-
40 స్థానాలు మావే!
సాక్షి, చైన్నె: రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలు తమవేనని, గెలుపు ప్రకాశవంతంగా ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సేలం జిల్లా ఆత్తూరులో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే బలం ఏమాత్రం తగ్గలేదని ఽధీమా వ్యక్తం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో మరింత బలోపేతం దిశగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని అయితే, ప్రజామద్దతు ముఖ్యం అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ఏ ఒక్కరికీ బానిస కాదని స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్సభ నియోజకవర్గాలలో అన్నాడీఎంకే బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ తమ గెలుపు ప్రకాశవంతంగా ఉందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయగా, అవి ఆయన వ్యక్తిగతం అని సమాధానం ఇచ్చారు. 25 స్థానాలను బీజేపీ గురి పెట్టినట్టుందే అని మళ్లీ ప్రశ్నించగా, అమిత్ చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
డీజీపీ ఎవరు?
* ముగియనున్న రామానుజం పదవీ కాలం * రేసులో నలుగురు * కేంద్రానికి జాబితా సాక్షి, చెన్నై: రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ రామానుజం పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి డీజీపీ ఎవరన్న ప్రశ్న పోలీసు వర్గాల్లో మొదలైంది. ఈ పదవికి అర్హులుగా పేర్కొంటూ నలుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా రామానుజంను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రను పోషించారు. అధికార పక్షానికి విధేయతను చాటిన ఆయన 2012 నవంబరులో పదవీ విరమణ పొందారు. దీంతో తదుపరి డీజీపీ చాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ అప్పట్లో మొదలైంది. అయితే, ఈ చర్చకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేసులో ఉన్న ఇతర అధికారుల్ని నిరాశలో పడేసింది. రామానుజం పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ, ఆయన సేవల్ని మరింతగా వినియోగించుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్లు: రామానుజం పదవీ కాలాన్ని పొడిగించడంపై కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, అవన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ముందుకు చతికిల బడ్డారుు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా తన పదవిని రామానుజం కొనసాగిస్తున్నారన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. ఇది వరకు ఆయన పదవీ కాలం పొడిగించినప్పుడే కేంద్రం సైతం వ్యతిరేకించింది. ఈ దృష్ట్యా, ఇక, ఆ పదవిలో రామానుజం మళ్లీ కొనసాగే పరిస్థితులు లేవు. దీంతో తదుపరి డీజీపీ ఎవరు అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది. నలుగురితో జాబితా: రామానుజంకు ఇక విశ్రాంతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించే సిఫారసు మేరకు ఒకరిని ఎంపిక చేస్తూ కేంద్రం ఆమోదం తెలపడం సహజం. దీంతో కొత్త డీజీపీ ఎంపికకు సంబంధించి నలుగురి పేర్లను సూచిస్తూ కేంద్రానికి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇందులో ప్రస్తుతం డీజీపీ హోదాతో ఇతర విభాగాల్లో ఉన్న అనూప్ జైశ్వాల్, కె ముత్తుకరుప్పన్, ఆర్ శేఖర్, అశోక్ కుమార్లు ఉన్నారు. అనూప్ జైశ్వాల్ లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా శాంతి భద్రతల పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో అధికార పక్షంతోపాటుగా అన్ని పార్టీలకు చుక్కలు చూపించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ దృష్ట్యా, ఆయన చేతికి శాంతి భద్రతల పగ్గాలు వెళ్లొచ్చన సంకేతాలు ఉన్నా, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement