-
ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషిటుపై ఈనెల 29న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రెండోరోజూ మంగళవారం ఈడీ వాదనలు విన్నారు. ఈడీ తరఫు న్యాయవాది నవీన్కుమార్ మట్టా ఈ కేసులో కవిత పాత్రపై మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.శరత్రెడ్డి, బుచి్చబాబు, శ్రీనివాస్ల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్పిన్గా వ్యవహరించిన ట్లు తెలిసిందన్నారు. హవాలా రూపంలో డబ్బులు తరలించడంలో ఎవరెవరి పాత్ర ఏంటనేది వివరించారు. వాదనల అనంతరం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషిటును పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు. -
కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్షీట్లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి -
అసైన్డ్ భూముల కుంభకోణం:చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు.. అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయి. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్షీట్లో సీఐడీ పేర్కొంది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ తెలిపింది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చదవండి: అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం -
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
‘న్యూయార్క్లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!
అమెరికాలో నివసిస్తున్న ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు భారత్ నుంచే కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిఖిల్ గుప్తాపై నేరం రుజువైతే, అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా ఈ ఆరోపణలపై అమెరికా నుంచి అందిన ఇన్పుట్పై విచారణ జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికి నవంబర్ 18న భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందించే వివరాల ఆధారంగా భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టనుంది. ఇదిలాఉండగా నవంబర్ 20న గురుపత్వంత్ సింగ్ పన్నుపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎయిరిండియాలో ప్రయాణించే వ్యక్తులను భయాందోళనకు గురిచేసేలా పన్నూ సోషల్ మీడియా సందేశాలను జారీ చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాలో ప్రయాణించేవారు ప్రమాదంలో ఉన్నారని పన్నూ సందేశం పంపాడు. నవంబర్ 19న ఎయిరిండియాకు అనుమతి ఇవ్వబోమని కూడా ఆయన పేర్కొన్నాడు. కాగా దీనికిముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కెనడా ఆరోపణలన్నింటినీ భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. కెనడాతో భారత ప్రభుత్వ దౌత్యపరమైన వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెరికా న్యాయ శాఖ ఈ ప్రకటన వెలువరించడం విశేషం. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్కు హర్దీప్ సింగ్ నిజ్జర్ చీఫ్. భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న ఇతను ఈ ఏడాది జూన్లో హత్యకు గురయ్యాడు. ఇతని హత్యపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని భారత్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. అయితే కెనడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు అందించలేదు. ఇది కూడా చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం -
అవినీతి.. వైఫల్యాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదన్నరేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, లోటుపాట్లు, వైఫల్యాలు ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ సర్కార్పై చార్జ్షీట్ను ప్రకటిస్తున్నట్టు బీజేపీ వెల్లడించింది. దేశంలోనే అవినీతికి, లంచగొండితనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా మారిందని ధ్వజమెత్తింది. బీఆర్ఎస్ ప్రభుత్వం–అవినీతి అనేవి రెండూ పర్యాయ పదాలుగా మారిపోయాయని విమర్శించింది. కాళేశ్వరంలో అవి నీతి ఎక్కడుందో చూపాలంటూ సవాళ్లు చేశారని, అయితే నిజం అనేది దాగదు కాబట్టి ఎన్నికలకు ముందు భగవంతుడే పిల్లర్ల కుంగుబాటు ద్వారా దానిని ప్రజల ఎదుట పెట్టాడని తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ సర్కార్పై చార్జ్షిట్ను సోమ వారం బీజేపీ రాష్ట్ర శాఖఅధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్, మేనిఫెస్టోకమిటీ చైర్మన్ పి.మురళీధర్రావు, డా.కె.లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్రెడ్డి, తేజావత్ రామచంద్రుడు, జయచంద్ర విడుదల చేశారు. దళితులకు దగా, బీసీలకు ద్రోహం, విద్యారంగం ఆగం, వైద్యరంగంలో హామీల బుట్టదాఖలు, నిరుద్యోగులకు మోసం, విశ్వనగరం–విషాదనగరం.. ఇలా 31 అంశాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఈ చార్జ్షిట్లో బీజేపీ ప్రస్తావించింది. చార్జ్షీట్లో ముఖ్యాంశాలు... బీఆర్ఎస్ అవినీతి: 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక అవినీతి విలయతాండవం. సీఎంతో సహా మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా.. వీటన్నింటిలోనూ బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు. మిషన్ భగీరథ అంతా అవినీతికంపే. మిషన్ కాకతీయ పేరుతో రూ. 30 వేల కోట్లలో అధిక సొమ్ము బీఆర్ఎస్ నాయకుల జేబులోకి పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి కంపు. ప్రాజెక్టును రీడిజైన్ చేసి, అంచనాలు పెంచారు. రూ.40వేల కోట్ల రూపాయల అంచనాను రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచి, సీఎంకుటంబసభ్యులే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు. మేడిగడ్డ కూలిపోయే స్థితికి రావడం తెలంగాణ ప్రజల రక్తమాంసాలను తాగినట్టుగానే మేం భావిస్తున్నాం. సీఎం కూతురికే లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయి. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఆదాయవనరుగా మారింది. చెరువులు, కుంటలు, పార్కులు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములు, కాందిశీకుల భూములు... ల్యాండ్ మాఫియాలో బీఆర్ఎస్ నిండా మునిగి ఉంది. అవినీతికి ఎవరు పాల్పడినా 040–23452933 నంబర్కు కాల్ చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఆ నంబర్ అసలు మనుగడలోనే లేదు. రైతులకు మోసం: అప్పుల బాధతో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినా బస్తా యూరియా కూడా ఇయ్యలే. నీటి పారుదల రంగం: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా, ఇంతవరకు కొత్త ఆయకట్టుకు నీరందింది లేదు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేదు. దళితులకు దగా: దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యలే, భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు గిరిజనులు : గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదు. పోడు భూములు పూర్తిగా ఇవ్వలేదు. బీసీలకు ద్రోహం: బీసీల సమగ్ర అభివృద్ధికి రూ.25 వేల కోట్లు, బీసీ కార్పొరేషన్కు ఏటా వెయ్యికోట్లు కేటాయిస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంబీసీ కుల వర్గీకరణ చేయలేదు. విద్యారంగం ఆగం: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు హామీని నెరవేర్చలేదు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలతో ఈ–లైబ్రరీల నిర్మాణానికి ఇంతవరకు అతీగతి లేకుండా పోయింది. ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా బోధనా సిబ్బందిని నియమించలేదు. మహిళలకు అన్యాయం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాలిస్తామని ఇంతవరకు ఇచ్చింది లేదు. మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, కాగితాలకే పరిమితమైంది. మహిళలకు రక్షణ లేదు. నిరుద్యోగులకు మోసం : ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నడు, కనీసం ఊరికొక ఉద్యోగం కూడా ఇయ్యలే. పోలీసుశాఖలో తప్ప ఇతర శాఖలలో నియామకాలే లేవు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు తొమ్మిది సంవత్సరాల తర్వాత 2022లో ఇచ్చిండు. కానీ అది కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు రద్దు అయ్యింది. సర్కారు వైఖరితో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులకు నెలకు 3016/– భృతి, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. విద్యుత్ రంగం: కొత్తగా 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. వేల రూపాయల బిల్లు వేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేసి ఆర్థికంగా ఇబ్బందులు చేశారు. పారిశ్రామిక రంగం: నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలే. కార్మికులు, రైతులను అన్యాయం చేశారు. కాగజ్నగర్ నుంచి మణుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గాలిమాటలు చెప్పిండు. విశ్వనగరం కాదు... విషాద నగరం: మూసీనదిని బ్యూటిఫికేషన్ చేసి, టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేసిండు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మూసీ మురికిపోలే, కంపుపోలే. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ జరగలేదు కానీ కబ్జాలు జరుగుతున్నాయి. కార్మికులు: కార్మికులకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. తెలంగాణ ఉద్యమకారులు: అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వలేదు. రూ. 10 లక్షలు ఇవ్వలేదు. ఉద్యమకారులకు గుర్తింపేలేదు, అమరవీరులకు విలువ లేదు. రాష్ట్రం కోసం పోరాడిన వారిని కూడా మోసం చేసిండు. జర్నలిస్టులు: జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇవ్వకుండా దగా చేసిండు. జేఎన్జే సొసైటీకి 38 ఎకరాల స్థలాన్ని కోర్టు ఉత్తర్వులు వచి్చన తర్వాత కూడా బదలాయించలేదు. పరిపాలనాలోపాలు: ప్రజలకు అందుబాటులో లేని సీఎంగా కేసీఆర్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిండు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సీఎంని కలవరు. రాష్ట్ర పాలన మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం చేతిలో యావత్ తెలంగాణ బందీ అయ్యింది. అతివాదం, ఉగ్రవాదం ఊతమిచ్చే కుట్ర :బీజేపీ చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్రావు ప్రజల భద్రతకు ఒకప్పుడు నక్సలైట్ల తీవ్రవాదంతో ఎలాంటి ముప్పు ఉన్నదో, నేడు అతివాదం, ఉగ్రవాదంతో అంతే ప్రమాదం ఉందని బీజేపీ నేత, పార్టీ చార్జ్షీట్ కమిటీ చైర్మన్ పి. మురళీధర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ కారిడార్ను ఉగ్రవాదం, అతివాదం వైపు మళ్లించేందుకు (ర్యాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం) ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అనేక సంఖ్యలో ఉన్నారని, ఈ విషయంలో ఎంఐఎం, బీఆర్ఎస్ అలైన్మెంట్ కారణంగా సవాళ్లు ముందుకొస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై బీజేపీ అభియోగపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్ఐతో లింకులు ఇక్కడ బయటపడ్డాయని, ఎన్ఐఏ ఇక్కడకు వచ్చి కొందరిని అరెస్ట్ కూడా చేసిందని తెలిపారు. తెలంగాణ–మద్యం, హైదరాబాద్–డ్రగ్స్ అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని మండిపడ్డారు. -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
తిరగబడదాం.. తరిమి కొడదాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచార నగారా మోగించింది. ‘తిరగబడదాం...తరిమికొడదాం’అనే నినాదంతో పోరాటాలే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించింది. బీఆర్ఎస్–బీజేపీ రెండూ తోడు దొంగలని, కలిసే అవినీతి–అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతామని వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్, బీజేపీలపై రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేస్తూ.. కార్యక్రమాల షెడ్యూల్ను ప్రకటించింది. శనివారం హైదరాబాద్ బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్ల చిత్రాలతో ‘తోడు దొంగలు’పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్లో బీఆర్ఎస్, బీజేపీలపై 15 అంశాలతో కూడిన ప్రజా చార్జిషిట్ను నమోదు చేశారు. అనంతరం మధుయాష్కీ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. చార్జిషిట్ను ఇంటింటికీ చేరుస్తాం ప్రచార కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో రాష్ట్రంలోని 75 లక్షల కుటుంబాలకు తమ చార్జిషీట్ను చేరుస్తామని మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు. ప్రజలను మమేకం చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామని.. 12వేల పంచాయతీల్లో గ్రామ సభలు, 3 వేల డివిజన్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన సందర్భంగా పోస్టర్కార్డుపై ప్రజల సంతకాలు తీసుకుని, బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలపై ప్రజల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. ఈ పోరాటంలో తమతో కలసి వచ్చేందుకు ప్రజలు 7661899899 ఫోన్ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. కాగా.. నియంతలను మించి కేసీఆర్ ప్రజలపై దాడులు చేస్తున్నారని, ఆయనపై ప్రతి గ్రామానికి వెళ్లి చార్జిషిట్ వేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మల్లురవి, రాజయ్య, షబ్బీర్అలీ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ప్రజాకోర్టు.. కేసీఆర్పై అభియోగాలు.. ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించిన అనంతరం Vటీపీసీసీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ప్రజాకోర్టు నిర్వహించారు. దీనికి కంచె ఐలయ్య జడ్జిగా వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత కటౌట్లను బోనులో దోషులుగా నిలబెట్టి వారిపై పీసీసీ నేతలు అభియోగాలు నమోదు చేశారు. చార్జిషిట్లోని అంశాలను వాదనలుగా వినిపించారు. న్యాయమూర్తిగా వ్యవహరించిన కంచె ఐలయ్య వారి వాదనలు విన్నారు. సమాజంలో అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని, ఓట్లు వేయకుండా తిరస్కరించాలని తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ దోపిడీపై పోరాటమే: భట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోడగా నిలిచిందని.. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ సమాజం విలవిల్లాడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఇచి్చన పారీ్టగా కాంగ్రెస్ మరోసారి నడుం బిగించిందని.. బీఆర్ఎస్ అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రభుత్వంపై అభియోగాల నమోదుతోపాటు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. పోరాడుదాం, తిరగబడదాం, తరిమికొడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం..’’ అని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు. ఆకాంక్షలను కాలరాసిన కేసీఆర్: రేవంత్ ఉద్యమకారుల ఆకాంక్షలను రాజకీయ ఇంధనంగా మార్చుకుని గద్దెనెక్కిన కేసీఆర్.. తర్వాత ఆ ఆకాంక్షలను కాలరాశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రజాకోర్టు ఏర్పాటు చేస్తున్నామని.. రాజులు, నియంతలను మరిపించే విధంగా ప్రజలపై దాషీ్టకాలకు పాల్పడుతున్న కేసీఆర్, ఆయన కుటుంబంపై చార్జిషిట్ వేస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేవి రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదన్నారు. కాళోజీ స్ఫూర్తితో బీఆర్ఎస్ను తెలంగాణ పొలిమేరలు దాటేవరకు తరిమికొడతామన్నారు. కాంగ్రెస్ ప్రజా చార్జిషిట్లోని అంశాలివీ.. భ్రష్ట జుమ్లా పార్టీ (బీజేపీ) తెలంగాణకు ద్రోహం– ఆంధ్రతో స్నేహం కాళేశ్వరంలో అవినీతి–కేసీఆర్తో లాలూచీ ప్రాజెక్టులు కట్టలే–జాతీయ హోదా దక్కలే నీళ్లు, నిధుల్లో అన్యాయం–యువతకు ఇవ్వలే ఉద్యోగం రైతులపై అప్పుల భారం–పేదలపై ధరల భారం ప్రభుత్వ ఆస్తులు అమ్ముడు–ప్రజల సొమ్ము దోచుడు బీజేపీ రిష్తేదార్ సమితి (బీఆర్ఎస్) కల్వకుంట్ల కుటుంబం–కావేవీ అక్రమాలకు అనర్హం కాళేశ్వరంతో చోరీ–ఖజానా ఖాళీ కచరా సర్కార్–కర్షకుల ఖూనీకోర్ అబద్ధాలు చెప్పిండు–అధికారంలోకి వచ్చిండు కారు వారసులు–భూబకాసురులు దళిత గిరిజనులకు అవమానం–దక్కలేదు గౌరవం ఇంటికి ఉద్యోగం రాలే–యువత భవిత మారలే అటకెక్కిన ఉచిత విద్య–పడకేసిన ఆరోగ్యం ఆడబిడ్డలపై దాడులు–అయినా ఫామ్హౌజ్ వదలరు బడ్జెట్లో కోతలు–సంక్షేమానికి వాతలు (ఈ అంశాలను పోస్టర్లో పేర్కొనడంతోపాటు బైబై మోదీ, బైబై కేసీఆర్ అనే నినాదాలను చేర్చారు) -
1984 అల్లర్లు: సీబీఐ చార్జిషీట్లో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పేరు
న్యూఢిల్లీ: 39 ఏళ్ల క్రితం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లో ఆనాటి కాంగ్రెస్ ఎంపీ జగదీశ్ టైట్లర్ గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద అల్లరిమూకను రెచ్చగొట్టి గురుద్వారాను తగులబెట్టి ఠాకూర్ సింగ్, బాదల్ సింగ్, గొర్చరణ్ సింగ్ అనే ముగ్గురు సిక్కులను హత్య చేయించినట్లుగా మే 20న దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది సీబీఐ. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూస్టార్'కు ప్రతిగా 1984లో ఆమెను సెక్యురిటీ సిబ్బంది హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. సిక్కులను ఎక్కడపెడితే అక్కడ ఊచకోత కోశారు. ఆరోజు జరిగిన హింసాకాండలో సుమారుగా 3000 మంది మృతి చెందారు. అల్లర్లలో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పాత్రపై సీబీఐ లోతైన దర్యాప్తు చేసింది. అల్లర్లలో జగదీశ్ గుంపులను రెచ్చగొట్టినట్లు మరింత విధ్వాంసానికి పాల్పడి, పలు హత్యలకు కారణమైనట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. 2000లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై నివేదిక సమర్పించిన నానావతి కమీషన్ అందులో జగదీశ్ టైట్లర్ ప్రత్యక్షంగానే అల్లరి మూకలను రెచ్చగొట్టే ప్రయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఆరోజున జగదీశ్ కారులో వచ్చి టీబీ హాస్పిటల్ గేటు వద్ద కత్తులు, రాడ్లు, కర్రలు చేత పట్టుకుని ఉన్న ఒక గుంపుతో మాట్లాడుతూ.. "మీరు చేసిన హింస సరిపోదు.. నాకైతే సంతృప్తికరంగా లేదు.. మరింత మంది సిక్కులని చంపండి పోయి.. లేదంటే నా మాట పోతుంది, పెద్ద ఎత్తున సిక్కులను హత్య చేయిస్తానని మాటిచ్చాను" అని చెప్పినట్లు తెలిపింది. తాజాగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో ఒకామె జగదీశ్ టైట్లర్ గుంపును రెచ్చగొట్టడాన్ని కళ్లారా చూసినట్లు తెలిపింది. ఆరోజు తన దుకాణాన్ని అల్లరి మూకలు ధ్వంసం చేస్తుండడం చూసి వెనక్కి వెళ్లిపోతుండగా గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద జగదీశ్ టైట్లర్ ఒక తెల్లటి అంబాసిడర్ కారులో వచ్చి అక్కడున్న దుండగలతో.. "ఆస్తులను తర్వాత కొల్లగొట్టవచ్చు.. ముందు దొరికిన సిక్కులను దొరికినట్టు చంపండి" అని రెచ్చగొట్టినట్లు సాక్ష్యమిచ్చింది. అటుపై తాను ఇంటికి తిరిగొచ్చి పక్కింట్లో ఆశ్రయం పొందినట్లు అక్కడ తన భర్త వద్ద పనిచేసే శ్రీ గొర్చరణ్ సింగ్, శ్రీ బాదల్ సింగ్ మృతదేహాలను చూసినట్లు తెలిపింది. ఈ సాక్ష్యాలతో పాటు ఆనాడు ఎంపీగా ఉన్నజగదీష్ టైట్లర్పై సిక్కు వ్యతిరేక అల్లర్లలో అనేక నేరారోపణలున్నాయి. అందుకు తగిన ఆధారాలను సేకరించిన తర్వాతే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపింది. అల్లరి మూకలను రెచ్చగొట్టడం, సిక్కులను హత్య చేయించడం, గురుద్వారాను తగులబెట్టడం, 1984 నవంబర్ 1న నిషేధిత ఉతర్వులను ఉలంఘించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి నేరాలను అభియోగించింది సీబీఐ. ఇది కూడా చదవండి: ఉత్తర భారతాన్ని వదలని వానలు -
ఛార్జ్ షీట్ లో అంతా కల్పిత కథలే
-
Viveka Case: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారమంటూ గూగుల్ టేక్ అవుట్ పేరిట కొండను తవ్వినంత హడావుడి చేసిన సీబీఐ.. తుది చార్జ్షీట్లో తోక ముడిచింది. ఇన్నాళ్లూ ఎంతో శాస్త్రీయ ఆధారమంటూ చెప్పుకొచ్చిన అంశంపైనే చివరికి చేతులెత్తేసింది. తాను గతంలో చార్జ్షీట్లో పేర్కొన్న నిందితుడు సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ వివరాలు అంతా పొరపాటని అంగీకరించడం గమనార్హం. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన ఏ–6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ–7 వైఎస్ భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చూపిస్తూ వారిని అరెస్టు చేసిన సీబీఐ తుది చార్జ్షీట్లో ఎలాంటి ఆధారం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్ను ఆశించనే లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఎంపీ టికెట్కు అడ్డుగా ఉన్నందునే వివేకాను హత్య చేశారన్న అభియోగాల్లో వాస్తవం లేదన్నది తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్లోని సీబీఐ న్యాయస్థానంలో బుధవారం తుది చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలకు సరైన ఆధారమేదీ తుది చార్జ్షీట్లో సీబీఐ చూపించలేకపోయింది. వెరసి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఏనాడో దారి తప్పిందని.. కొందరి ప్రభావానికి గురై సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. వైఎస్సార్ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతో ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనన్నది తేలిపోయింది. తూచ్.. అంతా ఉత్తిదే కేసు దర్యాప్తులో కేంద్ర బిందువుగా పేర్కొన్న ప్రధాన సాక్ష్యాధారంపైనే సీబీఐ బొక్కబోర్లా పడింది. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఏ–2 సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాను సేకరించి ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని రెండేళ్లుగా చెబుతున్న సీబీఐ.. తుది చార్జ్షీట్లో మాట మార్చింది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన తుది చార్జ్షీట్లో అందుకు విరుద్ధంగా పేర్కొంది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానందరెడ్డి నివాసంలో లేరు. 2019 మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, ఉదయం 8.12 గంటలకు ఇంటి లోపల ఉన్నాడు. గతంలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నది గ్రీన్విచ్ కాలమానం ప్రకారం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం అంటే దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో పొరబడ్డాం’ అని స్పష్టం చేసింది. గూగుల్ టేక్ అవుట్ పేరిట బురిడీకి యత్నం! కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్ టేక్ అవుట్ డేటా పేరిట సీబీఐ యత్నిస్తోందన్న సందేహాలు బలపడుతున్నాయి. వివేకా మరణించారనే విషయం 2019 మార్చి 15 ఉదయం 6.05 గంటలకే అందరికీ తెలిసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వందలాది మంది ఉదయం 7 గంటలకే పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్నారు. స్థానికులు ఆ విధంగా రావడం సహజం. ఆ తర్వాత 8 గంటల సమయంలో సునీల్ యాదవ్ అక్కడికి వచ్చారని సీబీఐ ప్రస్తుతం చెప్పడం గమనార్హం. ఆ రోజు వివేకా నివాసానికి చేరుకున్న వారిలో 248 మందిని సాక్షులుగా సీబీఐ అధికారులు విచారించారు. వారిలో ఎవరూ కూడా ఆ రోజు సునీల్ యాదవ్ అక్కడ ఉన్నట్టు చెప్పనే లేదు. గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఒక్క ఆధారం లేదే.. గూగుల్ టేక్ అవుట్ డేటా అశాస్త్రీయతతతోపాటు ఈ కేసులో సీబీఐ అరెస్టుల వెనుక డొల్లతనం కూడా తుది చార్జ్షీట్లో బట్టబయలైంది. సీబీఐ హడావుడిగా అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్రెడ్డి, గజ్జల ఉదయ్కుమార్రెడ్డిలకు వ్యతిరేకంగా కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్షీట్లో పేర్కొంది. అసలు సునీల్ యాదవ్ ముందు రోజు రాత్రి వివేకానందరెడ్డి ఇంట్లోనే లేరని తుది చార్జ్షీట్లో పేర్కొంది. హత్య సమయంలో వివేకా ఇంట్లోలేని సునీల్ యాదవ్.. ఆ రోజు రాత్రి భాస్కర్రెడ్డి నివాసం నుంచి వివేకా నివాసానికి వెళ్లినట్టు, హత్య తర్వాత మళ్లీ వివేకా నివాసం నుంచి భాస్కర్రెడ్డి నివాసానికి వచ్చినట్టు ఎలా చెబుతుంది? ఈ లెక్కన గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామన్న ఆ సమాచారం కూడా తప్పే కదా! కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగానే వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్టు చేయడం పూర్తిగా అసంబద్ధమన్నది స్పష్టమైంది. అదే గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని అరెస్టు చేసినట్టు సీబీఐ చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన తన ఇంటి నుంచి తొందరగా వెళ్లిపోయారని, మర్నాడు ఉదయం వివేకా ఇంటి వద్దకు వెళ్లారని చెప్పింది. కానీ ఆ రోజు రాత్రి ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది మాత్రం సీబీఐ చెప్పనే లేదు. మర్నాడు వివేకా మరణించారని సమాచారం తెలిసిన తర్వాత వందలాది మంది ఆయన నివాసానినికి చేరుకున్నారు. తాను ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని ఉదయ్ కుమార్రెడ్డే చెప్పారు. మరి దాన్ని ఏదో గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్టు సీబీఐ చెప్పడం ఏమిటి? ఎంపీ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి మార్చి 15 ఉదయం వివేకా నివాసానికి చేరుకోవడానికి ముందే తాము అక్కడకు వెళ్లామని ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ చెప్పినట్టు తుది చార్జ్షీట్లో ఉంది. అప్పటికే వివేకా గుండెపోటుతో మరణించినట్టు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే వివేకా గుండెపోటుతోనే మరణించారని మొదట బయటకు పొక్కిన సమాచారంతో భాస్కర్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైంది. ఏ విధంగానూ భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్షీట్లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. మిగిలిన నిందితుల గూగుల్ టేక్ అవుట్ డేటా లేదా? సీబీఐ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయతమై మొదటి నుంచి నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతగా గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే.. ఈ కేసులో మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరి మొబైల్ ఫోన్ల గూగుల్ టేక్ అవుట్ డేటాను సీబీఐ ఎందుకు సేకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు నిందితుల్లో ఒకరి డేటాను మాత్రమే సేకరించడం ఏమిటి.. మిగిలిన ముగ్గురి డేటాను విస్మరించడం ఏమిటన్నది కీలకంగా మారింది. ఆ సమాచారం శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే హత్యలో పాలుపంచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నలుగురు నిందితుల మొబైల్ ఫోన్ల గూగుల్ డేటాను సేకరించి విశ్లేషించాలి. కానీ సీబీఐ అలా చేయకపోవడం సందేహాస్పదంగా మారింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నాన్న కడప ఎంపీ టికెట్ ఆశించనే లేదు ‘మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావించలేదు. ఆయన ఎంపీ టికెట్ ఆశించలేదు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘కడప ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న కోరారు. కానీ ఆ సమయంలో కడప జిల్లా రాజకీయాల పట్ల నేను ఆసక్తిగా లేను’ అని తెలిపారు. ఈ మేరకు షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ తుది చార్జ్షీట్లో పొందుపరిచింది. దాంతో కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ ఇన్నాళ్లూ చేస్తున్న అభియోగాలు అవాస్తవం అని పరోక్షంగా తేలిపోయింది. వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలని భావించారని, దీంతో ఎంపీ టికెట్కు అడ్డురాకుండా ఉండేందుకే ఆయన్ని హత్య చేశారన్న సీబీఐ అభియోగాల్లో నిజం లేదని నిగ్గు తేలింది. 2022 అక్టోబర్ 7న ఢిల్లీలోని సీబీఐ కార్యాలాయానికి వెళ్లి షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన 20 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ వివేకానందరెడ్డి వచ్చారని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని కోరారని షర్మిల చెప్పారు. ఆ సమయంలో ఆసక్తిగా లేనని చెప్పానన్నారు. వివేకా ఎందుకు పోటీ చేయాలని భావించలేదని సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బహుశా ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని షర్మిల చెప్పారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో వివేకానందరెడ్డి తన తల్లి విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బహుశా అందువల్ల తనకు టికెట్ రాదని ఆయన భావించి ఉండవచ్చని చెప్పారు. -
వివేకా కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన CBI
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన విచారణ గడువు ఇవ్వాళ్టితో ముగియనుండడంతో CBI ఇవ్వాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు, అనుమానితులను పలు మార్లు విచారించింది సీబీఐ. విచారణకు వచ్చిన వారందరి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. ఇప్పటివరకు దాఖలైన ఛార్జ్ షీట్ల సంఖ్య చూస్తే ఇవ్వాళ్టిది మూడోది. 2021 తొలి ఛార్జ్ షీట్ 2022 జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ 2023 జూన్ 30 ఫైనల్ చార్జిషీట్ దాఖలు ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియటంతో కోర్టులో హాజరు పర్చారు సీబీఐ అధికారులు. అయితే వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు.. కేసు విచారణను జులై 14 కు వాయిదా వేసింది. ఇక ఇదే కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు జులై 3 న విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేయగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఈ కేసును జులై 3న తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రోజుతో సిబిఐకి ఇచ్చిన విచారణ గడువు ముగియడంతో సునీత పిటిషన్కు ఎంత వరకు వాలిడిటీ ఉంటుందన్నది జులై 3న తేలనుంది. ఇదీ చదవండి: ఎందుకీ ఈగో క్లాషెస్?.. సునీతకు సుప్రీంకోర్టు ప్రశ్న -
లిక్కర్ స్కాంలో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో సీబీఐ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్పై శనివారం రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్పాల్ విచారించారు. సీబీఐ అభియోగాలు మోపిన మనీష్ సిసోడియా, ఆడిటర్ బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్దీప్లకు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు. ఈ సప్లిమెంటరీ చార్జిషీట్లో సౌత్గ్రూప్ ప్రస్తావన వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే మద్యం విధానం రూపకల్పనలో ఆడిటర్ బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది. -
సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్.. రూ.25 కోట్ల అవినీతి ఆరోపణలు
న్యూఢిల్లీ: మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్పై డ్రగ్స్న్కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది. సమీర్ వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై కేసు కూడా నమోదు చేసింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్గా సమీర్ వాంఖేడే ఉన్నారు. షారూక్ తనయుడు ఆర్యన్పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై ఈయనే తొలుత దర్యాప్తు చేశారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్మేనేజ్మెంట్కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడికి .. సరైన ఆధారాలు లేకపోవడంతో 2022 మేలో క్లీన్చిట్ లభించింది. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు..
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులోలో అరుణ్ పిళ్లైపై ఈడీ కీలక అభియోగాలు నమోదు చేసింది. సౌత్ గ్రూప్ హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చేరినట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సే కల్వకుంట్ల కవితపై కూడా ఈడీ కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర కీలకంగా ఉందని తెలిపింది. ఈ గ్రూప్నకు లాభం కలిగేలా ఆప్ నేతలు వ్యవహరించినట్లు తెలిపింది. లిక్కర్ స్కాంలో కవితకు ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించినట్లు అభియోగపత్రంలో పేర్కొంది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హైదరాబాద్లో భూములు కొన్నట్లు గుర్తించామంది. మూడో ఛార్జ్షీట్లో ఫీనిక్స్ పేరును ఈడీ తెరపైకి తెచ్చింది. దీని ద్వారానే భూములు కొన్నట్లు తెలిపింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై ఛార్జ్షీట్లో పేర్కొంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరును కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. కాగా.. ఆడిటర్ బుచ్చిబాబు మార్చి 28న ఈడీ ముందు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కవిత ఆదేశాల మేరకే భూముల కొనుగోలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ సంస్థ నుంచి 25 వేల అడుగుల ప్రాపర్టీ ఎంగ్రోత్ సంస్థ కొనుగోలు చేసిందని, ఫినిక్స్ శ్రీహరి ద్వారా ఈ కొనుగోలు తతంగం జరిగిందని తెలిపింది. 'బయటి రేటు కంటే తక్కువ ధరకు కవిత భూములను కొనుగోలు చేశారు. మార్కెట్ ధర అడుగుకు రూ.1,760 అయితే, కవిత డిస్కౌంట్ కు కొనుగోలు చేసిన ధర అడుగుకు రూ.1,260 మాత్రమే. ఎంగ్రోత్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ భాగస్వామి. ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో భూములను చౌక ధరకు కొనుగోలు చేయగలిగారు. నల్లధనాన్ని వైట్గా మార్చేందుకే భూముల కొనుగోలు చేశారు.' అని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..! -
ఢిల్లీ లిక్కర్ స్కాం: రెండో ఛార్జ్షీట్ నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ రెండో ఛార్జ్షీట్ నమోదు చేసింది. మద్యం పాలసీ విధానం, రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయని తెలిపింది. టెండర్ల తర్వాత ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొంది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటివరకు ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, ముంబై, హైదరాబాద్ , లక్నో బెంగళూరులో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. పలు కీలక డాక్యుమెంట్లు, వస్తువులు, డిజిటల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశామని, కొత్తగా లభించిన ఆధారాలతో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వివరించింది. కాగా.. ఈ ఛార్జ్షీట్లో మనీశ్ సిసోడియాతో పాటు హైదరాబాద్కు చెందిన బుచ్చిబాబు గోరంట్ల, లిక్కర్ వ్యాపారి అమన్దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే పేర్లను కూడా చేర్చింది. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం? -
ఐసీఐసీఐ స్కాంలో కీలక పరిణామం: ఆ ముగ్గురికీ భారీ షాక్!
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాం కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్కు భారీ షాక్ తగిలింది. ఈ కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చందా కొచ్చర్ తోపాటు, ఆమె భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్లపై చార్జిషీట్ దాఖలైంది. ముంబై సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు శనివారం తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ 2009 , 2011 మధ్య వీడియోకాన్ గ్రూప్కు చెందిన ఆరు కంపెనీలకు రూ. 1,875 కోట్ల రూపాయల టర్మ్ రుణాన్ని మంజూరులో అవకతవకలు జరిగాయని సీబీఐ ప్రధాన ఆరోపణ. క్విడ్ ప్రో కింద వీడియోకాన్ గ్రూప్నకు రుణాలు మంజూరైనట్టు, ఇందులో ధూత్ అంతిమ లబ్ధిదారుడని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకుగాను దీపక్ కొచర్కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్కు రూ. 64 కోట్లు, దక్షిణ ముంబైలోని ఫ్లాట్కు 2016లో రూ. 11 లక్షలు (విలువ రూ. 5.25 కోట్లు) లంచంగా ముట్టాయని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో చందాకొచ్చర్ను ఐసీఐసీఐ బ్యాంకు తొలగించింది. ఈ కేసులో సీబీఐ 2019లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019లో, చందా కొచ్చర్ బ్యాంక్ ఎండీగా ఉన్నప్పుడు కంపెనీలకు ఐసీఐసీఐ మంజూరు చేసిన రూ.1,800 కోట్లకు పైగా రుణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 డిసెంబర్లో కొచ్చర్ దంపతులను, వేణుగోపాల్ ధూత్లను సీబీఐ అరెస్టు చేసింది. అయితే, అరెస్టులు చట్టానికి లోబడి లేవని పేర్కొంటూ జనవరి 9న బాంబే హైకోర్టు కొచ్చర్లకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ధూత్కు బెయిల్ కూడా లభించిన సంగతి తెలిసిందే. -
మాల్యా దగ్గర లోన్లు చెల్లించేంత డబ్బుంది, కానీ..
ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా వ్యవహారానికి సంబంధించి.. సీబీఐ తాజాగా ముంబై కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో విస్తుపోయే విషయాలను పేర్కొంది దర్యాప్తు సంస్థ. విజయ్ మాల్యా దగ్గర ఆ సమయానికి రుణం తిరిగి చెల్లించడానికి తగినంత డబ్బు ఉనప్పటికీ.. ఆ పని చేయలేదని, బదులుగా ఆయన దేశం విడిచి పారిపోయే ముందు విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశాడని సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. అదే సమయంలో బ్యాంకులు సైతం ఆయన నుంచి లోన్లు రికవరీ చేయడంలో విఫలం అయ్యాయంటూ తెలిపింది. 2008-17 మధ్య మాల్యా దగ్గర బ్యాంకు లోన్లు చెల్లించడానికి తగినంత డబ్బు ఉంది. ఆ సమయంలోనే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ కోసం అతను లోన్లు తీసుకున్నాడు అని సీబీఐ పేర్కొంది. అయితే.. తన దగ్గర ఉన్న సొమ్ముతో లోన్లు చెల్లించకపోగా.. యూరప్ వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు తన పిల్లలకు సంబంధించి స్విట్జర్లాండ్లో ఉన్న ట్రస్టులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడని గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. ఫ్రాన్స్లో 35 మిలియన్ యూరోలు చెల్లించి రియల్ ఎస్టేట్ను కొనుగోలు చేశాడు. తన కంపెనీలలో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుండి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ పేర్కొంది. అలాగే ఇంగ్లండ్లోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. ఐడీబీఐ-కింగ్పిషర్ ఎయిర్లైన్స్ 900 కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నాడు. విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయి.. యూకేలో తలదాచుకున్నాడు. ఈ మేరకు అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కూడా. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2019, జనవరి 5వ తేదీన ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను fugitive(పరారీలో) ఉన్నట్లుగా ప్రకటించింది. ఇక.. గత ఛార్జ్షీట్లో 11 మంది నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ, తాజా ఛార్జ్షీట్లో ఐడీబీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ బుద్ధదేవ్ దాస్గుప్తా పేరును చేర్చింది. మొత్తంగా రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయాడు మాల్యా. ఇదీ చదవండి: ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. వణికిపోయేలా చేసింది! -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్షీట్ దాఖలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రోజ్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. మొత్తం 428 పేజీల చార్జ్షీట్లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది వివరంగా తెలిపింది. చార్జ్షీట్లో చేర్చిన 17 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు: A1 - సమీర్ మహేంద్రు A2 - సమీర్కు చెందిన రెస్టారెంట్ ఖావోగాలి A3 - సమీర్కు చెందిన బబ్లీ బేవరేజేస్ A4 - సమీర్కు చెందిన ఇండో స్పిరిట్ A5 - సమీర్కు చెందిన ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ A6 - విజయ్ నాయర్ A7 - శరత్ చంద్ర A8 - శరత్కు చెందిన ట్రైడెంట్ చెంపార్ A9 - శరత్కు చెందిన అవంతిక కాంట్రాక్టర్స్ A10 - శరత్కు చెందిన అర్గనామిక్స్ ఎకోసిస్టమ్స్ A11 - బినయ్ బాబు A12 - రాజేశ్ మిశ్రాకు చెందిన పెర్నార్డ్ రికర్డ్ A13 - అభిషేక్ బోయిన్పల్లి A14 - అమిత్ అరోరా A15 - అమిత్కు చెందిన KSJM స్పిరిట్స్ A16 - అమిత్కు చెందిన బడ్డీ రిటైల్స్ A17 - అమిత్కు చెందిన పాపులర్ స్పిరిట్స్ ఆప్కు వంద కోట్ల ముడుపులు కోర్టులో దాఖలు చేసిన రెండో చార్జ్షీట్లో కుట్ర జరిగిన తీరును ఈడీ సవివరంగా పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్ అద్మీ పార్టీకి చేరాయని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా ఇందులో పేర్కొంది. లంచంగా వచ్చిన వంద కోట్లను గోవా ఎన్నికల్లో ఆమ్ అద్మీ పార్టీ ఉపయోగించిందని ఆరోపించింది. గోవాలో పార్టీ వాలంటీర్లుగా పని చేసిన వారి కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్టు పేర్కొంది. చార్జ్షీట్లో సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లు ఇక ఇదే ఛార్జ్ షీట్లో కుట్ర గురించి వివరించిన ఈడీ ఓ చోట ఎమ్మెల్సీ కవిత గురించి ప్రస్తావించింది. నవంబర్ 12, 2022న అరుణ్పిళ్లైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని పేర్కొంది. అరుణ్ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్లో పార్ట్నర్గా చేరారని తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన రెండు ఫోన్ నెంబర్లను ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ నెంబర్లను ఏ ఏ సమయంలో వాడారో కూడా తేదీల వారీగా ఛార్జ్షీట్లో పేర్కొంది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. అలాగే ఎంపీ మాగుంట పేరు కూడా ఈడీ చార్జ్షీట్లో ఉంది. ఒబెరాయ్ హోటళ్లో కుట్రకు సంబంధించిన వ్యవహారమంతా జరిగిందని తెలిపింది. ఆమ్ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, ఢిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా L1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలు మార్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారని ఈడీ తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది. చదవండి: పోలవరంపై ఎంపీ వంగా గీత ప్రశ్న.. కేంద్రమంత్రి సమాధానమిదే -
TS: వైద్యం ‘కుదేలు’.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రెండో చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రెండో చార్జిషీట్ వేసింది. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రెండు నెలలపాటు ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్లు వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా వైద్యరంగంపై చార్జిషీట్ వేసింది. శనివారం గాంధీభవన్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సమన్వయ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 16 అంశాలతో కూడిన అభియోగ పత్రాన్ని విడుదల చేశారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం కుదేలైందని, మండలస్థాయిలో 30 పడకల దవాఖానా ఏర్పాటు హామీ, డాక్టర్లు ఊర్లోనే నివసించాలన్న నిబంధన ఎత్తివేత, బడ్జెట్లో 4.4 శాతం మాత్రమే నిధుల కేటాయింపు, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులలేమి, సిబ్బంది కొరత, రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న వైనం, జిల్లాకేంద్రాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయకపోవడం, అత్యవసర సేవల నిర్వీర్యం, సమగ్ర వైద్య విధానం రూపకల్పనలో వైఫల్యం, పల్లెల్లో అరకొర వైద్యం, ఆరోగ్యశ్రీ, జర్నలిస్టుల హెల్త్కార్డుల సేవలకు ఆటంకాలు, కరోనా కట్టడిలో విఫలం, కరోనా బూచితో కార్పొరేట్లకు దోచిపెట్టడం, గ్రేటర్ హైదరాబాద్లో పడకేసిన వైద్యం అనే అంశాలతో ఈ అభియోగపత్రాన్ని రూపొందించింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు: ఏలేటి కొత్త సచివాలయం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్ల మీద ఉన్న ప్రేమ సీఎం కేసీఆర్కు ప్రజారోగ్యంపై ఎందుకు లేదని ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఆరోగ్య తెలంగాణ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ బడ్జెట్లో 8 శాతం మేర కేటాయించాల్సిన నిధులను కేవలం 4.4 శాతానికి పరిమితం చేశారన్నారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కోల్పోయేలా చేశారని, ముఖ్యమంత్రి తన సాధారణ పరీక్షలకు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ఆయనకే చెల్లిందన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్వాయి స్రవంతి, నిరంజన్, మదన్మోహన్, కైలాశ్, భరత్చౌహాన్ పాల్గొన్నారు. చదవండి: 'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్ -
శ్రద్ధా హత్య కేసు..చార్జిషీట్లో షాకింగ్ ట్విస్ట్
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసులో ఆరు వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్ను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చార్జిషీట్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా తన బాయ్ఫ్రెండ్ని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సుమారు 6,629 పేజీల చార్జీషీట్లో శ్రద్ధా తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లిందన్న కోపంలోనే అఫ్తాబ్ ఈ దారుమైన ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అప్తాబ్కి శ్రద్ధా తన స్నేహితుడిని కలవడం నచ్చలేదని, పైగా ఆ విషయమై తీవ్ర ఆందోళన చెందినట్లు నివేదికలో తెలిపారు. దీంతోనే ఆమెను అంత క్రూరంగా చంపేశాడని చార్టిషీట్లో పేర్కొనట్లు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మీను చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ తన భాగస్వామి శ్రద్ధావాకర్ని హత్య చేసి, 36 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఆ తదనంతరం శ్రద్ధా కనపడకపోవడం, ఆ విషయాన్ని స్నేహితులు శ్రద్ధా తండ్రికి చెప్పడంతో.. ఆయన ఫిర్యాదు మేరకు అఫ్తాబ్ని అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్) -
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ దూకుడు.. రెండో చార్జిషీట్ దాఖలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. 13,657 పేజీలతో కూడిన ఈ అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్లో 12 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను ప్రస్తావించింది. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన విజయ్ నాయర్, శరత్రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా పేర్లతోపాటు మరో ఏడు కంపెనీలపై అభియోగాలు మోపింది. అయితే ఈ చార్జిషీట్లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఈడీ అధికారులు శనివారం కోర్టుకు సమర్పించనున్నారు. కాగా, ఇప్పటికే గత ఏడాది నవంబర్లో తొలి చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుకు సంబంధించిన చార్జిషీట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఇప్పటి వరకు ఈ కేసులో సమీర్ మహింద్రు, శరత్చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సమీర్ మహింద్రు ఒకరు. ఈ కేసులోని నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా పేరు ఈడీ తొలి చార్జిషీట్లోనూ చేర్చలేదు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బీసీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మనీష్ సిసోడియా సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారంతో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులైన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి , బినోయ్బాబు జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. జనవరి 7న శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ నిందితులను ప్రవేశపెట్టనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
గౌతమ్ థాపర్పై ఛార్జ్షీట్
న్యూఢిల్లీ: సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, ఆ సంస్థ మాజీ ప్రమోటర్ గౌతమ్ థాపర్పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రూ. 2435 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఈ ఛార్జ్షీట్ దాఖలైంది. 12 బ్యాంకులపై ఈ బ్యాంకింగ్ మోసం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. కంపెనీ, థాపర్ ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై బ్యాంక్ నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాలను తారుమారు తదితర ఆరోపణలపై ఏజెన్సీ దాదాపు 19 నెలల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ చార్జ్షీట్ను దాఖలు చేయడం జరిగింది. అవినీతి, మోసం ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసిన యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్తో సంబంధాలపై థాపర్ ఇప్పటికే పలు విచారణలను ఎదుర్కొంటున్నారు. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! -
ఆ దాడి వెనుక తెలంగాణ మావోలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్స్టేషన్ పరిధి టేకల్ గుడియం సమీపంలో పోలీసులపై జరిగిన దాడి ఘటన వెనుక తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలే కీలకంగా వ్యవహరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ ఘటనకు సూత్రధారులుగా 23మంది పేర్లను పేర్కొన్న ఎన్ఐఏ.. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది పేర్లను చార్జ్షీట్లో చేర్చింది. 2021 ఏప్రిల్ 3న జరిగిన ఈ దాడి ఘటనలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్లకు చెందిన పోలీసులు 22మంది మృతి చెందగా, 35మందికిపైగా గాయపడ్డారు. సుమారు 21 నెలలపాటు విచా రణ జరిపిన ఎన్ఐఏ అధికారులు... దాడిలో 350 నుంచి 400 మంది వరకు సాయుధ మావోయి స్టులు పాల్గొన్నప్పటికీ కేసులో (ఆర్సీ–02/ 2021/ఎన్ఐఏ/ఆర్పీఆర్) 23మందిపైన చార్జ్షీట్ను దాఖలు చేశారు. సంచలనం కలిగించిన తారెం ఘటన పోలీస్ సాయుధ బలగాలపై మెరుపుదాడి చేసిన ఆ ఘటన కేసును మొదట బీజాపూర్ జిల్లాలోని టార్రెమ్ పోలీస్స్టేషన్ ఎఫ్ఐఆర్ నం.06/2021 ప్రకారం నమోదు కాగా, తర్వాత ఎన్ఐఏ ద్వారా 2022 జూన్ 5వ తేదీన తిరిగి నమోదు చేశారు. భద్రతా దళాలు సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులపై బారెల్ గ్రెనేడ్ లాంచర్(బీజీఎల్)లు, ఆటోమేటిక్ ఆయుధాలతో కా ల్పులు జరిపి రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే కోబ్రా జవాన్ను కూడా అపహరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తెలంగాణ అగ్రనేతలే సూత్రధారులు... 21 నెలల విచారణ తర్వాత ఎన్ఐఏ తన దర్యా ప్తులో దాడి వెనుక సీపీఐ(మావోయిస్ట్) సీనియర్ నేతల పాత్ర ఉందని తేల్చింది. ఐపీసీలోని సెక్షన్లు– 120 రెడ్విత్/302 – 307, 396, 149, 121 మరియు 121ఎలతో పాటు భారతీయ ఆయుధ చట్టం, 1959లోని సెక్షన్లు– 25(1ఏ) – 27, ఈ చట్టం 1908లోని సెక్షన్ – 3, 4 – 6 మరియు సెక్షన్లు– 16, 18, 18ఏ, 20, యుఏ(పీ) చట్టం, 1967లోని 38ల కింద కేసులు నమోదు చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కమిటీ సలహాదారుడు ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతితోపాటు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న, కేంద్ర నాయకులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, సుజాత అలియాస్ పోతుల కల్పన (మల్లోజుల కోటేశ్వర్రావు భార్య), ఉమ్మడి వరంగల్కు చెందిన సాగర్ అలియాస్ అన్నే సంతోష్, రఘు రెడ్డి అలియాస్ వికాస్, నిర్మల అలియాస్ నిర్మలక్కలు ఉన్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన పొడియం హిద్మా అలియాస్ హిడ్మన్న, మద్నా అలియాస్ జగ్గు దాదాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర, దండకారణ్యం, ఏరియా కమిటీలకు చెందిన 15 మంది పేర్లను ఎన్ఐఏ ప్రధానంగా పేర్కొంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
డ్రాపౌట్స్ నివారణకు చర్యలు
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఓటు ప్రజాస్వామ్యానికి బలం
అమలాభట్టలో న్యాయ సచేతన శిబిరం
మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నలుగురు బీజేడీ ఎమ్మెల్యేలకు అనర్హత తాఖీదులు
భక్తులకు పండ్లు వితరణ
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
తప్పక చదవండి
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement