- రోడ్డు ప్రమాదంలో మామా, అల్లుడి దుర్మరణం
- మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
- బైక్పై వెళ్తుండగా స్కార్పియో ఢీకొన్న ఫలితం
మరణంలోన వీడని బంధం నిజమే. దానికి బంధాలు.. అనుబంధాలతో పని లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో కబళిస్తుందో అంతుబట్టదు. ఇప్పుడు అదే జరిగింది. బైక్పై బయలుదేరిన మామా అల్లుడ్ని స్కార్పియో రూపంలో మృత్యువు కబళించింది. ఒకేసారి ఇద్దర్ని బలిగొంది. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.
- సోమందేపల్లి (పెనుకొండ)
హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం బెల్లాలచెరువుకు చెందిన అంజనరాజు(32), అతని మామ రాము(50) దుర్మరణం చెందగా, జానకిరాముడు(30) తీవ్రంగా గాయపడ్డారు. పైన పేర్కొన్న ముగ్గురూ కలసి బైక్లో సోమందేపల్లికి బయలుదేరగా తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన స్కార్పియో వాహనం అనంతపురం వైపు వస్తూ బైక్ను వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో బైక్ డివైడర్ను ఢీకొని 20 అడుగుల దూరంలోకి దూసుకెళ్లింది. ఘటనలో అంజనరాజు అక్కడికక్కడే మరణించగా, రామును బెంగళూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. జానకిరాముడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
మామను వదిలొద్దామని బయలుదేరి...
సోమందేపల్లికి చెందిన రాము చేనేత కార్మికుడు. తన కుమార్తె శిరీషను ఏడాదిన్నర కిందట అంజనరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పుట్టింటికి వచ్చింది. సొంత పనిపై బెల్లాలచెరువుకు వెళ్లిన రాము అక్కడ పని ముగించుకుని సోమందేపల్లికి బయలుదేరాడు. దీంతో మామను ఇంట్లో వదిలి, తరువాత తన భార్యను పిల్చుకొద్దామని భావించిన అంజనరాజు మామతో పాటు జానకిరాముడుతో కలసి బైక్లో బయలుదేరారు. ఊహించని విధంగా మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో మృత్యువు మామా అల్లుడ్ని మృత్యు ఒడికి చేర్చింది. ఒకేసారి ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. కాగా అనంతరాజుకు 7 నెలల బాబు ఉన్నాడు.
మరణంలోన వీడని బంధం
Published Thu, Jun 15 2017 11:41 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
నకలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి
సదరం స్లాట్.. సమస్య లేదిక..!
పుస్తకాలు వచ్చేశాయ్
నిర్మల్
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్
స్వచ్ఛత అందరి బాధ్యత
పార్కింగ్ పరేషాన్
● ఫుట్పాత్ల ఆక్రమణ.. ఆపై బిజినెస్ ● చిరువ్యాపారులకు అద్దెకిస్తూ మరికొందరి అక్రమార్జన ● తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య ● ఈ – చలాన్లతో వాహనదారుల జేబులు గుళ్ల ● రామగుండం కార్పొరేషన్ సహా బల్దియాల్లో దుస్థితి ఇది
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement