-
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తుఫాను, వర్షం, బలమైన గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఊహించని విధంగా మారింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్కు మళ్లించారు. బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్ 58లో ఒక భవనం మరమ్మత్తు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. #WATCH | Noida, Uttar Pradesh: Several cars were damaged after a shuttering installed to repair a building in Sector 58 of Noida blew off due to gusty winds hitting the National Capital & the adjoining areas. pic.twitter.com/lz7F2WuX9q— ANI (@ANI) May 10, 2024 శనివారం(ఈరోజు) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉంది.రాజధానిలో గాలి దిశలో మార్పు కారణంగా శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 180 వద్ద నమోదైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పు నుంచి ఆగ్నేయ దిశగా గంటకు సగటున ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. -
'ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!
మన కళ్లముందే దారుణ ప్రమాదాలను ఫేస్ చేసి మరీ మృత్యుంజయులై బయటపడిన కొందరూ వ్యక్తులును చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కానీ నిజంలా అద్భుతంగా కనిపిస్తారు ఆయా వ్యక్తులు. అలాంటి మిరాకిల్ లాంటి ఘటనే ఈ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఆ సంఘటన కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పైగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డులకు కెక్కింది కూడా. ఏంటా మిరాకిల్ సంఘటన అంటే..వివరాల్లోకెళ్తే..ఆ మహిళ పేరు వెన్నా వులోవిచ్. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తోంది. సరిగ్గా జనవరి 26, 1972న యుగోస్లావ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 367లో ఫైట్ అటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక భయానక ప్రమాదం జరిగింది. ఓ అనుమానాస్పద బాంబు కారణంగా ఆమె ప్రయాణిస్తున విమానం చెకోస్లోవేయా పర్వతాల మీదుగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 27 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క ఫైట్ అటెండెంట్ వులోవిక్ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. నిజం చెప్పాలంటే వులోవిక్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలింది. ఏకంగా 33 వేల అడుగుల నుంచి కూలిపోయింది. ఇక్కడ వులోవిక్ కనీసం పారాచూట్ లేకుండా అంత ఎత్తు నుంచి పడిపోయినా..బతికిబట్టగట్ట గలిగింది. ఇదే అందర్నీ ఒకింత ఆశ్చర్యచకితులను చేసింది. అయితే దర్యాప్తుల బృందం విమానం భూమిపై కూలిపోతున్నప్పుడూ తోక భాగంలోని ఫుడ్ రూమ్లో వులోవిక్ చిక్కుపోవడంతో సేఫ్గా ఉన్నట్లు తెలిపింది. ఆ తోక భాగం అటవీ ప్రాంతలో పడిపోయి మంచుతో కప్పబడి ఉండటంతో ఆమె అరుపులు అరణ్యరోదనగా మారాయి. ఆమె అదృష్టం కొద్ది అక్కడ పనిచేస్తున్న అటవీ వర్కర్లకు ఆ అరుపులు వినపడ్డాయి. వెంటనే వారు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఏకంగా పదిరోజులకు పైగా కోమాలోనే ఉండిపోయింది. ఈ ప్రమాదంలో వులోవిక్ పుర్రెకి తీవ్ర గాయం, రెండు వెన్నుపూసలు చితికిపోవడం, కటి, పక్కటెముకలు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నడుము తాత్కలికి పక్షవాతానికి గురయ్యి కొన్ని రోజులు బెడ్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి స్థితిలో కూడా ఆమె ఆశను వదులుకోలేదు. పైగా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. నెమ్మదిగా వులోవిక్ పూర్తి స్థాయిలో కోలుకుంది. ఆ తర్వాత ఎయిర్లైన్లో డెస్క్ జాబ్లో విధులు నిర్వర్తించేందుకు తిరిగి వచ్చింది. ఇలా వులోవిక్. మృత్యంజయురాలై నిలవడమే గాక మళ్లీ తన కాళ్లమీద నిలబడి అద్భుతంగా జీవించడంతో .. 1985లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ల కెక్కింది. ఆశకు అసలైన నిర్వచనం ఇచ్చి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ సెర్బియా మహిళ వులోవిక్. తనకు దేవుడిచ్చిన మరో జీవితాన్ని విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన పెంచి ,శాంతిగా ఉండేలా చేసేందుకు అంకితం చేసింది. ఇక వుల్విక్ 2016లో 66 ఏళ్ల వయసులో మరణించింది. ఇది మాములు మిరాకిల్ స్టోరీ కాదు కదా..!(చదవండి: అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..) -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
KCR Shocking Comments: ఏ క్షణమైనా రేవంత్ సర్కారుకు..?
సాక్షి,హైదరాబాద్ : కేసిఆర్ సంచలన విషయాలు బయట పెట్టారు. హైదరాబాద్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కెసిఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారు మనుగడ కష్టమేనన్నారు. తన వాదనకు కొన్ని ఉదాహరణలను ముందుంచారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో BRSకు కనీసం ఎనిమిది సీట్లు వస్తాయన్నారు కెసిఆర్. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న సంకేతాలిచ్చారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చన్న వ్యాఖ్యలు చేశారు కెసిఆర్. ముందుంది ముసళ్ల పండగే రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగే అన్న సంకేతాలిచ్చారు కెసిఆర్. "BRS పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది BRS ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే BJP వాళ్ళు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను బిజెపి వాళ్లు బతకనిస్తారా?" అని ప్రశ్నించాడు. "రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్కు అధికారం వచ్చింది కదా అని BRSని వీడి కాంగ్రెస్లోకి వెళ్తే ఇక్కడ అంతా బిజెపి కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు" అని కెసిఆర్ చెప్పారు. "ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్" అని నన్ను సంప్రదించాడు. కానీ ఇప్పుడే వద్దని నేనే వారించానని కేసీఆర్ చెప్పారు. ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయంటే? ఇప్పుడున్న పరిస్థితులను సమీక్షిస్తే.. "ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో గెలుస్తాం, మరో మూడింటిలోనూ విజయావకాశాలున్నాయి. బస్సుయాత్ర చేద్దాం. జనం నుంచి పార్టీ పట్ల మంచి స్పందన వస్తోంది. ఇప్పుడున్న రేవంత్ సర్కారుపై వీపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభిస్తాను. కీలకమైన "వరంగల్ , ఖమ్మం.. మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిద్దాం" అని అన్నారు. "బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, పదేళ్ల నుంచి లేని కరువు ఈసారి కనిపిస్తోంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది. కొంత మంది బీఆర్ఎస్ నాయకులు వెళ్లినంత మాత్రానా.. పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. మనం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారు. వెళ్లిన వారి స్థానంలో అంతకంటే గట్టి నాయకులను తయారు చేసుకుందాం" అని పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచే ప్రయత్నం చేశారు. మన ఎలక్షన్ ప్లాన్ ఏంటంటే? "ఒక్కో లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్డు షోలు నిర్వహించబోతున్నాం. రోజుకు రెండు మూడు రోడ్షోలుంటాయి. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు పెట్టబోతున్నాం. అలాగే కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తాం. ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లనున్నట్టు" కెసిఆర్ సూచించారు. "బీఆర్ఎస్లో ప్రతీ నాయకుడు ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై స్పందించాలి. పోస్టు కార్డు ఉద్యమం చేయాలి, ఒక్కోపార్లమెంట్ పరిధిలో లక్ష కార్డులు పోస్ట్ కావాలి, రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.500 బోనస్ పై ప్రశ్నించాలి. రేవంత్ ఇచ్చిన హామీలపై గుర్తు చేయాలి" అని పిలుపునిచ్చారు. కవిత అరెస్ట్పై ఏమన్నారంటే.? తన కూతురు కవిత అరెస్ట్పై తొలిసారి బహిరంగంగా స్పందించారు కెసిఆర్. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కెసిఆర్.. తన కూతురు కవితను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినందుకు బీజేపీ అగ్రనాయుకుడు బీఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకే కవితపై కేసు పెట్టారన్నారు కెసిఆర్. త్వరలో మళ్లీ పాత కెసిఆర్ను చూడబోతున్నారని, ఉద్యమ కాలం నాటి నాయకుడిని చూస్తారని అన్నారు. అలాగే మేడిగడ్డ పిల్లర్లు కుంగడం పైనా స్పందించారు కెసిఆర్. పిల్లర్ల కింద ఉన్న ఇసుకంతా కుంగిపోవడం వల్ల పిల్లర్లు దెబ్బ తిన్నాయని, అంతే తప్ప నిర్మాణంలో లోపాలేవీ లేవన్నారు. -
నీలగిరిలో మంచుదుప్పటి.. అలరిస్తున్న వీడియో!
ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో విపరీతమైన చలి నెలకొంది. జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో ఈరోజు(ఆదివారం) మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దక్షిణ భారతంలోనూ ఇటువంటి వాతావరణం నెలకొంది. తమిళనాడులోని నీలగిరిలో ఈరోజు ఉదయం(ఆదివారం) ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు చేరుకుంది. ఈ విధమైన వాతావరణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో నీలగిరిలో భూమిపై మంచు వ్యాపించడాన్ని చూడవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడి వాతావరణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇదిలావుండగా గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం! #WATCH | Nilgiris, Tamil Nadu: A layer of frost covered the Thalaikundha area of Nilgiris after 0 degrees Celcius temperature was recorded this morning. pic.twitter.com/Z43LzgaGvb — ANI (@ANI) December 24, 2023 -
Madhya Pradesh: పట్టుమని 15 నెలలు.. గత జ్ఞాపకం వెంటాడుతుందా?
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. 230 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 17న పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. గత రెండు దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న రాష్ట్రాన్ని బీజేపీ నిలుపుకోనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని 15 నెలలు కూడా మనుగడ సాగించలేకపోయింది. జ్యోతిరాదిత్య సింధియా తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. 2023లో పెరిగిన ఓటింగ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అత్యధిక ఓటింగ్ జరిగింది. గతంలో కంటే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.97 శాతం ఓటింగ్ జరిగింది. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. అదే రోజున ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. మిజోరంలో కౌంటింగ్ను ఒకరోజు వాయిదా వేశారు. 2,533 మంది అభ్యర్థులు మధ్యప్రదేశ్లోని 230 నియోజకవర్గాల్లో 2,533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ఆద్మీ వంటి పార్టీలు కూడా గణనీయమైన స్థానాల్లో పోటీ చేశాయి. కాగా ఈ ఎన్నికల్లో 5.59 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ వరుస విజయాలకు బ్రేకులు మధ్యప్రదేశ్లో వరుసగా మూడు పర్యాయాలు గెలుస్తూ వచ్చిన బీజేపీకి 2018లో కాంగ్రెస్ బ్రేకులు వేయగలిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ కేవలం 109 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే 116 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను మాత్రం కాంగ్రెస్ అందుకోలేకపోయింది. స్వతంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల సాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎంతోకాలం నిలవలేదు. పార్టీలో కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తనతో సహా 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో పట్టుమని 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. -
ఆరంభ లాభాలు ఆవిరి..
ముంబై: ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు గురువారం చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 5 పాయింట్లు నష్టపోయి 66,018 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10 పాయింట్లు పతనమై 19,802 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూ చీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణి లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంధన, రియలీ్ట, టెలికం, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘నిఫ్టీ 19,800 స్థాయిని దాటి ముందుకెళ్లేందుకు ప్రోత్సాహానిచ్చే కీలక పరిణామాలేవీ లేకపోవడంతో పరిమిత శ్రేణి ట్రేడింగ్ రెండోరోజూ కొనసాగింది. క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు దిగిరావడం వంటి అంశాలు దేశీయ మార్కె ట్ పత నాన్ని అడ్డుకుంటున్నాయి’’ అని జియోజిత్ ఫైనా న్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..
జమ్మూ కశ్మీర్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 39 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో కిష్త్వార్-జమ్మూ హైవేపై కిష్త్వార్ నుండి జమ్మూకు ప్రయాణికులతో వస్తున్న బస్సు.. ఓల్డ్ జమ్మూ-కిష్త్వార్ రహదారిపై 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియాను అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా జమ్ముకాశ్మీర్లో ఇటువంటి ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. జమ్ముకాశ్మీర్లో భారీ రోడ్డు ప్రమాదాలు 2019, జూలై 1: కిష్త్వార్లోని సాంగ్వారీ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 35 మంది మృతి, 17 మందికి గాయాలు. 2018, సెప్టెంబర్ 14: కిష్త్వార్లోని దండారన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 17 మంది మృతి, 16 మందికి గాయాలు. 2009, జూన్ 27: దోడా జిల్లాలోని పుల్ దోడాలో రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం. 2021, అక్టోబర్ 28: దోడా జిల్లాలోని థాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి. 2022, నవంబర్ 16: కిష్త్వార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. 2023, మే 30: జమ్మూ-శ్రీనగర్ హైవేపై జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లిలో యాత్రికుల బస్సు వంతెనపై నుండి పడటంతో 10 మంది దుర్మరణం. 2019, మార్చి 15: రాంబన్లో కారు లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మృతి, నలుగురికి గాయాలు. 2023, మే 24: కిష్త్వార్లోని దచాన్ ప్రాంతంలోని దంగ్దురు డ్యామ్ వద్ద ఒక కారు లోయలో పడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు. 2023, ఆగస్టు 30: ఒక కారు 300 అడుగుల లోతైన లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి, ముగ్గురికి గాయాలు. 2023, జూన్ 27: దోడాలోని భదర్వా-పఠాన్కోట్ రహదారిపై ఒక వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి -
పథం దృక్పథం
దృక్పథం... ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండేది దృక్పథం. మనస్థితి, పరిస్థితి వీటిని బట్టి ఎవరికైనా దృక్పథం అన్నది ఉంటూనే ఉంటుంది. దృక్పథం ఉండని మనిషి ఉండడు. మనిషి అన్నాక దృక్పథం ఉండకుండా ఉండదు. దృక్పథం మనిషి మనుగడ స్థాయిని, తీరును, నిర్ణయిస్తుంది. దృక్పథం మనిషి ప్రగతికి, పతనానికి మూలం ఔతుంది. సరైన దృక్పథం లేకపోతే మనుగడ సరిగ్గా లేనట్టే; మేలైన దృక్పథం ఉంటే మనుగడ మేలుగా ఉన్నట్టే. చంద్రుడిపై కాలు మోపిన తొలి మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నది మనకు తెలిసిందే. కానీ ప్రణాళిక ప్రకారం ఎడ్విన్ ఆల్డ్రిన్ ముందుగా చంద్రుడిపై దిగాలి. ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు పెట్టబోయే తొలి మానవుడుగా నిర్ణయం అయిపోయింది. అయితే చంద్రుడిపై రాకెట్ దిగి తలుపులు తెరుచుకున్నాక ఆల్డ్రిన్ కదల్లేదు. అతడికి దిగమని ఆదేశాలు అందినా అతడు కదల్లేదు. ముందుగా చంద్రుడిపై దిగితే తనకు ఏం జరుగుతుందో అన్న దృక్పథం ఎడ్విన్ ఆల్డ్రి¯Œ ను కదలనివ్వలేదు. ఆల్డ్రిన్ కదలకపోవడంతో ఆర్మ్స్ట్రాంగ్కు దిగమని ఆదేశాలు అందాయి. ఏమైనా పరవాలేదు అన్న దృక్పథంతో ఆర్మ్స్ట్రాంగ్ రాకెట్ నుంచి చంద్రుడిపై దిగాడు; చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడుగా చరిత్రలో నమోదు అయ్యాడు. ఆల్డ్రిన్ ఆ అవకాశాన్ని తన దృక్పథం కారణంగా జారవిడుచుకున్నాడు; చారిత్రిక ప్రాశస్త్యాన్ని కోల్పోయాడు. ‘మనం మన దృక్పథానికి అంటిపెట్టుకుని ఉంటాం అన్నీ దాని ఆధారంగానే ఉంటాయి అని. అయినా మన అభిప్రాయాలకు శాశ్వతత్వం లేదు. వసంతం, హేమంతాలలాగా అవి తొలగిపోతూంటాయి’ ఆని ప్రఖ్యాత చైనీస్ తత్త్వవేత్త జువాంగ్ చి ఒక సందర్భంలో అన్నారు. తన దృక్పథం సరైంది అనుకుంటూ దాన్నే అంటిపెట్టుకుని ఉండడం మనిషి బలహీనతల్లో బలమైంది. దృఢమైన దృక్పథం అన్నది మనిషికి బరువైన అవరోధం ఔతుంది. కదలని నీరు కాలక్రమంలో బురద అయిపోయినట్టుగా మారని దృక్పథం మనిషిని పాడుచేస్తుంది. మనిషి తన దృక్పథాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పరిణామాలను బట్టి దృక్పథం ఉండాలి. దృక్పథం ప్రయోజనాల్ని సాధించగలిగేదై ఉండాలి. కొందరు నేతల దృక్పథ దోషాలవల్ల ప్రపంచానికి ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. ఇవాళ్టి రోజున రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉక్రెయి¯Œ పై రష్యా దృక్పథం, రష్యాపై ఉక్రెయిన్ దృక్పథం వల్లే యుద్ధం సాగుతూ పెనువినాశనం జరుగుతోంది. ఆ దృక్పథ వైరుద్ధ్యం పలు ఇతర దేశాల్ని అవాంఛనీయ పర్యవసానానికి గురిచేస్తోంది. ఈ దుస్థితి తొలగిపోవాలంటే ఇంకా విధ్వంసం జరగకుండా ఉండాలంటే ఆ ఇరుదేశాల దృక్పథాలూ మారాలి. వ్యక్తిపరంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ, కళల పరంగానూ, భాషపరంగానూ దృక్పథం తిన్నగా ఉండడమే కావల్సింది. దృక్పథం తిన్నగా ఉండకపోవడం నష్టాన్ని, నాశనాన్ని కలిగిస్తుంది. కొన్ని దశాబ్దుల క్రితం మెరుగైన దృక్పథం లోపించడంవల్ల ఇవాళ తెలుగు భాష, తెలుగు కవిత్వం వైభవాన్ని కోల్పోవడం కాదు వికృతం అయిపోయిన వైనాన్ని అందుకు ఉదాహరణగా మనం చూడచ్చు. పలువురు తమ దృక్పథాల్ని మార్చుకోలేక తాము పతనమైపోవడమే కాకుండా తమ కుటుంబాలకు తీక్షణమెన హాని చేస్తున్నారు. దృక్పథ వక్రత అన్న దానివల్ల సమాజానికి తీవ్రమైన చేటు కలుగుతోంది. దృక్పథం అన్నది మనిషి మనుగడలో ప్రముఖమైంది ఆపై ప్రధానమైంది. ప్రతిమనిషికి దృక్పథం అన్నది ప్రత్యగ్రంగా ఉండాలి. మనిషికి దృక్పథం భవ్యంగా ఆపై సవ్యంగా ఉంటే సత్పథం అమరుతుంది. సత్పథం అమరితే మనుగడ ఉన్నతంగా ఆపై ఉజ్జ్వలంగా ఉంటుంది. కనుక మనిషి తన దృక్పథాన్ని సరిచూసుకుంటూ ఆపై సరిచేసుకుంటూ మనుగడకు మహత్తును సాధించుకోవాలి. ‘దృక్పథం మనిషిని ఎత్తులకు తీసుకు వెళుతుంది. దృక్పథం మనిషిని చిత్తు చేస్తుంది. దృక్పథం ఎత్తుల్లో ఉన్న వ్యక్తిని చిత్తు అయేట్టు చేస్తుంది. దృక్పథం చిత్తు అయిన వ్యక్తిని ఎత్తులకు చేరుస్తుంది. ఎత్తులకు చేరుకోవడానికైనా, చిత్తు అయిపోవడానికి అయినా దృక్పథం కీలకం’ – రోచిష్మాన్ -
ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు. మృతుల్లో 7గురు మైనర్లు సహా 5గురు మహిళలు కూడా ఉన్నారు. గలకతి సదర్ జిల్లా పరిధిలో చత్రకాండ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్పూర్కు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో 60-70 మంది ప్రయాణికులు ఉండటం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ వేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఇదీ చదవండి: విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. రెండు గంటలు అలాగే.. -
బైక్పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
పెట్రోల్, డీజిల్కు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: భారీ వర్షాల అంచనాలతో ప్రయాణ ప్రణాళికలు, వ్యవసాయ రంగంలో ఇంధన వినియోగ ధోరణులు మారిపోవడంతో జూలై ప్రథమార్ధంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమ ప్రాథమిక డేటా ప్రకారం .. గతేడాది జూలై 1–15 తేదీల మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో డీజిల్కు డిమాండ్ 15 శాతం క్షీణించి 2.96 మిలియన్ టన్నులకు పరిమితమైంది. నెలవారీగా దాదాపు 20 శాతం క్షీణించింది. పెట్రోల్ అమ్మకాలు 10.5 శాతం తగ్గి 1.25 మిలియన్ టన్నులకు దిగి వచ్చాయి. నెలవారీగా 10.8 శాతం తగ్గాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ సంస్థలు గణనీయంగా కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో దాదాపు ఏడాది కాలంగా ఇంధనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదీ చదవండి ➤ IT Dept Clarification On PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ మార్చి ద్వితీయర్ధం నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు మరింతగా పుంజుకున్నాయి. అయితే, రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఇతరత్రా వ్యవసాయ అవసరాలకు జనరేటర్ల వినియోగం తగ్గడం తదితర అంశాలు ఇంధనాల డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి. -
టోకు ధరలు మూడోనెలా మైనస్లోనే..
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక లోహాల ధరలు తగ్గుదల ప్రభావం మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) క్షీణతకు దారితీస్తోంది. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, టెక్స్టైల్స్ ధరలు కూడా జూలై తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం జూన్లో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 4.12 శాతంగా నమోదయ్యింది. ఇలాంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. గత ఏడాది జూన్ నెల్లో హై బేస్ ఎఫెక్ట్ (16.23 శాతం) కూడా తాజా ప్రతిద్రవ్యోల్బణం పరిస్థితికి ఒక కారణం. ఈ తరహా పరిస్థితి నెలకొనడం వరుసగా ఇది మూడవనెల కావడం గమనార్హం. ఇక ఇంతటి స్థాయిలో ప్రతిద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టం కావడం మరో విషయం. 2015 అక్టోబర్లో మైనస్ 4.76 ప్రతిద్రవ్యోల్బణం రికార్డయ్యింది. మేలో 4.3 శాతం ఉన్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 4.8 శాతానికి పెరిగిన నేపథ్యంలోనే టోకు ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అయితే ఆర్థికవ్యవస్థకు కీలకమైన రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) రేటు నిర్ణయానికి సెంట్రల్ బ్యాంక్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రామాణికంగా తీసుకునే సంగతి తెలిసిందే. -
జూన్లో సేవల వేగం డౌన్!
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వేగం మేతో పోల్చితే జూన్లో కొంత మందగించింది. మేలో 61.2 వద్ద ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, జూన్లో 58.5కు తగ్గింది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50పైన కొనసాగడం వరుసగా 23వ నెల. సూచీ తాజా సమీక్షా నెల్లో కొంత మందగించినప్పటికీ, వ్యవస్థలో డిమాండ్, కొత్త వ్యాపార పరిమాణాలు, ఉపాధి కల్పనకు సంబంధించి సానుకూల వాతావరణమే ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ విభాగ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. తయారీ, సేవలు కలిపితే... తయారీ, సేవల రంగాలు కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ జూన్లో 61.6 వద్ద ఉంటే, మేలో 59.4కు తగ్గింది. ఈ సూచీ కూడా వృద్ధి ధోరణిలోనే పటిష్టంగా ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. భారత పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70% వాటా కలిగిన ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మేలో 31 నెలల గరిష్ట 58.7 స్థాయిని చూసిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ జూన్లో 57.8కి తగ్గింది. 400 తయారీ సంస్థల పర్చేజింగ్ మేనేజర్లకు పంపిన సమాధానాల ప్రాతిపదికన కదలికలు ఉంటాయి. -
జస్ట్ మిస్..! వందేభారత్ కింద.. చెకింగ్ అధికారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి..
అహ్మదాబాద్: వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబయికి వెళ్తున్న రైలులో చెకింగ్ అధికారి కాస్తలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రైన్లోకి ఎక్కే ప్రయత్నంలో డోర్లు మూసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గుజరాత్ నుంచి వందేభారత్ రైలు ముంబయికి వెళుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వద్ద ఆగింది. అక్కడే ఉన్న చెకింగ్ అధికారి రైలులోకి ఎక్కడం కాస్త ఆలస్యం అయింది. అంతలోనే రైలు ప్రారంభమైంది. ట్రైన్లోకి ఎక్కే ప్రయత్నం చేశారు చెకింగ్ అధికారి. కానీ అప్పటికే డోర్లు మూసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన కిందపడ్డారు. కాస్తలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు ఆయన్ను పైకి లాగారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat #Mumbai #IndianRail pic.twitter.com/WvzuQDGudN — ABS (@iShekhab) June 29, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. ట్రైన్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు సూచించారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ
యాపిల్ వాచ్లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్వాచ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) కాగా యాపిల్ స్మార్ట్వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీస్లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్లో మాన్యువల్గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా?) -
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
-
వీడియో: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు..
-
Joe Biden: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన చేష్టలతో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఉన్నట్లుండి మరిచిపోవడం, ఒకవైపు వెళ్లాల్సింది మరోవైపు వెళ్లడం, ఉన్నట్లుండి కిందపడిపోవడం.. అంతెందుకు ఆ మధ్య సైకిల్ నుంచి కిందపడిన సందర్భమూ ఉంది. తాజాగా.. ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గురువారం కొలరాడోలోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన బైడెన్.. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తుళ్లి ముందుకు పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన్ని పక్కకు తీసుకెళ్లగా.. అక్కడున్నవాళ్లతో కలిసి ఆయన కూడా చిరునవ్వులు చిందించారు. ఎనభై ఏళ్ల బైడెన్ క్షేమంగానే ఉన్నట్లు వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బెన్ లాబోల్ట్ ట్వీట్ చేశారు. కానీ..ఇక.. ఆయన శారీరకంగా ఫిట్గా ఉన్నారని, నిత్యం ఎక్సర్సైజులు గట్రా చేస్తున్నారని ప్రకటించారు. 2020 నవంబర్లో పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కిందపడి కాలు విరగొట్టుకున్నారు బైడెన్. అయితే ఆ గాయం నుంచి త్వరగానే కోలుకున్నారాయన. 🚨 BREAKING: Joe Biden falls at the Air Force Graduation pic.twitter.com/5r2HQwjAdN — Benny Johnson (@bennyjohnson) June 1, 2023 బైడెన్ కిందపడిన సందర్భంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. బైడెన్కి మానసికంగానే కాదు.. ఇప్పుడు నడవడానికి కూడా కష్టంగా ఉంది. అమెరికన్ల రక్షణ కోసం పార్లమెంట్(అమెరికన్ కాంగ్రెస్) ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను(అధ్యక్ష స్థానాన్ని మరొకరితో భర్తీ చేయించడం) తెర మీదకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ట్వీట్ చేశారాయన. బైడెన్కి ఇది కొత్త కాదంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. వయసు పైబడిన వ్యక్తి కదా సహజమేనంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. Joe Biden is mentally unfit and now unable walk. For the safety of the American people, congress must invoke the 25th amendment NOW! pic.twitter.com/gHQ6rLVd9F — The Trump Train 🚂🇺🇸 (@The_Trump_Train) June 1, 2023 To the ignorant people who are calling for President Joe Biden to be removed from office via the 25th Amendment because he tripped, here is a reminder that Franklin D. Roosevelt was confined to a wheelchair for his presidency. Old people fall. Young people fall. Smart people… pic.twitter.com/iOwTELPVZo — Brian Krassenstein (@krassenstein) June 1, 2023 Stop making fun of Joe Biden, it’s clear he tripped over the flat ground. pic.twitter.com/I4m1tk2w9v — Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) June 1, 2023 BREAKING: Donald Trump reacts to Joe Biden falling pic.twitter.com/qt7ntp8cER — ALX 🇺🇸 (@alx) June 1, 2023 Here’s why Joe Biden fell…pic.twitter.com/cjG1RmNALn — Vernon Jones (@VernonForGA) June 1, 2023 Joe Biden falling pic.twitter.com/akTBYwevbz — COMBATE |🇵🇷 (@upholdreality) June 1, 2023 ఇదీ చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యే సముద్రంలోకి దూకాడు.. రియల్ హీరో అయ్యాడు
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement