-
తోడు దొంగల కొత్త తెలివి తేటలు
-
సీఎం జగన్ కి తగిలి..నా మీద పడింది..
-
ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవుతుంది...
-
ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా చంద్రబాబూ..
పచ్చ పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్లో వాలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జనం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీని కోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే.. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయమే ఖాయమని రకరకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తుందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్ తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు.చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పెర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. రకరకాల సర్వేలు ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సీఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు. -
వీధినపడ్డ అవ్వా, తాతలు ఈ పాపం చంద్రబాబుదే
-
పెన్షన్ల పంపిణీపై నీచ రాజకీయం
-
ధూళిపాళ్ల బరితెగింపు
-
డబ్బుతో రండి..అధికారంలోకి వస్తే దండుకొండి
-
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు
-
షర్మిల చదువుతున్నది ఎవరి స్క్రిప్ట్..టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతుంది ?
-
రంగా హంతకులెవరో ఎల్లో తాతకు తెలియదా..?
-
గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి బోర్లాపడ్డ విపక్షాలు
-
పూర్తిగా ప్యాకేజీ స్టార్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్
-
చెత్త విమర్శలు..చిల్లర చేష్టలు
-
తుపాను తాకిడి ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ టూర్లు
-
దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!
పోయింది. పరువంతా పోయింది. తెలంగాణ గట్టు మీద వేసిన పొలిటికల్ పిల్లిగంతులను ఓటర్లు అదిరిపోయే రేంజ్లో తిప్పికొట్టారు. తెలంగాణలో పార్టీ జెండా పీకేసినా.. చంద్రబాబుకి ఫలితం దక్కలేదు. ఓట్ల వేటలో దత్తపుత్రుడికి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడేదో చేసేసి.. ఆ ప్రభావంతో ఏపీలో ఏదేదో చేసేద్దామని పన్నిన కుట్రలు ఈవీఏంల సాక్షిగా కుళ్లు కంపు కొట్టేశాయి. ఇప్పుడు ఇక ఏపీ వంతు. ఎవరికి ఎవరు ఏం అవుతారు ? ఎవరు ఎవరితో కలుస్తారు ? పార్టీలు కలిసినంత మాత్రానా క్యాడర్ కలుస్తుందా ? టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. ఈ గజిబిజి గందరగోళానికి తెర పడేదెప్పుడు ? తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేస్తే.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద లైట్ వెలగాలి. చంద్రబాబు గీసిన స్కెచ్ సారంశం అదే. అందులో భాగంగానే దత్తపుత్రుడ్ని కూడా రంగంలోకి దింపి.. బీజేపీతో పొత్తు సరాగాలు ఆలపించేలా చేసింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీ అదిరిపోయేలా తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేయాలని చంద్రబాబు తలిస్తే.. బాబుకి, దత్తపుత్రుడికి తలతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. సీమాంధ్ర ఓటర్లంతా మావాళ్లే అని తెగచెప్పే విజనరీకి కనువిప్పు కలిగిస్తూ గ్రేటర్ అంతా బీఆర్ఎస్కి జై కొట్టింది. ఇక పవన్కళ్యాణ్కొచ్చిన కష్టమైతే పగొళ్లకి కూడా రాకూడదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు డిపాజిట్లు పోయి బోరుమంటుంటే...మరోవైపు బర్రెలక్క పాటి విలువ లేదు ప్యాకేజీ స్టార్కి అంటూ మొదలైన పొలికలు జనసేనకి జ్వరం వచ్చేలా చేశాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్లు. సరే... ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక ఏపీ వైపు చూద్దామనుకునే లోపు...కథ మరో మలుపు తిరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చుకున్న హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అవలంభించిన వైఖరితో.. బీజేపీ మరింతగా దూరం పెడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించే చచ్చు వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారో.. ఇటు బీజేపీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి దాకా జనసేనతోనే పొత్తు అంటూ వచ్చిన బీజేపీ.. ఇప్పుడు "టీడీపీ కాంగ్రెస్తోనూ, ఇండియా కూటమిలోనూ ఉండొచ్చు. ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటని" ఎదురు ప్రశ్నిస్తోంది. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యాక...ఇక ఆల్ ఈజ్ వెల్ అన్న భావనలోనే చంద్రబాబు వెళ్లిపోయారు. అటు పురంధేశ్వరి కూడా టీడీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీ క్యాడర్ని ఆశ్చర్యపరిచారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్కి జాతీయ స్థాయి నేతల అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం విశ్వప్రయత్నాలు చేయడం. ఇలా చాలానే చేశారు. చివరకు మీరు...మాకు అధ్యక్షురాలా ? టీడీపీకా అంటూ బీజేపీ నేతలు బహిరంగంగా పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే...పురంధేశ్వరి కూడా టీడీపీని బీజేపీకి దగ్గర చేయలేకపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అనే దాకా బీజేపీ నేతలొచ్చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సాగుతోన్న వార్ ఎపిసోడ్స్ ఇటు చంద్రబాబులో, అటు పవన్కళ్యాణ్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. రోలు మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఈ భేటీని అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ ఎత్తుగడలు తెలంగాణలో చిత్తు అయ్యాయి. ఈ తరుణంలో డిపాజిట్లు కోల్పోయిన పవన్ తన కష్టాలు చెప్పుకుంటే...ఆయన ఓదార్చేదేం ఉంటుంది ? ఈ విషయం పక్కన పెడితే...ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఏపీలో...క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. క్యాడర్ కన్నా, పార్టీ కన్నా టీడీపీనే మిన్న అన్న సంకేతాలను పంపిన దత్తపుత్రుడు తీరుతో.. జనసైనికులు షాక్ అవుతున్నారట. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా...పట్టుమని పదిమంది లీడర్లు లేరు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు. పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్ర బాబుకి అవసరం అయినప్పుడు స్పందిస్తూ వచ్చారు పవన్కళ్యాణ్. బలమైన రాజకీయ నిర్మాణం లేకపోయినా...ఈ పదేళ్లు జనసేనని క్షేత్రస్థాయిలో మోస్తూ వచ్చిన వాళ్లంతా...తాము టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి చేసే రాజకీయానికి ఇటు క్యాడర్ నుంచి, అటు లీడర్స్ నుంచి ఎంత వరకు మద్దతు వస్తుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదీ చదవండి: కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీకి ఈ దుస్థితి ఏమిటో? -
పవన్ నాయకత్వం వర్ధిల్లాలి..రోడ్డెక్కిన లోకేష్..
-
చీప్ లీడర్స్...చీప్ పాలిటిక్స్
-
"మిడిల్ లో మీడియేటర్" అందిన కాడికి దోచేస్తున్నాడు
-
ఓట్లు కావాలి కానీ..పార్టీ బలపడకూడదు..అందుకేనా..?
-
టీడీపీ నిమ్మల రామానాయుడు చిల్లర రాజకీయాలు..
-
అదీ సంగతి.. లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారన్నమాట..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజలలో సానుభూతి కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి. ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒక ఖాళీ కుర్చీ సన్నివేశాన్ని కూడా సృష్టించినట్లు అనిపిస్తుంది. అలాగే చంద్రబాబుకు తన తల్లి, భార్య విషం పెడతారంటూ కొందరు చేసిన ఆరోపణను కూడా సింపధీ కోసమే ప్రస్తావించినట్లు కనబడుతుంది. ✍️ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి యథా ప్రకారం సైకో వ్యాఖ్యలు చేయడం, లేనిపోని ఆరోపణలు మోపడం వంటివి చేశారు. తండ్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్టు అయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో పార్టీకి ఒక దశ,దిశ లేకుండా పోయాయని, పార్టీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను తయారు చేసుకోవడం లో తప్పు లేదు. కాని ఆ సందర్బంలోనే ఖాళీ కుర్చీ ఉంచవలసిన అవసరం ఉంటుందా? అన్న సందేహం వస్తుంది. అది చంద్రబాబు పట్ల గౌరవంతో చేసిందే కావచ్చు. కాని కొద్ది రోజుల క్రితం ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు స్థానంలో కూర్చుని అద్యక్షత వహించారన్న ప్రచారం నేపథ్యంలో ఇలా చేసి ఉండవచ్చు. ✍️ఆ తర్వాత బాలకృష్ణకు సంబంధించిన వార్తలను తెలుగుదేశం మీడియానే బహిష్కరించింది. దాంతో ఇదేదో నందమూరి, నారా కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత బాలకృష్ణను సైడ్ లైన్ చేశారు. తెలంగాణ పార్టీని చూసుకోవాలని చెప్పినట్లు ఉన్నారు. దాని సంగతేమో కాని, ఆయన హాపీగా సినిమా ఫంక్షన్లలో పాల్గొని అమ్మాయిల మీద చెణుకులు విసురుతున్నారు. అది వేరే విషయం. ✍️ఇక ఈ సమావేశం విషయానికి వస్తే లోకేష్ కూడా అధ్యక్ష స్థానంలో కూర్చోకుండా జాగ్రత్తపడ్డారని టీడీపీ వర్గాలు భావించవచ్చు. కాని గతంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావుకు ఈ పాటి గౌరవం అయినా దక్కలేదే అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎన్.టి.ఆర్. స్థాపించిన టీడీపీని చంద్రబాబు లాక్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకు తోసేశారు. ఆయన పార్టీ గుర్తు స్వాధీనం చేసుకున్నారు. చివరికి పార్టీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోని డబ్బును కైవసం చేసుకున్నారు. పార్టీ నుంచి బయటకు పంపినట్లు ప్రకటించారు. ✍️వైస్రాయి హోటల్ వద్ద చెప్పులు వేసి మరీ అవమానించారు. పైగా అప్పట్లో చంద్రబాబే స్వయంగా ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని విమర్శలు చేశారు. అంతే తప్ప, పార్టీలో గొడవలు జరిగినా ఎన్.టి.ఆరే తమ నాయకుడని ఆయన జీవించి ఉన్నంత కాలం ఏనాడు అనలేదు. ఒక ఖాళీ కుర్చీని ఆయన కోసం వదలివేయలేదు. ఎన్.టి.ఆర్. మరణించిన తర్వాత అసలు తామే ఎన్.టి.ఆర్. వారసులమని మాత్రం ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించుకున్నారు. అయినా ఆయన కోసం ఇలా ఖాళీ కుర్చీ వదలలేదు. అంటే దీని అర్ధం ఎన్.టి.ఆర్.ను ఆయన కుమారులు, అల్లుళ్లు ఎవరూ గౌరవించలేదని అనుకోవాలా? కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఖాళీ కుర్చీ సన్నివేశాలు జరిగినా, వాటి గురించి,ఆ సందర్భాల గురించి ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉండదు. ✍️ఇక లోకేష్ చేస్తున్న విమర్శలను పరిశీలిద్దాం. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి లు చంద్రబాబుకు విషం పెడతారని అంటారా అని కొందరు వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. నిజమే ఎవరూ అలా అనరాదు. కాని అందుకు అవకాశం ఇచ్చింది లోకేష్, ఇతర కుటుంబ సభ్యులే కదా! చంద్రబాబును జైలులోనే ఏదో చేసేస్తారని, కుట్రలు జరుగుతున్నాయని అన్నప్పుడు అందుకు సమాధానంగా .. అయ్యా.. చంద్రబాబుకు ఇంటి నుంచే ఆహారం వస్తోంది కదా? అందులో ఏమైనా చేస్తే కుటుంబం వారే చేయాలి కదా అని పేర్కొన్నారు. ఆరోపణ చేసేటప్పుడు దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఆలోచించుకోకుండా చేస్తే ఇలాగే ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ✍️లోకేష్ అయితే తన తండ్రి ఆరోగ్యంపై భావోద్వేగం చెందారని ఈనాడు పత్రిక రాసిందే. మరి అంతకుముందే ఇతర టీడీపీ నేతలు అంతా బాగుందని చెప్పారే. తండ్రి ఆరోగ్యంపై అనవసర అనుమానాలు లేవనెత్తింది ఎవరు? జైలు పై దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన సందేహపడ్డారు. మరో వైపు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వంటివారు జైలు గోడలు బద్దలు కొట్టి అయినా చంద్రబాబును బయటకు తీసుకు రావాలిపిస్తోందని ఎందుకు అన్నారో చెప్పాలి. అప్పుడు ఎవరి మీద డౌట్లు వస్తాయి? తన తల్లిని,భార్యను అంటారా అంటూ లోకేష్ ముఖ్యమంత్రి పై మళ్లీ దారుణమైన ఆరోపణలు చేశారు. ✍️మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్పై నేరుగా ఆరోపణలు చేస్తున్న లోకేష్కు అది సైకోలాగా మాట్లాడడం అని తెలియదా? తాను ఏమైనా మాట్లాడవచ్చుకాని, ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు అమ్మో అంత మాట అంటారా అంటే కుదురుతుందా? జగన్ గతంలో జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాని, టీడీపీ నేతలు కాని ఎన్ని నీచమైన విమర్శలు చేశారో బహుశా లోకేష్కు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో ఆయన రాజకీయాలలోకి రాలేదు. అమెరికాలో చదువుకుంటూ ఎంజాయ్ చేస్తున్న రోజులవి. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు టీడీపీ సృష్టించిన వదంతులు ఎన్నో ఆనాటివారందరికి తెలుసు. ✍️అంతెందుకు రెండేళ్ల క్రితం రాజంపేట పర్యటనకు వెళ్లి చంద్రబాబు ఏమన్నారో గుర్తు లేదా! జగన్ గాలిలో వస్తాడు.. గాలిలోనే పినిష్ అవుతారని అన్నప్పడు అవి సైకో మాటలు అనిపించలేదు. ఈ సంగతులు పక్కనబెడితే లోకేష్ తెలిసి అంటున్నారో, తెలియక అంటున్నారో కాని, వ్యవస్థలను జగన్ మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో ఉంచుతున్నారని, బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి జగన్కు అంత శక్తి ఉంటే ఇన్నేళ్లుగా టీడీపీ నుంచి ఇన్ని సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కుంటారు? కోర్టుల్లో పదుల సంఖ్యలో లాయర్లు, అంతర్జాతీయ స్థాయి లాయర్లను ఉపయోగించి కేసు కొట్టివేయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడితే అందుకు జగన్ కారణం ఎలా అవుతారు? ✍️కేసులో చంద్రబాబు పై వచ్చిన అభియోగాలలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జిలు భావించడం కాదా? లోకేష్ వ్యాఖ్యలు జడ్జిలను అవమానించడం కాదా? ఈ కేసులో మిగిలినవారికి ముప్పై రోజులలో బెయిల్ వచ్చిందని, తన తండ్రికి ఎందుకు రాలేదని ఆయన అంటున్నారు. నిజమే.. వారు కేసులలో విచారణకు ఎంతో కొంత సహకరించారు. తప్పులను కొన్నిటినైనా ఒప్పుకున్నారు. చంద్రబాబు అలా చేయడం లేదు కదా? అంతదాకా ఎందుకు మాజీ పి.ఎస్.పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయింది చెప్పగలిగే పరిస్థితి లోకేష్కు ఉందా? పైగా 17 ఎ ఉపయోగపడితే కేసులు లేకుండా పోతాయని భావించి బెయిల్ కోసం అప్లై చేయంది టీడీపీ లాయర్ల టీమ్ కాదా? ఇవన్ని వదలిపెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఏమి ఉపయోగం? తన తండ్రి నిస్వార్దపరుడని లోకేష్ ప్రచారం చేసుకోవచ్చు. చదవండి: ఆ ప్రశ్నకు ఎందుకు సమాధానం దాటేశావ్ లోకేషా? ✍️అచ్చం పార్టీ సభ్యులు వంద రూపాయలు చొప్పున కట్టిన సొమ్మే టీడీపీ ఖాతాలో ఉందని చెప్పవచ్చు. కాని దానిని ఎంత మంది నమ్ముతారు? కనీసం టీడీపీ క్యాడర్ అయినా నమ్ముతుందా? ప్రజల కోసమే తప్ప కుటుంబం కోసం చంద్రబాబు ఆలోచించలేదని లోకేష్ చెప్పడం వినడానికి బాగానే ఉంటుంది. నిజానికి కుటుంబం గురించి పట్టించుకోవడం తప్పేమీ కాదు. కాని బిల్డప్ కోసం అబద్దాలు చెప్పడమే తప్పు. లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి ఎవరి నుంచి సాయం పొందింది తెలియదా? లోకేష్ రాజకీయాలలోకి రారని గతంలో ఒక సందర్భంలో చెప్పారు. కాని కనీసం ఎమ్మెల్యే కాకుండా ఎందుకు ఎమ్మెల్సీని చేశారు? ఆ తర్వాత ఏమి అనుభవం ఉందని ఆయనను మంత్రిని చేశారు? అది కూడా మూడు శాఖల మంత్రి. ✍️అంతేకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం చక్రం తిప్పిందంతా లోకేష్ కాదా? ఇప్పుడేవో కథలు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వింటారా? చంద్రబాబు మాదిరి ఎదుటివారిపై వ్యక్తిగత దూషణల ద్వారా తాను కూడా రాజకీయం చేయాలని లోకేష్ భావిస్తున్నట్లుగా ఉంది.కాని ఈ రోజులలో అది అయ్యే పనికాకపోవచ్చు. ఒకవైపు చంద్రబాబు జైలులో ఉంటే, భార్య భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉండి ఆయనకు అవసరమైన ఆహార విషయాలను జాగ్రత్తగా చూసుకుంటారనుకుంటే, ఆమె కూడా రాజకీయ యాత్ర ఎందుకు చేస్తున్నారు? ఏమిటి ఆమె లక్ష్యం? సానుభూతి రాజకీయం కాదా? ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు పక్షాన నలభై ఐదు రోజులపాటు లోకేష్ మీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తారట. అంటే అప్పటిదాకా చంద్రబాబు జైలునుంచి బయటకు రాలేరని లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారా? -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అసలు చంద్రబాబు అరెస్ట్కి, తిరుమలకు ఏం సంబంధం?
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు విశ్వరూపం బయటపడుతుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. దీంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలతో ఆ పార్టీకి కనీస సానుభూతి కూడా రావడంలేదు. అయినా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలను ఏమార్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ శృతిమించింది. తిరుమల పవిత్రతను మంటగలిపేలా టీడీపీ శ్రేణులు ప్రవర్తించారు. ఉనికి కోసం టీడీపీ చావు తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పచ్చ పార్టీ నాయకులు ఎందుకు తిరుమలను లక్ష్యంగా చేసుకొని గత పది రోజులుగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనే పేరుతో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం జెండాలతో ఫోటోలు తీసి రాజకీయం చేయాలని చూస్తున్నారు?. చివరికి స్టీలు గ్లాసులతో తెలుగుదేశం పార్టీ మోత మోగించు అనే నిరసన కార్యక్రమాన్ని కూడా తిరుమలలో చేయాలని చూడడం ఏవగింపు కలిగిస్తుంది. ఈ విషయంపై హైందవులు, తిరుమల శ్రీవారి భక్తులు తెలుగుదేశం పార్టీ వైఖరిని చీదరించుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకి మద్దతుగా గత పది రోజులుగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం జెండాను చూపిస్తూ ఫోటోలు దిగి సామాజిక ఉద్యమాల్లో సర్కులేట్ చేయడం ద్వారానో లేక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న నిరసనలతో తిరుమలలో వివాదాస్పదం చేసి, అధికార పక్షాన్ని ఇరకాటంలోకి పెట్టాలని శతవిధాల తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని హైందవ సంఘాలు, తిరుమల శ్రీవారి భక్తులు తిప్పి కొట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చివరికి టీడీపీ నిర్వహిస్తున్న మోతు మోగిద్దాం నిరసన కార్యక్రమానికి మద్దతుగా సీహెచ్ భగవాన్, రామ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా విజయవాడ నుంచి తిరుమలకు వచ్చి స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకున్నారు. టీడీపీ ఎంత నీచానికి ఒడిగట్టిందో ఈ విషయంతోనే అర్థమవుతుంది. ఇదే విధంగా 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు ఇదే అత్యుత్సాహం ప్రదర్శించి చతికిల పడిన విషయం మర్చిపోతున్నారు. చదవండి: నోటీసుల్లో లోకేష్కు సీఐడీ ఏం చెప్పిందంటే..? -
అయ్యా పవనూ.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శవ రాజకీయానికి తెరలేపారు. మొన్నటికి మొన్న వలంటీర్ వ్యవస్థపై విషాన్ని కక్కిన పవన్.. ఇప్పుడు విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంకతో శవ రాజకీయాలు మొదలు పెట్టారు. వరలక్ష్మీ అనే వృద్ధురాలిని వాలంటీర్ చంపేశాడంటూ అసత్య ప్రచారం చేస్తున్న పవన్.. రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్’ అంటూ వాలంటీర్లను అభివర్ణించడం.. పవన్లో నిండుకుపోయిన విషానికి నిదర్శనమంటున్నారు. కాగా వరలక్ష్మిని చంపడానికి వారం రోజులు ముందే వెంకటేష్ అనే యువకున్ని వాలంటీర్గా తొలగించారు. విధులు సరిగా నిర్వహించడం లేదని జులై మూడో తేదీన వెంకటేట్పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 24వ తేదీన వెంకటేష్ వాలంటీరుగా తొలగించారు. వాలంటీరుగా తొలగించిన తరువాత వరలక్ష్మికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్గా వెంకటేష్ చేరాడు. ఈ క్రమంలో జులై 30వ తేదీ అర్ధరాత్రి నగల కోసం వరలక్ష్మిని వెంకటేశ్ హత్య చేశాడు. అయితే రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ హత్య చేశాడంటూ పవన్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ వల్ల 30 వేల మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ దుష్ప్రచారం చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తి చంపేస్తే వలంటీర్ చంపేశారంటూ పవన్ విష ప్రచారం చేశారు. ఎంత చంద్రబాబు డైరెక్ట్ చేయించినా.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? అని పవన్ తీరును ప్రశ్నిస్తున్నారు పలువురు. వ్యవస్థలో ఒకరో, ఇద్దరో చేసిన తప్పుకు మొత్తం అందరిపై నిందలు వేయడం, విషం జిమ్మడం సరికాదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించడం సరికాదని, చుట్టున్న ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నామని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నది పూర్తిగా దుష్ప్రచారమని, ఇటీవల కేంద్రం కూడా పార్లమెంటులో ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు, చదవండి: బాలికపై చిరుత దాడి ఘటన.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశం -
మళ్ళీ అవే చీప్ ట్రిక్స్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement