-
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
మద్యానికి బానిసైతే...ఇంత భయంకరమా? వైరల్ వీడియో!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసు, మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉంది. అసలు మద్యం లేదా అల్కహాల్ సేవించడం ఎంత ప్రమాదమో తెలుసా?ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి దుస్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు ఆల్కహాల్కు బానిసై, అకస్మాత్తుగా అకస్మాత్తుగా మద్యపానాన్ని ఆపివేసినా లేదా బాగా తగ్గించేసినా మానసిక, శారీరక సమస్యలు రెండూ వస్తాయి. ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. తక్షణ వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం) లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది ప్రాణాపాయం కావచ్చు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే. మద్యానికి అలవాడు పడిన నరాలు స్థిమితంగా ఉండలేకపోయాయి. దీంతో కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. అంతిమంగా ఇది మరణానికి దారితీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలు: అధిక రక్త పోటు, నిద్రలేమి, శరీర భాగాలు బాగా వణికిపోవడం (హైపర్ రెఫ్లెక్సియా) ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, గుండె దడ లాంటివి. ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U — Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024 మద్యానికి బానిసైతే ♦ ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ♦ అతిము ఖ్యమైన అవయం కాలేయం దెబ్బతింటుంది. ఇది ముదిరితే కాలేయ కేన్సర్కు దారి తీస్తుంది. ♦ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ♦ ఎంజైమ్లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. నోట్: మద్యం ఆరోగ్యానికి అనర్థం. ఇందులో రెండో మాటకు తావేలేదు. ఆరోగ్య జీవనం కోసం ఆ వ్యసనాన్ని మెల్లిగా వదిలించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకొని మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం. -
మద్యపాన వ్యసనానికి చెక్పెట్టే సరికొత్త చికిత్స విధానం!
మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్కి, జీవనశైలికి దాని అడిక్షన్ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే..ఈ ఆల్కాహాల్ యూజ్ డిజార్డర్(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్ డోపమేన్ సిగ్నలింగ్ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు. ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(జీడీఎన్ఎఫ్) అనే ప్రోటీన్. అల్కహాల్ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్ఎఫ్స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్ఎఫ్ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్ సిగ్నలింగ్ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్ సిగ్నలింగ్ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్ను విడుదల చేస్తుందని అన్నారు. ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్ ఇచ్చే డోపమేన్ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్ఎఫ్ జన్యు చికిత్సను అందించారు. దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్ యూస్ డిజార్డర్తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..) -
ఎయిర్పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
బైక్కు నిప్పు..!
పాలకవీడు: మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి గ్రామ శివారులో మద్యం సేవించి గొడవపడ్డారని.. ఈ క్రమంలో ఓ బైక్ను తగలబెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ లింగంను వివరణ కోరగా.. సజ్జాపురం గ్రామానికి చెందిన మూగల బాలసైదులు మరో వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి బైక్పై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డుకుని వారి బైక్ను తగలబెట్టినట్లు తెలిపారు. మూగల బాలసైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మద్యం మత్తులో జరిగిన గొడవకారణంగానే బైక్కు నిప్పు పెట్టారా.. లేదా వ్యక్తిగత కక్షతో ఈ ఘటన చోటుచేసుకుందా అనే విషయం తెలియనుంది. -
మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్లో కొత్త బీర్ బ్రాండ్ ఎంట్రీ..
దేశంలోని మద్యం ప్రియుల రుచులు, అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో దిల్లీ, ఉత్తరాఖండ్తో సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లలోకి ప్రవేశించింది. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో 96 శాతం రిటైల్ అమ్మకాలేనని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100 శాతం ఫెసిలిటీను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో 1,00,000 హెక్టోలీటర్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2,00,000 హెక్టోలీటర్ల లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి విస్తరణ చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
బీర్లు, లిక్కర్ విక్రయాల్లో పరకాల టాప్
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లాలో మద్యం ప్రియులు బీర్లకే జై కొడుతున్నారు. 2022లో 1,07,73,420.. ఈ ఏడాది ఏకంగా 1,26,32,616 బీర్లు తాగారు. అంటే గతేడాది 8,97,785 కేసులు.. ఎన్నికలు జరిగిన ఈ సంవత్సరంలో 10,52,718 కేసుల బీర్లు తాగారు. 2022లో 5,61,186 ఐఎంఎల్ (లిక్కర్) కేసులు తాగితే ఈసారి ఆ సంఖ్య 5,39,437కి తగ్గింది. మద్యం అమ్మకాలతో 2022లో రూ.574.98 కోట్లు.. ఈసారి రూ.589.89 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో వరంగల్ రూరల్ జిల్లా నుంచి వచ్చి చేరాయి. ఈ ఏడాది సంక్రాంతి, దసరా, వివిధ పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మద్యానికి భారీగా గిరాకీ పెరిగింది. అందుకే గతేడాది మించి ఈసారి ఎక్కువగా మద్యం ప్రియులు మద్యాన్ని లాగేశారని ఎకై ్సజ్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్ట్ షాపును ప్రోత్సహించడంతో ఆదాయం భారీగా పెరగడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతమున్న ప్రభుత్వం బెల్ట్షాపులపై కొరడా ఝుళిపిస్తుండడంతో వచ్చే ఏడాది మద్యం విక్రయాలు తగ్గే అవకాశముందని ఎకై ్సజ్ విభాగంలో అంతర్గత చర్చ జోరుగా జరుగుతోంది. అక్కడే టాప్... వరంగల్ రూరల్ జిల్లాలో 63 వైన్షాపులు, ఏడు బార్లు ఉన్నాయి. నర్సంపేట సర్కిల్లో 25, వర్ధన్నపేట సర్కిల్లో 16, పరకాల సర్కిల్లో 22 మద్యం దుకాణాలు ఉన్నాయి. నర్సంపేటలో 2022లో 1,98,551 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 3,30,471 బీరు కేసులు విక్రయిస్తే.. 2023లో 1,90,636 లిక్కర్ కేసులు, 3,84,878 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో 208.61 కోట్ల ఆదాయం వస్తే.. ఇప్పుడు రూ.214.15 కోట్ల ఆదాయం వచ్చింది. పరకాల సర్కిల్లో 2022లో 2,12,263 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 3,29,736 బీరు కేసులు విక్రయించారు. ఈ ఏడాది 2,02,288 లిక్కర్ కేసులు, 3,91,744 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో రూ.213.98 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.218.41 కోట్లు వచ్చాయి. ఇక వర్ధన్నపేట సర్కిల్లో 2022లో 1,50,372 లిక్కర్ కేసులు, 2,37,578 బీరు కేసులు విక్రయిస్తే ఈ ఏడాది 1,46,513 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 2,76,096 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అంటే 2022లో రూ.152.36 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.157.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా ఓవరల్గా తీసుకుంటే బీర్ల విక్రయాల్లో పరకాల ముందుండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉంది. లిక్కర్ తాగడంలో పరకాల మొదట స్థానంలో ఉండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉన్నాయి. -
Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
గాంధీనగర్: మద్యపాన నిషేధం నుంచి గిఫ్ట్ సిటీని మినహాయిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం.. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ‘వైన్ అండ్ డైన్’ సేవలకు అనుమతి ఇచ్చింది. అయితే మద్య నిషేధంలో గాంధీనగర్ జిల్లాలోని (గిఫ్ట్ సిటీ)లో మినహాయిచడాన్ని ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గుజరాత్ మొత్తం వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపుతుందని మండిపడ్డారు. ‘గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో మద్య నిషేధం లేకపోతే.. ఇక్కడి ప్రజలు మద్యం సేవిస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఒక వ్యతిరేక ప్రభావం పడుతుంది’ అని శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గిఫ్ట్ సిటీలో మద్య నిషేదం ఎత్తివేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం చేకూరుతుందో తనకు అర్థం కావటం లేదని విమర్శించారు. గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్ సిటీలో ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు మద్యం నిషేధం ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రస్తుతం మందు బాటిళ్ల అమ్మకానికి అనుమతి లేదు. చదవండి: ఈ ఏడాది భారత్కు వెరీ బిగ్ ఇయర్ -
ప్రతి రోజు పబ్లో మద్యం తాగేదాన్ని: స్టార్ హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రవర్తన, పరివర్తనలకు శృతిహాసన్ కేరాఫ్గా మారారు. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సలార్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత నటుడు కమలహాసన్ తనయగా.. తండ్రి కథానాయకుడిగా నటించిన హే రామ్ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయౖమైన శృతిహాసన్, ఆ తరువాత హిందీలో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ) అయితే చాలా విభిన్నమైన మనస్తత్వం కలిగిన నటి శృతిహాసన్. కారణం ఆమె పెరిగిన వాతావరణం కావచ్చు. ఈ ఏడాది తెలుగులో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు విజయం సాధించటం విశేషం. అదే విధంగా నాని కథానాయకుడిగా ఇటీవల విడుదలైన సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న హాయ్ నాన్న చిత్రంలో కూడా మోడల్గా కీలక పాత్రలో నటించారు. తాజాగా ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ భారీఅంచనాల మధ్య తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ సలార్ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపింది. తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది. కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. నేను ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిస అయ్యానని పేర్కొన్నారు. ప్రతి రోజు నా స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లి మద్యం సేవించేదాన్ని అని తెలిపింది. అయితే తనకు ఎలాంటి డ్రగ్స్ సేవించే అలవాటు మాత్రం లేదని శృతిహాసన్ చెప్పారు. అయితే కొన్ని రోజుల తరువాత మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైందని తెలిపింది. ఎలాగైనా ఆ వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికీ మద్యం మానేసి 8 ఏళ్లు పూర్తవుతోందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం తెలుగులో అడవి శేషు సరసన ఓ చిత్రం.. ఇంగ్లిష్లో ది ఐ అనే చిత్రంలోనూ శృతిహాసన్ కనిపించనుంది. (ఇది చదవండి: బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు) -
ఆ.. మద్యం... ఏం చేద్దాం..?
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కొనుగోలు చేసిన మద్యం తీసుకెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నాయి. వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో అప్పగించి వారిపై పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. అయితే స్వాదీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీస్ స్టేషన్ల గదులు నిండిపోయాయి. ఈ మద్యాన్ని ఎంత తొందరగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా అప్పగిద్దామా అని ఆయా ఠాణాల పోలీసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్ పోలీస్స్టేషన్, నారాయణగూడ, అబిడ్స్, దోమలగూడ తదితర 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2727 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అధిక మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్తుండగా 11 కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో 1509 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకొని వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే నగదు, మద్యం సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు, ఎఫ్ఎస్టీ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబండింది. నమూనాల సేకరణ... ఎన్నికల సమయంలో స్వాదీనం చేసుకున్న మద్యంలో ఒక్కో బ్రాండ్కు సంబంధించి ఒక సీసాను పోలీసులు సీజ్ చేసి సీల్ వేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ల్యా»ొరేటరీకి పంపించారు. ఉదాహరణకు 12 బీరుసీసాలు స్వాధీనం చేసుకుంటే అందులో ఒక బీరుసీసాను సీజ్ చేసి ఎక్సైజ్ ల్యా»ొరేటరీకి పంపించడం జరుగుతుంది. మిగతా మద్యం అంతా ఠాణాల్లోని గదుల్లో భద్రపరిచారు. సీజ్ చేసిన పంపించిన మద్యం నాటు సరుకా..? ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరా..? అనే విషయాన్ని కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే పోలీసులు ఆ మొత్తాన్ని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు. డీసీ ఇచ్చిన రశీదును జత చేసి చార్జిషీట్ దాఖలు చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా పెండింగ్లోనే ఉంది. ఇంత వరకు కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందలేదు. కనీసం పంపించిన నమూనాలు కూడా కెమికల్ ల్యాబ్లో ఇంకా పరిశీలించలేదని తెలుస్తున్నది. ఈ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు స్వాదీనం చేసుకున్న మద్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వా«దీనం చేసుకున్న మద్యం సీసాల్లో ఒక్కటి మిస్ అయినా సంబంధిత దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఠాణాల్లో పేరుకుపోయిన మద్యం సీసాలను కాపాడుకోవడానికి దర్యాప్తు అధికారులు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. కష్టపడి స్వాదీనం చేసుకున్న మద్యాన్ని డిప్యూటీ కమిషనర్కు అప్పగించేదాకా జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇంతా కాదు. పోలీసులకు ఈ మద్యం చుక్కలుచూపిస్తున్నది. గత ఎన్నికలతో పోలిస్తే భారీగా నగదు స్వాదీనం... ► 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడింది. నిబందనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి రూ. 50 వేలకంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తుండగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో పాటు ఎఫ్ఎస్టీ బృందాలు నగదును పెద్ద మొత్తంలో స్వా«దీనం చేసుకున్నాయి. ► జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17.80 లక్షలు పట్టుబడగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 61.46 లక్షలు పట్టుబడ్డాయి. ఈ మొత్తాన్ని జిల్లా గ్రీవెన్స్ సెల్కు పోలీసులు అప్పగించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను బాధితులు చూపిస్తే పోలీసులు ఆ డబ్బును తిరిగి వారికి అప్పగిస్తారు. ► ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో రూ. 5 కోట్ల 51 లక్షల నగదు ఎన్నికల సమయంలో పట్టుబడింది. అలాగే రూ. 3.97 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాదీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 18 బస్తాల రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో ఇండియన్ పేరు నమోదైంది. ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరిన వ్యక్తి ఎవరు.. అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన 'లలిత్ ఖైతాన్' (Lalit Khaitan) 1972-73లలో కంపెనీ స్వాధీనం చేసుకున్న తరువాత దానిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఈయన అనుదినం కృషి చేసేవారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. లలిత్ ఖైతాన్ సారథ్యంలో ముందుకు సాగుతున్న 'రాడికో ఖైతాన్' (Radico Khaitan) ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ లాంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారు. ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, బెంగుళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సును అభ్యసించారు. రాడికో ఖైతాన్గా పిలువబడుతున్న కంపెనీని గతంలో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్గా పిలిచేవారు. ఆ సంస్థను ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ 1970 ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్న సమయంలో సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్లను సుమారు 85 దేశాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన మద్యం రంగంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప పురోగతి కనపరిచిన లలిత్ ఖైతాన్ 2008లో 'ఇన్స్పిరేషనల్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు', 2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 'లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు' వంటి వాటిని సొంతం చేసుకుని.. ఇప్పడూ ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించారు. -
కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది. కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే.. 2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
ఆల్కహాల్ అలర్జీ అని పొరబడింది! చివరికి ఏకంగా..
పట్టుమని 20 ఏళ్లు నిండలేదు. ఆ చెడు అలవాటు సరదా అనుకుంది. ప్రెజెంట్ ట్రెండ్ అని స్నేహితులతో తరచుగా బయట పార్టీలు చేసుకుంది. శరీరంపై దద్దర్లు, వాంతులు అవుతున్నా.. జస్ట్ ఎలర్జీయే కదా!.. అని లైట్ తీసుకుంది. చివరికి అదేంటో తెలిసి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. తనలా మరెవ్వరూ చేయకూడదని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అందుకు తన ఉదంతమే నిదర్శనం అంటూ ఆమె గాథని వివరిస్తోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..న్యూజిలాండ్కి చెందిని పాపీ బెగ్లీకి స్నేహితులతో పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఇలా స్నేహితులతో బయటకి వెళ్లినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఆమె వారితో కలిసి ఆల్కహాల్ సేవిస్తుంది. ఏమైందో ఏమో గత కొంతకాలంగా ఇలా తాగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచే శరరం అంతా దద్దర్లు, వాంతులు అవ్వడం మొదలవుతోంది. ఆమె అది ఆల్కహాలిక్ ఎలర్జీ అనుకుంటా అని లైట్ తీసుకుంది. అంతగా పట్టించుకోలేదు. పార్టీలు చేసుకున్న ప్రతీసారి ఆమె పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నటుండి ఓ రోజు మరింత బలహీనంగా మారి సీరియస్ అయ్యింది. అప్పుడు డాక్టర్ ఆమె ఫేస్ చేస్తున్న సమస్య ప్రతిదీ నోట్ చేసుకుని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. తదుపరి ఆల్ట్రాస్కానింగ్ వంటి వైద్య పరీక్షలు చేసి హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకి ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు విపరీతంగా వస్తాయని చెబతున్నారు. కానీ బెగ్లీ అలర్జీ అనే అనుకుంది. వైద్యుల కూడా చర్మవ్యాధిగానే భావించి మందులు ఇచ్చేవారేగానీ సరియైన పద్ధతిలో నిర్ధారణ చేయలేదు. దీనికి తోడు ఆమె కూడా తన శరీరంలోని లక్షణాలను క్లియర్గా వివరించలేదు. అయితే ఆమె వైద్య పరీక్షల్లో తన మెడ కింద కూడా నొప్పిగా ఉందని చెప్పడంతో వారు మరింతగా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే వారు గడ్డ ఉన్నట్లు గుర్తించి క్యాన్సర్గా నిర్థారించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె టీనేజర్. కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. కానీ అప్పుడే నాలుగు శస్త్ర చికిత్సలు, కీమోథెరఫీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఆమెకు 20 ఏళ్ల వచ్చాయి. అయితే తనలా ఎవ్వరూ చాలా చిన్న ఏజ్లోనే ఆల్కహాల్ వంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెబుతోంది. అంతేగాదు తనకొచ్చిన హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినదని, దీన్ని చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటేనే వైద్యులు క్యూర్ చేయగలరంటూ ప్రజలకు అవగాహన కల్సిస్తోంది. ఏదైనా అనుభవిస్తేగానీ తెలిసిరాదంటారు. బహుశా ఇదే కాబోలు.ఎప్పుడోకప్పుడో అందరం పోయే వాళ్లమే. అలాంటప్పుడూ ఈ జీవితాన్ని ఇలా చెడుఅలవాట్లతో పాడుచేసుకోకుండా మంచి ఆహ్లాదకరంగా జీవించడానికి ఉపయోగిస్తే తనకి, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది. (చదవండి: యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్) -
మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ‘దృశ్యం’ తరహాలో హత్య! -
కిక్కెక్కింది.. నిద్ర ముంచుకొచ్చింది.. అట్లుంటది మనతోని!
పెద్దపల్లి: మందు బాబులూ.. ఒక్కక్షణం ఆలోచించండి.. మనం బయటకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చే దాకా మన కుటుంబం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోతే వాళ్లకు దిక్కెవరు? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తావద్ద రోడ్డుపై ఓ వ్యక్తి ఇలా గాఢనిద్రలో పడుకున్నాడు. చిత్తుగా మద్యం తాగడంతో మత్తు ఆవరించింది. ఆ కిక్కుతో ఒళ్లు మరిచి ఇలా నడిరోడ్డుపై నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నికల వేళ.. ఎవరు పిలిచి మద్యం తాగించారో లేక.. సొంతంగా కొనుగోలు చేసి తాగాడో తెలియదు కానీ.. రాజీవ్రహదారి సిగ్నల్స్ పక్కనే రోడ్డుపై నిద్రపోతున్నాడు.. వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోవచ్చు. కానీ ‘సాక్షి’ చొరవ చూపింది. రోడ్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
వైన్ షాప్నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!
విశాఖపట్నం: మద్యం ఇవ్వలేదని వైన్ షాప్ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోతినమల్లయ్య పాలెం పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను వైన్షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
‘మద్యం చాయ్’.. ప్రయోగాలకు పరాకాష్ట అంటున్న జనం!
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి టీ తయారీలో వినూత్న ప్రయోగం చేయడాన్ని చూడొచ్చు. ఆ వ్యక్తి ఒక చిన్న కుండలో మద్యం పోసి, దానితో టీ తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది యూజర్లు తెగ రియాక్ట్ అవుతున్నారు. ఒక యూజర్.. ‘సోదరా, మనం ఇకపై ఈ భూమిపై జీవించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించాడు. మరొక యూజర్ ఎప్పుడూ టీతోనే ఎందుకు ప్రయోగాలు జరుగుతాయి?’ అని ప్రశ్నించాడు. ఈ వీడియో చూసిన కొందరు ఆ టీ తయారీదారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో దేశీమోజిటో అనే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు పైగా వీక్షణలు దక్కాయి. ఇప్పుడే కాదు గతంలోనూ టీపై పలు ప్రయోగాలు జరిగాయి. ఈ జాబితాలో ఎగ్ టీ, ఫ్రూట్ టీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం! Old monk chai peelo fraans:) pic.twitter.com/HTYZsCJmGX — desi mojito 🇮🇳 (@desimojito) November 7, 2023 -
మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?
జానకి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలసి పబ్కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది. అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. అలవాటు కాదు.. జబ్బు జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. తిడితే సరిపోదు.. చికిత్స అవసరం.. మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వివిధ దశల్లో చికిత్స మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. మద్యపాన వ్యసనం లక్షణాలు మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం · తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం కారణాలు.. మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్గ్రౌండ్ ఎయిర్పోర్టు..కానీ ఇప్పుడది..) -
మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం, ఎగబడిన జనం: వైరల్ వీడియో
‘మెడిసిన్’ పేరుతో మద్యాన్ని అక్రమ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అక్టోబరు 30న బిహార్లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో 2016, ఏప్రిల్ 5 నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అక్రమ రవాణాకు తెరతీసింది. మెడిసిన్ పేరుతో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న ఈ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు కారులో ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. అంతే ఒక్కసారిగా అక్కడ గలాటా మొదలైంది. మద్యం బాటిళ్లను దొరకబుచ్చుకుని పరుగు అందున్నారు. ఫలితంగా అక్కడ ట్రాఫిక్ స్థంభించి, గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. కానీ అప్పటికే కారులో ఉన్న నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరవాటిని తీసుకెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించినట్టు స్థానికి అధికారి చెప్పారు. A video of people looting liquor bottles from a car on National Highway 2 in Bihar after the vehicle was involved in an accident has gone viral. Alcohol has been banned in the state since 2016. #Bihar #alcohol #liquor #viralvideo pic.twitter.com/F0gYIoycBt — Jammu Tribune (@JammuParivartan) November 1, 2023 -
ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా?
మోతాదుకు మించి ఆల్కహాల్ తాగితే చనిపోతారా?..అంటే పలు ఉదంతాల్లో అది నిజమనే ప్రూవ్ అయ్యింది కూడా. ఎందువల్ల ఇలా జరుగుతుంది?. ఒక్కసారిగా అది మన శరీరానికి హని కలిగించే విషంలా ఎలా మారుతోంది తదితారాల గురించే ఈ కథనం. ఈ ఆల్కహాల్కి చెందిన ఛాలెంజింగ్లను తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి రెండు లక్షలు గెలుచుకోవడం కోసం ఆఫీస్ పార్టీలో ఏకంగా ఒక లీటరు ఆల్కహాల్ని కేవలం పది నిమిష్లాల్లో హాంఫట్ చేశాడు. ఇక అంతే కాసేపటికే ప్రాణం పోయింది. ఆ వ్యక్తి పేరు జాంగ్. ఆస్ప్రతికి తరలించగా గుండెపోటు, ఆస్పిరేషన్ న్యూమోనియా తదతరాలతో బాధపడుతున్నట్లు తేలింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఆల్కహాల్ తాగేంతవరకు బాగానే ఉన్న వ్యక్తి వెంటనే ఎలా పాయిజన్ అయ్యి ప్రాణాంతకంగా మారింది...?. తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే.. ఓ వ్యక్తి ఛాలెంజ్ పరంగా, లేదా ఏ కారణం చేతనైనా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితే అది ఒక్కసారిగా పాయిజన్గా మారిపోతుంది. అమాంతం రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెంచేందుకు దారితీస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆల్కహాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయో..అప్పుడూ కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఇబ్బంది పడుతుంది. రక్తప్రవాహంలో అదనపు ఆల్కహాల్ సాధారణ పనితీరును దెబ్బతీసి శ్వాస, హృదయస్పందన రేటు, రక్తపోటు పడిపోయేలా చేస్తుంది. దీంతోపాటు శరీర విధులను నియంత్రించే మెదుడలోని భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో ఆల్కహాల్ పెరుగుతూనే ఉన్నందున అతడు బతికే అవకాశాలు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోతుంది. సంకేతాలు లక్షణాలు.. ఆల్కహాల్తో ఇలాంటి ఛాలెంజ్లు ప్రమాదకరమైనవి. అత్యవసరంగా చికిత్స అందించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వ్యక్తులు ప్రమాదకరంలో ఉన్నారని ఎలా గుర్తించాలంటే.. వారి గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి తేమగా లేదా చల్లగా అవుతున్నా.. నడవలేకపోతున్నా హృదయస్పందన సరిగా లేకపోయినా మూత్రశయం లేదా ప్రేగు నియంత్రణ కదలికలను నియంత్రించడం వాంతులు లేదా ఉక్కిరిబిక్కిరి చికిత్స! నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. తక్షణమే ప్రాణాలను రక్షించేలా చికిత్స అందించాలి. నిర్జలీకరణానికి ఇంట్రావీనస్ ద్రవాలు ఇస్తారు. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతారు అలాగే ఆల్కహాల్ పాయిజనింగ్తో బాధపడుతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కాన్యులాను ఉపయోగించి వారికి ఆక్సిజన్ని అందించడం చికిత్సలో అత్యంత ముఖ్యం పొట్టని ఒక పంపు సాయంతో టాక్సిన్లు లేకుండా శుభ్రం చేయడం రక్తంలోఇన ఆల్కహాల్ స్థాయిలను తగ్గించేలా రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు డయాలసిస్ చేయడం చేసి. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
మందేసుకుంటే కనిపెట్టేస్తుంది
మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలకు కారణమవడం దాదాపు ప్రపంచవ్యాప్త సమస్య. వాహనాలను నడిపే మందుబాబులను పట్టుకోవడానికి పోలీసులు నగరాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. మూతి దగ్గర గొట్టం పెట్టి ఊదమంటారు. ఊదితే ఎంత మందేశారో తెలిసిపోతుంది. కొందరు తెలివిమీరిన మందుబాబులు గొట్టం ముందు ఊదడానికి నానా విన్యాసాలు చేస్తారు. ఊదాల్సిన అవసరం లేకుండానే, మందుబాబులు ఏ డోసులో తాగారో ఇట్టే కనిపెట్టేసే బ్రాస్లెట్ ఇది. ‘సోబర్సేఫ్’ అనే అమెరికన్ కంపెనీ ‘సోబర్స్యూర్’ పేరుతో ఈ హైటెక్ బ్రాస్లెట్ను గత నెలలోనే మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో జీపీఎస్ టెక్నాలజీని కూడా అమర్చడంతో, దీనిని తొడుక్కున్న వారు ఎక్కడ ఉన్నారో తేలికగా కనిపెట్టవచ్చు. దీనిని వాచీలా చేతికి తొడుక్కుంటే, ఒంట్లో ఆల్కహాల్ ఎంత మోతాదులో ఉందో ఇట్టే తెరపై చూపిస్తుంది. దీని ధర 38 డాలర్లు (రూ.3,159) మాత్రమే! -
తాగుబోతు చేత ప్రమాణం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement