-
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) -
Manisha Rani: స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటున్న మనీషా రాణి (ఫొటోలు)
-
Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
-
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య (ఫొటోలు)
-
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
-
20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం
ప్రముఖ సింగర్ పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా కేవలం 20 ఏళ్ల వయసులోనే చేసుకోనుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. స్వతహాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్.. హిందీలో బిగ్బాస్-16 షోలో పాల్గొని పాపులరిటీ సంపాదించాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్తో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)20 ఏళ్ల అబ్దు రజాక్.. షార్జాకు చెందిన అమీరాతో జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకోనున్నాడు. ఈమె అబ్దు కంటే ఏడాది చిన్నది. అయితే వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇతడు పెట్టిన ఇన్ స్టా వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ వీడియో, క్యాప్షన్లో ఏముందంటే?'ప్రేమ కంటే విలువైనది నా జీవితంలో ఇంకేది లేదు. పెళ్లికి రెడీ అయ్యాను. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నాను. నాది ప్రేమ పెళ్లి. అయితే ఈ ప్రేమ నాకు అంత సులభంగా దక్కలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చాను. లవ్ జర్నీ నాకు కాస్త సవాలుగానే అనిపించింది. అమీరా-నేను ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. జూలై 7వ తేదీని సేవ్ చేసుకోండి' అని అబ్దు తన సంతోషాన్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) View this post on Instagram A post shared by Abduroziq Official (@abdu_rozik) -
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్కు చేరుకుని భారీగా ఫ్యాన్స్ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది. -
స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం
బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈమేరకు తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. తన భర్త మంజునాథ్ తండ్రి గారు హఠాన్మరణం చెందారని తెలుపుతూ ఆమె కలత చెందింది. ఈ క్రమంలో తన మామగారి ఫోటోను ఆమె షేర్ చేసింది. 'మిస్ యూ అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ చెప్పుకొచ్చింది.ఇదే సమయంలో లాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యాడు. 'భౌతికంగా మీరు మాతో లేకపోయినా.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుంది.' అని మంజునాథ్ భావోద్వేగానికి గురైయాడు. ఆపై తన తండ్రితో దిగిని ఫోటోలను పంచుకున్నాడు. ఆయన మరణానికి కారణాలు తెలుపలేదు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించి ఉంటారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Manjunath Chillale (@manjunath_chillale) -
‘మీ అమ్మకు అలా మెసేజ్ చేస్తే ఓకేనా?’.. నెటిజన్పై శ్వేతవర్మ ఫైర్
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. వారిలో శ్వేతవర్మ కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత బుల్లితెర ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రియులందరికి దగ్గరైంది. ఆ షో తర్వాత సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గాను నటించింది. అయితే అవకాశాలు రాలేకనో లేదా పాత్రలు నచ్చకపోవడంతో తెలియదు కానీ కొన్నాళ్లుగా శ్వేత వర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వార మాత్రం ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్తో షేర్ చేసుకునే శ్వేతకు సోషల్ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫ్రైవేట్ భాగాలపై నీచంగా కామెంట్ చేశాడు. తాజాగా సదరు వ్యక్తి పంపిన సందేశాలతో పాటు అతని ప్రొఫైల్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.‘ఒక మనిషికి ఇలాంటి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’అంటూ శ్వేత రాసుకొచ్చింది. అలాగే అతని అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని, ఆ వివరాలు కూడా ఇన్స్టాలో పెట్టొచ్చు..కానీ మనిషిని కాబట్టి షేర్ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇది అతనికొక గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటూ శ్వేత ఓ వీడియోని షేర్ చేసింది.శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
బిగ్ బాస్ హౌస్లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
జైలు నుంచి వచ్చాడు.. రూ.3 కోట్ల కారు కొన్నాడు!
ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్. పాము విషం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్పై విడదలయ్యారు కూడా. యూట్యూబర్గా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఎల్విశ్ యాదవ్ బిగ్బాస్ షో మరింత గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల జైలు నుంచి బయటికొచ్చిన ఎల్విశ్ యాదవ్ ఖరీదైన లగ్జరీ కారును కొన్నారు. తాజాగా మెర్సిడెస్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ కారును 2022లోనే కొనాలనుకున్నట్లు తన వీడియో ఎల్విశ్ వెల్లడించారు. అప్పుడు కుదరకపోవడంతో ఈ ఏడాది తన కల నెరవేరిందని అన్నారు. కాగా.. ఎల్విశ్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2 విజేతగా నిలిచారు. -
బిగ్బాస్ నటితో సహజీవనం.. ఇప్పుడేమో సింగిల్గా ఉంటూ!
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ పవిత్రా పూనియా. ఈ ముద్దుగుమ్మ 2020లో బిగ్బాస్ -14వ సీజన్లో మెరిసింది. అదే సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న ఇజాజ్ ఖాన్తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డేటింగ్లో ఉన్న భామ.. ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ.. అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. ఈ ఏడాదిలోనైనా పెళ్లిబంధంలోకి అడుగుపెడతారన్న జంట ఫిబ్రవరి 14న షాకింగ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు బుల్లితెర జంట ప్రకటించారు. బుల్లితెర నటులైన ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అంతకుముందు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా.. గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర పూనియా మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలికారు. అయితే ప్రస్తుతం ఇజాజ్ ఖాన్ తన దృష్టినంతా కెరీర్పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎవరితోనూ రిలేషన్లో లేడని సమాచారం. దీంతో ఇజాజ్ సింగిల్గానే ఉంటున్నారు. గతంలో పునియాను ఇజాజ్ ఖాన్ మోసం చేశాడని.. విడిపోవడానికి అదే కారణమని రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ పూనియా తోసిపుచ్చింది. కాగా.. ఇజాజ్ ఖాన్ ప్రస్తుతం కొత్త ఇంటికి మారాడు. అంతే కాకుండా దివ్యాంక త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నాడు. బ్రేకప్ అయ్యాక పూర్తిగా తన కెరీర్పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్ కీ దస్తాన్-నాగమణి' అనే సీరియల్లో నటిస్తోంది. -
డ్రెస్ సర్దుకునే ఫోటోలు కూడా తీస్తారా? బిగ్ బాస్ నటి ఆగ్రహం!
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ సీజన్- 17 ఫేమ్ అయేషా ఖాన్ చేసిన పోస్ట్ బీ టౌన్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే ఎలా పడితే అలా ఫోటోలు తీస్తున్నారని మండిపడింది. కొందరు మీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా నటీమణులను అనుచితమైన కోణాల్లో రికార్డ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరంతా కనీస కనీస మర్యాదల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని... మీ ప్రవర్తన చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఆయేషా తన ఇన్స్టాగ్రామ్లో రాస్తూ..'అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు? అసలు మీకు అనుమతి ఉందా? కొందరు మీడియా వాళ్లు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? ఒక స్త్రీ భయం లేకుండా తన దుస్తులు కూడా సర్దుకునే స్వేచ్ఛ లేదా? ఇది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఒక మహిళ తన కారులో నుంచి దిగే ముందు తన దుస్తులను సర్దుకుంటూ కనిపిస్తుంది. ఆ ఫోటోలను కూడా మీరు క్యాప్చర్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒక మహిళ తనను వెనుక నుంచి ఫోటోలు తీయవద్దని కోరుకుంటుంది. మహిళలకు కనీస మర్యాద ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకోండి అంటూ' చురకలు అంటించింది. కాగా.. సోషల్ మీడియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటి.. హిందీ బిగ్ బాస్ సీజన్-17లో మెరిసింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. అ తర్వాత మలయాళ చిత్రం లక్కీ బాస్కర్లో నటించనుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా కనిపించనున్నారు. -
ప్రియుడితో ప్రియాంక పెళ్లి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు (ఫొటోలు)
-
ఫ్యాన్స్కు షాకిచ్చిన బిగ్బాస్ ప్రియాంక.. సడన్గా ప్రియుడితో పెళ్లి!
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్బాస్ హౌస్లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉండే ప్రియాంక సడన్గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది. -
బిగ్ బాస్ ఫేమ్ గీతూ పై జూనియర్ ఆర్టిస్ట్ సౌమ్య శెట్టి ఫైర్
-
'బిగ్ బాస్' నటికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. జైలుకు తరలింపు
కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. సోనూ గౌడకు ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నటి ఏం చెప్పింది..? జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మీడియాతో స్పందించిన సోను శ్రీనివాస్ గౌడ.. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని తెలిపింది. నేను ఒక అమ్మాయిని తీసుకువచ్చాను ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం రక్షణ అవసరం, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే నేను తెచ్చుకున్నాను. నేనే ఆమెను సురక్షితంగానే చూసుకున్నాను. ఏం జరిగింది..? గత మార్చి 2న సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో, ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. అది కూడా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. రాయచూర్కు చెందిన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు అందులో సోనూ పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను అంగీకరించాలి. అలాగే, సోనూ గౌడ ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఇది అమ్మకాల ప్రక్రియగా కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం ఆమెది స్కూల్కు వెళ్లి చదువుకోవాల్సిన వయసు.. కానీ ఆ బాలిక విషయంలో ఇది జరగలేదు. పలువురు ఫిర్యాదు చేయడంతో సోనూ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చిన్నారిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. -
Sonu Srinivas Gowda Photos: పాపను దత్తత తీసుకుంది.. జైలుపాలైంది (ఫోటోలు)
-
8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్
కన్నడ బిగ్బాస్ సీజన్ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్తో పాటు.. యూట్యూబ్ కోసం పలు వీడియోలను సోనూ క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు. బిగ్బాస్ ఫేమ్ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు. రాయచూర్కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. -
బిగ్బాస్ విన్నర్కు షాక్.. పోలీసుల అదుపులో యూట్యూబర్!
వివాదాస్పద యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాము విషం కేసులో నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు నోయిడా డీసీపీ విద్యాసాగర్ మిశ్రా వెల్లడించారు. ఇవాళ అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎల్విశ్ యాదవ్ పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. తాజాగా అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా..గతేడాది గురుగ్రామ్, నోయిడాలోని రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎల్విష్ను పోలీసులు ప్రశ్నించారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యూట్యూబర్ ఎల్వీశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో తాను దోషిగా రుజువైతే కెమెరాలో బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తానని అన్నారు. Systum ka system hila diya Noida Police me! Chapri #ElvishYadav in Police custody. pic.twitter.com/zCcWeabmij — Prashant Kumar (@scribe_prashant) March 17, 2024 -
Shobha Shetty Latest Photos: లంగా ఓణీలో మరింత అందంగా 'బిగ్బాస్' శోభాశెట్టి (ఫొటోలు)
-
ఎన్నికల ముందు బిగ్ షాకిచ్చిన బిగ్బాస్ బ్యూటీ!
లోక్సభ ఎన్నికల ముందు ప్రముఖ నటి సంభవనా సేథ్ బిగ్ షాకిచ్చింది. గతేడాది అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన నటి సంభవనా సేథ్ తాజాగా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆమె తన తప్పును గ్రహించానని.. అందువల్ల ఇకపై ఆప్లో భాగం కాలేనని పేర్కొంది. దీంతో లోక్ సభ ఎన్నికల ముందు ఆప్కు గట్టి షాక్ తగిలింది. సంభావన సేత్.. "నా దేశం కోసం సేవ చేయాలనే ఉత్సాహంతో సంవత్సరం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. మనం ఎంత తెలివిగా నిర్ణయం తీసుకున్నా సరే. మనుషులం కాబట్టి చివరికీ ఏదో ఒక తప్పు చేస్తాం. నా తప్పు తెలుసుకుని ఆప్ పార్చీ నుంచి నిష్క్రమిస్తున్నా' అని ట్వీట్లో రాస్తూ అరవింద్ కేజ్రీవాల్ను ట్యాగ్ చేసింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ గుడ్ డెసిషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. సంభావన సేత్ బాలీవుడ్లో పలు చిత్రాలతో పాటు రియాలిటీ షోలలో కూడా కనిపించింది. బిగ్బాస్ సీజన్-8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. 2006లో '36 చైనా టౌన్'లో అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కరీనా కపూర్, షాహిద్ కపూర్ జంటగా నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్లతో పేరు సంపాదించుకుంది. Joined @AamAadmiParty a year back wid a lot of enthusiasm to serve for my country bt no matter hw wisely U take a decision U can still go wrong bcz at the end of the day we r humans. Realising my mistake I officially declare my exit from AAP. @ArvindKejriwal @SandeepPathak04 — Sambhavna Seth (@sambhavnaseth) March 10, 2024 -
సినిమా ఆఫర్ కోసం వెళ్తే.. డైరెక్టర్ అలాంటి పాడు పని: బిగ్ బాస్ బ్యూటీ
క్యాస్టింగ్ కౌచ్ ఈ పదం చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రంగుల ప్రపంచం లాంటి సినిమా రంగంలో ఇది సర్వ సాధారణంగా మారిపోయింది. గతంలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్పై మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి తనకెదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ శ్రీజిత దే సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది. ఓ సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఛానెల్కు ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. శ్రీజిత మాట్లాడుతూ..' నేను 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మాది పశ్చిమ బెంగాల్లోని హల్దియా అనే చిన్న పట్టణం. మా అమ్మ ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ నాతోనే ఉండేది. మా అమ్మ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచేదాన్ని కాదు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో కొందరు చెత్త వ్యక్తులను కూడా కలిశాను. కొందరు ప్రాజెక్ట్ లేకపోయినా కేవలం మీటింగ్ కోసం పిలిచి టైం పాస్ చేసేవారు. మరికొందరు పెద్ద డైరెక్టర్తో సినిమా ఉందంటూ కమిట్మెంట్ అడిగేవారు. అలా రెండుసార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి చాలా భయంకరమైన పరిస్థితి నుంచి బయపడ్డానని తెలిపింది. శ్రీజిత మాట్లాడుతూ.. "నాకు 19 ఏళ్ల వయస్సులో హిందీ చిత్రం రీమేక్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ నన్ను సమావేశానికి పిలిచారు. ఆ సమయంలో మా అమ్మ కోల్కతాలో ఉంది. నేను ఒంటరిగా డైరెక్టర్ ఆఫీసుకి వెళ్లాను. అతను నా భుజం పట్టుకున్న విధానం, నాతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. అతను వయసులో చాలా పెద్దవారు. ఎలాంటి వారికైనా ఆయన బుద్ధి ఎలాంటిదో వెంటనే అర్థమైపోతుంది. అతను నన్ను చూస్తున్న తీరు చాలా అసహ్యంగా అనిపించింది. దీంతో వెంటనే నా పర్సు తీసుకుని ఆఫీసు నుంచి బయటికి పరిగెత్తా." అంటూ ఆ షాకింగ్ సంఘటనను వివరించింది. కానీ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎప్పుడు మోసపోలేదని తెలిపింది. కాగా.. శ్రీజిత ఉత్తరాన్, తుమ్ హి హో బంధు సఖా తుమ్హీ, లేడీస్ స్పెషల్, లాల్ ఇష్క్, యే జాదూ హై జిన్ కా లాంటి ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. బెంగాలీలో తన పాత్రలకు బాగా గుర్తింపు తెచ్చుకుంది. 2007లో కసౌతి జిందగీ కే అనే షోతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా తషాన్, మాన్సూన్ షూటౌట్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ వంటి చిత్రాలలో కూడా నటించింది. View this post on Instagram A post shared by Sreejita De Blohm-Pape (@sreejita_de) -
Vasanthi Krishnan: బిగ్బాస్ బ్యూటీ వాసంతి రిసెప్షన్ పిక్స్ (ఫోటోలు)
-
వాడికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
డ్రాపౌట్స్ నివారణకు చర్యలు
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఓటు ప్రజాస్వామ్యానికి బలం
అమలాభట్టలో న్యాయ సచేతన శిబిరం
మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నలుగురు బీజేడీ ఎమ్మెల్యేలకు అనర్హత తాఖీదులు
భక్తులకు పండ్లు వితరణ
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
తప్పక చదవండి
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement