-
అమెజాన్ సేల్లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో స్మార్ట్వాచ్లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్బడ్స్పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్లో అన్నీ రకాల ప్రొడక్ట్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్ప్లస్తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్ ట్యాప్ ఆర్డర్ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్ కంపెనీని డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్ ఎచ్ఛేంజ్ చేయమని కోరుతుంటుంటాం. ఓ యూజర్ టాటా క్లిక్ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్. కామ్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. Tata Cliq Luxury is out here defrauding customers of their hard-earned money. I've lost my money, but pls save yourselves from being scammed. I ordered New Balance sneakers, they sent a pair of slippers, now refusing to refund money saying quality check failed @TATACLiQLuxury pic.twitter.com/6ktajmB8r7 — Ripper (@Ace_Of_Pace) March 7, 2024 ఖరీదైన షూ బదులు చెప్పులు వినియోగదారుడు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్ బదులు సాధారణ స్లిప్పర్లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్ లగ్జరీ రిఫండ్ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు. తస్మాత్ జాగ్రత్త ‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్.కామ్లో పోస్ట్ చేశారు. Your disappointment with our products and services hurts us the most, and we deeply apologize for the hassle it has caused you. We request you to share the order details via the below DM link, so we can check and provide further assistance. ^AB (1/2) — TATA CLiQ Luxury (@TATACLiQLuxury) March 7, 2024 దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం చేస్తామనంటూ టాటా క్లిక్ లగర్జీ అధికారికంగా తెలిపింది. -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్కార్ట్లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ పూర్తిగా వాల్మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్ను అందించనుందని తెలిసింది. ‘ఆప్డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్కార్ట్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
అమ్మకానికి అమెజాన్ పుట్టినిల్లు.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం!
జెఫ్బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1994లో జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్లు కలిసి అమెరికాలోని సియోటెల్లో ఒకే అంతస్తులో మూడు పడకగదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దాన్ని కార్యాలయంగా మార్చారు. అక్కడే అమెజాన్ సంస్థ పురుడు పోసుకుంది. ఆన్లైన్లో పుస్తకాలు అమ్మేలా ఓ వేదికగా ప్రారంభమై ఇప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఐదవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో ఉన్న జాన్ వైన్రైట్ అనే ఆస్ట్రేలియన్ ఐటీ ఉద్యోగికి అమెజాన్ ‘ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్: కంప్యూటర్ మోడల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ మెకానిజమ్స్ ఆఫ్ థాట్’ అనే మొదటి పుస్తకాన్ని అమ్మింది. అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దాని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ను 1.6 ట్రిలియన్లని అంచనా ఇలా ఎన్నో మైలురాళ్లను తనఖాతాలో వేసుకున్న జెఫ్బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1,540-చదరపు అడుగుల (143-చదరపు మీటర్ల) ఇంటి ప్రస్తుతం ధర 2.3 మిలియన్లగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేందుకు జెఫ్బెజోస్ సిద్ధమవ్వగా.. దాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగులో దారులు ఎగబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ఉడాన్లో కీలక పరిణామం..ఇంటర్ గ్లోబ్ సీఈఓగా ఆదిత్య పాండే
ప్రముఖ బీ2బీ ఈకామర్స్ కంపెనీ ఉడాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా పాండే ఏవియేషన్ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓ నియమితులయ్యారు. మార్చి 1, 2024 నుండి విధులు నిర్వహించనున్నారు. గతంలో ఇండిగోలో పనిచేసిన అనుభవం కారణంగా ఇంటర్గ్లోబ్ యాజమాన్యం సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించింది. వ్యూహాత్మక వ్యాపారం, కార్పొరేట్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి బాధ్యతలు చూసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాండే ప్రొడక్టివీటీ, ప్రాఫిట్ వంటి విభాగాల్లో దృష్టిసారిస్తూ వివిధ కంపెనీలలో వ్యాపార వ్యూహం, ఆర్ధిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. గతంలో పాండే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఉడాన్లో చేరారు. తాజాగా ఉడాన్ నుంచి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సీఈఓగా పదోన్నతి సాధించారు. ఇక,ఉడాన్లో పాండే స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా.. బదులుగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు అదనపు ఫైనాన్స్ బాధ్యతలను అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
‘ఆన్లైన్ షాపింగ్ చేయొద్దనేది ఇందుకే’..కళ్లు బైర్లు కమ్మేలా
ఆన్లైన్లో ల్యాప్ట్యాప్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి ఫ్లిప్కార్ట్ ఝలక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ యూజర్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.1.13 లక్షల విలువైన ల్యాప్టాప్ను కొనుగోలు చేశాడు. బదులుగా ఫ్లిప్కార్ట్ తనకు పాత, డొక్కు ల్యాప్ట్యాప్ను పంపిందని వాపోయాడు. ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నప్పుడే ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే బయపడాల్సి వస్తుందని అంటున్నాడు. ‘రిపబ్లిక్ డే సేల్లో లక్షకు పై ధరలో ఫ్లిప్కార్ట్లో ఆసుస్ ల్యాప్టాప్ని ఆర్డర్ చేశాను. కానీ ఫ్లిప్కార్ట్ నాకు పాత ల్యాప్ట్యాప్ను పంపింది. అందుకే ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ నుండి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్లను నమ్మకండి అంటూ బాధితుడు సౌరో ముఖర్జీ వీడియోను ఎక్స్.కామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌరౌ ముఖర్జీ జనవరి 13న రూ.1.13లక్షలు విలువ చేసే ల్యాప్ట్యాప్ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మరుసటి రోజే ల్యాప్ట్యాప్ చేతికి వచ్చింది. వెంటనే సౌరౌ తాను పార్శిల్ను ఓపెన్ చేస్తానని, వీడియో తీయాలని సదరు డెలివరీ బాయ్ను కోరాడు. చెప్పినట్లుగానే డెలివరీ బాయ్ పార్శిల్ను వీడియో తీస్తుంటే ముఖర్జీ దానిని ఓపెన్ చేసి చూస్తాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతనికి కళ్లు బైర్లు కమ్మేలా.. తాను ఖరీదైన ల్యాప్ట్యాప్ బుక్ చేస్తే..మట్టికొట్టుకుపోయిన పాత ల్యాప్ట్యాప్ వచ్చినట్లు గుర్తిస్తాడు. ల్యాప్ట్యాప్ ఓపెన్ చేసి నేను బ్లాక్ ల్యాప్టాప్ని ఆర్డర్ పెట్టాను’ అని ముఖర్జీ వీడియోలో చెబుతుంటే పక్కనే ఉన్న డెలివరీ ఏజెంట్ మాటకలుపుతూ ఇది ఉపయోగించిన ల్యాప్ట్యాప్లా ఉందని అని అంటున్న సంభాషణలు స్పష్టంగా వినపడుతున్నాయి. I ordered a brand new Asus Laptop from Flipkart in this Republic Day sale and I received some old discarded laptop. Never trust products ordered from online platforms. @flipkartsupport @Flipkart #flipkartscam pic.twitter.com/EMEBBhnh2V — Souro Mukherjee (Gutenberg) (@souro9737) January 14, 2024 ఇక ల్యాప్ట్యాప్ పార్శిల్ ఓపెన్ చేసిన అనంతరం ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఇలా వీడియోలు తీసుకోవడం మంచిదని, నకిలి పార్శిళ్ల నుంచి సురక్షితంగా ఉంచేలా అవి మనల్ని కాపాడుతాయని అని అన్నాడు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులకు ఎక్స్.కామ్లో ట్యాగ్ చేశాడు. కొత్త ల్యాప్ట్యాప్ను కొనుగోలు చేసే పాత ల్యాప్ట్యాప్ను పంపారని మెసేజ్ చేయగా.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. సంబంధిత వివరాల్ని పంపమని మెసేజ్ చేసింది. -
లాభాలు లేక చేతులెత్తేసిన అమెజాన్.. మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కొత్త ఏడాది 2024లో చేతులెత్తేసింది. ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ పేరెంట్ కంపెనీ వీడియో లైవ్ స్ట్రీమ్ సర్వీసులు అందించే ‘ట్విచ్’ ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం..అమెజాన్ ట్విచ్లో 35 శాతంతో 500 మంది ఉద్యోగల తొలగింపులపై నిర్ణయం తీసుకుంది. వీడియో లైవ్ స్ట్రీమ్ సేవలు మరింత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ సైతం ట్విచ్లో ఉన్నత స్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరిగా సంస్థను వదిలి వెళ్లిన తర్వాత తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది. ఒక్కొక్కరిగా గత ఏడాదిలో ట్విచ్లో టాప్ ఎగ్జిక్యూటీవ్లు ఆ సంస్థకు గుడ్బై చెప్పారు. వారిలో ట్విచ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ కస్టమర్ ఆఫీసర్, చీఫ్ కంటెంట్ ఆఫీసర్తో పాటు గతంలో అమెజాన్ యాడ్స్ యూనిట్లో పనిచేసిన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సైతం ట్విచ్కు రాజీనామా చేశారు. తాజాగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారణం అదే డిసెంబర్లో ట్విచ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ క్లాన్సీ దక్షిణ కొరియాలో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తుందని, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్టుబడులు ఎక్కువ పెట్టడం.. తిరిగి రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగుల్ని తొలగించింది.ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ‘‘ట్విచ్ నెలకు 1.8 బిలియన్ గంటల ప్రత్యక్ష వీడియో కంటెంట్కు సపోర్ట్ చేసేలా భారీ స్థాయిలో వెబ్సైట్లను నిర్వహించడం చాలా ఖరీదైనవని అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అమెజాన్ 2014లో వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు అందించే ట్విచ్ను 970 మిలియన్ డాలర్లను వెచ్చించి ఆ సంస్థను కొనుగులో చేసింది. ఈ కొనుగోలు జరిగిన తొమ్మిదేళ్లకు ట్విచ్తో పాటు లాభదాయకంగా లేదని ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసిందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఏమాత్రం లాభం లేని ట్విచ్లో నష్టాల్ని తగ్గించుకునేందుకు అమెజాన్ గత ఏడాది రెండు సార్లు 400 మందిని తొలగించింది. తాజాగా మరో 500 మందిని ఇంటికి పంపింది. అమెజాన్లో 27 వేల మంది ఉద్యోగులు ఆన్లైన్ రిటైల్ దిగ్గజం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 27వేల మందికి ఫైర్ చేసిన విషయం తెలిసిందే. -
ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్లో డిస్కౌంటే డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్లో రిపబ్లిక్డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic day Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్లో భాగంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్లో కస్టమర్లు అర్హులైన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం ఎప్పుడనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం సేల్ అప్పుడే ప్రారంభమవుతుందని యూజర్లు భావిస్తున్నారు. 50 వేల వరకు డిస్కౌంట్ రాబోయే సేల్లో అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్లు ప్రారంభ ధర రూ. 9,999కే అమ్ముతుండగా.. పలు ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై రూ.50వేల వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. 75 శాతం.. 65 శాతం డిస్కౌంట్ అదేవిధంగా, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు 75 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది. -
రూ.2800 కోట్లు సమీకరించినా ఉద్యోగుల తొలగింపు.. కారణం ఇదేనా..
ఈ-కామర్స్ యునికార్న్ ఉడాన్ రూ.2800 కోట్ల మూలధనాన్ని సమీకరించిన తర్వాత తాజాగా 150 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఉడాన్ తన సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, తాజా నిధులతో ఇతర సంస్థలతో తమ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రణాళిక వేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు కంపెనీలోని ఎఫ్ఎంసీజీ బృందం దేశవ్యాప్తంగా పనిచేసేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ ప్రస్తుతం క్లస్టర్ వారీగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడానికి భారీగా పెట్టుబడులు పెట్టామని, వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి, స్థిరంగా వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అందులో భాగంగా కంపెనీ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కంపెనీ తాజాగా నవంబర్లో రూ.990 కోట్లమేర కన్వర్టబుల్ నోట్లను సేకరించిన తర్వాత ఉడాన్ 10 శాతం ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. కంపెనీ కార్యకలాపాల్లో వస్తున్న మార్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2800 కోట్లమేర నిధులు సమీకరించింది. గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. ఇదిలా ఉండగా 2025లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)గా స్టాక్మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉడాన్ను 2016లో ముగ్గురు ఐఐటీ పూర్వ విద్యార్థులు అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా స్థాపించారు. వీరు గతంలో ఫ్లిప్కార్ట్లో పనిచేశారు. -
ఉడాన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్లో భాగంగా ఎంఅండ్జీ పీఎల్సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి. బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్కార్ట్లో 80 శాతం భారీ డిస్కౌంట్కే..
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ప్రారంభించింది. డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగే సేల్లో 80 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇయర్ ఎండ్ సేల్స్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సహా పలు కేటగిరీల్లోని ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఫ్లిప్కార్ట్ హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్, క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పొందవచ్చు. ఐఫోన్14 రిటైల్ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్ 40 పైనా ఫ్లిప్కార్ట్ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30ఐ ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్2 ధర రూ.39,999 కాగా.. తాజా సేల్లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్కి బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్కి బంపరాఫర్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లను తక్కువ ధరకే అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తెలిపింది. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఎక్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలుపుకుని రూ.30,000లోపే దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్ ధర రూ.49,900 ఉండగా రూ.40,999కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తుంది. ఈ ఫ్లాట్ఫామ్ ద్వారా చేసే ఐఫోన్ కొనుగోలుపై 17 డిస్కౌంట్ను పొందవచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉండగా.. దీని ధర మరింత తగ్గనుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీబ్యాంక్ క్రిడెట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై ఈఎంఐలో ఐఫోన్ను కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే దానిని ఇచ్చేసి ఈ యాపిల్ ఫోన్ను ఎక్ఛేంజ్ కింద తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 అమ్మకాలు నిలిపివేత ఈ ఏడాది సెప్టెంబరులో ఫ్రాన్స్ అధికారులు ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 12 అనుమతించిన దానికంటే ఎక్కువ రేడియేషన్ను విడుదల చేస్తుంది. అయితే, ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించాయని యాపిల్ తనను తాను సమర్థించుకుంది. టెక్ దిగ్గజం ఫ్రాన్స్లోని ఐఫోన్ 12 వినియోగదారుల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ప్రోటోకాల్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ అప్డేట్ను కూడా విడుదల చేసింది. అదే సమయంలో , ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ ఎక్స్పోజర్ పరిమితులను ఉల్లంఘించినందున దేశంలో ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్ 12 అక్కడ అమ్ముడవుతుందో లేదో తెలుసుకునేందుకు తమ ఏజెంట్లను యాపిల్ స్టోర్లకు పంపుతామని ఆ దేశ అధికారులు చెప్పారు. అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫోన్ ఇప్పటికీ విక్రయిస్తున్నట్లు గుర్తించేతే ఇప్పటికే వినియోగదారులకు విక్రయించిన ఫోన్లను రీకాల్ చేస్తామని వారు తెలిపారు. -
కొనుగోలు దారులకు బంపరాఫర్.. ఈ ప్రొడక్ట్లపై 85 శాతం డిస్కౌంట్!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, ఆఫ్లైన్ దుకాణాలు అమ్మకాలు పెంచుకునేందుకు మరో విడత డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ ఫ్రైడే (నవంబర్ 24), సైబర్ మండే (నవంబర్ 27) సందర్భంగా మంచి డీల్స్ను ప్రకటిస్తుండడం కనిపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని ఈ కామర్స్ సంస్థలు, ప్రముఖ బ్రాండ్లు, రిటైలర్లు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మరోసారి అదే విధమైన వాతావరణం నెలకొంది. పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్, బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. అదే విధమైన సంస్కృతి క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. టాటా గ్రూప్లో భాగమైన ఈ కామర్స్ సంస్థ టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ, టాటా క్లిక్ ప్యాలెట్ బ్లాక్ ఫ్రైడే సందర్భంగా భారీ ఆఫర్లతో డీల్స్ను ప్రకటించాయి. ‘థ్యాంక్స్ గాడ్, ఇట్స్ బ్లాక్ ఫ్రైడే’ అనే ట్యాగ్లైన్ వేశాయి. వస్త్రాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఆభరణాలు, వాచ్లపై ఆఫర్లు తీసుకొచ్చాయి. టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ నవంబర్ 22 నుంచి 27 వరకు ఈ సేల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. టాటా క్లిక్ ప్యాలెట్ అయితే ఈ నెల 17 నుంచి 27 వరకు సేల్స్ను చేపట్టింది. ‘‘బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నది ఎంతో ఆసక్తికరమైన కార్యక్రమం. వినియోగదారులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆఫర్లు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లపై అందిస్తున్నాం’’అని టాటా క్లిక్ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. పండుగల అమ్మకాలు క్రిస్మస్, నూతన సంవత్సరం వరకూ కొనసాగుతాయని టాటా క్లిక్ అంచనా వేస్తోంది. హ్యూగో బాస్, జిమ్మీ చూ తదితర బ్రాండ్లపై 85 శాతం వరకు తగ్గింపును టాటా క్లిక్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సైతం.. అమెజాన్ బ్యూటీ సైతం బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సందర్భంగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు ‘ద బ్యూటీ సేల్’ను నిర్వహిస్తోంది. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులపై 60 శాతం వరకు, లగ్జరీ బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 300 బ్రాండ్లపై 8,000 డీల్స్ను ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 8పీఎం డీల్స్ పేరుతో అర్థరాత్రి వరకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. ‘‘చర్మ, శిరోజాల సంరక్షణపై గడిచిన్న కొన్నేళ్లలో భారత వినియోగదారుల్లో ఎంతో అవగాహన పెరుగుతుండడం గమనించాం. దీంతో ప్రీమియం ఉత్పత్తుల కోసం చేసే ఖర్చు పెరిగింది’’అని అమెజాన్ ఇండియా సౌందర్య ఉత్పత్తుల విభాగం డైరెక్టర్ జెబా ఖాన్ తెలిపారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకు, ఫర్నిచర్పై 75 శాతం వరకు తగ్గింపుతో కూడిన టాప్ డీల్స్ను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. -
షాపింగ్ వైపే భారతీయుల చూపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్ప్లేస్ వేదికలు విస్తరించినప్పటికీ రిటైల్ స్టోర్లకు వెళ్లడం భారతీయులకు అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ విధానంగా నిలిచింది. ఇన్–స్టోర్ షాపింగ్ జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఉత్పత్తిని ముట్టుకోవడం, అనుభూతి చెందగల అవకాశం ఉండడమే. ఉత్పత్తుల ఖచ్చితమైన ప్రామాణికత, నాణ్యత కారణంగా ఆఫ్లైన్ షాపింగ్ను దాదాపు 54 శాతం మంది ఇష్టపడుతున్నారని డిజిటల్ రుణ సంస్థ నౌగ్రోత్ సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25కుపైగా నగరాల్లో సుమారు 3,000 మంది వర్తకులు, కొనుగోలుదార్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. కుటుంబంతో షాపింగ్.. హోమ్ డెలివరీని వినియోగదార్లు కోరుకుంటున్నారు. ఇంటికి సరుకులు పంపాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారని 60 శాతం విక్రేతలు తెలిపారు. దాదాపు సగం మంది తమ స్థానిక స్టోర్లకు విధేయులుగా ఉన్నారు. ఒక కుటుంబంలోని అనేక తరాలు తరచుగా ఒకే రిటైలర్ నుండి షాపింగ్ చేయడం వల్ల విశ్వాసం, పరిచయానికి దారి తీస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి స్థానిక రిటైలర్ నుండి 35 శాతం మంది భారతీయులు షాపింగ్ చేస్తున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది కస్టమర్లు రిటైల్ స్టోర్లో కుటుంబ షాపింగ్ అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో స్టోర్లకు వినియోగదార్లు అధికంగా వస్తున్నారు. ఫ్లాష్ సేల్స్ సమయంలో.. భారతీయ కొనుగోలుదార్లలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్ విక్రయ ప్లాట్ఫామ్లలో ప్రత్యేకంగా షాపింగ్ చేస్తున్నారు. 26 ఏళ్లలోపు ఉన్న జెన్–జీ కస్టమర్లలో 14 శాతం మంది పూర్తిగా ఆన్లైన్ను ఎంచుకుంటున్నారు. 43–58 మధ్య వయసున్న జెన్–ఎక్స్ వినియోగదార్లలో కేవలం 5 శాతం, 27–42 మధ్య వయసున్న మిల్లేనియల్స్లో 11 శాతం మంది ఆన్లైన్ వేదికగా షాపింగ్ చేస్తున్నారు. ఫ్లాష్ సేల్స్, ఈ–కామర్స్ కంపెనీల ద్వారా అధిక తగ్గింపులను అందించే సమయాల్లో ఆన్లైన్లో ఎక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి. ఫ్లాష్ సేల్స్ సమయంలో మాత్రమే ఆన్లైన్ షాపింగ్ను 35 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఈ–కామర్స్తో ముప్పు లేదు.. తమ కార్యకలాపాలకు ఈ–కామర్స్తో ఎటువంటి ముప్పు లేదని 80 శాతంపైగా వర్తకులు ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ విక్రయ వేదికలు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని 18 శాతం మంది వెల్లడించారు. భారత్లో ఎఫ్ఎంసీజీ, రిటైల్ అమ్మకాల్లో ఆఫ్లైన్ వాటా ఏకంగా 97 శాతం ఉంది. ఫుడ్, బెవరేజ్ విభాగంలో 95 శాతం, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో ఆఫ్లైన్ 93 శాతం కైవసం చేసుకుంది. దాదాపు 60 శాతం మంది రిటైలర్లు భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ సహాయంతో రిటైల్ స్టోర్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. 70 శాతం మంది రిటైలర్లు తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ఔట్లెట్లను తెరవాలని యోచిస్తున్నారు. -
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ అయ్యారు. జెఫ్బెజోస్ 1994లో అమెరికాలోని న్యూయార్క్ నగరం సియాటెల్కు చెందిన ఓ గ్యారేజీలో అమెజాన్ సంస్థను ప్రారంభించారు. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా ఆ సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా బెజోస్ను నిలబెట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఫ్లోరిడా మయామికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెజాన్.కామ్ ఆఫీస్ మొత్తం చూసేందుకు మీకు ఎక్కువ సమయం పట్టదు అంటూ సియోటెల్ గ్యారేజీలో అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో తీసుకున్న వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) ఆప్పట్లో అమెజాన్ను స్థాపించిన సమయంలో తన ఆఫీస్ ఎలా ఉందో చూడండి అంటూ బెజోస్ తన ఆఫీస్ను చూపిస్తుండగా.. ఆ వీడియో తీస్తున్న బెజోస్ తండ్రి ఉత్సాహపరుస్తున్నట్లు వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న సంభాణల్ని మనం వినొచ్చు. అయితే బెజోస్ హైస్కూల్ విద్యార్ధిగా ఉన్న సమయంలో నివసించిన మయామి ప్రాంతానికి తన తల్లిదండ్రుల కోసమే సియోటెల్ని వదిలి వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ కార్యకలాపాలు ఎక్కువగా ఫ్లోరిడా కేప్ కెనావెరల్ నుంచి కొనసాగుతున్నాయి. ఆ స్పేస్ పనులు దగ్గరుండి చూసుకునేందుకు వీలు కలుగుతున్నట్లు వెల్లడించారు. బిలియనీర్ బంకర్లోని జెఫ్ బెజోస్ ఇంటి ప్రత్యేకతలు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న జెఫ్బెజోస్ ఫ్లోరిడాలోని బిలియనీర్ బంకర్ ద్వీపంలో తన 68 మిలియన్ల విలువైన ఎస్టేట్కు పక్కనే ఉన్న భవనాన్ని 79 మిలియన్లు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు తర్వాత సియోటెల్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2000లో నిర్మించిన 19,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖరీదైన ఇల్లు, ఏడు బెడ్రూమ్లు, 14 బాత్రూమ్లు, ఒక కొలను, థియేటర్, లైబ్రరీ, ఒక వైన్ సెల్లార్,మెయిడ్స్ క్వార్టర్స్ మరియు ఆరు గ్యారేజ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్లో బిలియనీర్ బంకర్ ద్వీపంలో మరో ప్రాంతంలో కొనుగోలు చేసిన 9,259 చదరపు అడుగుల మాన్స్లో కేవలం మూడు బెడ్రూమ్లు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. చదవండి👉 చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్కు జాక్ పాట్! -
ఉద్యోగం నుంచి తొలగించింది.. మళ్లీ చేరొచ్చంటూ 4 సార్లు ఆఫర్, రిజెక్ట్ చేసిన ఉద్యోగి!
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ చరిత్రలోనే తొలిసారి ఈ ఏడాది ప్రారంభంలో 18,000 మందిని ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అ తర్వాత సైతం పలు రౌండ్లలో సిబ్బందిని ఇంటికి సాగనంపింది. అయితే, వారిలో కొంతమందిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకుంది. అలా ఓ ఉద్యోగిని తొలగించిన అమెజాన్ తిరిగి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలైమంది. అమెజాన్లో మళ్లీ చేరడాన్ని ససేమిరా అన్నాడు. ఇప్పుడు ఇదే అంశం దిగ్గజ టెక్ కంపెనీల్లో హాట్ టాపిగ్గా మారింది. ఆర్ధిక అనిశ్చితి, సంస్థ పునర్నిర్మాణం, కాస్ట్ కటింగ్, పలు జాతీయ అంతర్జాతీయ సమస్యల కారణంగా అనేక చిన్న చిన్న స్టార్టప్ల నుంచి దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు ఈకామర్స్ సేలవందించే అమెజాన్ సైతం వర్క్ ఫోర్స్ని తగ్గించుకోక తప్పలేదు. మెల్లిమెల్లిగా పరిస్థితులు చక్కబడుతుండడం, మార్కెట్లో డిమాండ్ పెరిగిపోవడం, కొత్త ప్రాజెక్ట్లు క్యూ కట్టడంతో పలు కంపెనీలు తొలగించిన ఉద్యోగుల్ని మళ్లీ తిరిగి విధుల్లోకి (Re Hiring) తీసుకుంటున్నాయి. సాధారణంగా ‘మీ సేవలు చాలు ఇక వెళ్లిపోండి’ అంటూ తొలగించి.. మళ్లీ రీజాయిన్ చేయించుకుంటామని రెడ్ కార్పెట్ పరిస్తే.. ఆర్ధిక అనిశ్చితితో ఎవరైనా సరే సంస్థ ఇచ్చిన ఆఫర్ వైపు మొగ్గు చూపుతారు. కానీ, బిజినెస్ అనలిస్ట్గా పనిచేసిన ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి అలా కాదు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ జనవరిలో కంపెనీ తనకి పింక్ స్లిప్ ఇచ్చింది. ఆ తర్వాత అతని స్కిల్స్ చూసి ముచ్చట పడి.. తిరిగి వెనక్కి తీసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. సదరు ఉద్యోగి మాత్రం ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ నాలుగు సార్లు కంపెనీ ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేశారు. ఎందుకని? ప్రశ్నిస్తే అమెజాన్లో పని చేసే సమయంలో తాను ఎలాంటి సంతృప్తి చెందలేదని సమాధానం ఇచ్చారు. అందుకు కారణాల్ని వివరించారు. మేనేజర్ మాటలు పచ్చి అబద్ధం ఈ ఏడాది జనవరిలో సదరు ఉద్యోగిని అమెజాన్ ఫైర్ చేసింది. అందుకు గానూ రెండు నెలల వేతనం ఇస్తామని మెయిల్ పంపింది. అంతవరకు బాగున్నా.. ఆ మెయిల్లో తన మేనేజర్..‘మీ పనితీరు అమోఘం. మిగిలిన సభ్యులతో పోలిస్తే మీలో ఉన్న స్కిల్స్ అద్భుతం.. ఉద్యోగ భద్రత గురించి మీరేం ఆలోచించొద్దు’ అంటూ కొన్ని హామీలు ఇవ్వడం షాక్ గురి చేసింది. ఎందుకంటే? అది నిజం కాదని తర్వాత తేలింది. సంస్థ (అమెజాన్) లేఆఫ్స్పై మేనేజర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదు కాబట్టి. తొలగింపుకు రెండు నెలల ముందు తొలగింపులకు రెండు నెలల ముందు, ఉద్యోగులు తమ పని, ప్రాజెక్ట్లను డాక్యుమెంట్ చేయమని అమెజాన్ కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే, మేనేజర్లు ‘నేను చేసిన పనిలో మార్పులు చేయడం, నా పేరుకు బదులు వారి పేరు ఎంట్రీ చేయడం, అసలు తాను చేసిన ప్రాజెక్ట్లో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా.. ఆ ప్రాజెక్ట్లో తామే కీరోల్ పోషించామని చెప్పుకోవడం, ఆ పనికి నాకు సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేశారని’ వాపోయారు సంస్థే గుర్తించలేదు ఆ తర్వాత కొద్ది కాలానికి తొలగించిన ఉద్యోగులకు అమెజాన్ ఇతర సంస్థల్లో అవకాశాలు కల్పించింది. తిరిగి సంస్థలోకి తీసుకుంది. అందులో లేఆఫ్స్ గురైన ఈ మాజీ ఉద్యోగి కూడా ఉన్నాడు. ‘నా మేనేజర్ ఎప్పుడూ నీ మంచి కోరే వాడిని అని ఎప్పుడూ చెబుతుండే వారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇది నాకు చెంప దెబ్బలాంటిది’ అని పేర్కొన్నారు. చివరిగా.. అమెజాన్లో ఉద్యోగం కోల్పోయినా.. ఇతర సంస్థల్లో ఉన్నత ఉద్యోగం సంపాదించే టాలెంట్ నాలో ఉంది. సంస్థే అది గుర్తించలేదు. నాలుగు సార్లు కంపెనీలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ నేనే అమెజాన్లో చేరలేదంటూ తన సోషల్ మీడియా పోస్ట్ని ముగించాడు. చదవండి👉 మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్ -
ఫ్లిప్కార్ట్ నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం భారీగా పెరిగి రూ. 4,891 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,371 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం స్టాండెలోన్ నష్టాలు సైతం 44 శాతం పెరిగి రూ. 4,839 కోట్లను దాటాయి. అంతక్రితం రూ. 3,362 కోట్ల నష్టం ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ఆదాయం 9 శాతంపైగా ఎగసి రూ. 56,013 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం ఆదాయం రూ. 51,176 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ. 60,858 కోట్లకు చేరాయి. -
‘బిగ్ దసరా సేల్’లో అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది. దసరా సేల్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. -
‘ఇంట్లోనే కూర్చోండి’.. ఉద్యోగులకు అమెజాన్ హెచ్చరిక!
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని అతిక్రమించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సమస్య తీవ్రతను బట్టి లేఆఫ్స్ ప్రకటిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ ఇటీవల సంస్థలో రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు సార్లు ఆఫీస్ రావాల్సిందేనని పట్టు బట్టింది. అయితే, సుదీర్ఘ కాలంలో ఇంటి వద్ద నుంచే పనిచేసిన సిబ్బంది ఆఫీస్కు వచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం, వారానికి 3 రోజులు కూడా ఆఫీస్కి రాకపోతే ఎలా? అని ప్రశ్నించింది. పైగా ఆఫీస్కి వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగుల్ని తొలగించే వెసులుబాటును మేనేజర్లకు కల్పించింది. తొలగింపులపై ఇంటర్నల్గా వర్క్ ఫోర్స్కి సమాచారం అందించే పోర్టల్ నోటీసుల్లో పేర్కొన్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. ఆ నోటీసుల్లో రిటర్న్ టూ ఆఫీస్, ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా లేని ఉద్యోగులతో మూడు దశల్లో వ్యవహరించాల్సిన తీరును పొందుపరిచింది. మొదటి దశలో, మేనేజర్లు వారానికి మూడు సార్లు ఆఫీస్కు వచ్చే అవసరాన్ని పాటించని ఉద్యోగులతో వ్యక్తిగతంగా మాట్లాడి భవిష్యత్ కార్యచరణను రూపొందించాలి. మొదటి దశలో సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి 1 నుంచి 2 వారాల పాటు ఆఫీస్కి వచ్చేలా చూడాలి. అప్పటికి నిరాకరిస్తే, మేనేజర్ మరో సమావేశాన్ని నిర్వహించాలి. ఆపై సదరు వాళ్లనే వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తిరిగి ఆఫీస్కి వచ్చేలా ప్లాన్ చేయడం తప్పని సరి. రెండో దశలో సరైన కారణం లేకుండా వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తూ వర్క్ కొనసాగడం క్రమశిక్షణా చర్యలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇవ్వాలి. చివరిగా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగికి వ్రాతపూర్వక హెచ్చరిక లేదా ఫైర్ చేస్తూ హెచ్ఆర్ విభాగానికి తోడ్పాటు నందించేలా చూడాలని మేనేజర్లకు సూచించింది. చదవండి👉‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో -
ఆన్లైన్ షాపింగ్లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్లైన్లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
13 బిలియన్ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా
ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్రాకెట్కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది. ఎగుమతులు అప్.. పండుగ సీజన్లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది. -
పోటెత్తుతున్న యూజర్లు.. ఆ సేవల్ని రద్దు చేసిన ‘ఫ్లిప్ కార్ట్’!
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్కార్ట్ పోర్టల్కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్కార్ట్ సైట్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సైట్లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్లో చిన్న బ్యానర్ను డిస్ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం. ఫిర్యాదుల వెల్లువ అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. సేవలు పున:ప్రారంభం అప్పుడే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రూ.90వేల కోట్ల ఆన్లైన్ అమ్మకాలు పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్లైన్ విక్రయాలు జరిగాయి. -
బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు
ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో భారతీయులు సైతం ఉన్నారు. లేఆఫ్స్తో కొత్త ఉద్యోగం దొరక్కపోవడంతో తిరిగి భారత్కు వస్తున్నారు. మాద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగారులు కొనుగోలు విషయాల్లోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు తమ వ్యయాలను నియంత్రించకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే మెటా, గూగుల్, అమెజాన్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇతర సంస్థలు సైతం ఇంకా ఫైర్ చేస్తూనే ఉన్నాయి. అమెజాన్లో 18,000 మంది తొలగింపు జనవరిలో అమెజాన్ 18,000 మందిని తొలగించింది. ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అనేక కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే ఉద్యోగం పోగొట్టుకుని బాధపడుతున్న వారికి ఇప్పుడు హెచ్1బీ వీసా రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త ఉద్యోగం దొరక్కపోవడంతో అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. అగ్రరాజ్యంలో ఉండేందుకు వీలు లేకపోవడంతో లేఆఫ్స్కు గురైన అమెజాన్ మాజీ ఉద్యోగులు తిరిగి భారత్కు వస్తున్నారు. వేల సంఖ్యలో రిజెక్షన్లు ఈ నేపథ్యంలో లేఆఫ్స్ తరువాత తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని అమెజాన్ మాజీ ఉద్యోగి లింక్డిన్లో పోస్ట్లో వివరించారు. అమెరికా కేంద్రంగా అమెజాన్ ప్రధాన కార్యాలయంలో డెవలప్మెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహించే వారు. అయితే, సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగం పోయింది. అనంతరం రెండు నెలల పాటు కొత్త ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో అన్నీ విఫలమయ్యాయి. ఈ సమయంలో తాను అనేక ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, కానీ వేలాది తిరస్కరణలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. మళ్లీ అమెరికా వెళ్తా.. సాయం చేయరూ 'మీలో చాలా మందికి తెలిసినట్లుగా, గత కొన్ని నెలలు నాకు పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. అమెజాన్లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత, సామూహిక తొలగింపుల మధ్య, నేను వెయ్యికి పైగా ఉద్యగాలకు అప్లయ్ చేసుకున్నాను. దాదాపు అందరూ రిజెక్ట్ చేశారు. ఇంటర్వ్యూలు కాల్స్ రాకపోవడం, ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసినా నా ప్లేస్లో వేరే వారిని తీసుకోవడం, రిక్రూటర్లు మరోసారి ఇంటర్వ్యూలు చేయడం, వాటి గురించి సమాచారం లేకపోవడంతో అనే తిరస్కరణలు ఎదురయ్యాయి. నాకు హెచ్-1బీ వీసా ఉన్నందున నెల రోజుల క్రితం కఠిన పరిస్థితుల మధ్య భారత్కు తిరిగి రావాల్సి వచ్చిందని వాపోయారు. ఉద్యోగం లేదు. పొదుపు చేసిన డబ్బూ ఉంది. అప్పూ ఉంది. అందుకే పొదుపు చేసిన డబ్బు ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో తిరిగి భారత్కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తనకు సాయం చేయాల్సిందిగా తన సన్నిహితులను కోరారు. చదవండి👉🏻 ఎలాన్ మస్క్ హత్యకు గురవుతారేమో
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement