-
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారేరీ?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. వారి తరువాత జైపాల్రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారు. కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదు. ఫుల్టైం బిజినెస్లు చేసేవాళ్లు రాజకీయాల్లోకి పార్ట్టైంగా రావడమే ఇందుకు కారణం కావొచ్చు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు’అని సీఎం పేర్కొన్నారు. మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు రచించిన ‘గవర్నర్పేట్ టు గవర్నర్స్ హౌస్’పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి అంశాల గురించి పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడేందుకు, విజ్ఞప్తి చేసేందుకు ఎవరూ కనపించని పరిస్థితి నెలకొందన్నారు. దేశ పరిపాలనలో మన పాత్ర ఉండాలి.. ‘జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నట్లుగానే దేశ పరిపాలనలో, నిర్ణయాల్లో మన పాత్ర ఉండాలి. గతంలో ప్రధాని పదవి ఉత్తరాది వారికి ఇస్తే రాష్ట్రపతి దక్షిణాది నుంచి అయ్యేవారు. ఇక్కడి వారు ప్రధాని అయితే ఉత్తరాది నేతకు రాష్ట్రపతి అవకాశం దక్కింది. అలాగే కేంద్ర కేబినేట్లోనూ గతంలో కనీసం ముగ్గురు కీలక మంత్రులు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి కారణాలు విశ్లేషించి ఏం చర్యలు తీసుకోవాలన్నది అనుభవజు్ఞలైన రిటైర్డ్ అధికారులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సూచించాలి. విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జాతీయ స్థాయిలో మన ప్రాభవం చాటేలా మళ్లీ మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కీలక అంశాలతో మాజీ గవర్నర్ రామ్మోహన్రావు రాసిన పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా మారుతుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కీలక పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించా: రామ్మోహన్రావు తాను రచించిన పుస్తకం ఎన్నో వెలుగులోకి రాని చారిత్రక అంశాలకు వేదికగా నిలుస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మెహన్రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలక పరిణామాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి రంగయ్య నాయుడు ఐపీఎస్ అధికారిగా, రాజకీయనాయకుడిగా తన అనుభవాలు, నాటి పరిస్థితులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు దారులు.. చరిత్రకు సాక్ష్యాలు
సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని లండన్లో ఆవిష్కరించుకున్నారు ప్రవాసాంధ్రులు. లండన్లో డాక్టర్ ప్రదీప్ చింతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ అవుతాల, షాన్ పద్మనాభన్, శ్రీనివాసన్ జనార్థన్, విజయ్ పెండేకంటి తదితరులు పాల్గొన్నారు. నేటి తరానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఎన్నో అంశాలను, రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ఘటనలను దేవులపల్లి అమర్ పుస్తకం ద్వారా లైవ్లో ఉంచారని డాక్టర్ ప్రదీప్ చింతా అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు ఎపిసోడ్, వైస్రాయ్ వేదికగా చంద్రబాబు చేసిన పనులను రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి రూపొందించిన ఈ పుస్తకం.. భావి తరాలకు ఓ గైడ్గా ఉంటుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు తెలిపారు. ఈ పుస్తకం ద్వారా ఎన్నో వాస్తవాలు.. పూర్తి ఆధారాలతో వెలుగులోకి వచ్చినట్టయిందని తెలిపారు. ఈ ప్రయత్నం చేసిన దేవులపల్లి అమర్ను ప్రశంసించారు. -
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు.. పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్గా, రిఫరెన్స్ మెటీరియల్గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం సభా మందిరంలో బుధవారం నిర్వహించిన "మూడు దారులు" పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృషిని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబీ వర్ధన్ సభకు అధ్యక్షత వహించగా, లీడర్ దిన పత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారని ప్రశంసించారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ వైఎస్ ఆర్ విద్యా విషయాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టేవారనీ, పాలనా వ్యవహారాలలో తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారని పేర్కొన్నారు. రాజకీయాలలో నైతిక విలువలకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. మూడు దారులు పుస్తకంలో రచయిత ప్రత్యేకంగా ప్రస్తావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్మోహన రెడ్డి గురించి పుస్తకం చదివిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో తానే స్వయంగా రాండమ్ శాంపిల్ సర్వే చేశానని ఆయన వివరిస్తూ.. వైఎస్ఆర్ కు 87 శాతం, చంద్రబాబు కు 49.5 శాతం, జగన్ కు 78.5 శాతం జనం మద్దతుగా మాట్లాడారని పేర్కొన్నారు. మూడు దారులు పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పుస్తకాన్ని సమగ్రంగా సమీక్ష చేసిన లీడర్ దిన పత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించేందుకు జరిపిన వైస్రాయ్ ఉదంతాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో ఆ కుట్రను పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని, ఈ పుస్తకం ద్వారా అమర్ నెరవేర్చారన్నారు. పుస్తకంలో ముగ్గురు ముఖ్యమంత్రులను కథా వస్తువుగా అమర్ తీసుకున్నారని, అయితే నాలుగో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తారని తెలిపారు. అధికారం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ని వెన్నుపోటుకు సైతం వెనుకాడని సంఘటన పుస్తకంలో సాక్షాత్కరిస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ ఎలా క్షోభించింది, అడ్డదారిలో చంద్రబాబు పాలన ఎలా కైవసం చేసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు. ఈ ఆధారాలతో అమర్ రాయడం విశేషమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. చరిత్రలో వాస్తవిక దృష్టితో రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏయూ జర్నలిజం శాఖ విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబివర్ధన్ మాట్లాడుతూ.. పాత్రికేయులు అమర్ రాసిన మూడు రహదారుల పుస్తకంపై పి.హెచ్.డి చేయవచ్చన్నారు. సాధారణంగా చరిత్రలను, జీవిత కథలను రాస్తూ ఉంటారని, అందుకు భిన్నంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనా చరిత్రను తొలిసారిగా రాసి అమర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశోధనాత్మక జర్నలిజం ప్రాంతీయ భాషలోనే చేయవచ్చని, అందుకు ఉదాహరణ ఈ పుస్తకమే అన్నారు. పాత్రికేయ ప్రముఖులు మంగు రాజగోపాల్ ఆత్మీయ ప్రసంగం చేస్తూ జర్నలిస్టులలో రాసే జర్నలిస్టు అక్షర బాహుబలి అమర్ అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సమాజంలోని రాజకీయ పరిణామాలకు అప్డేట్ అవ్వాలని, వారిలో అమర్ ముందుంటారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి అమర్ ఈ పుస్తకం రాశారని తెలిపారు. పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ.. దక్షిణాది వారిని ఉత్తరాది వారు పట్టించుకోరని, మద్రాసీయూలుగా పిలిచే తెలుగువారిని ఆంధ్రులుగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, 1983 వరకు ఓకే పార్టీలో కలిసి ప్రయాణించారని తెలిపారు. 83లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చానని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదన్నారు. అనంతరం, రచయిత అమర్ ను అతిథులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు బిఎస్ రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది. -
వాటి గురించి ఆలోచించడం మానేశా
‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు. -
రాహుల్పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్ మై ఫాదర్..ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్ను షర్మిష్ట లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్,రాహుల్గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు. ‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీని 2013 సెప్టెంబర్లో ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్కు చెప్పింది నేనే. రాహుల్ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి రాహుల్ అలా ఆర్డినెన్స్ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్ చర్యను వ్యతిరేకించారు. రాహుల్ ప్రభుత్వ క్యాబినెట్లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్ను చింపివేయడానికి అని ప్రణబ్ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్పై కేసు -
Huma Qureshi: అయిదు పడవల ప్రయాణం
రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్హీరో’ పుస్తకంతో రైటర్గా మారింది. రైటర్గా తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
‘తెలంగాణ ఎడిషన్ 50 ఇన్స్పైరింగ్ ఉమెన్’ పుస్తకం ఆవిష్కరణ
-
ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, జస్టిస్ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి.వైఎస్సార్తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకం గా పనిచేసారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే.. అవే విధానాలను జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు. చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి -
పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ
పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు. సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు. -
బ్రేలి లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం
-
కథలన్నీ సలీమ్వి... సంభాషణలు నావి
(జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి): బాలీవుడ్ స్టార్ రచయితలు సలీమ్ జావేద్ విడిపోయి ఇంతకాలం అయినా వారు ఇరువురూ ఏనాడూ తాము పని విభజన ఎలా చేసుకున్నారో చెప్పలేదు. ఎన్ని ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న వేసినా సమాధానం దాట వేసేవారు. కాని జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం తన పుస్తకం ‘టాకింగ్ లైఫ్’ విడుదల సందర్భంగా జావేద్ మాట్లాడుతూ ‘మేమిద్దరం (సలీం జావేద్) రాసిన సినిమాలన్నింటిలో ప్రతి కథా సలీం నుంచి వచ్చేది. సంభాషణలు నేను రాసేవాణ్ణి. స్క్రీన్ ప్లే ఇద్దరం సమకూర్చేవాళ్లం’ అని తేటతెల్లం చేశాడు. ఈ ఇద్దరి జంట రచనలో జంజీర్, యాదోంకి బారాత్, డాన్, షోలే, దీవార్, శక్తి వంటి సూపర్హిట్ బాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రచయితలకు సినిమా రంగంలో స్టార్డమ్ తెచ్చిన జోడి వీరు. ‘మేమిద్దరం అనుకోకుండా కలిశాం. దర్శకుడు రమేష్ సిప్పి వాళ్ల నాన్న దగ్గర నెలకు 750 రూపాయల జీతానికి చేరాం. రాజేష్ ఖన్నా హీరోగా అందాజ్, హాతీ మేరి సాథి రాయడంతో స్థిరపడ్డాం’ అన్నాడాయన. బాలీవుడ్లో యాంగ్రీ యంగ్మేన్ ఇమేజ్ను హీరోకు సృష్టించిన ఈ జంట అనిల్ కపూర్ హీరోగా ‘మిస్టర్ ఇండియా’ (1987) రాశాక విడిపోయారు. (క్లిక్ చేయండి: అవకాశాలు ఇప్పిస్తాం, కోరికలు తీర్చమని అడిగారు) -
'మట్టి మనిషి' ఫిల్మ్ ప్రివ్యూ బాగుంది: నటుడు హర్షవర్దన్
నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన ‘కవితా చిత్రమ్’ పుస్తకావిష్కరణ, బాసంగి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మట్టి మనిషి’ ఫిల్మ్ ప్రివ్యూ రామనాయుడు స్టూడియోస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథి గా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ, మట్టి మనిషి ఫిల్మ్ ప్రివ్యూలో నటుడు, రచయిత హర్షవర్ధన్ చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి ఒక శాస్త్రజ్ఞుడని , నిరుత్సాహపడుతున్న రైతులకు ఆయన స్పూర్తి అని కొనియాడాడు. ‘వెంకటరెడ్డి స్ఫూర్తితో తీసిన ‘మట్టి మనిషి’ డెమో ఫిల్మ్ బాగుంది. ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ..సాగుచేస్తున్న నేలలో నిస్సారవంతమైన భూమిని సారవంతం చేయడమే నా ప్రక్రియ . ఇది 2004 లో పేటెంట్ చేయబడింది. ఒక రైతు గా నేను చేసినవే పేటెంట్ కోసం రాశాను. వాటిని వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి యదాతధంగా ఆమోదించారు. దీని గురించి ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ లో ప్రస్తావించడం జరిగింది.’ అన్నారు ఈ కార్యక్రమంలో షేడ్స్ స్టూడియో సి.ఇ.ఓ దేవీ ప్రసాద్, బాసంగి సురేష్, చిత్రకారుడు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకులు, ఎస్ ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీ చరణ్, మధుసూదన రావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి దర్శకుడు విరాజ్ వర్మ, నటులు నవీన్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పౌర హక్కుల కోసం పోరాడిన కన్నభిరాన్
లక్డీకాపూల్: పౌర హక్కుల కోసం చివరి వరకు పోరాడిన శక్తి కేజీ కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. ’వీక్షణం’ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అక్షరీకరించిన కేజీ కన్నభిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను కల్పనా కన్నభిరాన్ ఆంగ్లంలో అనువదించగా.. ‘ది స్పీకింగ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కాలిన్స్’ ప్రచురించింది. శనివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఆవిష్కరించారు. సభలో ఇంగ్లిష్ పుస్తక అనువాదకర్త, ఎడిటర్ కల్పన, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లా డారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. -
ఆర్థిక నేరాలపై ఎస్హెచ్వోలకు అవగాహన ఉండాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరాలపై పోలీసు స్టేషన్ అధికారులకు(ఎస్హెచ్వో)లకు అవగాహన ఉండా లని రాష్ట్ర డీజీపీ పి.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక నేరాలు అరుదుగా జరిగేవని, వాటిని సీసీఎస్ లేదా సీఐడీకి బదిలీ చేసేవాళ్లమని, మారిన పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు అధికమైనందున వాటి దర్యాప్తు బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. గురువారం మాసబ్ట్యాంక్లోని పోలీసు ఆఫీ సర్స్ మెస్లో ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) డీజీ ఉమేష్ష్రాఫ్ రచించిన ‘ఎకనామిక్ అఫెన్సెస్–హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ను డీజీపీ ఆవిష్కరించారు. అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమ్రంలో డీజీపీ మాట్లాడుతూ..యువ పోలీస్ అధికారులకు మార్గ దర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతీ సీనియర్ పోలీస్ అధికారి తమ అనుభవాలతో రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన నేరాలు అధికమయ్యాయన్నారు. ఉమేష్ ష్రాఫ్ రచించిన పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. మాజీగవర్నర్, రిటైర్డ్ డీజీ పి.ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆర్థికపరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుంచే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఉమేష్ ష్రాఫ్ రాసిన మరో పుస్తకం క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ పరిచయ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్ రావు, సాంబశివరావు, ఉమేష్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డిలతోపాటు అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, అంజనీకుమార్, శివధర్రెడ్డి, రాజీవ్ రతన్, సంజయ్ జైన్, విజయ్ కుమర్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలహాసన్ రెడ్డి హాజరయ్యారు. -
సాహితీ లోకానికి ఇది ఓ కరదీపిక
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు, అధ్యాపకులకు, సాహిత్యలోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ ఓ కరదీపికగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ గ్రంథం అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్య అధ్యయనానికి దోహదం చేస్తుందన్నారు. తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో కలిసి మంగళవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో 50 మంది రచయితలు పూర్వయుగం తొలిపాలకులు, వేములవాడ చాళుక్యులు నుంచి మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు నిక్షిప్తం చేశారని పేర్కొన్నారు. గోనబుద్దారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, పోతన, భాస్కర రామాయణ కవులు, మారన, గౌరన, గోపరాజు ఇంకా ఆనాటి సంప్రదాయ కవిత్వ పంక్తిలో తెలంగాణది సింహభాగమని వివరించారు. గౌరీశంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న ప్రస్తుత బృహత్ గ్రంథం ‘‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ, గ్రూప్–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, కాళోజీ పురస్కార అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జర్నలిస్ట్ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్ డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెహాన ప్రయత్నాన్ని సీఎం జగన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. రచయిత, జర్నలిస్ట్ విజయార్కె రాసిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరువేసుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి పాల్గొన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
దివంగత సీఎం వైఎస్ది గోల్డెన్ పీరియడ్: చాడ
హుస్నాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం గోల్డెన్ పీరియడ్ అని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. వైఎస్ కాలంలో తాను సీపీఐ శాసన సభాపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ఎక్కువ అవకాశం కలిగిందని, స్ఫూర్తిదాయక చర్చ జరిగేదని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం చాడ వెంకట్రెడ్డి రచించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం.. శాసనసభ ప్రసంగాలు’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హుస్నాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించానన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్లో జరిగిన లాకప్డెత్పై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. వైఎస్ మానవత్వం ఉన్న నాయకుడని, ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు పార్టీ వేరైనా పరిష్కరించేవారన్నారు. నాటి ప్రతిపక్షాలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారని నేడు అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనే పరిస్ధితి వచ్చిందని, ఇప్పుడు ప్రజాస్వామ్యం అమ్ముడుపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్చైర్మన్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ నియంతృత్వాన్ని ఉద్యమంలా తీసుకెళ్తోంది
సుందరయ్య విజ్ఞానకేంద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వాన్ని కూడా ప్రత్యేక ఉద్యమంలా తీసుకువెళ్తోందని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ ఆరోపించారు. మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు కె.బాలగోపాల్ 13వ స్మారకోపన్యాసాన్ని ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వేదిక కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, సుధ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అరుంధతీరాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు నియంతృత్వ వి«ధానాలకు కులమతాలను జోడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పరోక్ష భాగస్వామి కావడం వల్లే 8ఏళ్లలోనే అదానీ 8 బిలియన్ డాలర్లనుంచి 139 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగాడన్నారు. భవిష్యత్లో ఇదే వరుసలో అమిత్షా కుమారుడు కూడా రానున్నాడని చెప్పారు. అదానీని ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా ఫోకస్ చేయడం కోసమే 2014లో మోదీ.. అదానీ విమానంలో వచ్చి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీఎండబ్ల్యూకి, ఎడ్లబండికి పోటీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. సామాజిక, విప్లవ శక్తులు మరింత ఎక్కువగా ప్రజల మధ్య పనిచేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మహిళలను మరింత అణచివేసేందుకే హిజాబ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిఫ్టన్ డి రాజోరియో మాట్లాడుతూ... మోదీ ఫాసిజానికి ఫేస్లాంటి వాడన్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశంలో కార్మికుల హక్కులు మరింతగా అణచివేతకు గురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో పీయూసీఎల్ నాయకులు నిహిర్ దేశాయ్, హెచ్ఆర్ఎఫ్ నాయకులు జహా ఆరా, మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జీవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్ రచించిన ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ అనే పుస్తకాన్ని అరుంధతీరాయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
అల్లూరి రామలింగయ్య 100వ జయంతి వేడుకలు.. బుక్ లాంఛ్ కార్యక్రమం( ఫోటోలు)
-
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
భారత రాజకీయాల్లో వైఎస్సార్ గొప్ప నేత
సాక్షి, హైదరాబాద్: ఆధునిక భారత రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ కొనియాడారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు చాలా చరిత్ర ఉందని, కానీ వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రచించిన ‘జలయజ్ఞం–పోలవరం.. ఒక సాహసి ప్రయాణం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్ 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రధానమంత్రి మాజీ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు సంజయ్ బారుకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో జైరాం రమేశ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి మూలకు నీరందించే లక్ష్యంతో పని చేశారని రమేశ్ చెప్పారు. ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, విద్య, సాగునీటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టారని తెలిపారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ ఖ్యాతిలో సింహభాగం వైఎస్కే దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓట్ల పండుగ మాత్రమే కాదని, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయడమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ప్రజాస్వామ్యం మిగులుతుందో లేదో అర్థం కావడంలేదని అన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఆర్కిటెక్ట్ వైఎస్సార్ అని సంజయ్ బారు అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. ఎమెస్కో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేవీపీతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్రెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, కొణతాల రామకృష్ణ, గీతారెడ్డి, కాంగ్రెస్ నేత కొప్పుల రాజుతోపాటు పలువురు మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సాధించిన తెలంగాణ దేశంలో నంబర్వన్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎవరితోనూ సాధ్యం కాని తెలంగాణను సాధించి, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న నేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె.తారకరామారావు అన్నారు. నంది అవార్డు సాధించిన రచయిత, సినీ దర్శకుడు మనోహర్ చిమ్మని రచించిన ‘కేసీఆర్–ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’పుస్తకాన్ని ప్రగతిభవన్లో కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల ప్రజల స్వప్నం తెలంగాణను కేసీఆర్ సాకారం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డ్ టైంలో నిర్మించడంతో పాటు కనీవినీ ఎరుగని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంత చేస్తున్నా కేసీఆర్ను కొందరు దూషిస్తున్నారని, అనరాని మాటలంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సమయంలో మనోహర్ చిమ్మని లాంటి రచయిత శ్రమించి కేసీఆర్ మీద ఒక మంచి పుస్తకం తీసుకురావడం నిజంగా హర్షణీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్రెడ్డి బైరి పాల్గొన్నారు. -
ఆహార తయారీలో పవిత్ర యజ్ఞమే వ్యవసాయం
సాక్షి, హైదరాబాద్: మట్టి నుంచి మనుగడకు ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేసే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. ఈ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న రైతుల పట్ల ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు పక్షపాతం చూపించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో రైతునేస్తం పబ్లికేషన్ ప్రచురించిన ‘ప్రకృతి సైన్యం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన వంద మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని, ప్రచురణ కర్త యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రచయిత డి.ప్రసాద్లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆంగ్లేయుల పాలనలో భారతీయ సంస్కృతి, సంప్ర దాయాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొందని, స్వరాజ్య సాధన తర్వాత మన అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడంలో పర్యావరణాన్ని అశ్రద్ధ చేశామన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపడం సంతోషకరమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చని, ఈ పద్ధతిలో ఏ వస్తువును బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చేందుకు చిత్తశుద్ధితో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. పార్లమెంట్, పార్టీలు, ప్రణాళికా సంఘాలు, నీతి ఆయోగ్, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నీ వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. యువత కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నార్మ్ సంచాలకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బాలు చిరస్మరణీయుడు
బంజారాహిల్స్: పాటల కార్యక్రమాల నిర్వహణ వెనుక పిల్లలను గాయకులుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు సినీగాయకుడు బాలసుబ్రమణ్యం పడిన తపన కనిపి స్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాసం సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ రచించిన ‘జీవనగానం’ గ్రంథాన్ని జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో శుక్రవారం ఆవిష్కరించారు. సంజయ్కిశోర్ రూపొందించిన బాలు జీవన చిత్రం డాక్యుమెంటరీని, సినీనటుడు కమల్ హాసన్, హాసం సంస్థ, శాంతాబయోటెక్ సంస్థ ఫౌండర్ వరప్రసాద్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లా డుతూ.. బాలు స్ఫూర్తితో మన భాష, సంస్కృతి, కళలను భావితరాలకు సగర్వం గా అందించేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఆలయ సుప్రభాత నివేద నల్లో, తెలుగు ప్రజల జీవితాల్లోనూ బాలు చిరస్మరణీయుడని కొనియాడారు. బాలు జీవితం గురించి ముందు తరాలు తెలుసుకోవాలన్న తపనతో పుస్తకాన్ని తీసుకొచ్చిన పుస్తక రచయిత డా‘‘పి.ఎస్.గోపాలకృష్ణ, చిత్ర రూపకర్త సంజయ్ కిశోర్, ప్రచురణకర్త డా.వర ప్రసాద్ రెడ్డిలను, హాసం సంస్థను ఆయన అభినందించారు. పుస్తకాన్ని ఆవిష్కరించడం, వారికి ఆత్మీయులైన కమల్ హాసన్కి తొలిప్రతిని అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ తమ ఇద్దరి ఆత్మ ఒకటేనన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement