముద్దను ఘోరంగా మార్చేశారు. టోఫెల్ లేదు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. ట్యాబ్లు కనుమరుగు.. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్కు మంగళం.. సీబీఎస్ఈ రద్దు.. హైస్కూల్ ప్లస్లు రద్దు.. ఆయాలకూ జీతాలు ఇవ్వడం లేదు.. కనీసం పిల్లలకు తాగునీటిని కూడా సమకూర్చడం లేదు.. ఫిల్టర్లు కూడా మార్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.. రాష్ట్రంలో 29 మంది పిల్లలు చనిపోయిన దుస్థితికి విద్యా రంగాన్ని దిగజార్చి.. మళ్లీ పీటీఎంల పేరుతో ఈవెంట్ల నిర్వహణ ఏమిటని తల్లిదండ్రులు, విద్యావేత్తలు చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్నారు. తొలి ఏడాది పూర్తిగా తల్లికి వందనం ఎగ్గొట్టడమే కాకుండా రెండో ఏడాది అరకొరగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తే, చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని అన్ని చోట్లా పీటీఎం సమావేశాల్లో చర్చించుకున్నారు. -
క్రెడిట్ చోరీ.. బాబు బాటలో పవన్
సాక్షి, అమరావతి: ఎగవేతలు... అడ్డగోలు కోతలు తప్ప ఏడాదిన్నర నుంచి చేసిన మంచి పని ఒక్కటీ లేదు..! చెప్పుకోవడానికి ఏమీ లేదు..! దీంతో చంద్రబాబు సర్కారు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది...! వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను యథేచ్ఛగా తన ఖాతాలో వేసుకుంటోంది..! వైఎస్ జగన్ వినూత్న ఆలోచనలను చంద్రబాబు ప్రభుత్వం అటుఇటు మార్చి తమ గొప్పలుగా చెప్పుకుంటోంది. వేగంగా జరుగుతున్న ఈ క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు దారిలోనే ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ గురువారం 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను (డీడీవో) ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ప్రకటించుకున్నారు. కానీ, వాస్తవం మాత్రం వేరు. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మచిలీపట్నం డివిజనల్ డెవలప్మెంట్ ఆపీసు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గ్రామ సచివాలయ భవనంలో ప్రారంభించిన డీడీవో కార్యాలయం దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించిపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 1987లో మండల వ్యవస్థను తీసుకురాగా... కీలకమైన ఎంపీడీవోలకు 33 ఏళ్ల పాటు పదోన్నతులు లేవు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవస్థను తెచ్చారు. అప్పటివరకు ఎంపీడీవోలు వేర్వేరు సంఘాలుగా వేరుపడి సీనియారిటీ జాబితాపై వాళ్లలో వాళ్లే కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ చూపి... గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించింది. అలా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లో ఐదేళ్ల కిత్రం 2020 సెప్టెంబరులో ‘డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల’ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బందితో ఏడుగురు చొప్పున నియామకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 30న జీవో నంబరు 674ను జారీ చేసింది. దీంతోపాటు కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్ కొనుగోలుతో పాటు అద్దెకు కారు వాడుకునేలా, ఇతర నిర్వహణ ఖర్చులకు సైతం నిధులు కేటాయించింది. తద్వారా పెద్దఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఊరూవాడా అందరికీ అందేలా కృషి చేసింది. సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు తెరపడుతూ డీడీవోలుగా పదోన్నతి పొందిన ఉత్సాహంతో అధికారులు సైతం సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించారు.అక్షరం మార్చేసి అదే కొత్తగా ప్రచారంఉప ముఖ్యమంత్రి పవన్ సొంత ఆలోచనగా ప్రకటించుకున్న డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు (డీడీవో) ఐదేళ్లుగా రాష్ట్రమంతా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ, కొత్తవి అన్నట్లుగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డీడీవోలను వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షిప్తంగా డీఎల్డీవోలుగా పిలిచేవారు. ఎంపీడీవోల నుంచి పదోన్నతి పొందిన నేపథ్యంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాను డీఎల్డీవోగా కొనసాగించారు. కాగా, బాబు సర్కారు ప్రస్తుతం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాలో డివిజనల్ అన్న పదానికి సంక్షిప్తంగా ‘డీఎల్’కు బదులు కేవలం ‘డీ’ని మాత్రమే పేర్కొంటూ... డీఎల్డీవోను డీడీవోగా మార్చింది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి (డీఎల్పీవో), డ్వామా (ఉపాధి హామీ పథకం) ఏపీడీ కార్యాలయం, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీఎల్డీవో) కార్యాలయాలు వేర్వేరుచోట్ల పనిచేశాయి. బాబు ప్రభుత్వం డీఎల్పీవోతో పాటు ఉపాధి హామీ ఏపీడీ కార్యాలయాలను కూడా డీడీవో కార్యాలయంలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకేచోట ఉన్నప్పటికీ, డీడీవో కార్యాలయాల్లో డీడీవో పర్యవేక్షణలో డీఎల్పీవోలు, ఉపాధి హామీ ఏపీడీలు వేర్వేరుగా పనిచేస్తారని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు.గ్రామ సచివాలయాల్లోనేఈ కార్యాలయాలుడిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించిన డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం నిర్మించినవి కాకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి ఊరిలో రెండంతస్తులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను డీడీవో కార్యాలయాలకు వాడుకుంటున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కింది అంతస్తులో గ్రామ సచివాలయం ఉండగా, పైఅంతస్తును డీడీవో కార్యాలయాలకు కేటాయించారు. -
‘చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు’
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల కోసం గంపమట్టివేయలేదని సీపీఎం జాతీయ నాయకులు గఫూర్ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప వేరే అజెండా ఏమీ లేదని మండిపడ్డారు. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నావని, చేసింది మాత్రం ఏమీ లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు రోజు ఉపన్యాసాలు చేస్తుంటావు కాని ఆలూరులో రోడ్ల పరిస్థితి ఒకసారి చూడు. జిల్లాల సమగ్రాభివృద్ధికి కొరకు నంద్యాల జిల్లా చేశారు వైఎస్ జగన్. అదే విదంగా చంద్రబాబు ఆదోని జిల్లా చేయాలి. కర్నాటక ప్రభుత్వం ఆంధ్ర నీళ్ళను జల దోపిడీ చేస్తున్నా.. చంద్రబాబుకు పట్టదు. చంద్రబాబు వేదవతి ప్రాజెక్టు కోసం ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు. చంద్రబాబు పోలవరం ,అమరావతి తప్ప వేరే అజెండా పట్టదు’ అని మండిపడ్డారు. -
Ambati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలవరం జీవనాడి
-
‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’
సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు...తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు...వైఎస్ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్లోని ఇంట్లోకి పవన్కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
Appalaraju : ప్రైవేటీకరణ ఆపాలని కొన్నిరోజులుగా ఉద్యమం చేస్తున్నాం
-
ఏది విధ్వంసం చంద్రబాబూ?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజాసంపదను దోచుకుంటున్నారంటూ చంద్రబాబు సర్కార్ను ఆయన నిలదీశారు. 16 నెలల కాలంలోనే 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలాంటి పరిపాలన దేశంలో మరెక్కడా ఉండదు’’ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐదేళ్లలో 3 లక్షల 30 వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా?. 16 నెలల కాలంలో 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేయడం విధ్వంసమా?. ఏది విధ్వంసం చంద్రబాబు..?. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం విధ్వంసమా?. నాడు బాబు పాలనలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు విధ్వంసమా?’’ అంటూ అప్పలరాజు దుయ్యబట్టారు. -
పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా CID విచారణ జరిగింది
-
KSR: వీర బాదుడుకు రంగం సిద్ధం ఏపీ ప్రజలు రెడీగా ఉండండి
-
చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు: భూమన
తిరుపతి: పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సీఐడీ విచారణ జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు?. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు?. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు...చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వం పట్టించుకోలేదు.. జగనన్నా మీరే న్యాయం చేయాలి
-
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్ను వైజాగ్లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ను కలిసిన భవానీ పురం బాధితులు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను భవానీపురం బాధితులు కలుసుకున్నారు. భవానీ పురం 42 ఫ్లాట్స్ బాధితులు శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను కలిసి తమ గోడును చెప్పుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బాధితులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఏం జరిగిందంటే.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయి రూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు. చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే! విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణ కోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రం తిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు.బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి «న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైద్య విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పీజీ సీట్లు అమ్మకానికి పెట్టిన కూటమి సర్కార్పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకు రూ.9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది.రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్ కోటాకు, 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు. -
వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నోరు తెరవకపోవడం గమనార్హం.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కూటమి సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారు. సూపర్ సిక్స్ అమలు చేశామంటున్న ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇచ్చారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? అని అడిగారు.అలాగే, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సైతం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2024 జులైలో కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారు?. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఉంటే మరి టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అడిగారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు నోరే తెరవలేక పోవడం గమనార్హం. -
కూటమికి YS జగన్ దబిడి దిబిడి
-
సందట్లో సడేమియా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!ఫైబర్ నెట్లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు. చట్టం.. చంద్రబాబు చుట్టం!ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం. -
ఈ సర్కారుకు మాయరోగం!
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి 18 నెలలకు రూ.5,400 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా..! ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందట. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! బొనాంజా కాదా ఇది?’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇచ్చారు? విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక పాలన.. ఇవి కదా చేయాల్సింది. కానీ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేటీకరణే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం.. ఉన్నకాడికి స్కామ్లు చేయడమే..’’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. దారుణంగా ప్రజారోగ్య వ్యవస్థ ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ అమలుకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 18 నెలలకు కలిపి రూ.5,400 కోట్లు ఇవ్వాలి. ఇటీవల నేను దీనిపై పలుదఫాలు మాట్లాడటం.. వాళ్లు కూడా (నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు) స్ట్రైక్లు చేయడంతో ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. అంటే ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. చివరికి మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. సమ్మె విరమించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకిచి్చన మాటకు ఇంతవరకు దిక్కులేదు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 సేవలను స్కాములుగా మార్చేశారు. రూ.5 కోట్లు టర్నోవర్ లేని వాటికి 104, 108 సరీ్వసుల నిర్వహణను అప్పగించేశారు. ఆ వ్యక్తి ఎవరంటే.. టీడీపీ ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడట..! ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటారు. అది ఇంకో డ్రామా. అన్నీ గవర్నమెంట్వే.. లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా.. ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒక స్కాముగా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా కూడా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. (ప్రభుత్వం జారీ చేసిన జీవో 847ను ప్రదర్శించారు). ఒక్కో టీచింగ్ హాస్పిటల్ (550 పడకల ఆసుపత్రి)లో ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.60 నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది.ఆశ్చర్యమేమిటంటే.. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! ఆశ్చర్యంగా లేదా ఇది..? బొనాంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా ఇది? ఓవైపు ప్రజా ఉద్యమం జరుగుతోంది. దానిని ఖాతరు చేయకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు స్కాములపర్వం ముందుకు పోతోంది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. మరో వైపున వాటిని ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కామ్ల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.16న గవర్నర్కు కోటి సంతకాల పత్రాలు అందచేస్తాంకొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మా పార్టీ భారీ ర్యాలీలు చేపట్టి ప్రజల గొంతుకను వినిపించింది. కోటిమందికి పైగా సంతకాలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నెల 10వ తేదీన సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి ప్రజలకు, మీడియాకు అందరికీ చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు చేరుస్తారు. ఆ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 16న గవర్నర్కు అందచేస్తాం. ఆ తరువాత ఈ పత్రాలతో హైకోర్టులో పిటిషన్ వేస్తాం. -
ఉద్యోగులను ముంచేశారు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఐదింటికి ఒకే డీఏ.. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు. ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గని అడగరు.. ప్రైవేటు ప్లాంట్కు అడుగుతారా?
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయొద్దు... పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి... చంద్రబాబు వ్యవహరిస్తున్న ఈ తీరే నిదర్శనం’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా కాపాడుకున్నామని, ప్రభుత్వ రంగంలోనే నడపాలని, సొంత గని (క్యాప్టివ్ మైన్) కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కానే కాదని, సొంత గని లేకపోవడమేనని తేల్చి చెప్పారు. దీనికి ఆధారంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్) వార్షిక నివేదికలను చూపారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గని కేటాయించాలని అడగరు కాని.. మిట్టల్ సంస్థ పెట్టే ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప గని కేటాయించాలని టీడీపీ కూటమి ఎంపీలతో కేంద్రాన్ని అడిగిస్తారా?’’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ ఇంకా ఏమన్నారంటే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాటా? మా ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం. కానీ, ఎన్నికల ముందు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది చూడండి. (2021 ఫిబ్రవరి 16న చంద్రబాబు మాట్లాడిన మాటలు, 2025 నవంబర్ 15న మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్లను చూపించారు). ప్లాంట్ను కాపాడుకుంటాం. కలిసి పోరాడతాం అంటూ వీర డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అంటున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయెద్దు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నిజానికి నష్టాలకు ఉద్యోగులు కారణం కాదు. విశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే నష్టాలు. ఆర్ఐఎన్ఎల్, ఎస్ఏఐఎల్ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం.. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం చేసే వ్యయం 11.2 శాతం ఉంది. కానీ, సెయిల్కు ఐరన్ ఓర్ ఉంది. క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఉంది. దాన్నుంచి 34.34 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ తీసుకోవడమే కాకుండా, జార్ఖండ్ ప్రభుత్వం అనుమతితో 1.16 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను మార్కెట్లో అమ్ముకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు. అందుకే ఐరన్ ఓర్ వ్యయం 18.6 శాతం అవుతుంటే సెయిల్లో ఇది 9.8 శాతమే. 10 శాతం తేడా ఉంది. -
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
ఆ 53 వేల ఎకరాలకే దిక్కులేదు..
అధికారంలో ఉంటే చంద్రబాబుకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నీ స్కాములు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు రైతుల నుంచి ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు వెనుకాడటం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని.. సింగపూర్, గింగపూర్ ఎక్కడికి పోవాలో.. మన దగ్గర నుంచే ఏదైనా కానీ.. మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డప్ చేస్తున్నానని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు. ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత? రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్ల రూపాయలు కావాలని సినిమా చూపిస్తూ రూ.5 వేల కోట్లు పెట్టాడు. మళ్లీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.’ అని చెప్పారు.స్కాముల కోసమే అది చాలదంటున్నారు‘ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8 వేల ఎకరాలు మిగిలిందని, దాంతోనే రాజధాని అయిపోతుందని చెప్పాడు. మళ్లీ ఈ రోజు అది చాలదంటున్నాడు. అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ జరిగేది ఒక్కటే... ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ పక్కన భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరే చోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు. వేసే రోడ్లు ఏవో వీళ్ల మనుషులకు ప్లాట్లు ఇచ్చిన చోట వేసుకుంటారు’ అని చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న అవినీతి కేసులు తీసేయించుకుంటున్నారన్న ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి’ జగన్ అన్నారు. -
చినబాబు డైరెక్షన్లోనే పేదల ఇళ్లు నేలమట్టం
‘‘ నాపేరు డి.నాగరాజు. తినీతినక కష్టపడిన సొమ్ముతో 9 ఏళ్ల క్రితం విజయవాడ జోజినగర్లో స్థలం కొనుక్కున్నాను. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొన్నాను. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా. నా కళ్లముందే ఆ ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని కోర్టు ఉత్తర్వు చూపించినా కోర్టు అమీనాగానీ, పోలీసులుగానీ పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ కాపీని ఫోన్లో చూపిస్తుంటే లాయర్, అమీనా వెటకారంగా మాట్లాడారు. వ్యవస్థలు అమ్ముడు పోతుంటే నాలాంటి సామాన్యులు ఎలా బతకాలి? నాలుగు నెలల నుంచి నరకం చూపించారు. ఉన్న పళంగా నడిరోడ్డుపైకి నెట్టారు’’ – ఇదీ చంద్రబాబు పాలనలో ఓ బాధితుడి ఆక్రోశం సాక్షి ప్రతినిధి,విజయవాడ/భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయిరూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు. చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే! విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజి్రస్టేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణకోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిరి్మంచుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజి్రస్టేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రంతిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు.బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన ఉద్ధృతం ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి «న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూపర్ 6 పేరిట.. 'సూపర్' మోసం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం ఆడేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో సూపర్ సిక్స్ విజయవంతం అంటూ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారని.. చంద్రబాబు గోబెల్స్కు టీచర్, మెంటార్ లాంటి వాడని ఎద్దేవా చేశారు.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసగిస్తూ 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. అసలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల కింద ఏం చేశారో చెప్పాలని, సక్రమంగా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ హిట్టని ఎలా ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో రైతులు పండించిన చీని, అరటి ఎగుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. 23 వేల టన్నులు ఉన్న అరటి ఎగుమతులను 2023–24 నాటికి 3 లక్షల టన్నులకు తీసుకెళ్లాం. దళారుల బెడద లేకుండా చేశాం. రవాణా ఖర్చులను 40 శాతం మేర తగ్గించాం. ఈ 19 నెలల పాలనలో రైతుల కోసం మీరేం చేశారు? రైతుల కష్టాలు పట్టవా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే నిద్రపోతున్నారా.. అని ప్రశి్నంచారు. మిమ్మల్ని సీఎం చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా.. అంటూ మండిపడ్డారు.వ్యవసాయంపై 62 శాతం మంది ఆధారపడిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా సాగును పండుగ చేసి.. రైతులను సంతోష పెడితేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకుంటే రాష్ట్రం ఎదగదని, వెనకడుగు వేయాల్సి వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడాలని.. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఉచిత పంటల బీమాకు మంగళంఇటీవల మోంథా తుపాను వచి్చన సమయంలో ఆరీ్టజీఎస్ నుంచి చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడూ కంప్యూటర్ల ముందు కూర్చొని పెద్ద బిల్డప్ ఇచ్చారు. వీళ్లకు తోడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఎలా బిల్డప్ ఇచ్చాయంటే.. వీరు తుపాను పీకపట్టి డైవర్ట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చాయి. వీళ్లు కాబట్టే తుపానును ఆపగలిగారన్నట్టుగా ఆకాశానికి ఎత్తారు. కానీ, వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. తుపాను కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. తుపాను ప్రభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. దాన్ని నాలుగైదు లక్షల ఎకరాలకు కుదించారు. వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. బాబు 19 నెలల పాలనలో ఇప్పటి వరకు 17 ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఆ విపత్తుల కారణంగా రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వం నుంచి 17 విపత్తులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రూ.1,100 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఇవ్వనేలేదు. దీనికి తోడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఉచిత పంటల బీమా కింద రైతు తరఫున కూడా ప్రభుత్వమే ప్రీమియం కట్టి.. పంట నష్టపోయిన రైతులకు రూ.7,400 కోట్ల నుంచి రూ.7,800 కోట్ల మేర బీమా పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు లేకుండా చేయడంతో బీమా పరిహారం రాకుండా పోయింది. రాష్ట్రంలో ఖరీఫ్ సమయంలో 84 లక్షల మంది రైతులు, కౌలు రైతులు పంటలు సాగు చేస్తే.. కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? రోజూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నష్టపోయిన రైతులకు ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో ఆ ఉపన్యాసాల్లో ఎక్కడా చెప్పరు. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేది కాకుండానే అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఒకవైపు పెట్టుబడి సాయం దక్కలేదు. మరోవైపు మా ప్రభుత్వంలో సీజన్ ముగిసే సమయానికి అందే ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కనిపించకుండా పోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము రాకుండా పోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఇన్ని కష్టాల మధ్య రైతు సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని దుస్థితి చూస్తున్నాం. పోయిన ఏడాది ధాన్యం, పొగాకు, ఉల్లి, టమాట, మామిడి, సజ్జ, చీనీ, మిర్చి.. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర దక్కలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మోంథా తుపానులో నష్టపోయిన రైతుల నుంచి ధాన్యం కొనేవారు లేరు. 75 కేజీల బస్తాకు ఎంఎస్పీ ప్రకారం రూ.1,776 రావాలి. అయితే రూ.1,200, రూ.1,300కు ఇస్తారా? అని దళారులు రైతులను అడుగుతున్నారు. ఇంకో పక్క దిత్వా తుపాను పంట కోతల(హార్వెస్టింగ్) సమయంలో వస్తుందని 10రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళ్లాల మీదే ఉందని తెలుసు. పంట కొనకుంటే ధాన్యం తడిచి పోతుందనీ తెలుసు. రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. ధాన్యం కొనకపోతే మరింత నష్టాల్లో కూరుకుపోతారని తెలిసి కూడా చంద్రబాబు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులు వచి్చనప్పుడు ఎలాంటి స్పందన ఉండేదో ప్రజలు ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం మొత్తం పనిచేసేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, ధాన్యం సరఫరాకు లారీలు సమకూరేవి. ధాన్యం కొనుగోలుకు వెనువెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. ధాన్యం సేకరణ, తరలింపునకు మొత్తం యంత్రాంగం అప్రమత్తం అయ్యేది. వర్షానికన్నా ముందే పంట కొనుగోలు పూర్తి చేసేవాళ్లం. ఇవన్నీ గతంలో జరిగాయి. ఈ రోజున రైతులు ఏమైపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేజీ అరటి పండ్లు అర్ధ రూపాయికొబ్బరి, అరటి, వేరుశనగ పంటలదీ ఇదే పరిస్థితి. ఏ పంటకూ రేట్లు లేవు. కేజీ అరటి అర్ధ రూపాయి అంటున్నారు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? ఇంత ఘోరంగా పాలన సాగుతోంది. అదే మా ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల, కర్నూలు నుంచి ఘజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి. దీంతో రైతులకు దళారుల బెడదల తప్పింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. మా ప్రభుత్వం రాక మునుపు అరటి ఎగుమతి 23 వేల టన్నులు ఉంటే 2023–24లో 3 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభించాం. కరెంట్ బిల్లుల ఖర్చు వస్తుందని దానిని మనుగడలో లేకుండా చేయడం దుర్మార్గం.డైవర్ట్ చేయడం కోసమే ‘రైతన్నా.. మీ కోసం’ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారిపోయింది. ఆర్బీకేలు, ఈ–క్రాప్ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. తూతూ మంత్రంగా ఈ–క్రాప్ చేస్తున్నారు. ఒక పొలంలో రైతును నిలబెట్టి, ఎన్ని ఎకరాల్లో, ఏ పంట సాగు చేశారో ఆర్బీకేకు అనుసంధానం చేసేదే ఈ–క్రాప్. ఆ రైతుకు భవిష్యత్లో గిట్టుబాటు ధర రాకపోయినా, పంట నష్టం వాటిల్లినా ఆదుకునే వ్యవస్థ ఆర్బీకే ద్వారా ఉండేది.ఆర్బీకేల్లో పంటల వారీగా గిట్టుబాటు ధరల పట్టికలు ప్రచురించే వాళ్లం. ఎక్కడైనా గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్(క్రియాశీలకం) అయ్యేది. జాయింట్ కలెక్టర్ దృష్టికి సమస్య వెళ్లేది. ఆయన మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ను అప్రమత్తం చేసి పంట కొనుగోలు చేసేవారు. మార్కెట్లో పోటీ సృష్టించేవారు. ఈ క్రమంలో మేం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం దాదాపు రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ‘రైతన్నా.. మీ కోసం’ అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులందరికి ధన్యవాదాలు.. అంటూ ఈనాడులో యాడ్ కూడా వేసుకున్నారు. అసలు వీళ్లు రైతుల దగ్గరకు పోయే పరిస్థితే లేదు. పోతే రైతులు తిడతారు, కొడతారు కూడా.. రైతుల దగ్గరకు పోకుండానే కార్యక్రమం విజయవంతం అయినట్టు ఆశ్చర్యకరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలయ్యాయా? ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ ఇచ్చారు? ఇలా ఎన్నెన్నో 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే. అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ–5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా.రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. ధాన్యం, ఉల్లి, టమాటా, అరటి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పాలన ‘సేవ్ ఏపీ’ అన్న తరహాలో ఉంది. హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోంది. – వైఎస్ జగన్➤ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.72 వేలు భృతి ఇవ్వాలి. ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతిగా రూ.72 వేలు చెల్లించారా? ఇది మోసం కాదా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎన్నికలకు ముందు బాండ్లు కూడా ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వనేలేదు. మరి సూపర్ సిక్స్ ఎక్కడ అమలైంది?➤ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి రూ.18 వేలు.. రెండేళ్లకు ఒక్కరికైనా రూ.36 వేలు ఇచ్చారా? ఇది మోసం కాదా?➤బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు, రెండేళ్లకు రూ.96 వేలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలే. ఇది మోసం కాదా?➤అమ్మ ఒడి పథకం పేరు మార్చారు. తల్లికి వందనం అన్నారు. ప్రతి పిల్లాడికి రూ.15 వేలు అన్నారు. తీరా చూస్తే తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదికి వచ్చే సరికి 20 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. రూ.15 వేలు కాకుండా రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు ఇచ్చారు. కొందరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. ఇలా ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడం మోసం కాదా?➤దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. రెండేళ్లకు ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది రెండే. అవీ అందరికి ఇవ్వలేదు. ఇది మోసం కాదా?➤ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఇన్ని 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే కదా? అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా. -
స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు దగా!
-
ఏపి ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం
విజయవాడ: ఏపీ ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం చోటు రేసుకుంది. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దంటూ వైఎస్సార్సీపీ గౌతమ్రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆ కేసును ఏసీబీ కోర్టు ఈనెల 8వ తేదీన విచారించనుంది. ఫైబర్నెట్ కేసులో అక్రమాలపై చంద్రబాబుపై గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఇటీవల తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా చంద్రబాబు క్లోజ్ చేయించుకుంటున్న తరుణంలో గౌతమ్రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఫైబర్నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌతమ్రెడ్డి రెడ్డి కోఓర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. దాంతో ఆ కేసును ఏసీబీ కోర్టు 8వ తేదీన విచారణ చేపట్టనుంది. -
YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది
-
తానే దొంగ.. తానే పోలీస్.. జగన్ సెటైర్లు..
-
PRC.. DA లేదు ఉద్యోగుల జీతాలపై .. జగన్ సంచలన కామెంట్స్
-
చంద్రబాబు.. ఇదేనా మీ బ్రాండ్..?
పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి. పారిశ్రామిక వాడలలో, లేదా ఇతరత్రా వచ్చే పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.కాని ఆచరణలో కాలం గడిచే కొద్ది ఆ పరిశ్రమలు మూతపడడం, లేదా వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి భూములు ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది.దీనిపై బిఆర్ఎస్ ,బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ, లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో, పరిసరాలలో ఉన్న పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఏపీలో ఐటి కంపెనీలను స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి.పారిశ్రామికవాడలలో, లేదా ఇతరత్రా వచ్చే పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.కాని ఆచరణలో కాలం గడిచే కొద్ది ఆ పరిశ్రమలు మూతపడడం, లేదా వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి భూములు ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది. దీనిపై బిఆర్ఎస్ , బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ,లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ,పరిసరాలలో ఉన్న పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఏపీలో ఐటి కంపెనీలను స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలుగా ప్రభుత్వమే అవకాశం కల్పిస్తున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చే భూములలో నలభై నుంచి ఏభై శాతం స్థలంలో ఐటి కార్యకలాపాలకు కాకుండా ఇళ్ల నిర్మాణం,కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించుకోవచ్చట.వాటిని అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చట. ఇలాంటివి ఐటి ఉద్యోగాలు ఇవ్వలేవు. ఎందుకంటే అవి ఐటి కంపెనీలు కావు కనుక. కాకపోతే అవి నిర్మించే భవనాలను ఐటి కంపెనీలకు అద్దెకు ఇస్తాయి. ఆ ఐటి కంపెనీలలో ఉండే ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకుని ప్రభుత్వం ఇచ్చే భారీ ప్రోత్సహాకాలను ఇవి పొందుతాయట.విశాఖలోని కోట్ల విలువ చేసే భూములను ఈ రకంగా పందారం చేస్తున్నారు.ఇప్పటికే ఉర్సా అనే పేరుతో వెలసిన కొత్త సంస్థకు అరవై ఎకరాల భూమి కేటాయించి ప్రభుత్వం విమర్శలపాలైంది. అయినా అదేతరహాలో రహేజా, కపిల్ చిట్ ఫండ్స్ ,బివిఎమ్ ఎనర్జీ,ఎఎస్ఎస్ ఆర్ మొదలైన రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం భూమిని ఇవ్వడమే కాకుండా వేల కోట్ల రాయితీ ప్రయోజనాలు కల్పిస్తుండడం శోచనీయమని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.రహదారులు,నీరు,విద్యుత్, వంటి మౌలిక వసతులకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుందట. ఇవి కాకుండా పెట్టుబడిలో అరవై నుంచి డెబ్బై శాతం ప్రోత్సాహకాల పేరుతో వారికి చెల్లింపులు జరుగుతాయట.ఇటీవల రహేజ గ్రూప్ కు విశాఖపట్నంలో 27 ఎకరాల భూమిని 99 పైసలకే ప్రభుత్వం ఇచ్చేసింది. ఈ భూమి విలువ సుమారు 1300 కోట్ల పై మాటే అని చెబుతున్నారు.ఈ కంపెనీ నిర్మించే ఐటి క్యాంపస్ ద్వారా 15వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బెంగుళూరు కు చెందిన సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 45 కోట్లకే ఇచ్చేశారు.విశేషం ఏమిటంటే సత్వా కంపెనీ హైదరాబాద్ లో కోకాపేటలో ఇటీవలే వేల కోట్లు వ్యయం చేసి 25 ఎకరాలు కొనుగోలు చేసింది.ఈ కంపెనీ హైదరాబాద్ లో తన భవనాలను లక్షల రూపాయలకు అద్దెకు ఇస్తోంది. విశాఖలో సైతం అదే రీతిలో ఐటి కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం ఏ ఇతర రాష్ట్రంలోలేని విధంగా కారుచౌకగా భూములు ఇవ్వడం ఎంతవరకు ఏపీ కి లాభదాయకమన్న ప్రశ్న వస్తోంది.విశాఖ ఇమేజీని చివరికి పైసలలోకి తీసుకువచ్చి ఇక్కడి భూమిని పప్పు బెల్లాలమాదిరి పంచుతారా అన్న బాధను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక సంగతి చెప్పాలి. గతంలో దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా చోట్ల పరిశ్రమలవారికి నిర్దిష్ట మొత్తాలకు భూములను కేటాయించితే దానిని క్విడ్ ప్రోకో గా టిడిపి ప్రచారం చేసింది. వైఎస్ ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే పాట అందుకుని రాజశేఖరరెడ్డి కుమారుడిపై కేసులు పెట్టించింది. చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి నీరు సరఫరా చేయడాన్ని ఇదే కోవలో వేసి జగన్ కు అంటకట్టారు.ఇప్పుడు ఏకంగా 99 పైసలకే వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇచ్చేస్తున్న చంద్రబాబు అండ్ కో కు ఎలాంటి లావాదేవీలు ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తే ఎకరా 130 కోట్ల నుంచి 170 కోట్ల వరకు అమ్ముడుపోయింది. హైదరాడబాద్ కు విశాఖ కూడా పోటీ ఇచ్చే నగరమే. కోట్లలో భూమి ధర పలుకుతోంది. అలాంటి విశాఖలో ఇంత ఘోరంగా భూములు కట్టబెట్టడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం కిందకు రాదా?అన్న ప్రశ్నకు జవాబు దొరకదు.పైగా ఈ కంపెనీలు కొన్ని అసలు తమకు తక్కువ ధరకు భూమి ఇవ్వాలని కోరకపోయినా ఎందుకు కేటాయిస్తున్నారో అర్ధ కాదు. పరిశ్రమలు రావల్సిందే.కాని ఆ పేరుతో ఇలా భూములు కాజేస్తున్నారన్న భావన రానివ్వరాదు. భవిష్యత్తులో ఎంతకాలం ఇవి సంబంధిత పరిశ్రమలు కొనసాగిస్తాయో లేదో తెలియదు. లూలూ మాల్ వంటివాటికి ఎకరాలకు ఎకరాలు లీజు పేరిట తక్కువ ధరకు భూములు ఇచ్చారు. ఒక నిపుణుడు చెబుతున్నదాని ప్రకారం 33 ఏళ్లు లీజ్ అయినా, ఆ తర్వాత దానిని అరవైఆరు ఏళ్లు,తదుపరి తొంభైతొమ్మిది ఏళ్లు పొడిగించుతారు. చివరికి ఆ భూమి లీజుదారుడికే సొంతం అవుతున్నట్లే భావించాలి. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక భూమిని అప్పట్లో ప్రభుత్వం లీజుకు ఇచ్చినా, తాజాగా ప్రభుత్వ ఆలోచనల ప్రకారం 9వేల ఎకరాలలో పరిశ్రమల బదులు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి వీలు కల్పించబోతున్నారు. ఒకప్పుడు అజామాబాద్ పారిశ్రామికవాడ ను లీజు పద్దతిన ప్రభుత్వం ఇచ్చింది.కాని ఆ చుట్టుపక్కల నివాసాలు ఏర్పడడంతో అక్కడనుంచి పరిశ్రమలను తరలించాలన్న ప్రతిపాదన వచ్చింది.కాని ఆ సమయంలో ఆ భూములు తమకే ఇవ్వాలని పరిశ్రమలవారు పట్టుబట్టారు. తాజాగా హైదరాబాద్, పరిసరాలలో ఉన్న పారిశ్రామికవాడలలోని భూముల వినియయోగాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ,కొన్ని కండిషన్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజ్ లో 30 శాతం చెల్లిస్తే చాలని నిర్ణయించింది. దీనిపైనే బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు,బీజేపీ శాసనసభ పక్షనేత మహేష్ రెడ్డిలు ఇది లక్షల కోట్ల కుంభకోణం అని విమర్శిస్తున్నారు.ప్రభుత్వం ఖండించి తమ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి ఐదువేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెబుతోంది. దీనిని చెడగొట్టడానికి విపక్షం కుట్ర పన్నుతోందని మంత్రులు బదులు ఇచ్చారు.అయినప్పటికీ రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే గురువుకు తగ్గ శిష్యుడు అన్న విమర్శకు గురి అయ్యే ప్రమాదం ఉందన్నది కొందరి వ్యాఖ్య.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఏభైప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి ,వాటి ఆస్తులను ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే అప్పగించారు. వారు కూడా అక్కడ పరిశ్రమలు నడపడం లేదని, రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని చెబుతున్నారు. ఇది చంద్రబాబు మోడల్ ఆర్ధిక విధానంగా కొందరు చమత్కరిస్తుంటారు. తెలంగాణలో ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పుడు ప్రైవేటు పరం అవుతుంటే,ఏపీలో కొత్తగా ఇస్తున్న భూములు ప్రైవేటువారికి మొదటే సంపద చేకూర్చి పెడుతున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. విశాఖలో మాదిరి అమరావతిలో కూడా ఇలాగే అణా,బేడాకు భూములు ఇవ్వడానికి చంద్రబాబు సిద్దపడతారా?అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ఐటి కంపెనీల ముసుగులో ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం సరైనదేనా?అన్నది వారి ఆవేదన. ప్రజలకు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు హోరెత్తించిన చంద్రబాబు తనకు కావల్సిన సంపన్నులకు సంపద బాగానే సృష్టిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు బ్రాండ్ అంటే ఇదేనా? -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
YS Jagan: వెర్రితలల.. రెడ్ బుక్ రాజ్యాంగం
-
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు... జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
YS Jagan: జోగిని లోపలేశారు.. జోగి కొడుకుని టార్గెట్ చేశారు
-
దొంగ, పోలీస్.. రెండూ చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘిస్తున్నారని.. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు. తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారు. ఇది బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘించడం కదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘చంద్రబాబు ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారు. బ్లాక్లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి ఫైబర్నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ.వందల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు గత పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్ చేశారు. మేం వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. 1300 కోట్లు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్కిల్ స్కామ్లో రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారు. స్వయంగా బాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తున్నారు. ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టాబెట్టారు. వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబు సంతకం చేశారు. బాబు అండ్కో గోబెల్స్ను మించిపోయారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
సింహాచలం చోరీ కేసు.. అశోక గజపతి మాటేంటి?
తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలి. సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు..అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది..అలాంటప్పుడు టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్ ప్రచారం చేస్తున్నాయి?. చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.. అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన రమణ, సురేష్ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘జోగి రమేష్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. -
ఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం..
-
YS Jagan: ఈ నెల 16వ తేదీన గవర్నర్ ను కలుస్తా.. చంద్రబాబు సంగతి తెలుస్తా..
-
చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రశ్నల వర్షంతో విరుచుకుపడ్డ జగన్
-
YS Jagan: గాడిదలు కాయడానికా నిన్ను సీఎంని చేసింది
-
కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్ జగన్ దుయ్యబటారు.‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నాడు-నేడును పూర్తిగా ఆపేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 7100 కోట్లు. నేటి తరం ఆస్తి చదువు. పిల్లలను చదివించడానికి బాబు ముందుకు రావడం లేదు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
గోబెల్స్కు గురువు మన చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్ జగన్.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్కు చంద్రబాబే టీచర్’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
సేవ్ ఆంధ్రా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. రైతులు పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి.. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు.‘‘పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొంథా తుపాను ఇంకా కళ్లముందే కదలాడుతోంది. మొంథా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం. మొంథా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్ఇచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించింది. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్ఫుట్ సబ్సీడీల మాటే ఎత్తరు. ఈ 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘బాబు పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రూ.1100 కోట్ల ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఉన్నాయి. మా హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా ఇచ్చాం. మా హయాంలో ఉచిత పంటల బీమా కింద రూ.7800 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమాకు బాబు ఉరేశారు. బాబు పాలనలో కౌలు ైతుల పరిస్థతి దయనీయంగా ఉంది. ..ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో బాబు చెప్పరు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాలి.. బాబు ఇచ్చింది 10 వేలే. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబు పాలనలో రైతులను దళారులు దోచుకుంటున్నారు. అయినా చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నారు.’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉందికానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తూనే ఉన్నారుప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారుకేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారుప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబే సంతకం చేశారుచంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారుచంద్రబాబు బరితెగింపు2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లుఆషామాషీ స్కాములు కావవి!స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించిందిస్కిల్ స్కామ్లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారుచంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణంఇసుక స్కామ్తో వందల కోట్లు దోచిపెట్టారువివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబుచంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారుఅబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారుబెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపుబెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారుఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్లు చేస్తున్నారుబాబు అండ్కో గోబెల్స్ను మించి పోయారువీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీసెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారురమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారుఅలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదువిచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదుసింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిఅశోక్ గజపతిని ఎందుకు విచారించలేదుసుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా? పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు. ఇది ధర్మమేనా? వాళ్లంతా టీడీపీ మనుషులే.. లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదుటీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగిలడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో అంతా టీడీపీ వాళ్లే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారుదేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారునెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారుఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలిసర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారుమా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాంపకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారుమళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొందిటీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలుఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులుచెవిరెడ్డిని జైలుకు పంపారుమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు మిథున్రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారుకాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారుపోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారుమంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవువాట్సాప్ మెసేజ్లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదుఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదుపైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారురిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారుటీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారుటీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారుచంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారుటీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారుకొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారుఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోటఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారులిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబుఅప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారుఅలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారులేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అరెస్టులు చేశారుమా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారుమిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు రెడ్బుక్ వెర్రితలలు వేస్తోందిరాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లేమంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచిందికుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు మా పార్టీకి చెందిన జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారుజోగి రమేష్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుజోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారువాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లేరెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారుపీఆర్సీ లేదు.. ఐఆర్ లేదుచంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాంబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారురెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవుఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్లు చేస్తున్నారుజీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించలేదుఐదు డీఎలు పెండింగ్లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమేవిశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలుమిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారుకానీ, విశాఖ స్టీల్కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరుఅందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాంప్రైవేటీకరణ కాకుండా ఆపేశాంస్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదుఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారుఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!దటీజ్ చంద్రబాబు ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాంగవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్లాభం ప్రైవేట్వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమంకోటి సంతకాలతో 16న గవర్నర్ను కలుస్తాం ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు నెలకు రూ.300 కోట్లు అవుతుందిఅలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లుకానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారుబకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి104, 108లు స్కామ్గా మారిపోయాయిపేదలకు వైద్య సాయం అందేదెలా?సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారుఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్గా నడుస్తోందికొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే.. ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లుభారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా?? నేటి తరం ఆస్తి చదువుపిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదుస్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయినాడు-నేడును పూర్తిగా ఆపేశారుఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారుఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయితల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారువైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారుకలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయిఅనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారువందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారుచిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారుచంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు గోబెల్స్కే మెంటార్ మన చంద్రబాబుసూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలేపెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదుఅయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారంహిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాంఅందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరుకానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలిఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలిగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవిరైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాంబాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారుచంద్రబాబేమో చోద్యం చూస్తున్నారుఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలుజీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారుఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలనదిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉందిపంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసుఅయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయిందిమా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవిరైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారుకేజీ అరటికి రూ.50 పైసలా?వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోందిచంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?.. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలేరెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు 18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులుకూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నంరూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమాచంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదుఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదుదయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితిమరి గతంలో ఎలా ఉండేది?.. వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారుచంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయంమోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారుతుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదునష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదుపైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు సేవ్ ఆంధ్రప్రదేశ్లా.. పాలనరాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందినాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిరాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నదిరాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలిరైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందిరైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు -
చంద్రబాబు ఇంటికి భవానిపురం బాధితులు
-
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
-
చంద్రబాబుపై కేసు మూసివేత డాక్యుమెంట్లను ఎందుకు బయట పెట్టడం లేదు?
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబుపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను మూసివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు.. అందుకు సంబంధించిన కాపీలను బహిర్గతం చేయకపోవడంపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో ఏదీ రహస్యం కాదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను బహిర్గతం చేయడాన్ని సీఐడీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. డాక్యుమెంట్ల కాపీలు బయటపెట్టే విషయంలో సీఐడీ ఎందుకు జంకుతోందని నిలదీశారు. ఏదో గూడుపుఠాణి లేకుంటే కోర్టు తీర్పు కాపీలను బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ప్రాసిక్యూషన్కు ఏముందని ప్రశి్నంచారు. ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అది న్యాయపాలనలో భాగమని స్పష్టం చేశారు. కోర్టులోని ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంటేనని, అది కక్షిదారులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తి కాదని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదు కోర్టు రికార్డులను ఏ వ్యక్తి అయినా నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చని, వాటిని తిరస్కరించే అధికారం ఎవరికీ లేదని పొన్నవోలు కోర్టుకు వివరించారు. చార్జిషీట్, ఎఫ్ఐఆర్లతో సహా అన్ని రికార్డులను థర్డ్ పార్టీ తీసుకోవచ్చన్నారు. ఈ విషయంలో ఏ చట్టంలోనూ నిషేధం లేదని నివేదించారు. ఎవిడెన్స్ చట్టం ప్రకారం సహేతుక కారణం చూపి ఏ వ్యక్తయినా కూడా కోర్టు డాక్యుమెంట్లను తీసుకోవచ్చని కేకే వేలుస్వామి వర్సెస్ పళని స్వామి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు. కోర్టు డాక్యుమెంట్లు కేవలం ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదని, ఫిర్యాదుదారులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సదుద్దేశం ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకోవచ్చని ఎన్.శివశంకరయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచి్చందని కూడా ఆయన తెలిపారు. ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చుకేవలం పార్ట్–1 కేసు డైరీని మాత్రమే బహిర్గతం చేయకూడదని, మిగిలిన ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చని పొన్నవోలు కోర్టుకు వివరించారు. కోర్టు డాక్యుమెంట్లను తీసుకునే విషయంలో లోకస్ స్టాండీ (జోక్యం చేసుకునే హక్కు) వాదనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదన్నారు. క్రిమినల్ లాలో ఎక్కడా లోకస్ స్టాండీ ప్రస్తావనే లేదన్నారు. అలాంటప్పుడు దేని ఆధారంగా చంద్రబాబుపై కేసుల మూసివేత డాక్యుమెంట్లను రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని పాటించబోమంటే, సుప్రీంకోర్టులో పోరాటం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్ల కాపీలను కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను ఇవ్వాలని కోరుతూ చీరాలకు చెందిన సువర్ణరాజు అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన తరఫున బుధవారం పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. -
జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు..'ఔను.. అదానీనే'!
రెండు నెలల క్రితం..రూ.లక్ష కోట్లకుపైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్ వస్తోంది..! మేమే తీసుకొస్తున్నాం.. డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే!రెండు రోజుల క్రితం..అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్టు. గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానీకి బదలాయిస్తున్నాం. గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్ అదానీకి వర్తింప చేస్తున్నాం.– గూగుల్ రాకపై చంద్రబాబు సర్కారు విన్యాసాలివీ! గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో సాక్షి, అమరావతి: గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు, సంకుచిత వైఖరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెలువరించిన జీవోల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో వెల్లడించింది. అంతేకాదు... గతంలో గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని తిరిగి అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమైన విషయం తెలిసిందే. డేటా సెంటర్ ఏర్పాటుపై తొలుత ఈ ఏడాది అక్టోబర్లో ఆగమేఘాలపై జీవో ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. స్వయంగా గూగులే దీన్ని నిర్మిస్తోందని, ఈ ప్రాజెక్టు మొత్తం గూగుల్ సంస్థే ఇప్పటికిప్పుడు కొత్తగా చేపడుతోందనే భ్రమలు కల్పించింది. ఇక యథావిధిగా ఎల్లో మీడియా దీనికి కోరస్ పాడుతూ అదొక ప్రపంచ ఈవెంట్ మాదిరిగా చిత్రీకరించింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో రక్తి కట్టించిన ఈ నాటకం అంతా డ్రామా అని తాజాగా ప్రభుత్వ జీవోలే వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అబద్ధాలు ఆడటం.. ఇంతటి ఘరానా మోసం.. ప్రజలకు ఎలా తప్పుడు సమాచారం ఇస్తున్నారో చెప్పేందుకు ఇదొక క్లాసిక్ కేస్ స్టడీగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలాడతారనేందుకు విశాఖ డేటా సెంటర్లే నిదర్శనమని పేర్కొంటున్నారు. చంద్రబాబు బృందం క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఎంతటి అబద్ధాలైనా ఆడగలదని, ఆత్మసాక్షిని మోసగించి వంచనకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నొయిడాలోని అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4.64లక్షల చదరపు అడుగులను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందని 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. , గూగుల్తో కలిసి విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు అదానీ.. గూగుల్ సంస్థ భాగస్వామేవిశాఖలో గూగుల్ డేటా సెంటర్కు తొలుత అడవివరం–ముడసర్లోవ వద్ద 120 ఎకరాలు, ఆనందపురం మండలం తర్లువాడ వద్ద 200 ఎకరాలు, రాంబిల్లి వద్ద 160 ఎకరాలను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్కు కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రెడిట్ చోరీలో భాగంగానే అదానీ పేరును దాచిపెట్టి కేవలం రైడెన్ టెక్ పేరుతో జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గూగుల్ అధికారిక భాగస్వామిగా అదానీ వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదానీ గ్రూపును గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వ్యాపార భాగస్వామిగా చంద్రబాబు సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.ఆ భూములను అదానీకి బదలాయించండి..ఏపీఐఐసీ కేటాయించిన ఆ 480 ఎకరాలను అదానీ గ్రూపు తదితర సంస్థల పేరిట బదలాయించాల్సిందిగా గూగుల్ కోరింది. తర్లువాడ, అడవివరం–ముడసర్లోవలో కేటాయించిన భూములను అదాని పేరిట అంతర్గతంగా బదలాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బదలాయింపు రైడెన్, అదానీ మధ్య అంతర్గత ఒప్పందం ద్వారా జరుగుతుందని వివరించింది. ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్గా ఉన్న అదానీకి గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను వర్తింప చేస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించడం గమనార్హం. సీఐఐ సదస్సు సాక్షిగా తేల్చి చెప్పిన అదానీ..విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 14న ఢిలీల్లో ఎంవోయూ కుదుర్చుకున్న సమయంలో అదానీ పేరును చంద్రబాబు సర్కారు కనీసం ప్రస్తావించలేదు. దాదాపు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ పేరు ఎక్కడా చెప్పకుండా చంద్రబాబు దాగుడుమూతలు ఆడారు. అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తాము ఆ డేటా సెంటర్లో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా తాము గూగుల్తో కలసి 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.ఆ డేటాసెంటర్.. జగన్ నాటిన మొక్కసంకుచిత బుద్ధితోనే అదానీ పేరెత్తని బాబుచంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కృషి, చొరవతో సాకారమైన డేటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఏ విధంగా వేసుకున్నాడన్న విషయాన్ని వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టారు. డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని, తద్వారా గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ వస్తాయన్నారు. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటు పనులకు వైఎస్ జగన్ ప్రభుత్వమే అంకురార్పణ చేసింది. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జీవో సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ భూములను అదానీ పేరు మీదకు బదలాయించడమే దానికి తార్కాణం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లో అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాల్సి ఉన్నందున దీనిపై 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో అదానీకి వ్యాపార అనుబంధం ఉంది. నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 2022 అక్టోబర్ 11 లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఆ డేటా సెంటర్ కోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్ను అసలు తాము నిర్మించడం లేదని, దీన్ని అదానీ గ్రూపే నిర్మిస్తుందని, ఆ భూమిని కూడా అదానీకే కేటాయించాలంటూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు అక్టోబర్లో లేఖ రాయడం గమనార్హం. చంద్రబాబును కలిసిన గౌతమ్ అదానీసాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. -
వరి వల్ల ఉపయోగం లేదు.. ఆదాయం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం/నల్లజర్ల: వరి సాగు వల్ల ఎలాంటి ఉపయోగం, ఆదాయం లేవని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరిస్థానంలో ఉద్యాన పంటలు సాగుచేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగులో టెక్నాలజీ ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపామని, వంశధారకు కలుపుతామని, పెన్నానది వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరవు ఉండదని చెప్పారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి నీరు ఇస్తే నల్లజర్ల ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కరవు ఎక్కువగా ఉండే రాయలసీమ నంద్యాల జిల్లాలో భూగర్భ జలాలు నాలుగు మీటర్లకు పెరిగాయన్నారు. తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గాయని చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాదిరిగానే దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోను ‘దివ్యాంగ్ భవన్’లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసిబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కరుణ కుమారికి రూ.15 లక్షలు, దీపికకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తామని, వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు. -
Visakha: మొహం చాటేసిన చంద్రబాబు
-
ఈ మూడింటిలో ప్రభుత్వం విఫలం.. చంద్రబాబుపై తమ్మినేని ఫైర్
-
Chandrababu: ఏపీ ఖజానా ఖాళీ..!
-
TJR Sudhakar: చంద్రబాబు చరిత్రే నీచ, నికృష్ణ, చండాలపు రాజకీయాలు
-
స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP జెండా ఎగరేస్తాం: YS అవినాష్ రెడ్డి
-
విశాఖలో అదానీ డేటా సెంటర్ బాబుకి చెంప చెల్లుమనేలా జీవోతో క్లారిటీ
-
సంపద సృష్టి చేతకాలేదు.. చంద్రబాబు ఒప్పేసుకున్నారు!
సాక్షి, విజయవాడ: ఏపీ ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం చేతకాలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఎంత వెతికిన కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పు చేయడానికి వీలుండదు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించడం.. సంపద సృష్టి చేతకాలేదని తేలిపోయింది. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. ఇక అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరంటూ చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు.బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. -
ముంబైతో అమరావతి పోటీ నవ్వకండి..సీరియస్ మ్యాటర్
-
కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ విజయంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధిరావాలని అవినాష్రెడ్డి అన్నారు. కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18 వేలు వంటి పథక పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి టీడీపీ నాయకులకు లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు క్రైంను నమ్ముకున్నారు...పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితి అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం’’ అని అవినాష్రెడ్డి చెప్పారు. -
‘బాబూ.. అధికారం శాశ్వతం కాదు.. కేసులున్నాయ్ కదా?’
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడతారని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం కోసం చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలకు పాల్పడతారు. అధికార దుర్వినియోగంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు, లోకేష్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. పల్నాడులో జంట హత్యల కేసును పిన్నెల్లి సోదరుల మీద బనాయించారు. టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని హత్యలు చేసుకున్నాయని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించారు. మరి అలాంటప్పుడు పిన్నెల్లి సోదరుల మీద కేసు ఎందుకు పెట్టారు?. ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ నేతని కూడా టీడీపీ రెండో వర్గమే హత్య చేసింది. దోచుకుని, దాచుకునే విషయంలో గొడవలు పడి వారికి వారే హత్యల దాకా వెళ్తున్నారు. అలాంటి కేసుల్లో మా వారిని ఎందుకు ఇరికిస్తున్నారు?జోగి రమేష్ సోదరుల మీద కూడా అలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ములకలచెరువులో నకిలీ మద్యం బయట పడినప్పుడు జోగి రమేష్ లేడు. ఆ తర్వాత కావాలనే జోగి బ్రదర్స్ మీద అక్రమ కేసు పెట్టారు. కొందరు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. చంద్రబాబుకు అధికారం శాశ్వతం కాదని తెలుసుకుంటే మంచిది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఒంటినిండా రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుదారి పట్టించి బెయిల్ తెచ్చుకున్నారు. సాక్షులను బెదిరించటానికి వీల్లేదని బెయిల్ ఇచ్చే ముందు కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారు.ఇవన్నీ బయటకు తెలుస్తాయని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రోజుకొక వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. పల్నాడులో చంద్రబాబు హయాంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. వైఎస్సార్, జగన్ హయాంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. డిప్యూటీ సీఎం సినిమాకు వెయ్యి, ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు రూ.500 రేటు పెంచారు. నారా లోకేష్ సినిమా తీస్తే రూ.1500 పెంచుతారు. అధికార దుర్వినియోగం చేయటంలో కూటమి నేతలు ముందున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
జోగి రమేష్ కుటుంబంపై చంద్రబాబుకు తీరని కక్ష..
-
Kakani: గంజాయి డాన్ కామాక్షి ఇంటిని ప్రజలే నేల మట్టం చేశారు
-
చంద్రబాబుపై బుగ్గన 2.0 పంచులు
-
రైతన్న కోసం అశోక్ బాబు వినూత్న నిరసన
-
‘పవన్కు ‘పీపీపీ’ పక్కాగా సూట్ అవుతుంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని వ్యాఖ్యలు చేశారు. అలాగే, పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్కు వర్తిస్తాయని పార్టీ నేత సతీష్రెడ్డి ఎద్దేవా చేశారు.పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి హాజరయ్యారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..‘కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి ఇష్టపడి పనిచేయాలి. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18,000, వంటి పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. అందుకే పచ్చ పార్టీ నేతలు దాడులు, నేరాలు చేస్తున్నారు.పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితిని అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం అని అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య, నీచమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ప్లాప్ అయ్యాయి. చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ఎల్లో మీడియా ద్వారా డబ్బాలు కొట్టుకుంటున్నాడు. పీపీపీ విధానం పవన్ కళ్యాణ్ మాత్రమే వర్తిస్తుంది. పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్కు వర్తిస్తాయి. మహిళలకు ఏడాదికి 18000, మూడు సిలిండర్లు, నిరుద్యోగ భృతి రైతు భరోసా పంటి పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాడు. జెడ్పీటీసీ ఎన్నికలలో పులివెందులలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు బాటలో పవన్ డబుల్ గేమ్?
ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఊగిపోతూ, జుట్టు ఎగరవేస్తూ ఆవేశంతో ప్రసంగాలు చేస్తుంటే, ఆయనలో చిత్తశుద్ది ఉందని అభిమానులు బావించారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తారని, ప్రభుత్వంలో తప్పు జరిగితే నిలదీస్తారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని అంతా ఆశించారు. కాని అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చూసి విస్తుపోయే పరిస్తితి ఏర్పడుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఉచిత పధకాల గురించి మాట్లాడిన విషయాలు ప్రజలను అవమానించేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రజలకు ఉచిత స్కీములు ఇస్తానన్నది టీడీపీ, జనసేనలు. అప్పుడు ఓట్ల కోసం దేహీ అని ప్రజలను ప్రాధేయపడిన ఈ పార్టీల నేతలు ఇప్పుడు స్వరం మార్చడం శోచనీయంగా ఉంది. చిత్రంగా ప్రజలేదో దేహి అని అడుగుతున్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. అప్పుడెవరైనా ప్రజలు ఆయనను కలిసి తమకు ఫలానా స్కీమ్ కావాలని దేహీ అన్నారా? లేదే!. అయినా ఎందుకు సుమారు లక్షన్నర కోట్ల ఖర్చు అయ్యే స్కీములను కూటమి వాగ్దానం చేసింది. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ఎవరైనా అడిగితే ఇదే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పేవారు! చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, దానితో స్కీములు అమలు చేస్తామని అనేవారా?లేదా? గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకు మాటలు మార్చడంలో ఎంతో అనుభవం ఉందని భావిస్తారు. ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ పయనిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కోనసీమ జిల్లాలో ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఉచితాలతోనే ఓట్లు రావని, ప్రజలు ఈ స్కీముల ద్వారా దేహీ అన్నచందంగా మారకూడదని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన అబిప్రాయపడ్డారు. మరి ఇవే మాటలు ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు? పైగా అప్పటి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అదనంగా ఇస్తామని, సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికలోని 140 అంశాలను అమలు చేసి చూపిస్తామని గప్పాలు కొట్టారే! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వారు చేసిన వాగ్దానాలకు లక్షన్నర కోట్ల వరకు అవసరం అవుతాయని, అవి ఎక్కడ నుంచి వస్తాయని ఆ రోజుల్లో జగన్ చెబితే ఆయనకు చేతకాదని ప్రచారం చేశారే. ఇప్పుడేమో చేతులెత్తేస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ కు ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన లేకపోతే ఈ మధ్యనే సూపర్ సిక్స్ -సూపర్ హిట్ అంటూ భారీ సభలు పెట్టి ఉపన్యాసాలు ఎలా దంచారు? సూపర్ సిక్స్ లోని అంశాలనే పూర్తిగా అమలు చేయలేదు. అయినా హిట్ అన్నారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారా? లేదా?. నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయలు ఇస్తామని అన్నారా?లేదా? ఏభై ఏళ్లకే బిసిలకు పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారా? లేదా? ఇలా అనేక అబద్దపు హామీలు ఇచ్చి, ఇప్పుడేమో ఉచితాలు మంచిది కాదని చెబుతారా? అంటే ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ప్లాన్ వేసినట్లే కదా!. మహిళలకు ఉచిత బసు ప్రయాణం స్కీమును ఎందుకు ప్రకటించారు. దాని గురించి ఎవరైనా దేహీ అన్నారా? మహిళల నుంచి వస్తున్న నిరసనను తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా దానిని అమలు చేశారు. అదే సమయంలో లక్షలాది ఆటోవాలాల ఉపాధికి గండి కొట్టారు. ఎవరి కాళ్లమీద వారు నిలబడాలని సుద్దులు చెబుతున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఉచిత బస్ స్కీమ్ ప్రారంభసభలో ఎందుకు పాల్గొన్నారు. ఆటోలవారి కాళ్లను కూటమి పెద్దలు విరగగొట్టినట్లే అనుకోవాలి కదా! పోనీ ప్రజా ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారా అంటే అదేమి లేదు. తమ షోకులను ఎక్కడా తగ్గించుకోవడం లేదు. దుబారాకు అంతులేదన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ లలో పర్యటనలు చేస్తున్నారు. అది అనవసర వ్యయమా? కాదా?. పేదలకు ఇవ్వడానికి డబ్బు లేదు కాని, విశాఖలో ప్రైవేటు పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు అడిగినా, అడగకపోయినా 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఎలా ఇస్తున్నారు?. అది ఉచిత స్కీమ్ కింద రాదన్నమాట. తూర్పు గోదావరి జిల్లాలో డ్రైనేజీల మరమ్మతుకు నాలుగువేల కోట్లు కావాలని, కాని ఆ డబ్బు లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్, అమరావతిలో వేల కోట్లు అప్పుచేసి పనులు ఎలా చేపట్టగలుగుతున్నారు?ఇప్పటికే 29వేల కోట్ల అప్పు అమరావతి కోసం చేశారు. మరో 31 వేల కోట్లు మంజూరు అయ్యాయని గొప్పగా చెప్పుకున్నారు.అవి చాలవన్నట్లు మరో 7500 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఇక ప్రభుత్వ అవసరాల కోసం సుమారు 2.20 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బు అంతా ఏమైపోతోందో ఎవరికి అర్ధం కావడం లేదు. అమరావతిలో రోడ్డు నిర్మాణంలో కిలోమీటర్ కు 170 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా దుబారా అవ్వదా! పవన్ కళ్యాణ్ వాటి గురించి మాట్లాడకుండా ప్రజలు ఉచిత పధకాలు కోరుకోరాదని చెప్పడం మోసం చేయడం కిందకు రాదా?ఎన్నికలకుముందు అన్నీ తన చేతిలోనే ఉంటాయన్నట్లు ఫోజు పెట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో తన వద్ద ఆర్ధిక శాఖ లేదని, ముఖ్యమంత్రిని నిధులు అడగాలని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? అమరావతిలో 33వేల ఎకరాల భూమి తీసుకోవడాన్నే ఒకప్పుడు తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సమర్ధిస్తున్నారు. అదనంగా మరో 40వేల ఎకరాలకు ప్రభుత్వం సిద్దం అవుతుంటే,క్యాబినెట్ లో ఒకసారి ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం రెండోదశలో 20వేల ఎకరాలు అదనంగా తీసుకోబోతోంది కదా! దీనిని ఎందుకు పవన్ అంగీకరించారు? ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలలో పవన్ కూడా డబుల్ గేమ్ ఆడుతూ చంద్రబాబుతో ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాటకు ప్రభుత్వంలో పెద్ద గా విలువ ఇవ్వడం లేదని, తొలుత ఏదో విన్నట్లు నటించి తర్వాత చంద్రబాబు ,లోకేష్ లు తమ పని తాము చేసుకుని పోతున్నారన్న ప్రచారం కూడా రాజకీయవర్గాలలో ఉంది. ఇక బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అప్పుడప్పుడు ఉచితాలకు వ్యతిరేకం అంటూ గాత్రం అందుకుని విమర్శలకు గురి అవుతున్నారు. కొద్ది కాలం క్రితం బీహారులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు రెండు లక్షల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పి ,తొలుత పదివేల రూపాయల చొప్పున ఇచ్చినప్పుడు వెంకయ్య అభ్యంతరం చెప్పి ఉంటే బాగుండేది కదా!. స్వయంగా ప్రధాని మోదీనే ఈ బటన్ నొక్కారు కదా! ఉచిత బస్ ప్రయాణాలు వద్దని చెప్పిన ఆయన పరిశ్రమలకు కోట్ల రూపాయల విలువైన భూములను 99 పైసలకే 66 ఏళ్ల లీజుకు ఇవ్వడం ఏమిటని ఎందుకు అడగలేదో తెలియదు.2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేసినప్పుడు చంద్రబాబు ఇచ్చిన లక్షకోట్ల రూపాయల రుణాల మాఫీని వ్యతిరేకిస్తూ ఎక్కడైనా ప్రకటన ఇచ్చారా? అలా చేసి ఉంటే ఇప్పుడు ఏమి చెప్పినా విశ్వసనీయత వచ్చి ఉండేది. ఇక పవన్ కళ్యాణ్ రకరకాల చిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎర్రచందంనం స్వామివారి రక్తం నుంచి పుట్టిందని కొన్నాళ్ల క్రితం ప్రకటించి ప్రజలు విస్తుపోయేలా చేశారు. కోనసీమకు తెలంగాణవారి దిష్టి తగిలిందని అంటూ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. దాని మీద తెలంగాణ నేతలు జగదీష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మంత్రులు తదితరులు మండిపడి పవన్ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి మీద విమర్శలు వస్తుంటే ,వాటిని తట్టుకోలేక సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రశ్నించేవారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేనలకు చెందిన వారు అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్నా పట్టించుకున్నట్లు కనపడదు. పవన్ కళ్యాణ్ గతంలో ఏమి ప్రసంగాలు చేసింది? అధికారం వచ్చాక ఏమి చేస్తున్నది?ఎలా మాటలు మార్చుతున్నది తెలిపే వీడియోలు బహుశా వందల సంఖ్యలో ఉండవచ్చు. వాటిని ఒక్కసారి చూడగలిగితే ఆయనేమిటో పవన్కే తెలుస్తుంది. మాట మార్చడం గొప్పదనం కాదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గొప్ప విషయం అవుతుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రజల సొమ్ముతో..బాబు.. లోకేష్.. పవన్ జల్సాలు
-
విశాఖ ఉక్కు ఉద్యోగులపై మరో చీకటి దెబ్బ
సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగులపై వైజాగ్ స్టీల్ప్లాంట్ యాజమాన్యం మరో చీకటి దెబ్బ వేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా.. ఉత్పత్తి ఆధారిత వేతన విధానం అమలు చేస్తోంది. పేస్లిప్పులో పూర్తి జీతం.. ఖాతాలో మాత్రం కట్ అయిన జీతంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు అంటూ ఇటీవల సర్క్యులర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పోరాటానికి దిగారు. సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం కార్మికుల దానిని పట్టించుకోలేదు. జీతాల నుంచి 17 నుంచి 33 శాతం కోతలు విధించారు. ఈ పరిణామంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కార్మిక సంఘాలతో కలిసి అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నాకు దిగారు. ముడి సరుకు ఇవ్వండి.. ఉత్పత్తి చేసి చూపిస్తాం. వైఫల్యం యాజమాన్యానిది అయితే.. నెపం కార్మికులపైకి ఎలా నెడతారంటూ నిలదీస్తున్నారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే లేబర్ కమిషన్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులపై కొనసాగుతున్న కుట్రలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 6 వేల మంది కార్మికులను(గత నెల వ్యవధిలో 450 మంది కాంట్రాక్ట్ కార్మికులను) తొలగించారు. ఇప్పుడేమో ఉత్పత్తి ఆధారంగా జీతాల్లో కోతలు విధిస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కూటమి నేతలు స్పందించడం లేదు. పైగా.. ఆ మధ్య స్వయానా సీఎం చంద్రబాబు స్టీల్ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్తో పోల్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. -
అంత బిల్డప్ ఇచ్చి జగన్ నే ఫాలో అవుతున్నావ్ కదా
-
ప్రజా ధనంతో ప్రభుత్వ పెద్దల జల్సాలు!
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని.. అది అర్థం చేసుకోవాలంటూ ఏపీ ప్రజల ముందు నారా చంద్రబాబు నాయుడు ఆడే డ్రామాలు తెలియంది కాదు. ఈ వంకతో ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎగ్గొడుతూ వస్తున్నారు కూడా. అయితే రాష్ట్రం అప్పులలో కూరుకుపోతున్నా సరే.. ప్రజా సొమ్ముతో ప్రభుత్వ పెద్దల జల్సాలు మాత్రం ఆగడం లేదు.. రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నా సరే.. ప్రభుతవ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు గండికొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్కైతే అధికారిక పర్యటనలనే వంకతో తెగచక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోందిసీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఇప్పటిదాకా 88 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి నిజంగానే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాదులో.. ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఈ మధ్యే క్రికెట్ చూడటానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు కూడా. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని.. ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ కూటమి పెద్దల విలాసాలను ప్రజల్లోకి పోనీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడుతోంది. -
అవును.. అది అదానీ డేటా సెంటరే..!
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదు. హైదరాబాద్లో హైటెక్ సిటీతో మొదలు.. ప్రతీదాంట్లోనూ సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తుంటారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలోనూ అలాంటి పనే చేయబోయి.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు.విశాఖలో గూగుల్ నెలకొల్పబోయే డేటా సెంటర్.. ఆదానీ డేటా సెంటరే. గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందమే ఇది!. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు.. ఎట్టకేలకు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకుంది. తాజాగా డాటా సెంటర్ కోసం భూకేటాయింపులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అందులో.. అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్స్ ఇండియా, అదానీ పవర్లకు భూ కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించింది. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాలు.. మొత్తం 480 ఎకరాలు ఆదానీ సంస్థలకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో మెన్షన్ చేసింది. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్టనర్లుగా అదానీ, భారతి ఎయిర్ ఎయిర్ టెల్ లకు భూ కేటాయింపు ఉత్తర్వులతో పాటు అన్ని రాయితీలు కల్పించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జీవో కోసం 👉 ఇక్కడ క్లిక్ చేయండిదాదాపు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి ఉన్న డాటా సెంటర్ విషయంలో యాజమాన్యం పేరు ఉసెత్తకుండా ఇంతకాలం చంద్రబాబు, నారా లోకేష్ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకు కారణం.. ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు జీవోతో ఆ బండారం బయటపడింది. వైఎస్ జగన్ చెబుతోంది ఏంటంటే.. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ = అదానీ గ్రూప్ పెట్టుబడి + గూగుల్ క్లయింట్. అంటే ఈ డేటా సెంటర్లో గూగుల్ కేవలం క్లయింట్ మాత్రమే, కానీ అసలు నిర్మాణం, పెట్టుబడి అదానీ గ్రూప్దే. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనేది నిజానికి అదానీ గ్రూప్తో కలిసి వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలోనే కుదిరింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దానిని కొత్తగా తన ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్ట్లా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. -
బాబు బ్లండర్ మిస్టేక్.. కేసులు క్లోజ్ చేసుకున్నా మళ్లీ జైలుకే!
-
చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్! జైలుకు వెళ్లడం పక్కా
-
అన్నదాత విలవిల
పెరవలి : ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతి గడించిన గోదావరి జిల్లాల్లోని రైతులు నానాటికీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల్లో దాదాపు ఏ ఒక్కదానికీ గిట్టుబాటు ధర లభించకపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. తేమ శాతం నిబంధనల పేరుతో ఆహార పంట అయిన వరి ధాన్యానికి ఎలాగూ మద్దతు ధర ఇవ్వడం లేదు. దీనికి తోడు మొక్కజొన్న, కొబ్బరి, అరటి.. ఇలా ఏ పంట చూసినా సరైన ధర లభించని దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మంచి ధర వచ్చేలా చూసి, ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని రైతులు ముఖ్యంగా ఉద్యాన రైతులు వాపోతున్నారు. 90 వేల మంది రైతులు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల మంది రైతులు 64,536 హెక్టార్లలో మొక్కజొన్న, కొబ్బరి, కోకో, ఆయిల్పామ్, మామిడి, జామ, కంద, పసుపు, బొప్పాయి, నిమ్మ, తమలపాకులు, జీడిమామిడి వంటి వాణిజ్య, ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3 లక్షల మంది జీవిస్తున్నారు. జిల్లా నుంచి వివిధ వాణిజ్య, ఉద్యాన పంట ఉత్పత్తులు రాష్ట్రం నలుమూలలతో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్,ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూంటాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంటకూ ముందుగానే గిట్టుబాటు ధర నిర్ణయించి, పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు ప్రారంభించేవారు. నేడు అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.మామిడి జిల్లాలో 5,500 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. ఈ ఏడాది దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభించలేదు. రకాన్ని బట్టి టన్నుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలు మాత్రమే ధర లభించింది, గత ప్రభుత్వంలో ఇదే పంటకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ ధర లభించింది. మొక్కజొన్న జిల్లావ్యాప్తంగా 1,500 హెక్టార్లలో మొక్కజొన్న ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేస్తారు. దీనికి గరప, ఎర్రరేగడి నేలలు అనుకూలం. అందుకే, ఈ పంటను ఎక్కుగా లంకల్లో వేస్తారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,600 ధర పలకగా, ఈ ఏడాది రూ.2,200 మాత్రమే దక్కుతోంది. దొండ కూరగాయల పంటల్లో అత్యధికంగా సాగు చేసే పంట దొండ. జిల్లావ్యాప్తంగా 400 హెక్టార్లలో దొండ సాగు ఉంది. సుమారు 4 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి దొండ రైతుకు ఈ ఏడాది చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం రైతుకు కిలోకు రూ.5 మాత్రమే లభిస్తోంది.వరి ఈ ఏడాది ఖరీఫ్ వరి రైతుకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ప్రకృతి విపత్తులకు ఎదురీది సాగు చేసినా.. దిగుబడుల్లో నష్టాలు చవి చూస్తున్నా గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రభుత్వం 75 కేజీల బస్తాకు సుమారు రూ.1,780 మద్దతు ధర ప్రకటించినా తేమ శాతంతో పాటు సవాలక్ష ఆంక్షలు విధించింది. దీంతో, మరో మార్గం లేక రైతులు ధాన్యాన్ని దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. దొరికిందే చాన్సు అన్నట్టుగా దళారులు చేల వద్దకు వచ్చి రూ.300 నుంచి రూ.400 వరకూ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.కొబ్బరి జిల్లావ్యాప్తంగా 8,050 హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇక్కడి నుంచి నిత్యం 50 లారీల వరకూ కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఒక్కో చెట్టు నుంచి ఏటా 150 నుంచి 175 కాయల దిగుబడి వస్తుంది. ఎకరానికి 75 చెట్లు వేస్తారు. ఈ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు, కోకో, పూల సాగు వంటివి చేపడుతూ, అదనపు ఆదాయం పొందుతారు. ఈ పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన దింపు, ఎగుమతి, దిగుమతి కూలీలు, ఒలుపు కారి్మకులు, వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్లో కుంభమేళా సందర్భంగా ఎక్కడ లేని డిమాండూ వచ్చి వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. ఇది రెండు నెలలుగా తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం రూ.8 వేలకు పడిపోయింది. కోకో జిల్లాలోని 5,517 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోంది. దీనిపై ఆధారపడిన వారు 10 వేల మంది ఉన్నారు. ఈ పంటను చిన్న పిల్లల్లా సాకాలి. తెగుళ్లను తట్టుకోలేవు. నీడ పట్టున పెంచాలి. అందుకే, దీనిని కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తారు. చాక్లెట్ల తయారీలో వాడే కోకో గింజలకు మంచి డిమాండ్ ఉన్నా ఈ ఏడాది తయారీ కంపెనీలు సిండికేట్గా ఏర్పడి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిలో గింజల ధర రూ.1,050 ఉంటే నేడు రూ.350కి పడిపోయింది.అరటి జిల్లావ్యాప్తంగా అరటి సాగు 7,500 హెక్టార్లలో ఉంది. చక్కెరకేళీ, కూర అరటి (బొంత), ఎర్ర చక్కెరకేళీ, అమృతపాణి, కర్పూరం రకాలను ఇక్కడి రైతులు పండిస్తూంటారు. జిల్లా నుంచి నిత్యం 40 లారీల్లో అరటి గెలలు వివిధ ప్రాంతాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మే నెలలో 10 టన్నుల లారీ ధర రూ.2 లక్షలు పలికింది. అది కాస్తా నేడు రూ.40 వేలకు పడిపోయింది. గెలలను కొనే నాథుడు లేక అరటి రైతులు అల్లాడిపోతున్నారు. ఈ పంటపై ఆధారపడి రైతులతో పాటు నిత్యం కూలి పనులు చేసుకుంటూ సుమారు 12 వేల మంది జీవిస్తున్నారు. జామ పేదల యాపిల్గా పేరొందిన పండు జామ. దీనిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. జిల్లాలోని 300 హెక్టార్లలో జామ సాగు ఉంది. ఇక్కడి రైతులు వివిధ దేశవాళీ రకాలతో పాటు కేజీ జామ, తైవాన్ జామ కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటపై వ్యాపారులు, కూలీలు కలిపి నిత్యం 3 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జామ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల వద్ద నుంచి వ్యాపారులు కిలో రూ.20 నుంచి రూ.25కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కిలోకు రైతుకు రూ.50 వరకూ దక్కేది.తీవ్ర నష్టాలు అరటి పంట తీవ్ర నష్టాలు మిగిల్చింది. తోటలు అమ్మినప్పుడు మంచి ధర లభించింది. నేడు మార్కెట్లో ధరలు పతనమవడంతో వ్యాపారులు సగానికి సగం కోత పెడుతున్నారు. దీంతో, మేం నష్టపోవాల్సి వచ్చింది. అసలు తోటలు కొనుగోలు చేయటానికే ఎవరూ రావటం లేదు. – వాకలపూడి గాం«దీ, అరటి రైతు, కానూరుకొబ్బరి ధర పతనం కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రెండు నెలలు క్రితం వెయ్యి కాయల ధర రూ.32 వేలు పలికితే నేడు రూ.8 వేలు ఉంది. అంటే వెయ్యి కాయలకు రూ.24 వేల మేర ధర పతనమైంది. – పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు, కొబ్బరి రైతు, ఖండవల్లి ఇంత దారుణం ఎప్పుడూ లేదు కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారులు సిండ్కేట్గా మారి ధరలు తగ్గించారు. గతం ప్రభుత్వంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.350 లభిస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – వాకలపూడి సూర్యారావు, కోకో రైతు, కానూరుప్రభుత్వమే ఆదుకోవాలి క్వింటాల్ మొక్కజొన్న గింజలకు గత ఏడాది ధర రూ.2,600 ఉంటే నేడు రూ.2,200కు పడిపోయింది. దీంతో ఆర్థికంగా నష్టపోయాం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులను ఆదుకోవలసింది ప్రభుత్వమే. – కంటిపూడి సూర్యనారాయణ, మొక్కజొన్న రైతు, తీపర్రు -
చి'వరి'కి మిగిలింది ఇదే బాబూ..!
పల్లెకోన(భట్టిప్రోలు): ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో మంగళవారం రైతులతో కలసి అశోక్బాబు వినూత్నంగా నిరసన తెలిపారు. ‘దళారుల వ్యవస్థను అడ్డుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం... మద్దతు ధరకు ధాన్యం కొనడంలో విఫలం... పంటలకు బీమా చేయకుండా నిర్లక్ష్యం... రైతులకు యూరియా, కోతయంత్రాలను, టార్పాలిన్లను సరఫరా చేయడంలో వైఫల్యం... కులం, పార్టీలను పట్టించుకోకుండా రైతును రైతుగా చూడకపోవడం...’ అనే ఐదు రకాల పాడెలను కట్టి వాటిపై ధాన్యం బస్తాలు పెట్టి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆ పాడెల చుట్టూ అశోక్బాబు తిరిగి తలకొరివి పెట్టారు. ఆ తర్వాత ఆయన రోడ్డుపై స్నానం చేశారు. అశోక్బాబు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని చెప్పారు. -
ఏడాదిన్నరలోనే బాబు చేసిన అప్పు రూ.2,66,175 కోట్లు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జేటేతర అప్పుల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపల చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.1,54,880 కోట్లకు చేరాయి. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,11,295 కోట్ల అప్పులు చేసింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం రూ.71,295 కోట్ల అప్పు చేసింది. అలాగే రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(ఎన్ఏబీఎఫ్ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) నుంచి ఏకంగా రూ.40,000 కోట్ల అప్పు చేసింది. ఆస్తులను సైతం ప్రైవేటుకు కట్టబెడుతూ..బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బడ్జెట్ అప్పు(రూ.కోట్లలో)2024–25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,597 2025–26 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 67,283నవంబర్ 4వ తేదీ (ఆర్బీఐ ప్రకారం) 3,000డిసెంబర్ 2వ తేదీ (ఆర్బీఐ ప్రకారం) 3,000మొత్తం 1,54,880బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా బాబు సర్కారు అప్పులు (రూ.కోట్లలో)పౌరసరఫరాల సంస్థ 7,000మార్క్ఫెడ్ 18,700ఏపీఐఐసీ 8,500ఏపీఎండీసీ 9,000ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా.. 5,473 నాబార్డు నుంచి డిస్కంలకు 3,762మొత్తం 71,295రాజధాని కోసం చేసిన అప్పులు(రూ.కోట్లలో)ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15,000హడ్కో 11,0జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000ఎన్ఏబీఎఫ్ఐడీ 7,500ఏపీపీఎఫ్సీఎల్ 1,500మొత్తం 40,000 -
రాజధానిలో రెండో విడత భూసమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడతలో 20,494.87 ఎకరాల భూసమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల్లో 16,562.56 ఎకరాలు పట్టా, 104.01 ఎకరాల అసైన్డ్ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరించనుంది. మంత్రుల బృందం(జీవోఎం) 21వ సమావేశం మినిట్స్ ప్రకారం ఆ భూములను ఏపీ సీఆర్డీఏ చట్టం సెక్షన్–55(2) ప్రకారం రైతుల నుంచి సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలతోపాటు 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్డీఏ కమిషనర్ సమీకరించనున్నారు. అంటే.. రెండో విడత భూసమీకరణలో మొత్తం 20,494.87 ఎకరాల భూమిని సీఆర్డీఏ సమీకరించనుంది. రాజధానిలో రెండో విడత భూసమీకరణకు జూన్ 24న రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తొలుత గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 11 గ్రామాల్లో 44,676.44 ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.తొలుత ఏడు గ్రామాల పరిధిలో 20,494.87 ఎకరాల సమీకరణకు గత నెల 28న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడత భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు జూలై 1న జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం పేర్కొంది. భూసమీకరణ ఇలా...ప్రస్తుతం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పట్టాభూమి 1,965 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1,395.48 ఎకరాలు, పెదమద్దూరులో పట్టా భూమి 1,018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, యండ్రాయిలో పట్టా భూమి 1,879 ఎకరాలు, అసైన్డ్ భూమి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, కర్లపూడి లేమల్లెలో పట్టా భూమి 2,603 ఎకరాలు, అసైన్డ్ భూమి 51 ఎకరాలు, ప్రభుత్వ భూమి 290.75 ఎకరాలను సమీకరిస్తారు.అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పట్టా భూమి 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72, ప్రభుత్వ భూమి 168.86, హరిశ్చంద్రాపురంలో పట్టా భూమి 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 977.87 ఎకరాలు, పెదపరిమిలో పట్టా భూమి 5,886.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 627.34 ఎకరాలను సమీకరిస్తారు. -
అమరావతి నాడు ఇంటర్నేషనల్.. నేడు.. మున్సిపాల్టీ!
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిలో అత్యద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తానంటూ 2014 నుంచి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చే వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే నమ్మబలికారు! కానీ ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ వితండ వాదనకు తెరతీశారు. నాడు ఇంటర్నేషనల్ సిటీ అంటూ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు మున్సిపాల్టీ అంటూ బీద అరుపులు అరవడమేమిటని మేధావులే కాదు.. రాజధాని రైతులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాడే ఈ మాట చెప్పి ఉంటే.. అసలు రాజధానికి భూములు ఇచ్చేవాళ్లమే కాదని రైతులు మండిపడుతున్నారు. భూములిచ్చి 11 ఏళ్లవుతున్నా.. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు రెండో విడత అంటూ 20,494.87 ఎకరాల భూసమీకరణకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు రగిలిపోతున్నారు. రెండో విడతలో సమీకరించే భూములను ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో తక్కువ ధరకు బినామీలు, సన్నిహితులకు కట్టబెట్టేసి.. ఇప్పటికే తొలి విడతలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..?సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానంటూ 2014లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధాని ఏర్పాటుపై బినామీలు, సన్నిహితులకు లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భారీ ఎత్తున భూములు కాజేశారు. ఆ తర్వాత రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ) రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రచించారు. ఆ పరిధిలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియం ‘సుర్బానా–జురాంగ్’లకు రూ.28.96 కోట్లు చెల్లించి 2015–16లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్తో ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో రాష్ట్రానికి అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ నాడు చంద్రబాబు నమ్మబలికారు. మన ఇంజనీర్ల మాస్టర్ ప్లాన్తో నిర్మిస్తే అవి మురికివాడలుగా మారుతాయంటూ మన రాష్ట్ర, దేశ ఇంజనీర్లను అప్పట్లో అవమానించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్తో 53,748 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు 2014 నుంచి చెబుతూ వచ్చారు. తాజాగా 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది అంటూ కాడి పారేశారు! అంటే.. మరి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధాని విషయంలోనూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ దాగుడుమూతలాడుతున్నారని మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్కు రాజధాని ముసుగు..!ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న 53,748 ఎకరాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఇతర అవసరాలు పోనూ ప్రభుత్వం వద్ద ఇంకా 8,274 ఎకరాలు మిగులు భూమి ఉందని 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబే వెల్లడించారు. ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీతోపాటు స్మార్ట్ ఇండస్ట్రీస్కు ఆ భూమి సరిపోతుందని నిపుణులు, రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో సమీకరించిన భూముల్లోనే ఇప్పటికీ రాజధాని పనులు ప్రాథమిక దశ దాటలేదని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు నేటికీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఆ పనులను 2036 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకుకు చెబుతోందని పేర్కొంటున్నారు. రాజధాని నిర్మించడమంటే నగరం నిర్మించడం కాదని.. పరిపాలన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని.. ఆ తర్వాత తనకు తానుగానే నగరంగా రూపుదిద్దుకుంటుందని.. హైదరాబాద్ అందుకు నిదర్శనమని నిపుణులు స్పష్టం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలు, సన్నిహితులతో కలిసి కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారని విశ్లేషిస్తున్నారు.ఐఎంజీ భారత్, బిల్లీ రావు తరహా బినామీలను ముందు పెట్టి.. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధి ముసుగులో ఊరూ పేరులేని ఐఎంజీ భారత్ అనే సంస్థ ముసుగులో బిల్లీరావుకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలు, శంషాబాద్కు సమీపంలో 450 ఎకరాలు కేటాయించేశారు. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో స్టేడియంలు, క్రీడా మైదానాలను బిల్లీరావుకు 45 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేసి వాటి నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. నాడు చంద్రబాబు భూకుంభకోణానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చెక్ పడింది. ఇప్పుడు అదే రీతిలో అమరావతిలో మరో భూకుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. రాజధాని తొలి విడత, రెండో విడతలో సమీకరించే భూముల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం పేరుతో 5 వేల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు పేరుతో మరో 2,500 ఎకరాలను బిల్లీరావు లాంటి సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
ప్రైవేటుకు కాలేజీలు.. అప్పనంగా ఆస్పత్రులూ..
నిన్న...ప్రభుత్వ భూమిలో... ప్రభుత్వ డబ్బుతో... వైఎస్సార్సీపీ సర్కారులో వైఎస్ జగన్ నిరి్మంచిన వైద్య కళాశాలలను పప్పుబెల్లాల తరహాలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేసింది. మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టింది. పేదలకు ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసింది.నేడు..చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది. ప్రభుత్వ డబ్బులతో నిరి్మంచిన నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పబోతోంది. కొసమెరుపు ఏంటంటే... ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు గంపగుత్తగా ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పజెప్పడమే కాకుండా.. ఈ రెండేళ్లు పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందట. అంటే... ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టి, ప్రభుత్వ ఆస్పత్రిని, దానిలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతోంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమూ చేయని రీతిలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. సాక్షి, అమరావతి: సంపద సృష్టి హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు... పచ్చపార్టీ కార్పొరేట్లు, అస్మదీయులు, బంధుమిత్రులకు ప్రజా సంపదను దోచిపెట్టడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్నారు. భూమి ప్రభుత్వానిది, మెడికల్ కాలేజీ ప్రభుత్వానిది, ఆస్పత్రులు ప్రభుత్వానివి, అక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని హోల్సేల్గా ప్రైవేటుకు అప్పజెప్పడమే కాక రెండేళ్ల పాటు వారి జీతాలను ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధమైంది. తద్వారా జీతభత్యాల రూపేణానే వందల కోట్ల రూపాయిలను అప్పనంగా ప్రైవేటు వారికి దోచిపెడుతోంది. జగన్ శ్రీకారం.. చంద్రబాబు బేరం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో కొత్తగా 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టగా గత ప్రభుత్వంలోనే ఐదు కళాశాలలు ప్రారంభమై తరగతులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు 10 వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలను కైవసం చేసుకునే ప్రైవేట్కు ధారాదత్తం చేసింది. ఇది చాలదన్నట్లు వాళ్లకు ప్రభుత్వ ఆస్పత్రులను రెండేళ్ల పాటు అప్పగించనుంది. వాటిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అధికారికంగా దోచిపెడుతోంది. ఆర్ఎఫ్పీకి సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇప్పటికే రూ.కోట్ల విలువైన భూములను ఎకరానికి రూ.వంద లీజు, వైద్య సేవలకు రుసుములు, ప్రైవేట్ కళాశాలల మాదిరి వైద్య విద్యార్థుల నుంచి ఫీజు వసూలుతో ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు తలపెట్టడానికి బాబు సర్కారు సిద్ధమైంది. ఇదికూడా సరిపోనట్లుగా ప్రైవేట్ వ్యక్తులకు మరింత లబ్ధి చేకూరుస్తూ ఖజానా నుంచి ఏకంగా రూ.వందల కోట్లపైనే ప్రయోజనం చేకూర్చే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)కు సవరణలు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అత్యాధునిక పరికరాలు, పోస్టులు భర్తీ చేసిన జగన్ సర్కారు.. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రైవేట్కు ఇస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లు పిలిచింది. వీటిలో పులివెందుల వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. మిగతా మూడుచోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను 300 పైగా పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. పులివెందుల కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులను ప్రారంభించడానికి ఎన్ఎంసీ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. కానీ, బాబు సర్కారు కళాశాలకు సీట్లు వద్దని లేఖ రాసి రద్దు చేయించింది. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్లగ్ అండ్ ప్లే తరహాలో నాలుగు కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఒక కొత్త వైద్య కళాశాలను స్థాపించాలంటే 25 ఎకరాల భూమి సమకూర్చుకోవాలి. కనీసం 320 పడకల బోధనాస్పత్రిని అభివృద్ధి చేశాక... ఎన్ఎంసీకి దరఖాస్తు చేసి ఓపీ, ఐపీ, సర్జరీలు, ఇతర సేవల్లో నిర్దేశించిన ప్రమాణాలను అధిగమించాకే నెలకొల్పే అర్హత వస్తుంది. ఇది ఎంతో ఖర్చు, ప్రయాసలతో కూడినది. దీనంతటికీ రూ.వందల కోట్ల పెట్టుబడి పెట్టి, సుమారు ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వ్యయ ప్రయాసలేమీ లేకుండా తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్కు ఇచ్చేసింది. దాంతో ఆగకుండా మరింత బరితెగించి ఆస్పత్రులను ఇచ్చేసి, అక్కడి పనిచేసే వైద్య సిబ్బందికి జీతాలను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 800 మంది వైద్య సిబ్బంది నాలుగు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 800 మంది మేర వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్లలో కళాశాలలను కైవసం చేసుకున్న ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆస్పత్రులు పెట్టి, వైద్యులు, సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లించబోతోంది. అంటే, రూ.వందల కోట్లపైగా ప్రజాధనాన్ని జీతాల రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు చేయబోతోంది. గోరంత ప్రభుత్వానికి ఇస్తే చాలు భవిష్యత్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ వంటి అనుబంధ వైద్య విద్య కళాశాలలు మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఇచి్చంది. ప్రతిఫలంగా వచ్చే ఆదాయం నుంచి ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి 3 శాతం ఇవ్వాలని ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి తొలుత మెడికల్, నర్సింగ్, అనంతరం డెంటల్, ఆయుష్ వంటి ఇతర కళాశాలలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వైఎస్ జగన్ హయాంలో కళాశాలలకు భూములను కేటాయించారు. ఇప్పుడా భూములన్నింటినీ నామమాత్రం లీజు ధరలతో ప్రైవేట్కు కట్టబెట్టేయడమే కాకుండా అనుబంధ కళాశాలలు ఏర్పాటు చేసుకుని లాభాలు గడించడానికి బాబు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. పీపీపీలో వైద్య కళాశాలల అభివృద్ధిలో ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులపై ఎలాటి భారం ఉండదంటూ చంద్రబాబు, మంత్రులు తేనె పూసిన కత్తిలాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులకు నష్టం తలపెడుతూ ప్రైవేట్ వ్యక్తులకు లాభాల పంట పండించేలా పీపీపీ విధానం రూపొందించారు. ఈ కళాశాలల్లో... మిగతా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులు ఉంటాయని సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. కోటి సంతకాలతో కలమెత్తి..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునకు అపూర్వ స్పందన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థుల నుంచి స్వచ్ఛందంగా మద్దతు మేధావులు, తల్లిదండ్రులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంతకాలుప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ, వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచి్చన కోటి సంతకాల సేకరణ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. రూ.లక్షల కోట్ల విలువైన సంపద లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన సన్నిహితులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టడంపై వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పేదలు వైద్యం కోసం వెళ్లిన క్రమంలో ప్రైవేటు దోపిడీకి బలికాకుండా అరికట్టి సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు పలికి పెద్దఎత్తున పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీల్లో ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేశారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలంటూ చంద్రబాబు సర్కార్పై సమరభేరి మోగించారు. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరాకాష్టకు చేరిన చంద్రబాబు సర్కారు అవినీతికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కనీ్వనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు కాలదన్నడాన్ని వివరించింది. కాగా, కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాల సేకరణలో భాగమయ్యారు. ఇది ఒక మహోద్యమంగా రూపాంతరం చెందడంతో బాబు ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి దిగింది. నిరసన ర్యాలీల్లో పాల్గొనొద్దని, కేసులు పెడతామని వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల చేత నోటీసులిప్పించింది. అయినా నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు గళం విప్పాయి. -
కూటమి సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్ఆర్సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియా:రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్ఆర్సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:బంద్కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్ 2న నెల్లూరు బంద్కు టీడీపీ, వైయస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు లేవు.ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్కు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి (మంగళవారం) బంద్ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనకా తప్పడం లేదు.చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.మొంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.దారుణంగా పడిపోయిన ధరలు:మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. -
కేసులు ఎదుర్కొనే ధైర్యం లేక.. చంద్రబాబు అడ్డదారులు: బొత్స
సాక్షి, విజయవాడ: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘ఆ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించు కునేలాచేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు.’’ అని బొత్స మండిపడ్డారు.‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే. అదే ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
Kakani: కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో హత్యలు పెరిగాయి
-
Perni Nani: చంద్రబాబు అనైతిక రాజకీయాల్లో భాగంగానే ఎమ్మెల్సీల రాజీనామాలు
-
రాజకీయాల్లో చంద్రబాబు వింత పోకడ: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు. -
చంద్రబాబు డబల్ యాక్షన్ ఆయనే సీఎం, ఆయనే నిందితుడు
-
‘అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప బాబు చేసిందేమీ లేదు’
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి సర్కార్ పోకడలు చూస్తే.. ఇది ప్రజాస్వామ్యమా? అనిపిస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు’ అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గత చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని 2023లో సీఐడీ కేసు పెట్టింది. ఇప్పుడు అదే సీఐడీ అధికారులు ఈ కేసుకు, మాకు సంబంధం లేదని వాంగూల్మం ఇచ్చారు. చంద్రబాబు తన మీద కేసును తానే విచారించుకుని.. తానే తీర్పు ఇచ్చేస్తున్నాడు. క్యాబినెట్ తీర్మానం.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మద్యం విషయంలో అప్పట్లో నిర్ణయాలు జరిగాయి. తన మీద కేసును ఆయనే కొట్టేసుకుంటున్నారు...నిజంగా చంద్రబాబు నిరాపరాధి అయితే.. ఈ కేసును ఎందుకు కోర్టు ద్వారా విచారించుకోవడం లేదు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు పోరాటం.. ఆరాటం ఎందుకు జరుగుతుంది?. ప్రభుత్వ సొమ్ముతో సిద్దార్ధ లూథ్రా అనే న్యాయవాధికి ఫీజులు ఇచ్చి కేసులు వాదించుకుంటున్నాడు. చంద్రబాబు హయం లో స్కిల్ స్కామ్, ఇన్నర్ రోడ్డు వంటి పలు కేసులు ఉన్నాయి...చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది. ఒక అరటిపండు అర్ధ రూపాయికి అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించింది. వైఎస్ జగన్ హయంలో టన్ను అరటి రూ.25 వేలకు అమ్ముడు పోయింది. చంద్రబాబు రియల్ ఇంటిలెన్స్ ఏమైపోయింది?. చౌకగా వైజాగ్లో భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. గత 18 నెలల కాలంలో కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
Farmers: ఇది చాలదా ఈ ప్రభుత్వం గురించి చెప్పడానికి
-
అమరావతికి రెండో విడత భూ సమీకరణ
సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్డీఏ(CRDA) కమిషనర్కు అప్పగించింది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది.రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన సీఎం చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు.మరోవైపు, మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ వ్యాఖ్యలు.. చంద్రబాబు స్పందించాలి: పొన్నం
సాక్షి, సిద్ధిపేట: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు. తెలంగాణ తుపానులో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఏపీని తప్పుపట్టడం లేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్.. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా? లేక అవివేకా? అని ప్రశ్నించారు. ..మిత్రపక్షానికి బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నాను. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడటం దురదృష్టకరం. ఏపీలో తుఫాను వస్తే మా హుస్నాబాద్ మునిగింది.. మేము ఏపీ ప్రజలను తప్పు పట్టడం లేదు. అది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం. వెంటనే పవన్ తన మాటలు ఉప సంహరించుకోవాలి.. క్షమాపణలు కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడవద్దు.. విజ్ఞతగా వ్యవహరించాలి. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. ఏపీ, తెలంగాణ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి.. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలితెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు..తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టడం లేదు..ఎక్కడో కోనసీమ లో కొబ్బరి… pic.twitter.com/CEI7fldwq6— Ponnam Prabhakar (@Ponnam_INC) December 2, 2025 -
సంచలనం రేపుతోన్న వైఎస్ జగన్ ట్వీట్
-
రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కిన పాలనే ఇది
భారత రాజ్యాంగం ఎంత గొప్పదో తెలిపే భారీ ప్రసంగాలు ఒకవైపు, అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వైనం మరో వైపు ... ఇవి పరస్పర విరుద్దం అయినప్పటికీ, మన పాలకులు అతి చాకచక్యంగా రెండిటిని ఏక కాలంలో చేయగలుగుతున్నారు. అప్పుడప్పుడూ న్యాయ వ్యవస్థ చెక్ పెడుతున్నప్పటికీ, దానిని అతిక్రమించి రాజ్యాంగాన్ని ,తద్వారా ఏర్పడిన చట్టాలను పలుమార్లు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరికొత్త రికార్డులను సాదిస్తోందన్న భావన న్యాయ కోవిదులలో కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందంటూ ఒక కల్పిత కథను సృష్టించి, అందులో పలువురిని ఇరికిస్తూ అరెస్టులు చేయడం, వారికి బెయిల్ వస్తే కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పెద్ద,పెద్ద లాయర్లను పెట్టి వారిని తిరిగి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న తీరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు పై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుకార్చడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టులలో అఫిడవిట్లు వేయిస్తున్న పద్దతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్దులతో మాక్ అసెంబ్లీ నిర్వంచి చంద్రబాబు ,ఆయన కుమారుడు మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కాని చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా?లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్కునే ప్రమాణికంగా తీసుకుంటున్నారన్న అబిప్రాయం సర్వత్రా ఉంది. దానిని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు.అదే సమయంలో చంద్రబాబు పై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుకార్చడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టులలో అఫిడవిట్లు వేయిస్తున్న పద్దతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్దులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి చంద్రబాబు ,ఆయన కుమారుడు మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కాని చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా?లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్కునే ప్రమాణికంగా తీసుకుంటున్నారన్న అబిప్రాయం సర్వత్రా ఉంది.దానిని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు. మద్యం కేసులో రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి దనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రైవేటు కంపెనీలో పనిచేసే బాలాజి గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కేసు విచారణను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయలేదన్న భావనతో వీరికి కోర్టు బెయిల్ ఇస్తే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి దానిని రద్దు చేయించాలని పిటిషన్ వేసింది.దానిపై హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలని, అందువల్ల కోర్టులో తిరిగి లొంిపోవాలని వీరిని ఆదేశించింది. ఆ మీదట వారు సుప్రింకోర్టును ఆశ్రయిస్తే వారికి డిపాల్ట్ బెయిల్ కొనసాగిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించింది.నిదితులను సుదీర్గకాలం కస్టడీలో ఉంచి ఏమి సాధిస్తారని సుప్రింకోర్టు చీప్ జస్టిస్ సూర్యకాంత్ ఆద్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది.200 మంది సాక్ష్యులను విచారించాలని ప్రభుత్వం చెబుతోందని, ఎంత కాలం ఈ విచారణ సాగుతుందని కోర్టు అడిగింది. దీనికి సిట్ తరపు లాయర్లు జవాబు ఇచ్చే అవకాశం ఉందా?ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో లోక్ సభ సభ్యుడు మిదున్ రెడ్డికి ,మరొకరికి ఇదే కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఆదారాలు ఎక్కడ అని ప్రశ్నించింది.దానిపై కోపం వచ్చిన ప్రభుత్వ తరపు ఢిల్లీ న్యాయవాది ఒకరు ఏకంగా ఆ జడ్జిని బదిలీచేయిస్తామని వ్యాఖ్యానించి బెదిరించారని వార్తలు వచ్చాయి.అయినా నిందితులకు బెయిల్ రానివ్వకుండా ఏదో సాకు చూపుతూ ప్రభుత్వం అడ్డుపడుతున్నదన్న సంగతి అందరికి అర్ధం అవుతూనే ఉంది.ఇదంతా రాజ్యాంగ సమ్మతంగా కనిపిస్తుందా?నిర్టిష్ట ఆధారాలు చూపి కేసు పెడితే ఎవరూ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు జరిగాయా?లేదా?ఆ వెంటనే పోలీసులు కేసులు పెట్టడం నిత్యంచూస్తూనే ఉన్నాం. ఈ కేసులో హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల నగదు దొరికిందని పోలీసులు కోర్టుకు చెప్పిన తర్వాత, వాటి నెంబర్లతో సహా వీడియో రికార్డు చేయాలని రాజ్ కెసిరెడ్డి కోరగానే పోలీసులు వెంటనే ఆ డబ్బును బ్యాంకులో జమ చేయడం ఏమిటి?అలాగే వెంకటేష్ అనే మరో నిందితుడి ఫోన్ లో డబ్బుల డంప్ వీడియో,ఫోటో దొరికిందంటూ ఎందుకు లీక్ ఇచ్చారు. తర్వాత ఆసలు పోన్ ను ఓపెన్ చేయలేదని ఎందుకు కోర్టుకు చెప్పారు. ఇవన్ని చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు చేతిలోకి తీసుకున్నట్లు అనిపించదా? 3500 కోట్ల రూపాయల ముడుపులను ఇచ్చినట్లు ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయకపోయినా దారిపోయే వ్యక్తి తో లెటర్ రాయించి ఇలా కక్ష అరెస్ట చేయిస్తున్నారా?లేదా? పోనీ ఇదే ప్రామాణికం అయితే గతంలో చంద్రబాబు తదతరుల మీద వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ రాజ్యాంగం ప్రకారం నైతికంగా కరెక్టు అవుతాయి.ఉదాహరణకు అప్పట్లో స్కిల్ స్కామ్ , ఇసుక, మద్యం, అస్సైన్డ్ భూములు, అమరావతి ఇన్న్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి కేసులను నీరుకార్చుతున్న వ్యవహారంపై వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అప్పట్లో ఈ కేసులో సాక్ష్యాదారాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులతోనే ,ఆధారాలు లేవని అఫిడవిట్లు వేయిస్తున్నారట.ఉదాహరణకు మద్యం స్కామ్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి, అమరావతి కేసుల్లో ఫిర్యాదు చేసిన ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ , ఫైబర్ నెట్ అవినీతి కేసులో కంప్లెయింట్ చేసిన మధుసూదన రెడ్డిలను భయపెట్టి ,లేదా ప్రలోభపెట్టో ఆ కేసులపై వ్యతిరేకంగా అఫిడవిట్ లు వేయిస్తున్నారు.ఇది ఏ రాజ్యాంగం, చట్టం అనుమతిస్తుంది?అసలు విచారణ పూర్తి కాకుండానే అధికారం ఉంది కనుక వాటి నుంచి బయటపడడానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నాలపై న్యాయపోరాటం చేస్తామని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చెబుతున్నారు. ఇది లీగల్ పైట్ కు సంబందించిన విషయం కాదు.ప్రభుత్వం నడిపేవారు పాటించవలసిన విలువలకు సంబంధించినవని చెప్పాలి.తనపై వచ్చిన రోఉపణలను తనే క్లియర్ చేసుకోవడం నైతికంగా సమర్ధనీయమేనా? ఏపీలో తప్ప,దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఇలా జరుగుతోందా?వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య పై ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటికి రెండుసార్లు ఆరోపణలు చేయవచ్చా? విసుగుచెందిన ఆ అధికారి ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపితే దానికి జవాబు ఇవ్వకుండా, అతని ఉద్యోగం పీకేస్తారా? శంకరయ్య పోలీసు శాఖకు కళంకం తెచ్చారని ఇలా చేశారట. అంటే పౌరునిగా తన హక్కు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కళంకం పేరుతో ఉద్యోగం తీసిస్తేరా? నిండు చట్టసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబితే మాత్రంం ప్రజాస్వామ్యానికి కళంకం రాదన్నమాట.దానిపై ఎవరూ మాట్లాడకూడదన్నమాట.శంకరయ్య చేసిన ఆరోపణలకు ప్రభుత్వం జవాబు ఇవ్వలేకపోయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ విచారణకు హాజరుకాకుండా, అమెరికా పంపించివేసి, కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక అతనికి బకాయిలతో సహా జీతాలు చెల్లించడం ఏ రకంగా సమంజసం అవుతుంది. అలాగే సోషల్ మీడియా పోస్టుల కేసుల పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం మాటేమిటి? నిజంగా తప్పుగా పోస్టులు పెడితే ఎవరూ కాదనరు. తెలుగుదేశం, జనసేనలకు చెందినవారు ఎలాంటి దిక్కుమాలిన పోస్టులు పెట్టినా,వాఖ్యలు చేసినా కేసులు ఉండవా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కోపంతో వైసిపి అధికార ప్రతినిది కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేస్తే గౌరవ న్యాయస్థానం రిమాండ్ను తిరస్కరించిందే. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పట్టుబడిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఎలా ఇరికించారు?అసలు పాత్రధారులన్న అనుమానం ఉన్న టిడిపి నేతలపై కేసే ఎందుకు పెట్టలేదు?ఇంకా చిత్రమేమిటంటే ఏపీలో ఆయా ఘటనలలో బాదితులపైనే కేసులు పెట్టే సన్నివేశాలు చూస్తున్నాం.అందువల్లే హిందుపూర్ లో ఒక అధికారి తాను తప్పుడు కేసు పెడుతున్నానని క్షమించాలదని సంబంధిత వ్యక్తికే ఫోన్ చేసి చెప్పారు. దానిని బట్టే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం రాజ్యాంగ విలువలను పాటించడం లేదన్న సంగతి తేటతెల్లమవుతుంది కదా!అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు నాయుడా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేషా?రెడ్ బుక్ పేరుతో లోకేష్ కు చెందిన ఒక టీమ్ జరుపుతున్న అరాచకాలను ఏ రాజ్యాంగం అనుమతిస్తుంది. పైగా పలువురు పోలీసులకు రాజ్యాంగం తెలియదని లోకేష్ తన యువగళంలో తెలుసుకున్నారట. రెడ్ బుక్కే రాజ్యాంగమని తెలుసుకుని మసలుకోకపోతే పోలీస్ అధికారులనే శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికే కాదు.ఆయన విగ్రహం ఉన్న స్త్మతి వనానికి కూడా గౌరవం ఇవ్వడం లేదు. ఎంత దురదృష్టం! ఇలాంటి ప్రభుత్వాన్నా ఏపీ ప్రజలు కోరుకున్నది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు!
సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితి తెలుపుతూనే.. సేవ్ ఏపీ ఫార్మర్స్ (#SaveAPFarmers) పేరుతో సదీర్ఘమైన పోస్ట్ ఒకటి ఉంచారాయన. ఈ ఉదయం మరోసారి ఆ ట్వీట్ సారాంశాన్ని తెలుగులో ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు.కిలో అరటిపండ్లను రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే!. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపండ్లు చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే.. చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఏపీ అన్నదాతలు అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి!ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే!అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు… https://t.co/6HVqS4Wk1N— YS Jagan Mohan Reddy (@ysjagan) December 2, 2025జగన్ ట్వీట్తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా జగన్ ప్రెస్మీట్ పెట్టినా.. ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయడం టీడీపీ అండ్ కోకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం, పైగా కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు.. అవి వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థంకాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. 📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
వరి వేస్తే కొనేవారే ఉండరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘వరి పంట వేస్తే.. కొనేవారే ఉండరు. ఒక పంట తప్పదు కాబట్టి వరి వేద్దాం.. మరో పంట మారుద్దాం. మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు సూచించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో సోమవారం జరిగిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. వరి వల్ల షుగర్ (డయాబెటిస్) వస్తుందన్నారు. రైతులు వాణిజ్యపంటల వైపు మరలాలని పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. మహిళలు గంజాయి అమ్మకాల్లో లేడీ డాన్లుగా మారారు మహిళలు గంజాయికి బానిసలవుతున్నారని, ఆడవారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారని, లేడీ డాన్లుగా మారారని పేర్కొన్నారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన చెప్పారు. -
కేసులను ఎదుర్కొనే దమ్ములేక మూసేయించుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల కుంభకోణం కేసు, తాజాగా మద్యం కుంభకోణం కేసును మూసేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంలలో ఇరికించి.. భయపెట్టి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితో కూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.దర్యాప్తు సంస్థలు సైతం కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అత్యంత దుర్మార్గమన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి అధికార దుర్వినియోగాన్ని చూడలేదన్నారు. తక్షణమే చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువరించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని కూడా బొత్స హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు..కుట్రపూరితమే..‘ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు. వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటే. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు కూడా పంపింది.ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. ఇవికాక అసైన్డ్ ల్యాండ్ కేసు, అమరావతి రింగ్రోడ్డు అలైన్మెంట్ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్ నెట్లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ధోరణిని సహించబోము’ అని బొత్స స్పష్టం చేశారు. -
చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: ప్రకటన ఆర్భాటం... ఆచరణ అధ్వానం..! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలు తీరు. ఈ కోవలోనే ‘రైతన్నా మీ కోసం’ అంటూ హడావుడి చేశారు. కానీ, హామీల ఎగవేత తప్ప ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోవడం, అన్నదాత సుఖీభవ అంటూ దగా చేయడం, విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలేయడంతో తొలిరోజే అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో రెండో రోజు నుంచే మొహం చాటేశారు. కనీసం కరపత్రాలు కూడా పంచే సాహసం చేయలేకపోయారు. ప్రతి నెల సామాజిక పింఛన్ల పంపిణీలో ఫొటో షూట్తో నానా హంగామా చేస్తున్న సీఎం చంద్రబాబు రైతుల గడప తొక్కలేకపోయారు. రైతుల కోసం ప్రాణం ఇస్తానంటూ ఎన్నికల్లో నమ్మబలికిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే పత్తా లేరు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా రైతుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు చివరకు స్థానిక ప్రజా ప్రతినిధులకూ హాజరయ్యేందుకు ధైర్యం చాల్లేదు. ఫలితంగా ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ కార్యక్రమం కోసం పైసా కూడా విదిల్చ లేదంటేనే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. పంచసూత్రాల్లేవ్.. ఇంటింటికీ పోలేదు.. ‘‘నేనూ రైతు బిడ్డనే. రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అంటూ ‘రైతన్నా మీ కోసం’పై ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు గొప్పలు పోయారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో ఏం చేసిందో చెబుతామన్నారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు అధికారులు కూడా పాల్గొంటారని, తానూ రైతుల ఇళ్లకు వెళ్తానని సీఎం స్వయంగా ప్రకటించారు. రైతును రాజును చేసేందుకు పంచ సూత్రాల పేరిట ముద్రించిన కరపత్రాలను అందించడంతో పాటు ప్రత్యేకంగా తెచ్చిన ఏపీఏఐఎంఎస్ (ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణ వ్యవస్థ) యాప్ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, దాని నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఆచరణకు వచ్చేసరికి ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. తొలి రోజు హడావుడి, హంగామా చేసినా రైతుల నుంచి కనీస స్పందన లేదు. సరికదా పలుచోట్ల తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచి్చంది. టీడీపీ నేతలు తప్ప కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిదులు, నేతలు మచ్చుకైనా కనిపించలేదు. ఏ పంటకూ మద్దతు ధర లేదు.. ఇదే మీ నిర్వాకం ‘‘మిరప మొదలు అరటి వరకు 18 నెలలుగా ఏ పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదు. ధాన్యానికి సైతం తేమ శాతం వంకతో మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. ఓ వైపు ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మద్దతు ధరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు’’ అంటూ రైతన్నా మీ కోసంలో తొలిరోజే రైతులు ప్రజాప్రతినిధులను కడిగేశారు. మరోవైపు ‘ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ప్రీమియం కట్టలేక బీమా చేయించుకోలేకపోయాం. వరుస విపత్తులతో పంటలు నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదంటూ’ నిలదీశారు. ఎక్కడొచ్చింది అన్నదాత సుఖీభవ? అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో పీఎం కిసాన్తో కలిపి రూ.14 వేలు జమ చేసినట్లు చెప్పి తప్పించుకుందాం అని కూటమి ప్రజాప్రతినిధులు భావించినా, ఆ సొమ్ము తమకు పడలేదంటే తమకు పడలేదని, తొలి విడతకు సంబంధించిన వినతులను కనీసం పట్టించుకోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్పలేక, రైతులను సముదాయించలేక జారుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చేసేది లేక పాల్గొనలేదని పల్నాడుకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ‘‘అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగ్గొట్టాం. రెండో ఏడాది పీఎం కిసాన్తో కలిపి రెండు విడతల్లో రూ.14వేలు ఇవ్వడం తప్ప రైతులకు చేసిందేమి లేదు’’ అని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నారు. భజన మీడియా గప్చుప్.. సీఎం చంద్రబాబు బృందం కాలుబయటపెడితే చాలు.. అహో ఒహో అంటూ భజన చేసే పచ్చ మీడియా సైతం ‘‘రైతన్నా మీకోసం’’ గురించి ప్రస్తావించలేదు. దీంతోనే ఈ కార్యక్రమం ఎలా సాగిందో స్పష్టం అవుతోంది. రైతుల ఇళ్లకు వెళ్లినట్టు, వారు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు రోజువారీ నివేదికలివ్వడం తప్ప ప్రత్యక్షంగా రైతుల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు మచ్చుకైనా కని్పంచలేదు. మెజార్టీ గ్రామాల్లో రైతులనే అధికారులు పిలిపించుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడిన పరిస్థితి నెలకొంది. రైతన్నా మీ కోసం ముగింపు సందర్భంగా ఈ నెల 3న ఆర్బీకేల పరిధిలో వర్కుషాపులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మా ఊరికి వస్తే నిలదీద్దామనుకున్నా.. ఎవరూ రాలేదు ‘నా వయస్సు 60 ఏళ్లు.. గత 45 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో రూ.10 వేలు వేసామని చెబుతున్నారు. నాకు పడలేదు. ఎవరికి పడ్డాయో కూడా తెలియదు. సొంతంగా ఏడు ఎకరాలు, కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అప్పు చేసి పెట్టుబడి పెట్టి టమాట, పత్తి, కూరగాయలు పండించా. అధిక వర్షాల కారణంగా పత్తి 2–3 క్వింటాళ్ల దిగుబడే రాగా, మిగిలిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తికి క్వింటా రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. ఏంచేయాలో పాలు పోవడం లేదు. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో మా గ్రామానికి వస్తే నిలదీద్దామనుకున్నా. ఏ ఒక్కరూ మాఇంటికి వచ్చిన పాపాన పోలేదు. -కె.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లా బాబు సర్కారును రైతులు నమ్మడం లేదు మాటల గారడీ తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. మద్దతు ధర దక్కక ఓవైపు అరటి, ఉల్లి, మొక్కజొన్న, సజ్జ రైతులు గగ్గోలు పెడుతుంటే ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో చంద్రబాబు అన్నదాతల గడప తొక్కలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని నమ్మబలికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెట్టింది. కౌలు రైతులనైతే నిండా ముంచేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం రైతన్నా మీ కోసం అంటూ ఆడుతున్న దొంగ నాటకాన్ని నమ్మే స్థితిలో రైతులు లేరు. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
హామీలు ఎగ్గొట్టి.. పెన్షన్లు పోగొట్టి!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో ఎన్నికల నాటికి అత్యధికంగా ఇచ్చిన పింఛన్లు 66.34 లక్షలు..! చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1వతేదీ రాత్రి సమయానికి పంపిణీ చేసిన పెన్షన్లు 59.11 లక్షలు! పోనీ గత నెలలో చూసినా.. నవంబర్ 1న బాబు సర్కారు పంచిన పెన్షన్లు 61.64 లక్షలే!! అంటే.. గత 18 నెలల వ్యవధిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల పింఛన్లు ఎగిరిపోయాయ్! రాష్ట్రంలో దాదాపుగా తొలిరోజే పింఛన్లు తీసుకునే లబ్ధిదారులే అత్యధికంగా ఉంటారు. దీన్నిబట్టి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చంద్రబాబు సర్కారు వచ్చాక దాదాపు ఐదు లక్షల పింఛన్లు తగ్గినట్లు తెలిసిపోతోంది. మరి ఇది సుపరిపాలనా? ప్రజలకు మంచి చేసినట్లా? సూపర్ సిక్స్లు అమలు చేసినట్లా? కొత్త పెన్షన్లు ఇచ్చినట్లా? టీడీపీ కూటమి ప్రభుత్వం అవ్వాతాతలతోపాటు దివ్యాంగులనూ కనికరించడం లేదు. రీ వెరిఫికేషన్ పేరుతో నోటీసులిచ్చి దాదాపు లక్ష మంది దివ్యాంగులపై కత్తి వేలాడదీసింది! ఇలా ఒకవైపు పెన్షన్లు ఎగరగొడుతూ.. మరోవైపు ఈ నెలలో 8,190 మందికి కొత్త పింఛన్లు ఇచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం స్వీయ ప్రచార వేదికగా, పార్టీ కార్యక్రమంలా మార్చేసింది. గత ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటివద్దే గుడ్మార్నింగ్ చెప్పి మరీ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఠంచన్గా పెన్షన్లు పంపిణీ సాగగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు అవ్వాతాతలను, దివ్యాంగులను, వితంతువులను రోడ్డుకీడ్చి పడిగాపులు కాసేలా చేసింది. ఉదయం పూట ఇవ్వాల్సిన పింఛన్లు కాస్తా సోమవారం తిరుపతిలోని జీవకోనలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వానలో గుంపులుగా నిల్చోబెట్టి అరకొరగా అందజేశారు. దరఖాస్తులకే దిక్కులేదు.. పంపిణీ పేరుతో పబ్లిసిటీ!రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్తగా 60 ఏళ్లు నిండినవారు, వితంతువులకు అర్హత ఉన్నా గత 18 నెలలుగా పింఛనుకు దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం లేకుండా చేసింది. కనీసం ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేలేదు. ఒకవైపు దరఖాస్తులను తొక్కిపెడుతూ మరోవైపు పంపిణీ పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలను రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో టీడీపీ నేతలంతా సచివాలయాల ఉద్యోగులతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొని ఫోటోలు దిగి ప్రచారం చేయాలని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కావడం గమనార్హం. దీనికి అనుగుణంగా టీడీపీ ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. పాత పింఛనుదారులకే ఇప్పుడే కొత్తగా ఇచ్చినట్లు ప్రచారం చేశారు. పెండింగ్లో 2.5 లక్షల దరఖాస్తులు.. దాదాపు రెండున్నర లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఏడాదిన్నరకుపైగా పెండింగ్లో పెట్టింది. మరోవైపు అర్హత ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు సుమారు మరో 3 లక్షలమందికిపైగా ఉంటారని అంచనా.50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఒకపక్క ఉన్న పింఛన్లనే ఎగరగొడుతూ.. దరఖాస్తులను తొక్కిపెడుతూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు 50 ఏళ్లకే పెన్షన్ హామీని గాలికి వదిలేసింది.ఐదేళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లువైఎస్సార్ సీపీ హయాంలో వృద్ధాప్య పింఛను అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరింది. అర్హులు ఏడాదిలో ఏ రోజైనా సరే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. చివరిగా 2024లో జనవరి ఆరంభంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా 29.51 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) స్వయంగా ప్రకటించడం గమనార్హం.ఇంటి పన్ను చెల్లిస్తేనే పింఛన్ప్రత్తిపాడు రూరల్: ఇంటి పన్నుకు, పింఛన్లకు చంద్రబాబు సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో సోమవారం 11,463 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 10,500 మందికే పంపిణీ చేశారు. మండలంలోని పోతులూరులో పింఛన్ల పంపిణీలో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు చెప్పారు. ఈ విషయాన్ని వారు స్థానిక వైఎస్సార్సీపీ నేత శెట్టి సత్తిబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సత్తిబాబు స్థానిక గ్రామ కార్యదర్శిని నిలదీశారు. అప్పటికే పింఛన్ల పంపిణీ ముగిసింది. సత్తిబాబు మాట్లాడుతూ..గ్రామంలో ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇచ్చారని చెప్పారు. ఇలా బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని సత్తిబాబు అన్నారు. దీనిపై ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్బాబును వివరణ కోరగా, స్వచ్ఛందంగా ముందుకు వచి్చనవారి వద్ద మాత్రమే పన్ను వసూలు చేసి, రశీదులు ఇచ్చామని చెప్పారు. -
YS Jagan: హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండంటూ ట్వీట్
-
Chaitanya: సోమరిపోతు చంద్రన్న... అదిరిపోయే పిట్టకథ..
-
AP: అరటి పళ్లను నేలపై వేసి నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
-
పోర్టుల ద్వారా ఏపీలో జరిగిన అభివృద్ధిపై వైఎస్ జగన్ ట్వీట్
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యం.. అనంతలో అరటి రైతుల ఆగ్రహం (చిత్రాలు)
-
Anantapur: ఇక్కడ రైతులు ఆకలితో చస్తుంటే నువ్వు నీ కొడుకు చేసేది ఇదా..
-
సొల్లు కబుర్లు ఆపు.. నీకు చేతకాకపోతే బాబును రఫ్పాడించిన బొత్స
-
Botsa: తల దించుకుంటా మీకు దమ్ముంటే నిరూపించండి
-
బాబు పోకడలతో విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పేమీ చేయలేదు.. ఆయన సహజ స్వభావాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అంతే! విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ జరిగిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపైన, అందులో పనిచేసే కార్మికులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని ఆయన అన్నారు. వినడానికి బాగానే ఉంటుంది కదా! కాని ఇదే పెద్ద మనిషి 2024 ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేశారు? ఇది ఆంధ్రుల హక్కు, సెంటిమెట్, దీనిని ఎలాగైనా కాపాడుకుంటాం,పొరాడుదాం.. అని చెప్పారా?లేదా?ఆ రోజు కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్లే నష్టాలలో ఉందని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు?ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించినట్లు అవ్వలేదా? ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులను ఎలా రెచ్చగొట్టారు? తాను ఈ ప్లాంట్ను కాపాడడానికి సిద్దంగా ఉన్నానని, కార్మిక సంఘాలు కలిసి రావాలని అన్నారే కానీ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు పవన్ ఎత్తడం లేదు. విశాఖ స్టీల్ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వీరిద్దరూ ఎన్ని అభాండాలు మోపారు! కొద్దికాలం క్రితం శాసనమండలిలో మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారని వార్తలు వచ్చాయి కదా! ఆయన కూడా ప్రస్తుతం దీని గురించి మాట్లాడడం లేదే! అంటే వీరంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఒప్పుకోవలసిందే కదా! 12వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చాం కనుక ఇప్పుడు దానిని ఏమి చేసినా ఫర్వాలేదన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు?దేనికి వాడారు? ప్రైవేటువారికి అప్పగిస్తే రుణ బారం తగ్గించి ఇవ్వడానికి అలా చేశారన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది కదా! ఈ సంస్థకు సొంత గనులు లేవని మొత్తుకుంటుంటే ఆ సంగతి చెప్పకుండా, అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో మరో స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని, దానికి గనులు కేటాయించడానికి ప్రధాని మోదీని ఒప్పించామని చంద్రబాబు చెప్పారు. పైగా అది లాభాలలో నడుస్తుందని ఆయన జోస్యం చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించేలా కృషి చేయలేదో వివరించాలి కదా! ప్రైవేటుపై మోజు ఉంటే ఉండవచ్చు. కాని ఎన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీలు , బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ తర్వాత వాటిని సరిగా నడపలేక చేతులెత్తేశాయి. మరికొన్ని సంస్థలు మోసాలు చేసి దివాళాకు వెళ్ళాయి. ఇలా మూత పడ్డ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు మాత్రం బ్రహ్మాండంగా, హాపీగా ఉంటున్నారే. రాజకీయాలలోకి వచ్చి మంచి పదవులు పొందుతున్నారే. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వందల కోట్ల రుణాలను బ్యాంకులనుంచి పొంది ఎగనామం పెట్టారు కదా! గతంలో చంద్రబాబు టైమ్లో కొండపల్లి వద్ద లాంకో పవర్ అన్న సంస్థ ఏర్పాటైంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చెందిన ఆ సంస్థ వివిధ కారణాలతో మూతపడింది.ఆ కంపెనీకి బ్యాంకులు ఇచ్చిన 45వేల కోట్ల రుణాలలో ఎంత భాగం మాఫీ అయ్యాయో చంద్రబాబు వంటి వారికి తెలియదా? అప్పుడు తెల్ల ఏనుగులకు ప్రభుత్వ డబ్బు కట్టబెట్టినా ఫర్వాలేదా? దేశ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల మేర బ్యాంకులు పరిశ్రమలవారికి ఇచ్చిన రుణాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటిస్తున్నాయి కదా! ప్రైవేటు కంపెనీ లూలూ కు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అర్ధణా,అణాలకు ఇచ్చేసింది కదా! అదే కంపెనీ అహ్మదాబాద్లో ఎందుకు 519 కోట్లతో భూమి కొనుగోలు చేసింది. ఏపీలో మాత్రం అతి తక్కువ మొత్తానికి విలువైన భూమిని లీజుగా పొందింది? దీనికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?ఆ కంపెనీ ఉత్పత్తులపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టినా పట్టించుకోలేదే! కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు ఇవ్వడం, మరికొన్నిటికి వేల కోట్ల రాయితీలు ఇవ్వడంం, ఉర్సా వంటి సంస్థలకు భూముల అమ్మకం వంటివి సమర్ధనీయమేనా? ఆ రాయితీలు ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ఇచ్చేది. ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయవని ఒక ముద్ర వేసి వాటి ఆస్తులను ప్రైవేటువారికి కట్టబెట్టడంలోని మతలబు ఏమిటి?చంద్రబాబు హయాంలోనే ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజ్ చేశారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయా? లేక కంపెనీలను మూసి భూములు అమ్ముకుంటున్నాయా? అన్న శంక పలువురిలో ఉంది. దానిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది కదా? ప్రజల పన్నులతోనే సమకూర్చుకున్న ఆస్తులను కొందరు వ్యక్తులను సంపన్నులను చేయడానికి వాడవచ్చా? దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన భూములు విశాఖ ఉక్కుకు ఉన్నాయా?లేదా? సెయిల్తో పోల్చితే సొంత గనులు లేకపోయినా ఈ ప్లాంట్ ఉత్పాదకత ఎక్కువగా ఉన్న విషయాన్ని కార్మికులు గణాంకాలతో చెబుతున్నారు. అలాంటి కంపెనీ నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టకుండా,ఎలాగైనా ప్రైవేటువారికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళుతున్నారు. ఎన్నికలకు ముందు అదే తమ విధానమని చెప్పి ఉంటే ఎవరూ కాదనరు. కాని ఆ రోజు సెంటిమెంట్ అని ఆంధ్రుల హక్కు అని , ఈరోజు తెల్ల ఏనుగు అని అనడం, ప్రశ్నలు వేసిన మీడియావారిపై కస్సుమనడం చంద్రబాబుకే చెల్లింది. ఇవన్ని ఊసరవెల్లి మాటలుగా అనుకుంటారని కూడా ఫీల్ కారా? గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా ఆ రోజుల్లో విశాఖ ప్రాంత ప్రజలు వీరి ప్రచారం నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. అదికారం వచ్చాక వారిని ఏమి ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 35 విభాగాలను ప్రైవేటువారికి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు. కొన్నివేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ప్రభుత్వానికి ఈ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అన్నదాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఒక ఐడెంటిటిగా ఉన్న ఈ ప్లాంట్ భవిష్యత్తును గందరగోళంలోకి ప్రభుత్వమే నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చాలాకాలం గా స్పష్టంగా ఉన్నా,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు దీనిపై కార్మికులను ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికి సెంటిమెంట్ డైలాగులువాడారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేయవద్దని తీర్మానం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంనై అభాండాలు మోపారు.ప్లాంట్ కు ఉన్న భూములలో కొంత భాగాన్ని అమ్మి ప్లాంట్ ను రక్షించుకుందామని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే చాలా ఘోరం జరిగిపోతోందని చంద్రబాబు గగ్గోలు పెట్టారే!ఇప్పుడు ఏకంగా భూమితో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటువారికి అప్పనంగా ఇచ్చేసేలా ఉన్నారు. దీనిపై కార్మిక సంఘాలు కాని, రాజకీయ పార్టీల నేతలు కాని విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్దంగా ఉంటారు. ఎక్కడ లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలుఇవ్వాలని యాజమాన్యం తలపెట్టిందట. ఇది పుండుమీద కారం చల్లడమే అవుతుందనిపిస్తుంది. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అన్న ప్రశ్న వేసిన చంద్రబాబుకు కార్మికులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సూపర్ సిక్స్ అని, ఎన్నికల మానిఫెస్టో అని 150 హామీలు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేక హామీలను ఎగవేస్తోంది కదా! అలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎలా కరెక్టు అవుతుందన్నది వారి సందేహంగా ఉంది. నిత్యం అసత్య ప్రచారాలతో కాలాక్షేపం చేస్తున్న చంద్రబాబు సర్కార్ లోని మంత్రులకు ఎందుకు జితాలివ్వాలని జనం అడగవచ్చా? ప్రభుత్వంలోని సిబ్బందికి కూడా ఇలాగే ఏమైనా కండిషన్లు పెట్టబోతున్నారా?అని వారు అడుగుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక విమానాలలో , హెలికాప్టర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు తరచుగా పర్యటిస్తున్నారు కదా!వారికి అలా తిరిగే అధికారం ఉందా?లేకపోతే ఈ ఖర్చును జనం ఎందుకు భరించాలి. దేశవ్యాప్తంగా మరో నాలుగు ఉక్కు కర్మాగారాలను ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించి, ఆ రాష్ట్రాలలో వచ్చిన నిరసన దృష్ట్యా వెనక్కి తగ్గిందట. కాని ఆంధ్రులకు ఆ చేవ లేదని భావించిందో ఏమో కాని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందన్న అభిప్రాయం ఏర్పడింది.దానికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వడం విషాదం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబాయిస్తున్నానులే అనుకుంటుండవచ్చు. కాని ఉత్తరాంధ్రకే కాదు.. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్కు ఆయన ద్రోహం చేసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా PA కోసం CMను కూడా లెక్క చేయను
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధావులు స్పందించాలి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష సంతకాలు పూర్తిచేసిన సందర్భంగా ఆదివారం ఆయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, డా. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు వేదికలపై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రసంగించాలి్సన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వీరు ఈ విషయంపై అస్సలు మాట్లాడటంలేదని, దీనివల్ల రాçÙ్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని రాచమల్లు చెప్పారు. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదని.. ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక కోణంలో చూడాలని ఆయన సూచించారు. రాచమల్లు ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు సిగ్గుపడాలి..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని నిర్మించారు. నిజానికి గతంలో ఎవరూ ఇన్ని తీసుకురాలేదు. ప్రతీవారం సీఎం చంద్రబాబు చేసే అప్పుల్లో కేవలం రూ.నాలుగైదు వేల కోట్లు ఖర్చుపెడితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తిచెయొ్యచ్చు. సీఎం చంద్రబాబు వీటిని ప్రాథమిక బాధ్యతగా భావించి యుద్ధప్రాతిపదికన వీటి నిర్మాణం పూర్తిచేయాలి. వీటివల్ల ఆటో కార్మికులు, బేల్దారి పనిచేసే వారు, హమాలీల పిల్లలకు వాటిల్లో చదివే అవకాశం దొరుకుతుంది. పూర్తిగా జగన్పై కక్షతోనే.. ఆయనకు పేరొస్తుందన్న అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గాలికొదిలేశారు. ఏంచెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇందుకు బాబు సిగ్గుపడాలి.ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ను అటకెక్కించారుఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. ఎంతోమంది నిరుపేదలు ఆరోగ్యశ్రీతో గుండెజబ్బుల ఆపరేషన్లు చేయించుకుని జీవిస్తున్నారు. పేద పిల్లలూ ఉన్నత చదువులు చదివారు. చంద్రబాబు ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. దీంతో ఆస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ లేదని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా చెల్లించడంలేదు. బాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నాలుగోసారి సీఎంగా ఉన్నారు. అసలు ఇప్పటివరకు ఆయనకు మెడికల్ కాలేజీలు నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?లక్ష సంతకాలు పూర్తిచేశాం..ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గాంధేయ మార్గంలో చేపట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులతోపాటు నియోజకవర్గంలోని 30 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక్కో పుస్తకంలో 200 సంతకాలతో మొత్తం 500 పుస్తకాలను పూర్తిచేశాం. వాస్తవానికి అన్ని నియోజకవర్గాల్లో 50 వేల నుంచి 60 వేలు సంతకాలు చేయించాలని పార్టీ సూచించగా, ఇక్కడొక్క చోటే లక్ష సంతకాలు పూర్తిచేయడంతో నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా ఉంది. డిసెంబరు 10న పార్టీ హైకమాండ్కు వీటిని అందిస్తాం. -
ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను అథఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా.. పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం పిల్లలను వేధిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ గత ఏడాదిన్నరకుపైగా ఫీజు రీయింబర్స్మెంట్ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తరువాత చేతులు ఎత్తేసింది. ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఎనిమిది క్వార్టర్ల ఫీజుల డబ్బులు రూ.5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో రూ.2,200 కోట్లతో కలిపి ఏకంగా రూ.7,800 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా, పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. తేలికగా ఎగ్గొట్టవచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాలో కాకుండా, తాము కాలేజీల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. ఉన్నత విద్యలో పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ అమలు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి ఐదేళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. అనంతరం అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు సుమారు ఎనిమిది క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ను నిలిపివేసింది. ప్రభుత్వ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల నిలుపుదల.. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే గానీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమనే పరిస్థితికి ఉన్నత విద్య దిగజారిపోయింది. చివరికి ప్రభుత్వ వర్సిటీలు సైతం ఇదే బాటలో పయనిస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపేశాయి. సర్కారు బాధ్యతారాహిత్యానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విలువైన ఉద్యోగ అవకాశాలు, పీజీ విద్య సీట్లను కోల్పోతున్న దుస్థితి దాపురించింది. ఎంటెక్, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 2014–19లో టీడీపీ హయాంలో 16.73 లక్షల మంది విద్యార్థులకు బకాయి పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం పలికి ఆర్నెల్లకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామంటూ కళాశాలలను, విద్యార్థులను నిలువునా ముంచేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కళాశాలలు.. రాష్ట్రవ్యాప్తంగా 230కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు, 1,250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కనీ్వనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి బోధిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు సుమారు రూ.7,800 వేల కోట్ల చెల్లింపులు నిలిపివేయడంతో నిర్వహణ భారాన్ని భరించలేక అటు కాలేజీలు ఇటు విద్యార్థులు ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. వసతి దీవెనకు మంగళం.. పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు హాస్టల్ మెయింటెనెన్స్ (వసతిదీవెన) ద్వారా ఆరి్థక సాయం అందించి ఆదుకున్నారు. భోజన, వసతి ఖర్చుల కోసం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫీజులను నీరుగార్చగా.. వసతి దీవెనను ఏకంగా ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు ఎగ్గొట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చే అంశాన్ని పక్కన పడేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్య అభ్యసిస్తున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు బృందం నమ్మబలికింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టింది. విద్యకు లోటు బడ్జెట్ఒక్కో విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయింపులు చూపించి నిధులు మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. అదే వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ఫీజుల కోసం రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు సైతం చెల్లించింది. కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు నిశ్చింతగా చదువుకునేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన కోసమే ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. ‘ఎక్స్’లో ట్వీట్ల పిట్టలా లోకేశ్! ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ స్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం.. అంటూ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్ నుంచి మొదలు కాగా ఈ ఏడాది నవంబర్ వచి్చనా బకాయిలు చెల్లించకపోవడంతో కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్ అక్టోబర్ చివరిలో కంటి తుడుపుగా విదిల్చారు. పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం రూ.60 వేలు ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారం పంపించింది. తమకు రీయింబర్స్మెంట్ జమ కానందున ఫీజులు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.కదిరిలోని ఎస్ఎంజేఎల్ డిగ్రీ కాలేజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. కొందరు బాలికలను చదువు మానిపించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నపరెడ్డి గారి గంగిరెడ్డి సొంతూరు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లె కొత్తపల్లి. ఆయన కుమార్తె గౌరీప్రియ రాజంపేటలో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసి కాలేజీలో చెల్లించారు. రెండో ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని వాపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తన కుమారుడు గౌతమ్రెడ్డి బీటెక్ ఎలాంటి ఆర్థిక ఆటంకాలు లేకుండా పూర్తయిందని గుర్తు చేసుకుంటున్నారు. ఎంబీఏ పూర్తయి ఏడాదిన్నర.. రామచంద్రపురం కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశా. ఫీజు చెల్లించలేదని సరి్టఫికెట్లు ఇవ్వడంలేదు. రూ.48,500 వరకు కట్టాలని చెబుతున్నారు. నాన్న ఇటుక బట్టీలో కార్మికుడు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా – ఎస్.గంగరాజు, సందిపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించా మా కుమార్తె తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతోంది. ఇప్పటి వరకు ఫీజు రీయిబర్స్మెంట్ అందలేదు. కళాశాల యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక బంగారు నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాం. నా భర్త చనిపోయారు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా. – సుభద్రమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతిమానసికంగా కుంగిపోతున్నా.. కర్నూలు జీఎన్ఎంలో నర్సింగ్ మూడో ఏడాది చదువుతున్నా. గతంలో మా అమ్మ ఖాతాలో జగనన్న విద్యా దీవెన సకాలంలో జమయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమకాలేదు. పెండింగ్ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఇంట్లో ఫీజులు అడగలేక.. కాలేజీలో ఒత్తిళ్లు తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నా. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. – కె.సురేష్, నర్సింగ్ విద్యార్థిసి.బెళగల్ మండలం, ముడుమూల మా పీక పట్టుకుంటుంది.. మా అబ్బాయి కార్తికేయ భీమిలి మండలంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో ఏడాది చదువుతున్నాడు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఒక క్వార్టర్ ఫీజు మాత్రమే జమ చేసింది. అప్పటికే కళాశాల యాజమాన్యం రూ.20 వేలు చొప్పున వసూలు చేసింది. జిరాక్స్ షాపుపై ఆధారపడి జీవిస్తున్న నేను అతి కష్టం మీద ఆ డబ్బులు కట్టా. లేదంటే సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వబోమంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందనే కాలేజీలో చేర్చాం. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే యాజమాన్యం మా పీక పట్టుకుంటుంది. – గంటా రాజు, భీమిలి మండలం సకాలంలో ఇస్తే మాకీ అవస్థలుండవు నా కుమారుడు హుసేన్ అమీద్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. మాకు ఎలాంటి చర, స్థిర ఆస్తులు లేవు. చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఏటా ప్రభుత్వం సకాలంలో ఫీజులు జమ చేస్తే మాకీ అవస్థలు ఉండవు. – హుసేన్బీ, విద్యార్థి తల్లి, పాములపాడు, నంద్యాల జిల్లాచిల్లి గవ్వ ఇవ్వలేదు.. నా కుమారుడు రోషన్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కళాశాలలో ఫీజు కట్టకపోతే పంపొద్దు అంటూ బెదిరిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం సాయం చేస్తుందనే ధైర్యంతో ఉన్నత విద్యలో చేరి్పంచాం. – బాబు, విద్యార్థి తండ్రి, చిత్తూరుమదనపల్లె సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్న విజయ్బాబుకు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ చదివిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి జూన్లో రూ.25 వేలతో మొదటి ఏడాది ఫీజు కట్టారు. ఉన్నత చదువులు చదవాలని ఆశతో ప్రభుత్వాన్ని నమ్ముకుని ఎంబీఏలో చేరితే తన పరిస్థితి తల్లకిందులైందని.. రెండో ఏడాదీ ఫీజు తానే కట్టుకోక తప్పదని విజయ్బాబు వాపోతున్నాడు. -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: పార్లమెంటు సమావేశాలు రేపటి(డిసెంబర్ 1, సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపానులతో రైతులు నష్టపోయిన తీరు. పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు.‘‘రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలి. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయటంపై మాట్లాడాలి. బీమా లేకపోవడంతో రైతులు నష్టపోవటం, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించని వైనాన్ని సభలో చర్చించాలి. ఈ-క్రాప్ విధానం అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకు వెళ్లాలి. మామిడి రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించని వైనంపై మాట్లాడాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలి..18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంటులో నిలదీయాలి. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలాగ ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంపై చర్చించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవటం.. మౌలిక సదుపాయాలను కల్పించని వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలి. ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి’’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
మీకు అధికారం ఇచ్చినందుకు రైతులకు బాగా బుద్ది చెప్పారు..
-
అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే
-
‘రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’
నెల్లూరు : జిల్లాలో పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ ధోరణి గురించి చర్చించెకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. 2019లో వైఎస్ జగన్ చెప్పిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలు చేశారని, భౌగోళిక పరిస్థితులను, ప్రజల అభ్యంతరాలను అనుగుణంగా ఆనాడు విభజన చేయడం జరిగిందన్నారు. ఆ రకంగా 26 జిల్లాలను పునర్విభజన చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు కాకాణి. ‘ఆ రోజు భౌగోళిక పరిస్థితుల దృశ్య వెంకటగిరి నియోజకవర్గం లోని రాపూర్, కలువాయా, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది. నేడు చంద్రబాబు ఓ డ్రాఫ్ట్ విడుదల చేసి ఈ మూడు మండలాలను తిరిగి తిరుపతి జిల్లాలో కలుపుతామని అంటున్నారు. ఈ విభజన ద్వారా రైతాంగం, ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జలాశయాలు నీటి విడుదలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. సోమశిల, కండలేరు జలాశయాలకు సంబంధించిన నీటి విడుదల కమిటీలో ఈ నియోజకవర్గ ప్రతినిధులు ఆ జిల్లాలో ఉండే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. -
డొల్ల కంపెనీలతో బాబు భూ కుంభకోణం
-
గ్రానైట్ పరిశ్రమల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/బల్లికురవ/మార్టూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్పై విచ్చలవిడిగా పన్నులు వసూలుచేయడాన్ని నిరసిస్తూ.. శనివారం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరం జంక్షన్లోని ఏఎంఆర్ చెక్పోస్టు వద్ద గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆగ్రహంతో చెక్పోస్టు కంటైనర్ బాక్స్ను బద్దలుకొట్టారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రితోపాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.అయితే, విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం అద్దంకి నుంచే గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆందోళనలో పాల్గొన్న వారిలో 90 శాతం అధికార టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. మల్లాయిపాలెం, వేమవరం, ఉప్పమాగులూరు, కొనెదన, గంగపాలెం, నక్కబొక్కలపాడు గ్రామాల పరిధిలోని 500 పరిశ్రమల నుంచి పలువురు యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు జంక్షన్కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం రాయలీ్ట, జీఎస్టీ అంటూ పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందంటూ తీవ్రంగా నిరసించారు. చంద్రబాబు సర్కారు తీరును దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం దుర్మార్గంగా పన్నులు వేసి గ్రానైట్ వ్యాపారాన్ని కుదేలు చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక కట్టర్కు రూ.27 వేలు టాక్స్ వసూలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా కట్టర్కు రూ.35 వేల రాయల్టీతోపాటు రూ.5 వేల జీఎస్టీ వసూలుచేస్తోందన్నారు. ఇదికాక.. కట్టర్కు మరో రూ.35 వేలు కప్పం కింద వసూలు చేస్తున్నారన్నారు. వసూలు బాధ్యతలు ఏఎంఆర్కు అప్పజెప్పడంతో వారు చెక్పోస్టులు పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని పరిశ్రమల యజమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత మొత్తంలో పన్నులు, ఇతరత్రా చెల్లించి వ్యాపారం చేయలేమన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, అదే జరిగితే తాము నష్టపోవడమే కాక యుపీ, ఎంపీ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పొట్టచేతబట్టుకుని వచి్చన కార్మికులు రోడ్డునపడతారని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని యజమానులుతోపాటు కార్మికులూ మండిపడుతున్నారు. తక్షణం ప్రభుత్వం అధికంగా విధించిన పన్నులు ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఉద్రిక్తంగా మారిన ఆందోళన.. ఇదిలా ఉంటే.. యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు వేమవరం జంక్షన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఒక్కసారిగా ఆందోళనకారులు అక్కడే వున్న ఏఎంఆర్ చెక్పోస్టు కంటైనర్ బాక్స్ వద్దకు వెళ్లి దానిని కూలదోశారు. బాక్స్లో వున్న కంప్యూటర్ సెట్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చెక్పోస్ట్ లైటింగ్ పోల్ను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వేమవరం చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేశారు. దీంతో.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిరసనకారులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం విధించిన పన్నుల భారానికి వ్యతిరేకంగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు నాలుగు రోజుల క్రితం మార్టూరు జాతీయ రహదారిపై జొన్నతాళి గ్రామం వద్ద నిరసన తెలిపారు.గ్రానైట్ సంఘ ప్రతినిధులకు డీఎస్పీ హెచ్చరిక అనంతరం మార్టూరు పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే గ్రానైట్ అసోసియేషన్ సభ్యులపై, ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సబ్సిడీ విత్తనానికి మంగళం
సాక్షి, అమరావతి: అదునులో పెట్టుబడి సాయం అందించలేదు.. అన్నదాతా సుఖీభవ పేరుతో వంచన.. ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్పుట్ సబ్సిడీ ఊసే ఉండదు.. మద్దతు ధర ధ్యాసే పట్టదు.. కనీసం ఎరువులూ కరువే..! ఇలా అన్ని రకాలుగా అన్నదాతల నడ్డి విరిచిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తనాలను కూడా సకాలంలో పంపిణీ చేయకుండా మంగళం పాడేందుకు కుట్రలు చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపినట్లుగానే విత్తన సబ్సిడీ భారాన్ని సైతం రైతన్నలపైనే మోపుతోంది.గత మూడు సీజన్లలో సబ్సిడీ విత్తన కేటాయింపులను కుదించి రాయితీలో కోతలు విధించడమే దీనికి నిదర్శనం. అదునుకు విత్తనాలు సరఫరా చేయకుండా రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించేలా పురిగొల్పుతోంది. తద్వారా సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాను అటకెక్కించింది. పథకం ప్రకారం సబ్సిడీ విత్తనంలో కోతలు.. రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం ఖరీఫ్లో 77.87 లక్షల ఎకరాలు కాగా, రబీలో 53.80 లక్షల ఎకరాలు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఖరీఫ్–2023లో 6.85 లక్షల క్వింటాళ్లు, రబీ 2023–24లో 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగా, దాదాపు రూ.365 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాల నుంచి వచి్చన ఇండెంట్ ఆధారంగా రూ.310 కోట్లతో 10.48 లక్షల క్వింటాళ్ల విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేసింది. అయితే జూన్లో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కోతల మీద కోతలు పెట్టి రూ.268 కోట్ల సబ్సిడీతో 7.87 లక్షల క్వింటాళ్ల విత్తనం మాత్రమే సరఫరా చేసింది.గడిచిన ఖరీఫ్ 2025 సీజన్లో రూ.165.96 కోట్ల సబ్సిడీతో 5.24 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేయగలిగారు. గడిచిన 18 నెలల్లో 16 సార్లు వైపరీత్యాలు సంభవించాయి. వరదలు, అధిక వర్షాలు, తుపానుల బారిన పడి లక్షలాది ఎకరాలు ముంపునకు గురై పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు గత ప్రభుత్వం కంటింజెన్సీ ప్లాన్ కింద 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసి ఆదుకుంది. చంద్రబాబు సర్కారు మాత్రం ఒక్క క్వింటా విత్తనం కూడా కంటింజెన్సీ ప్లాన్ కింద సరఫరా చేసిన పాపాన పోలేదు. అదునులో అందక అగచాట్లు రబీలో వరి తర్వాత ఎక్కువగా 10.92 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతుంది. 90 శాతానికిపైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే శనగ సాగు చేస్తున్నారు. రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ముందస్తు రబీకి వెళ్లే రైతులు అక్టోబర్ మొదటి వారంలోనే విత్తుకుంటారు. గత ప్రభుత్వంలో సాగు లక్ష్యాలకు అనుగుణంగా సీజన్కు ముందుగానే విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేసేవారు. సెపె్టంబర్ 25 నుంచి రైతుల వివరాలు నమోదు చేసి అక్టోబర్ 1 నుంచి శనగ విత్తనం, సెపె్టంబర్ 15 నుంచి వరి సహా ఇతర విత్తనాలను సరఫరా చేసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్ మూడో వారం వరకు శనగ విత్తన టెండర్లు ఖరారు చేయలేదు. ఏటా అక్టోబర్ 1న సబ్సిడీ విత్తన పంపిణీ మొదలు కావాల్సి ఉండగా ఈసారి నవంబర్ 1న రిజి్రస్టేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సబ్సిడీలోనూ కోతలు.. రవాణా చార్జీల భారం వైఎస్సార్సీపీ హయాంలో 40 శాతం సబ్సిడీపై శనగ విత్తనం సరఫరా చేయగా, రాయితీని ప్రస్తుతం 25 శాతానికి కుదించారు. అయినప్పటికీ కొనుగోలు చేద్దామంటే ఆర్బీకేల్లో ఎక్కడా విత్తనాలు లేవు. రాయలసీమ జిల్లాల్లో 60 శాతానికి పైగా ఆర్బీకేల్లో విత్తనాలు దొరకని దుస్థితి నెలకొంది. చేసేది లేక రైతులు దూరప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 60–70 శాతం మంది రైతులు ప్రైవేటుగా డీలర్ల నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో దొరికే విత్తనాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. సగం కూడా సిద్ధం చేయకుండా..! రబీ 2024–25 సీజన్లో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, అతికష్టమ్మీద కేవలం 1.76 లక్షల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేయగలిగారు. ప్రస్తుత రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాన్ని కుదించి రూ.74.05 కోట్ల సబ్సిడీ 2.83 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరాకు ప్రతిపాదించారు. ఏటా రబీకి సిద్ధం చేసే విత్తనంలో దాదాపు 2 లక్షల క్వింటాళ్లకు పైగా శనగ విత్తనాన్ని అందుబాటులో ఉంచాలి. కాగా ఈ ఏడాది 1.50 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం సరఫరాకు యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేయగా సబ్సిడీ కోతలతో చివరికి 73 వేల క్వింటాళ్లు మాత్రమే సిద్ధం చేశారు. అయితే అప్పటికే రైతులు అధిక ధరలకు బయట కొనుగోలు చేశారు.వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ సంస్థకు గ్రహణంరాష్ట్రంలో విత్తన పరీక్ష నెట్వర్క్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశంలోనే తొలి రాష్ట్రస్థాయి విత్తన జీన్స్ బ్యాంక్ ఏర్పాటుకు వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గన్నవరం వద్ద 8 ఎకరాల్లో రూ.40 కోట్లతో చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి వచ్చేవి. రైతు శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ ఏర్పాటయ్యేవి. అలాగే నంద్యాల మెగా సీడ్ పార్కుకు ఈ ప్రభుత్వం పైసా విదల్చలేదు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్నీ నిరీ్వర్యం చేస్తున్నారు. విత్తనోత్పత్తిలో భాగస్వాములవుతున్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలూ ఎగ్గొట్టారు. టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే.. రబీలో మినుము, పెసర సాగు చేశా. స్థానిక టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే ఆర్బీకేల్లో విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో అదును దాటుతుండటంతో చేసేది లేక కిలో రూ.130 చొప్పున మినుములు, కేజీ రూ.110 చొప్పున పెసర విత్తనాలను తెనాలి, గుంటూరు వెళ్లి తెచ్చుకున్నా. రవాణా ఖర్చులతో అదనపు భారం పడింది. విత్తనం కోసం ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి అయ్యింది. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఆర్బీకేల ద్వారా సీజన్కు ముందుగానే అందుబాటులో ఉంచి పార్టీలకతీతంగా రైతులకు ఇచ్చేవారు. – వి.రామిరెడ్డి, వెంగపల్లి, హనుమంతునిపాడు మండలం, ప్రకాశం జిల్లా ఈ దుస్థితి ఎన్నడూ చూడలేదు నేను 20 ఏళ్లుగా శనగ సాగు చేస్తున్నా. ఈ ప్రభుత్వం రాయితీని 40 నుంచి 25 శాతానికి కుదించేసింది. దీనికంటే బయట మార్కెట్లోనే తక్కువ రేటుకు దొరుకుతున్నాయి. సబ్సిడీ తగ్గించడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ దుస్థితి ఎన్నడూ చూడలేదు. – జెట్టి శ్రీనివాసరావు, ముప్పాళ్ల, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా జగన్ హయాంలో నాణ్యతకు భరోసా.. వైఎస్సార్సీపీ హయాంలో రెండు సీజన్లలో కలిపి ఏటా సగటున 11 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సరఫరా చేశారు. ఇందుకోసం ఏటా రూ.400 కోట్ల వరకు బడ్జెట్లో కేటాయించారు. సీఎం స్థాయిలోనే సమీక్షించి విత్తన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీజన్కు ముందే రైతుల వివరాలను నమోదు చేసి సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే విత్తనాలను పంపిణీ చేశారు. ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించిన విత్తన నిల్వలను వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో ర్యాండమ్గా పరీక్షించి సరి్టఫై చేసిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు.తద్వారా విత్తనాల నాణ్యతకు భరోసా లభించేది. ఐదేళ్లలో రూ.1,380.14 కోట్ల రాయితీతో 76.10 లక్షల మంది రైతులకు 55.27 లక్షల క్వింటాళ్ల çసరి్టఫైడ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పచి్చరొట్టతోపాటు పత్తి, మిరప లాంటి నాన్ సబ్సిడీ విత్తనాలనూ ఆర్బీకేల ద్వారా అందించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. -
పగలు బోధన.. రాత్రి కాపలా!
సాక్షి, అమరావతి: పగటి వేళ తరగతి గదుల్లో టీచర్లుగా విద్యాబోధన.. రాత్రివేళ స్కూల్, హాస్టల్ బయట వాచ్మెన్లుగా కాపలా.. వేతనాలు సకాలంలో ఇవ్వరు.. సమస్యలతో సతమవుతూనే విధులు నిర్వర్తించాల్సిందే.. ఇది రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, విద్యాసంస్థల్లో టీచర్ల దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యాలయాల్లో పనిచేసే పార్ట్టైమ్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ), గెస్ట్ ఫ్యాకల్టీ, అవుట్ సోర్సింగ్ టీచర్ల పరిస్థితి దుర్భరంగా మారింది. సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు ఆదేశాలు వీరికి అమలు కావు. రెగ్యులర్ టీచర్లకు సుమారు రూ.60 వేల నుంచి లక్షకుపైగా ఉంటే.. వీరు మాత్రం రూ.18వేల నుంచి రూ.27,500 వేతనంతో నెట్టుకొస్తున్నారు. పేరుకే పార్ట్టైమ్ విధులు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ వారితో ఫుల్టైమ్ పని చేయిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. టీచర్లను బోధనేతర పనులకు వాడకూడదనే నిబంధనను తుంగలోకి తొక్కి వీరితో ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బోధన చేయించి రాత్రివేళ వాచ్మెన్ విధుల్లో పెడుతున్నారు. బీసీ హాస్టల్స్లో ఇష్టారాజ్యం బీసీ హాస్టల్స్, విద్యాసంస్థల నిర్వహణలో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. నిబంధనలు పాటించేది లేదు. గతంలో ఇచి్చన ఆదేశాలను లెక్క చేసేదిలేదు. మాకు తోచింది చేస్తాం. మేం అనుకున్నదే అమలు చేస్తాం అనే రీతిలో సాగుతోంది. మంత్రి నుంచి అధికారుల వరకు ఎవరికి తోచినట్టు వారు ఇష్టారాజ్యంగా చేయడంతో మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకులాలు ఆస్తవ్యస్తంగా మారాయి. ఇటీవల డిప్యుటేషన్ల దందా పెద్దఎత్తున సాగింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ స్కూల్స్ (గురుకులాలు)లో ఒక్క ప్రిన్సిపల్ మాత్రమే రెగ్యులర్ ఉద్యోగి ఉంటారు. మిగిలిన టీచింగ్ స్టాఫ్ అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవాల్సి ఉంటుంది. ఆ పోస్టుల్లో కాంట్రాక్ట్ టీచర్ల నియామకం లేకపోవడంతో గెస్ట్ టీచర్లతో నడిపిస్తున్నారు. ఆ పోస్టుల్లో సైతం రెగ్యులర్ టీచర్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డగోలుగా డిప్యుటేషన్లు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని 109 బీసీ గురుకులాల్లో 1,253 గెస్ట్ ఫ్యాకల్టీ (టీచర్లు) 8–10 ఏళ్లనుంచి సేవలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి పగలు బోధనతోపాటు రాత్రి భద్రత పేరుతో బోధనేతర పనులను, వాచ్మెన్ విధులను కూడా అప్పగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కాంట్రాక్ట్ పోస్టుల్లో పనిచేస్తున్న గెస్ట్ టీచర్లను పొమ్మనకుండా పొగబెట్టినట్టు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ టీచింగ్కు డిప్యుటేషన్లు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కేవలం రూ.24వేల వేతనానికి పనిచేస్తున్న గెస్ట్ టీచర్లు రెండు, మూడు జిల్లాలు దాటి వెళ్లలేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాల్లో రెండో శనివారం సెలవు ఉంది. ఒక్క బీసీ గురుకులాల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రెండో శనివారం కూడా పనిచేయాలని ఆ సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఎస్సీ గురుకులాల్లో వేతన వెతలు మరోవైపు సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లోని టీచర్లను వేతన వెతలు వెంటాడుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో 1,500 మంది పార్ట్టైమ్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 750 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ)కు రెండు నెలల వేతనాలు రాలేదు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. గిరిజన టీచర్ల వేదన వినేదెవరు! ఇక రాష్ట్రంలో 191 గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 10–18 ఏళ్లుగా సేవలందిస్తున్న 1,143 మంది అవుట్సోర్సింగ్ టీచర్ల వేదనను చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. డీఎస్సీలో వీరంతా పోస్టులు కోల్పోవడంతో సర్దుబాటు చేస్తామంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇదే సమయంలో వారికి రెండు నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
అభివృద్ధి మాటున విశాఖలో భూ దోపిడీ
సాక్షి, అమరావతి: పర్యాటకాభివృద్ధి మాటున చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ దోపిడీకి పాల్పడుతోంది. అత్యంత ఖరీదైన ప్రాంతాలు, పారిశ్రామికవాడలు, పోర్టులకు సమీపంలోని భూములను కొల్లగొట్టేందుకు భారీ కుట్ర నెరుపుతోంది. డొల్ల కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి పెట్టుబడుల పేరుతో తీర ప్రాంతాల్లో ఖరీదైన భూములను దోచేస్తోంది. కేవలం ఆరు నెలల క్రితం పెట్టిన ఓ కంపెనీకి రెండు వేర్వేరు ప్రాంతాల్లో 35 ఎకరాల భూములు కేటాయించింది. దీని విలువ ఏకంగా రూ.660 కోట్ల నుంచి రూ.850 కోట్లుగా ఉంది. ఆతిథ్య రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థలకు సైతం వీలుపడని పెట్టుబడులను.. డొల్ల కంపెనీలను అడ్డుపెట్టుకుని డీపీఆర్లు చూపిస్తూ భూ కుంభకోణానికి తెరతీస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక పెట్టుబడులను ప్రోత్సహించే పేరుతో కనీస మూలధన పెట్టుబడి లేని సంస్థలు రూ.వందల కోట్ల పెట్టుబడి పెడతామంటూ ముందుకొస్తే వాటికి ఖరీదైన భూములు అప్పగించేస్తోంది. ‘మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్థ 2025 మే 5న రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ)లో నమోదైంది. ఆ కంపెనీ చిరునామా విశాఖలోనే ఉంది. అయితే, సదరు కంపెనీ మూలధన పెట్టుబడిగా రూ.15 లక్షలు మాత్రమే చూపించింది. ఈ కంపెనీ నమోదైన ఐదు నెలల్లోనే రూ.255.91 కోట్లతో విశాఖలో రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్ నిరి్మస్తామంటూ ముందుకొచ్చింది. ఆ వెంటనే ప్రభుత్వం విశాఖలోని కొత్తవలసలో 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి విశాఖ తీర ప్రాంతంలో ఎకరా భూమి సగటు విలువ రూ.40కోట్ల నుంచి రూ.50కోట్లకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.600కోట్ల నుంచి రూ.750 కోట్లకుపైగా విలువైన భూమిని ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా అదే కంపెనీ మచిలీపట్నంలో రూ.157.53 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్కుతో కూడిన రిసార్టు కడతామంటే.. వెనువెంటనే ఈ నెల 13న తాళ్లపాలెంలో రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన మరో 20 ఎకరాలను కేటాయించింది. ఇక్కడ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తరంగా తలపెట్టిన పోర్టు నిర్మాణంతో మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ భూమి మార్కెట్ రేటు ఎకరం రూ.3–5 కోట్లకుపైగా ఉంది. అంటే, రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్లు విలువైన భూములను అప్పనంగా ఈ కంపెనీకి అప్పగించేస్తోంది. వాస్తవానికి మచిలీపట్నం తీరంలో పోర్టు వచి్చన తర్వాత భూముల విలువ పెరిగింది. పోర్టు సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్కడి భూములు అమూల్యంగా మారతాయి. ఇంతటి విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల మాటున చంద్రబాబు సర్కార్ మింగేస్తోంది. రూ.15 లక్షల సంస్థ రూ.413.44 కోట్ల పెట్టుబడి! ‘మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నమోదు సమయంలో మూల ధన పెట్టుబడి కేవలం రూ.15 లక్షలు మాత్రమే. అలాంటి సంస్థ ఆరు నెలలు తిరగకుండా ఒకచోట రూ.255.91 కోట్లు, మరొకచోట రూ.157.53 కోట్లు కలిపి రూ.413.44 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చేసింది. దీన్నిబట్టి ఇక్కడ ఈ సంస్థను కేవలం భూములు కాజేసేందుకు మాత్రమే తెరపైకి తెచి్చనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.660 కోట్ల నుంచి రూ.850 కోట్ల విలువైన భూములను కారుచౌకగా లీజు పేరుతో ఏకంగా 99 ఏళ్లపాటు తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగంగా అర్థమవుతోంది. వాస్తవానికి ఈ కంపెనీ ఐదుగురు డైరెక్టర్లతో ఏర్పాటైంది. ఇందులో ఒక వ్యక్తి ఛత్తీస్గఢ్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో కలిసి ఆతిథ్య రంగంలో పని చేస్తున్నారు. అయితే, సదరు కంపెనీ రెండేళ్ల కిందట నమోదవ్వగా ఇప్పటి వరకు ‘మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్’(ఎంసీఏ)కు తమ ఆరి్థక లావాదేవీల వివరాలను సమరి్పంచలేదు. పైగా ప్రతి కార్పొరేట్ సంస్థ/ప్రైవేటు సంస్థకు క్రెడిట్ రేటింగ్ చాలా కీలకం. ఆ క్రెడిట్ రేటింగ్పై ఆధారపడే సంస్థ పనితీరును అంచనా వేస్తారు. అలాంటిది ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తున్న ఫర్మ్ ఒక సంస్థ నుంచి క్రెడిట్ రేటింగ్ను విత్డ్రా చేసుకుని మరో సంస్థ ద్వారా తీసుకోవడం సందేహాలను కలిగిస్తోంది. ఆ క్రెడిట్ రేటింగ్ ఇచ్చిన సంస్థ కూడా ఉత్తమమైన క్రెడిట్ రేటింగ్ ఇచ్చే సంస్థల జాబితాలో లేకపోవడం గమనార్హం. పైగా ఈ ఫర్మ్కు రూ.50కోట్లకుపైగా బ్యాంకు రుణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సంస్థల్లోని వ్యక్తులు కొత్తగా కంపెనీలు పెడితే పాలకులు చెప్పారని పర్యాటకశాఖ రూ.వందల కోట్ల విలువైన భూములను కళ్లు మూసుకుని అప్పగించేస్తోంది. డొల్ల ప్రాజెక్టులకు భూ సంతర్పణ చంద్రబాబు అధికారంలోకి వచి్చనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములపై కన్నేసింది. పరిశ్రమలు, పర్యాటకం పేరుతో నచి్చనోళ్లకు కావాల్సినంత కట్టబెట్టేస్తోంది. విశాఖలో భూముల కేటాయింపుల వెనుక ఓ కీలక నేత చకచకా పావులు కదిపినట్లు సమాచారం. మచిలీపట్నంలో ఎప్పటి నుంచో భూములపై మనసు పడ్డ ఓ మంత్రి ఇదే అదునుగా ఈ సంస్థను అడ్డుపెట్టుకుని భూములు పొందేందుకు ప్రణాళిక వేసినట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడ ఏ సంస్థకు ప్రభుత్వ భూములు కేటాయించినా, దాని వెనుక ప్రభుత్వ పెద్దలు, బినామీలు ఉండటం సర్వసాధారణమైంది. ముఖ్యంగా పర్యాటక శాఖలోని ఓ కన్సల్టెంట్ సంస్థ ఇలాంటి డొల్ల ప్రాజెక్టులను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. సదరు సంస్థ ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ప్రభుత్వం భూములు కేటాయించేలా కంపెనీలకు లేని అర్హతలతో డీపీఆర్ రూపొందించి భారీగా ముడుపులు మూట కట్టుకుంటున్నట్టు బహిరంగ విమర్శలున్నాయి. మొత్తంగా భూములు పొందిన సంస్థ.. ప్రభుత్వ పెద్దలు.. మీకింత–మాకింత అని పంచుకోవడమేనని పర్యాటక శాఖలో అధికారవర్గాల మధ్య చర్చ నడుస్తోంది. -
అవినీతి పునాదులపై అమరావతి
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే ఎల్లో మీడియా వంశీకుడు. నిజమే కదా, ఎవరున్నారక్కడ? 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములిచ్చి జీవనాధారం కోల్పోయి, ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న త్యాగరాజుల కుటుంబాలు తప్ప! సర్కారిచ్చే ప్లాట్లు అమ్ముకుంటే గదా వారికి బ్యాంకులతో పని. ఆ భూము లపై ఆధారపడి పొట్టబోసుకున్న వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయో? భూసేకరణ ఫలితంగా సుమారు లక్ష కుటుంబాలు భుక్తిని కోల్పోయిన ఇచ్చోటనే నిన్న (శుక్రవారం) అమరావతి ఆర్థిక నగరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్య భాగస్వామి కావటం మూలాన ఆయనకు ఆనందం కలిగించే విధంగానే కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాదులో ఆయన స్థాపించిన ఆర్థిక నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ, ఇది కూడా అలాగే అభివృద్ధి సాధించాలనీ ఆమె ఆకాంక్షించారు. హైదరా బాదులో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’కి 2004 నవంబర్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని ఉజ్జ్వల ప్రస్థానం ప్రారంభమైంది. ‘క్రెడిట్ చౌర్యం’ అనేది బాబు బలహీనత. ఆ బలహీనతలో భాగంగా ఐటీ విప్లవం దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మాణం దాకా అనేక చరిత్రాత్మక ఘట్టాలు ఆయన ఖాతాలో చేరిపోతుంటాయి. అసలైన సమాచారం కంటే నకిలీ సమాచారమే ఎక్కువగా అందుబాటులో ఉన్నందువల్ల కేంద్ర మంత్రి కూడా పొరపాటు పడి ఉండవచ్చు. బౌద్ధ తాత్వికుడు, రసాయన శాస్త్ర పితామహుడైన ఆచార్య నాగార్జునుని పేరును కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం వాడైన నాగార్జునుని గురించి టిబెట్ విద్యార్థులకు కూడా తెలుసన్న సంగతిని తాను అక్కడికి వెళ్లినప్పుడు గమనించానని ఆమె చెప్పారు. దేవతల రాజధానయిన అమరావతిని అల నుంచి ఇలకు దించిన అపర భగీరథుడి గురించి కూడా ప్రపంచ ప్రజలకు తెలుసని ఆమె చెప్పకపోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ‘స్కిల్ కుంభకోణం’ కేసులో చంద్రబాబు అరెస్టయి నప్పుడు 55 దేశాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేశారని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రభావం అంతో ఇంతో ఉంటుందేమోననే అను మానం సహజం.అట్టి దేవతల రాజధాని అమరావతికి ఇప్పుడున్న 54 వేల ఎకరాలు సరిపోవని, అర్జెంటుగా ఇంకో 20 వేల పైచిలుకు ఎకరాల భూముల సమీకరణకు సర్కార్ సైరన్ మోగించింది. ఇంతటితో ఆగదట! ఇంకో పాతిక వేల ఎకరాల కోసం మూడో రౌండ్ సమీకరణ కూడా సిద్ధంగా ఉన్నదని విశ్వసనీయ సమా చారం. ఏతావతా రాజధాని పేరుతో లక్ష ఎకరాల సారవంత మైన పంట భూమికి సర్కార్ టెండర్ పెట్టింది. ఇప్పుడీ లక్ష ఎకరాల్లో నివసించడానికి లక్షల సంఖ్యలో నర నారీ జనసందోహం ఎక్కడ నుంచి వెల్లువెత్తి రావాలి? ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేసే వారు లేదా ప్రైవేటు కంపెనీలు వస్తే వాటిలో పని చేసేవారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ మోడల్లో కార్పొరేట్ రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అద్దెలు గాని, అమ్మకాలు గాని మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువు కోవడానికి ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు పెట్టబో తున్నారు? ప్రైవేట్ విద్యాసంస్థలకు భూ పందేరాలు చేయడం తప్ప, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వగైరా ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తాయి. విజయ వాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి అన్ని వసతు లున్న పట్టణ ప్రాంతాలు చేరువలో ఉండగా అమరావతిలోనే ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పడు తుందో చెప్పడం కష్టం. నాలుగొందల ముప్పయ్యేళ్ల్ల కిందట గోల్కొండ రాజైన ఖులీ కుతుబ్షా హైదరాబాద్ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తూ ‘‘సముద్రాన్ని చేప లతో నింపినట్టు ఈ నగరం కూడా ప్రజలతో నిండి ఉండేట్టు ఆశీర్వదించమ’’ని అర్థించాడు. తాను మహారాజు గనుక ఆదే శాలు జారీ చేసినంత మాత్రాన ప్రజలు నివసించబోరనీ, సరైన ఉపాధి, నివాసయోగ్య పరిస్థితులు ఏర్పడితేనే నగరం అభివృద్ధి చెందుతుందనీ గ్రహింపు ఉన్నవాడు కనుకే అటువంటి పరిస్థితు లను కల్పించాలని అల్లాను అభ్యర్థించాడు. అప్పటికే గోల్కొండ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రమైనప్పటికీ దైవంపైనే ఖులీ భారం వేశాడు. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అటువంటి నివాసయోగ్య పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ముఖ్యం.గాంధీనగర్ను గుజరాత్ రాజధానిగా నిర్మించి 50 ఏళ్లు దాటినా అది ఇప్పటికీ అహ్మదాబాద్ నీడలోంచి బయటకు రాలేదు. మహానగరంగా మారలేదు. భువనేశ్వర్ ఇప్పటికీ కటక్ కొంగు పట్టుకునే నడుస్తున్నది. నయా రాయ్పూర్ కథ కూడా అంతే! మలేసియా రాజధానిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ‘పుత్రజయ’ ఇప్పటికీ కౌలాలంపూర్కు అనుబంధ నగరమే. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజన్’ వంటి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం వేరు, అది రాజధాని నగరమే కావాలను కోవడం వేరని నిపుణులు చెబుతున్నారు. ‘గ్రోత్ ఇంజన్’గా అభి వృద్ధి చెందడానికి మానవ సంకల్పంతో పాటు కొన్ని సహజమైన అనుకూలతలు కూడా ఆ నగరానికి ఒనగూడి ఉండాలి. అటువంటి అనుకూలతలు అమరావతితో పోల్చితే విశాఖపట్నానికి దండిగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నది. విశాఖను ‘గ్రోత్ఇంజన్’గా మార్చుకొని, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలంటే లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపా యల అప్పు అవసరం లేదు.ఒక రాష్ట్రానికి గాని, దేశానికి గాని అభివృద్ధి ప్రణాళికలను రచించే ముందు ఆ ప్రాంత బలాబలాలను గమనంలోకి తీసు కుంటారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్కున్న సహజ బలాల్లో మూడు ముఖ్యమైనవి – ఒకటి సముద్రతీరం, రెండు వ్యవసాయ రంగ మయితే, మూడోది బహుళ పట్టణ వ్యవస్థ. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా 15 ప్రగతిశీలమైన పట్టణాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించి, దృష్టి పెడితే విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలకుతోడు మరో 10 పట్టణాలు ఒక్కోటి పది లక్షల జనాభాకు ఉపాధినీ, ఆశ్రయాన్నీ ఇవ్వ గలవు. అమరావతి కోసం ఇప్పుడు సేకరించిన భూమే రాజ ధాని అవసరాలకు సమృద్ధిగా సరిపోతుంది. మరింత భూసేక రణ, మరింత రుణ సేకరణ వంటి వృథా ప్రయాసలు తప్పు తాయి. పట్టణీకరణ నిపుణులు చెబుతున్న మాటలివి. ప్రతి పక్షాల విమర్శలు కావు.రాజధాని అప్పులు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసింది. రాజధాని కోసం 40 వేల కోట్లు చేశారు. మొదటి దశలోని 53 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి 77 వేల కోట్లు కావాలని చంద్ర బాబు స్వయంగా అన్నారు. ఇప్పుడిది లక్ష ఎకరాలకు మారింది. ఇంకెంత కావాలి? కేవలం రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రెండు కోట్ల చొప్పున లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని నిర్మాణ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, ఇతర అవస రాల కోసం ఇంకో లక్ష కోట్లు. మొత్తం మూడు లక్షల కోట్ల అప్పును ఎక్కడ తెస్తారు? దానిని ఎవరి నెత్తిన రుద్దుతారు? రాజధానితో సంబంధం లేకుండా ఏడాదిన్నరలోనే రెండు లక్షల కోట్లు దాటిన మిగతా అప్పు ఐదేళ్లలో ఎంత కావాలి? ఈ భార మంతా ఎవరు మోయాలి? ప్రజలే కదా! అమరావతిని రాజ ధానిగా కొనసాగిస్తూనే, సింగిల్ గ్రోత్ ఇంజన్ మోడల్ (విశాఖ), మల్టిపుల్ గ్రోత్ ఇంజన్ల మోడల్ (డజన్ నగరాలు) వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, లక్ష ఎకరాలు, మూడు లక్షల కోట్లు, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో రిస్కులతో కూడిన బాటలోనే పయనించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారో కనిపెట్టడం కష్టసాధ్యం కాదు.నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తిన వార్తలు విన్నాము. కానీ నగరంలోంచి నీళ్లను నదిలోకి ఎత్తిపోసే విడ్డూ రాన్ని మనం కేవలం అమరావతిలోనే చూస్తున్నామని ఒక నిపు ణుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నదులకైనా, వాగులువంకలకైనా వాటి సహజ ప్రవాహ గతి వాటికి ఉంటుంది. కృత్రి మంగా దారి మళ్లింపు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాటి సహజ మార్గాలను వెతుక్కుంటూ, బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాము. కొండవీటి వాగు కృష్ణలో కలిసే సహజ మార్గంలో మహానగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని వరద నీటి ఎత్తిపోత అనే రిస్కును తలకెత్తుకోవడానికి కారణం నిధుల ఎత్తిపోత అనే మహద్భాగ్య అవకాశమేనని వస్తున్న విమర్శలను కాదనగలరా? రాజధాని నగరంలో నిర్మాణాలకు చదరపు అడుగుకు తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎంత వైభవోపేతంగా కట్టినా నాలుగున్నర వేలు దాటదని నిర్మాణరంగంవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆరు వరుసల జాతీయ రహదారులను నిర్మించడానికి ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ కిలోమీటర్కు 25 కోట్లు ఖర్చు పెడుతున్నదట! మన అమరావతిలో దాన్ని 53 కోట్లుగా డిసైడ్ చేశారు. ఇటువంటి అవినీతి వ్యవహారాల మీద ‘సాక్షి’ మీడియాలో సవివరంగా కథ నాలు వచ్చినా, నిపుణులు ఎందరో సోషల్ మీడియా వేదికపై గొంతు విప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. అంటే, అందులో ఖండించడానికి ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన ప్రభుత్వం అప్పులు తెచ్చి రాజధాని కోసం మూడు లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో సగభాగం కైంకర్యాలకే సరిపోతుందన్నమాట! బలమైన ఆధా రాలు, అనుమానాలతో వస్తున్న ఈ విమర్శకు ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది కనుకనే పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నదని జనం నమ్ముతున్నారు.పాలక కూటమి కార్యకర్తలు, ఛోటానేతలు కూడా రాజధాని అవినీతిని నమ్ముతున్నారు. అందువల్లనే క్షేత్రస్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. ‘‘మంత్రిగారి కొడుక్కి నీ మీద మనసైంది. రా వచ్చెయ్’’మంటూ ఒంటరి మహిళలకు మంత్రిగార్ల పీఏలు బరితెగించి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఛోటామోటా నాయ కులు నిరుపేద హాస్టల్ బాలికలను నిర్జన ప్రదేశాలకు లాక్కెళ్తు న్నారు. ‘‘నీ ఉద్యోగం మాకు కావాలి, నువ్వు రాజీనామా చేసెయ్’’ అంటూ బలహీనవర్గాల చిరు మహిళా ఉద్యోగులను జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కీచక పర్వాలను సృష్టిస్తున్నారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, పేకాట మాఫియా చెలరేగిపోతున్నాయంటూ ఒక పోలీస్ హోమ్ గార్డ్ నిస్సహాయ ఆవేదనతో ఎస్పీకి పంపిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విధి నిర్వహణ కోసం అక్రమార్కుల ఆచూకీ తీస్తే లాఠీలతో తొక్కి చంపుతామన్నారట! తన పై అధికారులు కూడా ఈ మాఫియా ముఠాలకు భయపడుతున్నారని ఆ హోంగార్డు ఆవేదన వెలిబుచ్చారు. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.ఇక సాధారణ పరిపాలనను చాప చుట్టేశారు. ‘ఓన్లీ అమరా వతి’! ఇదే సర్కారు వారి తిరుమంత్రం! గిట్టుబాటు ధరల్లేక, రవాణా ఖర్చులు కూడా రాని దుఃస్థితిలో పంట పొలాలను దున్నేస్తున్న రైతుల కన్నీటి గాథలు అన్ని ప్రాంతాల్లోనూ వినిపి స్తున్నాయి. ధాన్యం సేకరణ మాట అటుంచి దాచుకునేందుకు గోనె సంచుల్ని కూడా అందివ్వలేని జుగుప్సాకరమైన పరిస్థి తుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మార్కెట్లో ఏ పంటకూ మద్దతు ధర దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్కవ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వయంత్రాంగం నిస్తేజంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జన జీవితం గాలిలో దీపం. కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్లు దిష్టి పెట్టారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారట! ఇక ఆ రైతాంగం ఆయనకు సమస్యల గురించి ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఏం చెబు తారో? న్యూయార్క్, లండన్ నగరాలు మన అమరావతికి దిష్టి పెట్టాయని ఆయన అనకుండా ఉండుగాక!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
లా అండ్ ఆర్డర్ విషయంలోనూ చంద్రబాబు మోసమే!
సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.. అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మాదకద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలయ్యను హత్య చేశారన్నారు. ‘‘హత్య చేసిన నిందితులు మరోవైపు పోలీసులపై దాడి చేశారు. డ్రగ్స్ మాఫియా పోలీసులపైనే తిరగబడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ కాకాణి ప్రశ్నించారు. ‘‘ఏపీని గంజాయి, డ్రాగ్స్ హబ్గా చంద్రబాబు మార్చారు. వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తానన్న చంద్రబాబు.. నేడు 555 రోజులవుతుంది అధికారం చేపట్టి.. నేడు శాంతి భద్రతల విషయంలో కూడా మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని నేను అనుకోవడం లేదు. లోకేష్ ఆధ్వర్యంలో ఏదో సబ్ కమిటీ అన్నారు. ఏం వెలగబెట్టాడో సమాధానం చెప్పాలి...విశాఖ కేంద్రంగా జాతీయ డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్న తీరు చూశాం. ఇతర దేశస్థులు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి మాదకద్రవ్యాల సరఫరా సాగిస్తుంటే నిఘా వర్గం ఏం చేస్తోంది?. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా ఇంటిలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ఇంకోటి లేదు’ అంటూ కాకాణి మండిపడ్డారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీ భూముల్ని కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారాయన. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక స్కాం ఉంది. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీ అయ్యింది. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి జీవోలు ఇచ్చారు..తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చేశారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారు. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా సరే జగన్ కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలాగా ఉన్నాయా?. అత్యద్భుతంగా జగన్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని సింపుల్గా అమ్మేస్తారా?. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయలేదు. కానీ చంద్రబాబే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వారికి ఇచ్చాక కూడా స్టాఫ్కి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఏంటసలు?. ఒక పేదవాడు అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఉంటుందా?. ఒకవేళ ఆస్పత్రి 70% ఫుల్ అయిందని చెప్పి వెనక్కు పంపితే ఆ పేదోడు బతికేదెలా?. వైద్య విద్య మీద ఈ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా?. ఇప్పటికే చంద్రబాబు వైఖరి వల్ల 2,750 మెడికల్ సీట్లు కోల్పోయాం. పాడేరు మెడికల్ కాలేజీ విషయంలో 50 సీట్లు కోల్పోయాం. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భిణులు, హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో కనపడలేదా?. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోంది. మేం అధికారం చేపట్టాక ప్రైవేటీకరించిన మెడికల్ కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం అని అన్నారాయన. -
Ambati: రాజధాని పేరిట భారీ కుట్ర మరో 20 వేల ఎకరాలు స్వాహా!
-
చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి మెగా సీరియల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు. -
నేను సీఎం.. నా కేసులు మూసేయండి
-
బాబు, నాదెండ్లపై నిప్పులు చెరిగిన పేర్ని నాని
-
చేసిన స్కాముల కేసులను క్లోజ్ చేసేస్తోన్న చంద్రబాబు
-
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
‘ఈనాడు’ బరితెగింపు.. అవే అబద్ధాలు.. అదే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: టీడీపీ భజంత్రీ పత్రిక, దుష్ప్రచార విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి తన మార్కు కుట్రకు బరితెగించింది! దశాబ్దాలుగా అవాస్తవాలు వండివార్చి నిత్యం ఉషోదయంతో ప్రజలను తప్పుదారి పట్టించే కుతంత్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో దారుణంగా విఫలమైన చంద్రబాబుకు రక్షా కవచంగా మరోసారి దుష్ప్రచారానికి దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం సంబంధంలేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో ఆయనకు ముడిపెట్టేందుకు యత్నిస్తోంది. ఆ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్రెడ్డి ఆయనకు సన్నిహితుడు అంటూ నిస్సిగ్గుగా అవాస్తవ కథనాన్ని ప్రచురించి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.సునీల్రెడ్డిని సిట్ విచారించిన సమాచారాన్ని వార్తా కథనంగా ప్రచురిస్తూ, అందులో ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు వివరాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారానికి తెగబడింది. కేవలం ముఖ పరిచయం ఉన్నవారిని బినావీులని చిత్రీకరిస్తోంది. మరి అదే సిద్ధాంతం ప్రకారం.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, గీతం మూర్తి ఆయనకు బినావీులనుకోవాలా? చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్న సునీల్రెడ్డి దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడని, వైఎస్ జగన్కు సన్నిహితుడని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. లేని ఆస్తులను, లేని నగదును సునీల్వంటూ దుష్ప్రచారం చేస్తోంది.అసలు ఎమ్మార్ కేసుతో వైఎస్ జగన్కు ఏం సంబంధం? ఈ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని సీఐడీ చార్జిషీట్లోనే పేర్కొంది. ఇంకా చెప్పాలంటే.. ఆ కంపెనీకి నాడు భూములిచ్చిందే చంద్రబాబు. దాని ప్రమోటర్ ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇస్తేగిస్తే చంద్రబాబుకే ముడుపులివ్వాలి! వైఎస్ జగన్పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, నాడు కాంగ్రెస్ కుట్రే! టీడీపీ నేతలతో కలసి కేసులు వేయించి నాడు కిరణ్కుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కాపాడింది చంద్రబాబే!‘ఈనాడు’ దుష్ప్రచార కుట్రతన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే చంద్రబాబు డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈనాడు పత్రిక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఆ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చింది. ఆయన చెప్పిన పనులను ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పని చేసే కుడిభుజం అంటూ పచ్చి అవాస్తవాలు ప్రచురించడం విస్మయపరుస్తోంది. ఈ పదేళ్లలో కలిసినట్లు ఒక్క ఫొటో చూపగలదా? చూపలేదు. ఎందుకంటే దశాబ్దంపైగా వైఎస్ జగన్ను సునీల్రెడ్డి ఏనాడూ వ్యక్తిగతంగా కలవనే లేదు. అయినప్పటికీ ఎల్లో మీడియా పాత ఫోటో ప్రచురించి విష ప్రచారానికి తెగబడింది. సునీల్రెడ్డి గత కొన్నేళ్లలో వైఎస్ జగన్ను ఎప్పుడైనా కలిసినట్లు ఈనాడు గానీ, చంద్రబాబు గానీ చూపించగలరా..?‘ఎమ్మార్ ప్రాపర్టీస్’కు భూములిచ్చింది బాబేఅసలు వాస్తవం ఏమిటంటే... ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టుకు 1999–2004 మధ్య టీడీపీ హయాంలో ఆమోదం తెలిపింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే. భూములు కేటాయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రమోటర్లు, డైరెక్టర్లు చంద్రబాబుకే సన్నిహితులు. బాబు కుట్రతోనే వైఎస్ జగన్పై అక్రమ కేసులువైఎస్ జగన్పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, అప్పటి కాంగ్రెస్ కుట్రేనన్నది బహిరంగ రహస్యం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానంతో జట్టు కట్టి చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావు, టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు కలిసే వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడమే అందుకు తార్కాణం. ఇక అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబే. ఆ విధంగా కాంగ్రెస్, టీడీపీ కలిసే వైఎస్ జగన్పై అక్రమ కేసులు నమోదు చేయించాయన్న వాస్తవం ప్రజలందరికీ తెలుసు. అదే కుట్రను కొనసాగిస్తూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పేరిట వైఎస్ జగన్పై ఈనాడు పత్రిక విష ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతోనే అవాస్తవ కథనాలను ప్రచురిస్తోంది.ఆ కుటుంబాల ఆస్తులన్నీ బాబు బినావీుయేనా...!ఫొటోలు దిగితేనే సన్నిహితుడు, బినామీ అయితే... చంద్రబాబు, లోకేశ్ ఎందరెందరితోనో ఫొటోలు దిగుతూ ఉంటారు. వారంతా ఆ తండ్రీకుమారులకు బినావీులుగానే పరిగణించాలా మరి...! అసలు క్విడ్ప్రోకో, బినామీ అనే పదాలు చంద్రబాబుకే వర్తిస్తాయి. ‘ఈనాడు’ రామోజీరావు కుటుంబం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం, టీవీ 5 బీఆర్ నాయుడు కుటుంబం, విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం. భరత్ కుటుంబం... ఇలా ఈ జాబితాకు అంతే లేదు. వారందరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే కాదు... ఆయన రాజకీయ కుట్రలో భాగస్వాములు కూడా. 1995లో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్తో ఎన్టీరామారావుకు వెన్నుపోటు కుట్రలో వారందరూ భాగస్వాములే కదా. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు.ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరబట్టి ఫిల్మ్ సిటీ నిర్మించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్ రూ.వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. అదే రీతిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, విశాఖఫట్నంలో ‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి (ప్రస్తుత టీడీపీ ఎంపీ భరత్ తాత) కుటుంబాల ఆస్తులు అమాంతంగా పెరిగిన విషయం బహిరంగ రహస్యమే. అదంతా చంద్రబాబు క్విడ్ ప్రోకో కుట్రనే. అంటే రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబాల ఆస్తులన్నీ చంద్రబాబు బినామీ ఆస్తులేనన్నది స్పష్టమవుతోంది. -
క్రెడిట్ చౌర్యం.. క్యాబినెట్ సాక్షిగా బట్టబయలు!
సాక్షి, అమరావతి: విశాఖకు గూగుల్ రాక వెనుక నిజాలను తొక్కిపెట్టి సంకుచిత బుద్ధితో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించిన వైనం తాజాగా మంత్రివర్గ సమావేశం సాక్షిగా మరోసారి బట్టబయలైంది! విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాంబిల్లి, అనకాపల్లి పరిధిలో అడవివరం, తర్లువాడ గ్రామాలలో 480 ఎకరాలను గూగుల్తో డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార అనుబంధం ఉన్న అదానీకి కేటాయించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడమే దీనికి నిదర్శనం. అదానీ గ్రూపు సంస్థలు అదానీ ఇన్ఫ్రా, అదానీ కోనెక్స్, అదానీ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలను గూగుల్ నోటిఫైడ్ పార్టనర్స్గా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదించడం గమనార్హం. విశాఖలో అదానీ సంస్థ డేటా సెంటర్ నిర్మిస్తుందని.. అందుకోసం భూమి అప్పగించాలంటూ గత అక్టోబర్ 4న రాష్ట ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేఖ రాయడం గమనార్హం.జగన్ హయాంలోనే డేటా సెంటర్కు శంకుస్థాపనవిశాఖ నగరాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలోనే 2020 నవంబర్లో (కోవిడ్ సమయంలో) అదానీ డేటా సెంటర్కు బీజం పడటం.. ఆ తర్వాత 2023 మే 3న అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగడం తెలిసిందే. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. మేర సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టారు. ఈమేరకు సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ హయాంలోనే 2021 మార్చి 9న లేఖ రాయడం గమనార్హం. విశాఖలో అదానీ డేటా సెంటర్కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 1,000 మెగావాట్లకు డేటా సెంటర్ను విస్తరిస్తున్నారు. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్, కేంద్ర ప్రభుత్వం, అదానీ కృషి ఎంతో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. అదానీ పేరెత్తితే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని బాబు సంకుచిత బుద్ధితో వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఉద్యోగాలు కూడా ఇచ్చేలా నాడు ఒప్పందం.. డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుండగా.. అదానీ గ్రూప్ దాదాపు రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్రానికి గూగుల్ను తెస్తున్నందుకు అదానీకి ధన్యవాదాలు చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇవ్వలేదు. ఆ పేరు చెబితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి గురించి కూడా ప్రస్తావించాల్సి వస్తుందనే భయంతోనే నిజాలను కప్పిపుచ్చి గుట్టుగా వ్యవహరించారు. కేంద్రం, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ రాకకు మార్గం సుగమమైందని చెప్పటానికి చంద్రబాబు సంకోచించారు. కేవలం డేటా సెంటర్ ఏర్పాటు మాత్రమే కాకుండా 25 వేల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోరడం గమనార్హం. తద్వారా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందంలో పొందుపరిచింది. -
44వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించే దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భూ దాహం తీరడం లేదు. మలి విడతలో తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోని 11 గ్రామాల పరిధిలో 44,676.74 ఎకరాల భూమిని సమీకరించే దిశగా అడుగులు వేశారు. గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు. మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి.. మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచి్చంది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ పదేపదే చెబుతూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలీటిగా మిగిలి పోతుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే– మలి విడత భూ సమీకరణ తప్పదంటూ గురువారం రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఇందుకు రైతులు సహకరించకపోతే అమరావతి చిన్న మున్సిపాలీటిగా మిగులుతుందని అన్నారు.మూడో విడత కూడా ఖాయం ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్లో రెండో విడత తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిలో రైతులకు చెందిన 16,666.57 ఎకరాల పట్టా భూమి, మరో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి వెరసి.. 20,494.57 ఎకరాల భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. మిగతా నాలుగు గ్రామాల్లో (మొతడక, తాడికొండ, కంతేరు, కాజా) 24,182.17 ఎకరాలను మూడో విడతలో సమీకరించడం ఖాయమని అధికార వర్గాలు తెలిపాయి. భూ సమీకరణ మూడో విడత కూడా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేయడం దీన్ని బలపరుస్తోంది. మొత్తంమ్మీద 98,424.74 ఎకరాలలో రాజధాని నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టమవుతోంది. అందుకయ్యే వ్యయాన్ని అప్పుగా తెచి్చ.. రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని ఆరి్థక నిపుణులు తేగిసి చెబుతున్నారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఏమాత్రం కాదన్నది మలి విడత భూ సమీకరణతోనే స్పష్టమైందని చెబుతున్నారు. మిగిలిందన్న 8,250 ఎకరాల మాటేంటి? గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు 2015లో ప్రభుత్వం సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కలి్పంచేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కు భూములు లేవని చెప్పడంపై రైతులే విస్తుపోతున్నారు. ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లోనే.. రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని గత ఏప్రిల్ 16న 16వ ఆరి్థక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.1.50 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676.74 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి మరో రూ.1.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధానా.. రియల్ ఎస్టేట్ వెంచరా? చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందా.. లేక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వ్యాపారం చేస్తోందా.. అని ఆరి్థక రంగ నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజ«దాని నిర్మాణంపై దృష్టి సారించకుండా.. మలి విడత భూ సమీకరణకు సిద్ధమవ్వడం ఏమిటని నిలదీస్తున్నారు. పదేళ్ల క్రితం రాజధానికి భూములు ఇచి్చన రైతులకు ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని.. అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి18 నెలలైనా, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రాజధాని రైతులు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ఈ స్థితిలో మలి విడతగా 44,676.74 ఎకరాల సమీకరణకు సిద్ధమవడంపై అటు రైతులు, ఇటు ఆర్థిక వేత్తలు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.భూముల ధరలు పెంచుకోవడం, కమీషన్లే లక్ష్యం రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం మలి విడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలను నిపుణులు, అధికార వర్గాల వారు ఎత్తిచూపుతున్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక (నిధులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోకుండా) లేకుండా రాజధాని ప్రాంతంలో 2016–19 మధ్య రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఈ పనుల కోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్లను అప్పు తెచ్చింది. కానీ.. ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే 2019 మే నాటికి వ్యయం చేసింది. ఆ పనులు పూర్తి కావాలంటే రూ.28,047.82 కోట్లు కావాలి. ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. 2018–19 ధరలతో పోలి్చతే.. పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరల్లో పెద్దగా మార్పులేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105% పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు, ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి రూ.7,500 కోట్లు, ఏపీఎస్పీసీఎల్ నుంచి రూ.1,500 కోట్లు వెరసి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే రూ.61 వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. రాజధాని కామధేనువు కాదు.. అప్పులకుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది పెరుమాళ్లకెరుక! రాజధాని నిర్మాణ పనులు రూ.62 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించి.. అందులో పది శాతం అంటే రూ.6,200 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పేసి నీకింత–నాకింత అంటూ పెద్దలు పంచుకుతిన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2014–19 మధ్య రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుంచి పెద్దల తరఫున కమీషన్లు వసూలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికిపోయిన అధికారికే ఇప్పుడూ అదే బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అటు తమ భూముల ధరలు పెంచుకోవడం, ఇటు నిర్మాణ పనుల్లో కమీషన్లు కాజేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇటీవల జపిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 5వేల ఎకరాలు, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణాన్ని సమీప వ్యక్తులకు కట్టబెట్టి.. కమీషన్లు దండుకునేందుకు వ్యూహం సిద్ధమైందని సమాచారం. -
అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ
సాక్షి, విజయవాడ: అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో రైతుల నుంచి 50 వేల ఎకరాల సమీకరణ చేపట్టగా.. ఇప్పుడు రెండో దశలో మరో 20 వేల ఎకరాలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.అమరావతి కోసం రైతుల నుంచి 50వేల ఎకరాల భూమి సేకరణ చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16వేల ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించింది. ఇప్పుడు రెండో విడత సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలను సేకరించనుంది. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ను సీఆర్డీఏ విడుదల చేయనుంది. -
Botsa: పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా సమన్వయ సమావేశం
-
అధికార దుర్వినియోగంతో చంద్రబాబు కేసుల మాఫీ
సాక్షి, తాడేపల్లి: గతంలో వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆ కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దోచుకున్నారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేసింది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారు. అధికారులను బెదిరించి కేసులను విత్ డ్రా చేయిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రివిలేజ్ ఫీజు విషయంలో వేల కోట్లు ఖజానాకు రాకుండా చేశారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి👉ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేసి తమవారి భూములు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఫైబర్ నెట్ లో రూ.350 కోట్లు అవకతవకలు చేశారు. సీఐడీ కూడా ఆధారాలతో పట్టుకుంది. అసైన్డ్ భూముల కుంభకోణంతో పేదల పొట్ట కొట్టారు. రూ.4,239 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేతలు కొట్టేశారు. రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూడా కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది.. 👉.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే 13 చోట్ల నోట్ ఫైల్ మీద సంతకాలు పెట్టారు. రూ.372 కోట్లు కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎం హోదాలో బెదిరించి అధికారులను బెదిరించి కేసులు విత్ డ్రా చేయిస్తున్నారు👉ప్రశ్నిస్తానన్న పవన్ ఈ కేసులపై ఎందుకు ప్రశ్నించటం లేదు?. పవన్ వలన దమ్మిడి లాభం లేనప్పుడు విమానాల్లో తిరగటం ఎందుకు?. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టించుకోవటం ఎందుకు?. అవినీతి, అరాచకాలను ప్రశ్నించలేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు పవన్?👉తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలను చంద్రబాబు తీశారు. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు అద్భుతంగా పని చేసింది. అలాంటి వ్యక్తిని విచారణ పేరుతో సీఐడీ వేధిస్తోంది. 👉ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పదంగా చనిపోతే మా పార్టీ వారి మీద దారుణమైన ఆరోపణలు చేశారు👉రాజధానిలో దారుణమైన అవినీతి జరుగుతోంది. వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. నేషనల్ హైవేల కంటే ఎక్కువ ధరకు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారుపశ్చిమ ప్రకాశంలో తాగు, సాగు నీరు లేక జనం అల్లాడిపోతుంటే చంద్రబాబుకు కనపడటం లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ వెలిగొండ ప్రాజెక్టును తీసుకువస్తే దాన్ని కూడా చంద్రబాబు ముందుకు పోనివ్వటం లేదు. టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. నీళ్లు ఇస్తామంటూ నిధులు తోడుకుంటున్నారు. రూ.17 కోట్లు దోచుకున్నారు. ఇలాంటివి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలో నే అట్టడుగున ఉంది. దాన్నిబట్టే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారాయన. -
భూములు ఇవ్వాల్సిందే..! తేల్చేసిన బాబు.. ఆందోళనలో అమరావతి రైతులు
-
పెట్టుబడులు.. అంకెల గారడీ.. అదన్నమాట సంగతి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా?లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఇరవై లక్షల ఉద్యోగాల నుంచి ఏకంగా ఐదేళ్లలో ఏభై లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టినట్లు ప్రకటించడం ఆసక్తికరమైన అంశమే. అంతేకాదు. పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అలా మాట్లాడడమే ఆయన సక్సెస్ మంత్ర అనుకోవాలి. భారీగా అంకెలు, గణాంకాలు చెబితే అది అసత్యమైనా నమ్మేవారు కూడా ఉంటారు.పదిహేనేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారన్న అనుమానం రావచ్చు. కాని ఎప్పటికప్పుడు కొత్త అంకెలు చెబుతూ ఏదో జరుగుతోంది అని భ్రమ కల్పించడమే ఇందులోని లక్ష్యమన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారిన మంత్రి లోకేష్ వచ్చే మూడేళ్లలో విశాఖలోనే ఐదు లక్షల ఐటి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తున్నట్లు అనించడం లేదూ! ఈ సమ్మిట్ లో మొత్తం మీద పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇవన్ని వినడానికి ఎంత బాగుంటాయి. నిజంగానే వాస్తవ రూపం దాల్చితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది!గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా చంద్రబాబు నాయుడి ఏకపాత్రాభినయం అధికంగా కనిపించేది. ఈ సారి సదస్సులో కొంత మార్పు కనిపించింది. అదేమిటంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సులో ప్రముఖంగా మారారు. అంటే ఈ విడత వీరిద్దరూ కలిసి షో నిర్వహించారన్న అభిప్రాయం ఆయా వర్గాలలో కలిగింది. దీనిని పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. నిజంగానే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేసినట్లుగా ఈ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినా, పండగలా జరిగినా సంతోషించవచ్చు. కాని ఎప్పుడు ఇలాంటి సదస్సులు సఫలం అయినట్లు అంటే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినప్పుడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఈ ఒప్పందాలన్నిటిని మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిన రీతిలో జరిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అలా చేస్తే ఆయనకు భారీ ఎత్తున సన్మానం చేయవచ్చు. కాని గత అనుభవాల రీత్యా చూసినా, వాస్తవాల ప్రకారం పరిశీలించినా అదంత తేలికైన సంగతి కాదు. ఉదాహరణకు ఒక సంస్థ పెట్టుబడి ప్రతిపాదన చేసిన తర్వాత ఏంతో ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకున్నా, అదొక్కటే సరిపోదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని, ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చే యత్నం చేసేవారు. ఆయన టైమ్లో పలు పరిశ్రమలు కూడా వచ్చాయి.రెన్యుబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు కూడా ఆరంభించాయి. అయినా చంద్రబాబు మాత్రం గతంలో పరిశ్రమలను తరిమేశారని అంటూ అబద్దాన్ని చెప్పడాన్ని మానుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిసినా, అలాంటి వ్యాఖ్యలను పారిశ్రామికవేత్తల ముందు చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. అంటే వచ్చేసారి వైఎస్సార్సీపీ గెలిస్తే ఎలా అని పెట్టుబడిదారులలో ఉన్న సందేహం అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రచారం చేశారు. దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మితే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు పెడతారు అంతేకాదు.. ప్రముఖ పారిశ్రామికేత్త జిందాలపై తప్పుడు కేసు పెట్టి వేధించే యత్నం కూటమి సర్కార్ చేసిందా?లేదా?ఆయన ఏపీకి రాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్డడానికి ఎందుకు సిద్ధమయ్యారు. లోకేష్ విరచిత రెడ్ బుక్ ప్రబావం గురించి పారిశ్రామికవేత్తలకు తెలియదా! నిజానికి చంద్రబాబు టైమ్లో వచ్చిన పరిశ్రమలకన్నా అధికంగా జగన్ టైమ్లోనే గ్రౌండ్ అయ్యాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం వచ్చినా అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆయన ఏపీకి రప్పించగలిగారు. జగన్ ప్రభుత్వ టైమ్లో జరిగిన సమ్మిట్ లో రిలయన్స్ ముకేష్ అంబానీ వచ్చి భారీ పెట్టుబడిని ప్రతిపాదించారు. జగన్ చెంతనే కూర్చుని సదస్సుకు నిండుదనం తెచ్చారు. మరి ఇప్పుడు అంబానీ ఎందుకు రాలేదో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమ్మిట్లో పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆదిత్య మిట్టల్, నవీన్ జిందాల్, బివిఆర్ మోహన్ రెడ్డి, భంగర్, కరణ్ అదానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరిగిన సమ్మిట్లో కరణ్ అదాని తప్ప మిగిలిన ప్రముఖులు పలువురు ఎందుకు రాలేదో తెలియదు. కరణ్ అదాని తన ప్రసంగంలో ఏమి చెప్పారు?. విశాఖలో వస్తున్నది అదాని డేటా సెంటర్ అని, దానికి గూగుల్ భాగస్వామి అవుతోందని ప్రకటించారా?లేదా? దానిపై చంద్రబాబు, లోకేష్లు కిమ్మనలేకపోయారే? ఆదాని డేటా సెంటర్ తో పాటు ఐటి బిజెనెస్ సెంటర్ కు ఆనాడు జగన్ శంకుస్థాపన చేసిన సంగతి విస్మరించి, అంతా గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలని ప్రయత్నించి భంగపడడం ప్రభుత్వానికి ఏ పాటి మర్యాద అవుతుంది.ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు తదితరులు అప్పుడూ వచ్చారు. ఇప్పుడూ వచ్చారు. 2014-19 టరమ్లో కూడా చంద్రబాబు సదస్సులు నిర్వహించారు. ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు, నలభై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెగ ప్రచారం చేశారు. ఆ పెట్టుబడుల ప్రగతి గురించి చంద్రబాబు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి, తదుపరి మళ్లీ ఏభై లక్షల ఉద్యోగాలు అన్నా, కోటి ఉద్యోగాలు అన్నా జనం నమ్ముతారు. అంతే తప్ప ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇలా లక్షల ఉద్యోగాలు అని చెబితే చివరికి కూటమి ప్రభుత్వానికే నష్టం అన్న సంగతి మర్చిపోకూడదు.కాకపోతే ఎప్పటి ప్రచారం అప్పటికే అన్నట్లుగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జగన్ టైమ్లో రెన్యూ పవర్, హీరో ఫ్యూచర్స్, ఎనర్జీస్, వంటి కొన్ని సంస్థలు సుమారు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశాయి. మళ్లీ అవే ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరిగి కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చెప్పడం ఆరంభించారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు దానినే లోకేష్ కూడా ఫాలో అవుతున్నారు.ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు బ్రాండ్ చూసి పరిశ్రమలవారు తరలి వచ్చేస్తారని టీడీపీ నేతలు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ విలువ ఎంతో తెలియదు కాని, విశాఖ వంటి కీలకమైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కంపెనీలకు లీజుకు ఇవ్వవలసి వస్తోంది. వేల కోట్ల రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలవారు చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని, ఈ పద్దతి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా విధ్వంసం అవుతాయని చెప్పుకుంటున్నారని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. చంద్రబాబులో ఉన్న విశిష్టత ఏమిటంటే తాము చేస్తే అది ప్రజలకు ఉపయోగం, ఎదుటివారు చేస్తే విధ్వంసం అని ప్రచారం చేస్తుంటారు.ఉదాహరణకు రిషికొండపై జగన్ అద్బుతమైన రీతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతిన్నదని విషం చిమ్మారు. రిషికొండను గుండు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు అవే కొండలను ప్రైవేటు కంపెనీలకు ఇస్తామని, సముద్రం ఎదురుగా ఉండే ఈ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఉంటుంది ఆయన తీరు. ఏది ఏమైనా ఈ సమ్మిట్ లోకేష్కు మంచి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడిందని అనుకోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భూములు ఇవ్వకపోతే..! అమరావతి రైతులకు బాబు బెదిరింపులు
-
పచ్చముఠా.. పాపం బద్దల్
-
సర్కారు నిర్లక్ష్యం.. గిరిజన విద్యార్థులకు సంకటం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు గిరిజన బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నాడు – నేడుతో ప్రైవేట్ స్కూళ్లను మించి సదుపాయాలు కల్పించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చింది. ఫలితంగా గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో మరణ మదంగం మోగుతోంది. వరుసగా పిల్లలు మత్యువాత పడుతున్నా.. వందల మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నా పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోకపోవడం నివ్వెరపరుస్తోంది.» పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో మంచినీటి ఆర్వో ప్లాంట్ పని చేయకపోవడంతో విద్యార్థులు పచ్చకామెర్ల బారి న పడ్డారు. సుమారు 184 మంది అస్వస్థతకు గురి కాగా చిన్నారులు పువ్వల అంజలి (కంబగూడ), తోయక కల్పన (దండనూరు) కామెర్లు ముది రిపోయి మత్యువాత పడ్డారు.» అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుంబ్రిగుడా మండలం జామిగూడ గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం (పాడైన గుడ్లు కూర) తిని 60 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.» అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ప్రైవేట్ ట్రస్ట్ హాస్టల్లో కలుషిత ఆహారం (మిగిలిపోయిన సాంబార్ అన్నం) తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు (శ్రద్ధ, జాషువా, నిత్య) చనిపోయారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.కలుషిత నీరు, ఆహారమే కారణం..! చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్వతీపురం సమీకత గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 14 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకరు, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏడుగురు మతి చెందినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది మరింత అధికంగా ఉంటుందని అంచనా. వీరంతా కలుషిత నీరు తాగడం, నిల్వ ఆహారం తినడం, పారిశుధ్య లోపం, సకాలంలో సరైన వైద్యం అందకపోవడం లాంటి ప్రధాన కారణాల వల్లే మతి చెందారన్నది తేటతెల్లమవుతోంది. విద్యార్థుల మరణాలను అరికట్టాలంటూ కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు.ఏఎన్ఎంల నియామకం ఎప్పుడు? ఏజెన్సీలోని 558 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఒకరు చొప్పున ఏఎన్ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రతి సందర్భంలో చెబుతున్నా అడుగు ముందుకు పడలేదు. ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక ఏఎన్ఎంను నియమిస్తే తక్షణం ప్రాథమిక వైద్యం అందించడంతోపాటు ఆరోగ్య సమస్య తీవ్రతను గుర్తించి ఆస్పత్రికి తరలించేలా అప్రమత్తం చేసే వీలుంది. విద్యాసంస్థల్లో పారిశుధ్య నిర్వహణ, ఆహార నాణ్యతను ఏఎన్ఎంల ద్వారా పరిశీలించవచ్చు. వరుస ఘటనలతో గ్రామ సచివాలయాల్లో అరకొరగా ఉన్న ఏఎన్ఎంలను ఆయా విద్యా సంస్థల్లో తాత్కాలిక సేవలు అందించాలని ఆదేశించారు.మంత్రి బాధ్యతారాహిత్యం..! గిరిజన విద్యా సంస్థలు, హాస్టళ్లలో మంచినీటి (ఆర్వో) ప్లాంట్లు, మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులకు కేవలం రూ.వంద కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో సమస్యలు తప్పడం లేదు. 558 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో 1.35 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఇంతమంది గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో పిల్లలు జ్వరాలు, పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు కేసుల కొట్టివేతపై కోర్టులో వాగ్వాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల కొట్టివేతపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మధ్య కోర్టులో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు కేసులో సాక్షులు ప్రభుత్వోద్యోగులు కావడంతో వారిని భయపెట్టి కేసులు కొట్టివేయించుకుంటున్నారని, అలా కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. దీంతో.. ఈ కేసులతో సంబంధంలేని వ్యక్తులు సర్టిఫైడ్ కాపీలు ఎలా అడుగుతారని పీపీ అభ్యంతరం తెలిపారు. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసు అని, సర్టిఫైడ్ కాపీలు థర్డ్ పార్టీ ఎవరైనా కోరవచ్చని పొన్నవోలు చెప్పారు. ఇందుకు సంబం«ధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. సాక్షులను ప్రభావితం చేసి, వారిని భయపెట్టి చంద్రబాబు కేసులు కొట్టివేయించుకుంటున్నారంటూ కోర్టులో ఆయన బలంగా వాదనలు వినిపించారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి గురువారం పీపీకి, పొన్నవోలుకు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అసైన్డ్ భూముల కేసు కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తాము థర్డ్ పార్టీకి ఇచ్చేదిలేదని లిఖితపూర్వకంగా చెప్పాలని పొన్నవోలు కోరారు. -
ధాన్యం.. దళారుల భోజ్యం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం ఆరబోసిన దృశ్యం చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రి పార్థసారథిని అవాక్కయ్యేలా చేసింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంబాడు గ్రామం నుంచి పామర్రు సెంటరు–గుడివాడ వెళ్లే రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాలన్నీ రోడ్లపై ధాన్యాన్ని పోసి పగలంతా ఆరబెట్టుకోవడం.. రాత్రి అయితే అక్కడే చలిలో కాపలా ఉండటం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు 75 కిలోల బస్తాను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న దుస్థితి. బుధవారం ఈ రహదారిలో వెళ్తున్న మంత్రి పార్థసారథి రోడ్లపై ధాన్యాన్ని చూసి కారు దిగేసరికి.. అన్నదాతలు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలు చేయట్లేదని, రంగు మారిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని వాపోయారు. మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోంథా తుపానుతో అతలాకుతలమైన ధాన్యం రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం డబుల్ గేమ్ అడుతోంది.. ఓ వైపు నష్టపోయిన రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోగా, ఇప్పుడు అంతంత మాత్రంగా చేతికందిన పంటను కొనుగోలు చేయడంలో దళారులకు మేలు జరిగేలా అంతర్గతంగా సహకరిస్తోంది.. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి.. నిర్దయగా తిరస్కరిస్తోంది.. గోనె సంచులు లేవు.. టార్పాలిన్లు లేవు.. రవాణా వాహనాలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి రైతులు ధాన్యాన్ని అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర కూడా లేదు.. ఈ దళారీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటని అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ధాన్యం సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసింది. రెండు మూడు గ్రామాలకు ఒక దళారి చొప్పున అప్పగించి, అందినకాడికి దోచుకోమని పచ్చ జెండా ఊపింది. సంచులు, లారీలు, ధర విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచి్చంది. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న వారు అతి తక్కువ ధరకు అడుగుతుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకు అమ్ముకోవడం తప్ప అన్నదాతలకు మరో మార్గం లేకుండా చేసింది. రైతు నేరుగా మిల్లులోకి ప్రవేశించే పరిస్థితి లేకుండా కుతంత్రం సాగిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ దశలోనూ ప్రభుత్వ పర్యవేక్షణ అన్నదే లేదు. ధాన్యం కొనాలనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు సర్కార్ కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కలి్పంచకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల దందాకు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా ముంచేస్తోంది. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు ఖరీఫ్లో ధాన్యం కోతలు ఊపందుకున్నా, మరోవైపు కొనుగోళ్లు మాత్రం ముందుకు కదలట్లేదు. ఇటీవల వరుస వాయు గుండాలు, మోంథా తుపాన్ రైతులను తీవ్రంగా దెబ్బ తీశాయి. మిగిలిన అరకొర పంటలను చేజిక్కించుకున్నా, అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు ఉత్సవ కేంద్రాలుగా మారాయి. కనీసం పంట పట్టుబడికి గోనె సంచులూ సమకూర్చలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోయింది. ఫలితంగా రోజుల తరబడి రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఎత్తుకోవడం.. లేదా దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం తప్ప మరో దారి కనిపించట్లేదు. దళారుల దోపిడీ పర్వంచంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ రైతులకు మద్దతు ధర అందించిన పాపాన పోలేదు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ పర్వానికి తెరతీసి వేడుక చూస్తోంది. పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా, దళారుల అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా పంట పొలం నుంచి మిల్లులకు చేరే పరిస్థితి లేదు. పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా, నిరాశే ఎదురవుతోంది. రోజుల తరబడి షెడ్యూల్ ఇవ్వక పోవడం, గోనె సంచులు సమకూర్చక పోవడంతో కోసిన పంటను నిల్వ చేసుకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఒకవేళ పట్టుబడి చేసినా రోజుల తరబడి లోడు మిల్లులకు చేరట్లేదు. అదే, దళారులు చెప్పిన రేటుకు ధాన్యాన్ని ఇస్తే మాత్రం క్షణాల్లో తరలించేస్తున్నారు. ఫలితంగా రైతులు 75 కిలోల బస్తాను రూ.400–500 తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే, సాధారణ రకానికి రూ.1,777, ఏ–గ్రేడ్కు రూ.1,792 మద్దతు ధర ఉంటే.. దళారులు ఇచ్చేది రూ.1,200–1,300 మాత్రమే. ఆరు కోట్ల గోనె సంచులు ఎక్కడ?ఖరీఫ్లో ధాన్యం సేకరణకు ఏకంగా 7,53,000 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో రైతులకు పంట పట్టుబడికి మాత్రం సంచులు దొరకట్లేదు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మరో వైపు 30 వేలకు పైగా రవాణా వాహనాలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా, లోడింగ్కు మాత్రం కనీసం ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇదిలా ఉండగా, ఇటీవల పౌర సరఫరాల సంస్థ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కాంట్రాక్టును, వాటి సాఫ్ట్వేర్ను ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు ఒకే సంస్థ పరిధిలో అన్ని రకాల జీపీఎస్ డివైజ్న్లను అనుసంధానం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా చాలా చోట్ల జీపీఎస్లు పనిచేయక పోవడంతో లారీల్లో లోడింగ్కు ముందుకు రావట్లేదు. బ్యాంకు గ్యారంటీలు కట్టని మిల్లర్లు ప్రభుత్వం 3,013 రైతు భరోసా కేంద్రాలు, 2,061 పీపీసీ (పీఏసీఎస్)ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు చెబుతోంది. కానీ, చాలా చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కులో భాగంగా కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించేలా పరోక్షంగా కుట్ర చేస్తున్నారు. అంటే.. ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనకపోగా.. దళారులతో కలిసి రైతులను దోపిడీ చేస్తూ.. మళ్లీ అదే దళారీ, రైతు పేరుతోనే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకుని లాభపడేలా దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మిల్లర్లు రూ.3 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 50 శాతం కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మిల్లులకు ధాన్యాన్ని తరలించలేక అధికార యంత్రాంగం చేతులు ఎత్తేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం వాట్సాప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెట్టగానే.. ధాన్యం కొంటామంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, రైతు నేరుగా కొనుగోలు కేంద్రానికి వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. తేమ.. తూకంలోనూ మోసం! మోంథా తుపాన్ దెబ్బతిన్న పంటను కోత కోయించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఎకరానికి రూ.4 వేలు పెట్టి మిషన్ల ద్వారా కోతలు కోయిస్తున్నారు. కోసిన పంటను కోసినట్టు అమ్ముకుందామంటే ప్రభుత్వం 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిరాకరిస్తోంది. ప్రభుత్వం రైతులకు పంట ఒబ్బిడికి టార్పాలిన్లు ఇవ్వకపోగా, తేమ శాతం పేరుతో కొనుగోలుకు నిరాకరిస్తోంది. రంగుమారిన ధాన్యాన్నీ కొనడం లేదు. దీనికి తోడు గోనె సంచికి రెండు కిలోల బరువు కట్టి, అంతే మొత్తాన్ని రైతుల ధాన్యంలో నుంచి లాగేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో సుమారు 81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పింది. అయితే తుపాను, ఇతర కారణాల వల్ల అంత దిగుబడి రాలేదు. ఇప్పటిదాకా 7.19 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుపాను వస్తేనే పరదాలు ఇస్తారట! ఈ రైతు పేరు ఆరుమళ్ల రాజశేఖర్రెడ్డి. కృష్ణా జిల్లా పామర్రు గ్రామం. సొంత పొలం మూడెకరాలు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. ప్రస్తుతం మిషన్ సహాయంతో రెండు ఎకరాలు నూరి్పడి చేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు 25–27 బస్తాలే వస్తోంది. పంటను ఆరబెట్టుకునేందుకు పరదాలు (టార్పాలిన్లు) కావాలని ఆర్బీకేకు వెళ్లి అడిగాడు. ‘ప్రస్తుతం పరదాలు ఇచ్చేది లేదు.. తుపాను వస్తేనే ఇస్తాం’ అని చెప్పారని వాపోయాడు. గోనె సంచులైతే చిరిగిపోయినవి ఇస్తున్నారని, కష్టపడి పంటను ఆరబెట్టుకుంటే లోడింగ్కు లారీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువకు రేటు కడదామని చూస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన ఎస్ సత్యనారాయణ ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల మోంథా తుపాను వల్ల పొలం నీట మునిగి పోవడంతో నష్టపోయాడు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి మళ్లీ తుపాను హెచ్చరిక రావడంతో భయంతో కోతలు ప్రారంభించాడు. అధిక వ్యయంతో యంత్రాలతో కోతలు నిర్వహిస్తే ఎకరాకు 33 బస్తాల ధాన్యమే దిగుబడి వచి్చంది. మద్దతు ధర దక్కడం గగనంగా మారింది. పొలాల వద్దకు వచ్చే వ్యాపారులు 75 కిలోల బస్తా రూ.1,300కే అడుగుతున్నారు. విక్రయించేందుకు సిద్ధమైనా సిండికేట్గా ఏర్పడి కొనుగోలు చేయకుండా మరింత తక్కువ రేటు కడదామని చూస్తున్నారని వాపోయాడు. ధాన్యం ఎవరికి అమ్మాలి? గత నెలలో తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ధాన్యం బాగా దెబ్బతింది. తేమ అధికంగా వస్తోంది. రెండు రోజుల కిందట కోతలు మొదలు పెట్టాం. వాతావరణంలో మార్పులు రావడంతో హడావిడిగా ఒబ్బిడి చేస్తున్నాం. ధాన్యం కల్లాల్లోనే బరకాలతో కప్పి ఉంది. ఆర్బీకేలో సవాలక్ష నిబంధనలు పెట్టారు. వ్యాపారులు కూడా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పెద్దిరెడ్డి సత్యనారాయణ, గాడిలంక, -ముమ్మిడివరం మండలం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రోజుకో రేటు నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. కొనుగోలు కేంద్రంలో స్పందన లేకపోవడంతో ఏజెంట్లను అడిగితే రోజుకో రేటు చెబుతున్నారు. మూడు రోజుల కిందట రూ.1,400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,330కి పడిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారు. తేమ శాతం, పొట్టు, మట్టి గెడ్డలు, పూర్తిగా ఆరబెట్టినవి మాత్రమే కొనుగోలు చేస్తారట. ధాన్యం ఆరబెట్టడానికి జాగా లేని మేము ఏం చేయాలి? – కట్టేపోగు నాగులు, శృంగారపురం గ్రామం, దుగ్గిరాల, గుంటూరు జిల్లా గోనె సంచులు ఇవ్వట్లేదు నేను ఎకరానికి రూ.20 వేలు వంతున ఖర్చు చేసి 13 ఎకరాలలో వరి సాగు చేశా. నూరి్పడులు కూడా పూర్తయ్యాయి. వాతావరణ మార్పుల హెచ్చరికలతో గుండెల్లో గుబులు మొదలైంది. నాకు ఈ ధాన్యం పట్టడానికి 500 గోనె సంచులు అవసరం. కానీ, 200 మాత్రమే ఇచ్చారు. తుపాను ఆందోళనతో గోనెలు లేకపోతే పంట నష్టపోవడం కంటే దళారులకు అమ్ముకోవడం ఉత్తమం అనిపిస్తుంది. అయితే, క్వింటాకు రూ.400 నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గోనె సంచులు ఇవాలి. – కనకల శ్రీనివాసరావు, బోని, ఆనందపురం మండలం, విశాఖపట్నం -
AP: సాయం కోసం మంత్రి వద్దకు వెళ్తే మరింతగా వేధించారు: మహిళలు
-
పవన్, చంద్రబాబుపై స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహం
-
Botsa : జగన్ కు మంచి పేరు వస్తుందనే బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు
-
AP: ప్రభుత్వ ఖజానాకు గండి విజనరీ ముసుగులో భారీ స్కెచ్
-
‘జగన్కు మంచి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తపించి మెడికల్ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్కు వివరించాం. దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు. ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. 👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు. -
సుప్రీం సీరియస్.. పవన్ పాత పాటలో కొత్త రాగం..
-
చంద్రబాబు చికిరి కుంభకోణం 13 సంతకాలు..
-
సుప్రీంకోర్టు సీరియస్.. బాబుకు బిగ్ షాక్..
-
బాబు మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం..!?
-
పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న, మంత్రి లోకేశ్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు.మొత్తం కార్యక్రమం నాలుగు గంటల పాటు జరిగితే.. అందులో మాక్ అసెంబ్లీ గంటన్నర పాటు జరిగింది. మిగిలిన రెండున్నర గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. సీఎం చంద్రబాబు ప్రసంగం ఒక్కటే గంటా నలభై నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ టెలీకాస్ట్ చేసిన ఈ కార్యకమ్రంలో సీఎం, స్పీకర్ల రాజకీయ ప్రసంగాలే ప్రధానంగా సాగాయి. పోలీసులకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని.. తన పాదయాత్రలో ఇది గమనించానని లోకేశ్ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? : స్పీకర్ అయ్యన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏమైపోయినా, గ్రామాలు, కుటుంబాలు ఏమైనా పర్లేదన్నట్లుగా ప్రతిపక్షం ఉందంటూ విద్యార్థుల్లో విద్వేషాలు రగిలేలా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ప్రజలు వారిని ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక పెద్దలు నిర్ణయించాలి’.. అంటూ చంద్రబాబు వైపు చేతులు చూపుతూ అయ్యన్న మాట్లాడారు.రాజకీయాలు, స్కోత్కర్షతో సీఎం ప్రసంగంఈ మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం యావత్తూ రాజకీయాలు, వ్యక్తిగత గొప్పలే ప్రధానంగా సాగింది. ప్రతిపక్షంపై విద్యార్థుల్లో విషం నింపడమే లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు. ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని నిజాంకి ఇస్తే నిజాం ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడని కొత్త భాష్యం చెప్పారు.ఇక తాను తన చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్నానని, దాంతో 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చానని.. ఇప్పుడు ఏకంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు తన కీర్తిని తానే కీర్తించుకున్నారు. ఎప్పటిలాగే.. సెల్ఫోన్ తానే తెచ్చానని, టెక్నాలజీకి తానే ఆద్యుడినని, ఇప్పుడు టీచర్ స్థానంలో ఏఐ పనిచేస్తోందంటే దానికి తానే కారణమని గప్పాలు కొట్టుకున్నారు. -
ప్రైవేట్కు 1,300 ఎకరాల మున్సిపల్ భూములు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ)లో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని మున్సిపాలిటీలకు విస్తరించింది. విలువైన 1,300 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భూములతోపాటు కంపెనీల యాజమాన్యాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల కోట్ల వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నీటిసరఫరా ప్రాజెక్టులు, రవాణా నెట్వర్క్, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలంటే 2029 నాటికి రూ.66,523 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఈ లక్ష్యాలను చేరుకునేందుకు పీపీపీని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విధానంలో 2.30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు వేల ఎకరాల భూములను కట్టబెట్టడంతోపాటు వయబులిటీ ఫండింగ్ ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. నిరుపయోగం పేరుతో నేతలకు ధారాదత్తం పట్టణప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు స్కెచ్ వేసింది. ఈ భూములను వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చేందుకని కలరింగ్ ఇచ్చి రాష్ట్రంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(యూడీఏ)ల ద్వారా అమలుచేస్తున్న ల్యాండ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్తో అప్పగించేందుకు సిద్ధమైంది. మొత్తం 18 యూడీఏల్లో 73 ల్యాండ్ పార్సిల్స్లో 1,300 ఎకరాలను ఇప్పటికే గుర్తించారు. ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని తేల్చారు. ఇప్పటికే నాలుగు యూడీఏల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీచేశారు. మిగిలిన వాటికి త్వరలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. పీపీపీ విధానంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయవచ్చని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని, ఈ విధానం దేశంలో పట్టణాభివృద్ధిలో రాష్ట్రాన్ని నిలబెడతాయని పేర్కొనడం గమనార్హం. ట్యాక్స్ బాదుడికి రంగం సిద్ధమైనట్టే? మున్సిపాలిటీలు, పంచాయతీల్లో రోడ్లు, రవాణాను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగిస్తే ప్రభుత్వంపై ఆరి్థకభారం ఉండదని గతంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు రోడ్లు వేసి ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని మున్సిపాలిటీలకు ఆపాదించి అమల్లోకి తెచ్చినట్టయింది. ప్రజలకు తాగునీటి సరఫరా, రోడ్లు, విద్య వంటి సదుపాయాలు ఉచితంగా ప్రభుత్వం కల్పించాలి. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రస్తుతం ప్రకటించిన నీటిసరఫరా, రవాణా, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రైవేటుకు కట్టబెడుతోంది. దీంతో వీటిపై ప్రజల నుంచి పన్ను వసూలుకు ఆయా సంస్థలకు అధికారం ఇచ్చినట్టేనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పీపీపీ విధానం: ముఖ్య కార్యదర్శి పట్టణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆర్థిక మండలాల్లో రూ.35 వేలకోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్శాఖలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంపై సమగ్ర పాలసీ ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు.


