-
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ క్యాంపెయినర్లకు ఒక నోట్ జారీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున్ ఖర్గే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘నవనీత్ కౌర్’ నామినేషన్.. సినిమా రేంజ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు
ముంబై : మహరాష్ట్ర అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్ధి ‘నవనీత్ కౌర్’ నామినేషన్ ప్రక్రియ ఓ సినిమాను తలపించింది. ఆమె నామినేషన్ చివరి నిమిషం వరకు ఎదురు చూపులు, ఉత్కంఠత కొనసాగింది. కుల ధృవీకరణ అంశంలో సుప్రీం కోర్టు కౌర్కు అనుకూలంగా తీర్పివ్వడంతో విజయ గర్వంతో నామినేషన్ వేశారు. నవనీత్ కౌర్ అమరావతి లోక్సభ అభ్యర్ధిగా గురువారం నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్ ముందు ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు సుప్రీం కోర్టులో కుల ధృవీకరణపై విచారణ, మరోవైపు లోక్సభ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు చివరి రోజు (ఏప్రిల్4). ఈ తరుణంలో కౌర్ నామినేషన్ వేసేందుకు ఉదయం బయలు దేరారు. ఆమె అభ్యర్ధిత్వం సుప్రీం కోర్టు కీలకం కావడంతో స్థానిక దసరా గ్రౌండ్లో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్తో పాటు తన మంది మార్బలంతో మధ్యాహ్నాం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 2021 జూన్ 8న నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రవీకరణ పత్రాలు ఉపయోగించారంటూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. మోసపూరితంగా వ్యవహరించారంటూ రూ.2లక్షల జరిమానా విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ కౌర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 11.58 గంటలకు విచారణ ప్రారంభం ఈ కేసు విచారణ గురువారం జరిగింది. సరిగ్గా 11:58 గంటలకు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్లతో కూడిన ధర్మాసనం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పును ప్రారంభించింది. కౌర్ కుల ధృవీకరణ పత్రంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టి వేసింది. నవనీత్ కౌర్కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. నవనీత్ కౌర్దే విజయం దీంతో 1100 కిలోమీటర్ల దూరంలో జరిగే సుప్రీం కోర్టు విచారణతో.. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న నవనీత్ కౌర్, ఆమె అనుచరులు ఆనందం వెల్లివిరిసింది. చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ సాగిన కౌర్కు అనుకూలంగా సుప్రీం ప్రకటించింది. ఐదు నిమిషాల వ్యవధిలో దసరా గ్రౌండ్ వేదికపై కెక్కిన ఫడ్నవీస్ కౌర్ విజయం సాధించారంటూ ప్రకటించారు. దీంతో రాణా తన మద్దతుదారులు, బీజేపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం 1:42గంటలకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. 2011లో రాజకీయ రంగ ప్రవేశం 2011లో నవనీత్ కౌర్ బీజేపీ నేత రవి రాణాతో వివాహం అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. తొలిసారి కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్న ఆమె 2014లో అమరావతి నుంచి తొలి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే 2019లో అమరావతి లోక్సభ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కాంగ్రెస్,ఎన్సీపీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. అమరావతి లోకసభ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. -
2009 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
2009 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ కు బొటాబొటీ మజార్టీనే వచ్చింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో 156 సీట్లు కాంగ్రెస్ కు రాగా, 91 స్థానాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈ ఎన్నికలలో విభజిత ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పక్షాన 106 మంది గెలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున ఏభై మూడు, మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున పదహారు మంది ఎన్నికయ్యారు. 2009లో రెడ్డి, కమ్మ, కాపుల మధ్య పోటీ ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే స్వతంత్ర కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై 31 మంది రెడ్లు, ఇరవై మూడు మంది బిసిలు, ఇరవై రెండు మంది ఎస్.సిలు, ఏడుగురు కాపులు, నలుగురు కమ్మ, ఆరుగురు ఎస్టి.లు,నలుగురు క్షత్రియ ముస్లింలు ముగ్గురు, వైశ్యులు ముగ్గురు, బ్రాహ్నణులు ఇద్దరు గెలిచారు. కాగా తెలుగుదేశం పక్షాన 19 మంది కమ్మ, ఎనిమిది మంది రెడ్లు, పది మంది బిసిలు, ఏడుగురు ఎస్సిలు, ఒక ఎస్టి, ఇద్దరు కాపు, ముగ్గురు క్షత్రియ, ఒక ముస్లిం, ఇద్దరు వైశ్యులు గెలపొందారు. ప్రజారాజ్యం పక్షాన పది మంది కాపులు, ముగ్గురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వైశ్యులు ఎన్నికయ్యారు. బిసిలలో కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు, శెట్టి బలిజ ఇద్దరు,పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ కురుమ లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. 42 మంది రెడ్డి ఎమ్మెల్యేల గెలుపు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎన్నిక కాగా వారిలో ముప్పై ఒక్క మంది కాంగ్రెస్ వారే. వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాలకు చెందినవారైతే, మిగిలిన పదిహేడు మంది రాయలసీమకు చెందినవారు. తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది ఎన్నిక కాగా, వారిలో ఇద్దరు కోస్తావారు, మిగిలినవారు రాయలసీమ నుంచి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరుకోస్తా, ఇద్దరు రాయలసీమ వారు. మొత్తం మీద రాయలసీమ నుంచి ఇరవైఐదు మంది రెడ్లు గెలుపొందగా, ఆంద్ర జిల్లాల నుంచి పదిహేడు మంది గెలిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత ఆయన సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా గెలుపొందారు. తిరిగి కడప ఎమ్.పిగా ఉన్న వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి, తిరిగి పోటీచేసినప్పుడు విజయమ్మ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీచేశారు.ఉప ఎన్నికలలో వీరిద్దరూ ఘన విజయం సాదించారు. 2009 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలలో డి.చంద్ర శేఖరరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, శివప్రసాదరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఎ. అమరనాద్ రెడ్డి, గడికోట శ్రీకాంతరెడ్డి, చెన్నకేశవరెడ్డి, గురునాదరెడ్డి, వైఎస్ ఆర్ కాంగ్రెస్లోకి వచ్చి పదవులు వదులుకొని తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచారు. అనర్హతకు గురైనవారిలో పెద్దిరెడ్డి రామచంద్రరరెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి వీరు అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి నుంచి గెలిచినవారిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు టిడిపి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్లో చేరారు. ప్రసన్నకుమార్రెడ్డి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. కాగా మిగిలిన ఇద్దరు అనర్హత వేటుకు గురైయ్యారు. ప్రజారాజ్యం నుంచి గెలిచినవారిలో శోభానాగిరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్లో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు. ప్రజారాజ్యం మరో ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్లోకి వెళ్లారు. రెడ్డి సామాజికవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు-31 ఎన్.శేషారెడ్డి- అనపర్తి డి.చంద్రశేఖర రెడ్డి - కాకినాడ సిటి గాదె వెంకటరెడ్డి- బాపట్ల కాసు వెంకట కృష్ణారెడ్డి- నరసరావుపేట వై. వెంకటేశ్వ రరరెడ్డి - సత్తెనపల్లి పి.రామకృష్నారెడ్డి - మాచర్ల శివప్రసాదరెడ్డి- దర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి- ఒంగోలు ఎమ్.మహీదర్ రెడ్డి-కందుకూరు ఉగ్ర నరసింహారెడ్డి-కనిగిరి, ఆనం రామనారాయణరెడ్డి- ఆత్మకూరు, ఆనం వివేకా నందరెడ్డి- నెల్లూరు రూరల్, ఆదాల ప్రభాకరరెడ్డి- సర్వేపల్లి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి, ఎ. అమరనాదరెడ్డి-రాజంపేట, గడికోట శ్రీకాంత రెడ్డి - రాయచోటి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి - పులివెందుల, జి.వీరశివారెడ్డి-కమ లాపురం, సి.ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు, డిఎల్. రవీంద్రరెడ్డి - మైదుకూరు, ఇ.ప్రతాపరెడ్డి - శ్రీశైలం, కె.రాంభూపాల్ రెడ్డి - పాణ్యం, శిల్పా మోహన్ రెడ్డి - నంద్యాల, చెన్నకేశవరెడ్డి - ఎమ్మిగనూరు, నీరజారెడ్డి - ఆలూరు, జె.సి.దివాకరరెడ్డి - తాడిపత్రి, గురునాదరెడ్డి - అనంతపురం, కె.వెంకట రామిరెడ్డి - ధర్మవరం, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి - పీలేరు, పి.రామచంద్రారెడ్డి - పుంగనూరు, కె.జయచంద్రారెడ్డి - చిత్తూరు. ఉప ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలిచినవారు పి.రామకృష్ణారెడ్డి-మాచర్ల బాలినేని శ్రీనివాసరెడ్డి-ఒంగోలు మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి ఎ.అమరనాదరెడ్డి-రాజంపేట గడికోట శ్రీకాంతరెడ్డి-రాయ చోటి వైఎస్ విజయమ్మ-పులివెందుల చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు గురు నాదరెడ్డి-అనంతపురం. తిరుపతి - భూమన కరుణాకరరెడ్డి (చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది) అనర్హత వేటుకు గురైన వారు డి.చంద్రశేఖరరెడ్డి-కాకినాడ శివప్రసాదరెడ్డి-దర్శి కె.వెంకటరామిరెడ్డి-ధర్మవరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పుంగనూరు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-8 కె.నారాయణరెడ్డి- మార్కాపురం ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు ఎమ్.లింగారెడ్డి-ప్రొద్దుటూరు వై.బాలనాగిరెడ్డి- మంత్రాలయం పి.రఘునాదరెడ్డి-పుట్టపర్తి ఎ.ప్రవీణ్ రెడ్డి-తంబళ్లపల్లె బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి పి.అమరనాదరెడ్డి- పలమనేరు ఉప ఎన్నికలు.. ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు అనర్హత వేటుకు గురైనవారు వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం ఎ.ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంభళ్లపల్లి ప్రజారాజ్యం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు-3 ఎ.శ్రీధర్ కృష్ణారెడ్డి- నెల్లూరు సిటీ-పిఆర్పి భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ-పిఆర్పి కె.రామిరెడ్డి- బనగానపల్లె- పిఆర్పి ఉప ఎన్నిక - భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ కమ్మ ఎమ్మెల్యేలు-24 2004 లో కాంగ్రెస్ పక్షాన 19 మందిఎమ్మెల్యేలు కమ్మ సామాజికవర్గం నుంచి గెలుపొందినా, 2009లో మాత్రం కాంగ్రెస్ లో ఆ వర్గం ఎమ్మెల్యేలు బాగా తగ్గిపోయారు.కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందగా, ఒకరు ప్రజారాజ్యం పక్షాన గెలిచారు. మిగిలిన 19 మంది కమ్మ ఎమ్మెల్యేలు టిడిపి తరపున గెలిచారు.వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాల నుంచి గెలుపొందగా, రాయలసీమలో ఐదుగురుగెలిచారు. టిడిపి ఎమ్మెల్యేలలో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లారు.ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానం లో టిడిపి విప్ కు విరుద్దంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.ప్రజారాజ్యం తరుపున గెలిచిన యలమంచిలి రవి ఆ పార్టీ విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2009 కమ్మ సామాజికవర్గ టిడిపి ఎమ్మెల్యేలు-19 వి.రామకృష్ణబాబు- విశాఖ తూర్పు వి.జోగేశ్వరరావు- మండపేట పి.వెంకటేష్- రాజానగరం- రాజానగరం బి.శేషారావు- నిడదవోలు చింతమనేని ప్రభాకర్- దెందులూరు డి.బాలవర్ధనరావు- గన్నవరం కొడాలి నాని-గుడివాడ దేవినేని ఉమామహేశ్వరరావు-మైలవరం కొమ్మాలపాటి శ్రీదర్-పెదకూరపాడు ధూళిపాళ్ల నరేంద్ర-పొన్నూరు ప్రత్తిపాటి పుల్లారావు-చిలకలూరిపేట జి.ఆంజనేయులు- వినుకొండ వై.శ్రీనివాసరావు- గురజాల కె.రామకృష్ణ - వెంకటగిరి కె. మీనాక్షి నాయుడు- ఆదోని పి.కేశవ్- ఉరవకొండ పరిటాల సునీత- రాప్తాడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు- నగరి నారా చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-4 దగ్గుబాటి వెంకటేశ్వరరావు - పర్చూరు-కాంగ్రెస్ గొట్టిపాటి రవికుమార్-అద్దంకి - కాంగ్రెస్ నాదెండ్ల మనోహర్ - తెనాలి-కాంగ్రెస్ గల్లా అరుణకుమారి - చంద్రగిరి - కాంగ్రెస్ 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ,తెలంగాణ ప్రకటన వంటి అంశాల నేపద్యంలో గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన అనర్హత వేటుకు గురయ్యారు. ప్రజారాజ్యం యలమంచిలి రవి - విజయవాడ తూర్పు - పిఆర్పి( ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు) 2009 కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-19 ప్రజారాజ్యం స్థాపనతో కాపు సామాజికవర్గం ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ఈ పార్టీకి ఓట్ల పరంగా గణనీయంగా ఓట్లు లభించినా, సీట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. కేవలం పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉమ్మడి రాష్ట్రంలో గెలుపొందగా, పదహారు సీట్లను ఎపి, రాయలసీమలలో గెలిచింది. అందులో పది సీట్లు కాపు నేతలే గెలుచుకున్నారు. 2004 లో కాపు సామాజికవర్గం వారు కాంగ్రెస్ నుంచి పదహారు మంది గెలవగా, 2009 లో ఏడుగురే గెలిచారు.ఇక తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయం అయింది. కేవలం ఇద్దరే గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ పక్షాన పది మంది విజయం సాదించారు. చిరంజీవి రెండు చోట్ల పోటీచేసి సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓడిపోవడం విశేషం. తిరుపతిలో ఆయన గెలిచారు. ఆ తర్వాత పరిణామాలలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. దాంతో వీరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యారు.చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన భూమన కరుణాకరరెడ్డి గెలుపొందారు. అవనతి గడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అస్వస్థతతో మరణించగా, ఆయన కుమారుడు హరి ప్రసాద్ గెలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆయనకు పోటీ పెట్టలేదు. ప్రజారాజ్యం పక్షాన గెలిచిన కాపు నేతలు ఎమ్. శ్రీనివాసరావు- భీమిలి సిహెచ్. వెంకటరామయ్య - గాజువాక గంటా శ్రీనివాసరావు - అనకాపల్లి పి.రమేష్ బాబు-పెందుర్తి ఈలి మధు సూదనరావు - టి.పిగూడెం వి.గీత-పిఠాపురం కె.కన్నబాబు - కాకినాడ రూరల్ పి.గాంధీ మోహన్-పెద్దాపురం బి. సత్యానాందరావు- కొత్తపేట కొణిదెల చిరంజీవి- తిరుపతి. కాంగ్రెస్కు చెందిన కాపు ఎమ్మెల్యేలు.. 7 తోట నరసింహం- జగ్గంపేట పి.రామాంజనేయులు-భీమవరం వట్టి వసంతకుమార్-ఉంగుటూరు- కాంగ్రెస్ ఎ.కె.శ్రీనివాస్- ఏలూరు పేర్ని వెంకట్రామయ్య(నాని) -బందరు కన్నా లక్ష్మీనారాయణ- గుంటూరు పశ్చిమ - కాంగ్రెస్ ఎ. కృష్ణమోహన్ -చీరాల కాంగ్రెస్ రాజకీయ పరిణామాలలో ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అనర్హత వేటుకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ కాపు ఎమ్మెల్యేలు-2 పి.సత్యనారాయణమూర్తి- ప్రత్తిపాడు అంబటి బ్రాహ్మణయ్య- అవనిగడ్డ. ఉప ఎన్నిక అవనిగడ్డ- అంబటి హరి ప్రసాద్-టిడిపి ఉప ఎన్నికలు రామచంద్రపురం-తోట త్రిమూర్తులు-కాంగ్రెస్ నరసాపురం- కొత్తపల్లి సుబ్బరాయుడు-కాంగ్రెస్ 2009లో ఎన్నికైన బిసి ఎమ్మెల్యేలు-33 ఈ ఎన్నికలలో ముప్పై మూడు మంది బిసి వర్గాలకు చెందిన వారు శాసనసభకు ఎన్నిక కాగా వారిలో పది మంది టిడిపికి చెందినవారు. మిగిలిన ఇరవై మూడు మంది కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఇచ్చాపురం, ఎస్.కోట, మాడ్గుల, కావలి, డోన్ , ప్రత్తికొండ, రాజమండ్రి రూరల్, కైకలూరు, పెనుకొండ, కదిరిలలో మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందగా, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, బీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విశాఖ-ఉత్తరం, విశాఖ-పశ్చిమ, నర్సీపట్నం, రాజమండ్రిసిటి, రామచంద్రాపురం, ముమ్మడివరం, ఆచంట, తణుకు, పెడన, పెనమలూరు, మంగళగిరి, రేపల్లె, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గంలలో కాంగ్రెస్ గెలిచింది. కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు,శెట్టి బలిజ ఇద్దరు, పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ, కురుమ, లింగాయత్లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు దర్మాన కృష్ణప్రసాద్, పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపు రామచంద్రరెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్లో చేరి తిరిగి పోటీ చేశారు.అయితే ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి తిరిగి గెలుపొందగా, సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. కాగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టెక్కలి ఎమ్మెల్యే కె.రేవతిపతి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు.టిడిపి ఎమ్మెల్యేలలో ఇచ్చాపురం ఎమ్మెల్యే పి.సాయిరాజ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్లో చేరి అనర్హత వేటుకు గురయ్యారు. కాంగ్రెస్కు చెందిన బిసి ఎమ్మెల్యేలు.. 23 కె.రేవంతిపతి - టెక్కలి-కాళంగ బి.సత్యవతి - ఆముదాలవలస - కాళంగ ధర్మాన ప్రసాదరావు - శ్రీకాకుళం-పొలినాటి వెలమ ధర్మాన కృష్ణదాస్ - నరసన్నపేట పొలినాటి వెలమ ముత్యాలపాప - నర్సీపట్నం - కాంగ్రెస్ - కొప్పుల వెలమ, విజయకుమార్ - విశాఖ ఉత్తర - కొప్పుల వెలమ, ఎమ్. నీలకంఠం - ఎచ్చెర్ల - తూర్పు కాపు బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి - తూర్పుకాపు బి.అప్పలనరసయ్య-గజపతినగరం-తూర్పుకాపు బి.అప్పలనాయుడు- నెల్లిమర్ల- కాంగ్రెస్- తూర్పుకాపు, ఆర్. సూర్యప్రకాశరావు-రాజమండ్రి-కాంగ్రెస్- తూర్పుకాపు ఎమ్.విజయప్రసాద్-విశాఖ పశ్చిమ-కాంగ్రెస్-గవర జె.జగన్నాయకులు-పలాస-కాంగ్రెస్- మత్సకార సతీష్ కుమార్- ముమ్మడివరం-కాంగ్రెస్- మత్సకార ఎమ్.వి.రమణరావు- రేపల్లె- కాంగ్రెస్-మత్సకార కె.వి.నాగేశ్వరరావు- తణుకు- కాంగ్రెస్-యాదవ, కె.పార్దసారది- పెనమలూరు- కాంగ్రెస్-యాదవ ఎన్.రఘువీరారెడ్డి- కళ్యాణదుర్గం- కాంగ్రెస్- యాదవ జోగి రమేష్- పెడన- కాంగ్రెస్-గౌడ పి.సుభాష్ చంద్రబోస్- రామచంద్రాపురం-కాంగ్రెస్- శెట్టి బలిజ పి.సత్యనారాయణ- ఆచంట-కాంగ్రెస్- శెట్టి బలిజ కోండ్రు కమల-మంగళగిరి-కాంగ్రెస్-పద్మశాలి కాపు రామచంధ్రారెడ్డి రాయదుర్గం. ఉప ఎన్నికలు టెక్కలి- కె.భారతి`కాంగ్రెస్, నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్`వైఎస్ఆర్ కాంగ్రెస్ రాయదుర్గం`కాపు రామచంధ్రారెడ్డి`వైఎస్ఆర్ కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్నికైన బిసి నేతలు-10 పి.సాయిరాజ్- ఇచ్చాపురం- కాళింగ కె.లలితకుమారి- ఎస్.కోట- కొప్పుల వెలమ జి. రామానాయుడు మాడ్గుల కొప్పుల వెలమ జె.వెంకటరమణ-కైకలూరు-వడ్డి బి.మస్తాన్ రావు - కావలి- యాదవ కె.ఇ.కృష్ణమూర్తి-డోన్ - గౌడ కె.ఇ.ప్రభాకర్- పత్తికొండ- గౌడ బి.కె.పార్దసారది-పెనుకొండ - కురుమ చందన రమేష్- రాజమండ్రి రూరల్ -దేవాంగ వెంకట ప్రసాద్-కదిరి-పద్మశాలి. 2009 ఎస్.సి సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం 29 ఎస్.రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో కాంగ్రెస్ కు ఇరవై రెండు స్థానాలు, తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు దక్కాయి. వారి వివరాలు.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు(వైఎస్ ఆర్ కాంగ్రెస్లో చేరి తిరిగి ఉప ఎన్నికలలో గెలుపొందారు కాగా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి ఎమ్మెల్యేలలో గోపాలపురం ఎమ్మెల్యే వనిత కూడా అనర్హత వేటుకు గురయ్యారు). కాంగ్రెస్ ఎస్.సి ఎమ్మెల్యేలు-22 కె.మురళీమోహన్ - రాజాం ఎస్.జయమణి - పార్వతిపురం జి.బాబూరావు - పాయకరావుపేట పి.విశ్వరూప్- అమలాపురం ఆర్.వరప్రసాదరావు-రాజోలు పి.రాజేశ్వరీదేవీ-పి.గన్నవరం, రాజేష్ కుమార్-చింతలపూడి డి.పద్మజ్యోతి- తిరువూరు డి.వై.దాస్-పామర్రు డి.ఎమ్.వరప్రసాద్- తాడికొండ ఎమ్.సుచరిత-ప్రత్తిపాడు ఎ.సురేష్-ఎర్రగొండపాలెం బి.ఎస్. విజయకుమార్ -సంతనూతలపాడు జి.వి.శేషు- కొండపి కమలమ్మ-బద్వేల్ కె.శ్రీనివాసులు-ర్వేల్వే కోడూరు ఎల్.వెంకటస్వామి-నందికోట్కూరు, మురళీకృష్ణ-కొడుమూరు ఎస్.శైలజానాధ్-శింగనమల కె.సుధాకర్- మడకశిర జి.కుతూహలమ్మ- గంగాధర నెల్లూరు పి.రవి-పూతల్ పట్టు. ఉప ఎన్నికలు.. పాయకరావుపేట-జి.బాబూరావు ఎమ్.సుచరిత-ప్రత్తిపాడు శ్రీనివాసులు-రైల్వే కోడూరు – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
2004 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. విబజిత ఏపీలో కాంగ్రెస్ కు 139 స్థానాలలో విజయం సిద్దించగా, తెలుగుదేశంపార్టీకి ముప్పైఏడు స్థానాలే దక్కాయి. బిజెపికి ఒకటి, సీపీఐకి రెండు, సీపీఎం కు మూడు, నలుగురు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు.అప్పట్లో ఏపీలోని ఆంద్ర, రాయలసీమలలో కలిపి 187 నియోజకవర్గాలు ఉండేవి. సామా జికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 49 మంది, కమ్మ 32 మంది, కాపు, తెలగ, బలిజ వర్గాలకు చెందినవారు 23 మంది, బీసీలు ముప్పై నాలుగు మంది ఎస్సీ లు 22 మంది, ఎస్టీలు ఎనిమిది మంది గెలిచారు. క్షత్రియలు ఏడుగురు, ముస్లింలు నలుగురు, వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణ ఒకరు, క్రిస్టియన్ ఒకరు, అగర్వాల్ ఒకరు గెలుపొందారు. బీసీ వర్గాల విశ్లేషణ తూర్పు కాపు-7 యాదవ- 5 కొప్పుల వెలమ-4 శెట్టి బలిజ-4, పొలినాటి వెలమ-3,పద్మశాలి-3, కాళింగ-2,గవర-1,రెడ్డిక-1,మత్సకార-1, వడ్డీ-1, బోయ-1, గౌడ-1(మొత్తం పదమూడు బీసీ కులాల నుంచి ముప్పైనాలుగు మంది ఎన్నికయ్యారు) 2004-రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ కు అదికారంలోకి రాగా,అత్యధిక సంఖ్యలో 49 మంది రెడ్డినేతలు శాసనసభకు ఎన్నికయ్యారు.వీరిలో కాంగ్రెస్ పక్షాన నలభై నాలుగు మంది,టీడీపీ తరుపున నలుగురు, ఇండిపెండెంటు ఒకరు ఎన్నిక య్యారు. వీరిలో ఇరవై మంది కోస్తా జిల్లాల నుంచి ఇరవై మంది ఎన్నిక కాగా, మిగిలిన ఇరవైనాలుగు మంది రాయలసీమ నుంచి గెలుపొందారు.టీడీపీ తరపున కేవలం నలుగురే గెలుపొందారు.గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మంది రెడ్లు టీడీపీ తరపున గెలవలేదు. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు.. 44 టి.రామారెడ్డి-అనపర్తి చిర్ల జగ్గారెడ్డి-కొత్తపేట బుల్లబ్బాయిరెడ్డి-సంపర గాదె వెంకటరెడ్డి-బాపట్ల గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల కాసు కృష్ణారెడ్డి-నరసరావుపేట వై.వెంకటేశ్వరరెడ్డి-సత్తెనపల్లి పీ.లక్ష్మారెడ్డి-మాచర్ల వి.శ్రీనివాసులురెడ్డి-కంభం బి.శ్రీనివాసరెడ్డి-ఒంగోలు, బి.మహీధర్ రెడ్డి-కందుకూరు, కే.పెదకొండారెడ్డి-మార్కాపురం, మాగుంట పార్వతమ్మ-కావలి, పీ.శ్రీనివాసులురెడ్డి-కోవూరు, ఎ.వివేకానందరెడ్డి-నెల్లూరు, ఎ.రామ నారాయణరెడ్డి-రాపూర, ఎ.ప్రభాకరరెడ్డి-సర్వేపల్లి, కే.విష్ణువర్ధనరెడ్డి-అల్లూరు, ఎన్.రాజ్యలక్ష్మి-వెంకటగిరి, ఎమ్.చంద్రశేఖరరెడ్డి-ఉదయగిరి, డి.సి. గోవిందరెడ్డి-బద్వేల్, కే.ప్రభావతమ్మ-రాజంపేట, జి.మోహన్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి-పులివెందుల, సి.ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు, ఎన్.వరదరాజులరెడ్డి-ప్రొద్దుటూరు, డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి-మైదుకూరు, జి.ప్రతాపరెడ్డి-ఆళ్లగడ్డ, ఇ.ప్రతాపరెడ్డి-ఆత్మకూరు, గౌరు చరిత-నందికోట్కూరు, కే.రాంభూపాల్ రెడ్డి-పాణ్యం, ఎస్.మోహన్ రెడ్డి-నంద్యాల, చల్లా రామకృష్ణారెడ్డి-కోయిలకుంట్ల, కోట్ల సుజాత-డోన్, కే.చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు, వై.సాయి ప్రసాదరెడ్డి-ఆదోని, బి.నారాయణరెడ్డి-అనంతపురం, డాక్టర్ కే.మోహన్ రెడ్డి-నల్లమడ, జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి, పీ.రవీంద్రరెడ్డి-గోరంట్ల, కే.ప్రభాకరరెడ్డి-తంబళ్లపల్లె, పీ.రామచంద్రారెడ్డి-పీలేరు, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి-వాయల్పాడు 44.ఆర్.చెంగారెడ్డి-నగరి. రెడ్డి ఎమ్మెల్యేలు- తెలుగుదేశం-4 జి.వీరశివారెడ్డి-కమలాపురం ఎస్.వి.సుబ్బారెడ్డి-పత్తికొండ బి.గోవిందరెడ్డి-రాయదుర్గం ఎన్.అమరనాధ్ రెడ్డి-పుంగనూరు ఇండిపెండెంట్ రెడ్డి ఎమ్మెల్యే -1 బి.సుబ్బారెడ్డి-దర్శి కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు- 2004 2004లో కాంగ్రెస్ తరపున కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికవడం విశేషం. మొత్తం 32 మంది ఎన్నిక కాగా, వారిలో కాంగ్రెస్ తరపున 21 మంది, టీడీపీ పక్షాన పది మంది ఉండగా, ఒక కమ్మ నేత ఇండిపెండెంటుగా కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేల వివరాలు-21 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కు కమ్మ సామాజికవర్గం నుంచి ఇంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం ఇదే అని చెప్పాలి.మొత్తం 32 మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందగా,వారిలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ నుంచి పది మంది టీడీపీ నుంచి గెలవగా, ఒకరు ఇండిపెండెంటుగా గెలిచారు.వీరిలో పద్దెనిమిది మంది కోస్తా జిల్లాల నుంచి కాగా, ముగ్గురు రాయలసీమ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన పది మంది లోఐదుగురు కోస్తా జిల్లాల నుంచి , ఐదుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు బి.కృస్ణార్జున చౌదరి-ఆలమూరు సిహెచ్ రవీంద్ర-బూరుగుపూడి చిట్టూరి బాపినీడు-తణుకు మాగంటి వెంకటేశ్వరరావు-దెందులూరు, ఘంటా మురళరామకృష్ణ-చింతలపూడి, వై.రాజారామచందర్- కైకలూరు, పిన్నమనేని వెంకటేశ్వరరావు- ముదినేపల్లి, దేవినేని రాజశేఖర్-కంకిపాడు, చనుమోలు వెంకటరావు-మైలవరం, డి.మల్లిఖార్జునరావు-రేపల్లె, నాదెండ్ల మనోహర్-తెనాలి, రావి వెంకటరమణ-పత్తిపాడు, మర్రి రాజశేఖర్- (కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్), ఎమ్.మల్లిఖార్జునరావు-వినుకొండ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు, గొట్టిపాటి రవికుమార్-మార్టూరు, పోతుల రామారావు-కండపి, ఐ.తిరుపతి నాయుడు-కనిగిరి, గల్లా అరుణకుమారి-చంద్రగిరి, ఎస్.సి.వి.నాయుడు-శ్రీకాళహస్తి, జి.ముద్దుకృష్ణమనాయుడు- పుత్తూరు. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు..10 పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు కొడాలి వెంకటేశ్వరరావు-గుడివాడ డి. ఉమా మహేశ్వరరావు-నందిగామ డి.నరేంద్ర కుమార్-పొన్నూరు కరణం బలరాం-అద్దంకి పీ.కేశవ్-ఉరవకొండ పరిటాల రవీంద్ర-పెనుకొండ జి.జయలక్ష్మమ్య-ధర్మవరం డి.రమేష్-మదనపల్లె చంద్రబాబు నాయుడు -కుప్పం. ఇండిపెండెంట్-1 కే.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు.. 23 కాపు సామాజకవర్గం ఎమ్మెల్యేలు 2004 లో ఇరవై మూడు మంది ఎన్నికైతే వారిలో పదహారు మంది కాంగ్రెస్ నుంచి, ఆరుగురు టీడీపీ నుంచి, ఒకరు బిజెపి పక్షాన ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పక్షాన గెలిచినవారిలో కోస్తా జిల్లాల నుంచి పదహేను మంది , రాయలసీమ నుంచి ఒకరు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురిలో నలుగురు కోస్తా జిల్లాల వారు కాగా, ఇద్దరు రాయలసీమ వారు. కాంగ్రెస్ కాపు,బలిజ ఎమ్మెల్యేలు-16 కరణం ధర్మశ్రీ-మాడుగుల తోట గోపాలకృష్ణ-పెద్దాపురం జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం తోట నరసింహం-జగ్గంపేట గ్రంది శ్రీనివాస-భీమవరం కే.సత్యనారాయణ-తాడేపల్లిగూడెం వట్టి వసంతకుమార్-ఉంగుటూరు ఎ.కే.శ్రీనివాస్-ఏలూరు బి.వేదవ్యాస్-మల్లేశ్వరం పేర్ని నాని-మచిలీపట్నం మండలి బుద్ద ప్రసాద్-అవనిగడ్డ వంగవీటి రాదాకృష్ణ-విజయవాడ సామినేని ఉదయభాను-జగ్గయ్యపేట కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు పగడాల రామయ్య-గిద్దలూరు (బలిజ) ఎమ్.వెంకటరమణ-తిరుపతి.(బలిజ) తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-6 గంటా శ్రీనివాసరావు-చోడవరం పర్వత సత్యనారాయణమూర్తి-ప్రత్తిపాడు సి.హెచ్. సత్యనారాయణమూర్తి-పాలకొల్లు కే.సుబ్బారాయుడు-నరసాపురం ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి ఎ.ఎస్.మనోహర్-చిత్తూరు (బలిజ). బారతీయ జనతా పార్టీ 1. పీ.దొరబాబు-పిఠాపురం వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్యేలు(బీసీ)-34 ఏపీలో 2004 లో ముప్పై నాలుగు మంది బీసీ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో కాంగ్రెస్ పక్షాన గెలిచినవారు ఇరవై రెండు మంది కాగా, టీడీపీ తరపున పది మంది నెగ్గారు. ఇద్దరు ఇండిపెండెంట్లుగా విజయం సాదించారు. ఆయా కులాల వారీగా పరిశీలిస్తే కాళింగ ఇద్దరు( కాంగ్రెస్) పొలినాటి వెలమ ముగ్గురు, కొప్పుల వెలమ నలుగురు కలిపి ఏడుగురు( నలుగురు కాంగ్రెస్ ,ముగ్గురు టీడీపీ), తూర్పుకాపులు ఏడుగురు( ముగ్గురు కాంగ్రెస్ ,నలుగురు టీడీపీ), గవర ఒకరు (కాంగ్రెస్), రెడ్డిక ఒకరు (కాంగ్రెస్), శెట్టిబలిజలు నలుగురు (ముగ్గురు కాంగ్రెస్, ఒకరు ఇండిపెండెంట్), యాదవ ఐదుగురు( ముగ్గురు కాంగ్రెస్, ఒకరు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్), బోయ ఇద్దరు( ఒకరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ), పద్మశాలి ముగ్గురు( ఇద్దరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ), మత్స్యకార, వడ్డీ ఒక్కొక్కరు(కాంగ్రెస్) గౌడ ఒకరు(టీడీపీ) ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు.. 22 అప్పయ్యదొర-టెక్కలి-కాళింగ డి.ఫ్రసాదరావు-శ్రీకాకుళం-పొలినాటి వెలమ బోడ్డేపల్లి సత్యవతి-ఆముదాలవలస-కాళింగ డి.కృష్ణదాస్-నరసన్నపేట-పొలినాటి వెలమ బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి-తూర్పు కాపు పీ.మంగపతిరావు-ఉత్తరాపల్లి- కొప్పుల వెలమ, కే.సీతారామ్-భీమిలి-తూర్పుకాపు, గండి బాబ్జి-కొప్పుల వెలమ, కొణతాల రామకృష్ణ-గవర, పీ. గురుమూర్తి రెడ్డి-పెందుర్తి-రెడ్డి, డి.వెంకటేశ్వర్లు-తాళ్లరేవు-శెట్టి బలిజ, పిల్లి సుభాష్ చంద్రబోస్-రామచంద్రపురం-శెట్టి బలిజ, రౌతు సూర్యప్రకాష్ రావు-రాజమండ్రి-తూర్పుకాపు, పితాని సత్యనారాయణ-ఆచంట-శెట్టి బలిజ, కే.పార్దసారధి- ఉయ్యూరు-యాదవ, ఎమ్.హనుమంతరావు-మంగళగిరి-పద్మశాలి, మోపిదేవి వెంకటరమణ-కూచినపూడి-మత్స్యకార, టి.వెంకట్రావు-గుంటూరు-2-వడ్డీ, జె.కృష్ణమూర్తి-గురజాల-యాదవ, ఎన్.నీలావతి-గుత్తి-బోయ, ఎన్.రఘువీరారెడ్డి -మడకశిర-యాదవ, జొన్నా రామయ్య-కదిరి-పద్మశాలి. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 10 గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కే.మోహన్ రావు-పాతపట్నం-తూర్పుకాపు కే.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పొలినాటి వెలమ కే.కళావెంకట్రావు- ఉణుకూరు-తూర్పుకాపు తెంటు జయప్రకాష్-తెర్లాం-కొప్పుల వెలమ పడాల అరుణ- గజపతినగరం-తూర్పుకాపు పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు సి.హెచ్. అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కొప్పుల వెలమ యనమల రామకృష్ణుడు-తుని-యాదవ పీ.రంగనాయకులు -హిందూపూర్-పద్మశాలి. ఇండిపెండెంట్లు.. 2 కుడిపూడి చిట్టబ్బాయి-అమలాపురం-శెట్టిబలిజ ఎమ్.వెంకటేశ్వరరావు-గన్నవరం-యాదవ. 2004 ఎస్.సి ఎమ్మెల్యేల వివరాలు ఈ ఎన్నికలలో పదహారు మంది కాంగ్రెస్ తరపున,ఐదుమంది టీడీపీ పక్షాన, ఒకరు సీపీఎం తరపున గెలిచారు.వారి వివరాలు.. కాంగ్రెస్ ఎస్.సి ఎమ్మెల్యేలు.. 16 కే. మురళీమోహన్-ఎచ్చెర్ల పీ. విశ్వరూప్-అమలాపురం పీ. రాజేశ్వరదేవి-నగరం జి.సూర్యారావు-అల్లవరం, మద్దాల సునీత-గోపాలపురం, కోనేరు రంగారావు -తిరువూరు, డి.మాణిక్ వర ప్రసాద్-తాడికొండ, దారా సాంబయ్య-సంతనూతలపాడు, పీ.ప్రకాశ్ రావు-గూడూరు, ఎన్.సుబ్రహ్మణ్యం-సూళ్లూరుపేట, జి.వెంకటేశ్వర ప్రసాద్-కోడూరు, పీ.మురళికృష్ణ-కొడుమూరు, ఎమ్.మారెప్ప-ఆలూరు, ఎస్.శైలజానాద్-శింగనమల, కే.నారాయణస్వామి-సత్యవేడు, జి.కుతూహలమ్మ-వేపంజేరి. టీడీపీ ఎస్.సి. ఎమ్మెల్యేలు-5 కే.జోగులు-పాలకొండ చెంగల వెంకట్రావు-పాయకరావుపేట పీ.సుజాత-ఆచంట ఎల్.లలిత కుమారి-పలమనేరు బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం సీపీఎం..1 పాటూరు రామయ్య-నిడుమోలు 2004 - షెడ్యూల్ జాతుల ఎమ్మెల్యేలు-8 ఎస్టీవర్గాలకు చెందినవారు కాంగ్రెస్ పక్షాన నలుగురు, టీడీపీ తరపున ఇద్దరు, ఒకరు సీపీఐ,ఒకరు సీపీఎం పక్షాన గెలిచారు. వారి వివరాలు. కాంగ్రెస్ జన్నిమినతి గోమాంగో-కొత్తూరు కుంభా రవి-ఎస్.కోట పీ.బాలరాజు-పాడేరు టి.బాలరాజు- పోలవరం. రాజన్నదొర-సాలూరు (2007 లో కోర్టు ద్వారా ఎన్నికయ్యారు) తెలుగుదేశం ఆర్.భంజ్ దేవ్-సాలూరు (2007లో ఈయన గిరిజనుడు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది). సి.రమేష్-ఎల్లవరం ఇతరులు.. కే.లక్ష్మణమూర్తి- నాగూరు-సీపీఎం సి.దేముడు-చింతపల్లి-సీపీఐ క్షత్రియ ఎమ్మెల్యేలు-7 క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు ఏడుగురు ఎన్నిక కాగా, అంతా కాంగ్రెస్ కు చెందినవారే కావడం విశేషం. వారి వివరాలు.. ఎస్.విజయరామరాజు-పార్వతీపురం పీ.సాంబశివరాజు-సతివాడ ఎస్. రంగరాజు-విశాఖ-రెండు యువి రమణమూర్తి రాజు-యలమంచిలి ఎ. కృష్ణంరాజు-రాజోలు సి.రంగనాదరాజు-అత్తిలి పీ.సర్రాజు-ఉండి. ముస్లింలు-4 నలుగురు ముస్లింలు ఎన్నిక కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం పక్షాన గెలుపొందారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు కూటమిగా పోటీచేశాయి. షేక్ నాజర్ వలి-విజయవాడ-ఒన్-సీపీఐ షేక్ సుబాని-గుంటూరు -ఒన్-కాంగ్రెస్ అహ్మదుల్లా-కడప-కాంగ్రెస్ ఎమ్.ఎ.గపూర్- కర్నూలు- సీపీఎం ఇతర సామాజికవర్గాలలో వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణులు ఒకరు, అగర్వాల ఒకరు ఉన్నారు.ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు. వారి వివరాలు. ఒక్కరు తప్ప వీరందరూ కాంగ్రెస్ పక్షానే ఎన్నికయ్యారు. ఒకరు మాత్రం ఇండిపెండెంట్ గా నెగ్గారు. ద్రోణం రాజు సత్యనారాయణ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్దిగా ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు. వైశ్య-3 (ఇద్దరు కాంగ్రెస్ -ఒకరు ఇండి) వీరభద్రస్వామి- విజయనగరం-వైశ్య- ఇండి ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ-వైశ్య-కాంగ్రెస్ కొణిజేటి రోశయ్య-చీరాల- వైశ్య-కాంగ్రెస్. వెలమ-2(ఇద్దరు కాంగ్రెస్) సుజయ కృష్ణ రంగారావు- బొబ్బిలి-వెలమ-కాంగ్రెస్ ఎమ్.వి. ప్రతాప అప్పారావు- నూజివీడు- వెలమ- కాంగ్రెస్ బ్రాహ్మణ-1(కాంగ్రెస్) ద్రోణంరాజు సత్యనారాయణ-విశాఖ-1-బ్రాహ్మణ-కాంగ్రెస్, ఉప ఎన్నిక విశాఖ-1- ద్రోణం రాజు శ్రీనివాస్ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1999 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తిరిగి అదికారంలోకి వచ్చింది. బీజేపీ పొత్తుతో ఎన్నికలలో పోటీచేసిన తెలుగుదేశం పార్టీ ఆంద్ర ప్రాంతంలో 130 నియోజకవర్గాలలో గెలుపు సాధించింది.ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు నలభై తొమ్మిది సీట్లు రాగా, బీజేపీ కి నాలుగు దక్కాయి. ఇండిపెండెంట్లు నలుగురు నెగ్గారు. సామాజికవర్గాల విశ్లేషణ చూస్తే రెడ్డి సామాజికవర్గం వారు 44 మంది గెలవగా,వారిలో తెలుగుదేశం పక్షాన 21 మంది, కాంగ్రెస్ పార్టీ తరపున 23 మంది నెగ్గారు. కమ్మ సామాజికవర్గం వారు నలభై మంది గెలవగా, టీడీపీ నుంచి 34 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. కాపు సామాజికవర్గం వారు 22 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో టీడీపీపద్నాలుగు మంది, ఆరుగురు కాంగ్రెస్ వారు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీసీలు ముప్పై నాలుగు మందికిగాను టీడీపీ24, కాంగ్రెస్ నుంచి పది మంది గెలిచారు. ఎస్.సిలు ఇరవై రెండు మందికి గాను పదహారు మంది టీడీపీ, నలుగురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ,ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు.క్షత్రియలు ఎనిమిది మంది గెలిస్తే, ఏడుగురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ వారు ఉన్నారు.ఎస్.టిలు ఎనిమిది మందికిగాను ఏగుగురు తెలుగుదేశం వారే. ఒకరు కాంగ్రెస్ నుంచి నెగ్గారు. కాగా ముస్లింలు ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ నుంచి నెగ్గారు. ఇతరులు నలుగురు టీడీపీవారే. బీసీ వర్గాల విశ్లేషణ- కొప్పుల వెలమ-7 యాదవ- 5 తూర్పు కాపు-4 గౌడ-4 మత్సకార-3 పొలినాటి వెలమ-3 కాళింగ- 2 గవర- 2 పద్మశాలి-2 శెట్టి బలిజ-1 రెడ్డి ఎమ్మెల్యేల విశ్లేషణ-44 1999లో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చినా , రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున కొద్దిగా ఎక్కువగా గెలవడం విశేషం.టీడీపీపక్షాన 21 మంది రెడ్లు గెలిస్తే, 23 మంది రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. కోస్తాలో ఎనిమిది మంది కాంగ్రెస్ పక్షాన, ఎనిమిది మంది టీడీపీనుంచి గెలిచారు. రాయలసీమ నుంచి పదిహేను మంది కాంగ్రెస్ పక్షాన రెడ్లు ఎన్నిక కాగా, టీడీపీతరపున పదమూడు మంది గెలిచారు. తెలుగుదేశం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు.. 21 ఎన్. మూలారెడ్డి - అనపర్తి, జె. దుర్గాంబ-మాచర్ల పి. విజయ్ కుమార్ రెడ్డి-గిద్దలూరు వి. వేణుగోపాలరెడ్డి-కావలి, ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి- కోవూరు, ఎస్.చంద్రమోహన్ రెడ్డి-సర్వేపల్లి, ఎ.ప్రభాకరరెడ్డి-అల్లూరు, కె.విజయరామిరెడ్డి- ఉదయగిరి, కె.వీరారెడ్డి- బద్వేల్, ఆర్ రమేష్ కుమార్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, పి.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు,ఎస్.రఘురామిరెడ్డి- మైదుకూరు, బి.శోబా నాగిరెడ్డి- ఆళ్లగడ్డ, బి.సీతారామిరెడ్డి-ఆత్మకూరు, బి.రాజశేఖరరెడ్డి-నందికోట్కూరు, బి.పార్ధసారధిరెడ్డి- పాణ్యం, ఎస్.వి.సుబ్బారెడ్డి- ప్రత్తికొండ, బివి మోహన్ రెడ్డి- ఎమ్మిగనూరు, పి.రఘునాదరెడ్డి-నల్లమడ, బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి, ఆర్.రాజశేఖరరెడ్డి- పుత్తూరు. ఉప ఎన్నిక.. గిద్దలూరు - సాయికల్పన రెడ్డి - టీడీపీ కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు- 23 గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల కె. నాగార్జునరెడ్డి-కంభం ఎస్. పిచ్చిరెడ్డి-దర్శి బి. శ్రీనివాసరెడ్డి- ఒంగోలు, కె.పి. కొండారెడ్డి- మార్కాపురం, ఆనం వివేకానందరెడ్డి- నెల్లూరు, ఆనం రామనారాయణరెడ్డి- రాపూరు, ఎన్.రాజ్యలక్ష్మి- వెంకటగిరి, వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల, ఎమ్.వి. మైసూరారెడ్డి- కమలాపురం, ఎన్.వరదరాజులు రెడ్డి -ప్రొద్దుటూరు, చల్లా రామకృష్ణారెడ్డి- కోయిలకుంట్ల, వి.వేణుగోపాలరెడ్డి- రాయదుర్గం, వై.శివరామిరెడ్డి- ఉరవకొండ, జెసి దివాకరరెడ్డి- తాడిపత్రి, బి.నారాయణరెడ్డి- అనంతపురం, కె.సూర్యప్రతాపరెడ్డి- ధర్మవరం, కె.ప్రభాకరరెడ్డి- తంబళ్లపల్లె, పి.రామచం్షరెడ్డి-పీలేరు, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి- వాయల్పాడు, ఎన్.శ్రీధర్ రెడ్డి-పుంగనూరు, ఆర.చెంగారెడ్డి-నగరి, సి.కె.జయచంద్రారెడ్డి-చిత్తూరు. కమ్మ సామాజికవర్గం విశ్లేషణ- 40 కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం నలభై మంది ఎన్నిక కాగా, వారిలో ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి విజయం సాదించారు. ఒకరు బీజేపీ నుంచి గెలవగా ,మరొకరు ఇండిపెండెంటుగా నెగ్గారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారిలో ఇరవై తొమ్మిది మంది కోస్తా జిల్లాల నుంచి గెలవగా, ఐదుగురు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచివనారిలో ముగ్గురు కోస్తా నుంచి ఒకరు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ, ఇండిపెండెట్లు కూడా కోస్తా జిల్లాలవారే. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు-34 ఎమ్.వి. కృష్ణారావు-ఇచ్చాపురం గద్దె బాబూరావు-చీపురుపల్లి బి. భాస్కర రామారావు-పెద్దాపురం వివిఎస్ చౌదరి-ఆలమూరు, కె.అచ్చమాంబ-బూరు గుపూడి, జి.బుచ్చయ్యచౌదరి-రాజమండ్రి, వై.టి .రాజా- తణుకు, కె.విశ్వనాధం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, డి.బాలవర్దనరావు- గన్నవరం, రావి హరగోపాల్-గుడివాడ, అన్నె బాబూరావు- ఉయ్యూరు, వై. నాగేశ్వరరావు- కంకిపాడు, వడ్డే శోభ నాద్రీశ్వరరావు-మైలవరం, డి.ఉమా మహేశ్వరరావు-నందిగామ, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్ర ప్రసాద్- వేమూరు, ఎమ్.వెంక టసుబ్బయ్య- రేపల్లె, గోగినేని ఉమ- తెనాలి, ఎమ్.పెద రత్తయ్య- ప్రత్తి పాడు, పి. పుల్లారావు-చిలకలూరిపేట, కె.శివ ప్రసాదరావు-నరసరావుపేట, వై.వీరాంజనేయులు- సత్తెనపల్లి, వి.యల్లమందారావు-వినుకొండ, జె.లక్ష్మీ పద్మావతి -పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, జి.నరసయ్య-మా ర్టూరు, దివి శివరామ్-కందు కూరు, డి.ఆంజనేయులు-కొండపి, కె.మీనాక్షి నాయుడు- ఆదోని, సిసి వెంకట్రా ముడు-హిందూపూర్, పి.రవీంద్ర-పెనుకొండ, ఆర్.శోభ-మదన పల్లె, చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-4 పి. వెంకటేశ్వరరావు-ముదినేపల్లి ఇ. తిరుపతి నాయుడు-కనిగిరి బి. కృష్ణయ్య- ఆత్మకూరు(నెల్లూరు జిల్లా) జి. అరుణకుమారి- చంద్రగిరి. ఇతర కమ్మ ఎమ్మెల్యేలు.. కె.హరిబాబు- విశాఖపట్నం ఒకటి -బీజేపీ వై.రాజా రామచందర్- కైకలూరు- ఇండి కాపు ఎమ్మల్యేలు-22 1999లో ఇరవై రెండు మంది కాపు నేతలు ఎమ్మెల్యేలుగా గెలవగా, వారిలో టీడీపీనుంచి పద్నాలుగు, ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. టీడీపీనుంచి గెలిచినవారిలో ముగ్గురు తప్ప మిగిలినవారంతా కోస్తాజిల్లాలవారే. కాంగ్రెస్ లో గెలిచినవారంతా కోస్తావారే. టీడీపీకాపు ఎమ్మెల్యేలు.. 14 పి. చలపతిరావు-యలమంచిలి పర్వత బాపనమ్మ-ప్రత్తిపాడు సి. రామచంద్రరావు-తాళ్లరేవు తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, జెవి అప్పారావు(నెహ్రూ)- జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, ఎర్రా నారాయణ స్వామి- తాడేపల్లిగూడెం, ఎస్.అరుణ-గుంటూరు-2, పి.బ్రహ్మయ్య-రాజంపేట, (బలిజ) ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి,(బలిజ) చదలవాడ కృష్ణమూర్తి-తిరుపతి(బలిజ) కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు-6 బలిరెడ్డి సత్యారావు-చోడవరం జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం జి.ఎస్.రావు -కొవ్వూరు మండలి బుద్దప్రసాద్-అవనిగడ్డ ఎస్.ఉదయభాను-జగ్గయ్యపేట కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు ఇండిపెండెంట్ కాపు ఎమ్మెల్యేలు.. 2 ఎస్.వీరభద్రరావు-పిఠాపురం-ఇండి కె.వి.రాఘవేంద్రరావు-పెనుగొండ-ఇండి బీసీ ఎమ్మెల్యేలు- 33 1999 ఎన్నికలలో బీసీ ఎమ్మెల్యేలు మొత్తం ముప్పైనాలుగు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీవారు ఇరవైనాలుగు మంది, కాంగ్రెస్ వారు పది మంది. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలలో పదిహను మంది ఉత్తరాంద్ర నుంచి గెలుపొందడం విశేషం.ఐదుగురు మిగిలిన కోస్తా జిల్లాలవారు కాగా,నలుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పక్షాన గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా జిల్లాల వారు(ఆరుగురు ఉత్తరాంద్ర నుంచి ),ఒకరు రాయలసీమకు చెందినవారు. బీసీలలో ఒక్కో కులం వారీగా చూస్తే ఏడుగురు కొప్పుల వెలమ,ఐదుగురు యాదవ, నలుగురు గౌడ, తూర్పు కాపు నలుగురు,పొలినాటి వెలమ ముగ్గురు, మత్సకార ముగ్గురు, గవర ఇద్దరు, కాళింగ ఇద్దరు, పద్మశాలి ఇద్దరు , శెట్టి బలిజ ఒకరుగెలుపొందారు. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 24 గైతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కె. రేవతిపతి-టెక్కలి-కాళింగ కె. మోహన్రావు- పాతపట్నం-తూర్పుకాపు,జి.ఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం- పి.వెలమ, తమ్మినేని సీతారామ్ -ఆముదాల వలస-కాళింగ, కె.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పి.వెలమ, కె.గణపతిరావు- ఉణుకూరు- తూర్పుకాపు, కె.అప్పల నాయుడు-ఉత్తరాపల్లి-కొప్పుల వెలమ, పి.నారాయణస్వామి నాయుడు- భోగాపురం- తూర్పుకాపు, పిన్నింటి వరలక్ష్మి-విశాఖ2, -యాదవ, బి.సత్య నారాయ ణమూర్తి-పరవాడ, -కె.వెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కొప్పుల వెలమ, దాడి వరభధ్రరావు -అనకాపల్లి-గవర, పి.గణబాబు-పెందుర్తి-గవర, అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు- తుని-యాదవ, వి.వెంకటేశ్వరరావు -కాకినాడ-మత్సకార, పి.అనంతలక్ష్మి- తాళ్లరేవు-శెట్టిబలిజ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం- గౌడ, ఎన్.నరసింహరావు-మచిలీ పట్నం-మత్స కార, పి.రామారావు-చీరాల-యాదవ,కె.ఇ.ప్రభాకర్-ఢోన్-గౌడ, ఆర్.సాయినాద్ గౌడ్-గుత్తి, -గౌడ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-9 ధర్మాన ప్రసాదరావు-నరసన్నపేట-పి.వెలమ ఎమ్. శివున్నాయుడు-పార్వతి పురం-కె.వెలమ పి.జగన్మోహన్ రావు-బొబ్బిలి-కె.వెలమ వాసిరెడ్డి వరద రామారావు-తెర్లాం -కె.వెలమ టిఎస్ఎ నాయుడు- గజపతినగరం-తూర్పుకాపు ఎమ్. హను మంతరావు-మంగళగిరి-పద్మశాలి ఎమ్.వెంకటరమణ-కూచినపూడి-మత్యకార జె.కృష్ణమూర్తి- గురజాల-యాదవ ఎన్.రఘువీరారెడ్డి-మడకశిర-యాదవ. టీడీపీక్షత్రియ ఎమ్మెల్యేలు..7 పి.అశోక్ గజపతిరాజు-విజయనగరం ఆర్ఎస్ డిపి నరసింహరాజు-భీమిలి ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు డి. శివరామరాజు-అత్తిలి పివి. నరసింహరాజు-భీమవరం కె.రామచంద్రరాజు-ఉండి మంతెన అనంతవర్మ-బాపట్ల కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యే-1 పి.సాంబశివరాజు- సతివాడ ముస్లిం ఎమ్మెల్యేలు.. నలుగురు ఎన్నిక కాగా వారిలో ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ కు చెందినవారు. టీడీపీ..3 ఎస్.జియావుద్దీన్-గుంటూరు-1, ఖలీల్ భాషా-కడప, ఎన్.ఎమ్.డి ఫరూక్-నంద్యాల కాంగ్రెస్-1 జలీల్ ఖాన్-విజయవాడ 1 ఇతర సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు..6 (నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ) వైశ్యులు ముగ్గురు, ఇద్దరు వెలమ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందనవారు గెలిచారు. వైశ్య-3 అంబికా కృష్ణ-ఏలూరు-టీడీపీ టిజి వెంకటేష్- కర్నూలు-టీడీపీ ఎమ్.ఎస్. పార్ధసారది-కదిరి-బీజేపీ వెలమ-2 కె. విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ కె. హనుమతరావు-నూజివీడు-టీడీపీ. బ్రాహ్మణ కోట శ్రీనివాసరావు-విజయవాడ తూర్పు-బీజేపీ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
కుల రహిత భారతం సాధ్యమే
భారతదేశానికి ‘కులం’ అనేది ఓ శాపం లాంటిది. కుల వ్యవస్థ... తద్వారా వచ్చిన సామాజిక అంతరాల వల్ల ఉత్పత్తి శక్తుల ప్రతిభ నిర్వీర్యమైంది. మని షిని మనిషిగా చూడ లేని దుర్మార్గ వ్యవస్థ వేల ఏండ్లుగా కొనసాగు తోంది. అంబేడ్కర్ లాంటి ప్రపంచ మేధా వియే కుల వ్యవస్థ దుర్మార్గం వల్ల విపరీత మైన వేదనకు గురయ్యారు. ఈ కులవ్యవస్థ పొడగింపు ప్రజాస్వామ్య ప్రభుత్వాల కాలంలోనూ కొనసాగడం గమనార్హం. కులవ్యవస్థ భారత జాతిని నిర్వీర్యం చేసింది. దేశంలోని 85 శాతం ప్రజలను సేవ కులుగా మార్చింది. అందుకే కుల రహిత భారతాన్ని కోరుకున్నారు అంబేడ్కర్. భారత దేశం కుల రహితంగా మారేంత వరకూ, ఆ వ్యవస్థ వల్ల వచ్చిన సామాజిక అంతరాలు పోయే వరకూ శూద్రులకు, అతిశూద్రులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచారు. కుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందించారు. కులరహిత భార తాన్నీ, సెక్యులర్ భారతాన్నీ అంబేడ్కర్ కోరు కున్నారు. కానీ, రాజ్యాధికారంలో ఉంటు న్నదీ, రాజ్యాంగాన్ని అమలుపరిచే స్థానంలో ఉంటున్నదీ కుల వ్యవస్థ వల్ల లాభపడుతున్న వారే కావడం వల్ల కుల నిర్మూలన జరుగడంలేదు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు కూడా అమలు కావడం లేదు. ఏది ఏమైనా దేశాన్ని అంధకార యుగంలోకి తీసుకు వెళ్ళే కులవ్యవస్థ అంతరించాల్సిందే. కులవ్యవస్థ అంతరించడమంటే వృత్తి పనులు అంతరించడం కాదు. అన్ని దేశా ల్లోనూ వివిధ వృత్తులకు సంబంధించిన పనులున్నాయి, కానీకులాలు లేవు. కులవృత్తులు లేవు. అయితే కులవ్యవస్థ లేనిచోట అన్ని సమస్యలూ పరిష్కారమైనాయా అంటే కాక పోయి ఉండవచ్చుగాక. కాని, కులవ్యవస్థ వల్ల వచ్చే పుట్టుకతోనే దఖలుపడే అధి కారాలు, ఆస్తులు, వివక్ష, పేదరికం, సామా జిక అంతరాలు అక్కడ లేవు. దేశంలోని కోట్లాది మందిని అస్పృశ్యులుగా ముద్ర వేయడం ఏ దేశంలోనూ లేదు. ఒక్క భారత్లో తప్ప. కుల రహిత భారతం ఏర్పడితే భారత జాతి అంతా ఒక్క టవుతుంది. సామాజికఅంతరాలు దూరమవుతాయి. ఎ వరికిష్టమైన పనిని, వృత్తిని వారు స్వీకరిస్తారు. ఇది తక్కువ పని, అది ఎక్కువ పని అనే భేద భావాలు తొలగిపోతాయి. విదేశాల్లోలా కులాల బట్టి కాకుండా ఎవరికి ఏ పనిలో నైపుణ్యముంటుందో ఏ పని చేయడానికి ఇష్ట పడుతారో ఆ పని చేస్తారు. అందరూ అన్ని పనులూ చేస్తుంటే సామాజిక అంతరాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. కులాలను కాపాడుతున్నవారు కులాలతో సామాజిక గౌరవం, ఆస్తులు, రాజ్యధికారం అనుభవిస్తున్నారు. వీళ్ళు కులనిర్మూలనకు సహకరించకపోగా కులాలను పెంచి పోషిస్తు న్నారు. వీరి స్థానంలో కుల బాధితులూ,కులంలో అత్యంత హీనస్థితిలో ఉన్నవారూ, మూలజాతుల వారూ రాజ్యాధికారంలోకి వస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు కనీసం యాభై ఏళ్లు పరిపాలన చేస్తే కుల నిర్మూలన జరుగుతుంది. నిచ్చెన మెట్ల కుల సమాజంలో అట్ట డుగున ఉన్నవారు రాజ్యాధిరారంలోకి వస్తే పై మెట్టుపై ఉన్న వారు మాకీ కులాలు వద్దని మొత్తుకుంటారు. కుల నిర్మూలనకు సహక రిస్తారు. ఎలాగూ వేల ఏండ్లుగా బాధితులైన మూలజాతుల వారు తాము పాలకులై తమను ఇన్నేండ్లుగా బాధలో ఉంచిన కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇలా అటు ఆగ్రకులాల వారూ, ఇటు శూద్ర, అతిశూద్ర కులాలవారూ కులనిర్మూలనకు సహకరిస్తే ఓ యాభై అరవై ఏళ్లల్లో దేశం లోంచి కులం మాయమైపోతుంది. - వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567 - డా‘‘ కాలువ మల్లయ్య -
కులమతాల చిచ్చు పెడుతున్నారు
ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్ముఖ్లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది. జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్లో అడుగుపెట్టింది. అరుణాచల్ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది -
కులం పేరిట బాబు విష రాజకీయం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి. కులం.. ఓ అస్త్రం ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. పవన్తో పొత్తు.. దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్ కళ్యాణ్ అనే చాప్టర్ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్కళ్యాణ్ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్ రూపం మాత్రమే. పవన్ వెనక ఉన్న వారెవరు? పవన్ కళ్యాణ్ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్కళ్యాణ్. నిజంగా పవన్ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు, బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు. మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా మహాలక్ష్మి శ్రీనివాస్ను, అగ్రోస్ ఛైర్మన్గా నవీన్ నిశ్చల్ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు. నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్కుమార్ను ఎంపిక చేశారు. ఫారెస్ట్ బోర్డు మెంబర్గా నయనార్ శ్రీనివాసులును నియమించారు. పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్. బలిజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : రత్నాకర్ వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. పవన్తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు. -
ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భోపాల్: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. "భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు
ముహమ్మద్ ఫసియొద్దీన్: కుల మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించవచ్చా? గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థన స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం... ‘లేదు’. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే. మీ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సజావుగా అమలు అవుతోందా? పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ప్రవర్తన, చర్యలు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలను ప్రజలు కూడా పరిశీలించవచ్చు. ఎవరైనా కోడ్ను ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు లేదా ‘సీ–విజిల్’ యాప్ ద్వారా ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపొచ్చు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘంజారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తాజాగా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. విద్వేషాలు రెచ్చగొట్టరాదు... భిన్న కుల, మత, భాష, వర్గాల ప్రజల మధ్య విభేదాలను పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర, చేసిన పనులకు పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, ఓటర్ల స్థానంలో ఇతరులతో ఓటేయించడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు జరపడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించడం వంటివి చేయరాదు. ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు ప్రతి పౌరుడి హక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్ల ముందు ఏ పరిస్థితుల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు. యజమానుల సమ్మతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం వినియోగించరాదు. గోడలపై ఎలాంటి రాతలు రాయకూడదు. ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం చేయకుండా చూసుకోవాలి. ఏదైనా ఓ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒక పార్టీ అతికించిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు. ఊరేగింపులు... ఊరేగింపుల రూట్ మ్యాప్ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా ఊరేగింపులు చేసుకోవాలి. భారీ ర్యాలీ అయితే తగిన నిడివికి తగ్గించుకోవాలి. ఇద్దరు లేదా అంతకుమించిఅభ్యర్థులు/పార్టీలు ఏక కాలంలో ఒకే రూట్లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరిపి ఘర్షణ జరగకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీలు, అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. ఆ వస్తువులు అసాంఘిక శక్తుల చేతిలో దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టి బొమ్మలను ఊరేగించడం, వాటిని బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు. పోలింగ్ బూత్ల వద్ద.. ఓటర్లు మినహా పోలింగ్ బూత్లోకి ప్రవేశించేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం పాస్ కలిగిన వారికి మినహాయింపు. పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీలు, అభ్యర్థులకు ఫిర్యాదులుంటే వాటిని పరిశీలకుల దృష్టికి తేవాలి. సభలకు ముందస్తు అనుమతి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలి. సభ వేదిక ఉన్న ప్రాంతంలో ఏవైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగా దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందస్తుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి. స్వేచ్ఛగా ఓటు వేసేలా.. అభ్యర్థులు/పార్టీలు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులకు సహకరించాలి. తమ అనధికార కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బ్యాడ్జీలను ఇవ్వాలి. ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి మద్యం సరఫరా జరపరాదు. పోలింగ్బూత్ల వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద ప్రజలను గుమికూడనీయొద్దు. అభ్యర్థుల క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలను సరఫరా చేయరాదు. పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలుంటాయి. పర్మిట్లు పొంది వాటికి స్లిక్కర్ బాగా కనిపించేలా వాహనంపై అతికించాలి. -
చెప్తాలే! ఇంతకీ మనదే కులం?!
-
‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం
సాక్షి, అమరావతి: కులగణన అంశానికి సంబంధించిన నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్ ఉన్నారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు మాకు మీరు.. మీకు మేం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేవి. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ సిర్పూర్ - కోనేరు కోనప్ప ఖమ్మం - పువ్వాడ అజయ్కుమార్ మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు (రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు) తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్ ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా.. పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. (టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల) కమ్మ @ కిం కర్తవ్యం ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. అర్జంట్గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను మాత్రం కలవలేదు. (బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు) చాలా స్ట్రాంగ్ తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు హైదరాబాద్లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్ఎస్ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. -
సత్తుపల్లి మట్టా దయానంద్కి గట్టి దెబ్బ
సాక్షి, ఖమ్మం: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏకంగా ఆయన పోటీ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణపై కొడారి వినాయక రావు అనే నేత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటీపడ్డారు. ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై, వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిగింది. వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించిన వలసినది జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee(DLSC) ఆదేశించింది కూడా. అయితే.. మట్టా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక రూపొందించారు. దీంతో.. ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాదంటూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లాలోని ఆయా శాఖ అధికారులకు సమాచారం పంపించారు కూడా. ఈ వ్యవహారంపై ముప్పై రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దయానంద్కు నోటీసులు జారీ అయ్యాయి. ప్లాన్ బీ కూడా? 2014లో ఎస్సీ ధ్రువీకరణతో దయానంద్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. 2,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) టిక్కెట్ అశించి భంగపాటుకు గురయ్యారు. అయితే మే నెలలో రేవంత్రెడ్డి సమక్షంలో భార్య రాగమయితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సత్తుపల్లి ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు. కుల ధ్రువీకరణ అభ్యంతరాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ.. ధ్రువీకరణ పత్రం గనుక రద్దు అయితే.. తన భార్య రాగమయిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ,కొండూరు సుధాకర్లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి మానవతారాయ్ కావడం గమనార్హం. -
నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పంపిణీ పథకం ఆశావహులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించి ప్రతి నెలా 15వ తేదీన విడతల వారీగా సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలివిడత కింద ఈనెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సాయానికి ఎంపికైన వారికి చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసిన యంత్రాంగం చివరకు అరకొరగా.. కేవలం పదుల సంఖ్యలోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పంపిణీ ఊసే లేకపోగా.. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చోట్ల పరిమితంగా లబ్ధిదారులకు చెక్కులు అందించడంతో ఎంతో ఆశగా సాయంకోసం ఎదురు చూసిన దరఖాస్తుదారులు నిరాశకు గురయ్యారు. ఎంతమందికి అందాయి..? బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండల స్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించాలని ప్రభుత్వం సంబంధిత అధికారు లను ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు వీలైనన్ని దరఖాస్తులను పరిశీలించి జాబితాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. తొలివిడత కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.400 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు సగటున 335 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున సాయం ఆదించవచ్చని అంచనా వేశారు. కానీ శనివారం మెజార్టీ సెగ్మెంట్లలో ఈ కార్యక్రమమే నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే శాసనసభ్యులకు సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లు క్షేత్రస్థా యి అధికారులు అధికారులు చెబుతున్నారు. దీంతో 15వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఎంత మందికి చెక్కులు పంపిణీ చేశారనే దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో మండలాల వారీగా సమాచా రాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలివిడతలో చేపట్టిన కార్యక్రమంలో పంపిణీ చేసిన చెక్కుల వివరాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని చెపుతున్నారు. అత్యధికం అనర్హులే...! వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులపై ఆధారపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. దరఖాస్తుల ప్రక్రియకు తక్కువ సమయం ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన వచ్చింది. అధికారులు వాటి పరిశీలనకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసినట్లు తెలిసింది. ప్రతి దరఖాస్తుపై పూర్తిస్థాయి పరిశీలన (360 డిగ్రీలు) విధానంలో ఆరా తీసినట్లు చెపుతున్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖా స్తుల్లో మూడోవంతు వాటిని తొలివిడత కింద పరిశీలన చేశారు. ఇందులో మెజార్టీ అర్జీ దారులు కులవృత్తులపైనే ఆధారపడకుండా ఇతరత్రా వ్యాపకాలు నిర్వహిస్తున్నట్లు వెలుగు చూసింది. అంతేకాకుండా ఆర్థికంగా బాగా ఉన్న వాళ్లు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. చాలా మందికి సొంతంగా నాలుగు చక్రాల వాహనాలు, ఇళ్లు, పొలాలు.. తదితరాలున్నా యని తేలింది. ఆదాయపన్ను చెల్లిస్తున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో మెజార్టీ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాల ఆధారంగా పరిశీలించిన దరఖాస్తుల్లోనూ ఇదే తరహాలో పలువురు అనర్హతకు గురైనట్లు తెలిసింది. దీంతో తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేనందున చెక్కుల పంపిణీ విషయంలో వారు ఆసక్తి చూపించలేదని తెలిసింది. -
కుల ప్రాతిపదికన భూములా?
సాక్షి, హైదరాబాద్: కులరహిత సమాజం కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం అవి మరింత బలంగా మారే పనులు చేయడం దారుణమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుల ప్రాతిపదికన భూములు ఎలా కేటాయిస్తారు.. వారు కట్టుకొనే కమ్యూనిటీ భవన్లలోకి ఇతర కులాలను అనుమతిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం అలా ఎలా భూములు కేటాయిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? ఈ రకమైన వివాహాలకు ఏదైనా సాయం అందిస్తోందా? కుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేయాలి. 21వ శతాబ్దంలో కూడా కులాల ఆధారిత విభజన ఉందంటే.. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇలాంటి ఆలోచ నలు చాలా సంకుచితమైనవి.. అసంబద్ధమైనవి’ కకులాల మధ్య మరింత అంతరాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్లు అనిపిస్తుంది. అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. కర్ణాటకలోనూ లింగాయత్ కమ్యూనిటీ విద్యాసంస్థలు, చారిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మార్కెట్ విలువకే ప్రభుత్వం నుంచి భూములు తీసుకుందని.. ఇలా కుల ప్రాతిపదికన భూములు కేటాయించడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ప్రభుత్వాలు ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కమ్మ, వెలమ కులాలకు 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలోని అత్యంత విలువైన భూములను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ ఎ.వినాయక్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎకరం విలువ రూ. 50 కోట్లకుపైనే... పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘ఖానామెట్ విలేజ్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) రహదారికి ఆనుకొని హైటెక్ సిటీ రోడ్డుకు పక్కన ఉన్న 5 ఎకరాల భూమిని ఆలిండియా వెలమ అసోసియేషన్కు, అయ్యప్ప సొసైటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న మరో 5 ఎకరాల భూమిని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండూ రాష్ట్రంలో అత్యంత ధనిక కులాలు. కేటాయించిన భూములు కూడా అత్యంత విలువైనవి. ఎకరం రూ. 50 కోట్లకుపైనే ఉంటుంది’అని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వం ఈ రెండు కులాలకు మాత్రమే భూములు ఇవ్వలేదు.. అనేక ఇతర కులాలకు కూడా కమ్యూనిటీ భవన్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించింది. జీవో నంబర్ 571 ఆధారంగా మార్కెట్ విలువ మేరకు భూములు కేటాయించింది. ఇతర కులాల్లో పేదలు ఎక్కువ శాతం ఉన్నందున వారికి మార్కెట్ విలువలోనూ తగ్గింపు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కులాలకు భూకేటాయింపులపై అసంతృప్తి వ్యకం చేసింది. ఈ పిటిషన్లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. వెలమ అసోసియేషన్కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామని పేర్కొంటూ విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. మరికొన్ని సంస్థలకు భూ కేటాయింపులపైనా... రాజబహదూర్ వెంట్రామిరెడ్డి విద్యాసంస్థలు(రెడ్డి హాస్టల్), శారదా పీఠం, జీయర్ ట్రస్టు, దర్శకుడు ఎన్.శంకర్కు భూ కేటాయింపులపై దాఖలైన పిల్ కూడా సీజే ధర్మాసనం వద్ద విచారణకు వచ్చింది. రెడ్డి హాస్టల్ కేటాయింపు పిటిషన్లో పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే 2018లో భూమి కేటాయిస్తే ఇప్పుడు ఎందుకు పిల్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 23కు వాయిదా వేసింది. -
కాబోయే మెగా కోడలు.. ఆ విషయంపై తెగ వెతికేస్తున్నారు!
టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఓ వైపు సినిమాల్లో మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్గా ఉంటుంది. ఈ ఏడాదిలో తను ప్రేమించిన మెగాహీరో వరుణ్ తేజ్ను పెళ్లాడనుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 9న నిశ్చితార్థం కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అందువల్ల ఆమె పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సందర్భంలో కొందరు నెటిజన్లు మాత్రం లావణ్య క్యాస్ట్ కోసం గూగుల్లో తెగ వెతుకుతున్నారు. సెలబ్రిటీల బయోడేటాను తెలుసుకునేందేకు చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్లో ఈ బ్యూటీ వచ్చి చేరింది. లావణ్య క్యాస్ట్ ఏంటి? అని నెటిజన్లు వెతకడంతో ఆమె పేరు గూగుల్లో టాప్ ట్రెండింగ్ అయిపోయింది. (ఇదీ చదవండి: అతనొక స్టార్ కమెడియన్.. అలా చేస్తారనుకోలేదు: ప్రగతి) ఉత్తర ప్రదేశ్, ఫైజాబాద్లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించిన ఈ అమ్మడు.. డెహ్రడూన్లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది కాగా, తల్లి రిటైర్డ్ టీచర్. తనకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. తమ కుటుంబంలో క్యాస్ట్కు అంత ప్రాధాన్యత ఉండదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది లావణ్య. 'మనం చేసే పనుల వల్ల మాత్రమే గొప్ప వాళ్లం అవుతాం. అంతేకాని కులం వల్ల ఎవరూ గొప్పవారు కాలేరు' అని గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇవే మాటలను మెగా ఫ్యాన్స్ నెటిజన్లకు గుర్తు చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చెబుతూ.. మెగా కుటుంబంలో కూడా క్యాస్ట్కు అంత ప్రాధాన్యం ఇవ్వరు అని వారు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం ఈ క్యాస్ట్ గోల ఏంటి? అని తప్పుబడుతున్నారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో బన్నీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్!) -
కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్కు కలిసొచ్చిన అంశాలు ఇవే!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీకి షాకిస్తూ ఘన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే హస్తం పార్టీ గెలుపుకు పలు అంశాలు కలిసొచ్చినప్పటికీ ప్రధానంగా మాత్రం మూడు సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడమనే చెప్పాలి. అవేంటో చూస్తే.. లింగాయత్లు దెబ్బ బీజేపీకి భారీగానే నష్టాన్ని మిగిల్చింది. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను పక్కన పెట్టడం, రాజకీయ విశ్లేషకుల ప్రకారం కాషాయ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని అంటున్నారు. బీజేపీ తప్పు కాంగ్రెస్ కలిసొచ్చిందా! లింగాయత్ల ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం పడిపోయింది(2018లో 41.8 శాతం నుంచి 2023లో 39.5 శాతానికి). అయితే ఓట్ల శాతం తక్కువే అయినప్పటికీ ఈ తేడా కారణంగా బీజేపీ ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం దాదాపు సగం సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. (2018లో 41 నుంచి 2023లో 21 చేరుకుంది). మరోవైపు, జేడీ(ఎస్)కు స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకును కాస్త కోల్పోయింది. ఈసారి లింగాయత్ ఓట్లలో ఐదు శాతంతో పాటు కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న మూడు స్థానాలను కోల్పోయింది. సాధారణంగా జనతాదళ్ (సెక్యులర్) వైపు మొగ్గు చూపే బీజేపీయేతర లింగాయత్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ఇది సూచిస్తుంది. జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి లింగాయత్ నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించడం ఆ పార్టీకి దోహదపడి ఉండవచ్చు. అథని సీటులో సవాది గెలుపొందగా, హుబ్లీ-ధార్వాడ్ (సెంట్రల్) సీటులో షెట్టర్ ఓడిపోవడం గమనార్హం. లింగాయత్ల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఇతర ప్రధాన సామాజిక వర్గాలు ఈసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. లింగాయత్ తర్వాత వారీ ఓట్లు కీలకంగా మారాయి లింగాయత్ల సామాజిక వర్గం తర్వాత వొక్కలిగలు, దళితులు ఆధిపత్య వర్గాలుగా ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ బాగానే సాధించింది. మరోవైపు, వొక్కలిగ స్థానాల్లో కాంగ్రెస్ దాదాపు నాలుగు శాతం ఓట్ల లాభంతో 2018లో 14 నుంచి 2023లో 27 సీట్లకు రెట్టింపు అయింది. దీనికి మరో ప్రముఖ వొక్కలిగ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. కనకపుర నియోజక వర్గంలో 1.2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన శివకుమార్ గౌడ గడ్డపై వొక్కలిగ ఓట్లను దూరం చేసి ఉండవచ్చు." జేడీ(ఎస్)కు కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్ పార్టీ 36 గ్రామీణ స్థానాల్లో విజయం సాధించడం ఓటర్లు మార్పునగా సూచనగా కనిపిస్తోంది. షెడ్యూల్డ్ కులాల ఓట్లతో కాంగ్రెస్కు మరో భారీ విజయం దక్కినట్లయింది. కాంగ్రెస్ పది సీట్లు, ఎస్సీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 5.5 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ, జేడీ(ఎస్) వరుసగా ఐదు, మూడు స్థానాలు కోల్పోయాయి. ఇవి నేరుగా కాంగ్రెస్లోకి వెళ్లినట్లు తెలస్తోంది. రాష్ట్రంలో దళితుల ఓట్లు సాధారణంగా చీలిపోతాయి. అయితే, ఈసారి, ఎస్సీ-ఆధిపత్య ప్రాంతాలు కాంగ్రెస్కు అత్యధికంగా ఓటేశారు. రాష్ట్రంలోని 37 ఎస్సీ-ఆధిపత్య స్థానాల్లో కాంగ్రెస్ 22 గెలుచుకుంది, గత ఎన్నికల్లో సాధించిన దానికంటే దాదాపు రెట్టింపుగా ఉంది. చదవండి: 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి -
ఓటు హక్కును వినియోగించుకున్న హెచ్ డీ కుమార స్వామి
-
మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు
సాక్షి, తూర్పుగోదావరి: రాజకీయాల్లో కులపిచ్చికి బాబు బ్రాండ్ అంబాసిడర్.. ఆయన కులపిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి గోదావరి జిల్లాల పర్యటనలో బయటపెట్టుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పరామర్శ పేరుతో వెళ్లిన చంద్రబాబు.. సిల్లీ రాజకీయాలకు తెరతీశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాట కోటేశ్వరంలో చంద్రబాబు కులపిచ్చి బయటపడింది. కష్టాన్ని చెప్పుకునేందుకు వచ్చిన రైతును కులం పేరుతో చంద్రబాబు అవమానించారు. కులం ఏంటని రైతును అడిగిన చంద్రబాబు.. మళ్లీ కులపిచ్చి తన బయటపెట్టుకున్నారు. చంద్రబాబు తీరుపై జనం మండిపడుతున్నారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! -
Bihar: నితీష్ కుమార్కు షాకిచ్చిన పాట్నా హైకోర్టు..
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేపై హైకోర్టు స్టే విధించింది. కుల గణనపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ మధురేష్ ప్రసాద్లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కుల, ఆర్థిక సర్వేలు నిర్వహిస్తోందని పిటిషనర్లలో ఒకరైన దిను కుమార్ కోర్టుకు తెలిపారు. సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం జరుగుతున్న సర్వేపై తక్షణమే స్టే విధించాలని, ఇప్పటివరకు సేకరించిన సర్వే డేటాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. కాగా మహాఘట్బంధన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కులాల లెక్కింపు జరిగింది. రెండో సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమవ్వగా మే 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో.. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక, సామాజిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. వాస్తవానికి కులగణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం కుల గణన చేపట్టాలని నితీష్ కుమార్ పలుమార్లు కోరారు. కానీ కేంద్రం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో బిహార్ సీఎం స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టింది. అవసరమైన వారికి సేవలు అందించడంలో సర్వే ఉపయోగపడుతుందని సీఎం నితీశ్ తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై వస్తున్న వ్యతిరేకతపై నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకే ప్రభుత్వం లక్ష్య సాయాన్ని సులువగా చేర్చేందుకు దోహదపడుతందన్నారు. చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా? #WATCH | Bihar Deputy CM Tejashwi Yadav speaks after Patna HC puts a stay on Caste-based census, says, "Caste-based census is for welfare of the people, we want to eradicate poverty, backwardness. One thing is clear, it is bound to happen" pic.twitter.com/GZG7V5m7de — ANI (@ANI) May 4, 2023 -
వాళ్లే నిజమైన యాంటీ నేషనల్స్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పరస్కరించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రస్తత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమబద్దమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆమె పేర్కొన్నారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ది టెలిగ్రాఫ్లో వ్యాసం రాశారు సోనియా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయులను మతం, భాష, కులం, లింగం ఆధారంగా విభజిస్తున్న వారే నిజమైన జ్యాతి వ్యతిరేకులు(యాంటీ నేషనల్స్) అని సోనియా బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు మనం బాబా సాహెబ్ వారసత్వాన్ని గౌరవిస్తున్నప్పుడు, రాజ్యాంగం విజయం.. దాన్ని అమలు చేసే పాలకులను ఎంచుకునే ప్రజలపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి.' అని సోనియా అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి దాని పునాలుదైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయాన్ని బలహీనపరుస్తోందని సోనియా ఫైర్ అయ్యారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగ సంస్థలతో దాడులు చేస్తున్నారని, కొంతమంది స్నేహితులకే ప్రయోజనం చేకూర్చుతున్నారని ఆరోపించారు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్పై దాడికి కుట్ర.. అసద్ ఎన్కౌంటర్కు ముందు ఇంత జరిగిందా? -
కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు: హీరోయిన్
తమిళసినిమా: మలయాళం, తమిళం, తెలుగులో నటిస్తున్న నటి సంయుక్త మీనన్. ప్రస్తుతం ధనుష్తో చేసిన వాత్తీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనను అందరూ సంయుక్త మీనన్ అని పిలుస్తున్నారని.. అయితే తనకు కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదని, సంయుక్త అని పిలవడమే తనకు ఇష్టమని పేర్కొంది. తాను నటిగా మలయాళంలో పరిచయమైనా తమిళ చిత్రాలు అంటే చాలా ఇష్టమని పేర్కొంది. తమిళ భాష, తమిళ సినిమా పాటలు అంటే ఇంకా ఇష్టమని చెప్పింది. చిన్న తనంలోనే ముస్తఫా అనే పాటను పలుమార్లు ఇష్టంగా వినేదాన్నని తెలిపింది. తాను ఇంతకు ముందు తమిళంలో కొన్ని చిత్రాలను అనుభవరాహిత్యంతో అంగీకరించి నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని చెప్పింది. అలా ఒప్పుకుని నటించిన చిత్రమే వాత్తీ అని చెప్పింది. ఇందులో ధనుష్ వంటి అనుభవమైన నటుడి సరసన నటించడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, ధనుష్ సింగిల్ టేక్ ఆరి్టస్ట్ అని, అందు వల్ల తాను ఎక్కువగా తీసుకోరాదని ముందుగానే డైలాగ్స్ చెప్పడం నుంచి నటించడం వరకు ప్రిపేర్ అయ్యేదాన్ని అని తెలిపింది. అయినా టేక్లు తీసుకునేదాన్ని, అందుకు ధనుష్ ఎంతగానో సహకరించారని పేర్కొంది. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా సంయుక్త పేర్కొంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్లోకి డైరెక్టర్గా ఎంట్రీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
తప్పక చదవండి
- ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
- ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- ‘కవిత అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement