-
బాబు బార్ కోడ్ కుట్ర
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో ప్రజా నిర్ణయం వ్యతిరేకంగా ఉందని, టీడీపీ కూటమికి ఓటమి తప్పదని స్పష్టం కావడంతో చంద్రబాబు తన వికృత రాజకీయానికి తెరతీశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి, ఆ డేటా ద్వారా వేల కోట్లు వెదజల్లి ఓట్లు కోనేందుకు హైదరాబాద్ కేంద్రంగా పక్కా భారీ కుట్ర పన్నారు. కేవలం ఓట్ల కొనుగోలుకే ఏకంగా రూ. వేల కోట్లు వెదజల్లుతూ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేస్తున్నారు. అందుకోసం ‘వుయ్’ అనే ప్రత్యేక యాప్ను రూపొందించారు. దీనిద్వారా పకడ్బందీగా కుట్రను అమలు చేస్తున్నారు.ఓటర్లకు ఓటర్ స్లిప్పులతో పాటు ప్రత్యేక బార్ కోడ్ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తూ.. హైదరాబాద్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నారు. అందుకోసం ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి, డేటా చౌర్యానికి పాల్పడి, ఓటర్ల వివరాలను వుయ్ యాప్లో పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఓట్ల కొనుగోలుకు బరితెగించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా దొరక్కుండా ఎన్నికల కమిషన్ను బోల్తా కొట్టిస్తున్నారు.‘వుయ్’ యాప్ ఇలా..గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో సేకరించిన ఓటర్ల సమాచారాన్ని సేకరించి, అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్లో పొందుపరిచిన విషయం తెలిసిందే. దానికి అప్డేటెడ్ వెర్షన్ కింద ఇప్పుడు ‘వుయ్’ యాప్ తెచ్చారు. ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచారు. వారు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా ఇందులో ఉంది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధం.మూడంచెల వ్యవస్థతో..ఈ యాప్ ద్వారా ఎన్నికల అక్రమాల కోసం చంద్రబాబు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ద్వారా స్లిప్పుల పంపిణీ, వీటిని పర్యవేక్షించి, స్కాన్ చేసేందుకు మరో ప్రత్యేక బృందం, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. యాప్లో ఉన్న వివరాల ఆధారంగా బూత్ కమిటీ సభ్యులు ఓటర్ల వద్దకు వెళ్లి, ఓటరు స్లిప్పులు, బార్కోడ్ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఈ బార్ కోడ్ను ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా (యూనిక్)గా కేటాయించారు. స్లిప్పుల పంపిణీ అయిన తరువాత రెండో బృందం ఓటర్ల ఇళ్లకు వెళ్లి స్లిప్పులపై ఉన్న బార్ కోడ్ను స్కాన్ చేస్తుంది. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి ఫోన్ పే, గూగుల్ పే తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఒక్కో ఓటుకు సగటున రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే చేస్తున్నారు. డబ్బులు హైదరాబాద్ నుంచి ఓటర్ల ఖాతాల్లో జమ అవుతున్నందున.. పోలీసులు, ఫ్లయింగ్ స్వా్కడ్లు తనిఖీ చేసినా బూత్ కమిటీలు, పర్యవేక్షక బృందాల వద్ద డబ్బు దొరకదు.నియోజకవర్గానికి రూ.87.50 కోట్లువుయ్ యాప్ ద్వారా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 1.75 లక్షల ఓట్లు కొంటున్నారు. ఓటుకు రూ.5 వేలు రేటు కట్టినట్టు సమాచారం. ఆ ప్రకారం నియోజకవర్గానికి రూ.87.50 కోట్లు చొప్పున అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.15,312 కోట్లు వెచ్చిస్తున్నారు. నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేసేది దీనికి అదనం. బార్ కోడ్ స్లిప్పులను సక్రమంగా పంపిణీ చేసిన బూత్ కమిటీలకు ఒక్కో దానికి రూ. 5 లక్షలు, పర్యవేక్షక బృందానికి రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాలు చెల్లిస్తునట్టు తెలుస్తోంది. ఇందుకోసం మరో రూ.2,500 కోట్ల వరకు చంద్రబాబు ప్రకటించినట్టు సమాచారం. వుయ్ యాప్ను రూపొందించి హైదరాబాద్ కేంద్రంగా కుట్రను అమలు చేస్తున్న బృందానికి మరో రూ.2 వేల కోట్లకు పైగా ప్యాకేజీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం రూ. 20 వేల కోట్లతో చంద్రబాబు ఓట్ల కొనుగోలుకు భారీ కుట్ర అమలు చేస్తున్నారన్నది సుస్పష్టమైంది. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల అక్రమానికి చంద్రబాబు తెగించారన్నది బహిర్గతమైంది. కుట్ర ఇలా బట్టబయలు..రెండు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ పంపిణీ చేసిన బార్ కోడ్ ఓటరు స్లిప్పులు బయటపడ్డాయి. తర్వాత మైలవరంలో, తాజాగా ఒంగోలులోనూ ఈ బార్ కోడ్ స్లిప్పుల బాగోతం బట్టబయలైంది. ఆ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల ఫొటోలు ముద్రించిన కరపత్రాలు, బార్ కోడ్ ఉన్న ఓటరు స్లిప్పులు లభించాయి. బార్ కోడ్ను పరిశీలించగా వాటిపై ‘ వుయ్ యాప్’కు అవి అనుసంధానించి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు టీడీపీ శ్రేణుల కోసం గూగుల్లో అందుబాటులో ఉంచిన ‘వుయ్ యాప్’ను పరిశీలించగా మొత్తం ఎన్నికల అక్రమాల గుట్టు బట్టబయలైంది.ఎన్నికల నియామవళి ఉల్లంఘనేప్రస్తుత లోక్సభ, రాష్ట్ర శాసన సభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) ప్రకారం స్పష్టమైన విధి విధానాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని వెల్లడించింది. దాంతోపాటు ఓటర్ల నమోదు, సర్వే పేర్లతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, పథకాలను ప్రకటించవద్దని, అవినీతి కార్యకలపాలకు పాల్పడవద్దని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ చంద్రబాబు ఈసీ మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వుయ్ యాప్ ముసుగులో ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఇది ఎన్నికల నియామావళి ఉల్లంఘనే కాకుండా డేటా చౌర్యం కూడా. దాంతోపాటు ఐటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారు. ఈసీ, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు వుయ్ యాప్ పేరుతో టీడీపీ పాల్పడుతున్న ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్(ఈసీ), రాష్ట్ర డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత కె. శ్రీనివాసరెడ్డి ఈసీకి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాచర్ల, ఒంగోలులో టీడీపీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బార్ కోడ్ ఉన్న ఓటరు స్లిప్పులు, డౌన్లోడ్ చేసిన వుయ్ యాప్, ఇతర వీడియో ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, దర్యాప్తు అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయాల్లో తనిఖీలు చేసి వుయ్ యాప్కు సంబంధించిన ఆధారాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధంఈసీకి, డీజీపికి ఫిర్యాదు అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వుయ్ యాప్లో ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం ఉందని చెప్పారు. ప్రజల ఓటర్ ఐడీలు, వారి సచివాలయ పరిధి, ఓటర్ నంబరు, ఏ పార్టీ సానుభూతిపరులు తదితర వివరాలన్నీ ఉన్నాయన్నారు. వాటితో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్తో పాటు బార్ కోడ్ కలిగిన స్లిప్ను, మేనిఫెస్టోను ఇస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిపారు. బార్ కోడ్ స్లిప్ స్కాన్ చేసిన అనంతరం వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. -
యాప్ల్లో ఎన్నికల పందేలు
సాక్షి, హైదరాబాద్: బంతి బంతికీ.. మ్యాచ్ మ్యాచ్కూ ఎలాగైతే క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నాయో.. అచ్చం అదే తరహాలో దేశంలో జరుగుతున్న ఎన్నికలపై కూడా పందేలు కాస్తున్నారు. క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ, సాకర్, బాక్సింగ్, హార్స్ రైండింగ్ వంటి అన్ని రకాల క్రీడలపై బెట్టింగ్లు నిర్వహిస్తున్న పలు ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నాయి. పార్టీల వారీగా వచ్చే ఫలితాలు, నియోజకవర్గం, అభ్యర్థుల విజయాలు, మెజారిటీ వారీగా పందేలు కడుతున్నాయి.గత ఎన్నికల్లోనే మొదలు..2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ తరహా బెట్టింగ్లు జరిగినా అది తక్కువ స్థాయిలోనే జరిగాయి. కానీ, ఈసారి ఎన్నికలు అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో పందేలపై ఆసక్తి పెరిగింది. దీంతో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలు వీటిపై దృష్టిసారించాయి. ఫెయిర్ ప్లే, జన్నత్బుక్, ఓం 247, జైబుక్, సాట్స్పోర్ట్, బకార్డీ వంటి సుమారు డజన్ యాప్లు, వెబ్సైట్లు ప్రత్యేకంగా ఎన్నికల్లో బెట్టింగ్లను నిర్వహిస్తున్నాయి. మ్యూల్ ఖాతాల్లోనే లావాదేవీలుబెట్టింగ్ యాప్లు ఇండియా వెలుపలి నుంచి నిర్వహిస్తుంటాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యాప్లను నిర్వహణ చేసే కంపెనీలు సిండికేట్గా మారి ఈ ఎన్నికల పందేలను నిర్వహిస్తుంటాయని, యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లనే వినియోగిస్తుంటాయని తెలిపారు. పందెం డబ్బు మొత్తం ఆయా అకౌంట్ల నుంచి క్రిప్టో వ్యాలెట్ల ద్వారా ఎలాంటి పన్ను చెల్లింపులు లేకుండా దేశం దాటేస్తుందని పేర్కొన్నారు.ఇదంతా చట్ట విరుద్ధంతెలంగాణ, ఏపీతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000, ఇన్మర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021 ప్రకారం ఆన్లైన్లో బెట్టింగ్ అనేది జూదంగా పరిగణిస్తారు. యాప్లను డౌన్లోడ్ చేసేందుకు వీలుగా ఏపీకే ఫైల్స్ను అందుబాటులో ఉంచుతారు. డోన్లోడ్ చేసుకునే క్రమంలో ఫోన్ కాంటాక్ట్లు, ఇతరత్రా పర్మిషన్స్ను అనుమతించాలని కోరతారు. పొరపాటున యాక్సెస్ చేయగానే హానికర సాఫ్ట్వేర్లు మొబైల్లో డౌన్లోడ్ అయిపోతాయి. దీంతో మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందెం..రూ.100 నుంచి రూ.10 లక్షల వరకు పందేం వేయవచ్చు. టెలిగ్రాం, వాట్సాప్ వంటి ఇన్స్టంట్ మెసేజ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోని పలు కీలకమైన రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఫ్యాన్సీ పందేలుగా పేర్కొంటూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఒంటరిగా ఎన్ని సీట్లు సాధిస్తాయి? రాష్ట్రాల వారీగా ఆయా పార్టీలు కూటమితో కలిసి ఎన్ని సీట్లు గెలుస్తాయి? .. ఇలా విభాగాల వారీగా పందేలు నిర్వహిస్తున్నాయి. -
టెక్నాలజీ.. ఈసీ ఈజీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్లు, వైబ్సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం. ఓటు నమోదు చేసుకోండి కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు. అభ్యర్థులెవరో తెలుసుకోండి నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది. ‘సువిధ’తో సులభం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్లైన్లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ‘సక్షం’తో చేయూత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’. ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’ కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ‘నోడల్’ మేడ్ ఈజీ ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు. -
మహిళల ప్రయాణం ఇక టీ–సేఫ్
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ప్రయాణించే పౌరులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గమ్య స్థానం చేరే వరకు పర్యవేక్షించేలా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసులు టీ–సేఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. స్మార్ట్ఫోన్ లేక పోయినా, సాధారణ మొబైల్ ఫోన్ ఉన్నా..ఈ టీ–సేఫ్ సేవలను వినియోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, కీలకమైన సర్వీస్ అని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మహిళా శక్తి విధానం ఆవిష్కరణలో భాగంగా మంగళవారం సచివాల యంలో టీ–సేఫ్ను సీఎం ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, డి.అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి ఐవీఆర్ ఆప్షన్లో 8 నంబర్ను నొక్కడం ద్వారా టీ–సేఫ్ సేవలను వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్కసారి సమాచారం ఇస్తే చాలు స్మార్ట్ ఫోన్లు ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదా టీ–సేఫ్ వెబ్పేజీ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు, చిన్నారుల సురక్షిత ప్రయాణం కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం అభినందనలు తెలిపారు. టీ–సేఫ్కు డయల్ 100 ద్వారా లేదా యాప్ ద్వారా ఒకసారి సమా చారం ఇస్తే సరిపోతుందని, మళ్లీ మళ్లీ అత్యవసర సేవల కోసం 100 నంబర్కు ఫోన్ చేయాల్సిన పని లేకుండా పోలీసులే నిర్ధారిత సమయంలోపు పౌరులను సంప్రదిస్తూ వారు సురక్షితంగా గమ్యం చేరే వరకు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరమైతే లైవ్ ట్రాకింగ్ లింక్ ఆ పరిధిలోని ప్యాట్రో వాహ నాలకు సైతం వెళుతుందని వివరించారు. లైవ్ లొకేషన్ పంపే వీలు టీ–సేఫ్ యాప్ను వినియోగించే పౌరులు ఆపదలో ఉన్నప్పుడు వారి లైవ్ లొకేషన్ను పోలీసులకు పంపే వీలు కూడా ఉందని రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 791 ప్యాట్రో కార్లు, 1,085 బ్లూకోల్ట్స్ వాహనాలకు టీ–సేఫ్ అనుసంధానమై ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత సురక్షిత ప్రయాణం కోసం టీ–సేఫ్ యాప్ సేవలను ఇతర క్యాబ్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సేవల యాప్లకు అనుసంధానిస్తామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీఐడీ, మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్రెడ్డి, శిక్షణ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ జైన్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. -
ఇకపై ఆండ్రాయిడ్ యాప్స్ను వాడలేరు!
ఆండ్రాయిడ్ యాప్స్ను మొబైళ్లతోపాటు పర్సనల్ కంప్యూటర్లలో కూడా చాలామంది వినియోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్. విండోస్ 11 పీసీ వినియోగదారులు ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ను వినియోగించలేరని మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ను నిలిపివేయనుంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2025 మార్చి 5 నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ను వినియోగించడం కుదరదు. ఈ మేరకు తన సపోర్ట్ డాక్యుమెంట్లో తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్ సబ్సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు, గేమ్స్ ఎంతమాత్రం పనిచేయవు. అంతేకాదు 2024 మార్చి 5 తర్వాత కొత్త యాప్స్ను డౌన్లోడ్ చేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇప్పటికే డౌన్లోడ్ చేసి యాప్స్ను వినియోగిస్తున్నట్లయితే కటాఫ్ డేట్ వరకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’ గతంలో మొబైల్ యాప్స్ను విండోస్ 11 పీసీల్లో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీల్లో వినియోగించేలా ఏర్పాటు చేశాయి. దీంతో అమెజాన్ యాప్ స్టోర్ను డౌన్లోడ్ చేసుకుని, అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్ను, గేమ్స్ను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
నైపుణ్య శిక్షణలో విశ్వరూపం
సాక్షి, విశాఖపట్నం: ‘యువత మన భవిష్యత్తు. చదువులు, నైపుణ్య శిక్షణలో సమూల మార్పులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాం. రాబోయే రోజుల్లో నైపుణ్య శిక్షణలో విశ్వరూపం చూపిద్దాం. అందుకే ఈ ‘భవిత’ కార్యక్రమం’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడాప్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమాన్ని మంగళవారం విశాఖలోని పీఎంపాలెం వి–కన్వెన్షన్ హాల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, విడదల రజని, పారిశ్రామిక ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... జాబ్ ఓరియెంటెడ్గా రాష్ట్ర్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చి అనుసంధానించే కార్యక్రమ్రాన్ని నిర్వహిస్తున్నాం. ఏ చదువైనా జాబ్ ఓరియెంటెడ్గా ఉండాలి. క్వాలిటీ చదువులు మనకు అందుబాటులో లేకపోతే పూర్తిగా వ్యర్థమైపోయినట్లే. అందుకే జాబ్ ఓరియెంటెడ్గా క్వాలిటీ చదువులతో మార్పులు తెస్తున్నాం. నాణ్యమైన విద్యని స్కూల్స్ నుంచి కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు.. అన్ని చోట్లా అందిస్తూ అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేయడం నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా ఎలా ముందుకు వెళ్తున్నామో అందరికీ తెలిసిందే. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్, టోఫెల్ శిక్షణ, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్ ద్వారా విద్యలో నాణ్యత పెంచుతున్నాం. డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఇలాగే అడుగులు వేస్తున్నాం. ♦ తొలిసారిగా కాలేజీల్లో కరిక్యులమ్ మార్చడం, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, తప్పనిసరి ఇంటర్న్షిప్, ఆన్లైన్ వర్టికల్స్, క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగం చేయడం లాంటివన్నీ చేస్తున్నాం. హార్వర్డ్, ఎల్సీఈ, ఎల్బీఎస్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం. వాటి ద్వారా దరఖాస్తు చేసుకుంటే మంచి జీతాలతో ఉన్నత ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తరహా మార్పు ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గర నుంచే మొదలవుతోందని గర్వంగా చెబుతున్నా. ♦ ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్ కాలేజీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. వచ్చే టర్మ్లో ఈ మార్పులు విశ్వరూపం దాలుస్తాయి. తొలిసారిగా 158 పారిశ్రామిక సంస్థలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కలిపి మొత్తం 208 ఇన్స్టిట్యూషన్లు మన పిల్లల ట్రైనింగ్, కోర్సుల్లో భాగస్వాములై శిక్షణ అందించి ఉద్యోగాలిచ్చే కార్యక్రమం జరుగుతోంది.దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019కి ముందు (టీడీపీ హయాంలో) అక్రిడిటేషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీ కేవలం ఒక్కటి మాత్రమే ఉండటం దురదృష్టం. కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువులు ఎలా ఉన్నాయి? అక్రిడిటేషన్ ఉందా? అనేది కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఎన్బీఏ అక్రిడిటేషన్ని 32 పాలిటెక్నిక్ కాలేజీలు పొందాయి. క్వాలిటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేస్తాం. హబ్ ద్వారా ఒకే చోట ఐటీఐ, పాలిటెక్నిక్, పదోతరగతి డ్రాపవుట్స్ కోసం ట్యూటరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో స్కిల్ కాలేజీ ఉంటుంది. వీటన్నింటి పైన ఒక స్కిల్ యూనివర్సిటీ కోర్సుల్ని డిజైన్ చేస్తుంది. పరిశ్రమల్ని కాలేజీల్లో భాగస్వాముల్ని చేస్తుంది. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం వచ్చేలా అడుగులు పడుతున్నాయి. ♦ ఇప్పటివరకూ 53 వేల మంది శిక్షణ పూర్తి చేసుకొని 26 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన భవిత కార్యక్రమం ఇకపై పైలట్గా కాకుండా ప్రతి నియోజకవర్గంలో విస్తరించే దిశగా శ్రీకారం చుడుతున్నాం. సీఎం సమక్షంలో ఎంవోయూలు ఏపీ స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి నైపుణ్య శిక్షణ అందించేందుకు పలు సంస్థలు ఆరు ఎంవోయూలు చేసుకున్నాయి. ♦ విశాఖ పోలీస్ కమిషనరేట్తో మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యుర్షిప్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వైజాగ్ పోలీస్ వర్క్ఫోర్స్ నైపుణ్య సామర్థ్యాలు పెంపొందించేలా జాయింట్ సర్టిఫికేçÙన్ కోర్సులు అందించేలా సహకారం అందించనున్నారు. ♦ ఏపీఎస్ఎస్డీసీతో హియర్ టెక్నాలజీస్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు లొకేషన్ సొల్యూషన్స్ కోసం ప్లాట్ ఫామ్ అందించేలా 60–90 రోజుల సర్టిఫికేషన్ కోర్సు అందించేందుకు ఒప్పందం జరిగింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ, తాజ్హోటల్స్, ఎస్ఐహెచ్ఎం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పర్యాటకం,హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ అందించడం, ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు, ఉపాధి అవకాశాలు సృష్టించేలా ఒప్పందం కుదిరింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ, డిక్సన్ టెక్నాలజీస్, నాలుగు ఐటీఐలు, మూడు పాలిటెక్నిక్ కాలేజీల మధ్య ఎలక్ట్రానిక్, మెకానికల్ రంగంలో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం, పరిశ్రమకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి పొందేలా ట్రైనింగ్ ఇవ్వడం మొదలైన అంశాల్ని అందించేలా ఎంవోయూ జరిగింది. ♦ వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఎంవోయూ జరిగింది. కాలేజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్థాపించనున్నారు. వీల్స్ ఇండియా ద్వారా అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందించనున్నారు. ♦డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ఎడ్యుకేషన్, అవెరా ఏఐ మొబిలిటీ మధ్య ఈవీ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్థాపనకు మార్గం సుగమం చేసేలా, పరిశ్రమలు సందర్శించేందుకు ఏర్పాటు చేసేలా ఎంవోయూ జరిగింది. ♦ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(డీఈటీ), ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీఐ కోర్సులతో సమానంగా ఈ లెర్నింగ్ మాడ్యుల్స్ అందించడం, ఎల్ అండ్ టీ బృందం ద్వారా విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాన్ని ఈ ఎంవోయూ ద్వారా అందించనున్నారు. 10 స్కిల్ సెంటర్లకు శంకుస్థాపన.. ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.7 కోట్లతో 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.44.32 కోట్లతో 43 పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణ పనులను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. రూ.43.77 కోట్లతో 22 ఐటీఐల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిత కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు భవిత లోగో, యాంథమ్, స్కిల్ యూనివర్స్ యాప్, ఫ్లాగ్ని ఆవిష్కరించారు. అంతకు ముందు వీ కన్వెన్షన్కు చేరుకున్న సీఎం తొలుత స్కిల్ ఇన్స్టిట్యూట్స్ స్టాల్స్ని సందర్శించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీలు తయారీ, విమాన విడిభాగాల తయారీ శిక్షణ తదితర స్టాల్స్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. -
గూగుల్ చర్యను అనుమతించలేము.. యాప్స్ తొలగింపుపై కేంద్రం
గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్లను తొలగించే చర్యను అనుమతించలేమని కేంద్రం తెలిపింది. టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్ల ప్రతినిధులను సోమవారం (మార్చి 4) రావాలని ఐటి మంత్రి 'అశ్విని వైష్ణవ్' ఆహ్వానించారు. సర్వీస్ ఫీజు చెల్లింపులపై వివాదాలను పేర్కొంటూ గూగుల్ నిన్న (మార్చి 1) భారతీయ కంపెనీల యాప్లను తొలగించడానికి సిద్ధమైంది. ఇందులో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్బుక్ ఉన్నాయి. అయితే గూగుల్ చేపట్టిన ఈ చర్యకు కంపెనీలు అసహనం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, గూగుల్ అధికారులతో చర్చ జరిపిన తరువాత సానుకూలమైన ఫలితం రావచ్చని, తప్పకుండా ఈ కంపెనీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి 'అశ్విని వైష్ణవ్' వెల్లడించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత యాప్స్పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్లో అవి మాయం! సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా యాప్ డెవలపర్లు నిబంధలను ఉల్లగించినట్లు, ఈ కారణంగానే ఆ యాప్లను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం త్వరలో ఐటి మంత్రిని కలిసిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలుస్తుంది. -
గూగుల్పై మిట్టల్ ఆగ్రహం.. యాప్స్ అన్నీ రీస్టోర్ చేయాల్సిందే!
సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో భారత్లోని తన ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే షార్క్ ట్యాంక్ జడ్జ్, పీపుల్ గ్రూప్ షాదీ.కామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ అనుపమ్ మిట్టల్ గూగుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నెట్కు ఈరోజు చీకటి రోజు.సర్వీసు ఫీజు చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ గూగుల్ యాప్స్ను తొలగించింది. సేవ్ స్టార్టప్ అంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎక్స్.కామ్లో ట్యాగ్ చేశారు. Today is a dark day for India Internet. Google has delisted major apps from its app store even though legal hearings are underway @CCI_India & @indSupremeCourt Their false narratives & audacity show they have little regard for 🇮🇳 Make no mistake - this is the new Digital East… — Anupam Mittal (@AnupamMittal) March 1, 2024 గూగుల్ యాప్స్ తొలగింపు అంశంలో సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్లేస్టోర్లో డీలిస్ట్ చేసిన యాప్స్ని రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు. -
యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
మొబైల్ వాడుతున్నామంటే దాదాపు ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వాడుతుంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ పూర్తిగా యాప్ల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్, బ్యాంకింగ్ ఇలా ఏ అవసరానికైనా యాప్లు వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్నైనా ఉపయోగించాలి. ఇందుకు పూర్తి భిన్నంగా తాజాగా డచ్ టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ మొబైల్ను ఎలాంటి యాప్లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో తమ టీ-ఫోన్ డివైజ్లోని ఈ కాన్సెప్ట్ను కంపెనీ వివరించింది. వినియోగదారులు వాయిస్ రూపంలో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను రూపొందించారు. నావిగేషన్, క్యాబ్, హోటల్ బుకింగ్.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్వాల్కామ్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్లైన్ ఫంక్షనాలిటీని జత చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? రానున్న రోజుల్లో మొబ్స్ళ్లలో ఎవరూ యాప్లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డచ్ టెలికాం కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో భాగమవుతాయని వివరించారు. -
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్ఫామ్తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్బాలాజీ), ఆడియో ప్లాట్ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్ప్లేస్ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్ను ఫోన్పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
10 భారతీయ కంపెనీ యాప్లపై కన్నెర్రజేసిన గూగుల్!
టెక్ దిగ్గజం గూగుల్ (Google) పది భారతీయ కంపెనీల యాప్లపై చర్య తీసుకుంటున్నట్లు ఈ రోజు (మార్చి 1) వెల్లడించింది. ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్లింగ్ విధానాన్ని పాటించని కారణంగా కంపెనీ వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ తొలగించనున్న యాప్ల జాబితాలో మ్యాట్రిమోనీ ప్లాట్ఫారమ్ షాదీ.కామ్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ALTT, స్టేజ్ మాత్రమే కాకుండా.. డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్కు ఫీజులు చెల్లించకపోవడం వల్ల వీటిని పూర్తిగా తొలగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యాప్ డెవలపర్లు కూడా గూగుల్ మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఇందులో గూగుల్ గేట్ కీపింగ్ చార్జీలు, ఎక్స్ట్రా కమీషన్స్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. యాప్ డెవలపర్ల నుంచి తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతం 200000 మంది భారతీయ యాప్ డెవలపర్లు తమ విధానాలకు కట్టుబడి ఉన్నారని, సురక్షితమైన ప్లాట్ఫామ్ను నిర్ధారిస్తున్నారని కంపెనీ తెలిపింది. అయితే 10 కంపెనీలు మాత్రమే తమ నియమాలను పెడచెవిన పెడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇదీ చదవండి: అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్కే అన్ని కోట్లా? -
‘చిత్ర’మైన యాప్లు! అలా తీసిన ఫొటో ఇలా..
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన స్మార్ట్ఫోన్ వినియోగంతో ఫోటోలు తీయడం అనేది ఊపిరి పీల్చుకున్నంత సహజంగా మారిన యుగం ఇది. ప్రతి కదలికకూ ఓ సెల్ఫీ.. రోజులో ఎన్ని సెల్ఫీలు, ఫొటోలు తీస్తామో మనకే తెలియదు. అయితే అలా తీసిన సాధారణ ఫొటోలు, సెల్ఫీలను అద్భుతమైన చిత్రాలుగా మార్చుకోవచ్చు. మీకు ఉన్నట్టుండి ఓ సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది.. మీ పెంపుడు జంతువు ముచ్చటగా అనిపించి ఓ ఫొటో తీస్తారు.. రమణీయ ప్రకృతి దృశ్యాన్ని మీ ఫోన్ కెమెరాలో బంధిస్తారు. ఈ సాధారణ ఫొటోలే వాన్ గోహ్ చిత్రించినట్లుగా, పికాసో మలిచినట్లుగా అద్భుతమైన చిత్రాలుగా మారిపోతే.. ఒక్కసారి ఊహించండి.. ఊహించడం కాదు.. నిజంగానే అద్భుతమైన చిత్రాలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం అద్భుతమైన నైపుణ్యం అవసరం లేదు. ఇక్కడ మేం చెప్పే కొన్ని మొబైల్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ప్రిస్మా అనేక రకాల ఎడిటింగ్ ఆప్షన్లు కావాలనుకున్నవారికి ఈ యాప్ చక్కగా సరిపోతుంది. న్యూరల్ నెట్వర్క్, కృత్రిమ మేధస్సు కలయికతో మీఫొటోను కొత్త శైలిలో పునఃసృష్టిస్తుంది. దీన్ని ఉచితంగానే ఉపయోగించవచ్చు. కాస్త ఎక్కువ ఫీచర్లు కావాలనుకున్నవారు ప్రీమియం వర్షన్ ట్రై చేయొచ్చు. ఆర్ట్ స్టైల్, క్లాసిక్ టెంప్లేట్లు, ఫ్రేమ్లు వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఫొటో నాణ్యతను పెంచే హెచ్డీ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ప్రిస్మా ( Prisma) యాప్ అందించే మరో ఆసక్తికరమైన ఫీచర్ మ్యాజిక్ అవతార్స్. ఇది ఏఐ సాంకేతికతను ఉపయోగించి మీ సొంత ఫోటోల నుంచి అవతార్లను సృష్టిస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంది. పిక్సార్ట్ పేరులో ఉన్నట్లుగానే మీ ఫోటోలను ఆర్ట్గా మార్చాలనుకుంటే పరిగణించవలసిన మరొక మంచి యాప్ పిక్సార్ట్ (Picsart). గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంది. స్కెచ్ ఎఫెక్ట్లు, పాతకాలపు ఫిల్టర్లు, ఆయిల్ పెయింటింగ్ వంటి వాటితో సహా అనేక రకాల ఫిల్టర్లు, ఆర్ట్ స్టైల్లను ఇది అందిస్తుంది. క్రాపింగ్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ సర్దుబాటు, టెక్స్ట్ యాడింగ్ వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అదనంగా మీ ఫోటోకు ఆసక్తికరమైన స్టిక్కర్లు, ఎలిమెంట్లు యాడ్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న టెంప్లేట్లు కాకుండా పిక్సార్ట్లో మీరు తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏఐ ఇమేజ్. గోఆర్ట్ ఫోటో ఆర్ట్ మేకర్ మీ ఫోటోలను తీర్చిదిద్దడానికి మరింత ప్రొఫెషనల్-గ్రేడ్ టూల్ కోసం చూస్తున్నట్లయితే గోఆర్ట్ (GoArt) ఫోటో ఆర్ట్ మేకర్ మంచి ఎంపిక. దీన్ని ఉపయోగించడం చాలా ఇతర ఫోటో ఎడిటింగ్ యాప్ల మాదిరిగా సూటిగా అనిపించకపోవచ్చు, కానీ ఇందులోని ఫీచర్లు, టూల్స్ కృషికి తగినవిగా చేస్తాయి. పెయిడ్ వర్షన్ను వినియోగిస్తే క్రెడిట్ల రూపంలో రోజువారీ రివార్డ్లు కూడా లభిస్తాయి. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోలీప్ ట్రెండింగ్లో ఉన్న అన్ని క్లాసిక్, ఏఐ ఫిల్టర్లతో మీ ఫొటోలను అద్భుతంగా మార్చుకోవాలంటే ఈ ఫోటోలీప్ (Photoleap) యాప్ను ట్రై చేయొచ్చు. ఫొటోలకి ఫ్యూచరిస్టిక్ ఎన్హాన్స్మెంట్స్ చేసే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అలాగే మీ ఫోటోను కార్టూన్, యానిమేషన్, మాంగా మొదలైనవాటిగానూ మార్చవచ్చు. ప్రతి ఫిల్టర్ మీ ఫోటోలోని రంగు, ఆకృతి, నమూనా వంటి వివిధ అంశాలను మాన్యువల్గా పునరావృతం చేయడానికి సంక్లిష్టంగా ఉండే మార్గాల్లో సర్దుబాటు చేస్తుంది. ఇందులో స్కై టూల్ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ ఫోటోలలో ఆకాశాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఫోటోకు మరింత కళను జోడించడానికి ఏఐ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఫోటో ల్యాబ్ ఫోటో ల్యాబ్ (Photo Lab) అనేది దాని విస్తృత శ్రేణి ఎఫెక్ట్లు, ఫిల్టర్లు, ఫ్రేమ్లు, ఇతర ఎడిటింగ్ సాధనాలకు ప్రసిద్ధి చెందిన మరొక అప్లికేషన్. దీంట్లో యూజర్లు తమ ఫోటోలను సులువుగా కళాత్మక సృష్టిలుగా మార్చుకోవచ్చు. ఇతర యాప్ల మాదిరిగానే ఈ యాప్ కూడా ఫొటోలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఈ యాప్లో ఇతర యూజర్లు చేసిన ఫోటో ఎడిట్ల క్యూరేటెడ్ స్ట్రీమ్ను ప్రదర్శించే ఫీడ్ ఫీచర్ను ఉంది. ఇక్కడ మీరు కమ్యూనిటీ ద్వారా అప్లయి చేసే విభిన్న శ్రేణి ఎడిట్స్, ఎఫెక్ట్స్ను వీక్షించడం ద్వారా ఫోటో ల్యాబ్లోని సృజనాత్మక అవకాశాలను అన్వేషించవచ్చు. అలాగే యూజర్ల ఫీడ్ నుంచి ఫోటోలను లైక్, కామెంట్, షేర్ చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో ఈ యాప్ను పొందవచ్చు. -
అక్రమ రుణయాప్లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా..
రుణాల కోసం బ్యాంక్లను ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది. మారుతున్న టెక్నాలజీతో అప్పు కావాలనుకుంటున్నవారు బ్యాంకులకు బదులుగా రుణ యాప్లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ధ్రువపత్రాలు, గుర్తింపు వివరాలు తెలియజేయకుండా వెంటనే అప్పులిస్తామంటూ ప్రకటించడంతో వాటి వలలో పడుతున్నారు. అధిక మొత్తం వడ్డీలు లాగుతున్న రుణయాప్ల మూసుగులోని నేరముఠాలు గడువు ముగిసి వసూళ్ల పర్వం ప్రారంభించాక వేధింపులకు దిగుతున్నాయి. అక్రమ రుణయాప్లు నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేద విద్యార్థులు, వ్యాపారుల ఉసురుతీస్తున్నాయి. ఆ రుణయాప్లపై చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని గడచిన సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అక్రమ రుణయాప్లను అరికట్టడానికి ఆర్బీఐ, సెబీలతోపాటు రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రమంత్రి చెప్పారు. దేశంలో నేడు రుణయాప్లు వేల సంఖ్యలో విస్తరించాయి. అందులో మోసపూరితమైనవేమిటో తెలియజేయాల్సిన బాధ్యతను, వాటన్నింటినీ నియంత్రించే కార్యాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు, పోలీసు విభాగాలకు, రిజర్వ్బ్యాంకుకు వదిలేస్తే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, టెలికాం సంస్థలు, సెబీ, రాష్ట్రాలు... అన్నీ కలిసికట్టుగా పని చేయాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలల్లో రూపాయలు ఎరగా చూపి వాటిని రుణాలిచ్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న అక్రమ ఆన్లైన్ రుణదాతలు భారీ మోసాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. గతంలో దాదాపు రూ.170 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోనే చైనాకు చెందిన ఓ రుణయాప్ సంస్థ ఏకంగా రూ.11,700 కోట్లు దండుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్లోనే ఆన్లైన్ రుణయాప్లతో సుమారు రూ.32 వేలకోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆన్లైన్ రుణాల్లో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు ముందుగానే అప్పులో దాదాపు 35శాతం మేర మినహాయించుకుంటారు. గడువు తీరిన వెంటనే అధిక వడ్డీతో బాకీలు వసూళు చేస్తారు. ఇదీ చదవండి: 20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్.. డిమాండ్ చేసినమేరకు చెల్లించకపోతే రుణ తీసుకున్నపుడు మొబైల్లో అన్ని అనుమతులు ఇస్తారు కాబట్టి అప్పు తీసుకున్నవారి కాంటాక్ట్ వివరాలు, గ్యాలరీ, హిస్టరీ అన్ని రికార్డవుతాయి. దాంతో మార్ఫింగ్ చేసిన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తారు. దాంతో బాధితులు తట్టుకోలేక అడిగినంత ముట్టజెపుతారు. ఆన్లైన్ రుణయాప్ల నియంత్రణకు పటిష్ఠ చట్టాలు, చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. -
వివాద రహితంగా ఎన్నికల ప్రక్రియ
సాక్షి, అమరావతి: వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుంటూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే దినపత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తాంశాలపై చర్యలు తీసుకుని, సంబంధిత వివరాలను ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో వివరించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతివారం సంబంధిత జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఆ యాప్ను అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీమ్లు, జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అదనపు సీఈవోలు కోటేశ్వరరావు, హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యాపిల్, గూగుల్ ప్లేస్టోర్కు పోటీగా ఫోన్పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే..
భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే తెరతీసింది. తాజాగా ఫోన్పే ఇండస్ యాప్స్టోర్ను దిల్లీ వేదికగా బుధవారం ఆవిష్కరించింది. 45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్ను ఈ యాప్స్టోర్లో పొందుపరిచింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 12 భాషల్లో వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్ను ఇందులో సర్చ్ చేయవచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్ 1 వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్పార్టీ పేమెంట్ గేట్వేను ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఫోన్పే యాప్ లేదా ఇండస్యాప్స్టోర్.కామ్ నుంచి ఇండస్ యాప్స్టోర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మొబైల్ యాప్ మార్కెట్లో మరింత పోటీకి ఈ యాప్స్టోర్ నాంది పలికింది. ఇది మరింత శక్తివంతమైన భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది’ అని ఫోన్పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ తెలిపారు. ఇదీ చదవండి: పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా.. ఇ-మెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023లో మొబైల్ యాప్లపై 1.19 లక్షల కోట్ల గంటలను భారతీయులు గడిపినట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. 2021లో నమోదైన 95,400 కోట్ల గంటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. యాప్ల డౌన్లోడ్ల విషయంలో ప్రపంచంలోనే మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. -
అనధికారిక రుణ యాప్ల పని పట్టండి
న్యూఢిల్లీ: అనధికారిక రుణాల యాప్లను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉన్న రిస్కులను గుర్తించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) 28వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్ సన్నద్ధత, నియంత్రణ సంస్థల మధ్య సమస్యాత్మక అంశాలు మొదలైన వాటి గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేలా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని ఎఫ్ఎస్డీసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశీష్ పాండా, ఆర్థిక సాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
యాప్ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..
మొబైల్ అప్లికేషన్ స్టోర్స్ నుంచి యాప్లు లేదా ఇతరత్రా సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది సబ్స్కిప్షన్ వలలో చిక్కుకుంటున్నారు. ముందుగా చెప్పకుండా తర్వాత వడ్డించే ఛార్జీలతో (హిడెన్ చార్జీలు) నానా తంటాలు పడుతున్నారు. ఆన్లైన్ రీసెర్చ్ సంస్థ లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో సగం మంది పైగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఉచిత యాప్ను లేదా వన్–టైమ్ సర్వీస్ను ఎంచుకున్న వినియోగదారులు ఆ తర్వాత సబ్స్కిప్షన్ ఉచ్చులో పడుతున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో లోకల్సర్కిల్స్ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. డార్క్ ప్యాటర్న్లను (మోసపూరితంగా కస్టమర్లను ఆకర్షించడం) నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నవంబర్ 30న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 13 రకాల డార్క్ ప్యాటర్న్లను ప్రస్తావించింది. అప్పటికప్పుడు వెంటనే చర్యలు తీసుకునేలా తొందరపెట్టడం, సబ్స్కిప్షన్ వల వేయడం, విసిగించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. తాజాగా లోకల్సర్కిల్స్ సర్వేలో వెల్లడైన మరిన్ని విషయాలను చూస్తే.. యాప్ ప్లాట్ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్ఫాంల ద్వారా వన్–టైమ్ సాఫ్ట్వేర్ లేదా సర్వీస్ అంటూ తమకు అంటగట్టిన వాటిల్లో చాలా మటుకు సబ్స్క్రిప్షన్ కోసం పన్నిన పన్నాగాలేనని సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది వినియోగదారులు తెలిపారు. కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు జరిపేటప్పుడు ముందుగా చెప్పని బోలెడన్ని హిడెన్ చార్జీలు తెరపైకి వచ్చినట్లు 71 శాతం మంది పేర్కొన్నారు. యాప్ ప్లాట్ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్ఫాంల ద్వారా తాము కొన్నది ఒకటైతే తమకు అందినది మరొకటని 50 శాతం మంది వినియోగదారులు తెలిపారు. యాప్ ప్లాట్ఫాంల ద్వారా తాము డౌన్లోడ్ చేసుకున్న కొన్ని యాప్లలో మాల్వేర్ ఉందని, ఫలితంగా తమ డివైజ్ల నుంచి ప్రైవేట్ సమాచారం చోరీకి గురైందని 25 శాతం మంది వినియోగదారులు వివరించారు. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమ్ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే.. యాప్లు లేదా సాఫ్ట్వేర్ సర్వీసుల యూజర్లపై 2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 30 వరకు 331 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేకు 44,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
ఆర్బీఐ అలెర్ట్, పెట్టుబడులు పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ప్రకటనలు గుప్పిస్తున్న పలు నకిలీ యాప్ల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ వెల్లడించిన అనుమతి లేని ఇన్వెస్ట్మెంట్ యాప్ల జాబితాలో అల్పరి ఇన్వెస్ట్–ఇన్వెస్ట్మెంట్స్, ఐక్యూ ఫారెక్స్–ఆన్లైన్ ట్రేడింగ్ యాప్, ఓలింప్ ట్రేడ్–ట్రేడింగ్ ఆన్లైన్లు ఉన్నాయి. అనుమతులు లేని యాప్లతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. ఆర్బీఐ అనుమతి లేని అలాంటి సంస్థల వివరాలు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్లోగానీ, 1930 టోల్ఫ్రీ నంబర్లోగానీ తెలియజేయాలని కేంద్ర హోంశాఖ అధికారులు సూచించారు. -
మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్లు ఇవే..!
ప్రస్తుతం జీవన విధానంలో మహిళలు బయటకు వెళ్లి సంపాదించాల్సిన పరిస్థితి. పెరుగుతున్న ధరలు, పిల్లల ఉన్నత చదువులని ఇలా రకరకాలుగా ఖర్చులు పెరగడంతో ఒక్కరి సంపాదనతో ఇంటిల్లపాదిని పోషించడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. అందువల్ల మగువలు కూడా కష్టపడక తప్పని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లో చిక్కుల్లో పడటమో! లేదా కొందరీ ఆకతాయిల వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొనవలసి రావొచ్చు. లేదా కంపెనీ నిమిత్తం లేదా మరే కారణాలవల్ల కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సిన రావొచ్చు అక్కడ ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితి రావొచ్చు. అలాంటి వాటిని చాలా సునాయసంగా హ్యాండిల్ చేసుకుని మిమ్మల్ని భద్రంగా ఉంచుకునేందుకు ప్రతి మహిళ ఈ భద్రతా యాప్ల గురించి అవగాహన పెంచుకోవాలి, తప్పక తెలుసుకోవాల్సినవి కూడా. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన యాప్లే. ఈ యాప్లు తెలుసుకున్నా లేదా వాటిలో కనీసం రెండు లేదా ఒక్క యాప్ని మీ ముబైల్ డౌనలౌడ్ చేసుకున్నా చాలు!. ప్రంపంచమంతా ధైర్యంగా చుట్టి వచ్చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితినైనా సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మహిళలు తెలుసుకోవాల్సిన యాప్లు.. బీసేఫ్: ఇందులో రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్లు ఉంటాయి. అలాగే ఇబ్బుందుల్లోకి నెట్టే ఫేక్కాల్ నుంచి బయటపడేసే రకరకాల ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పైగా ఇది చాలా ప్రసిద్ధ యాప్. సర్కిల్ ఆఫ్ 6: అత్యవసర పరిస్థితుల్లో త్వరగా సంప్రదించగలిగేలా సుమారు ఆరుగురు విశ్వసనీయ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సర్కిల్ను ఏర్పరిచేందుకు అనుమతిస్తుంది. సేఫ్టిపిన్: నగరంలో సురక్షితమైన, అసురక్షిత ప్రదేశాల గురించి సమాచారాన్ని అందించే క్రౌడ్-సోర్స్ యాప్. ఇది నగరంలోని వివిధ ప్రాంతాల గురించి సరైన సమాచారం ఇవ్వడం తోపాటు ట్రాకింగ్ చేసి అత్యవసర హచ్చరికలు జారీ చేయడమే గాక వాటికి భద్రతా రేటింగ్ని కూడా ఇస్తుంది. విత్యూ(VithU): జస్ట్ రెండు ట్యాప్లతో వారి కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్స్కి సాస్(SOSష్త్ర సందేశాన్ని పంపేందుకు అనుమతిస్తుంది. పరిస్థితికి సంబంధించిన సాక్ష్యాలను సంగ్రహించడానికి ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది. మై సేఫ్టీపాల్: మహిళలు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది వివిధ లొకేషన్లలో అత్యవసర హెచ్చరికలు, పానిక్ బటన్, సేఫ్టీ స్కోర్ల వంటి ఫీచర్లను అందిస్తుంది. షేక్2సేఫ్టీ: ముందుగా సేవ్ చేసిన కాంటాక్స్ నెంబర్స్కి అత్యవసర సందేశాన్ని పంపడానికి మహిళలు తమ ఫోన్ను షేక్ చేయడానికి అనుమతించే సులభమైన యాప్. సాస్ స్టే సేఫ్: జస్ట్ ఒక ట్యాప్తో సమీపంలోని పోలీస్ స్టేషన్కి సాస్(SOS) సందేశాన్ని పంపడానికి మహిళలకు అనుమతిస్తుంది. యాప్లో లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలారం ఫీచర్ను కూడా అందిస్తుంది. ఫైట్బ్యాక్: ఇది స్వీయ-రక్షణ యాప్. దీనిలో స్వీయ-రక్షణ ట్యుటోరియల్లు తోపాటు భద్రతా సలహాలను అందిస్తుంది. మహిళలు తాము ఎక్కడున్నారో వారి కుటుంబికులు లేదా స్నేహితులకు తెలియజేసేలా సాస్(SOS) సందేశాన్ని పంపడానికి అనుమతిస్తుంది. లైఫ్ 306: కుటుంబ భద్రత యాప్. ఇది మహిళలు తమ కుటుంబ సభ్యులతో ప్రైవేట్ నెట్వర్క్ని సృష్టించడానికి అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్లు, ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను అందిస్తుంది. నిర్భయం: భారతదేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. యాప్ రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్లు తోపాటు వన్-టచ్ పానిక్ బటన్ను అందిస్తుంది. ఈ యాప్లు చాలా వరకు మహిళలను తమను తాము సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వస్తున్న ఈ భద్రతా యాప్లను ఉపయోగించుకుని స్వీయ సంరక్షణ పొందండి. దీంతో పాటు కొన్ని విపత్కర పరిస్థితుల్లో అలాంటి యాప్లను కూడా వినయోగించలేని పరిస్థితి ఏర్పడొచ్చు అలాంటప్పడు ఈ కింది చిట్కాలు ఫాలోకండి. అవేంటంటే.. మీరు వెళ్లే పరిసరాల గురించి తెలుసుకోండి. ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండండి. అది అర్థరాత్రి అయిన లేదా మరే సమయం అయినా జనసంచారం లేని రోడ్డుపై వెళ్తుంటే బహు అప్రమత్తంగా ఉండండి. కనీసం ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేస్తున్న నిర్లక్ష్యం వహించొద్దు. చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. మీరు ఉన్న ప్రదేశంలో అసౌకర్యంగా అనిపించినా లేదా ఏదో తప్పు జరుగుతుంది లేదా తప్పు జరగబోతోందని అనిపిస్తే.. వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయి సురక్షితంగా ఉండేలా చూసుకోండి స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వంటి సురక్షిత సాధనాలను కూడా మీ వద్ద ఉంచుకోండి. పరిస్థితి చేజారుతుందనుకున్నప్పుడూ మిమ్మల్ని మీరు రక్షించుకునేలా స్వీయ రక్షణ చర్యలను నేర్చుకోండి(అవతలి వ్యక్తిపై తిరగబడటం లేదా భయపడలే చేయడం వంటి పనులు) తెలియని కొత్త ప్రదేశానికి వెళ్తుంటే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వండి. మీ ఆచూకిని వారికి క్లియర్గా చెప్పండి. ఎప్పటికప్పుడూ మీ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ని తప్పక ఇవ్వండి. ఇప్పుడు చెప్పిన యాప్లు, ఈ చిట్కాలు ఫాలో అయితే ప్రతి మహిళకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ఉండగలిగాలే హ్యాండిల్ చేసుకునే ధైర్యం ఆటోమెటిక్గా వస్తుంది. బీ కేర్ ఫుల్. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్ను తొలగించారు. వాట్సాప్ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
సెలవులు ఎలా గడుపుతారు? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
సెలవులంటే ప్రతిఒక్కరికీ ఉత్సాహమే. ఒకప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్లి సెలవులను ఆస్వాదించేవారు. అయితే సెలవులను గడిపే తీరు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో మారిపోయింది. రానున్న క్రిస్మస్ సెలవుల సీజన్ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. న్యూఢిల్లీ: వినియోగదారులు గతంలో కంటే ఈ సెలవుల సీజన్లో ఎక్కువ అప్లికేషన్లు, డిజిటల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని సిస్కో నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో 85 శాతం మంది ప్రధానంగా బ్యాంకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ యాప్ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఉపయోగించుకుంటారని తెలిపింది. క్రిస్మస్, సెలవుల కాలంలో అప్లికేషన్లు, డిజిటల్ సేవల వినియోగాన్ని తెలుసుకోవడానికి యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్ సహా వివిధ దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 12,000 మంది పాలుపంచుకున్నారు. Cisco Survey: సిస్కో యాప్ డైనమిక్స్ సీజనల్ షాపింగ్ పల్స్ సర్వే ప్రకారం.. అప్లికేషన్లు, డిజిటల్ సేవలు ఇప్పుడు ఆనందదాయక సెలవులు/క్రిస్మస్లో ముఖ్యమైనవి అని 88 శాతం మంది అంగీకరిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు. 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్ హోమ్ వంటి ఇంటర్నెట్తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్ యాప్లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా, వీడియో కాల్స్ సాధనాలను ఎంచుకున్నారు. చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్ యాప్లను, అదే నిష్పత్తిలో చివరి నిమిషంలో చెల్లింపులు, బదిలీలకై బ్యాంకింగ్, బీమా యాప్లను వాడతారు. 78 శాతం మంది వార్తలు, సమాచార–ఆధారిత యాప్లను, 88 శాతం మంది టేక్ అవే కోసం ఫుడ్ డెలివరీ సేవలను వినియోగిస్తారు’ అని సర్వేలో తేలింది. -
ఏఐ అశ్లీల ఫోటోల కోసం వెబ్సైట్లు, యాప్స్కు పోటెత్తుతున్న యూజర్లు!
ప్రపంచ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోవడంతో ఆన్లైన్లో అశ్లీలత విపరీతంగా పెరిపోతున్నట్లు తేలింది. ఫలితంగా ఏఐని ఉపయోగించి మహిళల ఫోటోల్ని అశ్లీలంగా చూపే యాప్లు, వెబ్సైట్లు ప్రాచుర్యం పొందుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సెప్టెంబర్లోనే 24 మిలియన్ల మంది యూజర్లు ఏఐ మహిళల ఫోటోల్ని వీక్షించేందుకు వాటిని డిజైన్ చేసే వెబ్ పోర్టల్స్, యాప్స్కు పోటెత్తినట్లు సోషల్ నెట్వర్క్ అనాలసిస్ సంస్థ గ్రాఫికా గుర్తించింది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి యూజర్లకు సర్వీసులు అందించేలా పలు రకాల యాప్స్ ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లలో ఏఐ అశ్లీల ఫోటోలతో ప్రకటనలు ఇస్తున్నాయని, ఆ సంఖ్య 2,400 శాతానికి చేరినట్లు తెలిపింది. వాటిల్లో ఎక్స్.కామ్తో పాటు రెడ్డిట్ కూడా ఉన్నట్లు గ్రాఫికా రీసెర్చర్లు గుర్తించారు. ఇందుకోసం ఏఐ నిపుణులు మహిళల ఫోటోల్ని రీక్రియేట్ చేసి వాటి సాయంతో ఏఐ అశ్లీల ఫోటోల్ని తయారు చేస్తున్నారని.. అనంతరం ఆ ఫోటోలతో యాప్స్, వెబ్ పోర్టల్స్ సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, దీనికి అడ్డుకట్ట వేసేలా ఆయా ప్రభుత్వాలు, ఏఐ సంస్థలు ఆంక్షలు విధించాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్లో 18 లోన్ యాప్లను స్పైలోన్ యాప్లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్యాప్లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్లలో 17 యాప్లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్లో తొలగించిన ఈ యాప్ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
ఆడుకుందాం రండి!
సాక్షి, అమరావతి : దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దాదాపు 43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీకి ఊరూవాడా ముస్తాబవుతున్నాయి. ఈ భారీ క్రీడా పండుగ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ‘ఆడుదాం–ఆంధ్ర’పై ప్రచారం కల్పించడంతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాకారుల వివరాలను నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్తో పాటు వెబ్సైట్ను రూపొందిస్తోంది. ఇక పోటీలకు డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జవనరి 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులోని ఐదు క్రీడాంశాల్లో రికార్డు స్థాయిలో 2.99 మ్యాచ్లు నిర్వహిస్తారు. మూడు విధాలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ♦ రాష్ట్రంలోని 15,004 గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు ఈ పోటీలకు క్రీడాకారుల వివరాలను నమోదు చేయడంతోపాటు ప్రజలను క్రీడా మహోత్సవానికి ఆహ్వానిస్తారు. ♦ ఔత్సాహిక క్రీడాకారులు తమ పేరు, చిరునామా, ప్రాతినిధ్యం వహించే క్రీడల వివరాలను గుర్తింపు కార్డు ఐడీ/ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ♦ ఒకటి కంటే ఎక్కువ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులు ప్రాధాన్యత క్రమంలో పాల్గొనే క్రీడల వివరాలను అందించాలి. ♦ వలంటీర్ ఇంటికి వచ్చినప్పుడు లేదా క్రీడాకారులే నేరుగా తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి పోటీలకు తమ వివరాలు ఇవ్వొచ్చు. ♦ వ్యక్తిగతంగానే కాకుండా ఒక గ్రూపుగా కూడా క్రీడాకారులు తమ జట్టును నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ♦ ఇక ప్రభుత్వం తీసుకొచ్చే వెబ్సైట్ ద్వారా కూడా క్రీడాకారులు నేరుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఐదు రకాల కాంపిటీటివ్ క్రీడాంశాలు, మూడు నాన్–కాంపిటీటివ్ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. వీటిల్లో 15 ఏళ్లకు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడలతో పాటు సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఐదు దశల్లో అంటే.. గ్రామ/వార్డు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రతి సచివాలయం నుంచి 10 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. సుమారు 1.50 లక్షల మంది వలంటీర్లకు క్రీడాంశాల నిర్వహణపై పీఈటీ, పీడీలతో జిల్లా చీఫ్ కోచ్ల సహాయంతో ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రత్యేక శిక్షణనిస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో బాలబాలిక విభాగాల్లో ఒక్కొక్క జట్టు చొప్పున లెక్కిస్తే 228 మంది పాల్గొంటారు. ఇలా మొత్తం 34.20లక్షల మంది క్రీడాకారుల ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా. సచివాలయం పరిధిలో ఒకటికి మించి ఎక్కువ జట్లు వస్తే క్రీడాకారుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం.. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకర సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆడుదాం–ఆంధ్ర పేరుతో నిర్వహించే ఈ మెగా టోర్నీని దేశంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా నిలబెడతాం. దీనిద్వారా ఐదు క్రీడాంశాల్లో క్రీడాకారుల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. తద్వారా ప్రతిభగల క్రీడాకారులకు అవసరమైన క్రీడా శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించడానికి ఎంతో వీలుంటుంది. ప్రతి క్రీడాంశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పీఈటీలు, పీడీలు, శాప్ కోచ్లతో పాటు వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కోసం యాప్, వెబ్సైట్ను దాదాపు సిద్ధంచేశాం. క్రీడాకారులు వీలైనంత త్వరగా వివరాలు నమోదు చేసుకోవాలి.– ధ్యాన్చంద్, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణ ఇలా.. ♦ గ్రామ/వార్డు సచివాలయం: డిసెంబర్ 15 నుంచి 20 వరకు ♦ మండల స్థాయి : డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు ♦ నియోజకవర్గం : జనవరి 5 నుంచి 10 వరకు ♦ జిల్లా స్థాయి : జనవరి 11 నుంచి 21వరకు ♦ రాష్ట్రస్థాయి : జనవరి 22 నుంచి 26 వరకు -
టీడీపీ యాప్లో ప్రజల వ్యక్తిగత సమాచారం
సాక్షి, అమరావతి/రాజంపేట: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డదారుల్లో సేకరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఓటర్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామంటూ ఇళ్లకు వెళ్లి యాప్లో వారి వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం వారి ఫోన్ నెంబర్లు తీసుకుని దాని ద్వారా వచ్చే ఓటీపీని అడుగుతున్నారు. ఓటీపీ నెంబర్ చెప్పకపోతే బలవంతంగా తెలుసుకునేందుకు బరితెగిస్తున్నారు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఒక మహిళా టీడీపీ కార్యకర్త ఒక ఇంట్లోకి వెళ్లి వారి వివరాలు సేకరించి ఓటీపీ తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలు అలాగే, ఇదే పట్టణంలోని ఆకుల వీధిలో కొందరు తెలుగు తమ్ముళ్లు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో సమాచారం సేకరిస్తూ ఎందుకని ప్రశ్నించిన వారిపై గొడవకు దిగి గందరగోళం సృష్టించారు. ఆ వీధిలోని ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఆమె ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు ఇతర వివరాలన్నీ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీ కూడా తీసుకోవడంతో ఇరుగుపొరుగు వాళ్లు అడ్డుకున్నారు. ఓటీపీ నెంబర్తో మోసాలకు పాల్పడుతున్నారని, ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. ఈలోపు సమీపంలోనే ఉంటున్న రాజంపేట మున్సిపల్ వైస్ఛైర్మన్ మర్రి రవి అక్కడికి రావడంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ప్రజలకు ఇష్టంలేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎలా యాప్లో నమోదు చేస్తారని అడిగినందుకు వారు గొడవకు దిగారు. సమాచారం తెలుసుకుని పోలీసులు రావడంతో టీడీపీ కార్యకర్తలు మాటమార్చి వైఎస్సార్సీపీ నేత రవిపై రకరకాల ఫిర్యాదులు చేశారు. దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీయగా.. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం కింద టీడీపీ కార్యకర్తలు ప్రజల పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తేలింది. ప్రజల ఫోన్ నెంబర్లను యాప్కి అనుసంధానం చేసుకుని దాని ద్వారా వారి వివరాలు తెలుసుకుంటున్నట్లు స్పష్టమైంది. కానీ, ఆ విషయం చెప్పకుండా తాము తహశీల్దార్ కార్యాలయం నుంచి ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చామని చెబుతూ ఇళ్లల్లోకి వెళ్లి వివరాలు సేకరిస్తూ ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. అడ్డంగా బుక్కవడంతో వీరంగం.. టీడీపీ తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోవడంతో దీనిని జీర్ణించుకోలేక వారు ఆదివారం వీరంగం సృష్టించారు. అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బత్యాల చెంగల్రాయుడు స్వయంగా రాజంపేట, నందలూరు మండలాల నుంచి కార్యకర్తలను సమీకరించి ఆకుల వీధికి వెళ్లారు. అక్కడ మున్సిపల్ వైస్ఛైర్మన్ ఇంటి వద్ద కవ్వింపు చర్యలకు దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు రావడంతో వారిని సైతం తోసేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు.. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. ఎవరైనా సమాచారం చెప్పడానికి నిరాకరిస్తే వారిపై ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
- టీడీపీలో భయాందోళనలు
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement