-
ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్, కుమారులు వినోద్(6), రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు. -
చక్రవాకాలు: ఆ స్త్రీల కోసం మొసళ్లు కూడా తోడుగా
'పాస్పోర్ట్ లేని అతిథులు పక్షులు. అవి మనల్ని ఫుడ్ అడగవు. వెచ్చటి బెడ్రూమ్లూ అడగవు. తొణికిసలాడే నీటి తావూ, వాలడానికి విస్తారంగా చెట్లు ఉంటే చాలు. కాని అవి వచ్చినప్పుడు వాటిని నమిలి మింగుదామనుకుంటే?.. కుదరదు అంటున్నారు స్త్రీలు. కేవలం డజన్ మందే. ఒడిశాలోని అరాచండిలో ప్రతి శీతాకాలం వచ్చే అరుదైన పక్షులను కాపాడి తిరిగి ఇళ్లకు పంపుతారు.' అంతా కలిపి ఒకటిన్నర చదరపు కిలోమీటర్లు. తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి గంటన్నర దూరంలో ఉన్న ‘బంకి’ అనే ఊళ్లో ఉంటాయి. వాటిని ‘అరాచండి మైదానాలు’ అని పిలుస్తారు. అక్కడకు ప్రతి సంవత్సరం చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్స్, చక్రవాకాలు (రడీ షెల్డక్)... ఇంకా డజను రకాల పక్షులు వస్తాయి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి–మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతాయి. దేశం కాని దేశం ఎందుకు వస్తాయవి? మనుషుల్ని నమ్మి. ఆ నమ్మకం అందరూ నిలబెట్టుకోరు. కొందరు నిలబెట్టేందుకు నడుం కడతారు. ఆ పన్నెండు మంది ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో నివసించే సూర్యకాంతి మొహంతి అనే గృహిణి ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్లు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అనిపించింది. వెంటనే ఊళ్లో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. ‘అందరం కలిసి పక్షులను కాపాడదాం’ అంది. చాలామంది పట్టించుకోలేదు. ‘లగాన్’ సినిమాలో ఒక్కొక్కరూ దొరికినట్టు కేవలం 12 మంది గృహిణులు అంగీకరించారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక 12 మంది కలిసి ‘అరాచండి పక్షి సురక్షా సమితి’ గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు, కాపలాదారులు, సైనికులుగా మారారు. పక్షుల కోసమని.. ‘ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చే వారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడ్డారు. అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చి హారన్లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించాం. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్లి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమన్నాం. రైతులు మా వేడుకోలును మన్నించారు. పక్షులు ఉన్నంత కాలం ప్రతి రోజూ మేము ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తాం. ప్లకార్డులు ప్రదర్శిస్తాం. చెత్త లేకుండా చూస్తాం’ అంటారు ఈ పన్నెండు మంది గృహిణులు. మొసళ్లు తోడయ్యాయి.. అయితే ఈ స్త్రీలకు మొసళ్లు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటిమడుగుల్లో మొసళ్లు ఉంటాయి. వేటగాళ్లు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ల భయం అడ్డుకుంటోంది. ‘మొసళ్లు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి?’ అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. ‘ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. జంటగా ఉండాల్సిందే’ అంటారు ఈ స్త్రీలు. వీరి సేవకు ప్రభుత్వ మెచ్చుకోలుకన్నా ప్రకృతి ఆశీస్సులు తప్పక దొరుకుతాయి. ఇవి కూడా చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు -
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ధనిక ఆలయం అందులోని నేలమాళిగల్లో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయంటూ వార్తల్లో నిలిచింది కూడా. ఈ గుడికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దేవస్థానానికి సంబంధించిన సరస్సులో 'బబియా' అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలాహారాలు తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు. గుడికి వచ్చే పర్యాటకులు ఈ మొసలిని చూసేందుకు తెగ ఆసక్తి కనబరిచేవారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెరువులో ఉంటోన్న 'బబియా'.. గత ఏడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా.. చనిపోయిన 'బబియా' స్థానంలో మరో కొత్త మొసలి ప్రత్యక్షమైందన్న వార్త ఇప్పుడూ హాట్ టాపిక్గా మారింది. ఓ మిస్టరీలా మరో మొసలి.. బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి 4 రోజుల క్రితం అనూహ్యంగా కనపడింది. నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. ఈ విషయం కాస్తా అధికారులకు వరకు చేరడంతో వారు శనివారం ఆ మొసలిని గుర్తించి.. ఆలయ ప్రధాన పూజారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఐతే ఇది చిన్న మొసలని, ఆలయ పూజారికి విషయం తెలియజేశాం కాబట్టి తదుపరి ఏ చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తారని అన్నారు. ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. కాగా, ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోది. దీని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా తదుపది ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. అయితే ఈ బబియా శాకాహారి, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదు. పైగా ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టదు బబియా. దీనికి "బబియా" అని పేరు ఎవరూ పెట్టారో కూడా ఎవ్వరికీ తెలియదు. అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే.. . ఈ బబియా అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం. (చదవండి: దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?) -
మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..!
బెంగళూరు: కర్ణాటకాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. కరెంటు కోతలు ఎక్కువవుతున్నాయని ఆరోపిస్తూ ఓ మొసలితో స్థానిక సబ్స్టేషన్కి వచ్చారు. కరెంటు ఇస్తారా..? మొసలిని వదలాలా..? అంటూ రోడ్లపైకి ఎక్కారు. కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో క్లిప్ని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ షేర్ చేశారు. ముందుంది ముసళ్ల పండగ అంటే ఇదేనేమో..? అంటూ రాసుకొచ్చారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో 😄 https://t.co/oGp0pJhgZV — KTR (@KTRBRS) October 24, 2023 అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ ఇవ్వడంతో పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి మొసలి పిల్లలు, వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్లో సబ్స్టేషన్కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది.. మొసలిని బంధించి సంరక్షణకేంద్రానికి తరలించారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
చింతల్బస్తీ నాలాలో మొసలి పిల్ల
-
ఖైరతాబాద్లో మొసలి పిల్ల కలకలం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీగా కురిసిన వానకు నాలాలన్నీ పొంగిపొర్లాయి. ఇదే క్రమంలో చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల ఒకటి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. చింతల్ బస్తీలో నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర నాలా వద్ద మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. వెంటనే భయభ్రాంతులకు గురైన స్థానికులు మొసలిని కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. మొసలి పిల్ల అరవడం మొదలుపెట్టడంతో అక్కడివారంతా తలోదిక్కూ పరుగులు తీశారు. అక్కడివారు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి సమాచారమందించారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్డు మీదకు వచ్చిన డ్రైనేజీ నీటి ఉధృతికి మొసలి రోడ్డుపైకి కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు.. -
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. -
భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. గుండె గుభేల్మనిపిస్తున్న వీడియో..!
మనిషి తాను చాలా తెలివైనవాడినని అనుకుంటాడు. అయితే ఎంతటి తెలివైనవాడైనా క్రూరజంతువులకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సివస్తుంది. ఎందుకంటే అవి అత్యంత ప్రమాదకరమైనవి. ఒకవేళ ఇంటికి సమీపంలో ఏదైనా క్రూర జంతువు కనిపిస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక గల్లీలో భూమికి పగుళ్లు కనిపిస్తాయి. అక్కడ సగభాగం లోపలికి, మరో సగభాగం బయటకు ఉన్న మొసలి కనిపిస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ మెసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో కొంచెం ముందుకు వెళితే, భూమిని చీల్చుకువస్తున్న మరో మొసలి కూడా కనిపిస్తుంది. దానిని చూసిన అక్కడున్న జనం భయపడటాన్ని గమనించవచ్చు. ఇలా మరో మొసలి కూడా లోపలి నుంచి వస్తుందని అక్కడున్నవారెవరూ ఊహించలేరు. ఆ మొసళ్లు అక్కడున్నవారిని అమాంతం మింగేద్దామనే రీతిలో బయటకు వచ్చాయి. అయితే అక్కడున్న అధికారులు ఆ మొసళ్లను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలివేశారు. ఈ వీడియో ఏప్రాంతానికి చెందినదో ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. ఈ వీడియోను ట్విట్టర్లో @Figen అనే అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివకూ 2.2 మిలియన్ల వ్యూస్ దక్కగా, 26 వేలమంది వీడియోను లైక్ చేశారు. అలాగే పలువురు యూజన్లు కామెంట్లు కూడా చేశారు. ‘ఈ వీడియో నమ్మశక్యంగా లేదని’ ఒక యూజర్ పేర్కొనగా, మరొక యూజర్ ‘ఇక్కడేం జరుగుతోంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: చెత్తతో 6 చక్రాల వాహనం.. ‘మెకానికల్ గాడిద’ సూపర్ సే ఊపర్ అంటూ కితాబు! OMG what are they doing there?😂pic.twitter.com/jhilcitIeY — Figen (@TheFigen_) August 11, 2023 -
మొసలి దాడిలో ఫుట్బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు? -
వామ్మో.. రోడ్లపైకి మొసళ్లు..!
మహబూబ్నగర్: మండలంలోని గోపల్దిన్నె రిజర్వాయర్కు అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల నుంచి రాత్రిళ్లు మొసళ్లు రోడ్లపైకి వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గోవర్ధనగిరి గ్రామ కత్వా, కామదేనుపల్లి ఊరకుంట సమీపంలో రాత్రి వేళల్లో తరుచూ సంచరిస్తూ రోడ్డుపైనే వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురై కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని గోవర్ధనగిరి, గోపల్దిన్నె, వీపనగండ్ల, రంగవరం గ్రామాల రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపైకి రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే..
ఉత్తరప్రదేశ్లోని లఖీంపుర్ ఖీరీలోని భీరా పోలీస్స్టేషన్ పరిధిలోగల ఫుట్హా గ్రామంలోని ఆ ఇంటిలోని వారంతా ఆ క్షణంలో వణికిపోయి, బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటి బెడ్రూంలోని మంచం కింద రాత్రంతా ఒక భారీ మెసలి నక్కివుంది. ఉదయాన్నే అది వారి కంటపడింది. అంతే ఇంటిలోని వారందరికీ ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వెంటనేవారంతా బయటకు పరుగులు తీశారు. ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ సమాచారాన్ని ఎవరో అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అయితే వారు వచ్చేలోగానే గ్రామస్తులంతా కలసి దానిని ఒక సంచీలో బంధించి నదిలో వదిలివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శారదా నదిలోకి వరదనీరు చేరింది. ఈ నేపధ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకువచ్చిన ఒక మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్ ఇంటిలోనికి ప్రవేశించింది. అది రాత్రంతా మంచం కిందే ఉంది. ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే అతనికి భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. వెంటనే అతను భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే గ్రామస్తులంతా లాలా రామ్ ఇంటికి చేరుకున్నారు. వారు దానిని ఒక సంచీలో బంధించి, తరువాత నదిలో విడిచిపెట్లారు. ఇది కూడా చదవండి: తాజ్మహల్ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ -
గుజరాత్ లో భయానక దృశ్యాలు.. వర్షాలకు రోడ్డెక్కిన మొసళ్ళు
-
మొసలిని పెళ్లి చేసుక్ను మేయర్! ఎందుకో తెలుసా!
మొసలిని పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఆ మొసలిని పరిణయమాడేందుకు సిద్ధయ్యాడు. ఆ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా చేయారు. పెద్ద ఊరేగింపుగా ఊరు ఊరంతా ఉత్సాహంగా పాల్గొని మరీ చేస్తారు. ఈ వింత ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఎందుకిలా చేస్తున్నారు. దీని వెనకున్న రీజన్ ఏమిటంటే.. మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోసా తన ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని పెళ్లి చేసుకున్నాడు. మధ్య అమెరికాలోని మెక్సికోలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. రెండు స్వదేశీ సముహాలు శాంతికి వచ్చిన రోజుకి గుర్తుగా మనిషి మొసలిని పరిణయమాడటం అనేది అక్కడి ఆచారం. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం. ఇది 230 సంత్సరాల నాటి నుంచి వస్తున్న ఆచారం. దీన్ని అక్కడి ప్రజలు ఇప్పటికి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. అందులో భాగంగానే మేయర్ హ్యూగో సోసా ఈ మొసలిని పెళ్లిచేసుకున్నాడు.. భూమాత సస్యమాలంగా ఉండేలా సకాలంలో మంచిగా వర్షాలు పడతాయనేది చరిత్రకారుల నమ్మకమని, అందుకే తాము ఇలా చేస్తుంటామని మేయర్ హ్యూగో సోసా చెబుతున్నాడు. వివాహ వేడుకకు ముందుగా ఈ మొసలిని ఇంటి ఇంటికి ఊరేగింపుగా తిప్పుతారు. ఆ తర్వాత ఆ మొసలిని కూడా అందమైన పెళ్లి కూతురు మాదిరిగా రెడీ చేస్తారు. అలాగే ఆ మొసలి ఆ తంతులో ఎవరిపైన దాడి చేయకుండా ఉండేలా దాని నోటికి తాళం వేస్తారు. ఆ తంతులో మేయర్ ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసి మరీ మొసలిని పరిణయమాడతాడు. ఆ తర్వాత మేయర్ ఆ మొసలితో కలిసి నృత్యం చేయడమే గాక చివరిగా దాని ముద్దాడటంతో పెళ్లి తంతు ముగుస్తుంది. స్థానిక జాలర్లు తమ మేయర్ ఇలా చేయడం కారణంగా తమ వలకు అధిక సంఖ్యలో చేపలు పడతాయని, తమ జీవితాలు మంచిగా మారతాయని ఆనందంగా చెబుతున్నారు. 👰🐊 Como parte de una #tradición, el alcalde de San Pedro Huamelula, #Oaxaca, Víctor Hugo Sosa, se casó con un lagarto llamado princesa Alicia, esto para simbolizar la unión del hombre con lo divino. #México pic.twitter.com/Us8COaHYeL — Luis Gabriel Velázquez (@soyluisgabriel1) July 2, 2023 (చదవండి: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!) -
లెగ్గుపీసే కానీ కోడిది కాదు..
ఏ విషయంలో ముందున్నా లేకున్నా... అన్ని జంతువులను సమభావంతో చూడటంలో చైనీయులు, తైవాన్వాసులు ఎప్పుడూ ముందుంటారు.. అందుకే తినే విషయంలో అదీ ఇదీ అని చూడరు. కనువిందుగా కనిపిస్తే చాలు.. ఏదైనా సరే.. నాలుగు రకాల మసాలాలు కుమ్మేసి.. ఆ నూడుల్స్తో కలిపేసి.. ఎంచక్కా మింగేస్తుంటారు. తైవాన్కు చెందిన విచ్ క్యాట్ అనే రెస్టారెంటోడికి కూడా ఓ మొసలి ఇలాగే కనిపించినట్లుంది. పైగా అక్కడి చెఫ్లకు క్రియేటివిటీ కూడా కాసింత ఎక్కువేనట. అందుకే ఎప్పుడూ చికెన్ లెగ్గుపీసులేనా.. మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని చెప్పి.. మొసలి లెగ్గు పీసుతో ఇదిగో ఈ వంటకాన్ని సిద్ధం చేసేశారు. దీన్ని రుచి చూస్తే. రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయట. అయితే.. రెస్టారెంట్కు వచ్చినోళ్లంతా.. ఫొటోలు తీసుకుంటున్నారు తప్పిస్తే.. దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి.. ఆ ధైర్యం మీకుందా? -
తల్లిదండ్రుల ఎదుటే బాలుడిని తిన్న మొసలి.. కర్రలతో కొట్టి..
బిహార్: బాలున్ని మొసలి తినేసిందనే కోపంతో కుటుంబ సభ్యులు ఆ మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటన బిహార్లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘవాపుర్ దియారా గ్రామానికి చెందిన అంకిత్ కుమార్(14) ఐదవ తరగతి చదువుతున్నాడు. కొత్త బైక్ కొన్న సందర్భంగా బాలుడు బైక్కు పూజ చేయించాలనుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గంగా నది వద్దకు చేరారు. నీటి కోసం నదిలోకి దిగగా.. మొసలి నోట చిక్కాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే బాలున్ని మొసలి తినేసింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బాలున్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మొసలిని నది నుంచి బయటకు లాగారు. అనంతరం దాన్ని తాళ్లతో కట్టి, కర్రలతో కొట్టి చంపారు. 'కొత్త బైక్ కొన్నాము.పూజ చేయించడానికి గంగాజలం కోసం నది వద్దకు వెళ్లాము. అక్కడ మొసలి అంకిత్ను పట్టి నీళ్లలోకి లాక్కెళ్లింది. బాలున్ని రక్షించే ప్రయత్నం చేశాము.. కానీ కొన్ని శరీర భాగాలు మాత్రమే లభించాయి. ఆ మొసలిని బయటకు లాగి చంపేశాము'అని అంకిత్ తాతయ్య చెప్పారు. ఇదీ చదవండి:సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత -
వామ్మో 276 కోట్ల..ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఊర్వశి
-
ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!
ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్పైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్లో తెగ చర్చిస్తున్నారు. దీంతో తాజాగా ఆమె టీమ్ నెక్లెస్ ధరను వెల్లడించింది. (ఇది చదవండి: 'డింపుల్తో డీసీపీ ర్యాష్గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పింక్ కలర్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌతేలా.. ఫేక్ నెక్లెస్ పెట్టుకుని వెళ్లిందని ట్రోల్స్ కూడా చేశారు. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) అయితే ఈ ట్రోల్స్పై నటి బృందం క్లారిటీ ఇచ్చింది. నెక్లెస్ ధర తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ నిదర్శనం.' అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెక్లెస్ అంత ధర ఉంటుందా? జోక్ బాగుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆడిపాడిన ఊర్వశి.. ఇటీవల అఖిల్ ఏజెంట్లోనూ కనిపించింది. -
చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన జరిగింది. కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లిన కెవిన్ డార్మోడీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను కన్పించకపోవడానికి ముందు అరుపులు, కేకలు విన్పించినట్లు అక్కడున్న వాళ్లు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అతనికోసం సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. అయితే కెవిన్ అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ రాక్షస మొసళ్లను గుర్తించారు అధికారులు. అవేమైనా అతడ్ని చంపి తిని ఉంటాయా అనే అనుమానంతో వాటిని షూట్ చేశారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్ల పొడవు ఉండగా.. మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉంది. వీటిలో ఓ మొసలి కడుపులో కెవిన్ మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అతడ్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అని జాలర్లు తెలిపారు. గతంలోనూ ఓ వ్యక్తిని మొసళ్లు చంపాయని వెల్లడించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. కెవిన్ వయసు 65 ఏళ్లు. ఓ హోటల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా కాలంగా చేపలు పట్టడం అలవాటని, ఇందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా బాగా తెలుసుని స్నేహితుడు తెలిపాడు. కానీ కెవిన్ ఇలా చనిపోతాడని అసలు ఊహించలేదన్నాడు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే ఇద్దరూ మృతి -
వైరల్ వీడియో: తల్లి ప్రేమ.. మొసలికే చక్కులు చూపించింది
-
ఆయుష్షు గట్టిదే.. మూడుసార్లు మొసలి దాడి.. నోట్లో కరుచుకొని వెళ్లినా!
కూక్టౌన్(ఆ్రస్టేలియా): మొసలి పలుమార్లు దాడి చేసి, నోట కరుచుకుని నీటి అడుగుకు లాక్కెళ్లిన తర్వాత కూడా ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన శనివారం ఆ్రస్టేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రం కూక్టౌన్లో చోటుచేసుకుంది. నలభయ్యేళ్ల ఓ వ్యక్తి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నాలుగున్నర మీటర్ల పొడవుండే ఓ మొసలి అతడి వైపుగా వచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టి తప్పించుకునేందుకు యత్నించాడు. తన వద్ద ఉన్న స్పియర్ గన్ను పేల్చేందుకు ప్రయత్నించాడు. మొసలి అతడిపై మూడుసార్లు దాడి చేసి తల, భుజాలు, కాళ్లను గాయపరిచి, నోట కరుచుకుని నీటి అడుగుకు లాక్కెళ్లింది. ధైర్యం కోల్పోని ఆ వ్యక్తి తన చేతి వేళ్లతో మొసలి కళ్లలోకి బలంగా గుచ్చాడు. బాధతో అది పట్టు సడలించడంతో సురక్షితంగా బయటపడ్డాడు. గాయాలపాలైన అతడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. -
Viral Video: చిరుతపై మొసలి బీకర దాడి
-
గోదావరిలో మొసళ్లు!.. బెంబేలెత్తుతున్న భక్తులు..
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో మొసళ్ల సంచారం పెరిగింది. శుక్రవారం పుష్కర ఘాట్ వద్ద పెద్ద మొసలి కనిపించడంతో పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు ఒక్క సారిగా బెంబేలెత్తిపోయారు. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో మొసళ్లు కొట్టుకు వచ్చి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మొసళ్ల ఉనికితో నదికి వచ్చే భక్తులతో పాటు జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలు గ్రామాల్లోని చెరువుల్లో మొసళ్లు కనిపించాయి. దీంతో కొన్ని చెరువుల్లో ఇప్పటికీ మత్స్యకారులు చేపలు పట్టడం లేదు. ముప్కాల్ మండల నల్లూర్ ఊర చెరువులో రెండు పెద్ద మొసళ్లు గత ఏడాది నుంచి సంచరిస్తున్నాయి. మెండోరా మండలం బుస్సాపూర్ ఊర చెరువులో రెండు మొసళ్లు ఉండ గా ఒక మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. రెండో మొసలి గురించి ఇప్పటికీ పత్తాలేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ వద్ద కాకతీయ కాలువ పక్కన గల చిన్న చెరువులో మొసలి ఉండటంతో అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా మొసళ్లు అప్పుడప్పుడూ బయటపడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గోదావరిలోని స్నా నాల ఘాట్ వద్ద మొసలి కనిపించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మొసళ్లను గోదావరిలో వదిలి పెడుతున్నాం. గోదావరిలో నీటిలోనే మొసలి ఉంటుంది. సేద తీరడం కోసం ఒడ్డుకు వస్తుంటుంది. అలా వచ్చిన మొసలిని పట్టుకుని మళ్లీ నీరు అధికంగా ఉన్న ప్రాంతంలో వదిలేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – గణేశ్, సెక్షన్ ఆఫీసర్, మెండోరా చెరువుల్లో పట్టి నదిలో వదిలి.. చెరువుల్లో పట్టుకున్న మొసళ్లను ఫారెస్టు అధి కారులు ఎస్సారెస్పీ దిగువన గోదావరిలో వదులు తున్నారు. మెండోరా మండలం బు స్సాపూర్ చెరువులో మే నెలలో జాలరుల వలకు చిక్కిన మొసలిని దూదిగాం శివారు లోని గోదావరిలో వదిలి వేశారు. ఆ సమయంలో నదిలో నీరు కూడా లేదు. అలా వది లేస్తే గోదావరికి పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తుల పరిస్థితి ఏంటని పలువురు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం దూదిగాం శివారులో జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చి నానా హంగామా చేసింది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడో చెరువుల్లో దొరికిన మొసళ్లను పట్టుకు వచ్చి గోదావరిలో వదిలి వేస్తున్నారని, తిరిగి అవే మొసళ్లు చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయని గ్రామీ ణులు ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్ర సోమవారాల్లో గోదావరిలోకి స్నానానికి భక్తులు, నిత్యం బట్టలు ఉతుక్కోవడానికి గ్రామస్తు లు వెళ్తుంటారు. మొసళ్ల వలన ప్రమాదాల భారిన పడితే ఎవరు దిక్కు అని ప్రశి్నస్తున్నారు. పట్టుకున్న మొసళ్లను జంతు ప్రదర్శన శాలకో, జంతువుల పెంపకం ప్రదేశాలకో పంపించాలని కోరుతున్నారు. -
ఇంట్లో మొసలి కలకలం... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....
ఒక మొసలి అనుహ్యంగా ఒక గ్రామంలోని రాత్రివేళ ఇంటిలోకి ప్రవేశించింది. ఎలా వచ్చిందో ఏమో గానీ దాని ఎంట్రీతో ఆ కటుంబం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ జాగారం చేస్తూ గడిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఇటావాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని హర్మామ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం. ...రాత్రి 10.గంటల సమయంలో వాళ్ల అమ్మ అరుపుతో తన కుమార్తె గది తలుపు తెరిచింది. అంతే ఆ సమయంలో ఈ మొసలి లోపలికి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో తమకు తెలియదని తమ మేకలు చప్పుడు చేయడంతో ఏదో జరిగినట్లు అనుమానం వచ్చిందని ఇంటి యజమాని చెబుతున్నాడు. తీరా చూస్తే మొసలి దీంతో తాము భయపడి పోలీసులకు సమాచారం అందిచామని చెప్పాడు. పోలీసులు స్థానికి వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ త్రిపాఠికి సమాచారం అందించారు. అతను ఇంటికి తాళం వేసి బయటకు వచ్చేసి ఉండమని చెప్పారు. దీంతో వారంతా అలానే చేసి రాత్రంతా జాగారం చేస్తూ ఇంటి బయటే కూర్చొన్నారు. ఈ వార్త ఆ గ్రామంలోని స్థానికులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో జనాలు సదరు యజమాని ఇంటి వద్ద గుమిగూడారు. ఈ మేరకు పోలీసులు, డాక్టర్ త్రిపాఠి ఇక గంటపాటు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఆ మొసలిని పట్టుకున్నారు. అనంతరం ఆ మొసలిని అటవీశాఖకు అప్పగించారు. ఐతే ఈ మొసలి పెద్దది కాదని బాల్యదశలో ఉందని చెప్పారు. రాత్రి సమయంలో ఈ మొసలి చాలా దూకుడుగా ఉంటుందని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించలేదని డాక్టర్ త్రిపాఠి చెప్పారు. పక్కనే ఉన్న కాలువ నుంచి రాత్రిపూటా ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిపారు. (చదవండి: వాట్ ఏ సెల్ఫీ! ఎంతా బాగా ఫోజ్ పెట్టిందో...) -
రేయ్.. అది పెళ్లామో.. గర్ల్ ఫ్రెండో కాదు!
పుర్రెకో బుద్ధి.. మనిషి తీరు ఒక్కోసారి బహు విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఓ ట్విట్టర్ వీడియో. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీతంగా వైరల్ అవుతోంది. విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతుంటుంది. ఆ కోవకు చెందిన ఓ వ్యక్తే.. అంటూ బోర్న్ఏకాంగ్ అనే ట్విట్టర్ థ్రెడ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలోనూ వైరల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి.. Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk — Lance🇱🇨 (@BornAKang) October 18, 2022 వీడియో ఒక ఎత్తయితే.. ఆ వీడియో కింద కనిపించే కామెంట్లు మరో ఎత్తు. అది పెళ్లామో .. గర్ల్ఫ్రెండో కాదని, మొసలికి నీళ్లలో బలం ఎక్కువని, తేడా వస్తే పని అంతేఅని కొందరు.. ఆ మొసలికి అతను బాగా నచ్చి ఉంటాడని మరికొందరు.. ఇలా కామెంట్ల పర్వం హిలేరియస్గా ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
Hyderabad Heavy Rains: హైదరాబాద్లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement