-
నువ్వు నేను హీరోయిన్ అనిత ఫ్యామిలీ (ఫొటోలు)
-
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ఆ సూపర్ హిట్ సినిమా మళ్లీ!
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. యూత్లో అతని మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. కానీ ఎప్పటికీ అతని నటించిన సినిమాలను ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్ను మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం లభించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్కు సిద్ధమైంది. ఇటీవల టాలీవుడ్లో పాత సినిమాలను రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా మళ్లీ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజై అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా మార్చి 21న థియేటర్స్లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. -
జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్లి అనిత(50) ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ కథనం ప్రకారం..మృతురాలు నాలుగు నెలలుగా మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజాము నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు పవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్తు ఏఎస్సై తెలిపారు. కాగా, పార్థివదేహం వద్ద డీఆర్డీవో విజయలక్ష్మి పుష్కగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియల్లో పాల్గొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఇవి చదవండి: వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి -
నటుడి మనవరాలి పెళ్లి.. హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్లో ఈ వివాహా వేడుక జరిగింది. కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో కూడా నటించారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
అనితకు ఊహించని షాక్..ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు
-
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. బ్రిజ్భూషణ్ విధేయుడి గెలుపు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీ వేదికగా ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈరోజే(గురువారం) వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల సందర్భంగా నూతన అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వీర విధేయుడిగా పేరొందిన సంజయ్.. మాజీ రెజ్లర్ అనిత షెరాన్పై విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకుంది. బ్రిజ్భూషణ్ అధ్యక్ష పదవికి అనర్హుడని... అతడిని వెంటనే తప్పించాలంటూ రెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ను రద్దు చేసింది. అనంతరం డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఎదురయ్యాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరగాల్సింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎలక్షన్ను నిలిపి వేసింది. ఈ క్రమంలో చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్హక్ కమిటీ ప్రకటించింది. అయితే, ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడగా... డిసెంబరు 21న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. అనిత్ వర్సెస్ సంజయ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి కోసం 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్, యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీపడుతున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనిత.. వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ వీర విధేయుడుగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్లలో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొనగా చివరికి సంజయ్ పైచేయి సాధించాడు. -
'తాతను మరచి ముందుకు సాగిన మనుమడి' పాదయాత్ర!
అనకాపల్లి: జెండాల హడావుడే గానీ జనం సందడి లేని నారా లోకేష్ పాదయాత్ర జిల్లాలో పేలవంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ తొలిరోజు చప్పగా సాగింది. జేజేలు పలకాల్సిన పార్టీ శ్రేణులు నిరసన గళానికే ప్రాధాన్యమిచ్చాయి. తుని పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లోకేష్ పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు. గౌతం సెంటరు వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన అనుయాయులతో స్వాగతం పలికారు. జనం ఆసక్తి చూపకపోయినా.. అదే సమయానికి సినిమాహాళ్ల నుంచి బయటకు వచ్చినవారు, భవన నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే ఉద్యోగులు కనిపించడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్రోడ్డులో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేసినా తెలుగు తమ్ముళ్ల జాడ అంతంతమాత్రంగానే ఉంది. పాయకరావుపేటలో అనిత వ్యతిరేక, అనుకూల వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా లోకేష్కు స్వాగతం పలికేందుకు రావడం గమనార్హం. పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి లోకేష్ను కలిశారు. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాతను మరచిన మనుమడు లోకేష్ పాదయాత్ర గౌతం సెంటరు, మంగవరంరోడ్డు మీదుగా పాయకరావుపేట వై జంక్షన్కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు నుంచే లోకేష్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తాత విగ్రహం ముందు నుంచి వెళ్లి కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని, ఆయన పెట్టిన పార్టీ లాక్కుని పదవులు అనుభవిస్తూ కనీసం ఆయన విగ్రహానికి దండ వేయకపోవడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనితకు అసమ్మతి సెగలు! యువగళం పాదయాత్రలో నియోజకవర్గంలో పార్టీ కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. నారా లోకేష్ సాక్షిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు నిరసన సెగ తగిలింది. అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు జీవీఆర్ నగర్ వద్ద ఉన్న వంగవీటి మోహన్రంగా విగ్రహం వద్ద అనిత ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర అక్కడకు చేరుకోగానే అనిత వద్దు, టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు గమనించిన అనిత వెంటనే అక్కడకు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేయగా ‘మమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయించారు. మేం చేసిన తప్పేంటి’ అని నిలదీశారు. లోకేష్ వారిని సముదాయించి యాత్ర కొనసాగించారు. బైపాస్ జంక్షన్, ప్రకాష్ కళాశాల, పీఎల్పురం, సీతారాంపురం మీదుగా నామవరం చేరుకొని, అక్కడ ప్రైవేటు లేఅవుట్లో రాత్రి బస చేశారు. ఇవి చదవండి: 15న మంత్రివర్గ సమావేశం -
టీడీపీ నేత యనమల కృష్ణుడుపై జనసేన ఫైర్
నక్కపల్లి/పాయకరావుపేట : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకేనని నియోజకవర్గ పరిశీలకుడు యనమల కృష్ణుడు చేసిన ప్రకటనపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి కృష్ణుడెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించే అధికారం పరిశీలకులకులేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి, కాపు నేత గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనితకు టికెట్ ఇస్తే జనసేన కార్యకర్తలు మద్దతిచ్చే ప్రసక్తిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఆమె వ్యవహారశైలి.. కాపులను, జనసేనతోపాటు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయాలు తెలియక యనమల కృష్ణుడు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో అనితకు ఎమ్మెల్యే పదవి భిక్ష పెట్టింది జనసేన పార్టీయేనని, తమ మద్దతువల్లే ఆమె గెలిచారని బుజ్జి చెప్పారు. పదవి చేపట్టిన వెంటనే ఆమె తనపై రేప్ కేసు పెట్టించిందని, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని, కాపుల వ్యతిరేకి అయిన ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకే కేటాయించాలని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కోరుతున్నారని ఆయన తెలిపారు. పాయకరావుపేట టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నిర్ణయిస్తారన్నారు. -
శోభిత ధూళిపాల హోయలు.. కలర్ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత!
►బ్లూ డ్రెస్లో స్మైలీగా యామీ గౌతమ్! ►కలర్ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత! ►బాలీవుడ్ భామ సన్నీలియోన్ హాట్ పోజులు! ►స్టెలిష్ డ్రెస్లో శోభిత ధూళిపాల హోయలు! ►బాలీవుడ్ భామ దిశా పటానీ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
'అనితా ఓ అనితా' సింగర్ గుర్తున్నాడా?.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. ఒక్క పాటతో సంచలనం సృష్టించిన నాగరాజు గురించి తెలుసుకుందాం. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్ పాటకు అనితా పాటను అటాచ్ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. పెద్దబ్బాయికి మూగ, చెవుడు తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదారాబాద్లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. -
తొలి సినిమాతో హిట్.. ఆ తర్వాత అవుట్..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించడం అంతా ఈజీ కాదు. అలాగే వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత సవాలుతో కూడుకున్నది. అలా కొందరు సూపర్ హిట్ మూవీస్లో నటించినా ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కొందరు హీరోయిన్లు పెళ్లిబంధంతో జీవితంలో సెటిలైతే.. మరికొందరు అసలుకే కనుమరుగైపోయారు. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. ఇలా కనిపించకుండా హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. నువ్వే కావాలి హీరోయిన్ రిచా హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. నువ్వు నేను హీరోయిన్ అనిత బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్ అనిత.. ఉదయ్ కిరణ్తో కలసి నటించింది. శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో ''తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిత్రం మూవీ హీరోయిన్ రీమా సేన్ ఉదయ్కిరణ్, రీమా సేన్ 'చిత్రం' మూవీలో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బావనచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శివకరణ్ సింగ్ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు బద్రిలో నటించిన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘బద్రి’. ఆ తర్వాత రేణు దేశాయ్ ప్రేమలో పడి పవన్ కల్యాణ్ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్.. ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వంశీ మూవీ హీరోయిన్ నమ్రత వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా ఆమె నటించలేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా స్టూడెంట్ నంబర్- 1లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన గజాలా ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనే కనిపించింది. అలాగే ఇడియట్ సినిమాలో రవితేజ సరసన కనిపించిన రక్షిత కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. 6 టీన్స్ మూవీలో నటించిన రుతిక, సంతోషం మూవీలో చేసిన గ్రేసీ సింగ్, మన్మథుడు మూవీలో నటించిన అన్షు, టక్కరి దొంగ నటించిన లిసా రే, బన్నీ మూవీలో అల్లు అర్జున్తో జోడిగా కనిపించిన గౌరీ ముంజల్, దిల్ మూవీలో చేసిన నేహా, ఆర్య మూవీలో అను మెహతా, ఒకటి రెండు సినిమాలతోనే హిట్ సాధించినా ఆ తర్వాత కనుమరుగైపోయారు. -
అదొక్కటే నాకున్న వ్యాపకం.. రెండో పెళ్లిపై దిల్రాజు కామెంట్స్
ప్రముఖ నిర్మాత దిల్రాజు డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం స్టార్ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక దిల్రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2017లో ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో 2020లో తేజస్విని(వైఘా రెడ్డి)తో ఆయనకు రెండో వివాహం జరిగింది. తాజాగా తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. '' నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మెంటల్లీ చాలా స్ట్రగుల్ అనిపించింది. ఆ టైంలో కూతురు, అల్లుడు నాతోనే ఉండేవారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ప్రయత్నించా. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్. నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. నా కూతురు హన్షితా కూడా సపోర్ట్ చేసింది. నా ఫ్యామిలీ డిస్టర్బ్ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా'' అంటూ దిల్రాజు పేర్కొన్నారు. కాగా ఇటీవలె ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్ రెడ్డి అని పేరు పెట్టారు. చదవండి : హీరోల క్యారవాన్ కల్చర్పై దిల్రాజు షాకింగ్ కామెంట్స్ -
సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత
ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి. గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్గా, ఎన్సీసీ క్యాడెట్గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్ ఫస్టియర్లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్సీసీ క్యాడెట్గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత. ‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్డీ సీటును కూడా వదులుకుని యూఎస్కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్ జనరల్ హాస్పిటల్లో చారిటీ వర్క్ చేశాను. ఒక కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను. యూఎస్ రోడ్లే కాదు! ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్ ఆనంద్ బాగ్లో రెయిన్ బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్ పడింది. ‘యూఎస్లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి జీహెచ్ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది. ప్లాస్టిక్ వద్దు... కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బదులు ఈ బ్యాగ్ వాడండి అని జ్యూట్ బ్యాగ్ ఇచ్చాం. జీహెచ్ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్ వేస్ట్ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్ డిజైన్ చేశాను. వీటన్నింటితోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ క్రషింగ్ యూనిట్కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం రైల్వే స్టేషన్లలో కూడా క్రషింగ్ మెషీన్లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ. సంఘటిత శక్తి ‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి. జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్నగర్ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం. – వాకా మంజులారెడ్డి. -
Anitha Rao: మహిళా ట్రెక్కర్గా.. హార్స్ రైడింగ్, పెయింటింగ్లోనూ.. హ్యాట్సాఫ్!
మురళీనగర్: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్ రైడింగ్తో సత్తా చాటుకుంటున్నారు. సాహసయాత్రికురాలిగా, బైక్ రైడర్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు. దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్లో బాలాజీ టవర్స్లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్ వి.రామకృష్ణ నేవీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు. మహిళా ట్రెక్కర్గా.. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్ సెక్షన్లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్లో స్పెషల్ కోర్సు చేస్తూ రెగ్యులర్ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. విశాఖ యూత్ హాస్టల్ తరుఫున బృందాలకు టీమ్ లీడర్గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యుట్లో 2015లో మౌంట్ ఇంజినీరింగు కోర్సు చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు. మౌంటినీరింగులో భాగంగా క్యాంప్ లీడరుగా లడక్లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్పాయింటుగా అయిన ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా అధిరోహించారు. హార్స్ రైడింగ్లో.. అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్ యాత్ర లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదయ్యింది. 2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి బైక్ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. ఈ రెండూ లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. పెయింటింగ్లోనూ.. పెయింటింగ్లో ఆమె దిట్ట. పెన్సిల్ స్కెచింగ్, వాటర్ కలర్ పెయింగ్స్ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్లో నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
అన్నార్తుల సేవలో.. కర్నూలు మహిళ
కర్నూలు (ఓల్డ్సిటీ): అన్నార్తుల ఆకలి తీర్చే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఒకరు.. ఇద్దరు కాదు.. కొన్ని కోట్ల మంది అభాగ్యుల కాలే కడుపులు నింపింది. కట్టుబట్టలతో ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చిన వలస జీవులకు బాసటగా నిలిచింది. మూడేళ్ల క్రితం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన కర్నూలు నగరానికి చెందిన అనిత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో అన్నార్తులను ఆదుకున్నారు. 200 మంది సభ్యులతో వలస వెళ్లే కార్మికులు, సాధారణ పౌరులకు అండగా నిలిచారు. ఏడాది క్రితం ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించగా ఆ సంస్థ హెడ్గా నైజీరియాలో ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీజ్లి చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవల ఆమె కర్నూలు రాగా ‘సాక్షి’తో మాట్లాడారు. తల్లిదండ్రులు, భర్త, కుమార్తెతో.. ‘మా నాన్న అర్థోపెడిషియన్ డాక్టర్ వెంకట శెట్టి నాకు స్ఫూర్తి. ఆయన 1,500 మందికి పోలియో ఆపరేషన్స్ ఉచితంగా చేశారు. ఆ చిన్నారులు, తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను. అరుదైన సేవలకు ఒక సార్థకత ఉంటుందని భావించి నేను సాఫ్ట్వేర్ రంగం నుంచి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రతినిధిగా ఎంపికయ్యాను. ఇటీవల ఆప్ఘనిస్తాన్లో సంభవించిన రాజకీయ పరిణామాలతో అక్కడి పౌరులు భారీ స్థాయిలో ఇతర దేశాలకు వలస వెళ్లిన క్రమంలో వాళ్లను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఆత్మీయంగా గుండెలకు హత్తుకుంది. వాళ్లు ఎక్కడ విడిది చేస్తే అక్కడే గుడారాలు వేసి ఆహారాన్ని అందించింది. గతంలో యెమెన్లో భారీ సంఖ్యలో (దాదాపు 2 కోట్ల మంది) వలసలు జరిగినప్పుడు డబ్ల్యూఎఫ్పీ వారిని ఆదుకుంది. నైజీరియా, మయన్మార్, బంగ్లాదేశ్ల నుంచి ప్రజలు వలసవెళ్లిన సందర్భాల్లో ఆహారం సరఫరా చేయడంతో పాటు కొన్ని నెలల పాటు పునరావాసం కల్పించాం. ఏదైన దేశంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడి తమ మనుగడ ప్రమాదకరంగా మారినప్పుడు చాలా మంది వలస వెళ్తున్న సమయంలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక విడిది ఏర్పాటు చేస్తాం. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సరఫరా చేస్తాం. వలసదారులతో పనిచేసే క్రమంలో వాళ్లు మాట్లాడే హౌసా, ఇగ్లో, ఎరూబా భాషలను కూడా నేను నేర్చుకోగలిగా. నా భర్త హరికృష్ణ, కుమార్తె మేధా అందించిన సహకారం మరవలేనిది’ అని అనిత చెప్పారు. -
అలుపెరగని అగ్గిబరాటా
వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత. అది 1965.. ఢిల్లీలోని సీలమ్పూర్లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్లోనే పెన్సిల్తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది. పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. అప్పులు... పోరాటాలు ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి. భర్తతో కలిసి... ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్నగర్ నంబర్ వన్ స్కూల్కు వైస్ ప్రిన్స్పాల్గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. -
పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటతో ప్రేక్షకులను బుట్టలో వేసుకొని అభిమానులుగా మార్చేసుకున్న నటి పూజా హెగ్డే. మరి ఆమెను బుట్టలో పడేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనీతా డోంగ్రే డిజైనర్ అనీతా డోంగ్రేకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. అందుకే ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ చేసింది. రాజస్థాన్ సంప్రదాయ ఎంబ్రాయిడరీనే తన డిజైన్స్కి ప్రేరణగా తీసుకుంటుంది. దాంతో అదే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. 2015లో తన పేరుమీదే ముంబైలో ఫ్యాషన్ హౌజ్ను ప్రారంభించింది. ఇప్పుడది సెలబ్రిటీస్ ఫేవరెట్గా స్థిరపడిపోయింది. ఆ దుస్తుల ధరలు డిజైన్ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్లైన్లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. బ్రాండ్: అనీతా డోంగ్రే ధర: రూ. 1,99,000 ఫుట్వేర్... టిన్సెల్ టోస్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్లో టిన్సెల్ టోస్ ఫుట్వేర్ ఒకటి. జపాన్లో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్తో లభించే ఈ జూతీస్కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యనే చండీగఢ్లో కూడా ఓ బ్రాంచ్ను ప్రారంభించారు. సాధారణ ఫుట్వేర్ కూడా ఇక్కడ అందమైన డిజైన్స్లో దొరుకుతాయి. అందుకే, సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభిస్తాయి. బ్రాండ్: టిన్సెల్ టోస్ ధర: రూ. 2,499 సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరు అని చాలా మంది అనుకుంటూంటారు. కానీ, నేను అలా కాదు. స్టయిల్ అనేది మనం సెట్ చేసేదే. మిక్స్ అండ్ మ్యాచ్ను ట్రై చేస్తుంటా. – పూజా హెగ్డే -
రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..
అనిత పుట్టింది పెరిగింది కరీంనగర్లో. ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్లో అమ్మమ్మగారింట్లో ఉండి చదువుకుంది. ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కెరీర్లో కొంత విరామం. ఇప్పుడు సొంత గ్యారేజ్ తో కొత్త కెరీర్లో అడుగుపెట్టింది. గ్యారేజ్ అనగానే టైర్లు, రెంచ్లు, గ్రీజు అంటిన దుస్తులతో మగవాళ్లు కళ్లముందు మెదలుతారు. మహిళలు ప్రవేశించని రంగం అనడం కంటే మహిళలు పెద్దగా ఇష్టపడని రంగం అనే చెప్పాలి. భుజబలంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టే ఈ రంగంలో అడుగుపెట్టడం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని ఒక సవాల్గా స్వీకరించింది అనిత వ్యాల. ఇల్లు అమ్మేశాం! ‘‘విక్టరీ 4 వీల్స్ గ్యారేజ్ని 2018లో తమ్ముడు, నేను కలిసి మొదలుపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను. యాభై లక్షలతో పూర్తవుతుందని దిగాం. కానీ మేము అనుకున్న స్వరూపం వచ్చేటప్పటికి 90 లక్షలైంది. లోన్ కోసం నెలలపాటు బ్యాంకు చుట్టూ తిరిగి చివరికి మా ఫ్లాట్స్ అమ్మేసి గ్యారేజ్ పెట్టాం. నలుగురు ఉద్యోగులతో మొదలైన గ్యారేజ్లో ఇప్పుడు నాతో కలిసి పన్నెండు మందిమి పని చేస్తున్నాం. మహిళ అయిన కారణంగా ఎదురయ్యే ఇబ్బందులేమీ లేవు. కానీ వర్కర్స్ జాప్యం చేస్తున్నట్లు, మహిళను కావడంతోనే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారేమో అనిపించేది. అయితే వాళ్ల సమాధానం విన్న తర్వాత పని ఆలస్యం కావడానికి కారణం సహేతుకంగానే అనిపించేది. పాప లక్ష్యం మెడిసిన్ పిల్లల కోసం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన తరవాత గ్యారేజ్ పెట్టడానికి మధ్య కొంతకాలం ట్యూషన్లు చెప్పాను. ట్యూషన్లతో వచ్చే రాబడితో హాయిగానే ఉండేది. అయితే మా పాప లక్ష్యం మెడిసిన్. సీటు తెచ్చుకోవడం ఆమె లక్ష్యం. ఫీజులు కట్టడానికి తగినట్లు నా ఇన్కమ్ను పెంచుకోవడం నా లక్ష్యం అయింది. అందుకే పని చేయగలిగిన వయసులోనే కన్స్ట్రక్టివ్గా ఏదో ఒక బిజినెస్లోకి అడుగుపెట్టి స్థిరపడాలనుకున్నాను. అంతే తప్ప నేను రికార్డు సాధించడం కోసం పిల్లల భవిష్యత్తు మీద ప్రయోగం చేసే పరిస్థితి కాదు. తమ్ముడి సూచన మా తమ్ముడికి టాటా డీలర్షిప్ వర్క్షాపులో పదహారేళ్ల అనుభవం ఉంది. మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్‡గురించి చెప్పాడు. అలా ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో ప్రతిదీ పనిలోకి దిగిన తర్వాత నేర్చుకున్నదే. కారు డీప్ ఇంటీరియర్ క్లీనింగ్, ఇన్సైడ్ వ్యాక్యూమింగ్, కెమికల్ క్లీనింగ్, ఫోమ్ వాషింగ్, ఫాగ్ మెషీన్ శానిటైజేషన్ వంటి పనులన్నీ చేస్తాను. సమస్యలుంటాయని చెప్పడానికి... ‘దిగితేనే లోతు తెలుస్తుంది’ అంటారు. నేనయితే ‘దిగితే ఈత దానంతట అదే వస్తుంది’ అంటాను. ఇందులో పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఒకసారి మా గ్యారేజ్కి వచ్చిన కస్టమర్లు ఆ తర్వాత నుంచి కొనసాగుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే మహిళల విషయంలో కారు సర్వీస్కి కూడా వాళ్లే రావాల్సి ఉంటుంది. మగవాళ్లు నిర్వహించే గ్యారేజ్లో కంటే మా దగ్గర సౌకర్యంగా ఫీలవుతున్నారు మహిళలు. నేను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్యారేజ్లో ఉంటాను. ఒక్కోసారి అర్జంట్గా పని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పన్నెండు గంటల వరకు కూడా గ్యారేజ్లో ఉండాల్సి వస్తుంది. అమ్మాయిలూ రెంచ్ పట్టుకోండి! ఒకప్పుడు మెకానిక్ అంటే సమాజం తక్కువ గా చూసేది. అలా చూడడం వల్లనే కావచ్చు ఇప్పుడు ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. పైగా ఇప్పుడు మెకానిక్ వృత్తికి గౌరవం పెరిగింది కూడా. కాబట్టి అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఈ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తాను. ఈ కాలంలో టూ వీలర్ నడిపే అమ్మాయిలు, కారు నడిపే మహిళల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు గ్యారేజ్కి వచ్చినప్పుడు గ్యారేజ్లో పని చేసే వాళ్లలో అమ్మాయిలు కనిపిస్తే భరోసాగా ఫీలవుతారు. ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఎప్పటికీ ఆదరణ తగ్గని మంచి రంగం అవుతుంది’’ అన్నది అనిత. కష్టం... వద్దన్నా వచ్చే అతిథి సింగిల్æమదర్ల మీద ఉండే బాధ్యతల బరువు నాకు తెలుసు. అందుకే సింగిల్ మదర్లు ఈ పని నేర్చుకోవడానికి ముందుకొస్తే వారికి సహకరిస్తాను.ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు. అనుకోని అతిథిలా కష్టం దానంతట అదే వచ్చి తిష్టవేస్తుంది. కష్టం వచ్చిందని భయపడి పిల్లలతోపాటు ఆత్మహత్యలకు పాల్పడే తల్లుల గురించి తెలిసినప్పుడు బాధ కలుగుతుంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. పరిస్థితులకు మనం బాధితులమైనప్పటికీ మన పిల్లలను బాధితులను చేయకూడదు. అలాగని అమ్మానాన్నల మీద వాలిపోకూడదు. వాళ్లు కష్టకాలంలో అండగా భుజాన్ని ఇవ్వగలుగుతారు. కానీ బరువు మోసే శక్తి వాళ్లకు ఉండదు. మీకు వచ్చిన పని చేయండి, నచ్చిన పనిని నేర్చుకోండి. – అనిత వ్యాల, ఎం.డీ. ఆమె తాను ఎంచుకున్న రంగంతో మహిళలకు స్ఫూర్తినివ్వడంతోపాటు కొత్తతరానికి స్వాగతం పలుకుతోంది కూడా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట..
సాక్షి, మాచర్ల రూరల్: కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట.. కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో వలంటీర్గా పనిచేస్తున్న కేతావత్ శివా నాయక్ (22)కు, రెంటచింతల మండలం పశర్లపాడుకు చెందిన జఠావత్ అనితతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మాచర్ల పట్టణంలోని ఓ కళాశాలలో అనిత డిగ్రీ చదువుతోంది. వేసవి సెలవుల్లో వివాహం జరిపించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అనిత కుటుంబంలో ఏర్పడ్డ స్వల్ప విభేదాలతో కలత చెందిన శివానాయక్, అనితలు గురువారం కంభంపాడు కుడికాలువలో దూకారు. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడికి చేరుకుని కాలువలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ రక్షించేందుకు అక్కడే ఉన్న కొంతమందిని పురమాయించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శివా నాయక్ కొట్టుకుపోగా.. కొన ఊపిరితో ఉన్న అనితను ఒడ్డుకు చేర్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివా నాయక్ మృతదేహాన్ని కాలువలో గాలించి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన తమ పిల్లలకు ఈ దుస్థితేంటంటూ ఇరు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవదాయశాఖ ఈవో అనిత ఆత్మహత్య
సాక్షి, దాచేపల్లి (గురజాల): రెండు రోజుల కిందట సస్పెండైన దేవదాయశాఖ గురజాల మండల ఈవో డి.అనిత (32) కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటికి తీయించిన ఎస్ఐ ఇ.బాలనాగిరెడ్డి.. మృతురాలు అనితగా గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత భర్త రమేష్ గుంటూరులో ఉంటూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనిత గురజాలలో విధులు నిర్వర్తిస్తూ దాచేపల్లి మండలం శ్రీనగర్లో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం భర్త వద్ద నుంచి ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. బస్సులో ఉన్నప్పుడు పలుమార్లు భర్తతో కూడా మాట్లాడారు. దాచేపల్లి బస్టాండ్లో దిగానని 9 గంటలకు ఫోన్ చేసి.. మధ్యాహ్నం 12 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. అంతలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టు వారికి సమాచారం అందింది. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా గురజాల మండలం దైద, సత్రశాల ఘాట్ల నిర్వహణ బాధ్యతలను అనిత చూశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అండదండలతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. త్రిసభ్య కమిటీ విచారణలో అది వాస్తవమని తేలడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. -
సత్యంబాబుకు పెళ్లయింది..
సాక్షి, ఖమ్మం: తొమ్మిదేళ్ల క్రితం విజయవాడలో బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసులో జైలు జీవితం గడిపి... నిర్దోషిగా విడుదలైన సత్యం బాబు ఓ ఇంటివాడయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చిలో శుక్రవారం అతడి వివాహం జరిగింది. అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబు సుమారు తొమ్మిదేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం ఆ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇదిలా ఉంటే తిరుమలాయపాలెం మండలం చంద్రతండా చర్చి ఫాదర్ క్రీస్తుదాసు కుమార్తె అనితతో బంధుమిత్రుల సమక్షంలో సత్యంబాబు పెళ్లి జరిగింది. -
అనితను పరామర్శించిన మంత్రి
సాక్షి, బోథ్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండలం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని.. అధైర్యపడవద్దని అనితను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని, అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవన్న, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్, మల్లికార్జున్ రెడ్డి, జివి రమణ, పాకాల రాంచందర్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
నా ప్రాణాలకు రక్షణ కల్పించండి: అనిత
హైదరాబాద్: మళ్లీ విధులకు వెళితే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని సిర్పూర్ కాగజ్నగర్ ఘటనలో గాయపడిన ఎఫ్ఆర్వో అనిత కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లానని, 4 రోజుల ముందే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి స్పష్టంగా చెప్పిన తర్వాత పొలంలోకి వెళ్లామని చెప్పారు. తాము మొక్కలు నాటే పనులు చేస్తుండగా జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణతోపాటు మిగతావారు వచ్చి తనను చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. ఎంత వేడుకున్నా వినకుండా దాడి చేశారన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు గ్రామస్తులను రెచ్చగొట్టడం, అధికారులపై దాడులకు ఉసిగొల్పడం చేస్తుంటారని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. దాడి చేసిన వారిపై ఏదో ఒక కేసు పెడితే మళ్లీ రాజకీయ బలంతో బయటకు వస్తారని, అప్పుడు తన ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. -
కొడుకు లేని లోటును తీరుస్తున్నాం..
‘మా అమ్మానాన్న ఆండాళమ్మ, స్వామిరెడ్డిలకు మేము నలుగురు కూతుళ్లమే. అమ్మాయిలని వివక్ష చూపకుండా.. విలువ కట్టలేని ప్రేమను పంచి మమ్మల్ని మా అమ్మానాన్న బాగా పెంచారు. అందరినీ చదివించారు. నేను డాక్టర్గా ఎదగాలన్నది నాన్న ఆకాంక్ష. ఈ గమ్యాన్ని చేరడంతో ఎంతో సంతోషపడ్డారు. అమ్మ మూడేళ్ల క్రితం మా నుంచి దూరమైంది. అప్పటి నుంచి నాన్న బాగోగులు బిడ్డలమే చూసుకుంటున్నాం. కొడుకులేని లోటు తీరుస్తున్నాం. ఒక ఆడబిడ్డగా దేవుడు మాకిచ్చిన వరమిది’ అని జిల్లా పరిషత్ నూతన చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి చెప్పారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తన విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మా అమ్మనాన్నలది హయత్నగర్ మండలం అనాజ్పూర్. అప్పట్లో మలక్పేట టీవీ టవర్ వద్ద ఉండేవాళ్లు. మాకు దగ్గర్లోని తిరుమల హిల్స్లో నా భర్త హరినాథ్రెడ్డి వాళ్ల ఇల్లు. ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకరి కంట ఒకరం పడలేదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి నాటికే మా ఇద్దరిదీ ఎంబీబీఎస్ పూర్తయింది. వివాహం తర్వాత నేను ఉన్నత చదువులు అభ్యసించడంలో హరి ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను గుల్బర్గాలో ఎండీ, డీజీఓలో చేరగా.. ఆయన తమ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. పీజీలో ఉండగానే కూతురు త్రిష పుట్టింది. మూడు నెలల వయసులో పాపను అత్తమ్మ దగ్గరే ఉంచాను. ఆలనాపాలనా తనే చూసుకున్నారు. అప్పుడు పరీక్షలు ఉండటంతో గుల్బర్గా వెళ్లక తప్పలేదు. ఇలా పీజీ అయ్యే వరకు వారానికోసారి పాప వద్దకు వచ్చే వెళ్లేదాన్ని. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఆప్యాయతకు, అనురాగానికి ఏమాత్రం కొదవ లేదు. మామ తీగల కృష్ణారెడ్డి, అత్తయ్య అరుంధతి, మరిది అమర్నాథ్రెడ్డి, తోటి కోడలు తులసి, మా వారు, ఇద్దరు పిల్లలం కలిసే నివసిస్తాం. నిత్యం ఎవరి బిజీలో వాళ్లుంటారు. ప్రతి శనివారం సాయంత్రం అందరం కలిసే భోజనం చేస్తాం. మా ఆడపడుచు కుటుంబమూ ఈ విందుకు హాజరవుతుంది. సమయాన్ని బట్టి కలిసే చోటు మారుతుంది. ఇలా ఇంటిల్లిపాదితో వారానికోసారి భేటీ ఉండటం గొప్ప సంతోషానిచ్చే అంశం. చిన్నప్పటి నుంచి టాపర్ని బాల్యం నుంచి చదువుల్లో ముందజలో ఉండేదాన్ని. పోటీతత్వం, ఇష్టంతో చదివేదాన్ని. ఏ క్లాస్ని తీసుకున్నా ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేదాన్ని. టెన్త్ వరకు హైదరాబాద్లో చదవగా.. విజయవాడలో ఇంటర్ పూర్తయింది. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ చేశా. వైద్య విద్యలో పీజీ కాగానే నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న డక్కన్ మెడికల్ కాలేజీలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలందించాను. అనంతరం రెండేళ్లపాటు మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా కొనసాగాను. మామ, మా ఆయన ప్రోత్సాహంతో 2010లో దిల్సుఖ్నగర్లో టీకేఆర్–ఐకాన్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థాపించాను. స్వీట్స్ తినేందుకు కిలోమీటర్లు వెళ్లేవాళం.. వైద్యవిద్య చదివే సమయంలో నచ్చిన ఆహారం తినేందుకు క్లాస్లకు డుమ్మా కొట్టేవాళ్లం. మా కాలేజీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రసమలై స్వీట్ తినేందుకు వెళ్లేవాళ్లం. అలాగే అక్కడ ఆశీర్వాద్ హోట్లో చికెన్ ఫ్రైడ్ రైస్, జనతా ఐస్క్రీం పార్లర్లో వివిధ రకాల ఫేవర్లలో ఐస్క్రీంలు చాలా ఫేమస్. చాలా ఆకర్షనీయంగా, టేస్టీగా ఉండటంతో తరగతులకు డుమ్మాకొట్టి ఆ రుచులను ఆస్వాదించేవాళ్లం. మా బెస్ట్ ఫ్రెండ్స్ మ్తొతం ఏడుగురు. ఎక్కడికి వెళ్లినా మేమంతా ఒకే జట్టుగా కదిలేవాళ్లం. 16ఏళ్ల నాటి కోరిక.. నెరవేరిన వేళ పెళ్లయిన కొత్తలో మేమిద్దరం మారీషస్కి వెళ్లాం. హెలికాప్టర్ రైడ్ చేయాలన్న కోరికను ఆయన ముందుంచా. అయితే, ఆ రైడ్ చేయడం వీలుపడలేదు. ఈ విషయాన్ని 16 ఏళ్లపాటు తనలో దాచుకున్న ఆయన నా 40వ పుట్టిన రోజు సందర్భంగా నిజం చేశారు. సౌతాఫ్రికాకు తీసుకెళ్లి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడ హెలికాప్టర్ రైడ్ చేయించారు. ఈ ఘటన చాలా సర్ప్రైజ్ కలిగించింది. ఆ క్షణాన నాకసలు మాటలు రాలేదు. నా ఇష్టం పట్ల ఆయన చూపిన ప్రేమ నా జీవితకాలపు తీపిజ్ఞాపకం. వైద్య వృత్తి వల్ల నేను.. టీకేఆర్ విద్యాసంస్థల నిర్వహణలో మా భర్త చాలా బిజీ. ఉదయం లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారాలే ఉంటాయి. కానీ, ప్రతి ఆదివారం పూర్తిగా మేం కుటుంబానికే కేటాయిస్తాం. ఆ రోజు ఎటువంటి పనులూ పెట్టుకోం. ఆయనది విశాల మనస్తత్వం. అన్నీ అర్థం చేసుకోగల గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. నాన్వెజ్ అంటే మహాఇష్టం.. మావారికి నాన్వెజ్ అంటే ఇష్టం. మటన్ మహాఇష్టం. మా ఇద్దరు పిల్లలు త్రిష, కృష్ణారెడ్డిలు కూడా వాళ్ల నాన్ననే అనుసరిస్తారు. రోజు వడ్డించినా వద్దనకుండా లాగించేస్తారు. నేనేమో నాన్వెజ్కు కొంచెం దూరం. నాన్వెజ్ని నేనే వండాలి..వడ్డించాలి. ఇక ఆరోజు క్రికెట్ ఉంటే పండగే. వారి ముంగిటకే వంటకాలను తీసుకెళ్లాలి. ఆ మ్యాచ్ అయ్యేదాకా టీవీని వదలరు. నేను పెద్దగా టీవీ చూడను. చూసే సమయమూ ఉండదు. పిల్లల చదువులో మాత్రం చాలా సీరియస్గా ఉంటాను. ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. నన్ను స్ఫూర్తిగా తీసుకున్న మా కూతురు డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నీట్లో మెరిట్ వచ్చింది. ఎంబీబీఎస్లో చేరనుంది. అబ్బాయి.. సెకండ్ క్లాస్. సినిమాలో విషయంలో మా అభిరుచులు వేరు. నేను హిందీ సినిమాలు చూస్తా, ఆయన తెలుగు కామెడీ మూవీలు ఎక్కువగా చూస్తారు. అయినా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తూ రెండు భాషల సినిమాలకు వెళ్తుంటాం. బేసిక్గా నేను చిరంజీవి ఫ్యాన్ని. జగదేకవీరుడు.. అతిలోకసుందరి బాగా నచ్చిన సినిమా. సేవకు కదిలి.. ప్రాణాలు కాపాడి మా ఆస్పత్రికి గ్రామీణ ప్రాంత మహిళలు అధికంగా వస్తుంటారు. వాళ్లంతా పెద్దగా పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిసింది. విశ్రాంతి పెద్దగా తీసుకోరని, మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నట్లు నా కౌన్సెలింగ్ ద్వారా తేలింది. ఇటువంటి మహిళలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి వారిని వేధిస్తున్నాయి. తొలుత వారికి చైతన్యం కల్పించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని భావించా. ఇందుకోసం ‘ఆర్ట్’ ఫౌండేషన్ను స్థాపించి.. గ్రామీణ మహిళల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. 60కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల బాలికల్లోనూ చైతన్యం తెచ్చాం. దీంతోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ని మా ఆస్పత్రిలో ఉచితంగా చేయించాం. ఇలా 1,350 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. ఇందులో నలుగురికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో వీరి ప్రాణాలను కాపాడగలిగాం. ఇప్పటికే నిత్యం ఒక గంట ఆ ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత ఓపీ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నాం.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement