-
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
సముద్రం అంచున విమానం ఇల్లు.. అదిరిపోయే ఫొటోలు
-
పాతబడేకొద్దీ మరింత ప్రమాదం
బోయింగ్ విమానాలు పాతపడే కొద్దీ అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయని ఆ కంపెనీలో 10 ఏళ్లకుపైగా ఇంజినీర్గా పనిచేసిన సామ్ సలేహ్పార్ తెలిపారు. ఇటీవల కాలంలో బోయింగ్ మోడళ్లలో లోపాలు తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్స్ట్రేషన్ (ఎఫ్ఏఏ) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. తాజాగా బోయింగ్ సంస్థపై సామ్ చేసిన ఆరోపణలను సైతం పరిశీలిస్తున్నట్లు ఎఫ్ఏఏ విచారణ అధికారులు తెలిపారు. సామ్ ఎఫ్ఏఏకు చేసిన ఫిర్యాదులో ‘బోయింగ్ 777, 787 డ్రీమ్లైనర్లలో లోపాలున్నాయి. బోయింగ్ విమానాల తయారీ సమయంలో సంస్థ షార్ట్కట్లను వాడుతోంది. దాంతో అవి పాతబడేకొద్దీ ఈ లోపాలు ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో తయారైన విడిభాగాలను అనుసంధానం చేసే క్రమంలో సరైన విధానాలను పాటించడం లేదు. 2019లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్లోని ప్లాంట్లో బోయింగ్ 787 తయారు చేస్తున్న సమయంలో పని త్వరగా పూర్తి చేయాలని కార్మికులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ విషయాలు పబ్లిక్డొమైన్లో పెట్టడంతో కంపెనీ ప్రతీకారచర్యలకు సైతం దిగుతుంది’ అంటూ వివరించాడు. సామ్ తరపు న్యాయవాది డెబ్రా ఎస్కాట్జ్ మాట్లాడుతూ ‘సామ్ చేసిన ఆరోపణల ఫలితంగా కంపెనీ తనను 787 ప్రాజెక్టు నుంచి తప్పించి 777 ప్రాజెక్ట్కు బదిలీ చేసింది. చివరికి అక్కడ కూడా సామ్ లోపాలు గుర్తించాడు’ అని అన్నారు. ఇటీవల సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. గతంలోనూ అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు ఇటీవల జపాన్లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
విమానంలో 135 మంది ప్రయాణికులు.. గాల్లోనే ఊడిన ఇంజిన్ కవర్
విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ఇంజిన్ కవర్ ఊడిపోయిన సంఘటన ఇటీవల అమెరికాలోని డెన్వర్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. అలా ఊడిన కవర్ విమానం కుడివైపు రెక్కలపై ఉన్న ఫ్లాప్స్లో చిక్కుకుంది. విమాన సిబ్బంది, పైలట్లు సమస్యను వెంటనే గుర్తించి అప్పటికే గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి, కిందకు దించారు. డెన్వర్ ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో హోస్టన్కు తరలించారు. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! గతంలోనూ అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
విమాన ప్రయాణికులకు ఆధునిక వినోద వ్యవస్థ
రోడ్లపై ప్రయాణాల్లో అలసటగా అనిపించినా, బోర్ కొట్టినా కాసేపు వాహనాన్ని ఆపి సేదతీరుతారు. కానీ విమాన ప్రయాణాల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఒకసారి గాల్లోకి ఎగిరాక తిరిగి దిగేవరకు ప్రయాణం ఎలా ఉన్నా భరించాల్సిందే. పైగా విమాన ప్రయాణాలంటేనే గంటల తరబడి ఉంటాయి. గాల్లో ప్రయాణించేవారికి కాసింత వినోదాన్ని పంచేందుకు థేల్స్ సంస్థ సిద్ధమయింది. ఇప్పటికే ఫ్లైట్ సీట్ ముందు డివైజ్ను అమర్చి ప్రయాణికులను కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తున్న సంస్థ ఆ వ్యవస్థను ఆధునికీకరించనుంది. ఎయిరిండియా తమ వద్ద ఉన్న 40 బోయింగ్ 777, 787 విమానాలను, థేల్స్కు చెందిన ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. థేల్స్ ‘అవాంట్ అప్’ వ్యవస్థను ఎయిరిండియా విమానాల లోపల అమర్చే పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. 2025లో ఎయిరిండియాకు కొత్తగా డెలివరీ అయ్యే 11 కొత్త ఎయిర్బస్, బోయింగ్ విమానాల్లోనూ థేల్స్ తన కొత్త వ్యవస్థలను పొందుపరచనుంది. ఇదీ చదవండి: యాప్ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. థేల్స్ 3డీ మ్యాప్, ఇమ్మర్సివ్ రూట్-బేస్డ్ ప్రోగ్రామింగ్, 4K QLED HDR డిస్ప్లేలను ఇన్స్టాల్ చేయనుంది. ఇందులో హై-స్పీడ్ ఛార్జింగ్ పోర్ట్లు, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏరోనాటిక్స్-స్పేస్, డిజిటల్ ఐడెంటిటీ-సెక్యూరిటీ, డిఫెన్స్-సెక్యూరిటీ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న కంపెనీగా థేల్స్ పేరొందింది. -
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
గాల్లో ఉండగానే కాక్పిట్ అద్దంలో పగుళ్లు!
అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానానికి ఇటీవలే పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. దాంతో బోయింగ్ 737 మ్యాక్స్లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. కానీ, ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ‘సపోరో-న్యూ చిటోస్ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే నాలుగు లేయర్లు కలిగిన కాక్పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితోపాటు 59 మంది ప్రయాణికులు ఉన్నారు’ అని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో చెప్పింది. ఇదీ చదవండి: కీలక టారిఫ్లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్? అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. తాజాగా వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు తెలిపింది. మరిన్ని భద్రతా పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్లైన్స్ సంస్థలకు గతవారం మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఆకాశ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం
దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాకేశ్ ఝన్ఝన్వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్కు 20 విమానాలు ఉన్నాయి. -
కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్' - ఫోటోలు చూశారా?
ముంబై విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో టాటా యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త బోయింగ్ బి737-8 విమానాన్ని 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్'గా ఆవిష్కరించారు. బోయింగ్ 737 మునుపటి డిజైన్కు భిన్నంగా కొత్త లోగో, ఎయిర్క్రాఫ్ట్ లివరీ పొందుతుంది. ఈ రిఫ్రెష్ బ్రాండింగ్ను చైర్ పర్సన్ 'అలోకే సింగ్' (Aloke Singh), సీఈఓ 'కాంప్బెల్ విల్సన్' (Campbell Wilson) ఆవిష్కరించారు. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదని తామెవరో, విజన్ ఏంటో.. ఈ మార్పులలో చెప్పదలచుకున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్లైన్స్గా నిలుస్తుందన్నారు. రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, లోగోలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు. Dear Guests, Fasten your seatbelts for the moment we've all been waiting for. We're thrilled to unveil the new X factor in Indian aviation - the new livery of Air India Express. #FlyAsYouAre #TailsOfIndia pic.twitter.com/Vif5GDQJlH — Air India Express (@AirIndiaX) October 18, 2023 -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్ ధరల ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ వార్షికోత్స సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ వెబ్సైట్, యాప్లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్సైట్లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో ప్రయాణానికి ఈ మెగా సేల్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. కంపెనీ యాప్లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ ఫీజు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా ప్రతి బుకింగ్పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్క్రాఫ్ట్ 737 MAX ను తన ఖాతాలో చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే పేర్కొన్నారు. కాగా ప్రముఖ స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్కతాలకు విమాన సేవలు అందిస్తోంది. Coming soon: Long Weekend. Have you booked yet? Get up to 15% off on over 900 weekly flights across India. Use promo code: AKASA1 Valid till: 7th Aug, 2023 Book NOW: https://t.co/aYCnmVC8ip#ItsYourSky #AkasaAir #flightoffer #longweekend #weekend #flights pic.twitter.com/W4Q1GR6DAi — Akasa Air (@AkasaAir) August 2, 2023 Thank you for being a part of our journey, @BoeingAirplanes! https://t.co/PbUIEgBmf5 — Akasa Air (@AkasaAir) August 2, 2023 -
ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ చైనా పర్యటనలో భాగంగా తన అధికారిక బృందంతో కలిసి రెండు విమానాల్లో బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ మిత్రదేశమైన చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తన ప్రతినిధుల బృందంతో కలిసి బయలుదేరారు. అయితే వారంతా ఒక బోయింగ్ 757 విమానంలో వెళుతుండగా వెనుక మరో విమానాన్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. అది ప్రస్తుతం ఫిలిపీన్స్ లోని మనీలా వరకు వారితో పాటు వెళ్ళింది. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన చైనాతో జరగబోయే చర్చలు ప్రయోజనకరంగా సాగాలని దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఒక వేళ ఒక విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయంగా రెండో విమానం ఉపయోగపడుతుందని ఈ విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ బోయింగ్ 757 విమానాలు 30 ఏళ్ల నాటివి. వాటి సర్వీసు ముగింపు దశకు వచ్చింది. 2028 లేదా 2030లో వాటిని మార్చే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నాయకులు న్యూజిలాండ్ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదేదో ఒక ఫోన్ చార్జర్ పని చేయకపోతే ఇంకో చార్జర్ వెంట తీసుకుని వెళ్ళినట్టుందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే.. -
31 వేల మంది పైలట్లు కావాలి..
ముంబై: వచ్చే 20 ఏళ్లలో భారత్లో 31,000 మంది పైలట్లు అలాగే 26,000 మంది మెకానిక్లు అవసరం కావచ్చని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. దేశీ ఎయిర్లైన్స్ భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడం ఇందుకు దోహదపడనుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! టాటా గ్రూప్లో భాగమైన ఎయిరిండియా గత నెల బోయింగ్, ఎయిర్బస్లకు 470 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చూస్తే రాబోయే 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతంలో విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందనుందని గుప్తే వివరించారు. భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతున్నందున మౌలిక సదుపాయాలు.. అలాగే పైలట్లు తదితర వనరులను సమకూర్చు కోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ కరోనా మహమ్మారి తర్వాత విమాన ప్రయాణాలకు డిమాండ్ ఆశ్చర్యపర్చే విధంగా రికవరీ అయ్యిందని గుప్తే తెలిపారు. ఎయిర్ ట్రావెల్ వృద్ధిపై ఆర్థిక సంక్షోభ ప్రభావాలేమీ పడే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బోయింగ్కి ఉన్న ఆర్డర్లపరంగా చూస్తే భారత్లో చిన్న విమానాలకు డిమాండ్ నెలకొందని గుప్తే చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు 90 శాతం మార్కెట్ వీటిదే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్కు జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎయిర్బస్, బోయింగ్ 470 విమానాలు కోనుగోలు తరువాత 2 లక్షలకు పైగ ఉద్యోగావకాశాలు లభించ నున్నాయంటూ ఇప్పటికే పలువురు నిపుణులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో నియామకాల జోష్ కని పిస్తోంది. కంపెనీ వెబ్సైట్లోని ఓపెనింగ్స్ ప్రకటన మేరకు పైలట్లకు ఏడాదికి రూ.2 కోట్ల వరకు చెల్లించనుంది. బోయింగ్, ఎయిర్బస్ విమానలు డెలివరీకి సిద్ధంగాఉన్న నేపథ్యంలో నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో ఎయిర్లైన్ 'B777 కెప్టెన్ల' కోసం వెతుకుతోందని, వీరికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుందని బిజినెస్ టుడే నివేదించింది. "B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎయిరిండియా వెబ్సైట్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులకు నెలవారీగా 21 వేల డాలర్లు వేతనం. అంటే వార్షిక ప్రాతిపదికన, రూ.2,08,69,416 పైమాటే. దీంతోపాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సహా అనేక ఓపెనింగ్లను ప్రకటించింది. నిపుణులైన పైలట్లు లేకపోవడం వల్ల ఈ పాత్ర చాలా ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్లైన్ కన్సల్టింగ్ సంస్థ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్ కొరత ఉందనీ, నిర్దిష్ట విమానంలో కనీసం 5000 నుండి 7000 గంటల పాటు క్వాలిఫైడ్ పైలట్లకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అభిప్రాయం ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం, వారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ప్రతి విమానానికి 50 కంటే తక్కువ క్యాబిన్ సిబ్బంది అవసరం. వీరితోపాటు చెక్అవుట్ కౌంటర్లో, బ్యాగేజీ హ్యాండ్లర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్లు మొదలైన సిబ్బంది కూడా అవసరమే. -
ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు
సాక్షి,ముంబై: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా మెగా డీల్ భారీ ఉద్యోగాల కల్పనకు దారి తీయనుంది. ఇటీవల బోయింగ్, ఎయిర్బస్ మధ్య తాజా మెగా ఒప్పందం భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 140 విమానాల సముదాయాన్ని కలిగి ఉన్న ఎయిరిండియా, బోయింగ్ ఎయిర్బస్ నుంచి భారగా విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాలు నడిపేందుకు, క్రూ, ఇతర ప్రత్యక్ష పరోక్ష సిబ్బంది అవసరం కాబట్టి భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కల్పిను అవకాశం లభిస్తుందని అంచనా.నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్ కోసం మొత్తం ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దాదాపు 400. వైడ్ బాడీ ప్లేన్ కోసం, 600-700మంది అవసరమంని తెలుస్తోంది. "డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో నేరుగా విమానయాన సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఉంటారు, ఉదాహరణకు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బంది. ఇది నారో బాడీ విమానానికి దాదాపు 175. ఇంకా విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రావెల్ సేల్స్ ఏజెన్సీ, సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ కలిసి విమానానికి 400 ఉద్యోగులు అవసమరని ఏవియేషన్ రంగ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ బిజినెస్ టుడేతో చెప్పారు. ఈ విధంగా మొత్తంగా లెక్కిస్తే దాదాపు 2 లక్షల నుంచి 2 లక్షల 9వేల వరకు ఉంటాయని ఉద్యోగాలొస్తాయని ఆయన చెప్పారు. దీనికి తోడు ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఉద్యోగాలొస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఈ బిల్పై స్పందించారు. ఇది చారిత్రాత్మక ఒప్పందమనీ, అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కొనియాడారు. అంతేకాదు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు, ఎందుకంటే ఇది వారికి కీలకమైనది. -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్లైన్స్లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఎయిర్ ఇండియా.. జో బైడెన్ ప్రశంసలు
ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ 'బోయింగ్' నుండి ఏకంగా రెండు వందలకు పైగా విమానాలను కొనుగోలు చేయాలనే ఎయిర్ ఇండియా నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ 'జో బైడెన్' మంగళవారం ప్రశంసించారు. ఈ నిర్ణయంతో తమ దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన అమెరికా-ఇండియా ఆర్థిక భాగస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యం యొక్క బలాన్ని ప్రతిబింబిస్తుందని జో బైడెన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి భారత్ - అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాను ఎదురు చూస్తున్నట్లు కూడా తెలిపారు. ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 34 బిలియన్ అమెరికన్ డాలర్లకు 220 విమానాలను కొనుగోలు చేయనుంది. మొత్తం మీద ఇది టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్స్, బోయింగ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎయిర్ ఇండియా ఆర్డర్ డాలర్ విలువలో బోయింగ్కి మూడవ అతిపెద్ద విక్రయం మాత్రమే కాకుండా, విమానాల సంఖ్య పరంగా రెండవదిగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో భారత్ - అమెరికా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. -
బోయింగ్కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ప్లాంటులో తయారు చేసిన తొలి ’వర్టికల్ ఫిన్’ భాగాన్ని అమెరికాలోని బోయింగ్ విమానాల తయారీ కేంద్రానికి పంపించినట్లు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏ) వెల్లడించింది. దీన్ని అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న బోయింగ్ ప్లాంటుకు డెలివరీ చేస్తారు. అక్కడ బోయింగ్ 737 విమానానికి అమరుస్తారు. నిట్టనిలువుగా ఉండే వర్టికల్ ఫిన్ భాగాన్ని విమానానికి స్థిరత్వాన్నిచ్చేలా ఎయిర్క్రాఫ్ట్ తోకపై ఏర్పాటు చేస్తారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బోయింగ్ కలిసి టీబీఏను జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన వర్టి కల్ ఫిన్ భాగాల తయారీ కోసం టీబీఏ గతేడాదే కొత్త లైన్ను ప్రారంభించింది. 14,000 చ.మీ. విస్తీర్ణంలోని టీబీఏ ప్లాంటులో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్టర్లకు కావాల్సిన ఏరో–స్ట్రక్చర్స్ మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. (ఇదీ చదవండి: డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...) -
‘ఎయిరిండియా’కు 470 కొత్త విమానాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ నుంచి, అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్ కూడా ఇదే. ‘‘40 ఎయిర్బస్ ఏ350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777–9 విమానాలు, 210 ఎయిర్బస్ ఏ320/321 నియో విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కొంటున్నాం’’ అని ఎయిర్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి విమానం ఈ ఏడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని తెలియజేసింది. లీజుకు తీసుకున్న 11 బీ777, 25 ఏ320 విమానాల డెలివరీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేసింది. రెండు ఒప్పందాల విలువ ఏకంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) అని అంచనా! సుదీర్ఘ ప్రయాణాలకు వైడ్–బాడీ విమానాలు ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశామని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం చెప్పారు. ఎయిర్బస్ నుంచి 210 నారో–బాడీ విమానాలు, 40 వైడ్–బాడీ విమానాలు కొంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తదితరులు వర్చువల్గా పాల్గొన్న కార్యక్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడారు. ఎక్కువ సమయం(అల్ట్రా–లాంగ్ హాల్) సాగే ప్రయాణాల కోసం వైడ్–బాడీ విమానాలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని అల్ట్రా–లాంగ్ హాల్ ఫ్లైట్ అంటారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూప్ దక్కించుకోవడం తెలిసిందే. ఎయిర్ ఇండియా చివరిసారిగా 2005లో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో బోయింగ్ సంస్థ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. 2005లో ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు. ఒప్పందాల పట్ల ప్రధాని మోదీ హర్షం ఎయిర్బస్, బోయింగ్తో ఎయిరిండియా ఒప్పందాలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇవి మైలురాయి లాంటి ఒప్పందాలన్నారు. భారత్లో విమానయాన రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 15 ఏళ్లలో 2,000కు పైగా విమానాలు అవసరమని చెప్పారు. మన పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. దేశంలో గత ఎనిమిదేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 147కు చేరిందని గుర్తుచేశారు. ‘ఉడాన్’ పథకం కింద మారూమూల ప్రాంతాలను సైతం విమానాల ద్వారా అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరించబోతోందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఉక్రెయిన్–రష్యా సమస్యను పరిష్కరించే సత్తా మోదీ నాయకత్వంలోని భారత్కుందని ప్రశంసించారు. భారత జి–20 సారథ్యం విజయవంతం కావడానికి సహకరిస్తున్నామని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎయిరిండియా–బోయింగ్ ఒప్పందంతోపాటు పలు అంశాలపై నేతలు చర్చించుకున్నారని వెల్లడించింది. చరిత్రాత్మక ఒప్పందం: జో బైడెన్ 34 బిలియన్ డాలర్లతో బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా బైడెన్ అభివర్ణించారు. ‘‘అవసరాన్ని బట్టి మరో 70 విమానాలు కొనేలా ఒప్పందం కుదిరింది. అలా మొత్తం ఒప్పందం విలువ 45.9 బిలియన్ డాలర్లు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నాం’’ అన్నారు. వైట్హౌస్ ప్రకటన మేరకు బోయింగ్తో ఒప్పందంలో 50 బోయింగ్ 737మ్యాక్స్, 20 బోయింగ్ 787 ఫ్లైట్లు ఉన్నాయి. ఎయిరిండియా ఇచ్చిన ఆర్డర్ బోయింగ్ చరిత్రలో డాలర్ విలువలో మూడో అతిపెద్ద సేల్, విమానాల సంఖ్యలో రెండో అతి పెద్దది! కీలక ఘట్టం: రిషి లండన్: ఎయిరిండియాకు 250 కొత్త విమానాలు విక్రయించడానికి ‘ఎయిర్బస్–రోల్స్ రాయిస్’ ఒప్పందానికి రావడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హర్షం బెలిబుచ్చారు. బ్రిటన్ ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలక ఘట్టమన్నారు. ‘‘భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. బ్రిటన్లో విమానయాన రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దు అనేందుకు ఈ ఒప్పందమే తార్కాణం’’ అన్నారు. ఈ ఒప్పదంతో బ్రిటన్లోని వేల్స్, డెర్బీషైర్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఎగుమతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఎయిరిండియా కొనుగోలు చేసే 250 విమానాల తయారీ ప్రక్రియ చాలావరకు యూకేలోనే పూర్తి కానున్నట్లు తెలియజేసింది. -
భారత్లో బోయింగ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ భారత్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్ సపోర్ట్ సెంటర్ (జీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్లైన్ కస్టమర్లు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలు, ఇతరత్రా పరిశ్రమ వర్గాలకు నిర్వహణపరమైన సామర్థ్యాలు.. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన సేవలను జీఎస్సీ అందిస్తుంది. జీఎస్సీ, లాజిస్టిక్స్ కేంద్రంపై ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం సంస్థ వెల్లడించలేదు. దేశీ విమానయాన సంస్థలు 150 పైచిలుకు బోయింగ్ విమానాలను నడుపుతున్నాయి. తమ రిపేర్ డెవలప్మెంట్ అండ్ సస్టెయిన్మెంట్ హబ్ ప్రోగ్రాం ద్వారా బోయింగ్ ప్రస్తుతం స్థానిక కస్టమర్లకు వివిధ సర్వీసులను అందిస్తోంది. దేశీయంగా విమాన ప్రయాణాలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో వినూత్న అవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు, ఏవియేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. -
ఎయిరిండియా విస్తరణ ప్లాన్స్, చర్చనీయాంశంగా టాటా భారీ డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. దాదాపు 250 విమానాల కోసం ఎయిర్బస్తో ఒప్పందం ఖరారైందని త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. అలాగే ఇప్పటికే సుమారు 200 విమానాల కోసం బోయింగ్తో ఎయిర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. వచ్చేవారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. కొత్త విమానాల కోసం ఎయిర్లైన్ చారిత్రాత్మక ఆర్డర్ను ఖరారు చేయనున్నట్టు ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్ ఇటీవల (జనవరి 27న) వ్యాఖ్యానించారు. దీంతో కొనుగోలు వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాన కాని నేపథ్యంలోఎయిరిండియా అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా 16 సంవత్సరాల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా. -
Layoffs: ఏవియేషన్ దిగ్గజం ఉద్యోగాల కోత; టీసీఎస్లో ఆ ఉద్యోగులకు ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు సమా పలు కంపెనీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కూడా వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది ఫైనాన్స్, హెచ్ఆర్ వర్టికల్స్లో 2,000 ఉద్యోగాలను తొలగించనుంది. వీరిలో ఎక్కువగా టీసీఎస్ అవుట్ సోర్స్ ద్యోగులు ప్రభావితం కానున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తం 5,800 కంపెనీల నుండి ఫైనాన్స్లో దాదాపు 1,500, హెచ్ఆర్లో 400 ఉద్యోగులను తొలగించనుంది. ఫైనాన్స్ , హెచ్ఆర్ సపోర్ట్ సేవలను తగ్గించిన నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బోయింగ్లో కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ మైక్ ఫ్రైడ్మాన్ ఉటంకిస్తూ సీటెల్ టైమ్స్ నివేదించింది. అయితే కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టీసీఎస్కి అవుట్సోర్స్ చేసిందని మీడియా నివేదించింది. ఇండియాలో బోయింగ్లో ఇప్పుడుదాదాపు 3,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే టీసీఎస్ సహా ఇతర సంస్థలకు సంబంధించి మరో 7వేల మంది ఉద్యోగులున్నారు. కాగా రానున్న కాలంలో వ్యయాలను తగ్గించుకునే క్రమంలో మరింత మందిని తొలగించాలని బోయింగ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షలను సిద్ధం చేయడానికి మేనేజర్లను కోరింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైన సిబ్బందిలో 10 శాతం మందిని వర్గీకరించాలని కోరింది. -
ఎయిర్ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్ విమానాలకు ఆర్డర్?
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా..అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించలేదు. కాగా, అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement