-
ప్రియుడితో కలిసి పెట్స్ బర్త్డే సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి (ఫోటోలు)
-
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్ను గిఫ్ట్గా ఇచ్చాడు. విగ్ను గిఫ్ట్గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్ఫ్రెండ్తో సబలెంక (ఫొటోలు)
-
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
కెమెరామ్యాన్తో ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్?
హీరోయిన్లు ఈ మధ్య కాలంలో వరసగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే నిశ్చితార్థం కానిస్తున్నారు. మరికొందరైతే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అలానే ప్రియుడ్ని పరిచయం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈమె రిలేషన్లో ఉన్నది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఇంతకీ ఎవరీ హీరోయిన్? ఏంటా ప్రేమకథ? (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) మలయాళ నటి రజిషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఎందుకంటే ఓటీటీ సినిమాల కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఓ హీరోయిన్గా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ కావడంతో ఈమెకు ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతానికైతే సొంత భాషతో పాటు తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. రజిషా విజయన్ ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నేరుగా బయటపెట్టనప్పటికీ టోబిన్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీళ్ల ప్రేమ నిజమేనేమో అనిపిస్తోంది. రజిషాతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన టోబిన్.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై కూడా ఇచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Tobin Thomas (@tobin_thomas7) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ
టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్ ఖాన్తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది. (ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార) -
దారుణం.. బాయ్ఫ్రెండ్ కూతురిని చంపిన యువతి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో అలెసియా ఓవెన్స్ అనే యువతి మానవత్వాన్ని మరిచి తన బాయ్ఫ్రెండ్కు చెందిన 18నెలల చిన్నారిని పొట్టనబెట్టుకుంది. గతేడాది జూన్లోని జరిగిన ఈ ఘటనలో అలెసియాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అటార్నీ జనరల్ మిచెల్ హెన్రీ తెలిపిన వివరాల ప్రకారం.. 18 నెలల ఐరిస్ రీటా అల్ఫెరా మృతికి కారణం అలెసియా అని.. పాపకు జరిపిన శవపరీక్షలో నమ్మలేని నిజాలు భయటపడ్డాయని తెలిపారు. అసిటోన్ అనే రసాయనం, వ్యాచ్ బ్యాటరీలు, స్క్రూలను పాపకు తినిపించడం వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల అలెసియా ఓవెన్స్.. జూన్25, 2023న పాప ఐరిస్ రీటా అల్ఫెరా తండ్రి బెయిలీ జాకబ్ పక్కనే ఉన్న ఒక స్టోర్ వెళ్లాడు. అదే సమయంలో పాపలో ఇంట్లో ఉన్న అలెసియా ఐరిస్ రీటాలో ఉలుకుపలుకు లేదని గమనించారు. అయితే ఈ సమాచారాన్ని ఆమె బెయిలీ జాకబ్కు అందించింది. దీంతో బెయిలీ జాకబ్ పాపను పిట్స్బర్గ్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం పాప ఐరిస్ రీటా మృతి చెందింది. పాప అవయవాల వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పాప ఐరిస్ తన తల్లి ఎమిలి అల్ఫెరాతో ఉంటోంది. అయితే తండ్రి బెయిలీ జాకబ్కు కేవలం సందర్శన హక్కులు మాత్రమే ఉండటం గమనార్హం. పాప మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు అలెసియా ఫోన్ పరిశీలించగా.. పలు నమ్మలేని నిజాలు భయటపడ్డాయి. పాప ఐరిస్ మృతికి ముందు.. అలెసియా పిల్లలకు హానీ చేసే వస్తువులు, పద్దతులకు సంబంధించి ఫోన్లో సమాచారాన్ని వెతికినట్లు బయటపడింది. పిల్లలకు హాని కలిగించే అసిటోన్ రసాయనం, బ్యాటరీలు, నెయిల్ పాలీష్, చిన్న వాటర్ బాల్స్, చిన్నపిల్లలకు విషపూరితంగా మారే బ్యూటీ ప్రాడక్టులను కూడా వెతికినట్లు పోలీసులు గుర్తించారు. శవ పరీక్షల నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా తేలటంతో అలెసియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు చిన్నారిని చంపిందనే విషయంపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: గాల్లో ఉండగానే కాక్పిట్ అద్దంలో పగుళ్లు! -
ఎంగేజ్మెంట్ అయిన ఏడాదికి పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన లైగర్ భామ.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలే కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తమ రిలేషన్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించింది. తాజాగా ఇవాళ తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. తన ఇన్స్టా స్టోరీస్లో అతని ఫోటోను షేర్ చేశారు. ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్డే ఏడీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అనన్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనన్య.. ప్రస్తుతం కో గయే హమ్ కహాన్ చిత్రంలో నటిస్తోంది. అర్జున్ సింగ్ డైరెక్షన్లో గౌరవ్ ఆదర్శ్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
రకుల్ భామకు బాయ్ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్స్టా పోస్ట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 10న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె బాయ్ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషళ్ విషెస్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్స్టాలో జాకీ రాస్తూ..'మీ ఈ ప్రత్యేకమైన రోజున.. నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా అలసిపోయినట్లు అనిపించదు. మీరు నా సహచరుడి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం.. ప్రతి అడుగులో నువ్వే నా భాగస్వామి. నా జీవితాన్ని ప్రేమ, సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే. ఈ గొప్ప రోజున, మీరు కలలుగన్నవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీ కలలన్నీ నిజమవుతాయి.. ఎందుకంటే మీరు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హులు. ప్రతి రోజును ఎక్స్ట్రార్డినరీగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు! ' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. View this post on Instagram A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) -
ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?
ఓ మహిళకు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. జేస్ ఎల్లీస్ అనే మహిళ ఒకటో, రెండు కాదు ఏకంగా 13 బొమ్మలను తన పిల్లల మాదిరిగా సాకుతుంది. ఆమె ప్రతిరోజూ ఆ బొమ్మల డైపర్లను మారుస్తుంది. ఆ బొమ్మలను బయటకు తీసుకెళ్లి ఆడిస్తుంది. ఆమె చేస్తున్న ఈ పనిలో ఆమెకు కాబోయే భర్త కూడా సహాయం చేయడం మరింత విచిత్రం. తూర్పు లండన్లోని ప్లాస్టోలో ఉంటున్న ఆ మహిళ పేరు జేస్ ఎల్లీస్. ఆమె వయస్సు 27 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా హెచ్ఆర్ బిజినెస్ పార్టనర్. ది సన్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో జేస్ ఎల్లీస్ ఒంటరితనానికి గురయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఆన్లైన్లో కొన్ని రీబోర్న్ బొమ్మలను చూసింది. అవి అచ్చం పిల్లల్లాగే ఆమెకు కనిపించాయి. 2020, మే నెలలో ఆమె అలాంటి అనేక బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె 13 బేబీ డాల్స్కి తల్లిగా మారింది. ఈ విధంగా బొమ్మలను కొనుగోలు చేయడం తనను పేరెంట్హుడ్కి సిద్ధం చేస్తుందని జేస్ తెలిపింది. జేస్ తొలుత రెబెక్కా అనే బొమ్మను కొనుగోలు చేసింది. ఇది ఒక నెల వయసు కలిగిన రీబోర్న్ బొమ్మ. ఆమె దానిని 250 యూరోలకు కొనుగోలు చేసింది. అనంతరం ఆమె షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా, జూన్తో సహా మరో రెండు బేబీ బొమ్మలను కొనుగోలు చేసింది. ఈ బొమ్మలను కొనుగోలు చేసేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. ఆమె దగ్గరున్న అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ, ఆమె దానిని £1,700కి కొనుగోలు చేసింది. ఆమెకు కాబోయే భర్త అవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ ఆమె అభిరుచికి సాయం అందిస్తున్నారు. ఆమె దగ్గరున్న బేబీ బొమ్మలకు దుస్తులు ధరింపజేయడంలో, వాటి డైపర్లను మార్చడంలో ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది కూడా చదవండి: డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది? -
యువతి కిరాతకం.. అడ్డుగా ఉన్నాడని 11 ఏళ్ల బాలుడిని..
న్యూఢిల్లీ: బాయ్ఫ్రెండ్ తనకు దూరమయ్యాడని కోపంతో అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అతడి కుమారుడిని హతమార్చిందో ఖిలాడి ప్రియురాలు. పోలీసులు స్థానికంగా ఉన్న 300 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లయిందని తెలిసినా.. పూజ కుమారి(24) అనే ఓ యువతి 2019లో తనకు పరిచయమైన జితేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. జితేంద్రకి అప్పటికే పెళ్లి కాగా వారికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అతను భార్య నుంచి వేరై పూజతో కలిసి ఉండేవాడు. మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసే జీవించారు. కానీ ఆ తరువాత జితేంద్ర తన భార్య కుమారుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుంది పూజ. జితేంద్ర స్నేహితుల్లో ఒకరి ద్వారా అతడు ప్రస్తుతముంటున్న ఇంటి అడ్రస్ తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10న ఇందర్పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లిన పూజ అక్కడ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూస్తే దివ్యాంష్(11) ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పూజ అదే అదనుగా బాలుడిని చంపేసి అక్కడే ఉన్న ఒక పెట్టెలోంచి బట్టలు బయటకుతీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైందని తెలిపారు. ఇలా దొరికింది.. హత్య గురించి సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పశ్చిమ ఢిల్లీ పోలీసులు మొదట పూజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆమె అక్కడ ఉండటంలేదని తెలుసుకున్న తర్వాత ఇందర్పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితురాలిని జల్లెడ పట్టారు. ఎలాగోలా హత్య జరిగిన మూడు రోజులకు పూజను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Viral Video: బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం. Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr — Enezator (@Enezator) August 10, 2023 ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్గఢ్లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం -
ఒక్క ఏడాదిలోనే వందమంది బాయ్ఫ్రెండ్స్ను మార్చిన యువతి
పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నామంటేనే పేరెంట్స్ తాట తీసేస్తారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అబ్బాయిలకు దూరంగా ఉండమని, వీలైతే మాట్లాడటం కూడా చేయొద్దని కాలేజీ రోజుల నుంచే హితబోధ చేస్తుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం దగ్గరుండి మరీ కూతురిని డేటింగ్కు పంపించింది. కూతురి ఖర్చుల కోసం 500 డాలర్లు కూడా ఇచ్చి హ్యాపీగా డేటింగ్ చేయమని ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఎంత అప్గ్రేటెడ్ సొసైటీలో బతుకుతున్నా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వైఖరి కాస్త కఠినంగా ఉంటోంది. ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు బోలెడన్నీ ఆంక్షలు పెడుతుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. అలా ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఇంకేముంది కూతురు కూడా రెచ్చిపోయింది. తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్ఫ్రెండ్స్ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్టాక్లో షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్గా వేడుకలు జరిపిందట. కేక్పై 100 నెంబర్ క్యాండిల్తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారట. దుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. కూతురికి తల్లి ఐదందల డాలర్లు బహుమతిగా ఇచ్చిందట. కన్నతల్లి అయ్యిండి కూతురికి డేటింగ్ చేయమని ఎంకరేజ్ చేయడం ఏంటని ప్రశ్నించగా.. పెళ్లి తర్వాత తన కూతురికి మగవాళ్ల పట్ల భయం, అనుమానం ఉండకూడదని, అందుకే చాలామంది పురుషులతో డేటింగ్కు వెళ్లమని ప్రోత్సహించినట్లు మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్తో సెలవిచ్చింది. -
అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా
ఏంటి.. హీరోయిన్ రాశీఖన్నా లవ్లో పడిందా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమా సినిమాకు తనని మార్చుకుంది. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్గా తయారై సెగలు పుట్టిస్తోంది. చాలామంది ఈమె సింగిల్ గానే ఉందనుకుంటున్నారు. కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. బ్రేకప్తో బరువు పెరిగా 'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా, ఎన్నో వర్కౌట్స్ చేశా కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది' (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) డేటింగ్తో స్లిమ్గా 'మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి? అయితే ఫైనల్గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లు మారాను.' అని హీరోయిన్ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. త్వరలో చెబుతుందేమో? ఆ మూవీస్తో బిజీ రాశీఖన్నా నటించిన తెలుగు సినిమాలు 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' గతేడాది విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిలయ్యాయి. ప్రస్తుతానికి తెలుగులో కొత్త చిత్రాలేం చేయడం లేదు. తమిళంలో రెండులో, హిందీలో 'యోధ' చిత్రం చేస్తోంది. ఈ ఏడాది 'ఫర్జీ' వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. ఇది పక్కనబెడితే అప్పుడప్పుడు పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లి ఏమైనా ప్లాన్ చేస్తుందోమో చూడాలి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
9 నెలలు...బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన ఇలియానా
-
డేట్ నైట్
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. -
మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి...
కోల్కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా.. ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
బాయ్ఫ్రెండ్ దారుణం.. గర్భవతైన ప్రియురాలిని స్నేహితులతో కలిసి
ఉత్తరప్రదేశ్లో ఘోరం వెలుగు చూసింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోమని అడిగిందుకు ప్రియుడి చేతులో దారుణంగా హత్యకు గురైంది. గర్భవతి అని కూడా చూడకుండా ప్రియురాలిని స్నేహితులతో కలిసి అంతమొందించాడు ఓ దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటన మీరట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబిరి అనే యువతికి వినోద్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి రాంబిరి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఆదేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి శారీరక సంబంధానికి దారితీసింది. కాగా ఇటీవల రాంబిరి గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఆదేశ్పై ఒత్తిడి తీసుకొచ్చింది.పెళ్లి పేరులో ప్రియురాలు ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన ఆదేశ్ తన స్నేహితులతో కలిసి ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. జూలై 2న రాంబిరిని తన ఇంటికి కలవడానికి పిలిపించాడు. ఆమె రాగానే ఆదేశ్, అతని స్నేహితులు గర్భవతైన రాంబిరిని ఇటుకలతో బాది హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తీసుకొని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. తన కూతురు కనిపించడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 2న రాంబిరి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రియుడు ఆదేశ్తోపాటు నలుగురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలిని తామే చంపినట్లు నిందితుడు పోలీసులు మందు అంగీకరించాడు. ఆదేశ్ స్నేహితులను దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్గా గుర్తించారు. వీరందరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: మూత్ర విసర్జన ఘటన: గిరిజన యువకుని కాళ్లు కడిగిన సీఎం శివరాజ్ సింగ్ -
బాయ్ఫ్రెండ్తో కనిపించిన సాహో భామ.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!) అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ బీ టౌన్లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. రాహుల్ తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపించాయి. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
‘లివ్ ఇన్’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!
ఒక యువతి తన పార్ట్నర్తో లివ్ ఇన్లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్ ఇన్లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది. ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్ మేట్స్తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్ కాలేక విడిపోతున్నారు. వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్ ఇన్ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లివ్ ఇన్లో ఉండేందుకు.. ‘ది మిర్రర్’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్నర్తో పాటు లివ్ ఇన్లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్ఫ్రెండ్కు లివ్ ఇన్ కోసం ఉంచిన షరతులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ కూడా పాటించాలని స్పష్టం చేసింది. యువతి పెట్టిన నిబంధనలివే.. ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్ ఫ్రెండ్ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్ టేబుల్ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్.. లివ్ ఇన్లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్ లివ్ ఇన్లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
కీర్తిసురేష్ డేటింగ్ వార్తలపై స్పందించిన తండ్రి
హీరోయిన్ కీర్తి సురేష్ ఈమధ్య కాలంలో పెళ్లి వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కీర్తి ఓ అబ్బాయితో డేటింగ్లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయితో క్లోజ్గా ఫోటోలు దిగడం, ఇద్దరూ సేమ్ కలర్ అవుట్ఫిట్లో దర్శనం ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సోషల్ మీడియాలోనూ కీర్తి ప్రేమ విషయం వైరల్గా మారడంతో స్వయంగా ఆమె స్పందించక తప్పలేదు. తను జస్ట్ ఫ్రెండ్ అని, ఈ వార్తల్లో అతన్ని లాగకండి అంటూ పేర్కొంది. అంతేకాకుండా తన లైఫ్లోని నిజమైన మిస్టరీ మ్యాన్ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తానంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తిసురేష్ తండ్రి కూడా ఈ వార్తలపై స్పందించారు. 'నా కూతురు ప్రేమలో ఉందని,అతనితో త్వరలోనే పెళ్లి అంటూ కథనాలు రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు. రీసెంట్తో కీర్తి షేర్ చేసిన ఫోటోల్లోని అబ్బాయి నాకు తెలుసు. అతను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే తప్పకుండా మీడియాకు తెలియజేస్తాము. అంతేకానీ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల కుటుంబంలో మనఃశాంతి కరువవుతుంది' అంటూ ఆవేదన వ్యక్తి చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (24-05-2024)
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్పై స్టార్ జోడీ..!
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా 'సంజయ్ శర్మ'
ఎప్పటిలాగే ఇంకో రెండ్రోజులు ఇలాగే నిగ్రహంగా ఉంటే సరిపోతుంది సార్!
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement