-
CSK Vs MI: శెభాష్ హిట్మ్యాన్.. ఓడినా గానీ! రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 207 పరుగుల లక్ష్య చేధనలో ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి రోహిత్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు అద్బుతమైన పోరాటం చేసినప్పటికి తన జట్టును మాత్రం హిట్మ్యాన్ గెలిపించలేకపోయాడు. రోహిత్కు మరో ఆటగాడి సపోర్ట్ ఉండి ముంబై కచ్చితంగా విజయం సాధించిండేది. రోహిత్ సెంచరీ చేసినప్పటికి ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా జరుపుకోలేదు. రోహిత్ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. 63 బంతుల్లో హిట్మ్యాన్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 103 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రోహిత్కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. రోహిత్ శర్మ చివరగా 2012 ఐపీఎల్ సీజన్లో సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పతిరానకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ROHIT SHARMA, A HUNDRED TO REMEMBER FOREVER. 🫡 What a fightback, Lone Warrior for MI. pic.twitter.com/neT5HwxiO7 — Johns. (@CricCrazyJohns) April 14, 2024 -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఇదే సిక్స్తో తన సెంచరీ మార్క్ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. -
బంగ్లాదేశ్ ఓపెనర్ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ బ్యాటర్, బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్లో తంజిద్ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో తంజిద్ చేసిన సెంచరీ మూడవది. తంజిద్కు ముందు తౌహిద్ హ్రిదోయ్, విల్ జాక్స్ సెంచరీలు చేశారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. -
‘జై’స్వాల్ కమాల్
రాజ్కోట్ టెస్టులో రెండో రోజు వెనుకబడినట్లు కనిపించిన భారత్ ఒక్కసారిగా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది... బజ్బాల్ మాయలో చేజేతులా వికెట్లు కోల్పోయి స్వీయాపరాధంతో ఇంగ్లండ్ తమ పతనానికి అవకాశం కల్పించగా... టీమిండియా చక్కటి బౌలింగ్తో పాటు దానిని అందిపుచ్చుకుంది. అశ్విన్ లేని లోటు కనిపించకుండా మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొట్టారు. ఆపై యువ యశస్వి మరో దూకుడైన ఇన్నింగ్స్తో వరుసగా రెండో సెంచరీ సాధించగా, గిల్ అండగా నిలిచాడు. ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించిన భారత్ మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది. దీంతో ఆదివారం మరిన్ని పరుగులతో అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచడం ఖాయం. రాజ్కోట్: ఇంగ్లండ్తో మూడో టెస్టును గెలిచి సిరీస్లో ఆధిక్యంపై భారత్ కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (133 బంతుల్లో 104 రిటైర్డ్హర్ట్; 9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ సాధించగా, శుబ్మన్ గిల్ (120 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 155 పరుగులు జోడించారు. వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడిన యశస్వి మళ్లీ ఆదివారం బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 207/2తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (41) ఫర్వాలేదనిపించగా... మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ ఓవరాల్గా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇటీవల కన్నుమూసిన మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్కు నివాళిగా భారత క్రికెటర్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. టపటపా... పటిష్ట స్థితిలో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం స్వయంకృతంతో మంచి అవకాశం చేజార్చుకుంది. ప్రధాన బ్యాటర్ జో రూట్ (18) చేసిన తప్పుతో జట్టు పతనం మొదలైంది. మూడో రోజు ఐదో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో అత్యుత్సాహంతో ‘రివర్స్ స్కూప్’ ఆడిన రూట్ స్లిప్లో యశస్వి సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో బెయిర్స్టో (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత 150 పరుగుల మార్క్ను అందుకున్న తర్వాత బెన్ డకెట్ (151 బంతుల్లో 153; 23 ఫోర్లు, 2 సిక్స్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో స్టోక్స్, బెన్ ఫోక్స్ (13) కలిసి క్రీజ్లో పట్టుదలగా నిలిచే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు. వరుస బంతుల్లో స్టోక్స్, ఫోక్స్లను పెవిలియన్ పంపించారు. రేహన్ (6), హార్ట్లీ (9) కూడా ఒకే స్కోరు వద్ద అవుట్ కాగా...యార్కర్తో అండర్సన్ (1) పని పట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను సిరాజ్ ముగించాడు. 20 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 5 వికెట్లు పడ్డాయి. భారీ భాగస్వామ్యం... అండర్సన్ తొలి ఓవర్లో రోహిత్ శర్మ (19) కొట్టిన రెండు ఫోర్లతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే కొద్ది సేపటికే రోహిత్ను ఎల్బీగా అవుట్ చేసి రూట్ ఇంగ్లండ్లో కాస్త ఆనందం నింపాడు. కానీ అది ఆ కొద్ది సేపటికే పరిమితమైంది. గత టెస్టు సెంచరీ హీరోలు యశస్వి, గిల్ మరో భారీ భాగస్వామ్యంతో జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆరంభంలో వీరిద్దరు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా...ఆ తర్వాత దూకుడు పెంచారు. ముఖ్యంగా ఒక దశలో 73 బంతుల్లో 35 పరుగులతో ఉన్న యశస్వి ఆ తర్వాత మెరుపు షాట్లతో దూసుకుపోయాడు. అండర్సన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 బాదడంతో ఇది షురూ అయింది. హార్ట్లీ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టిన అతను తొలి సిక్స్తో 80 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత సెంచరీని చేరేందుకు యశస్వికి మరో 42 బంతులే సరిపోయాయి. ఈ క్రమంలో అతను ఏ బౌలర్నూ వదలకుండా మరో 4 ఫోర్లు, 3 సిక్స్లు బాదాడు. అప్పటి వరకు ప్రేక్షకుడిగా ఉన్న గిల్ కూడా చెలరేగి వుడ్ ఓవర్లో సిక్స్, ఫోర్తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (సి) యశస్వి (బి) బుమ్రా 18; బెయిర్స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41; ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రేహన్ (బి) సిరాజ్ 6; హార్ట్లీ (స్టంప్డ్) జురేల్ (బి) జడేజా 9; వుడ్ (నాటౌట్) 4; అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్ట్రాలు 20; మొత్తం (71.1 ఓవర్లలో ఆలౌట్) 319. వికెట్ల పతనం: 1–89, 2–182, 3–224, 4–225, 5–260, 6–299, 7–299, 8–314, 9–314, 10–319. బౌలింగ్: బుమ్రా 15–1–54–1, సిరాజ్ 21.1–2–84–4, కుల్దీప్ 18–2–77–2, అశ్విన్ 7–0–37–1, జడేజా 10–0– 51–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (రిటైర్డ్హర్ట్) 104; రోహిత్ (ఎల్బీ) (బి) రూట్ 19; గిల్ (నాటౌట్) 65; పటిదార్ (సి) రేహన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (51 ఓవర్లలో 2 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–30, 2–191. బౌలింగ్: అండర్సన్ 6–1–32–0, రూట్ 14–2–48–1, హార్ట్లీ 15–2–42–1, వుడ్ 8–0–38–0, రేహన్ 8–0–31–0. -
మ్యాక్స్వెల్ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్వెల్కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు. మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్లోకి తరలించాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm — Johns. (@CricCrazyJohns) February 11, 2024 వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. -
సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో అబుదాబీ నైట్రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది. అయితే అప్పుడే క్రీజ్లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గౌస్కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. -
రికీ భుయ్ అజేయ శతకం
విశాఖ స్పోర్ట్స్: బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. రికీ భుయ్ (243 బంతుల్లో 107 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్ నాలుగో వికెట్కు 87 పరుగులు జత చేశాడు. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్కు రికీ భుయ్ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్ మొహమ్మద్ ఖాన్ (31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రికీ భుయ్ ఏడో వికెట్కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డ్ను తుడిచిపెట్టేశాడు. (ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టాడానికి. కానీ కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డును బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాదిలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement. And the KING emerged. 🔥🔥 KOHLI 🙏🏻🙏🏻 — rajamouli ss (@ssrajamouli) November 15, 2023 -
భారత్ ప్రతాపం.. దక్షిణాఫ్రికా దాసోహం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ కష్టపెట్టింది. ఆరంభంలో రో‘హిట్స్’తో పరుగులు సులువైనా... తర్వాత గగనమైంది. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ కనిపెట్టుకొని పరుగులు పేర్చితే జట్టు స్కోరు 300 మార్కు దాటింది. ‘బర్త్డే బాయ్’ విరాట్ సెంచరీ పర్వాన్ని చూపిస్తే... ఆ తర్వాత బౌలర్లు వికెట్ల కూల్చివేతల్లో త్వరపడ్డారు. దీంతో వార్ వన్సైడ్ అయిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయంతో రోహిత్ శర్మ బృందం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ‘టాప్ ర్యాంక్’ను ఖరారు చేసుకుంది. కోల్కతా: అదేంటో ఈ ప్రపంచకప్లో యుద్ధం తప్పదనుకున్న మ్యాచ్ల్లోనే భారత్ సులువుగా దండయాత్ర చేసి గెలుస్తోంది. ఆ్రస్టేలియాతో మొదలైన టీమిండియా తొలి మ్యాచ్, క్రికెట్ ప్రపంచం గుడ్లప్పగించి చూసిన పాక్తో సమరం... భారీస్కోర్లతో చేలరేగుతున్న దక్షిణాఫ్రికాతో తాజా పోరు... ఇవన్నీ కూడా పోటాపోటీగా సాగుతాయనుకుంటే భారత్ వీరంగంతో ఏకపక్షమయ్యాయి. దీంతో ఆతిథ్య జట్టు కాస్తా అజేయ శక్తిగా మారిపోయింది. ఈ ప్రపంచకప్లో భారత జట్టు తర్వాత జోరుమీదున్న దక్షిణాఫ్రికా టీమిండియా దూకుడుకు దాసోహమైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 243 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. కోహ్లి పుట్టినరోజు (నవంబర్ 5) ఉదయం శుభాకాంక్షలతో మొదలైతే... సాయంత్రం వచ్చేసరికి శతక ప్రదర్శనతో ప్రశంసలు వెల్లువెత్తాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సచిన్కు సరిసమానమైన 49వ వన్డే సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (87 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్స్కోరర్! రవీంద్ర జడేజా (5/33) తన స్పిన్తో దక్షిణాఫ్రికాను చుట్టేశాడు. కుల్దీప్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను ఈనెల 12న బెంగళూరులో నెదర్లాండ్స్ జట్టుతో ఆడుతుంది. రో‘హిట్స్’తో మొదలై... కెప్టెన్ , హిట్మ్యాన్ రోహిత్ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఎదురుదాడికి దిగడంతో స్కోరు సగటున 10 పరుగుల రన్రేట్తో దూసుకెళ్లింది. 6వ ఓవర్లోనే రబడ అతని వేగానికి కళ్లెం వేయగా... కోహ్లి, శుబ్మన్ గిల్ (24 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగానే ఆడటంతో 10 ఓవర్లలో భారత్ 91/1 స్కోరు చేసింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్కు దిగగానే పరిస్థితి ఒక్కసారిగా ‘స్విచ్చాఫ్’ చేసినట్లు మారింది. గిల్ను అవుట్ చేసి... సహకరించే పిచ్పై స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కట్టడి చేయడంతో తర్వాతి 16 ఓవర్లలో భారత్ 60 పరుగులే చేయగలిగింది. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ 151/1 స్కోరుతో వేగంలో వెనుకబడింది. ‘శత’క్కొట్టిన కోహ్లి పిచ్ సంగతి అర్థమైన కోహ్లి... కేశవ్ బౌలింగ్ ప్రమాదకరమని గుర్తించాడు. అవతలివైపు అయ్యర్నూ అలర్ట్ చేసి సింగిల్స్, డబుల్స్తోనే స్కోరును ముందుకు సాగనిచ్చాడు. కానీ షమ్సీని మాత్రం వదల్లేదు. చక్కగా బౌండరీలు బాదారు. కోహ్లి 67 బంతుల్లో, అయ్యర్ 64 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు. ఈ జోడి మూడో వికెట్కు 134 పరుగులు జతచేశాక అయ్యర్ ఆటను ఎన్గిడి ముగించాడు. రాహుల్ (8) వచ్చివెళ్లాడు. ఆఖరి దశలో సూర్యకుమార్ (14 బంతుల్లో 22; 5 ఫోర్లు) జోరును షమ్సీ అడ్డుకోగా... జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాకే భారత్ పుంజుకొని 300 దాటింది. కోహ్లి (119 బంతుల్లో) శతకం సాధించాడు. ఈ మేటి బ్యాటర్ క్రీజులో ఉన్నా కూడా... కేశవ్ పూర్తి కోటా వేసినా... ఒక్క బౌండరీ ఇవ్వకపోవడం విశేషం. సఫారీ పేకమేడలా... ఈ టోర్నీలోనే బాగా సెంచరీలు, భారీగా స్కోర్లు చేస్తున్న జట్టు... రన్రేట్లో ముందున్న జట్టు దక్షిణాఫ్రికానే! కానీ ఈ జట్టు కూడా భారత బౌలింగ్కు కుదేలైంది. ఇంకా చెప్పాలంటే వికెట్లు రాలిన ఉదంతాన్ని చూస్తే ఓ క్రికెట్ కూననే తలపించింది. సిరాజ్ డెలివరీకి డికాక్ (5) క్లీన్బౌల్డ్ అయ్యాడు. జడేజా ముందుగానే రంగంలోకి దించితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమం తప్పకుండా సఫారీ మేటి బ్యాటర్లను పడగొట్టేశాడు. బవుమా (11), క్లాసెన్ (1), మిల్లర్ (11)లను స్పిన్ ఉచ్చులో ఉక్కిరి బిక్కిరి చేయగా... మరోవైపు షమీ పేస్తో డసెన్ (13), మార్క్రమ్ (9)లను పెవిలియన్ చేర్చాడు. కుల్దీప్ కూడా తనవంతు మ్యాజిక్ చూపడంతో 40 పరుగులకే 5 వికెట్లను... 83 పరుగులకే దక్షిణాఫ్రికా మొత్తం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బవుమా (బి) రబడ 40; గిల్ (బి) కేశవ్ 23; కోహ్లి (నాటౌట్) 101; అయ్యర్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 77; రాహుల్ (సి) డసెన్ (బి) జాన్సెన్ 8; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) షమ్సీ 22; జడేజా (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–62, 2–93, 3–227, 4–249, 5–285. బౌలింగ్: ఎన్గిడి 8.2–0–63–1, జాన్సెన్ 9.4–0–94–1, రబడ 10–1–48–1, కేశవ్ మహరాజ్ 10–0–30–1, షమ్సీ 10–0–72–1, మార్క్రమ్ 2–0–17–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; బవుమా (బి) జడేజా 11; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 13; మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమీ 9; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 1; మిల్లర్ (బి) జడేజా 11; జాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; కేశవ్ (బి) జడేజా 7; రబడ (సి అండ్ బి) జడేజా 6; ఎన్గిడి (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (27.1 ఓవర్లలో ఆలౌట్) 83. వికెట్ల పతనం: 1–6, 2–22, 3–35, 4–40, 5–40, 6–59, 7–67, 8–79, 9–79, 10–83. బౌలింగ్: బుమ్రా 5–0–14–0, సిరాజ్ 4–1–11–1, జడేజా 9–1–33–5, షమ్సీ 4–0–18–2, కుల్దీప్ 5.1–1–7–2. ప్రపంచకప్లో నేడు శ్రీలంక Xబంగ్లాదేశ్ వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అచ్యుతానందన్కు 100 ఏళ్లు
అలప్పుజ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వెలిక్కకత్తు శంకర్ అచ్యుతానందన్ శుక్రవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2006–11 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేశారు. 1991 నుంచి 2016 దాకా మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు. వీఎస్గా ప్రసిద్ధుడైన ఆయన 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన నేతగానూ రికార్డు సృష్టించారు. స్ట్రోక్ నేపథ్యంలో ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరికి 2016 ఎన్నికల్లో కూడా కేరళలో వామపక్ష కూటమి వీఎస్నే ముందు పెట్టుకుని ప్రచారం చేసింది. కాంగ్రెస్ను ఓడించి అధికారం చేపట్టింది. అభిమానులు ఆయన్ను ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు. అలప్పుజ జిల్లా పున్నప్ర గ్రామంలో 1923లో జన్మించిన వీఎస్ 11 ఏళ్లప్పుడే కన్నవారిని పోగొట్టుకున్నారు. మరుసటేడే స్కూలు మానేసి అన్న టైలరింగ్ షాపులో పనికి కుదురుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్లో చేరారు. రెండేళ్ల తర్వాత సీపీఐలోకి మారి పారీ్టలో చకచకా ఎదిగారు. 1964లో సీపీఐ నుంచి బయటికొచ్చి సీపీఎంను ఏర్పాటు చేసిన 32 మంది నేతల్లో వీఎస్ ఒకరు. పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు వీఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. -
నాలుగోసారీ ఛేదించాం
మళ్లీ అదే వ్యూహం... అదే ఫలితం... పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం... ఆపై మెరుపు బ్యాటింగ్తో వేగంగా విజయాన్నందుకోవడం... 199, 272, 191, 256... ఇలా ప్రత్యర్థి స్కోర్లు మారడమే తప్ప భారత జట్టు ఆట మారలేదు... సమష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది... వరుసగా నాలుగో మ్యాచ్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా తమ విజయాల స్కోరును 4/4గా మార్చుకుంది... బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్పై సులువైన విజయంతో రోహిత్ బృందం సత్తా చాటింది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ నామమాత్రపు స్కోరుకు పరిమితం కాగా... రోహిత్, గిల్, కోహ్లి బ్యాటింగ్తో అలవోకగా భారత జట్టు లక్ష్యం చేరింది... చిన్నపాటి లక్ష్యంలో కూడా చివర్లో చెలరేగి కోహ్లి 48వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడం మ్యాచ్లో హైలైట్. పుణే: తిరుగులేని ప్రదర్శనతో భారత్ వరల్డ్కప్లో మరో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లిటన్ దాస్ (82 బంతుల్లో 66; 7 ఫోర్లు), తన్జీద్ హసన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్స్లు), మహ్ముదుల్లా (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ సాధించగా... గిల్ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (40 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. భారత్ ఆదివారం జరిగే తమ తర్వాతి పోరులో ధర్మశాలలో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఓపెనర్ల జోరు... బంగ్లాకు ఓపెనర్లు తన్జీద్, దాస్ శుభారంభం అందించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. శార్దుల్ తొలి ఓవర్లో తన్జీద్ వరుసగా 6, 4, 6 బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. ఈ క్రమంలో 41 బంతుల్లో తన్జీద్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని కుల్దీప్ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. అంతే...ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు వరుసగా విఫలమయ్యారు. 93/0తో ఒకదశలో పటిష్ట స్థితిలో కనిపించిన జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (8), మిరాజ్ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... 62 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న దాస్ వీరిని అనుసరించాడు. తౌహీద్ (16) బంతులు వృథా చేయగా, ముషి్ఫకర్ రహీమ్ (46 బంతుల్లో 38; 1 ఫోర్, 1 సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే మన పటిష్ట బౌలింగ్లో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. చివర్లో మహ్ముదుల్లా ధాటిగా ఆడటంతో బంగ్లా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గాయం కారణంగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ప్రధాన పేసర్ తస్కీన్ అహ్మద్ ఈ మ్యాచ్కు దూరం కావడంతో ఆట ఆరంభానికి ముందే బంగ్లా బలహీన పడింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఎప్పటిలాగే రోహిత్ తనదైన శైలిలో దూకుడు చూపిస్తూ వరుస బౌండరీలతో దూసుకుపోయాడు. మరోవైపు నసుమ్ ఓవర్లో 2 సిక్స్లతో జోరు పెంచిన గిల్... ముస్తఫిజుర్ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. అయితే హసన్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన రోహిత్ తర్వాతి బంతికి అదే తరహా షాట్ ఆడబోయి వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి బాధ్యత తీసుకోగా... 52 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత గిల్ నిష్క్రమించాడు. చూడచక్కటి షాట్లు ఆడిన కోహ్లి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... కోహ్లి, కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగా, వీరిని నిలువరించలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. 48 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు కోహ్లి మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. రోహిత్ (31) మూడో స్థానంలో ఉన్నాడు. 4 వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో భారత జట్టుపై ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలు/సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు/సెంచరీలు చేసిన మూడు మ్యాచ్ల్లో భారత జట్టు ఓటమి చెందగా... నాలుగోసారి మాత్రం భారత్ గెలిచింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 51; లిటన్ దాస్ (సి) గిల్ (బి) జడేజా 66; నజ్ముల్ (ఎల్బీ) (బి) జడేజా 8; మిరాజ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 3; తౌహీద్ (సి) గిల్ (బి) శార్దుల్ 16; ముష్ఫికర్ (సి) జడేజా (బి) బుమ్రా 38; మహ్ముదుల్లా (బి) బుమ్రా 46; నసుమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 14; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; షరీఫుల్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–93, 2–110, 3–129, 4–137, 5–179, 6–201, 7–233, 8–248. బౌలింగ్: బుమ్రా 10–1–41–2, సిరాజ్ 10–0–60–2, పాండ్యా 0.3–0–8–0, కోహ్లి 0.3–0–2–0, శార్దుల్ 9–0–59–1, కుల్దీప్ 10–0–47–1, జడేజా 10–0–38–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) తౌహీద్ (బి) హసన్ 48; గిల్ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్ 53; కోహ్లి (నాటౌట్) 103; అయ్యర్ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్ 19; రాహుల్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 4; మొత్తం (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–88, 2–132, 3–178. బౌలింగ్: షరీఫుల్ 8–0–54–0, ముస్తఫిజుర్ 5–0–29–0, నసుమ్ 9.3–0–60–0, హసన్ 8–0–65–1, మిరాజ్ 10–0–47–2, మహ్మదుల్లా 1–0–6–0. ప్రపంచకప్లో నేడు ఆ్రస్టేలియా X పాకిస్తాన్ వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
షేక్ రషీద్ అజేయ శతకం
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్ రషీద్ (54 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్లు) అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు. హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు), కరణ్ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్ (3/10), కేవీ శశికాంత్ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 21న గుజరాత్తో ఆడుతుంది. -
కాన్వేతో కలిసి... గెలుపు ‘రచిన్’చాడు
గత ప్రపంచకప్ ఫైనల్కు ప్రతీకారమా అంటే సరిగ్గా ఈ మ్యాచ్కు ఆ విలువ లేకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ను తాము చిత్తు చేసిన తీరు న్యూజిలాండ్కు మాత్రం పూర్తి సంతృప్తినిచ్చి ఉంటుంది. దుర్బేధ్యమైన జట్టు, ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పేలవ బ్యాటింగ్ ఆపై పసలేని బౌలింగ్తో తమ స్థాయిపై సందేహాలు రేకెత్తించింది. కివీస్ మాత్రం అద్భుత ఆటతో తమపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని పడగొట్టి ఆపై సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్లో తాము ఆడిన తొలి మ్యాచ్ల్లోనే అజేయ మెరుపు సెంచరీలు సాధించి కాన్వే, రచిన్ రవీంద్ర మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు పేరిట గెలుపును లిఖించారు. రాహుల్+సచిన్ పేర్లను తన పేరులో ఉంచుకున్న రచిన్ అటు క్లాస్, ఇటు మాస్ ఆటను కూడా చూపించడం విశేషం. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, జోస్ బట్లర్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్ 36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్కు న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్ –విల్ యంగ్ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్ సవరించారు. కీలక భాగస్వామ్యం... బలమైన లైనప్, చివరి ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్ను చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్ రెండో బంతినే బెయిర్స్టో (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్గా మలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ‘సిక్స్’తో స్కోరు మొదలు కావడం ఇదే తొలిసారి. అయితే ప్రత్యరి్థని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మలాన్ (14) విఫలం కాగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలో కివీస్ మరో 3 వికెట్లు పడగొట్టింది. రవీంద్ర ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన బ్రూక్ (25) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఈ దశలో రూట్, బట్లర్ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 72 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని హెన్రీ విడదీశాక ఇంగ్లండ్ వేగంగా వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు కనీసం 300 పరుగులకు చేరువగా కూడా రాలేదు. వన్డే చరిత్రలో ఆడిన 11 మందీ కనీసం రెండంకెల స్కోరు చేయడం ఇదే మొదటిసారి కాగా... ప్రతీ ఒక్కరు అంతంతమాత్రంగానే ఆడటంతో ఇంగ్లండ్కు ఫలితం దక్కలేదు. ఆడుతూ పాడుతూ... స్యామ్ కరన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే యంగ్ (0) అవుట్! దాంతో కివీస్ ఎలా లక్ష్యాన్ని ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ కాన్వే, రవీంద్ర అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్లో 13వ వన్డే ఆడుతూ తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగిన రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడగా, ఐపీఎల్ అనుభవాన్ని కాన్వే అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థిపై బౌలర్లందరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 10 ఓవర్లలోనే స్కోరు 81 పరుగులకు చేరగా, చెరో 36 బంతుల్లోనే రవీంద్ర, కాన్వే అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిని కట్టడి చేయడంలో ఇంగ్లండ్ విఫలం కావడంతో 20 ఓవర్లకే స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఈ జోడి ఎదురులేకుండా దూసుకుపోయింది. ముందుగా కాన్వే 83 బంతుల్లో, ఆ తర్వాత రవీంద్ర 82 బంతుల్లో శతకాలను అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా... కివీస్ సునాయాసంగా లక్ష్యం చేరింది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో లాథమ్ కెప్టెన్గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 33; మలాన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; రూట్ (బి) ఫిలిప్స్ 77; బ్రూక్ (సి) కాన్వే (బి) రవీంద్ర 25; మొయిన్ అలీ (బి) ఫిలిప్స్ 11; బట్లర్ (సి) లాథమ్ (బి) హెన్రీ 43; లివింగ్స్టోన్ (సి) హెన్రీ (బి) బౌల్ట్ 20; కరన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; వోక్స్ (సి) యంగ్ (బి) సాన్ట్నర్ 11; ఆదిల్ రషీద్ (నాటౌట్) 15; వుడ్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. బౌలింగ్: బౌల్ట్ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్ట్నర్ 10–0–37–2, నీషమ్ 7–0–56–0, రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్ 3–0–17–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (నాటౌట్) 152; యంగ్ (సి) బట్లర్ (బి) కరన్ 0; రచిన్ రవీంద్ర (నాటౌట్) 123; ఎక్స్ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10. బౌలింగ్: వోక్స్ 6–0–45–0, స్యామ్ కరన్ 6–2–47–1, వుడ్ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్ 7–0–47–0, లివింగ్స్టోన్ 3–0–24–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ X నెదర్లాండ్స్ వేదిక: హైదరాబాద్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
11వ శతాబ్దం నాటి విగ్రహం చోరీ
చంద్రగిరి (తిరుపతి జిల్లా): రాయల కాలం నాటి పురాతన విగ్రహాన్ని రాత్రికి రాత్రి చోరీ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థానంలో నకిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి రాయలవారి కోట ప్రాంగణంలో క్రీ.శ.11వ శతాబ్ధానికి చెందిన రాతి గోడలో అప్పటి రాజులు వినాయక స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఇటీవల ఆ విగ్రహంపై కన్నెసిన గుర్తు తెలియని కేటుగాళ్లు చోరీ చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అదే ప్రదేశంలో నకిలీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన విగ్రహం లోపల భాగంలో నిధులుంటాయని, వాటిని సొంతం చేసుకోవడానికే విగ్రహాన్ని చోరీ చేసి ఉంటారని ప్రచారం చక్కర్లు కొడుతోంది. -
Ind Vs Ban: భారత్కు బంగ్లా షాక్.. టీమిండియాకు తప్పని ఓటమి
కొలంబో: ఆసియా కప్లో అనూహ్య ఫలితం... ‘సూపర్–4’ దశలో రెండు ఘన విజయాలతో ముందే ఫైనల్ స్థానం ఖాయం చేసుకున్న భారత్కు చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఎదురైంది. ప్రాధాన్యత లేని మ్యాచ్లో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బరిలోకి దిగిన టీమిండియా చివరకు ఓటమి పక్షాన నిలిచింది. అయితే ఈ గెలుపు బంగ్లాదేశ్ ప్రదర్శనను తక్కువ చేసేది కాదు. ముందే ఫైనల్ రేసు నుంచి నిష్కమించినా చివరి వరకు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు చెప్పుకోదగ్గ విజయంతో స్వదేశానికి వెళ్లనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. ఆసియా కప్లో గతంలో ఒకే ఒకసారి భారత్ను (2012)ఓడించిన బంగ్లాకు ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (85 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్స్లు), తౌహీద్ హృదయ్ (81 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్లు), నసుమ్ అహ్మద్ (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 49 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబ్, తౌహీద్ ఐదో వికెట్కు 101 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో శార్దుల్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. శుబ్మన్ గిల్ (133 బంతుల్లో 121; 8 ఫోర్లు, 5 సిక్స్లు) కెరీర్లో ఐదో సెంచరీతో చెలరేగాడు. ప్రతికూల పరిస్థితుల్లో స్పిన్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై అతను పట్టుదల కనబర్చి నిలబడ్డాడు. అయితే ఇతర బ్యాటర్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చివర్లో అక్షర్ పటేల్ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది. ముస్తఫిజుర్ 3 వికెట్లు తీయగా... అరంగేట్ర బౌలర్ తన్జీమ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్తో హైదరాబాదీ ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ వన్డేల్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 252వ ఆటగాడిగా తిలక్ నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందే తిలక్ 7 టి20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (బి) శార్దుల్ 13; లిటన్ దాస్ (బి) షమీ 0; అనాముల్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 4; షకీబ్ (బి) శార్దుల్ 80; మిరాజ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 13; తౌహీద్ (సి) తిలక్ (బి) షమీ 54; షమీమ్ (ఎల్బీ) (బి) జడేజా 1; నసుమ్ (బి) ప్రసిధ్ 44; మెహదీ హసన్ (నాటౌట్) 29; తన్జీమ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–13, 2–15, 3–28, 4–59, 5–160, 6–161, 7–193, 8–238. బౌలింగ్: షమీ 8–1–32–2, శార్దుల్ 10–0–65–3, ప్రసిధ్ 9–0–43–1, అక్షర్ పటేల్ 9–0–47–1, తిలక్ 4–0–21–0, జడేజా 10–1–53–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అనాముల్ (బి) తన్జీమ్ 0; గిల్ (సి) తౌహీద్ (బి) మెహదీ 121; తిలక్ (బి) తన్జీమ్ 5; కేఎల్ రాహుల్ (సి) షమీమ్ (బి) మెహదీ 19; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) మిరాజ్ 5; సూర్యకుమార్ (బి) షకీబ్ 26; జడేజా (బి) ముస్తఫిజుర్ 7; అక్షర్ (సి) తన్జీద్ (బి) ముస్తఫిజుర్ 42; శార్దుల్ (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 11; షమీ (రనౌట్) 6; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–2, 2–17, 3–74, 4–94, 5–139, 6–170, 7–209, 8–249, 9–254, 10–259. బౌలింగ్: తన్జీమ్ 7.5–1–32–2, ముస్తఫిజుర్ 8–0–50–3, నసుమ్ 10–0–50–0, షకీబ్ 10–2–43–1, మెహదీ హసన్ 9–1–50–2, మిరాజ్ 5–0–29–1. -
హండ్రెడ్ లీగ్లో చారిత్రక శతకం.. ఇంగ్లండ్ ఓపెనర్ ఖాతాలో రికార్డు
హండ్రెడ్ లీగ్లో చారిత్రక శతకం నమోదైంది. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ట్యామీ బేమౌంట్ లీగ్ హిస్టరీలోనే (పురుషులు, మహిళలు) అత్యధిక స్కోర్ (118) నమోదు చేసింది. ట్రెంట్ రాకెట్స్తో నిన్న (ఆగస్ట 14) జరిగిన మ్యాచ్లో వెల్ష్ఫైర్ ఓపెనర్ బేమౌంట్ 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. హండ్రెడ్ లీగ్ పురుషులు, మహిళల విభాగాల్లో ఇదే అత్యధిక స్కోర్ కాగా.. ఈ లీగ్ మహిళల విభాగంలో ఇదే మొట్టమొదటి సెంచరీ కావడం విశేషం. బేమౌంట్.. ఓవల్ ఇన్విన్సిబుల్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ అత్యధిక స్కోర్ (108) రికార్డును బద్దలుకొట్టి లీగ్ రికార్డ్స్లో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకుంది. రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ఫైర్.. బేమౌంట్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. మహిళల హండ్రెడ్ లీగ్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్ కావడం మరో విశేషం. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్లో బేమౌంట్ రికార్డు సెంచరీతో కదం తొక్కగా.. డంక్లీ (24), సారా బ్రైస్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాకెట్స్ బౌలర్లలో క్రీస్టీ గార్డన్ 2, అలానా కింగ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. ఫ్రేయా డేవిస్ (2/19), అలెక్స్ హార్ట్లీ (1/28), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/23), సోఫియా డంక్లీ (1/16) రాణించడంతో 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా వెల్ష్ ఫైర్ 41 పరుగుల తేడాతో గెలపొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాకెట్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ స్మిత్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. లిజెల్ లీ (26), హర్మాన్ప్రీత్ కౌర్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
లబుషేన్ సెంచరీ.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్నైట్ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడిన మార్నస్ లబుషేన్ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ మార్ష్ (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్’ను నిలబెట్టుకుంటుంది. -
సాయి సుదర్శన్ అజేయ సెంచరీ
కొలంబో: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 క్రికెట్ టోర్నీ లీగ్ దశలో భారత్ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్ హంగార్గేకర్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్ సుథర్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) పాక్ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ తొలి వికెట్కు అభిõÙక్ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్కు నికిన్ జోస్ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్కు కెపె్టన్ యశ్ ధుల్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం పొందింది. నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్ ‘ఎ’; బంగ్లాదేశ్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్ 23న జరుగుతుంది. -
తొలి రోజే ‘తల’పోటు...
పిచ్పై తేమ, కాస్త పచ్చిక, ఆకాశం మేఘావృతం... అన్నీ పేస్ బౌలింగ్కు అనుకూలించే పరిస్థితులే. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ఈ స్థితిలో ఏ కెప్టెనైనా ఏం చేస్తాడో అతను కూడా అదే చేస్తూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో షమీ, సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ఫీల్డింగ్ ఎంచుకున్న నిర్ణయం సరైందనిపించింది... ఒక గంట గడిచింది. వాతావరణం అంతా మారిపోయింది... పిచ్ ఒక్కసారిగా బ్యాటర్ల పక్షాన చేరింది... హెడ్, స్మిత్ దీనిని అద్భుతంగా వాడుకున్నారు. సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశారు. మెరుపు వేగంతో ఆడిన హెడ్ సెంచరీతో చెలరేగగా, స్మిత్ శతకానికి చేరువయ్యాడు. చివరి సెషన్లోనైతే మన బౌలర్లు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి... డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో తొలి రోజు పూర్తిగా ఆ్రస్టేలియాదే. రెండో రోజు వారిని నిలువరించలేకపోతే భారత్ ఈ టెస్టుపై ఆశలు కోల్పోవాల్సిందే! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. భారత్తో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (156 బంతుల్లో 146 బ్యాటింగ్; 22 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95 బ్యాటింగ్; 14 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. భారత తుది జట్టులో అశ్విన్కు స్థానం దక్కకపోగా, కీపర్గా భరత్కే చోటు లభించింది. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి కోసం టీమిండియా ఆటగాళ్లు మౌనం పాటించగా, ఇరు జట్ల క్రికెటర్లు నల్లబ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. రాణించిన వార్నర్... పేసర్లు షమీ, సిరాజ్ పదునైన బంతులతో ఆసీస్ ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మొదటి మూడు ఓవర్లు మెయిడిన్ కాగా, తర్వాతి ఓవర్లో ఫలితం దక్కింది. సిరాజ్ బంతిని ఆడలేక ఉస్మాన్ ఖ్వాజా (10 బంతుల్లో 0) కీపర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి గంటలో 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 29 పరుగులే చేసింది. చెరో 2 ఓవర్లు వేసిన షమీ, సిరాజ్ వేసిన అనేక బంతులు వార్నర్ (60 బంతుల్లో 43; 8 ఫోర్లు), లబుషేన్ (62 బంతుల్లో 26; 3 ఫోర్లు) శరీరానికి తాకాయి. అయితే ఇద్దరు బ్యాటర్లు పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ను నడిపించారు. ఉమేశ్ ఓవర్లో నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించిన వార్నర్ ఆ తర్వాతా దానిని కొనసాగించాడు. ఆసీస్ పటిష్ట స్థితికి చేరుతున్న దశలో శార్దుల్ భారత్కు కీలక వికెట్ అందించాడు. లంచ్ సమయానికి కాస్త ముందు లెగ్సైడ్ వెళుతున్న బంతిని వార్నర్ వెంటాడగా భరత్ అద్భుతంగా అందుకున్నాడు. వార్నర్, లబుషేన్ రెండో వికెట్కు 69 పరుగులు జోడించారు. విరామం తర్వాత షమీ చక్కటి బంతితో లబుషేన్ ను బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారీ భాగస్వామ్యం... ఐదు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా ఆనందాన్ని తర్వాతి భాగస్వామ్యం పూర్తిగా దెబ్బ కొట్టింది. స్మిత్, హెడ్ కలిసి ఇన్నింగ్స్ను నిర్మించారు. తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లోనే 6 ఫోర్లతో దూకుడు చూపించిన హెడ్ 60 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, రెండో సెషన్లో భారత్కు వికెట్ దక్కలేదు. చివరి సెషన్లోనూ ఈ జంట మరింత పట్టుదలగా ఆడింది. 144 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే హెడ్ 106 బంతుల్లోనే కెరీర్లో ఆరో శతకాన్ని అందుకున్నాడు. ఇదే ఊపులో భాగస్వామ్యం 200 పరుగులు దాటగా, భారత బృందం బేలగా చూస్తుండిపోయింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దుల్ 43; ఖ్వాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0; లబుషేన్ (బి) షమీ 26; స్మిత్ (బ్యాటింగ్) 95; హెడ్ (బ్యాటింగ్) 146; ఎక్స్ట్రాలు 17; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76. బౌలింగ్: షమీ 20–3–77–1, సిరాజ్ 19–4– 67–1, ఉమేశ్ 14–4–54–0, శార్దుల్ 18–2– 75–1, జడేజా 14–0–48–0. -
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
ధోని కప్.. గిల్ సెంచరీ.. ఫైనల్ పై ఉత్కంఠ..
-
SRHvsRCB : కింగ్ కోహ్లితో అట్లుంటది మరి.. హైదరాబాద్ అంటే పూనకాలే (ఫొటోలు)
-
ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది. నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఐతే దాని ప్లేస్లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. (చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement