* ముగియనున్న రామానుజం పదవీ కాలం
* రేసులో నలుగురు
* కేంద్రానికి జాబితా
సాక్షి, చెన్నై: రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ రామానుజం పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి డీజీపీ ఎవరన్న ప్రశ్న పోలీసు వర్గాల్లో మొదలైంది. ఈ పదవికి అర్హులుగా పేర్కొంటూ నలుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా రామానుజంను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రను పోషించారు. అధికార పక్షానికి విధేయతను చాటిన ఆయన 2012 నవంబరులో పదవీ విరమణ పొందారు. దీంతో తదుపరి డీజీపీ చాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ అప్పట్లో మొదలైంది. అయితే, ఈ చర్చకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేసులో ఉన్న ఇతర అధికారుల్ని నిరాశలో పడేసింది. రామానుజం పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ, ఆయన సేవల్ని మరింతగా వినియోగించుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు.
పిటిషన్లు: రామానుజం పదవీ కాలాన్ని పొడిగించడంపై కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, అవన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ముందుకు చతికిల బడ్డారుు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా తన పదవిని రామానుజం కొనసాగిస్తున్నారన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. ఇది వరకు ఆయన పదవీ కాలం పొడిగించినప్పుడే కేంద్రం సైతం వ్యతిరేకించింది. ఈ దృష్ట్యా, ఇక, ఆ పదవిలో రామానుజం మళ్లీ కొనసాగే పరిస్థితులు లేవు. దీంతో తదుపరి డీజీపీ ఎవరు అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది.
నలుగురితో జాబితా: రామానుజంకు ఇక విశ్రాంతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించే సిఫారసు మేరకు ఒకరిని ఎంపిక చేస్తూ కేంద్రం ఆమోదం తెలపడం సహజం. దీంతో కొత్త డీజీపీ ఎంపికకు సంబంధించి నలుగురి పేర్లను సూచిస్తూ కేంద్రానికి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇందులో ప్రస్తుతం డీజీపీ హోదాతో ఇతర విభాగాల్లో ఉన్న అనూప్ జైశ్వాల్, కె ముత్తుకరుప్పన్, ఆర్ శేఖర్, అశోక్ కుమార్లు ఉన్నారు. అనూప్ జైశ్వాల్ లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా శాంతి భద్రతల పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో అధికార పక్షంతోపాటుగా అన్ని పార్టీలకు చుక్కలు చూపించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ దృష్ట్యా, ఆయన చేతికి శాంతి భద్రతల పగ్గాలు వెళ్లొచ్చన సంకేతాలు ఉన్నా, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
డీజీపీ ఎవరు?
Published Sat, Oct 18 2014 2:06 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement