పేదలకు అండగా సీఎం జగనన్న | Sakshi
Sakshi News home page

పేదలకు అండగా సీఎం జగనన్న

Published Thu, May 9 2024 4:45 AM

పేదలకు అండగా సీఎం జగనన్న

నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాటు పేదలకు అండగా నిలిచి సంక్షేమ పథకాలను అందించారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండీ ఖలీల్‌ అహ్మద్‌ తెలిపారు. నగరంలోని 4వ డివిజన్‌ న్యూకాలనీ, 47వ డివిజన్‌ గుప్తా పార్కు సెంటర్‌, కంసాలి వీధి, ములుముడి బస్టాండ్‌ సెంటర్‌, చిన్నబజారు మెయిన్‌రోడ్డు, 13వ డివిజన్‌ బాలాజీ నగర్‌ గ్యాస్‌ గోదాము సెంటర్‌, ఓల్డ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ రోడ్డు, గౌడ హాస్టల్‌ సెంటర్‌, వేపదొరువు, 43వ డివిజన్‌ జెండావీధి, బడేసాహెబ్‌వీధి, బొందిలివీధి తదితర ప్రాంతాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోలంరెడ్డి లక్ష్మీప్రత్యూష, పొట్లూరి రామకృష్ణ ఆచారి, ఊటుకూరు నాగార్జున, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మీరామొహిద్దీన్‌, నాయకులు ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement