-
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది: ఎమ్మెల్యే మల్లాది విష్ణుమార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు జగన్పై అసూయ తారా స్థాయికి చేరిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది. ఐటీడీపీ సైట్లో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది. చంద్రబాబు, పవన్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని విష్ణు కోరారు.ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బాబు, పవన్ దుష్ప్రచారం: మనోహర్ రెడ్డిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మోదీ సభలో మాట్లాడే ధైర్యం బాబు, పవన్లకు ఉందా?. అబద్దాల ప్రచారానికి టీడీపీకి ఓ యూనివర్సిటీ నే ఉంది’’ అని మనోహర్రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు. -
ఆత్మలనూ వాడుకుంటున్న రామోజీ
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు. ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది. -
ఏది సత్యం? ఏదసత్యం?
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్/ నబ్రూయాత్ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం. మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది. అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్ అనుయాయి గోబెల్స్ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్ జ్ఞానగుళిక. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి. ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది. సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2024’లో వెల్లడించింది. అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం. -
Yellow Media: ఈ పత్రికలు చదవడానికా? సైకిల్ తుడవడానికా?
కోరల నిండా విషం నింపుకున్న పాములకన్నా.. వాళ్ళిద్దరూ ఇంకా ప్రమాదకరం.. వాళ్ళు చిమ్మే ఎల్లో పాయిజన్ పాము విషం కంటే అత్యంత ప్రమాదకరం. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ఎల్లో మీడియా జగన్పై, జగన్ సర్కార్పై విషం చిమ్ముతోంది.. మొదట్లో ఒకటి రెండు డోస్ మాత్రమే పాయిజన్ కనిపించేది. ఇప్పుడు లీటర్ల కొద్దీ విషం కక్కుతున్నారు. ప్రతిరోజూ తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో తమ పత్రికల్ని నింపేస్తున్నారు. వాటిని పత్రికలు అనడం కటంటే.. విష పుత్రికలు అనడమే కరెక్ట్.. క్రమంగా విషపు రాతల డోస్ పెంచుతూ వచ్చారు. ఎంతలా అంటే మన ఊహలకు అందనంతలా ఇప్పుడు డోస్ పెంచారు. ఒక్కో పత్రిక రోజుకు 50కి పైగా విషపు వార్తలు రాస్తోంది. అంటే ఆ రెండు ఎల్లో పత్రికలు రోజుకు వందకు పైగా విషపు రాతలు రాసి జనాలపైకి వదులుతున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వంపై పూర్తిగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నారు? పనికట్టుకుని మరీ ఎందుకిలా రోత పుట్టించే రాతలు రాస్తున్నారు ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? జర్నలిజం అనే సీసా ఒక ఇజంతో ఒక నిజంతో నిండి ఉంటుంది. అందులో ఉన్న ఆ ఇజాన్ని నిజాన్ని పక్కన పడేసి పూర్తిగా అందులో విషాన్ని నింపి... రాజకీయాల్లో దాన్ని శత్రువులపై అస్త్రంగా వాడుకోవచ్చని మూడు దశాబ్దాల క్రితమే గుర్తించిన దొంగ విజన్ వున్నోడు నారా రూప చంద్రబాబు నాయుడు. మీడియా ఏం చెప్పినా జనం నమ్ముతారు.. మీడియా ఏం చెప్పినా జనం వింటారని అప్పట్లోనే గుర్తించి మెల్లగా కొన్ని పత్రికలను తన విష పుత్రికలుగా మార్చుకుని స్లో పాయిజన్ మాదిరిగా తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లిన ఘనత పచ్చ బాబుకే దక్కుతుంది. జర్నలిజం విలువలు పూర్తిగా దిగజార్చిన ఖ్యాతి కూడా ఆయనదే..! అతను విసిరే బిస్కెట్ల కోసం ఆశపడే శునక జాతి.. జర్నలిజాన్ని అమ్ముడుపోయే వస్తువుగా మార్చేసింది. జాతి జనుల కంటే..తమ జాతి గాడి ప్రయోజనాల కోసం మీడియా విలువల్ని కిలో మీటర్ లోతులో గొయ్యి తీసి పాతి పెట్టిన క్రెడిట్ మాత్రం మన ఎల్లో తాతగారికి, అందరి కుర్చీ కింద కూర్చుని, బాత్ రూముల్లో దాక్కుని రహస్య వార్తలు సేకరించే కృష్ణయ్యగారికే దక్కుతుంది. అసలు ఎందుకీ విషపు రాతలు? వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? ఇవి పత్రికలా.. పత్రికలకు పట్టిన పీడా ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్కై పోయామా.. అయినా డోంట్ కేర్. పట్టపగలు నట్ట నడివీధిలో నగ్నంగా పట్టుబడ్డామా.. అయినా డోంట్ కేర్. పచ్చి అబద్ధాలు చెప్పి పక్కా ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా...అయినా డోంట్ కేర్. అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజస్వరూపం బయట పడిపోయిందా...అయినా డోంట్ కేర్. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు వార్తలు రాసేద్దాం.. ప్రజల మధ్యకు వదిలేద్దాం..! జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, అబివృద్దిని పచ్చ పత్రికలతో కప్పేద్దాం ...ఇలానే ఉంది ఈ విష పత్రికల తీరు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబుగారి కూలి పత్రికలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పోటీ పడతాయి.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడంలో ముందుంటాయి.. మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలపై విమర్శలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి.. ప్రభుత్వం చేసే మంచి పనులపై తప్పుడు రాతలు రాయడంలో మేమే ఫస్ట్ అంటాయి. పేదలపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తాయి. మంచి చేసే వ్యవస్థలను నోటికొచ్చిన ఆరోపణలు చేయడంలో పోటీ పడతాయి. వీటి పనేంటో తెలుసా.. ప్రజలకు నిజాలు చెప్పడం కాదు. అందంగా అబద్ధాలను వండి వార్చడం. ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించడం. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. బాబుగారి కూలి పత్రికలు అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం... 1. ప్రభుత్వంపై ఎందుకిలా విషం చిమ్ముతున్నారు? 2. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు ? 3. ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? 4. వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? పదే పదే బాబుగారి విషపు పత్రికలు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే! ఎల్లో తాతగారి పత్రిక, కుర్చీ కింద కృష్ణయ్య గారి పత్రిక ఒక్కసారి ఓపెన్ చేసి తీక్షణంగా చూడండి. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఓసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు లెక్క పెట్టి చూడండి. ఒక్కో పత్రికలు సుమారుగా 50కి పైగా వార్తలు మీకు కనిపిస్తాయి. అంటే ఈ రెండు పత్రికల్లో రోజుకు సుమారుగా వందకు పైగా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారన్న మాట. ఈ లెక్కన ఏడాదికి 365 రోజులు అంటే.. 36 వేల 500 తప్పుడు వార్తలు. అవును ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది నిజంగా నిజం. ఇంకా డౌట్ ఉంటే ఓ వారం రోజులు ఆ దిక్కుమాలిన పేపర్లు దగ్గర పెట్టుకుని.. విషపు వార్తలు ఎన్ని వున్నాయో లెక్క పెట్టి చూడండి... నేను చెప్పిన లెక్క తక్కువ కాదు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వీటి పనంతా ప్రభుత్వంపై బురద జల్లడం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. దీనికోసం బాబుగారి నుంచి సెపరేట్ పేమెంట్లు ఉంటాయ్. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇంచార్జీల మార్పులు చేర్పులు చేస్తుంటే దానిపైనా విషం కక్కుతున్నారు. ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాకొద్దు బాబోయ్ మాకొద్దు అంటున్నారని ఓ వార్త రాస్తారు. మరుసటి రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో టికెట్ కోట్లు పలుకుతోందని రాస్తారు. ఆ వార్తకు ఈ వార్తకు అసలు సంబంధమే లేదు. ఏదేమైనా జనాల మెదళ్లలోకి విషాన్ని నింపడమే వీళ్ల టార్గెట్. మరి టీడీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే మాత్రం ఆ వార్త జోలికి పోరు. వాటిని మెయిన్ పేజీల్లో అచ్చేయరు. అలా చేస్తే బాబుకు డ్యామేజీ కాబట్టి. ఈసారి ఎన్నికల్లో గెలిచే దారి బాబుకు కనిపించడం లేదు. కొడుకుతో పాదయాత్ర చేయించాడు కుదర్లేదు. జైల్లో ఉండగా భార్యతో చెక్కులు పంపిణీ చేశాడు పావుకిలో సింపతీ రాలేదు. పీకేను తెచ్చేకున్నాడు ఉపయోగం లేదు. మరో పీకేతో చర్చలు జరిపాడు.. అయినా నమ్మకం కుదర్లేదు. ఎయిర్ పోర్టులో డీకేను కలిశాడు.. అయినా ఐసీయూలో ఉన్న పార్టీని బతికించే దారి కనిపించ లేదు. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు.. అయినా జగన్ అదరలేదు బెదరలేదు. ఇక చేతిలో ఉన్న అన్నీ అస్త్రాలు వాడేసిన బాబు.. మిగిలిన ఒకే ఒక్క విషపు అస్త్రాన్ని మరింత బలంగా వాడుతున్నాడు. అదే ఎల్లో మీడియా. ఆంధ్రాలో జనరంజక పాలన నడుస్తుంటే.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే.. అభివృద్ధి పరుగులు పెడుతుంటూ.. చూసి ఓర్వలేక అబద్ధాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు, ఆయన కూలి మీడియా. నిజం చెప్పకపోవడం అబద్ధం.. అదే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు చేస్తోంది పచ్చి మోసం. దానికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోక తప్పదు. సార్ ఒక్క విషయం చెప్పనా.. 700 సంవత్సరాల క్రితం బద్దెన ఓ పద్యం రాసారు శార్.. తలనుండు విషము ఫణికిని....వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్...తలతోక యనక యుండును.. ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! పాముకి తలలో, తేలుకు తోకలో విషం వుంటుంది...కానీ శరీరమంత విషం నిండిన వారు ఈ భూలోకంలో ముగ్గురే ముగ్గురు వున్నారు.. కుప్పం, ఎల్లో తాత, బాత్ రూం క్రిష్ణయ్య.. చెప్పాను కదా 700 సంవత్సరాల క్రితమే ఈ ముగ్గురు గురించి... బద్దెన ఊహించారు. అందుకే ఈ పద్యం రాశారు. చదవండి: రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ -
ఏయూ వీసీ ప్రసాద్రెడ్డిపై ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలెన్నో..!
ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. వీసీ ప్రసాద్రెడ్డిపై విషం చిమ్ముతోంది. ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మరలా ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి నియామకంపై ఎల్లో ఏడుపులు మాములుగా లేవు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులను ఎల్లో గ్యాంగ్ ఎదుర్కొంది. ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలు చాలానే ఉన్నాయి. నారా లోకేష్ తోడల్లుడుకి చెందిన గీతం సంస్థకు పోటీగా ఏయూలో సౌకర్యాలను మెరుగుపరిచి, క్యాంపస్ రూపురేఖలు మార్చి, తరగతి బోధన విధానాలను మెరుగుపరిచి, హాస్టళ్లను ఆధునీకరించి, 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్లను మొదలుపెట్టి ఏయూని దేశంలోనే ఒక ప్రఖ్యాత సంస్థగా మార్చారు. దీనికి రుజువు ఈమధ్యనే ఏయూని సందర్శించిన NAAC (National Assessment Accreditation Council) టీమ్ ఏయూకి 4 మార్కులకుగాను 3.74 మార్కులను వేసి ఏయూకి ప్రతిష్టాత్మక NAAC A++ ర్యాంక్ ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఏయూని ఆనుకుని ఏయూ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యవహారాలు నడిపిన కుహనా ఖద్దరు చొక్కాల చెర నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విడిపించి ఆక్రమణదారుల పీచమనిచారు. దీంతో ఎల్లోగ్యాంగ్ గుక్కపట్టి ఏడ్చారు. యూనివర్శిటీ గ్రౌండ్, చుట్టూ ఉండే పరిసరాలను పూర్తిగా ప్రక్షాళించి తుప్పలు పొదలు లేకుండా పరిశుభ్రం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు ఏ చిన్న అవకాశం లేకుండా కట్టడి చేయడంతో ఎల్లో గ్యాంగ్ ఆపసోపాలు పడ్డారు. ఇంతకుముందు ప్రభుత్వాన్నో, ఏయూ ఉన్నత అధికారులనో ఇబ్బందులు పెట్టాలంటే ఏయూ క్లాసుల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేయించి పబ్బం గడుపుకునే కుహనా యువ రాజకీయ విద్యార్థి లీడర్స్ తోకలను కత్తిరించి వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపారు. ఎల్లోగ్యాంగ్ హాహాకారాలు చేశారు. రాజకీయ మీటింగ్లకు కుల సంఘాల మీటింగ్లకు బలవంతంగా ఏయూ ఉద్యోగులు విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేసే కుల విద్యార్థి సంఘాల కుహనా వ్యక్తులను క్యాంపస్ లోకి అడుగుపెట్టకుండా కట్టడి చేయడంతో ఎల్లోగ్యాంగ్ పెడబొబ్బలు పెట్టారు. హాస్టళ్లలో మత్తు పదార్థాలను చొప్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించే బేవర్స్లను మెడ పట్టుకుని బయటకు గెంటి ఏయూ ప్రశాంతతని కాపాడటంతో ఎల్లోగ్యాంగ్ విలవిల్లాడిపోయారు. ఒకప్పుడు దెయ్యాల కొంపగా ఎల్లో గ్యాంగ్తో అభివర్ణించిబడిన ఏయూ నేడు ప్రభుత్వ విధి విధానాలు, ప్రసాద్రెడ్డి అకుంఠిత దీక్ష మూలంగా అత్యంత సుందరంగా రూపుదిద్దుకోవడంతో రాబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని లెక్కలు వేసుకుంటూ, తర్జనభర్జనలు పడుతూ పచ్చ గ్యాంగ్ ఉడికిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. ప్రసాద్ రెడ్డిపై విషం చిమ్ముతోంది. ఇదీ చదవండి: భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్! -
కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్కుమార్కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ‘‘బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ నిప్పులు చెరిగారు. టోఫెల్లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది. ఆ టెస్ట్లో పాస్ అయిన వారికి మాత్రమే టెస్ట్కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. చదవండి: బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ.. ‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం’’ అని మంత్రి వెల్లడించారు. -
మద్యంపై పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో
మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవేనని తెలిసినా ఆ విషయాన్ని పురంధేశ్వరి దాటవేశారు. మద్యం నిధులు మళ్లించింది చంద్రబాబేనని తేలుతున్నా నోరెత్తని ఆమె.. పైపెచ్చు కాకిలెక్కలు చెబుతూ.. ఈ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర శాఖ తేల్చిచెప్పిన కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ‘ఈనాడు’ రూట్లోనే ఏపీ బీజేపీ చీఫ్ వెళ్తున్నారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అంటూ ఈ నెల 9న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవంగా తేలింది. 8వ తేదీన పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం. ఆమె చేసిన ఆరోపణలు, వాస్తవాలు... ఇవిగో. ఆరోపణ: ఏపీలో చీప్ లిక్కర్ అమ్మకాలు వేలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మద్యం పేరిట భారీ అవినీతికి తెరలేపి వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. సమాజంపై మద్యం వినియోగం ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను ఈ ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వంలో 4,380 మద్యం దుకాణాలుండగా ఈ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం, బీరు గరిష్ట స్వాధీన పరిమితి కూడా ఈ ప్రభుత్వమే తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను ఈ ప్రభుత్వమే తొలగించింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యం దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మద్య విమోచన ప్రచార కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో ఐఎమ్ఎల్ (మద్యం), బీరు విక్రయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాకే గణనీయంగా తగ్గాయి. గత ప్రభుత్వంలో 2017–18లో అంటే 360.85 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే, 2018–19లో ఆ సంఖ్య 384.36 లక్షల కేసులకు పెరిగింది. అలాగే 2017–18లో బీర్ల అమ్మకాలు 227.26 లక్షల కేసులుంటే.. 2018–19లో ఆ సంఖ్య 277.16 లక్షల కేసులకు పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కేంద్ర ప్రభుత్వమే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. దీనికి సంబంధించిన టేబుల్ కూడా చూడవచ్చు. ఆరోపణ: వైయస్సార్సీపీలోని కీలక నేతలే మద్యం తయారీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. వైయస్సార్సీపీ నాయకులకు తన కంపెనీని అప్పగించడానికి ఒక వైఎస్సార్సీపీ ఎంపీ నిరాకరిస్తే.. ఏపీఎస్బీసీఎల్ ఆ కంపెనీ నుంచి మద్యం కొనుగోలును ఆపేసింది. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చాక అంటే 2019 మే తరవాత... ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. ఈ ప్రభుత్వం రాకముందు ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే.. మద్యం తయారీ, సరఫరా చేస్తున్నాయి. ఆరోపణ: మద్యంలో నాణ్యత లేదు. విషపు అవశేషాలు ఉన్నాయి. ముడి పదార్థమైన రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచి హానికారక అవశేషాలను తొలగించడం లేదు. మద్యం తయారీ ధర లీటరుకు రూ.15 కాగా.. విక్రయ ధర లీటరుకు రూ.600–రూ.800 మధ్య ఉంది, వాస్తవం: రాష్ట్రంలో మద్యం తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందనడం పూర్తిగా అవాస్తవం. ఏపీ డిస్టిలరీ (బీర్, వైన్ కాకుండా మద్యం తయారీ), 2006 నియమాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మద్యం తయారవుతోంది. మద్యంలో ఎలాంటి హానికారక అవశేషాలు ఉండకూడదని రూల్ 34 చెబుతోంది. మద్యం తయారయ్యే ప్రతి ఫ్యాక్టరీలోనూ మద్యం నాణ్యతను పరీక్షించేందుకు ఒక రసాయన ల్యాబొరేటరీ కూడా ఉంది. మద్యం తయారీ ప్రక్రియను, నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి డిస్టిలరీ పరిధిలోనూ ఒక డిస్టిలరీ ఆఫీసర్ ఉన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం వారు రాష్ట్రంలో 5 ప్రాంతీయ ఎక్సైజ్ ల్యాబొరేటరీలు ఏర్పాటుచేశారు. ఇవి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరుల్లో ఉన్నాయి. ఇవి మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం నమూనాల్లో అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో సర్టిఫికెట్లను కూడా ఇస్తాయి. ఇవి కోర్టుల్లో కూడా చెల్లుబాటు అవుతాయి. ఆధునిక పరీక్షా పద్ధతులు సాధ్యమయ్యేలా అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబొరేటరీలను ఆధునికీకరించింది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం. ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత వేగంగా, కచ్చితంగా పరీక్షలు చేసేలా ఈ ల్యాబొరేటరీలు తయారయ్యాయి. ఈ అత్యాధునిక పరికరాల కోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు. ఎసిటల్ డీహైడ్, ఇథైల్ ఎసిటేట్, మెథనాల్ వంటి వాటిని నిశితంగా పరిశీలించే వీలు ఇప్పుడు డిస్టిలరీల్లోని ల్యాబొరేటరీల్లోనూ, ప్రాంతీయ ల్యాబొరేటరీల్లోనూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో విశ్లేషించిన శాంపిళ్ల వివరాలను టేబుల్లో చూడొచ్చు. ఇక మద్యం ఎమ్మార్పీ విలువ విషయానికొస్తే... అందులో15 శాతం తయారీ ఖర్చు కాగా, మిగిలిన 85 శాతం ఏపీఎస్బీసీఎల్, ప్రభుత్వ ఆదాయం. ఆరోపణ: రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు.. డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే మద్యం కొంటున్నారు కనుక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది. ఆరోపణ: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లు అయితే అందులో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారు. వాస్తవం: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. అలాంటప్పుడు రూ.25వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారు అనేది కూడా అసంబద్ధం, అవాస్తవం. ఆరోపణ: లంచాలిచ్చే కంపెనీల నుంచే ఏపీఎస్బీసీఎల్ మద్యం కొనుగోలు చేస్తోంది. వాస్తవం: రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత అంటే 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని 19–09–2022న నివేదిక ఇచ్చింది. ఆరోపణ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారు. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడం లేదు. వాస్తవం: వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. అందువల్ల ఆ స్పెషల్ మార్జిన్ రాష్ట్ర ఖజానాకు వెళ్లదు. ఆరోపణ: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మరణించిన వారు 25 శాతం పెరిగారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని ప్రతి మద్యం సీసాపైనా స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ప్రభుత్వం. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కాలేయం వంటివి దెబ్బతింటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేతప్ప, ప్రభుత్వం విక్రయించే మద్యంలో నాణ్యత లేకపోవడం వల్లనో, విషపూరిత అవశేషాలు ఉండటం వల్లనో కాదు. విశాఖపట్నంలోని కేజీహెచ్లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని అర్థమవుతోంది. అందువల్ల పురంధేశ్వరి రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే. మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే ఈ ప్రభుత్వ విధానం. పూర్తిగా నాణ్యమైన మద్యాన్ని తయారుచేసి, ఎలాంటి అవినీతికీ ఆస్కారం లేకుండా అమ్మకాలు జరిపేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. చదవండి: Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ.. -
ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్కు పోలీసులు అప్పగించారు. కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పరాకాష్టకు టీడీపీ శవ రాజకీయం
సాక్షి నెట్వర్క్ : చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రాణాలు విడుస్తున్నట్లుగా ప్రజలను నమ్మించడానికి టీడీపీ విఫలయత్నం చేస్తోంది. అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో సహజ మరణాలను సైతం చంద్రబాబు అరెస్టు, జైలుకు ముడిపెట్టి శవ రాజకీయం కొనసాగిస్తోంది. ఈ విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, సానుభూతి పొందేందుకు పచ్చ బ్యాచ్ తెగతాపత్రయ పడుతోంది. నిజానికి.. ‘పచ్చ’ మీడియా పేర్కొన్న వారంతా అనారోగ్య కారణాలతో మరణిస్తున్నా ‘బాబు అరెస్టును తట్టుకోలేక..’ అంటూ నానా హడావుడి చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా భజనతో గ్రామాల్లో ప్రజలు నివ్వెరపోతున్నారు. మొత్తానికి ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వాస్తవాలివి. -
సిగ్గులేని రామోజీ, చివరికి ఇందులో కూడా విష ప్రచారమా!
-
Fact Check: వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచింది బాబే
సాక్షి, అమరావతి: నిజాలకు పాతరేసి అబద్ధాలను అచ్చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన రామోజీ తాజాగా వీఆర్ఏల డీఏపై పడ్డారు. టీడీపీ పాలనలో చేసిన నిర్వాకాలను మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు. వీఆర్ఏల డీఏను తొలగించి వారిని నిండా ముంచింది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిన విషయమైనా రామోజీ అదేమీ తెలీనట్లు ఉంటూ సొల్లు పురాణం అందుకున్నారు. నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018లో వీఆర్ఏలకు డీఏ వర్తించదని జీఓ ఇచ్చారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ నిజాలకు ముసుగేసి వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్న ఈనాడు.. బరితెగించి మరీ అడ్డగోలు కథనం రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదీ నిజం.. వీఆర్ఏలకు నెలకు రూ.300 చొప్పున ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ)ను కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరి 29న టీడీపీ ప్రభుత్వం జీఓ–14 జారీచేసింది. 2018 జూన్ 1 నుంచి వీఆర్ఏలకు డీఏ వర్తించదని ప్రకటించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరాయి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను మార్చి కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని కోరుతుండగా ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించి, పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ విషయాలను మరచిపోయి ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను అచ్చోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 మంది వీఆర్ఏలు సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారిలో ఎంతమంది ఏవిధంగా డీఏ డ్రా చేశారని తెలుసుకునేందుకే ఖజానా, అకౌంట్స్ శాఖ మెమో ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క వీఆర్ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా ఈనాడు నిస్సిగ్గుగా వీఆర్ఏల నుంచి డీఏలను రికవరీ చేస్తున్నట్లు అబద్ధాలు రాసిపారేసింది. కానీ, డీఏలు రికవరీ లేకుండా చేయడంతోపాటు ప్రతినెలా డీఏను కొనసాగించేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై అతి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది. వీఆర్ఏలకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. ఈ సంవత్సరమే 66 మంది వీఆర్ఏలకు గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతులిచ్చింది. ఇవన్నీ మర్చిపోయి.. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈనాడు కంకణం కట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?
నిజాలకు పాతరేసి.. అబద్ధాలు అందంగా అచ్చు వేయటంలో ‘ఈనాడు’ దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే... ఏమీ చేయకపోయినా సాహో.. అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అదే అధికారం తమవారి చేతుల్లో లేకపోతే మాత్రం... ‘ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత వహించిన రామోజీరావు. ఇదంతా ఎందుకంటే... ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన విజన్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులను చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీలను మన పిల్లలు ఒడిసి పట్టుకోవటానికి యూనివర్సిటీలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ఆ వార్త యథాతథంగా వేస్తే... ముఖ్యమంత్రి విజన్ అందరికీ తెలుస్తుందని, చదువుకున్న వారిలోను, విద్యార్థుల్లోను సానుకూలత వస్తుందని భయపడిన రామోజీరావు... ‘సీఎంగారూ! ఇదెలా సాధ్యం?’ అంటూ తన పైత్యం మొత్తాన్ని జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్చాన్స్లర్లుగా, పాలకమండలి సభ్యులుగా అధికార పారీ్టకి కావాల్సిన వారిని నియమించారని... ఇలా చేతికొచ్చినంత రాసిపారేశారు. మరి ఇందులో నిజమెంత? ఏది నిజం? నిజమే! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కావటం లేదు. కాకపోతే అది గడిచిన నాలుగేళ్లుగా కాదు. చాలా సంవత్సరాలుగా!!. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచీ యూనివర్సిటీ వైస్చాన్స్లర్లుగా, పాలక మండలి సభ్యులుగా తన బంధువులనే నియమించుకున్నారు. వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కేసి తమకు కావాల్సిన వారిని, ముడుపులిచ్చిన వారిని నియమించుకోబోయారు. ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు, వారి తీరు నచ్చన ఆయా వర్సిటీల్లోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టులకెళ్లారు. దీంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీల్లో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్నడూ ప్రశి్నంచలేదెందుకు రామోజీరావు గారూ? వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా... కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్మెంట్లు నిలిచి పోయాయి. దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కనబెడితే... కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ‘ఈనాడు’ రాస్తే ఒట్టు!. ఇప్పుడేమో ఆ కేసులన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోస్టుల భర్తీ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశి్నంచటం మొదలెట్టారు రామోజీ!!. నాలుగేళ్లూ ఊరుకుని ఇప్పుడెందుకంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. అసలు ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబును... కోర్టు కేసులకు కారకుడైన చంద్రబాబును మాత్రం వెనకేసుకొస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 50% మహిళలకే అవకాశమిస్తోంది. దాన్ని కూడా పక్కనబెట్టి అంతా అధికార పారీ్టవారే అంటూ దుర్మార్గపు రాతలకు దిగింది ‘ఈనాడు’. అదీ రామోజీరావు తీరు!!. ఇదీ నిజం. నిధులు మళ్లించిందెవరు రామోజీ? వర్సిటీల నిధులను దారిమళ్లించినట్లు ‘ఈనాడు’ అవాస్తవాలను వండి వార్చేసింది. మరి ఇందులో నిజమెంత? టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలకు ఉరి వెయ్యటానికి చంద్రబాబు నిధుల దుబారా పథకాన్ని అమలు చేశారు. అంటే... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాల కోసం యూనివర్సిటీల్లో సమావేశాలు నిర్వహించారు. సమావేశం వర్సిటీలో కనక దానికయ్యే ఖర్చు మొత్తాన్ని వర్సిటీల నుంచే చేయించారు. ఇందుకోసం ఆయా యూనివర్సిటీలు ఒక్కొక్కటి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. కానీ అప్పట్లో ‘ఈనాడు’ పెన్నెత్తితే ఒట్టు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పనులకోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తూ తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. బాబు దుబారాపై కళ్లు మూసుకుని... డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ.. రామోజీనే!! సాక్షాత్తూ యూజీసీ చైర్మన్ చెప్పారు జూలై 1న సాక్షాత్తూ యూజీసీ ౖచైర్మన్ కాకినాడలో జరిగిన సమావేశంలో... ఉన్నత విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పలు అంశాల్లో ముందున్నదని వ్యాఖ్యానించారు. కానీ ‘ఈనాడు’ మాత్రం ఉన్నత విద్యపై బురద చల్లుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళనలను కలిగించడానికి ప్రయత్నిస్తోందన్నది నిజం. గడిచిన నాలుగేళ్లలో దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులు, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు, నైపుణ్య కోర్సులు వంటి అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలోని మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ‘ఈనాడు’కు అసాధ్యమైనవిగా కనిపించటం విచిత్రమే మరి. ఎందుకంటే చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదు కాబట్టి ‘ఈనాడు’కు సహజంగానే అవన్నీ అసాధ్యమైనవిగా కనిపిస్తాయి. ఒక కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టే ముందు దానిపై లోతుగా అధ్యయనం చేయటం, ప్రణాళికాబద్ధంగా అమలుకోసం సన్నద్ధమవటం వంటివి చేస్తున్నపుడు ఏదో ఒకరకంగా బురద జల్లాలనే లక్ష్యంతో ‘ఈనాడు’ వరుస కథనాలు రాస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే నిన్న జరిగిన వైస్చాన్సలర్ల సమావేశం.. ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి సమావేశం కాదు. 2021 అక్టోబర్ 25న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఉపకులపతులతో సమావేశమై ఉన్నత విద్యపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగేళ్లలో దాదాపుగా 10 సార్లు ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యపై ఇన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. వీటన్నిటినీ విస్మరించిన ‘ఈనాడు’... నాలుగేళ్ల తరవాత తొలిసారిగా వీసీలతో సమావేశం నిర్వహిస్తున్నారన్న తరహాలో కథనాన్ని వండిందంటేనే.. రామోజీ దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచే పటిష్ట పునాదులు ఒక్క ఉన్నత విద్యలోనే కాకుండా పునాది స్థాయి నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దేలా రాష్ట్రంలో పలు సంస్కరణలను సీఎం జగన్ తొలిరోజు నుంచీ అమలు చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయి. పాఠశాల విద్యలో నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు యూపీ, అస్సాం, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. గతంలో ప్రయివేటుకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమాన్ని వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టించారు. దీనిపైనా చంద్రబాబు, రామోజీ విషం చిమ్మి అడ్డుపడే ప్రయత్నం చేశారు. నూతన విద్యావిధానం కన్నా ముందే రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యావిధానాన్ని తీసుకువచ్చి శిశుస్థాయి నుంచే పిల్లల్లో అక్షరజ్ఞానానికి సీఎం శ్రీకారం చుట్టారు. నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, సీబీఎస్ఈ విధానం వంటి విధానాలను తెచ్చి పాఠశాల విద్యను బలోపేతం చేశారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను నెలకొల్పి డిజిటల్ బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్ధులకు, టీచర్లకు ట్యాబులను కూడా అందిస్తూ... దిగ్గజ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ పాఠాలను కూడా అందులో అందజేస్తున్నారు. ఉన్నత విద్య భారం పూర్తిగా ప్రభుత్వానిదే... ఉన్నత విద్యలో చేరే ప్రతి విద్యార్థికీ పూర్తి ఫీజురీయింబర్స్మెంటుతో పాటు వారి వసతి ఖర్చులనూ ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారు. దీనికోసం గత నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచి్చంచింది. గత ప్రభుత్వంలో 35వేలు మాత్రమే ఫీజు ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని విద్యార్ధులే కట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్తిభారం ప్రభుత్వానిదే కావటంతో ఇంటర్ తరవాత డ్రాపవుట్లు గత ప్రభుత్వంలో 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గారు. ఉన్నత విద్యలోనూ నేటి అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులమ్ అభివృద్ధి చేయించారు. బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీని వేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టించారు. డిగ్రీలో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసి నాలుగేళ్ల హానర్ కోర్సులను ఏర్పాటు చేయించారు. 27 వేల పరిశ్రమలు, సంస్థల అనుసంధానంతో ఇంటర్న్షిప్. విద్యార్ధులకు ఇంటర్న్íÙప్కోసం కాలేజీలను జిల్లాల వారీగా 27వేల పరిశ్రమలతో అనుసంధానం చేయించారు. చదువులు పూర్తి చేసేనాటికే విద్యార్ధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు సమకూరేలా చేశారు. విద్యార్ధులలో నైపుణ్యాలకోసం 553 ఎంటర్ప్రెన్యూర్íÙప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ కేంద్రాల ఏర్పాటుచేయించారు. మైక్రోసాఫ్ట్ ద్వారా రూ.32 కోట్లతో 1.62 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు అందించారు. మరో 1.95 లక్షల మందికి వివిధ కంపెనీలతో వర్చువల్ ఇంటర్న్íÙప్ అందించారు. నాస్కామ్ ఫ్యూచర్స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, బీఎస్ఎన్ఎల్, సేల్స్ఫోర్సు, పాల్ ఆల్టో, బ్లూప్రిజమ్, ఫుల్స్టేక్, ఏడబ్ల్యూఎస్, ఎంప్లాయిమెంటు ఎక్స్ప్రెస్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో వర్చువల్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చారు. సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లోనే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, క్స్టైల్స్, అపెరల్, లైఫ్సైన్సెస్, అగ్రికల్చర్, హెల్త్కేర్ తదితరాల్లో ఇంటర్న్íÙప్ వల్ల విద్యార్ధులకు అవగాహన పెరుగుతోంది. బాబు హయాంలో 37వేలు మాత్రమే ప్లేస్మెంట్లు ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. ఈ ఏడాదిలో 1.20 లక్షల మందికి ప్లేస్మెంట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతా ‘పచ్చ’గానే ఉండాలనుకునే రామోజీరావు కళ్లకు ఇవేవీ ఎన్నటికీ కనిపించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. బాబు హయాంలో ఒక్కపోస్టూ భర్తీ చేయలేదే.. మన పిల్లలని ప్రపంచస్థాయి లీడర్లుగా ఎదగకుండా ఆపింది ఎవరు? అనేది ‘ఈనాడు’ ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే. ఎందుకంటే విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం ఆయనే. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలి తొమ్మిదేళ్ళూ... అంటే 1995 నుంచి 2004 వరకు, ఆలాగే, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక 2014 నుండీ 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినీ నియమించలేదు. దీన్ని రామోజీరావు ఎప్పుడూ ప్రశ్నించలేదు కూడా!. విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆయా కోర్సుల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుంటే కృత్రిమ మేధ వంటి కొత్త కోర్సుల వల్ల ఉపయోగం ఏమిటనేది ‘ఈనాడు’ ప్రశ్న. వాస్తవానికి మారుతున్న సమకాలీన సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు వస్తుంటాయి. వాటికి అవసరమైన నిపుణులను వర్సిటీల్లో నియమించుకోవాలి. అంతేకానీ, ప్రస్తుతం నిపుణులు లేరు కాబట్టి కొత్త కోర్సులను తేవొద్దని చెప్పటం ఏ రకమైన పాత్రికేయం? వర్సిటీల్లో ర్యాంకులు పడిపోతున్నాయనీ, ఈ సమయంలో కొత్త కోర్సులు అవసరమా? అనేది ‘ఈనాడు’ కథనంలో ప్రధానమైన అంశం. ర్యాంకులు పడిపోవడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆచార్యులు లేకపోవడమే కారణం. దీనికి ప్రధాన బాధ్యుడు చంద్రబాబే. నియామకాలు చేపట్టకపోవటం, కోర్టు కేసులపై దృష్టిపెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ర్యాంకులను పునరుద్ధరించుకోవడానికి ముఖ్యమంత్రి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి నమూనాలను తీసుకోవాలని దార్శనికతతో వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. తద్వారా విశ్వవిద్యాలయాలను శక్తివంతమైన సాంకేతిక, ఆధునిక విద్యా కేంద్రాలుగా మారాలన్నారు. కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయాలని పేర్కొన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అంశాలు, ఏ నిరుద్యోగినీ బాధించవు. అవకాశాలు పెంచుకోవడానికి, మరికొంత మందిని ఉపాధికి చేరువ చేయడానికి కృత్రిమ మేధ ఉపయోగ పడుతుంది. బహుశా, ఇలాంటి విధానం ‘ఈనాడు’కు నచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఇలా చెప్పింది చంద్రబాబు కాదు కాబట్టి నచ్చి ఉండకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు సిద్ధమవుతుండటాన్ని గమనించి... ఎలాగైనా నియామకాలు జరగకూడదనే కుట్ర ఈ కథనంలో స్పష్టంగా కనబడుతోంది. -
‘ఫెర్రో ఎల్లాయ్స్’ సమస్యలు ఏనాటివో..! ఆ ఇబ్బందులు దశాబ్దాలుగా ఉన్నవే రామోజీ..
సాక్షి, అమరావతి: రాసిందే పదే పదే రాస్తే పాఠకులు నమ్మేస్తారన్నది రామోజీరావు భ్రమ. ప్రతీ అంశాన్నీ అటుతిప్పి ఇటు తిప్పి చివరికి ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కేలా ఉంటున్నాయి ఆయన రాతలు. గత టీడీపీ ప్రభుత్వంలోనే కుదేలైన ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వంపై రుద్దేందుకు తెగ ఆయాసపడుతూ ఎప్పటిలాగే మరో తప్పుడు కథనాన్ని అచ్చోశారు. అసలు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల పరిస్థితులే లేవన్నట్లు ఆ కథనానికి కలరింగ్ ఇచ్చారు. ‘కరెంటు షాక్తో అల్లాడుతున్న ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల మూత’ శీర్షికతో మంగళవారం ఈనాడు అసత్యాలతో ఓ వంటకాన్ని వండి వార్చింది. దీని వెనకనున్న అసలు వాస్తవాలను ఇంధన, పరిశ్రమల శాఖలు వెల్లడించాయి. అవి.. ఆరోపణ: జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, బెదిరింపులు, దాషీ్టకానికి భయపడి ఇప్పటికే చాలా పరిశ్రమలు వెళ్లిపోయాయి.. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలవల్ల రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా.. వైఎస్సార్ జిల్లాలో సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమ ఏర్పాటవుతోంది. జపాన్కు చెందిన ‘యెకోమా’ సంస్థ ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమను గత ఏడాది ఉత్పత్తి ప్రారంభించింది. మరో రూ.1,000 కోట్లతో రెండోదశ కర్మాగారం నిర్మాణానికి సీఎం జగన్ ఇప్పటికే శంకుస్థాపన చేయడంతో శరవేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ వేధిస్తేనే వచ్చాయా? ఆరోపణ: రాష్ట్రంలో ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు.. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలూ మూతపడుతున్నాయి.. వాస్తవం: అనేక కారణాలవల్ల ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు గత కొన్ని దశాబ్దాలుగా ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్నాయి. అందువల్లే అవి మూతపడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమీ జరగడంలేదు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇవి అనేకం మూతపడ్డాయి. గత ఇరవై ఏళ్లుగా ఈ విభాగంలో అమలులో ఉన్న టారిఫ్కు ఎలాంటి డిమాండు ఛార్జీలు, స్థిర ఛార్జీలు, సమయానుసార ఛార్జీలు (టీఓడీ), తప్పనిసరి వినియోగం ఛార్జీలు విధించలేదు. కానీ, ఖర్చులు 54శాతం పెరిగాయి. ఇతర వినియోగదారులకు అవలంబిస్తున్నట్లుగానే ఈ పరిశ్రమలకూ డిస్కంలు చార్జీలను అమలుచేస్తున్నాయి. వీటి ప్రకారం చూసినా.. రాష్ట్రంలో వీటికి యూనిట్ ఛార్జి దాదాపు రూ.0.50 తక్కువే. ఆరోపణ: ‘అమరరాజా’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో ఆ సంస్థ విస్తరణ ప్రాజెక్టుల్ని తెలంగాణ, తమిళనాడులో చేపట్టింది. వాస్తవం: కాలుష్య కారకాలైన వాయు, ద్రవ పదార్థాలను నేరుగా వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ ప్రమాణాలను పాటించాలని ‘అమరరాజా’కు నోటీసులివ్వడం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్నా ఊరుకోవాలా డ్రామోజీ? ఆరోపణ: కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో టీడీపీ నిర్ణయించిన భూముల ధరల్ని వైఎస్సార్సీపీ అధి కారంలోకి వచ్చాక ఐదురెట్లు పెంచింది. వాస్తవం : ఏపీఐఐసీ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల ధరలను సవరించడం సర్వసాధారణం. ఆరోపణ: విక్రయ ఒప్పందానికి రాలేదన్న కారణాలతో 74 మందికి స్థల కేటాయింపులను రద్దుచేసింది.. వాస్తవం: ఇందులో తప్పేముంది? భూముల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేటాయిస్తే నిరీ్ణత కాలంలో డబ్బు చెల్లించి రిజి్రస్టేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత పారిశ్రామిక సంస్థలది కాదా? ఆరోపణ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చిత్తూరు జిల్లాలో రూ.13 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.. వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. రకరకాల వివాదాల్లో ఉన్న భూమిని గత టీడీపీ ప్రభుత్వం రిలయన్స్కు కేటాయించింది. అందుకే విరమించుకుంది. కానీ, రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడతామని ముఖేష్ అంబానీ విశాఖ సదస్సులో ప్రకటించిన విషయం గుర్తులేదా!? -
ఇంతకాలం బాబు డ్రామాలు.. కేసు తప్పలేదు.. జగన్ వచ్చాక సీన్ రివర్స్
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తనను సమర్ధించుకోలేని దశలోకి వెళుతున్నారు. ప్రత్యేకించి రెండు, మూడు అంశాలలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి రాజధాని భూముల స్కామ్ లో చంద్రబాబు ఏ1 అంటే మొదటి నిందితుడుగా సీఐడి కేసు నమోదు చేసింది. ఇంతకాలం తాను ఎన్ని అక్రమాలు చేసినా ఎక్కడా కేసు రాకుండా జాగ్రత్తపడ్డ నేర్పరిగా పేరొందారు. ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిపోయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన మేనేజ్ చేసుకోగలిగారు. కానీ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన పప్పులు ఉడకడం లేదు. అయినా ఏదో రకంగా ఎల్లో మీడియాను, ఆయా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి, తన తప్పులేవీ లేవన్న ప్రొజెక్షన్ ఇచ్చుకోవాలని తంటాలు పడుతున్నారు. ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి 5 వంటి మీడియా సంస్థలు శక్తివంచన లేకుండా జగన్ పై పచ్చ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణంలో ప్రత్యేకించి ఆయనకు, ఆయన కంపెనీ హెరిటేజ్కు లబ్ది జరిగిందన్న విషయం సీఐడీ విచారణలో తేటతెల్లమయింది. అందువల్లే కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడం జప్తునకు గురైంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కోర్టు కూడా మొత్తం స్టడీ చేసి అమరావతి భూ స్కామ్ లో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, రియల్ ఎస్టేట్ యజమాని లింగమనేని రమేష్ తదితరుల పాత్ర ఉందని అభిప్రాయపడి, కొన్ని ఆస్తుల జప్తునకు ఓకే చేసింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. చంద్రబాబు తీరును కోర్టు తప్పుపట్టింది. ఎల్లో మీడియా ఆ విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడింది. ఈ తీర్పు తర్వాత దానిని ఎలా సమర్ధించుకోవాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. కాకపోతే ఈ కేసులో క్విడ్ ప్రోకో జరగలేదని చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాని అందులో అంత పస ఉన్నట్లుఅనిపించదు. రాజధాని రింగ్ రోడ్డు అలైన్ మెంట్లో లింగమనేని రమేష్ భూములు మాత్రం భూ సమీకరణలో ఎలా పోకుండా ఉండగలిగాయన్నదానికి సమాధానం లేదు. అలాగే హెరిటేజ్ సంస్థ రమేష్ నుంచి కొనుగోలు చేసిన భూముల పక్కనుంచే రింగ్ రోడ్డును ప్రతిపాదించడంలో దురుద్దేశం లేదని చెప్పడం టీడీపీకి కష్టంగా మారింది. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని సీఐడీ జప్తు చేయడానికి కోర్టు అనుమతించింది. ఇందులో క్విడ్ ప్రోకో ఉందని ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి కోర్టు వచ్చిందన్నమాట. ఇందుకు వేరే వారి సాక్షాధారాలు అవసరం లేకుండా చంద్రబాబు, రమేష్ ల వీడియోలే రుజువుగా మారాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటీన విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన రమేష్కు చెందిన కరకట్ట ఇంటిలో చేరి నివాసం ఉంటున్నారు. అది నిబంధనలను ఉల్లంఘించి కట్టారని ఎందరు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఇది ప్రభుత్వ భవనమని, లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేశారని, ఇది తప్ప కృష్ణానది కరకట్టపై ఏ భవనాన్ని ఉండనివ్వబోమని, ఆ ప్రాంతం అంతా టూరిజం కింద అభివృద్ది చేస్తామని చెప్పేవారు. అవేవి ఆయన చేయలేదు. పైగా ప్రజా వేదిక పేరుతో మరో అక్రమ నిర్మాణం నిర్మించారు. అది వేరే సంగతి. ఈ క్రమంలోనే రమేష్ కూడా తనకు ఆ భవంతితో సంబంధం లేదని దానిని ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పిన వీడియో కూడా ఉంది. 2019లో అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. అసలు విషయాలన్నీ బయటకు వచ్చేశాయి. సీఐడీ పూర్తి స్థాయి విచారణ జరిపి కొన్ని వ్యవస్తల ద్వారా ఎంత ఆటంకం వచ్చినా, అక్రమాలను తవ్వి తీసింది. ఇది క్విడ్ ప్రోకోగా ఉందని సీఐడీ నిర్దారించడంతో చంద్రబాబు, రమేష్లు మాట మార్చారు. అసలు ఆ నివాసంతో తనకు సంబంధం ఏముందని చంద్రబాబు వాదించారు. ఆయన కేవలం ఒక అద్దె ఇంటిలో ఉన్నారని తెలుగుదేశం నేతలు చెబుతూ వస్తున్నారు. రమేష్ కూడా అది తన ఇల్లని, జప్తు ఎలా చేస్తారని కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు తొలుత చెప్పినట్లు ప్రభుత్వ భవనం అయితే, రమేష్ ఆ మేరకు ఎందుకు డాక్యుమెంట్లు ఇవ్వలేదన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. పోనీ చంద్రబాబు అద్దెకు తీసుకున్నారని అనుకుందామనుకుంటే అందుకు సంబంధించిన రశీదులుకాని పన్ను చెల్లింపు కాని జరగలేదు. చంద్రబాబు అద్దె చెల్లించినట్లు ఆధారాలు లేవట. తనకు జరిగిన వ్యాపార లబ్ది కి గాను రమేష్ ఈ ఇంటిని చంద్రబాబుకు ఇచ్చేశారన్నది అభియోగంగా మారింది. దీంతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ బల్లి మాదిరి అయింది. అందువల్లే చంద్రబాబు దీనిపై గట్టిగా స్పందించలేకపోతున్నారు. కాకపోతే తన కంపెనీ తరపున ఒక రీజాయిండర్ ఇప్పించి ఊరుకున్నారు. చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్కు సంబంధించి ఇలాంటి విషయం ఏదైనా ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎంతగా రెచ్చిపోయి రోజువారి కథనాలు ఇచ్చేవి. కాని అవి ఇప్పుడు తేలుకుట్టిన దొంగల మాదిరి ఈ స్కామ్ జోలికి వెళ్లడం లేదు. ఈ కేసులో లింగమనేని రమేష్ అప్పీల్ కు వెళ్లవచ్చు. సీఐడీ తదుపరి చర్య ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరమే. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ బినామీలుగా భావిస్తున్న ఆయన బంధువుల పేరుతో ఉన్న భూములను కూడా జప్తు చేయడానికి సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే గతంలో అమరావతిలో భూదందా జరగలేదన్నట్లుగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఎంతవరకు హేతుబద్దంగా ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖుల బంధువుల ప్రమేయం కూడా ఈ స్కామ్ లో ఉన్నట్లు ఆరోపణ రావడం ,దానిపై కోర్టు తోసిపుచ్చడం అప్పట్లో సంచలనం అయింది. కాని ఇప్పుడు చంద్రబాబు, లింగమనేని రమేష్, నారాయణ ల ఆస్తుల జప్తునకు ఏసీబి కోర్టు అనుమతించడం ద్వారా అమరావతిలో స్కామ్ జరిగిందన్న విషయాన్ని నిర్దారించినట్లు అవుతుందా? మరో అంశం గురించి కూడా చెప్పుకోవాలి. చిత్తూరులో మూతపడ్డ సహకార డెయిరీని ముఖ్యమంత్రి జగన్ తిరిగి తెరిపించగలగడంలో కృతకృత్యులవుతున్నారు. ఆయన దానికి సంబంధించిన 180 కోట్ల రూపాయల బకాయిలు తీర్చేసి, సంస్థను అమూల్ కంపెనీకి అప్పగిస్తున్నారు. తద్వారా సుమారు 350 కోట్ల పెట్టుబడులు పెట్టించి రైతులకు మేలు చేయ సంకల్పించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కోసం ఈ చిత్తూరు డెయిరీ మూతపడేలా చేశారన్న ఆరోపణ ఉండేది.ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణ అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవారు. ఆమె హెరిటేజ్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. చదవండి: టైమ్స్ నౌ సర్వే: ఇప్పటివరకు ఒక లెక్క.. వైఎస్ జగన్ వచ్చాక మరో లెక్క! తన సొంత కంపెనీ కోసం చిత్తూరు డెయిరీని దెబ్బతీస్తున్నారని ఆరోపించేవారు. సరిగ్గా అలాగే చంద్రబాబు ప్రభుత్వ టైమ్లోనే ఆ డెయిరీ మూతపడింది. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం అమూల్ ద్వారా దానిని తిరిగి తెరిపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీనిపై కూడా చంద్రబాబు స్పందించలేని పరిస్థితి. హెరిటేజ్ సంస్థ మాత్రం ఈ విషయంలో కూడా చంద్రబాబు తరపున ఖండన ఇచ్చింది. దీనిని బట్టే చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్దం చేసుకోవచ్చు. చిత్రం ఏమిటంటే ఒక పక్క చంద్రబాబు టైమ్లో మూతపడ్డ పరిశ్రమలను జగన్ తిరిగి తెరిపిస్తుంటే, దానిపై కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లు దారుణమైన అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు డిఫెన్స్ లో పడినప్పుడల్లా ఏదో ఒక అబద్దపు వార్త వేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఈ ఎల్లో మీడియా ఉంటోంది. కాని వాటిని జనం నమ్మే రోజులు పోయాయని వారు తెలుసుకోలేకపోతున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పంచాయతీ రాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్, పార్లమెంటరీ పోలింగ్ బూత్ ఇంచార్జిలతో వేర్వేరుగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజల దృష్టిలో పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుంది.. న్యాయ పరంగా దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం గతంలో మాదిరిగానే ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే పత్రాలు నుంచి ప్రతి విషయంలోనూ న్యాయ విభాగం సహాయ సహకారాలు అందించాలని కోరారు. వైఎస్సార్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం నెలకు 5000 రూపాయలు స్టైపండ్ ఇస్తుందని, అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వివిధ విభాగాలకు సంబంధించి కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలన్నారు. పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి నేతృత్వంలో న్యాయవిభాగ సమావేశం జరిగింది. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. -
స్క్రిప్ట్ చంద్రబాబుది.. స్పీచ్ పవన్ కల్యాణ్ది: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఏపీ వైపు చూడని సంస్థలు ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ‘‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వాస్తవాలు కనిపిస్తున్నా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఫస్ట్ప్లేస్లో ఉంది’’ అని మంత్రి అన్నారు. ‘‘స్క్రిప్ట్ చంద్రబాబుది.. స్పీచ్ పవన్ కల్యాణ్ది. ఉపవాసాలు చేస్తే సీఎం కాలేరు. ప్రజల మన్ననలు పొందాలి. తాను ఓడిపోతానని పవన్కు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. చంద్రబాబు, పవన్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పేరు సార్ధకం చేసుకున్నాడు. ఒకే రోజు రెండు పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకే సీఎం జగన్ ఆయనకి దత్తపుత్రుడు అని పేరు పెట్టారు. హైదరాబాద్ పారిపోయింది చంద్రబాబు, పవన్ కల్యాణ్లే. సింపతి కోసం పవన్ కల్యాణ్ ప్రాణహాని ఉందని ఆరోపణ చేస్తున్నాడు. చంద్రబాబు వల్లే పవన్కి ప్రాణ హాని ఉండొచ్చు’’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. ‘‘ముద్రగడ పద్మనాభంను చంపేద్దాం అనుకున్న వ్యక్తి చంద్రబాబు. బాబు బిస్కెట్ల కోసం కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. భూముల ధరలు కోసం కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదు. మా విశాఖలో కూడా ఎకరం కొంటె.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు. హైదరాబాద్ కాకుండా బయటకు వెళితే ధర ఎక్కడుంది. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు’’ అని మంత్రి అమర్నాథ్ అన్నారు. -
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
‘విజయ్కుమార్ స్వామి.. రామోజీ వియ్యంకుడి విమానంలోనే వచ్చారు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొన్ని పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపైన, దేవుళ్లపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలు ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు విజయకుమార్ స్వామి గురించి రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నాయి. విజయకుమార్ స్వామిని లాబీయిస్టుగా పోలుస్తూ, లాబీయింగ్కు వాడుకుంటున్నామని దుర్మార్గమైన రాతలు రాస్తున్నారు. అంటే, స్వామిజీలను, దేవుళ్లను వారి స్వార్థ రాజకీయాలకు వాడుకునే దిగజారుడు కార్యక్రమానికి ఎల్లోమీడియాతో పాటు, ఆ పత్రికలు ఎవరినైతే కొమ్ముకాస్తున్నాయో వారే ఈ కథనాలను రాయిస్తున్నారనేది అందరూ గమనిస్తున్నారు. వీరి రాతల యొక్క ముఖ్య ఉద్దేశమేమంటే, జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నపళంగా దిగిపోవాలని కలలు కంటూ, చంద్రబాబును అర్జెంట్గా అధికారంలోకి తీసుకురావాలని.. ఆ తర్వాత దోచుకోవచ్చు, పంచుకోవచ్చనేది వారి ఆరాటంగా కనిపిస్తుంది. ఎల్లోమీడియా నీచమైన రాతల్ని ఖండిస్తున్నాం. ఆ ప్రత్యేక విమానం రామోజీ బంధువుదే కదా.. ఈ సందర్భంగా ఈ అంశంపై నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అసలు విజయకుమార్ స్వామి ఎవరిద్వారా విజయవాడకు వచ్చారు..? ఇక్కడకు ఎందుకు వచ్చారు..? ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు కదా.. ఆ విమానం ఎవరిది..? ఆయన వచ్చిన విమానం రామోజీరావు బంధువు (వియ్యంకుడు) నవయుగ విశ్వేశ్వరరావుదే కదా.. ఆయనతో పాటు విశ్వేశ్వరరావు కొడుకు శశిధర్, విజయకుమార్ స్వామి ఉంది నిజం కాదా..? మరి మీరు.. మార్గదర్శి కేసుల నుంచి బయటపడేందుకే స్వామీజీని పిలిపించారా..? అసలు, రామోజీరావు బంధువు విమానంలో విజయకుమార్స్వామిని ఎందుకు ఇక్కడకు తెచ్చుకున్నారనేది మాకు తెలియదు. కానీ, ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందజేయడాన్ని.. లాబీయింగ్ అని పేరుపెట్టి అదే రామోజీ మీడియాలో కథనాలు రాయడం ఎంత దుర్మార్గమో అందరూ ఆలోచించాలి. అసలు, మీరు విజయకుమార్ స్వామిని విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు..?. మీ మార్గదర్శి కేసుల నుంచి బయట వేయించుకునే కార్యక్రమానికి తెచ్చుకున్నారా..?. ఇదే రామోజీరావు బంధువులు 2017–18లో హైదరాబాద్లో గృహప్రవేశం జరిగితే, విజయకుమార్స్వామి కూడా వచ్చారు. అప్పుడు కూడా నవయుగ విశ్వేశ్వరరావు, శశిధర్తో వచ్చారు కదా..? మరి, అప్పుడు ఎందుకు వచ్చారనుకోవాలి. - మీరు చేసేవన్నీ దైవకార్యాలనుకోవాల్నా..? దానికి సమాధానం చెప్పండి..? ఇంత నిసిగ్గుగా కథనాలు రాస్తారా..? ముఖ్యమంత్రికి స్వామీజీల ఆశీస్సులు ఇప్పిస్తే తప్పేంటి..? నాకు 2007 నుంచి విజయ్కుమార్ స్వామితో పరిచయం ఉంది. నాకు చాలామంది స్వామీజీలు తెలుసు. ఈ విజయకుమార్ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన మంచి భక్తిపరులు. ఎల్లోమీడియా ప్రచురించినట్లు ఆ స్వామివారితో మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత రాష్ట్రపతితోనూ పరిచయాలున్నట్లు అందరికీ తెలిసిందే కదా.. ఆ విధంగా నాకున్న పరిచయంతో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలపాలని తీసుకెళ్లాను. ముఖ్యమంత్రికి స్వామివారి ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందని భావించాను. దానికోసమే నేను ఎంతోమంది స్వామీజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి కలిపిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగానే చినజీయర్స్వామిని, స్వరూపానంద స్వామివారిని, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వాములను, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, కనదుర్గమ్మ దేవస్థానం వేదపండితుల్ని పిలిపించి ఆశీర్వచనాలు ఇప్పించాను. విజయకుమార్ స్వామి గారు విజయవాడకు వస్తున్నారని తెలిసి.. నేను ప్రత్యేకంగా ఆయన్ను రిక్వెస్టు చేసిన మీదట వారు అందుకు అంగీకరించారు. నేను ఆరోజు విజయవాడలో లేనప్పటికీ, ఏర్పాట్లు అన్నీ చేయడంతో స్వామివారు వచ్చి ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించి వెళ్లారు. మీకైతే ఆశీస్సులు.. మాకైతే లాబీయింగా..? స్వామీజీలపై వాళ్లకు నమ్మకం ఉందో లేదో మాకు తెలియదు. మాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందనే నమ్మకంతోనే.. మేం స్వామీజీల ఆశీస్సులు తీసుకుంటాం. మేమేదో లాబీయింగ్ చేస్తున్నామంటున్నారు కదా.. మరి, ఈ రామోజీరావులాంటి వాళ్లు ఏం చేయడానికి విజయకుమార్ స్వామిని రప్పించుకున్నారు. మేము స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే.. దానికి లాబీయింగ్ అని పేరెట్టి దుర్మార్గపు రాతలు రాస్తారా..?. అదే, మీ కోసం స్వామీజీలు వస్తే.. దానికి దైవాశీస్సులు అని పేరుపెట్టి చెప్పుకుంటారా..?. ఎల్లో మీడియా వక్రభాష్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టకముందే.. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి. విజయకుమార్ స్వామి వారు చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు ప్రత్యేక విమానాల్లో ఆయన్ను తెచ్చుకుంటూ ఉంటారు గానీ అది మాకు సంబంధంలేదు. ఆయన మైసూరులో ఉంటారు. 2007 నుంచి ఆయనపై నమ్మకంతో నేను కలుస్తూ ఉంటాను. విజయకుమార్ స్వామి వారంటే ఒక దైవాంశసంభూతులుగా మాకు నమ్మకం. కనుక, ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక రాసిందని, తర్వాతి రోజు మరో పత్రిక కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను. రాజకీయలబ్ధి కోసం నీచకార్యక్రమాలకు పాల్పడవద్దని ఎల్లోమీడియా పత్రికలకు, టీడీపీ నేతలకు హితవు పలుకుతున్నాను. వ్యక్తుల టార్గెట్ గా దర్యాప్తు వివేకానందరెడ్డి హత్యకేసులో ఒక పక్షపాత ధోరణితో సీబీఐ విచారణ జరుగుతున్నట్లు కొన్ని ఆధారాలు, పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ముందునుంచీ అవినాశ్రెడ్డి చెప్పే వాదనలను సీబీఐ పట్టించుకోకపోవడం.. ఎల్లోమీడియా కథనాల ప్రకారం సీబీఐ నడుస్తుందనే అభిప్రాయం ఉంది. ఇది కళ్లముందు జరుగుతున్న వాస్తవం. రాజకీయకోణంలో ఒకరిద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లే సీబీఐ వ్యవహరిస్తుందనేది ఇప్పటికే అవినాశ్రెడ్డి కోర్టు దృష్టికి కూడా తెచ్చారు. ఏదిఏమైనా ఈ కేసులో నిజనిజాలు నిగ్గుతేలాలి. న్యాయవ్యవస్థపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. చదవండి: మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
Fact Check: పోలవరంపై మళ్లీ విషం.. ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు, వక్రీకరణలు, అవాస్తవాల విషపు రాతలతో ‘ఈనాడు’ మళ్లీ రెచ్చిపోయింది. ‘ఏడాదిలోపు 3% పనులే’ అంటూ రాసిన ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం.. ఈ అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్.. గత ప్రభుత్వ విధానాలు, ప్రణాళిక లోపం వలన పోలవరం ప్రాజెక్టుకు కలిగిన సరిదిద్దలేని నష్టాలు, వారి అవినీతి, స్వార్థ ప్రయోజనాలు, తప్పిదాలతో ప్రాజెక్టుపై పడిన 2 వేల కోట్ల రూపాయల అదనపు భారం, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హెడ్ వర్క్స్, ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో అవినీతి చర్యలకు పాల్పడింది. 2013 నుంచి 2016 వరకు పనులు నత్తనడకన నడిచాయి. ఈ లోగా ట్రాన్స్స్ట్రాయ్ సంస్థ తమకు రేట్లు గిట్టుబాటు కావడంలేదని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపాదించగా, ఆ ప్రభుత్వం చేతికి ఎముకలేదనట్లుగా వారు అడిగిందే తడవుగా 2015-16 రేట్లకు ఆమోదం తెలుపుతూ అగ్రిమెంట్ విలువని రూ.4054 కోట్ల నుండి రూ.5386 కోట్లకు పెంచింది. ఈసీపీ నిబంధనలకు విరుద్ధంగా 2015-16 రేట్లకు పెంచి రూ.1332 కోట్ల అనుచిత లబ్ధిని వారికి చేకూర్చుతూ 29.09.2016 న ఉత్తర్వులు జారీ చేసింది. 2015-16 రేట్లు ఇచ్చినా, పనులు నత్తనడకన కొనసాగడంతో అప్పటి ప్రభుత్వం మిగిలిన పనులు చేయడానికి 2015-16 రేట్లతో టెండర్ పిలిచారు. ఈలోగా ఏమి జరిగిందో తెలియని రహస్యం.. కానీ టెండర్ రద్దు చేసి 3 దఫాలుగా మిగిలిన పనులను నామినేషన్ పద్దతిలో నవయుగ కంపెనీకి అప్పగించారు. 1. 27.02.2018 తేదీన రూ. 1244.36 కోట్లు 2. 28.05.2018 తేదీన రూ. 921.87 కోట్లు 3. 11.01.2019 తేదీన రూ. 751.55 కోట్లు మొత్తం రూ. 2917.78 కోట్లు నామినేషన్ పద్ధతిలో నవయుగకి పెంచిన రేట్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 3000 కోట్ల రూపాయల పనిని ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద అప్పగించింది. పై రెండు కంపెనీలు కూడా అస్మదీయులవే. నవయుగ అధికంగా లాభం ఉండే మాస్ కాంక్రీట్ పనులను మాత్రం (స్పీల్ ఛానెల్ కాంక్రీట్, స్పీల్ వే పౌండేషన్ వంటివి) దాదాపు రూ. 1675 కోట్ల పని చేశారు. క్రిటికల్ కాంపొనెంట్లు అయిన రెండు కాఫర్ డ్యామ్ పనులు మాత్రం నత్తనడకన జరిగాయి. ఈలోగా బావరు సంస్థ డీ-వాల్ పూర్తి చేసింది.. కానీ నవయుగ సంస్థ కాఫర్ డ్యామ్ను మాత్రం కట్టలేదు. u/s కాఫర్ డ్యామ్ మధ్యలో వదిలేశారు. తరువాత వచ్చిన వరదలకు ఏం జరిగిందో తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో ఎడమ కాలువ ప్యాకేజీ-5లో మిగిలిన పనిని అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కంపెనీ అయిన పీఎస్కే కంపెనీకి రూ.71 కోట్ల విలువ చేసే పనులను రూ.182 కోట్లకు నామినేషన్ పద్దతిలో అప్పగించారు . పోలవరం డ్యామ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు గత ప్రభుత్వ అవినీతి, అనాలోచిత విధానాల వలన ప్రధాన డ్యామ్ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలు, డీ వాల్ దెబ్బ తినడం, ఈ పాపం టీడీపీదే అనేది జగమెరిగిన సత్యం. ఇది ఖండించలేని వాస్తవం. మరొక ప్రధాన కారణం.. ప్రాజెక్టును సరియైన రీతిలో ఆర్ధిక వనరులు అందక పోవడం.. ఈ పాపం కూడా గత ప్రభుత్వానిదే. 2017-18 రేట్లకు అంచనాల ఆమోదం విషయంవలో 2016లో అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ప్రభుత్వ హయాంలో 2017 కేంద్ర క్యాబినెట్ నోట్లో పోలవరానికి నిధులను మూడు సంవత్సరాల కిందటి 2013-14 ధరల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆర్థిక, జల శక్తి శాఖలు ప్రతిపాదించినప్పుడు అప్పటి ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందా? దాని వలనే కదా 20,398.61 కోట్లు ఇస్తే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారమే కేంద్ర ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కూడా రాష్ట విభజనకు ముందు పెట్టిన ఖర్చు 4730.71 కోట్లను మినహాయించి 15,667.90 కోట్లు మాత్రమే వారు ఇస్తున్నారు. ఈ రాబోయే నేటి విపత్తును ముఖ్యమంత్రి.. ఆనాడు ప్రతి పక్ష నేత హోదాలో అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం జరిగిన తప్పిదాన్ని అప్పుడే అడిగి ఉంటే సరి చేసి ఉండటం జరిగేది అని కూడా వాఖ్యానించారు. ఇప్పుడు పై విషయాలన్ని సీఎం జగన్ అభ్యర్దన మేరకు ప్రధాని చొరవతో ఆర్ధిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పరిశీలనలో ఉన్నాయి. కొంత పురోగతి కూడా సాధించాం. సీఎం జగన్ ఎన్నో సార్లు ప్రధాని, ఇతర ముఖ్యులను కలిసి ఒత్తిడి తేవడం వలన, కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా డీపీఆర్లో వున్న క్వాంటిటీలకు అదనంగా చేసిన కొత్త నిర్మాణాలకు సంబంధించి పెట్టిన ఖర్చులో రూ. 826.18 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఎంతో పోరాటం చేసి ఈ నిధులు 2015-16 ధరల ప్రకారం (రెండు సంవత్సరముల తరువాతి ధరలతో) ఈ ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. ఈ దిశగా ఇది తొలి విజయం మాత్రమే. 2017-18 ధరలతో అన్నీ కాంపొనెంటులకూ రీయింబర్స్ మెంటు నిధులు పొందే దానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రణాళికా ఫలితం: ఈనాడు పత్రిక హెడ్ వర్క్స్లో సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన ఏ పనిని ఈ ప్రభుత్వం చేపట్టలేదో బాధ్యతతో చెప్పాలి. ఈ ప్రభుత్వం సీడబ్ల్యూసీ వారిచే డిజైన్ ఆమోదించబడిన ప్రతి పనిని పూర్తి చేసింది. కానీ గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్లు, స్పిల్ వే డిజైన్లు సిడబ్ల్యూసి చాలా ముందుగానే ఇచ్చినా వారు కట్టలేక, ఎంత నష్టం వాటిల్లిందో తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అత్యంత ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేసి కొన్ని కీలకమైన పనుల్ని ఇప్పటికే పూర్తి చేసింది. స్పిల్ వేను పూర్తి చేయడంతో పాటు దానికి 48 గేట్లు పెట్టింది. గత ఏడాది గోదావరి చరిత్రలో రెండో అతి పెద్ద వరద వచ్చినా సరే, సమర్థవంతంగా వరదను నియంత్రించగలిగింది. స్పిల్ వే పైన అప్రోచ్ ఛానెల్ను, దిగువన వున్న స్పిల్ చానెల్ను, పైలట్ చానెల్ను దాదాపుగా పూర్తి చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ లో 2 గ్యాప్లను పూర్తి చేసింది. ప్రధాన డ్యామ్ లోని గ్యాప్ 3 కాంక్రీటు పనులను పూర్తి చేసింది. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇటీవల వచ్చిన అనూహ్య వరదల కారణంగా ఎగువ కాఫర్ డ్యామ్ దెబ్బ తినకుండా అప్పటికప్పుడు మంత్రితో సహా అధికారులు అందరూ డామ్ సైటులోనే ఉండి ముఖ్యమంత్రితో అనుక్షణం సంప్రదిస్తూ ఒక మీటరు ఎత్తు కూడా పెంచి ఎటువంటి నష్టం జరగకుండా నివారించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రళిణాకా బద్ధంగా ప్రభుత్వం పూర్తి చేసింది. 2. పునరావాసం : పునరావాసం గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి గాని, వారి పత్రికలకు గాని లేనే లేదు అనే విషయాన్ని ఈ గణాంకాలు తేట తెల్లం చేస్తాయి. పునరావాసానికి మొత్తం అంచనా : 21,374 కోట్లు పునరావాస పనులు +41.15 కాంటురు వరకు వేగంగా జరుగుతున్నాయి. జూన్ 2023 లోగా మిగిలిన 9269 పీడీఎఫ్ఎస్ని కూడా పునరావాసం పూర్తి అవుతుంది. దీనికి దాదాపుగా 525 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. పునరావాసంలో వైఫల్యం అని గగ్గోలు పెడుతున్నారే? అసలు వైఫల్యం ఎవరిది. ఐదు సంవత్సరాలలో 484 కోట్లు ఖర్చు పెట్టి 3110 మందికి పునరావాసం కల్పించిన టీడీపీ ప్రభుత్వానిదా, లేక మూడు సంవత్సరాలలో 1677 కోట్లు ఖర్చు పెట్టి 8567 మందికి పునరావాసం కల్పించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదా వైఫల్యం?.. టీడీపీ ప్రభుత్వం పునరావాసం కనీస స్థాయిలో కూడా చేపట్టపోవడంలో ఒకే ఒక కారణం కనిపిస్తోంది. కాలువల పనులు జరగడంలేదంటూ ఆరోపణలు.. ఇక్కడ కొంచెం వివరంగా గత ప్రభుత్వ వైఫల్యం చెప్పుకోవాలి. కుడి కాలువ సామర్ధ్యం మొదటగా 330 క్యూమేక్స్గా డీపీఆర్లో ప్రతిపాదించారు. దివంగత మహానేత వైఎస్సార్ మొదటిగా చేసిన పని ఏమిటంటే, భవిష్యత్తు అవసరాలు మరియు కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ ఇవన్నీ ముందుగానే యోచన చేసి, కాలువ సామర్థ్యాన్ని 499 క్యూమేక్స్ కు పెంచుతూ G.O.Rt No. 765 Dt:- 07-10-2004 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 230 క్యూమేక్స్ నుండి 497 క్యూమేక్స్కు అదే జీవో ద్వారా పెంచారు. ముఖ్యంగా విశాఖపట్నం తాగునీరు, పారిశ్రామిక, వెనుకబడిన ఉత్తరాంధ్ర అవసరాలకై ప్రతిపాదిత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దృష్టి లో పెట్టుకుని వైఎస్సార్ కాలువ సామర్ధ్యాన్ని పెంచారు. 2014 ముందే రెండు కాలువల సామర్ధ్యాలు 499/497 క్యూసెక్కులకు పెంచి పనులు కొనసాగించినా, 2017వ సంవత్సరంలో రెండోపెట్టుబడి అనుమతికి ప్రతిపాదనలు 2010 2011 ధరలతో 16,010 కోట్లకు పొందటం ఒక వైఫల్యం అయితే, కాలువల సామర్ధ్యాలను 2005 డీపీఆర్ ప్రకారం పాత సామర్ధ్యాలకు మాత్రమే అంచనాలు వేయడం గత ప్రభుత్వం ఘోర వైఫల్యంగా పేర్కొనవచ్చు. దీని వలన ఇప్పటికి కూడా కాలువల మీద 499/497 క్యూమేక్స్లకు పెట్టిన ఖర్చును 2005 డీపీఆర్ సామర్ధ్యానికి మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ చెల్లించడం వలన ప్రాజెక్టు ఆర్ధిక వనరుల కూర్పు దెబ్బతిని, నిధుల లభ్యత సమస్యగా మారింది ఈ లోగా ప్యాకేజీలలో పని చేసే చాలా ఏజన్సీలు గత ప్రభుత్వ ప్రణాళిక వైఫల్యం, సహకార లోపం వలన దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ రేట్లకు చేయడానికి అంతగా ఆసక్తి ఎవరూ చూపడం లేదు. పైగా కాలువ పనుల మీద జరిగిన ఖర్చును పీపీఏ రియింబర్స్మెంట్ చేయడం లేదు. దీనికి కూడా ప్రధాన కారణం గత ప్రభుత్వం వారి నిర్వాకం వలనే. 2017 లో కేంద్ర క్యాబినెట్ 2013-14 రేట్లతో ఇరిగేషన్ కాంపొనెంట్కు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పినా, వారు నోరు మెదప కుండా ఉండటం ప్రధాన కారణం. చదవండి: తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం మిగిలి పోయిన ఎడమ కాలువ పనులు ఏవిధంగా పూర్తి చేయాలి అన్న దాని మీద ఆర్ధిక, జలవనరుల శాఖలు కూలంకుషంగా చర్చిస్తున్నాయి. తొందరలోనే ఒక నిర్ణయం దీని మీద తీసుకుంటారు. ముందుగా హెడ్ వర్క్స పూర్తి చేయడం మీదనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దీనికి ఒక రెండు సంవత్సరాలు సమయం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పడుతుంది మిగిలిన ఎల్ఎంసీ పనులు 6 నుండి 12 నెలలోపు పూర్తి చేయవచ్చు అనే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. ఈలోగా 2017-18 ధరల తో ప్రొజెక్టు అంచనాలను ఆమోదం పొందితే, కేంద్ర నిధుల లభ్యత అందుబాటు లోనికి వస్తుంది. హెడ్ వర్క్స్ పనులు పూర్తి అయ్యే లోపుగానే, మిగిలిన కాలువ పనులు పూర్తి చేయగలం 4. ఈ ప్రభుత్వ ధృడ సంకల్పం : ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా PPA/CWC/DDRPలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, జరిగిన తప్పిదాలను సరిచేసే ప్రణాళికను PPA/CWC/DDRPని ఒప్పించి ఆమోదింప చేసింది. ఇది ప్రాజెక్టు పురోగతిలో ఒక కీలక పరిణామం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ఈ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం పూర్తి చేసింది. రెండి డ్యామ్ల మధ్య ఇప్పుడు వరద నీరు చేరదు కాబట్టి , వరదల సమయంలో కూడా ప్రాజెక్టు పనులు అనగా అగాధాలు పూడ్చటం, డయాఫ్రమ్ గోడలు దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రమ్ గోడలు నిర్మించి మెయిన్ డయాఫ్రమ్ వాల్తో అనుసంధానించడం వంటి పనులు నిరాటంకంగా చేసుకునే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. తాత్కాలిక అవరోధాలు తొలగి ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల పరిస్తితులు ఏర్పడినవి. అన్ని నిర్మాణాలు చురుకుగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం జగన్, మంత్రులు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వ పెద్దలు, వారి అస్మదీయుల జేబులోకి అవినీతి వరద ఎలా ప్రవహించినదో అలాగే ప్రాజెక్టును, దాని ఫలితాలతో కలిగే ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టిన విషయాలను అన్ని సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రిక జీర్ణించుకోలేక, ఓర్వలేక ఇంకోసారి విషం చిమ్మి, బురద చల్లే విధంగా ఈ కథనం ప్రచురించింది. -
తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కేంద్రం చెబితే.. వద్దు మాకు ప్యాకేజీ చాలన్నారు చంద్రబాబు. అలా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోమని హామీనిచ్చేశారు. కేంద్రం సరేనని ప్యాకేజీలో భాగంగా పోలవరాన్ని అప్పగిస్తే.. రామోజీరావు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేషన్పై రూ.3,302 కోట్ల విలువైన పనులు కట్టబెట్టేశారు బాబు. పనిలోపనిగా యనమల రామకృష్ణుడి బావ మరిదికీ కొంత పంచారు. ఇక అందిన ప్యాకేజీలో దత్తపుత్రుడు, తోక పత్రికకు వాటా చేరిపోయింది. కాబట్టే... ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వాళ్లు ప్రశ్నించలేదు. ఒక్క ఒక్కరం ముక్కా రాయలేదు. ఇదీ.. దోచుకో– పంచుకో–తినుకో అంటే! మూసేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ గానీ, నడుస్తున్న మార్గదర్శి చిట్స్ గానీ ఏ నిబంధననూ పాటించవు. కోట్లకు కోట్లు డిపాజిట్లు తీసుకున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు క్రిమినల్ కేసులు నడుస్తుండగా.. రూ.2వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఏకంగా సంస్థనే మూసేశారు. ఇక చిట్స్ సంస్థ బిడ్ పాడుకున్న వాళ్లనూ ష్యూరిటీల పేరిట నెలలకు నెలలు తిప్పుతుంది. అక్రమంగా డిపాజిట్లూ తీసుకుంటోంది. ఇలా ఏం చేసినా... చంద్రబాబు ప్రశ్నించరు. ముఖ్యమంత్రిగా ఉన్నా దాని జోలికెళ్లరు. ఇది కాదూ.. డీపీటీ అంటే!! ముఖ్యమంత్రిగా షాపుర్జీపల్లోంజీ సంస్థకు వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు కట్టబెట్టారు నారా వారు. ఆ సంస్థను పిలిచి... పార్టీకి కాదు, మా ‘బాబు’ గారికి ఫండ్ కావాలన్నారు బాబు పీఏ శ్రీనివాస్. డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వందల కోట్లు ప్రవహించాయి. వాటిలో కొంత రామోజీ తనయుడి వియ్యంకుడి కంపెనీకీ (ఆర్వీఆర్ ఇన్ఫ్రా) చేరాయి. అక్కడి నుంచి చంద్రబాబు జేబులోకీ కొంత మళ్లాయి. దుబాయ్లో ఆస్తులు కూడబెట్టిన బాబు... అక్కడా కొంత క్యాష్ తీసుకున్నారు మరి!. ఇదంతా సంబంధిత వ్యక్తులు స్వయంగా సంతకం చేసిన ఇన్కమ్ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లోనిదే!. కానీ దీని గురించి రామోజీ, ఆయన తోకపత్రిక పెన్నెత్తితే ఒట్టు. ఇదీ.. తోడు దొంగల డీపీటీ అంటే!!. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్నెట్ వరకూ దోచుకో– పంచుకో– తినుకో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన దుష్ట చతుష్టయం... ఇపుడో కొత్త రాగం ఎంచుకుంది. అధికార పారీ్టయే ఇసుక తవ్వకాల్లో ‘దోచుకో, పంచుకో, తినుకో’ అన్నట్లుగా వ్యవహరిస్తోందనే కథనాలకు దిగింది. మరి ఇందులో నిజం వీసమెత్తయినా ఉందా? బాబు హయాంలో ఇసుక విషయంలో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరి హయాంలో దోపిడీ జరిగింది? ఎవరు పంచుకున్నారు? ఎవరు తిన్నారు? ఒకసారి చూద్దాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. పేరుకే ఇసుక ఉచితం!!. కానీ సామాన్యులు ఒక్కరికైనా ఫ్రీగా అందితే ఒట్టు!. అంతా బాబు కనుసన్నల్లోనే. అంతా టీడీపీ నేతల చేతుల్లోనే. ఉచితం పేరిట ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాకుండా వేల కోట్లు దోచేసి.. పంచుకుతినేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వకుండా... ప్రభుత్వానికి కూడా రూపాయి రాకుండా ఇసుకను తవ్వేయటం దారుణమని భావించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అందుకే జాతీయస్థాయిలో టెండర్లు పిలిచారు. అలా టెండర్లు పిలిచే బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీకి అప్పగించారు. బహిరంగ టెండర్లలో ఇసుక తవ్వి, విక్రయించే కాంట్రాక్టును జయప్రకాశ్ గ్రూపునకు చెందిన ‘జేపీ పవర్ వెంచర్స్’ దక్కించుకుంది. దీనికోసం ఇది ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలి. అంటే... ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు. గతంలో ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ప్రజలకు కూడా ఇసుక ఫ్రీగా దొరకనప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? ఇంకెవరు... చంద్రబాబు, రామోజీ, తోకపత్రిక యజమాని, దత్తపుత్రుడు. ఈ చతుష్టయమే మొత్తం ఇసుక వ్యాపారాన్ని శాసించింది. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు కట్టిన ఇంటి వెనకాల... రాత్రీపగలూ విరామం లేకుండా ఇసుక లారీలు తిరిగేవంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు! అక్రమంగా తవ్వేస్తున్నారని, ఉచితం పేరిట తినేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అడ్డుకోబోయిన నాటి ఎమ్మార్వో వనజాక్షిని... ఏకంగా జుట్టుపట్టుకుని ఈడ్చేశాడా ఎమ్మెల్యే. అంత దారుణం జరిగినా ‘ఈనాడు’ వ్యతిరేకించలేదు. మనవాడే కదా అని కిమ్మనకుండా ఊరుకున్నారు రామోజీ, ఆయన తోక మీడియా. ఇక చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఆ ఎమ్మార్వోను పిలిచి, ఎమ్మెల్యేపై ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా ‘రాజీ’ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇదీ.. బాబు, ఆయన బృందం స్థాయి. ఇసుకను ఉచితంగా ఇస్తూ రామోజీరావు చెప్పినట్లుగా చంద్రబాబు మహా యజ్ఞమే చేసి ఉంటే... ఈ దౌర్జన్యాలెందుకు? ఈ దొంగ తవ్వకాలెందుకు? ఒకవేళ ఇసుక తవ్వకాలు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటే జాతీయ స్థాయి టెండర్లలో రామోజీరావు కూడా పాల్గొని ఉండొచ్చుగా? ఎందుకు పాల్గొనలేదు?!. మరి ఇప్పుడెందుకీ కడుపు మంట? తమ అక్రమాలకు ఇపుడు ఫుల్స్టాప్ పడిందనేనా? వాళ్ల జేబుల్లోకి పోయిన సొమ్ము ఇపుడు నేరుగా ప్రభుత్వానికి అందుతోందనా? ఇసుక తవ్వకాలపై మరీ పనిగట్టుకుని అపోహలు రేకెత్తించేలా తరచూ రామోజీ రాస్తున్న కథనాల్లో నిజమెంత? ఒకసారి సబ్కాంట్రాక్టరుగా టర్న్కీని తప్పించారంటూ బాధ!. మరోసారి టర్న్కీ సంస్థ దోచేస్తోందని శివాలు. ఇంకోసారి ఇసుక దొరకటం లేదని బాధ! మరోసారి ఇసుక విచ్చలవిడిగా విక్రయంచేస్తున్నారని బాధ!. వీటన్నిటి వెనకా అసలు బాధ మాత్రం... తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే!. 2 కోట్ల టన్నుల ఇసుకతో... రూ.1800 కోట్లు ఎలా సాధ్యం? ‘ఈనాడు’ వాదన ఎంత ఘోరమంటే... రాష్ట్రంలో ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారని... ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని శుక్రవారంనాటి వార్తలో రామోజీ మండిపడ్డారు. కానీ అదే వార్తలో... తూర్పు గోదావరి జిల్లాను సబ్కాంట్రాక్టుగా తీసుకున్న వ్యక్తి... వ్యాపారం సరిగా జరగటం లేదని, తాను చెల్లించాల్సింది తగ్గించమన్నాడట. కుదరదనటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా రాసేశారు. ఎడాపెడా తవ్వేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నపుడు... వ్యాపారం జరగకుండా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందా? ఏమనుకోవాలి రామోజీ మీ తెలివిని? మరో వాదన చూద్దాం. ఇసుకపై రూ.1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి మిగిలిన సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారనేది ‘ఈనాడు’ కథ. నిజానికి రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. దీనికి అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక టన్ను ఇసుకను ఓపెన్ రీచ్లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అంటే.. మొత్తంగా రూ.900 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో లభ్యమయ్యే ఇసుకే 2 కోట్ల టన్నులైతే దానికి రెండు రెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలిసి కూడా జేపీ సంస్థ నుంచి అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి వైఎస్సార్ సీపీ నాయకులెందుకు సబ్కాంట్రాక్టులు తీసుకుంటారు? ఒకటీఅరా చోట్ల తీసుకున్నా అంత ఎక్కువ మొత్తం ఎలా చెల్లిస్తారు? ఇవన్నీ కాస్త ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతాయి కదా రామోజీ? అక్రమ రవాణాపైనా అబద్ధాలేనా? యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అబద్ధాలన్నిటినీ రాసి పారేసింది ‘ఈనాడు’. వాస్తవానికి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనికోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక ఎక్కువ రేట్లకు విక్రయించరాదన్న ఉద్దేశంతో ప్రతి వారం పత్రికల్లో స్థానికంగా విక్రయించే రేటును ప్రకటనల రూపంలో ప్రచురిస్తోంది. అక్కడే... ఒకవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే ‘సెబ్’ నెంబరుకు కాల్ చెయ్యవచ్చంటూ ఆ ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నారు. ఇక వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాలు, ఎక్కువ ధరలకు విక్రయించిన ఘటనలు జరిగితే సెబ్ తక్షణం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేసులు కూడా పెడుతోంది. ఇదిగో... ఈ చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందుతోంది. మరి ఇసుక విధానం ఇంత పారదర్శకంగా ఉన్నపుడు ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ ఎలా అవుతుంది రామోజీ? అబద్ధమైనా అతికినట్లుండాలి కదా? బాబు అక్రమాలకు... ఎన్జీటీ 100 కోట్ల జరిమానా చంద్రబాబు హయాంలో ఇసుక విధానం ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునలే తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. సాక్షాత్తూ తన ఇంటి పక్కనే కృష్ణా నదిని తొలిచేస్తూ టీడీపీ నేతలు ఇసుకను తరలించడాన్ని ప్రోత్సహించారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల లారీలు తన ఇంటి మీదుగానే అక్రమంగా తరలిపోతున్నా... వాటా వచి్చందో లేదో చూసుకున్నారు తప్ప పర్యావరణానికి జరుగుతున్న డ్యామేజీని ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపి... అక్రమాలు ముమ్మాటికీ నిజమని తేల్చింది. టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. విచిత్రమేంటంటే జాతీయ స్థాయిలో బాబు ఇసుక మాఫియా గురించి బట్టబయలైనా... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ ఒక్క అక్షరం కూడా రాయటానికి పూనుకోలేదు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగినా... వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుకను కొనుక్కోవాల్సి వచి్చనా ఇప్పుడు రాసిన తరహాలో రామోజీ ఎన్నడూ ఒక్క వార్త కూడా రాయలేదెందుకు? ఇసుక లారీలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా... టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఎందుకు ప్రశి్నంచలేదు? తమ వాటా తమకు అందేసిందనా? అది కదా... అసలైన డీపీటీ!! సబ్ కాంట్రాక్టులు ఎవరికివ్వాలో చెప్పగలమా? వాస్తవానికి టెండర్లలో పాల్గొని దక్కించుకున్న కాంట్రాక్టరు... ఆ తరవాత టెండరు నిబంధనలను పాటిస్తూ ఎవరికి సబ్కాంట్రాక్టుకు ఇచ్చుకున్నా, తనను అలా చేయకుండా నిలువరించటం కష్టం. సబ్కాంట్రాక్టు ఎవరికివ్వాలన్నది కాంట్రాక్టరు ఇష్టం. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఇదే పద్ధతి. పోనీ చంద్రబాబు హయాం చూసుకున్నా ఇదే తీరు కదా? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్కు ఇస్తే... ఆ శ్రీనివాస్ సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. మరి అప్పుడెందుకు కలమెత్తలేదు రామోజీరావు గారూ? అసలు నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. చదవండి: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దోపిడీకి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఇసుక పాలసీపై మరోసారి 'ఈనాడు' పత్రిక అసత్యాలు, అభూత కల్పనలతో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 'దోచుకో... పంచుకో... తినుకో...’ అనే శీర్షికతో ‘ఈనాడు’ పత్రిక పూర్తి అవాస్తవాలతో కూడిన కథనం రాశారని, వాస్తవాలను వక్రీకరిస్తూ... అబద్దాలతో కూడిన ఆరోపణలను తమ పత్రికలో ప్రచురించారన్నారు. గతంలో జేపీ, టర్న్కీ సంస్థలపై పదేపదే తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు, సిండికేట్లు అంటూ మరోసారి ఊహాత్మక ఆరోపణలతో, కట్టుకథలతో వార్తను ప్రచురించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇదే.. గత ప్రభుత్వంలో ప్రారంభంలో మహిళా సంఘాలకు ఇసుక ఆపరేషన్స్ను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించింది. తరువాత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వ్యక్తుల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. అటు ప్రభుత్వానికి ఐదేళ్లలో రావాల్సిన దాదాపు రూ.3825 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ సొమ్ము ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే మరోవైపు ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దం పట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కా పత్రం లేకుండా విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ మొత్తం విధానాన్ని మార్చేందుకు సీఎం జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా.. టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ను దక్కించుకున్న జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు సంస్థ ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు రెవెన్యూగా చెల్లిస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్లలో రూ.475 కి విక్రయిస్తున్నారు. అలాగే రీచ్లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, ఇసుక కొనుగోళ్లు రవాణాలో ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించాము. వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా సులభతర విధానాన్ని తీసుకువచ్చాం. ఎప్పటికప్పుడు తనిఖీలు ప్రతినెలా జేపీ సంస్థ తమకు అప్పగించిన రీచ్లకు గానూ ఎంత పరిమాణంలో పర్యావరణ అనుమతులు పొందింది, ఎంత మేర ఇసుక తవ్వకాలు చేసింది, ఎంత మేర విక్రయాలు చేసిందో గనులశాఖకు నివేదిస్తుంది. గనులశాఖ అధికారులు దీనిని పరిశీలించిన తరువాతే తరువాత తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం దాటి ఇసుకను పొరుకు రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం జిఓ నెం.71 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. గనులశాఖ రీజనల్ స్వ్కాడ్స్, ఎస్ఇబి కూడా దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పనికట్టుకుని తప్పుడు కథనాలు.. ఇంత పకడ్భందీగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే... ఈనాడు పత్రిక పనికట్టుకుని వరుసగా తప్పుడు కథనాలను ప్రచురించడం బాధాకరం. ఈ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో బుదరచల్లే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రిక వండి వారుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలే సిండికేట్లుగా మారి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఏ సమాచారంతో ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది? రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంది. దానికి అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇసుక కొరత అనేది లేదు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు.. వర్షాకాలం కోసం కూడా ముందుగానే డిపోల్లో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నాం. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు గానూ రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. ఈనాడు పత్రిక మాత్రం ఏకంగా ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయం వస్తోందని ఏ లెక్కల ప్రకారం చెబుతోంది? పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జిఓ 71 ని జారీ చేసి, దానిని అమలు చేస్తోంది. అటువంటప్పుడు పొరుకు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు పత్రిక ఆరోపణలు చేస్తోంది ఈనాడు పత్రిక చేసిన ఆరోపణల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతే, రాష్ట్రంలో అవసరాలకు ఇసుక కొరత ఏర్పడి ఉండేది కాదా? ఏ రీచ్లో అయినా కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఈనాడు పత్రిక తన కథనంలో రాసినదంతా అసత్యాలు అని అర్థమవుతోంది. ‘ఈనాడు’ రాతలకు అర్థం ఉందా? ప్రతి రీచ్ లోనూ పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ఇసుక పరిమాణం, రేటు కూడా ఖరారు అయిన తరువాత దానిపై వచ్చే ఆదాయం కూడా ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇవ్వన్నీ తెలిసి కూడా జిల్లాల్లో రీచ్ ల వారీగా అత్యధిక రేట్లకు ఇసుక తవ్వకాలు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తారా? జిల్లాల వారీగా కోట్ల రూపాయల రేట్లను ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారు. వారి నుంచి ముఖ్య నేతలు లక్ష్యాలు విధించి మరీ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారనే రాతలకు అర్థం ఉందా? జేపీ సంస్థ నిబంధనల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తాలను నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తోంది. అన్ని రీచ్ లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు ఇసుక ఆపరేషన్స్ ఎలా చేస్తారు? నెలకు జిల్లాకు రూ.150 కోట్లు ఎలా వసూలు చేస్తారు? దానిని హైదరాబాద్ లోని ముఖ్య నేతలకు ఏ విధంగా చెల్లిస్తారు? ఊహలను వార్తలుగా రాస్తూ... ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ.... రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఇసుక పేరుతో పదేపదే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా కనీసం వివరణ కూడా కోరలేదు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఈనాడు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
అసెంబ్లీ సాక్షిగా వీడియోలతో వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్ను కోరారు. చదవండి: జెండా పవన్ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్నాథ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement