-
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
సాక్షి, విజయవాడ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీ లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తోందని అన్నారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ అయినా,ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్సార్సీపీ శాశ్వతమని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని అన్నారు. ఐప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవని అన్నారు. ఐప్యాక్ ఓ జాబితా ఇస్తుందని,అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని స్పష్టం చేశారు.‘ఎన్నికలు పూర్తయ్యాయి... భవితవ్యం బ్యాలట్ బాక్సులలో ఉన్నాయి. మేం గెలుస్తామని.. జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పాం. ఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం. ప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారు. రాష్ట్ర విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నోకీలక మార్పులు తెచ్చాం. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు. మాపై బురద జల్లుతున్నారు. విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన. మా విధానాలు నచ్షే పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు.ప్రదాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?. చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి. చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు లోకేష్ విదేశాలికు వెళ్లారు. రాష్ట్ర ప్రజలని సంయమనం పాటించాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిభయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే. ఎందుకు హర్రీ అండ్ వర్రీ. చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటి?. ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?. సీఎం జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి? వైఎస్ జగన్ అడ్డుకోవాలని మెసేజ్లు పెట్టడం.. డిబేట్లు ఏంటి? ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు.తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినాా చెప్పారా?. తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేకపోయారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు సీఎం రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు. నా తప్పులని దిద్దుకుంటానని అదికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా?చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం. మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది. గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం, వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలికు కావాల్సిన విధానాలని, సంస్కరణలనే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. అందుకే సీఎం వైఎస్ జగన్కు మళ్లీ పట్టం కట్టారని మేం భావిస్తున్నాం.’ అని బొ త్స పేర్కొన్నారు. -
టీడీపీపై బొత్స సెటైర్లు
-
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
-
పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి
-
అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీసు అధికారి ఏక పక్ష నిర్ణయంపై గవర్నర్ను కలిసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని అన్నారు.తొందరపాటు నియమకాల వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స పేర్కొన్నారు అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా తమపై నిందలు వేయడం సరికాదని అన్నారు. హింసాకాండకు వైఎస్సార్సీపీ పూర్తి వ్యతిరేకమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు.చదవండి: ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలుమళ్లీ అధికారంలో వచ్చేది తామనేనని అన్నారు బొత్స సత్యనారాయణ. 175 సీట్లకు దగ్గరగా గెలవబోతున్నామని చెప్పారు. జూన్ 9న విశాఖలోనే సీఎంగా వైఎస్ జగన్మోమన్రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. ‘టీడీపీ ఫలితాల పై ఢీలా పడింది.. అందుకే మహానాడు వాయిదా వేసుకున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న సంఘటనలను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నం చేయొద్దు. పోలీసులు కూడా న్యాయ బద్దంగా వ్యవహరించండి. రాజకీయ పార్టీలు హింసను ప్రోత్సహించవద్దు. వైయస్సార్ సీపీ అలాంటి హింసలు ప్రోత్సహించదు. నిన్న విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ ఘటనను రాజకీయం చేస్తున్నారుత్వరలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభిస్తున్న దశలో విశాఖ ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ ప్రశాంతతను కాపాడాలని కోరుకుంటున్నా. .రాజకీయ నాయకునిగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మా పార్టీ సీట్లు అవసరం వుండేలా కేంద్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నా. ఉత్తరాంధ్ర లో 34 సీట్లు వస్తాయి. ప్రజా తీర్పు ఆధారంగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని కోర్టును కూడా కోరుతాo’ అని పేర్కొన్నారు. -
బాబుది మేకపోతు గంభీర్యం..YSRCPదే విజయం..
-
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారన్నారు.ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాలవారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్ ఎన్టీఆర్, వైఎస్సార్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి.’’ మంత్రి బొత్స చెప్పారు.‘‘మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి.. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. -
విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీ, హామీల అమలు ముఖ్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి ప్రమాణాలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీని విజయం వైపు తీసుకెళ్తోందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్కే ఉందని, వారంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి మహిళా మళీ సీఎంగా వైఎస్ జగన్ కావాలని కోరుకుంటున్నారన్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వృద్ధులకు ఇంటికే పింఛన్ అందుతుందని, అవినీతి లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాల ఆర్థిక సహాయం అందుతుందని భావించి ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు అధికార దాహంతో అనేక రకాల కుయుక్తులకు పాల్పడ్డాడని, స్థాయికి తగని తప్పుడు భాష వాడారని తెలిపారు. వ్యక్తిగతంగా కుటుంబంపై దూషణలు చేశాడన్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన దౌర్భగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కుటిల యత్నాలు చేశాడని తెలిపారు. చివరికి పోలింగ్ రోజు కూడా వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయించాడన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చంద్రబాబు ఓటమి ఖాయమైందని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. ఫలితాలు వచ్చే వరకూ చాలా విధాలుగా వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా టీడీపీ వారితో మాట్లాడిస్తాడని, ఎవరూ ఉద్రిక్తతకు లోనుకాకుండా సంయమనం పాటించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించబోహని కరాఖండిగా చెప్పారు. ఓటర్లలో చైతన్యం చూశాం: బొత్స ఝాన్సీ వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గత 35 రోజులుగా ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, జగనన్న అభిమానులు, విశాఖ ప్రజలు, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం జరిగిన పోలింగ్లో మహిళా ఓటర్లలో చైతన్యం చూశామని, ఉదయం నుంచే మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారని చెప్పారు. గత ఎన్నికలకంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనడానికి ఇది సూచిక అని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కూడా పాల్గొన్నారు. -
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
విశాఖ సిటీ: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని తేలిపోవడంతో పోలింగ్కు ముందు రోజు చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టించారు. బొత్స లెటర్ హెడ్పైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాస్తున్నట్లుగా లేఖను తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. ఈ కుతంత్రంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్కు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.రోజుకో కుట్ర..ఓటమి ముంగిట నిలిచిన చంద్రబాబు రోజుకో కుట్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ, నిర్ణయంలో లేని వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. భూ యజమానులకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించారు. -
లోకేష్ కు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
-
పేదల బతుకులతో ఆడుకుంటున్న టీడీపీకి ఓటేయ్యాలా?: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: పేదవాళ్ల బతుకులతో ఆటలాడుతున్న కూటమికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదల పట్ల చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నీచమైన ఆలోచనలతో ఈసీకి ఫిర్యాదు చేశారని ధ్వజమెత్తారు.‘‘చంద్రబాబు కూటమికి అవ్వాతాతల ఉసురు తగులుతుంది. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ అందకుండా చేశారు. ఈబీసీ నేస్తం, విద్యా దీవెన డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఓటమి భయంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. ఈసీ నిర్ణయం ధర్మం కాదు.. మేము వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ధర్మమా?’’ అంటూ మంత్రి బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.‘‘మీ భూమి మీది కాదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రామోజీ రావుకి ప్రజల పట్ల బాధ్యత లేదా?. డబ్బులు ఇస్తే గడ్డి కరుస్తారా? ఈనాడు ప్రకటనలో ఏ మాత్రమైనా వాస్తవం ఉందా?. ఈ 40 ఏళ్ల ఇంత దరిద్రమైన రాజకీయాలు చూడలేదు.’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. -
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. బొత్స మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తోడు దొంగ అయిన చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే సోమవారం సభల్లో చదివారని చెప్పారు. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మోదీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా! అని అన్నారు. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. పోలవరంపై విచారణ చేసుకోండి పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే ప్రధాని నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాధారపూరితంగా మాట్లాడకూడదని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా పూర్తవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పునరావాసం సొమ్మును ఫ్రీజ్ చేశారని షెకావత్ చెప్పారన్నారు. అప్పట్లో చూపిన లబ్దిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్దిదారులు ఆరోపిస్తున్నారని అన్నారు. నిర్వాసితులకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబు తప్పులను కూడా తాము సరిచేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి కార్యక్రమమని బీజేపీ వాళ్లు చెప్తుంటే.. చంద్రబాబు, పవన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేలా మాట్లాడుతున్నారన్నారు. వాళ్లిద్దరికీ సుద్దులు చెప్పాల్సిన మోదీ.. తమకు చెప్తున్నారని మండిపడ్డారు.నీచంగా మానవత్వం లేకుండా కూటమి చర్యలుటీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డుతూ నీచంగా, మానవత్వం లేకుండా పేదల కడుపు కొడుతున్నాయని బొత్స ధ్వజమెత్తారు. వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకొని, రెండు నెలల్లో 40 మంది అవ్వా తాతలను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. సుమారు 79 లక్షల మంది లబ్దిదారులున్న వైఎస్సార్ ఆసరా పథకంలో చివరి విడతలో ఇంకా రూ.1,839 కోట్లు చెల్లించకుండా అడ్డుకొన్నారని చెప్పారు. విద్యాదీవెన పథకంలో కూడా 28 లక్షల మంది లబి్ధదారులకు రూ.703 కోట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు. తుపాను, కరవు వల్ల నష్టపోయిన 13.60 లక్షల మంది రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ రూ.1,294.58 కోట్లు బ్యాంకుల్లో ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద 33 లక్షల మందికి రూ.565 కోట్లు విడుదల చేయడానికీ ఒప్పుకోలేదన్నారు. ఈబీసీ నేస్తం కింద 4.20 లక్షల మందికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇవన్నీ అమలులో ఉన్న పథకాలే అని, సాధారణంగా జరగాల్సినవేనని, అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరామని, అయినా అనుమతివ్వలేదని చెప్పారు. 2019లో పసుపు కుంకుమ కార్యక్రమం ఎన్నికల నోటిఫికేషన్ తరవాత ఇచ్చారని, తాము దానికి అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. దీనికి తోడు సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా! అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. తమకూ అలాంటి మాటలు వచ్చని, అయితే తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని చెప్పారు. ప్రజలు 15 రోజులు ఓపిక పడితే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని అన్నారు.ఈసీ వాస్తవాలు పరిశీలించాలి.. కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతూ ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం సరికాదని అన్నారు. ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఈసీ విజ్ఞతతో వాస్తవాలు పరిశీలించాలని కోరారు. కూటమి ఫిర్యాదు వల్ల వ్యక్తులకు, వ్యవస్థకు నష్టమా అనేది ఆలోచించకుండా వృద్ధుల చావుకు కారణం అవ్వడం భావ్యమా అని అన్నారు. చంద్రబాబు నీచమైన భాషపై ఈసీ తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులకు జరిగే నష్టానికి, ఫీజులందక విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కార్యక్రమాలకు ఈసీ ఓకే చెప్పిందన్నారు. అందుకే నిన్న సీఎం వైఎస్ జగన్ సజావుగా ఎన్నికలు జరుగుతాయా! అన్న అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. -
చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన..ఎన్నికలు అయిన వెంటనే..లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబుది మనిషి పుట్టుకేనా? ఆయన పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. ఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలనిసూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరని ప్రశ్నించారు. రియింబర్స్మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరని నిలదీశారు. వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలని తెలిపారు. పింఛను లబ్ధిదారులు వారికి కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టాలని, 15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. భవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్సనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రైల్వేజోన్పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ, టీడపీ, జనసేన తోడు దొంగలు ఎద్దేవా చేశారు. ఒకరు తానా అంటే ఇంకొకరు తందనా అంటున్నారని సెటైర్లు వేశారు. ప్రధాని మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదని అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి..దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదని అన్నారు మంత్రి బొత్స. తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోడీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో వస్తుందని చురకలంటించారు. కేంద్రంలో తమ పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని అన్నారు. -
ప్రజలను భయాందోళనలకు గురిచేయడం పెద్ద నేరం
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా కథనాలు రాయడం పాపం, పెద్ద నేరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు, పవన్కు, పచ్చ మీడియాకు ఇంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ అని ప్రశ్నించారు. అసలు ఈ చట్టంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఏం తెలుసని ప్రశ్నించారు. అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి రాతలు రాయరని అన్నారు. వారిది క్రిమినల్ మైండ్ అని, అందుకే ఇలాంటి సున్నితమైన సమస్యపై ప్రజల్లో అపోహలు సృష్టించి, ఎన్నికల్లో దీన్నొక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ‘సీఎం జగన్ ఫొటో పట్టాదారు పాసుపుస్తకంపై వేస్తే ఆ స్థలం సీఎంకి చెందిపోతుందా? మరి అప్పట్లో మరుగుదొడ్లపై ఎన్టీఆర్ బొమ్మ వేశారు కదా. ఆ మరుగుదొడ్లన్నీ ఎన్టీఆర్ సొంతమైపోతాయా’ అని ప్రశ్నించారు. బొత్స శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూవివాదాల్లో అవినీతి, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా చేయడానికే ఈ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని సాక్షాత్తు సీఎంగారే చెప్పారన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా లోపభూయిష్టమైన విధానాలను మార్చి సామాన్యుడికి మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా భూ వ్యవస్థలో లోపాలను సవరించి, చట్టాలు తేవాలన్న కేంద్రనిర్ణయంలో భాగంగానే తమ ప్రభుత్వం కూడా అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తోందని, దానికింకా బోలెడంత ప్రాసెస్ ఉందని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. తొలుత గ్రామాల్లో భూసర్వే జరగాలని, ఆ సమయంలో వివాదాలు వస్తే ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారని తెలిపారు. ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరని, ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్ అథారిటీకి, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. ఇది కూడా కోర్టులో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదని స్పష్టం చేశారు. ఈ లోపే మీటింగులు పెట్టి.. ఒకరు జోగిపోయి, ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాతలు ఎన్నికల వరకేనని అన్నారు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల్లో వారి కూటమికి లాభం చేకూర్చాలన్నదే వీరి దురుద్దేశమని తెలిపారు.లిటిగేషన్ తగ్గించడానికే..దీనిలో జిల్లా అప్పిలేట్ విచారణ తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదని, అందుకే కొందరు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేవలం లిటిగేషన్ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశామన్నారు. జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తామని అన్నారు. సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివాదాలు వస్తున్నాయన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోందని, మొదటి దశ పూర్తయి, రెండో దశ కొనసాగుతోందని చెప్పారు. తర్వాత పట్టణ ప్రాంతాల్లో కూడా సర్వే చేస్తామన్నారు.పవనేమన్నా పెద్ద మేధావా?పవ¯న్ కళ్యాణ్కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని, ఆయనేమన్నా పెద్ద మేధావా అని బొత్స ప్రశ్నించారు. ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తారా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలేనా అని మండిపడ్డారు. జిరాక్స్ కాపీలు తీసుకోవడానికి ప్రజలు అమాయకులనుకుంటున్నారా, వారు ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారం తప్పు అని చాలాసార్లు చెప్పానని అన్నారు. ఆయనొక రాజకీయ నాయకుడు.. ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా అని పవన్పై మండిపడ్డారు. అన్నం తినే వాడెవ్వడూ పవన్ మాటలను హర్షించరన్నారు. తెలిసీ తెలియని అంశాలపై ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. -
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరు?. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఏం తెలుసు?’’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా భూమి మాది కాకపోతే మరెవరిది.. రామోజీ.. అన్నం తినేవాళ్ళు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, రాయరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే, ఇలాంటి తప్పుడు కూతలు, రాతలు. భూ వివాదాల్లో, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ చట్టం. ప్రస్తుతం ఈ చట్టం కోర్టు పరిధిలో ఉంది.. రాష్ట్రంలో అమల్లో లేదు. వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్తో ఉన్నవారే, ఈ చట్టాన్ని వెపన్గా వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ దుష్ప్రచారం చేసే కూటమి నేతలెవరూ ప్రజలకు కనిపించరు’’ అంటూ ధ్వజమెత్తారు.మంత్రి బొత్స మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:⇒ఏకంగా మీ భూమి మీది కాదు అంటూ రాతలు రాస్తున్నారు. అసలేంటీ రాతలు? నా భూమి నాది కాకపోతే మరెవరది? ⇒మరొక పేపర్లో, నేల చట్టంలో..నింగీ..గాలి అంటూ రాతలు రాశాడు⇒ఈ రాతలు పోలింగ్ జరిగే వరకే. ఆ మర్నాడు వాళ్లు ఈ వార్తలు రాస్తే అడగండి. అప్పుడు వీళ్లకు, సామాజిక బాధ్యత ఏమీ ఉండదు.⇒ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ ఫ్రెండ్స్గా ఉన్న కూటమికి లాభం చేకూర్చాలనే⇒ప్రజలేమన్నా అమాయకులనుకుంటున్నారా? మీ మాట ఎవరు నమ్ముతారు? ⇒మీరు చేసే ప్రచారం, వాస్తవాలకు ఇంత దూరంగా ఉంటే, ఇక ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమే⇒ఏ కోణంలో మీ భూమి మీది కాదో వాళ్లు సమాధానం చెప్పాలి⇒మీ అనుమానాలేంటి అడగండి.. నేను సమాధానం చెప్తాను. ప్రజలకు కూడా మీ రాతలపై క్లారిటీ కావాలి కదా?⇒మీరు చేస్తున్న మాయ, మోసం, మీ కడుపు మంట ప్రజలకు తెలియాలి⇒రామోజీరావు, రాధాకృష్ణల బాధ కూడా ప్రజలకు తెలియాలి కదా? అడగండి..నేను సమాధానం చెప్తాదళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా పూర్తి హక్కులు కల్పించే చట్టం⇒ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది.⇒అవినీతికి తావులేకుండా, దళారులు, లిటిగెంట్లకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండాలని మేం ఈ చట్టం తెస్తున్నాం⇒ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ⇒అందులో భాగంగానే ఇది జరుగుతోంది. ప్రస్తుతం కోర్టుల్లో ఉంది. పబ్లిక్ హియరింగ్ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు.⇒ఈ లోపు మీటింగులు పెట్టి..., ఒకరు జోగిపోయి.., ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారు.⇒ఏకంగా ఈనాడు వారైతే మీ భూమే మీది కాదని రాసేస్తారు. ఏం ఖర్మ వచ్చింది వీళ్లకు?⇒మళ్లీ మళ్లీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున చెప్తున్నాం. ఏదైతే దళారులు, అవినీతిపరులు, లిటిగెంట్లు చేసే దగాను అరికట్టడానికే ఈ విధానం.⇒భారతదేశం యావత్తు దీనిలో లోపాలను సవరించి చట్టాలను తేవాలని నిర్ణయించింది.⇒అందులో భాగంగా మా ప్రభుత్వం కూడా దానిలో ఉన్న అన్నిటినీ అధ్యయనం చేస్తోంది.⇒దానికింకా బోలెడంత ప్రాసెస్ ఉంది. పబ్లిక్ హియరింగ్, సర్వే పూర్తి కాకుండా చట్టంగా మారదు.⇒ఏ గ్రామమైతే పబ్లిక్ హియరింగ్, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.⇒ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది.పవన్ కల్యాణ్ పెద్ద మేధావా?:⇒పవన్ కల్యాణ్కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు..? ఆయనేమన్నా పెద్ద మేధావా? ⇒ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తారా? అన్నం తినే వాడు మాట్లాడే మాటలేనా అవి?⇒జిరాక్స్ కాపీలు ఇస్తే ప్రజలు అమాయకులనుకుంటున్నారా? ఒప్పుకుంటారా? ⇒ప్రభుత్వం తరఫున జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని ప్రచారం చేయడం, తప్పు అని చాలా సార్లు చెప్పాను.⇒పవన్ కల్యాణ్ మాటలకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు.⇒ఆయనొక రాజకీయ నాయకుడు..ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా? ⇒తెలిసీ తెలియని అంశాలను ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా?⇒ఆయన భాష కూడా మారింది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు అలాంటి భాష ఎవరైనా మాట్లాడాతారా?⇒ఏమీ తెలియని పవన్ కల్యాణ్ మాట్లాడితే మనందరం వినాలా?⇒అతని భాషను ప్రజాస్వామ్యంలో ఎవరైనా అంగీకరిస్తారా?⇒ఇప్పుడు ఆ యాక్ట్ ఫోర్స్లో లేదు. ⇒అసలు ఒక్క సీటు కూడా లేని పవన్ కల్యాణ్ ప్రతిపక్షం ఏంటి?⇒ఆయనకొచ్చిన ఒక్క సీటు వ్యక్తి కూడా నీదగ్గర ఉండనని వెళ్లిపోయాడు.⇒ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి ఎంత ఉక్రోషం ఉందో వారి రాతలను బట్టి అర్ధం అవుతుంది.⇒మేం కాల్చిన గుడ్డ మీ నెత్తిన వేశాం..మీ చెప్పాల్సింది చెప్పుకోండి అన్నట్లుంది వారి వ్యవహారం.⇒ఏదో ఒక తప్పుడు రాతలు రాసేస్తాం..ఆ తర్వాత మేం దాని గురించి ప్రశ్నించం అని అనుకుంటున్నారు. ⇒ప్రజలారా మీరే ఆ పత్రికల తీరును ఆలోచన చేయండి. మీరే డిసైడ్ చేయండి.⇒ఆ పత్రికల ద్వంద వైఖరి, బుద్ధిని గమనించండి.వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్తో ప్రతిపక్షాలు:⇒ఏ గ్రామమైతే సర్వే పూర్తి చేసుకుంటుందో ఆ గ్రామమే దీని పరిధిలోకి వస్తుంది.⇒తర్వాత ఏదైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్ అథారిటీ దృష్టికి తీసుకురావచ్చు.⇒కోర్టుకు కూడా ఎప్పుడైనా వెళ్లొచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు.⇒ప్రత్యర్థులు వారి వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్తో దీన్ని వెపన్గా వాడుకోవాలని చూస్తున్నారు. ⇒క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లు కాబట్టే, ఇలాంటి సున్నితమైన సమస్యపై అపోహలు సృష్టిస్తున్నారు.⇒జగన్ ఫోటోను పట్టాదారు పాసుపుస్తకంపై వేశారంటున్నారు. మరి ఎన్టీఆర్ బొమ్మను మరుగుదొడ్లపై వేశారు కదా. దానికేం చెప్తారు?రిజిస్ట్రేషన్ పేపర్లు ఎవరి ఇంట్లో వారివి ఉంటాయి, సందేహం ఎందుకు?⇒బొమ్మ ఉంటే మాకు వచ్చేట్లయితే, ఎన్టీఆర్ బొమ్మ ఉన్న మరుగుదొడ్డి వాళ్లకు వెళ్లిపోతుందా?⇒ అసలు మీ ఇంట్లో కాగితాలు..మా ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు?⇒రిజిస్ట్రేషన్ కాగితం నీ ఇంట్లో ఉంటుంది కానీ..మరెవరింట్లోనే ఎందుకుంటుంది? ⇒ ఎవరో ఏదో చెప్తేస్తే, కడుపులో మంట ఉన్న వాళ్లు రాతలు రాస్తుంటే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు⇒రాజకీయ కోణంలో, క్రిమినల్ మైండ్తో, దుర్భిద్ధితో చేస్తున్న దుష్ప్రచారం ఇది⇒వీళ్లు రాసే రాతలు, చేసే ప్రచారం తప్పు అని చెప్పే బాధ్యత మాపై ఉంది⇒దీనిలో జిల్లా అప్పిలేట్ విచారించిన తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదు. అందుకు కొంతమంది న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు⇒కేవలం లిటిగేషన్ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశాం⇒ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తాం?⇒సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం⇒ఎప్పుడో బ్రిటీష్ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివిధాలు, లిటిగేషన్లు వస్తున్నాయి⇒ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దశల వారీగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోంది⇒మొదటి దశ అయిపోయింది. రెండో దశ కొనసాగుతోంది. తర్వాత అర్బన్లో కూడా సర్వే చేస్తాందేశంలో 73 శాతం భూ వివాద కేసులే...:⇒కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ 68 నుంచి 73 శాతం కేసులు భూవివాదాలే.⇒సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని చాలా సార్లు చెప్పారు.⇒తొలుత గ్రామాల్లో భూసేకరణ జరగాలి. ఆ సందర్భంలో ఏదైనా వివాదాలు వస్తే కింది స్థాయి ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారు.⇒ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరు.⇒ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో సమస్య పరిష్కారానికి వెళ్లొచ్చు.⇒ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చు. అప్పీలింగ్ అథారిటీ రెండేళ్ల వరకూ ఉంటుంది. ⇒ఈ రకంగా రాతలు రాయడం అనేది చాలా పెద్ద క్రైం. ⇒ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇదో పెద్ద క్రైం.⇒ఈ ప్రజాస్వామ్యంలో ఎవడి ఆస్తి ఎవడు తీసుకుంటాడు?వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం⇒కూటమిలో ముగ్గురున్నారు. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు. ఒకరు రాష్ట్రంలో అధికారం చేసినవాళ్లు..మరొకరు ఎక్కడా ఏదీ లేని వాళ్లు.⇒వాళ్లలో ఒకరు ఒప్పుకోకుండా, ఇద్దరు ఒప్పుకుంటే ఇక ప్రజలకు క్లారిటీ ఏముంటుంది? ⇒వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం. దానిలో పెట్టిన వాటి గురించి ఎందుకు ఆలోచించాలి?⇒వాళ్లకున్న అత్మాభిమానం ఏంటి? మాకున్న అహంకారం ఏంటో చెప్పండి.⇒8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామని అనడం చాలా తప్పు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల ఒక సారి ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.⇒ఎన్నికలు అయిన తర్వాత పాత్రికేయులకు చెప్పిన విధంగా వారికి స్థలాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు
విశాఖ సిటీ: ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రిజి్రస్టేషన్ తర్వాత జిరాక్స్ కాపీ ఇస్తారనడం... తెల్లకాగితం మీద రిజి్రస్టేషన్ చేస్తారనడం పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం మన రాష్ట్రంలోని ఏ ఒక్కరి ప్రయోజనాలకు భంగం కలగకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రూపొందించాం. అందరి ఆమోదం తర్వాతే అమలుచేస్తాం. చంద్రబాబు మాయమాటలను ఎవరూ నమ్మవద్దు’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖ లాసెన్స్బే కాలనీలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదనతోనే... ‘దేశంలో సమగ్రమైన రిజి్రస్టేషన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా తయారుచేసింది. దానిప్రకారం మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా కేంద్రం ఇచ్చిన ముసాయిదాకు తుది మెరుగులు దిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు రూపొందించింది. రిజి్రస్టేషన్శాఖలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసెంబ్లీలో మూడుస్లార్లు చర్చ జరిగింది. కేంద్రానికి పంపిన తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశాం. ప్రస్తుతం ఈ యాక్ట్ కోర్టు పరిధిలో ఉంది. ఈ చట్టాన్ని అమలుచేసే ముందు సమగ్ర భూసర్వే పూర్తయిన ప్రతి గ్రామంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాం. ఆ గ్రామంలో మొత్తం భూముల వివరాలు, వ్యక్తిగత, ప్రభుత్వ భూములు, వాటి హద్దులు.. ఇలా అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వాటన్నింటినీ సరిచేసిన తర్వాత వారి ఆమోదంతోనే ఆ గ్రామాన్ని చట్టం పరిధిలోకి తీసుకువస్తాం. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఈ చట్టాన్ని అమలుచేయబోం. ఈ చట్టం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. లిటిగెంట్లకు, దళారులకు మాత్రమే ఈ చట్టం కారణంగా నష్టం కలుగుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ప్రజల ఆస్తికి ప్రభుత్వం జవాబుదారీ.’ అని మంత్రి బొత్స చెప్పారు. చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశమివ్వడు ‘ఆలూ లేదు.. చూలులేదు అన్న సామెతలా ఉంది చంద్రబాబు పరిస్థితి. చట్టం అమల్లోకే రాలేదు. అయినా ఆయన అధికారంలోకి వచి్చన వెంటనే దానిని రద్దు చేస్తానని చెబుతున్నాడు. రద్దు చేయడానికి ఆ చట్టంలో ఉన్న తప్పేంటో చెప్పగలడా? అయినా చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశం ఇవ్వడు. పచ్చ మీడియా కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసత్య ప్రచారంచేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ తర్వాత జిరాక్సు కాపీలు ఇస్తారని ఎవడు చెప్పాడు రామోజీకి? ఎన్నికలు జరుగుతున్నాయి.. లేదంటే ఇలాంటి తప్పుడు రాతలు రాసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నందుకు ఎల్లో మీడియాపై చర్యలు తీసుకునేవాళ్లం.’ అని మంత్రి బొత్స చెప్పారు. మోదీ బొమ్మ ఎందుకు లేదు? ‘బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పుడు మేనిఫెస్టోలో మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్, ఎనీ్టఆర్ బొమ్మలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఇద్దరు ఏమయ్యారు? కూటమిలోని పార్టీయే మీ మేనిఫెస్టోను అంగీకరించనప్పుడు ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు చంద్రబాబు? దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఆయన 2019, 2024లో తీసుకొచ్చిన మేనిఫెస్టోలు దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. 2014లో చంద్రబాబు 50పేజీల మేనిఫెస్టో ప్రింట్ చేశాడు. ఇప్పుడు ఐదు పేజీలకు దిగివచ్చాడు. ఈ కూటమి ముఠా... జగన్ మేనిఫెస్టోలోని అంశాలనే కాదు.. పేజీల సంఖ్యను సైతం కాపీ కొట్టింది.’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
-
సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్ బే కాలనీలోని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ రికార్డ్
-
మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్
విశాఖ సిటీ: ‘మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వం. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా నెరవేర్చాం. తాజాగా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని, మరింతగా ప్రజోపయోగమైన అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ 2024 మేనిఫెస్టో రూపొందించారు.రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఆమోదించి, మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలి’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు నిక్కచ్చిగా, కచ్ఛితంగా ఏదైతే చేస్తామని చెప్పారో, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దళారులు, మధ్యవర్తులు లేకుండా రూ.2.7 లక్షల కోట్లు నేరుగా పేద ప్రజలకు అందించారని తెలిపారు. దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో 99 శాతం అమలు చేయలేదని, ఒక్క సీఎం వైఎస్ జగన్కి మాత్రమే అది సాధ్యమైందని, దేశ రాజకీయాల్లో కొత్త రికార్డులు నెలకొల్పి ఈ రోజు మీ ముందుకు వచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని చెప్పారు. విద్య, వైద్యాన్ని ఒక పెట్టుబడిగా చూస్తున్నామన్నారు.మూడు రాజధానులు మా అజెండారాష్ట్ర సమగ్రాభివద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించారని తెలిపారు. ఇదే తమ అజెండా అని చెప్పారు. దీనిని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లగలరా అని కొందరు ప్రశ్నించారని, ఇప్పుడు అదే రెఫరెండంగా మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళుతున్నామని చెప్పారు. విశాఖను ప్రపంచంలో మేటి నగరంగా తయారు చేయడానికి సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇక్కడ ఐటీ హబ్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రజల కోసం అర్బన్ లేఅవుట్లు డెవలప్ చేసి గృహ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు కాస్ట్ టు కాస్ట్కు ఇళ్లు ఇవ్వడంపై దృష్టి పెడతామన్నారు.అవుట్ సోర్సింగ్లకు తీపి కబురుఅవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదాయ పరిమితి పెట్టడంతో నవరత్నాలు అందడంలేదన్న ఉద్యోగ సంఘాల వినతిని తాము సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని రూ.25 వేలు వరకు జీతాలున్న వారందరూ అర్హులని మేనిఫెస్టోలో చేర్చడం చాలా పెద్ద విషయమన్నారు. ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. విద్యా శాఖలో ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నో వెకెన్సీ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏ ఏడాది ఖాళీ ఏర్పడితే అదే ఏడాది భర్తీ చేసే విధానాన్ని తేవాలని చూస్తున్నామన్నారు.బాబు మోసకారి.. టీడీపీ నక్కల పార్టీచంద్రబాబు మోసకారి అని, టీడీపీ నక్కల పార్టీ అని బొత్స వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను, మహిళలను మోసం చేశాడన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనీ అమలు చేయలేదని, మేనిఫెస్టోనే మాయం చేశారని చెప్పారు. బాబు రూ.4 వేలు పెన్షన్ ఇస్తానన్నా ఎవరు నమ్మరని అన్నారు. 2019లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన నాటికి మహిళలకు ఎంత రుణం ఉందో అంతటినీ ముఖ్యమంత్రి జగన్ మాఫీ చేశారని గర్వంగా చెబుతున్నామని అన్నారు.నాడు స్నోలు, పౌడర్లకు మూల ధన వ్యయంటీడీపీ హయాంలో మూల ధన వ్యయం ఏడాదిలో రూ.15,227 కోట్లు మాత్రమే కేటాయించి, దానిని కూడా స్నోలు, పౌడర్లకు దుబారా ఖర్చు చేశారన్నారు. అందులోనూ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆస్పత్రులు, నాడు–నేడు, వెల్నెస్ సెంటర్ల కోసం ఏటా రూ.17,757 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు ఇది మైనస్ రూ.366 కోట్లుగా ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే అప్పులు తెచ్చామని, ఇదీ జగన్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. -
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
పియూష్ గోయల్కు ఏపీ మంత్రి బొత్స కౌంటర్
విశాఖపట్నం, సాక్షి: మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు. పియూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా?. అసలు విద్యాశాఖ లో అవినీతి జరిగిందని చెప్పగలరా?.. .. ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డ్ శాతం ఫలితాలు వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారు. బావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయిరైల్వే జోన్ సంగతి ఏమైంది?పియుష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా(చంద్రబాబును ఉద్దేశిస్తూ..) ఉన్నారు. అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు?. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అడ్డంకులు అన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించాం అని మంత్రి బొత్స గుర్తుచేశారు. 2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమా?.. మధ్యలో ఒక ఇంజిన్ పని చేసిందా? మరో ఇంజిన్ రిపేర్ అయ్యిందా? అని మంత్రి బొత్స ఎద్దేశా చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఎలక్టోరల్ బాండ్స్ లో అతి పెద్ద అవినీతి జరిగింది బీజేపీ హయాంలోనే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ పని చేస్తుంది. మేలు జరిగే ప్రతీ అంశానికి మద్దతు ఇస్తాం. ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు. దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుంది....మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలి. పియుష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ఆయన్ని కోరుతున్నా అని మంత్రి బొత్స అన్నారు. కేంద్రంలో అలాంటి ప్రభుత్వం రావాలికేంద్రంలో మాపై ఆధారపడే పార్టీ రావాలని కోరుకుంటున్నాం. అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన ఇంకా కొన్ని ప్రయోజనాలు కోసం మాట్లాడవచ్చు. అది మా స్వార్థం. ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదు. కేంద్రం అన్నీ రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. అందుకే మనపై ఆధారపడే ప్రభుత్వం రావాలి..అందుకే కన్నీళ్లొచ్చాయ్షర్మిల మొన్నటి దాకా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెల్లి. కానీ, నిన్నటి నుంచి ప్రత్యర్థి పార్టీ వ్యక్తి. వారి పార్టీ విధానాలు వారివి. అది వాళ్ల ఇష్టం.చావుకి పుట్టుకకి సంబంధాలు ఉంటాయి. కానీ మిగతా వాటికి ఎందుకు ఉంటాయి?. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ నన్ను తండ్రితో పోల్చినప్పుడు వైఎస్సార్ గుర్తొచ్చారు. సీఎం జగన్ నా పేరు పిలవగానే.. జనం కూడా బాగా స్పందించారు. అందుకే భావోద్వేగానికి గురయ్యా అని బొత్స అన్నారు. -
ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది అందుకేగా: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయాల్లో నేతల తలలపై రూపాయి పెట్టి విలువ కట్టడమే నీ బతుకు.. ఓటుకు కోట్లు కేసులో పారిపోయి తిరుగుతున్న నీచుడు బాబు’’ అంటూ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటమి నీ కళ్ల ముందు కనిపిస్తుంటే.. నీ నోటికి అడ్డూఅదుపూ ఉండదా..?. విశాఖ రాజధానిగా సమర్ధించని నువ్వు ఉత్తరాంధ్రపై నంగనాచి కబుర్లా..?. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా జగన్ ఆలోచనలు ఉన్నాయి. ప్రజా నాయకుడు జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మర్యాద కాదు’’ అంటూ మంత్రి హితవు పలికారు.మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే.. ఓటమి తెలిసే.. చంద్రబాబులో అసహనంచంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన భాష, మాట్లాడే తీరును చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అనుభవశాలిగా చెప్పుకుంటూనే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకుని నెత్తిమీద అర్ధరూపాయి పెడితే దమ్మిడీకి కొనరంటున్నాడు. స్పీకర్నైతే రకరకాల పేర్లతో పిలుస్తాడా..? అసలెందుకు అంత సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు..? రాజకీయాల్లో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. నాయకులుగా గెలుస్తాం. ఓడతాం.. అయితే, తాను, తన కూటమి ఓడిపోబోతుందని తెలిసి అంత సహనం కోల్పోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా..? అతను ఏమనుకుంటున్నాడు.? ప్రజలు ఛీకొట్టే విధంగా మాట్లాడటానికి అతను సిగ్గుపడాలి. వెన్నుపోటు రాజకీయాల్లో నీకన్నా నీచుడెవడు..?నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు.. మరి, నిన్నేమని సంభోధించాలి..? నీచుడనాల్నా.. అంతకన్నా పెద్ద మాట ఇంకేమైనా ఉందా..? దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలి. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు..రాజకీయ నేతల తలల మీద ఎంత పెట్టాలో.. ఏ రకంగా వాళ్లను కొనాలో.. బేరాలకు లొంగే నేతల గురించి కొలమానం నీకు తెలుసు. అంతమాత్రానా అందర్నీ వేలం పెడతానంటే ఎలా కుదురుతుంది..? మరి, నీకు అంత సామర్ధ్యం ఉండబట్టే కదా.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పారిపోయి వచ్చింది..? ఓటుకు కోట్లు కేసులో నువ్వు చేసింది ఇదేనని అందరికీ తెలుసుకదా..? అతెందుకు.. అసలు, నీ తల మీద ఉన్న విలువెంతో నీకు తెలుసా..? నువ్వొక చెల్లని కాసు అనేకదా.. నిన్ను 2019లో ప్రజలు ఓడించి మూలన కూర్చొబెట్టారు. అలాంటి నువ్వు.. ప్రజా మద్దతుతో రాష్ట్రంలో 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్రెడ్డి గారిని పట్టుకుని వేలం వేస్తానంటావా..? ఆ మాట అనడాని కి నీకు సిగ్గుగా అనిపించలేదా..? నీ మాట్లాడే తీరును, భాషను, సహనం కోల్పోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. విశాఖ రాజధానిగా, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధే మా ధ్యేయంఎస్.కోటలో నా గురించి మాట్లాడుతూ.. ఏం బొత్సా అని పిలిచావ్..? సరే, నాకంటే వయస్సులో పెద్దోడివనుకుంటా.. నువ్వు అలా నన్ను సంభోదించినా నేనేం అనుకోను. ఎస్.కోటను విశాఖపట్టణంలో కలపకుండా విజయనగరంలోనే ఎందుకు ఉంచావన్నావు. నీమాటకే వస్తే.. ఎస్.కోటను విశాఖలో కలపడం వలన ఏంటి లాభం..? సమాధానం చెప్పు..? మా ఉద్దేశంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంత 34 ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధిలోకి తేవడం మా అభిమతం. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే హక్కు నీకెవరిచ్చారు...? మేం వారి అభిప్రాయాల్ని గౌరవిస్తాం కనుక ఉత్తరాంధ్రలో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఎలా చేయాలనేది మాకు తెలుసు. విశాఖను రాజధానిగా నువ్వెందుకు సమర్ధించవు..?విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాం.. దీన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. నువ్వేమో.. ఇక్కడ రాజధాని ఉండటానికే వీల్లేదంటూ.. ఆ స్థాయి పట్టణంగా విశాఖ పెరగకూడదని నువ్వు అడ్డుపడుతున్నావు. విశాఖ రాజధానిగా నువ్వు సమర్ధించనప్పుడు ఎస్.కోట గురించి ఎందుకు మాట్లాడుతున్నావు..? ఒకవేళ, నువ్వు విశాఖపట్టణాన్ని రాజధానిగా సమర్ధిస్తే.. ఒక్క విశాఖ ఏంటి..? అనకాపల్లి, పార్వతిపురం, విజయనగరం, ఎస్.కోట, శ్రీకాకుళం తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోంది కదా..? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లొద్దుగతంలో విశాఖ జిల్లాలోనే ఉన్న అనకాపల్లిని జిల్లా చేశామంటే.. అదొక వెనుకబడిన ప్రాంతంగా ఉండాలని చేశామా..? పరిపాలనా సౌలభ్యం కోసమే ఆ ప్రాంత ప్రజలకూ అభివృద్ధి ఫలాలు శరవేగంగా దక్కాలని కాదా..? మరి, ఇవ్వన్నీ ఏం తెలియకుండా నీ లెక్కలేంటి..? నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నావా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధిలోకి రావడంతో పాటు విశాఖ ప్రపంచస్థాయి నగరం అవుతోందనేది అందరికీ తెలుసు. అలాంటిది, నువ్వేమో ఒక్క పక్కన కోర్టులకెళ్లి మరీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మోకాలడ్డుతూ.. ఎన్నికలనగానే, ఇక్కడకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లు చెబుతావా..? ఉత్తరాంధ్ర ప్రజలు నువ్వు చెప్పే మాటల్ని నమ్మేంత అమాయకులేమీ కాదని తెలుసుకో.. అవినీతి చక్రవర్తి బిరుదాంకితుడు చంద్రబాబు:-చంద్రబాబు కాలేజీకి సైకిల్ మీదనే వెళ్లేవాడనేది ఆయన సన్నిహితులే గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. మరి, నేనైతే.. కాలేజీకి స్కూటర్ మీద వెళ్లాను. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాల్టికి రూ.1400 కోట్లు ఏ విధంగా వచ్చాయి..? అంతమొత్తం ఎలా సంపాదించాడు..? మరి, మేమూ 15 ఏళ్లపాటు అనేక ప్రభుత్వాల్లో మంత్రులుగా చేశాం కదా..? అన్ని కోట్లు రూపాయలు మాకెందుకు రాలేదు..? ఎన్ని కుంభకోణాలు చేసి అన్ని రూ.వేల కోట్లు సంపాదించావో ప్రజలకు సమాధానం చెప్పు. అవినీతి చక్రవర్తి అనే బిరుదును ప్రజలు నీకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకో.. ఇప్పటికైనా, నీ భాషను సరిచేసుకోకపోతే చాలా దెబ్బతింటావు. రాజకీయాల్లో సహనం కోల్పోయి మరీ అంతగా నోరుపారేసుకోవడం మంచిది కాదు. ప్రజలు నీ మాటలు విని అసహ్యించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నీ జాగీరేం కాదు..?ఉత్తరాంధ్ర ప్రాంత నేతలుగా మేము రాజకీయాల్లో ఎప్పట్నుంచో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకూ మనోభావాలు.. ఆత్మగౌరవం మాకు తెలుసు. అలాంటిది, ఈరోజు ఎన్నికలనగానే నువ్వొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నీ జాగిరు అన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది..? వయసులో పెద్దోడివైనప్పటికీ, కొంచెం వళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నోటికేదొస్తే అది మాట్లాడుతానంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు.పేద పిల్లలకు సీబీఎస్ఈ సిలబస్తో టోఫెల్ శిక్షణ:రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోని అనేకమంది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు జగన్ విజయం గురించి మాట్లాడతున్నవన్నీ వాస్తవాలే కదా..? మరి, ఆయన గానీ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, ఆయా కుటుంబాలకు ఖరీదైన వైద్యం దూరం అవుతుంది కదా..? ఈ రాష్ట్రంలో మూడోతరగతి నుంచే పిల్లలకు టోఫెల్ పరీక్షకు తయారుచేసే విద్యావిధానంలో దేశంలో ఎక్కడైనా ఉందా..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై పట్టుతో మాట్లాడేందుకు టోఫెల్ను గతంలో నేర్చుకునేవాళ్లు. కానీ, మన పిల్లలకు మూడో తరగతి నుంచి టోఫెల్ నేర్పిస్తూ.. బేసిక్, జూనియర్, సీనియర్ అంటూ టెస్టులు పెట్టి ప్రభుత్వమే వాళ్లకు ఫీజులు కడుతూ ఇంగ్లీషు మీడియంను వృద్ధిలోకి తెస్తున్నాం. గతంలో సీబీఎస్ఈ సిలబస్తో నడిచే హైస్కూళ్లు రాష్ట్రంలో అన్ని కలిపితే 100 ఉండేవి కాదు. అలాంటిది, ఇవాళ వెయ్యికి పైగా సెంట్రల్ సిలబస్తో హైసూళ్లను అప్గ్రేడ్ చేశాం. ఇంగ్లీషు మీడియం పట్ల కొత్తగా మేం చైతన్యం తెచ్చాం. ఐబీ విద్యను రాష్ట్ర విద్యావిధానంలోకి తెస్తున్నాం. జెనీవాలోని సంస్థతో మాట్లాడి.. ఆ సంస్థ మేనేజ్మెంట్ను ఏపీకి రప్పించి.. జగన్మోహన్రెడ్డి గారి సమక్షంలో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఐబీ కొలబరేషన్తో ప్రభుత్వ స్కూళ్లల్లో సరికొత్త విద్యావిధానాన్ని నడిపించ నున్నాం. మరి, విద్యావ్యవస్థలో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా చూశామా..? అదే ఐబీ చదువుకోవాలంటే, ట్యూషన్ ఫీజు ఒక్కో విద్యార్థికి ఆరేడు లక్షల రూపాయలు వెచ్చించాలి. అలాంటిది, ప్రభుత్వ స్కూళ్లల్లో ఉచితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామంటే అది సంతోషమే కదా..? ఇది మా ప్రభుత్వం తాలూకూ నిబద్ధత. మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి ఆలోచన. అందుకే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్రెడ్డి గారే ఎందుకు అవసరమనేది చెబుతున్నాం.రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. కాలేజీకి వంద సీట్ల చొప్పున తీసుకుంటే.. ఈ రాష్ట్ర విద్యార్థులకు 1700 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లే కదా..? అందులో 70 శాతం పేద విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. రూ. కోటి నుంచి రూ.2 కోట్లు ఖర్చుపెట్టి సీట్లు పొందలేని విద్యార్థులకు ఉచితంగా మెడికల్ సీట్లు వస్తున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వస్తుంది. ఆ ఊరి పేదవాడికి ఖరీదైన నాణ్యమైన వైద్యం ఉచితంగానే అందుతోంది. నీ విజన్తో పేదోడికి మేలు జరిగిందా బాబూ..?ఇవన్నీ ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలే కదా..? వీటిని చెప్పకుండా నోటికేదొస్తే అది మాట్లాడటం.. అభివృద్ధి లేదని అదేపనిగా ఊదరగొడితే ఎలా కుదురుతుంది..? ప్రజలకు ఇవ్వన్నీ తెలిసిన వాస్తవాలని మీరు మరిస్తే ఎలా..? చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు చేసే ఇలాంటి మంచి ఆలోచనలు ఎప్పుడైనా చేశాడా..? అంటే, నీ విజన్లో పేదోడికి ఏనాడైనా మేలు జరిగిందా..? జగన్ గెలుపు అనివార్యమంటోన్న మేధావులు:అనేకరంగాల్లో మేధావులైన వారు సైతం ఇవాళ జగన్ గారి పరిపాలనా సంస్కరణలను మెచ్చుకుంటున్నారు. ఆయన ఎన్నిక అనేది ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. ఈ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి కోసం. ఆయా కుటుంబాల్లోని పేద పిల్లల చదువులు అంతర్జాతీయ స్థాయిలో పెరగాలంటే .. అది రాబోయేకాలంలో దేశానికి, రాష్ట్రానికి పెట్టుబడిగా ఉండాలనేది జగన్ గారి తాపత్రయం. అందుకే, విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు చేపట్టారని పెద్దలు ఉదాహరణలుతో సహా వివరించడం చాలా బాగుంది. ఒకవేళ, జగన్ గారే కనుక గెలవకపోతే.. ఇప్పటిదాకా రాష్ట్రంలో విద్యావైద్యంలో కొనసాగిన సంస్కరణలు ఆగిపోయే ప్రమాదం ఉందని మేధావులే చెబుతున్నారు. అవి ఆగిపోతే, ఈ రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి పేద కుటుంబాల ప్రజలు ప్రమాదంలో పడిపోతారని చెబుతున్నారు.ఇదీ చదవండి: జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్ బస్సుయాత్ర
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎన్నికల నైతికత నెలకొనేనా?
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
మారని తీరు..
తెరచుకోని స్పెషలిస్టు ఓపీ గదులు..
పాత బకాయిలు చెల్లించాలి..
సంగంబండ లెఫ్టు కెనాల్ పనులు ప్రారంభం
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేద్దాం
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం
Advertisement