-
గెలుపు దిశగా శ్రీలంక
సిల్హెట్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 119/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 110.4 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ధనంజయ డిసిల్వా (108; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కామిందు మెండిస్ (164; 16 ఫోర్లు, 6 సిక్స్లు) అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్లోనూ శతకాలు బాది చరిత్ర పుటల్లోకి ఎక్కారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో 1974లో న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా బ్యాటర్లు ఇయాన్ చాపెల్ (145, 121), గ్రెగ్ చాపెల్ (247 నాటౌట్, 133)...2014లో అబుదాబిలో ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు మిస్బా ఉల్ హక్ (101, 101 నాటౌట్), అజహర్ అలీ (109, 100 నాటౌట్) ఈ ఘనత సాధించారు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
Ind vs Eng 1st Test Hyd: మొదటి టెస్టు మన చేతుల్లోకి...
భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఊహించిన దిశలోనే సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్ను కట్టడి చేసిన టీమిండియా రెండో రోజు తమ బ్యాటింగ్ సత్తా చూపించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చక్కటి అర్ధసెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ సమయోచిత సహకారం జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాయి. శుక్రవారం 3.47 రన్రేట్తో 87 ఓవర్లలోనే 302 పరుగులు సాధించిన టీమిండియాకు టెస్టుపై పట్టు చిక్కింది. పేలవ బౌలింగ్తో భారత్ను నిలువరించడంలో విఫలమైన ఇంగ్లండ్ ఇప్పటికే దాదాపుగా చేతులెత్తేసింది. రెండో రోజు ఒక రనౌట్ను మినహాయిస్తే ఆ జట్టు ఐదు వికెట్లే తీయగలిగింది. మరో మూడు వికెట్లతో భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉండగా... ఇంగ్లండ్ ఎంతవరకు పోరాడుతుందనేది చూడాలి. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ బలంతో భారత జట్టు ఇంగ్లండ్పై తొలి టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (155 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... కోన శ్రీకర్ భరత్ (81 బంతుల్లో 41; 3 ఫోర్లు), అక్షర్ పటేల్ (62 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇప్పటికే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉండగా... క్రీజ్లో ఉన్న జడేజా, అక్షర్ ఎనిమిదో వికెట్కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్లో భారత్ ఐదు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా... మూడింటిలో జడేజా ఉన్నాడు. భారత్ టాప్–5 బ్యాటర్లంతా దూకుడుగా ఆడబోయి అటాకింగ్ షాట్లకే వెనుదిరగడం విశేషం. సమష్టి బ్యాటింగ్తో... ఓవర్నైట్ స్కోరు 119/1తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్లు) వికెట్ కోల్పోయింది. క్రీజ్లో ఉన్నంత సేపు ఇబ్బందిగానే కనిపించిన శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే రాహుల్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 64 పరుగులు జోడించారు. శ్రేయస్ భారీ స్కోరు చేయడంలో విఫలం కాగా... 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. వుడ్ ఓవర్లో అతను కొట్టిన మూడు ఫోర్లు హైలైట్గా నిలిచాయి. రేహన్ ఓవర్లో రాహు ల్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే అతను సెంచరీ చాన్స్ను పోగొట్టుకున్నాడు. రాహుల్ పెవిలియన్కు చేరిన సమయంలో భారత్ 42 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. దాంతో చివరి వికెట్ల తీయగల మని ఇంగ్లండ్కు ఆశ కలిగింది. కానీ జడేజా వాటిని వమ్ము చేశాడు. ముందుగా భరత్తో, ఆ తర్వాత అక్షర్ పటేల్తో అతను రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆంధ్ర ఆటగాడు భరత్ పెద్ద స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ చేశాడు. జడేజాతో సమన్వయలోపంతో అశ్విన్ (1) రనౌట్ కావడం ఒక్కటే కాస్త నిరాశపర్చింది. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ అక్షర్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు. హార్లీ వేసిన చివరి ఓవర్లో అక్షర్ వరుసగా 4, 6, 4 బాది రోజును ముగించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) రూట్ 80; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (సి) డకెట్ (బి) హార్లీ 23; రాహుల్ (సి) రేహన్ (బి) హార్లీ 86; శ్రేయస్ (సి) హార్లీ (బి) రేహన్ 35; జడేజా (బ్యాటింగ్) 81; భరత్ (ఎల్బీ) (బి) రూట్ 41; అశ్విన్ (రనౌట్) 1; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 35; ఎక్స్ట్రాలు 15; మొత్తం (110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 421. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–159, 4–223, 5–288, 6–356, 7–358. బౌలింగ్: వుడ్ 13–0–43–0, హార్లీ 25–0–131–2, లీచ్ 25–6–54–1, రేహన్ 23–3–105–1, రూట్ 24–2–77–2. -
IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఆ జట్టు తొలిసారి ఓ టెస్ట్ మ్యాచ్లో ఏకైక స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగింది. హైదరాబాద్ టెస్ట్లో ఇంగ్లండ్.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడినే బరిలోకి దించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మ్యాచ్లో వుడ్ను బరిలోకి దించినా, తొలి రోజు ఆటలో అతనిచే కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించింది. తొలి రోజు ఇంగ్లండ్ మొత్తంగా 23 ఓవర్లు వేయగా.. అందులో 21 ఓవర్లు స్పిన్నర్లు టామ్ హార్ట్లీ (9), జాక్ లీచ్ (9), రెహాన్ అహ్మద్లే (3) షేర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇలా ముగ్గురు స్పిన్నర్లతో టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగడం కూడా చాలా అరుదు. హైదరాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఆటను బట్టి చూస్తే ఇంగ్లండ్ అంచనా కరెక్టే అయినప్పటికీ.. భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన స్టోక్స్ వికెట్ సహా రెండు వికెట్లు తీయడం విశేషం. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న (జనవరి 25) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ స్టోక్స్ (70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 20, బెన్ డకెట్ 35, ఓలీ పోప్ 1, జో రూట్ 29, బెయిర్స్టో 37, ఫోక్స్ 4, రెహాన్ అహ్మద్ 13, టామ్ హార్ట్లీ 23, మార్క్ వుడ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (76), శుభ్మన్ గిల్ (14) క్రీజ్లో ఉన్నారు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
భారత్ను ఇంగ్లండ్ ఆపతరమా!
సొంతగడ్డపై భారత జట్టు 2012లో చివరిసారిగా, అదీ ఇంగ్లండ్ చేతిలో ఓడింది... అయితే ఆ తర్వాత ఏ ఒక్క టీమ్ కూడా మన జట్టుతో తలపడి పైచేయి సాధించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే టీమిండియా వరుసగా 16 సిరీస్లలో విజయం సాధించగా ఇందులో 7 క్లీన్స్వీప్లు ఉన్నాయి. రెండుసార్లు ఆస్ట్రేలియా మాత్రమే సిరీస్ను ‘డ్రా’ చేసేందుకు కాస్త చేరువగా రాగలిగింది. నాటినుంచి ఇక్కడ ఆడిన 44 టెస్టుల్లో భారత్ మూడింటిలో మాత్రమే ఓడిందంటే మన బలం, బలగం ఏమిటో అర్థమవుతుంది. ఇంగ్లండ్ కూడా ఇక్కడ ఆడిన గత రెండు టెస్టు సిరీస్లలో భారత్ చేతిలో 0–4, 1–3తో చిత్తుగా ఓడింది... ఇలాంటి స్థితిలో భారత జట్టు మరోసారి ప్రత్యర్థిని పడగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మన మేనేజ్మెంట్ వ్యాఖ్యలు చూస్తే పూర్తి స్థాయిలో స్పిన్ పిచ్లే తయారు కావడం ఖాయం. మరోవైపు గత కొంతకాలంగా దూకుడైన ఆటతో ‘బజ్బాల్’ అంటూ సిద్ధమైన ఇంగ్లండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల భారీ సిరీస్కు రంగం సిద్ధమైంది. గత దశాబ్దకాలంలో మా జట్టుకు ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉన్నది వాస్తవమే అయినా అది ఈ సిరీస్ విజయానికి పనికి రాదు. పరిస్థితులకు తగినట్లుగా అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే. ఆఖరిసారిగా ఇంగ్లండే మమ్మల్ని ఇక్కడ ఓడించింది. మేం అజేయులం ఏమీ కాదు. అలాంటి భ్రమలేవీ లేవు. కాబట్టి ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా ఓటమి ఎదురవుతుంది. ఎదుటివారి బలబలాలకంటే మన జట్టు వ్యూహం గురించి స్పష్టత ఉండాలి. దానిని అమలు చేయాలి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మేమందరం ఆడాం కాబట్టి ఎలా ఆడాలో సొంత ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలి. టెస్టుల్లో ఒత్తిడిని అధిగమించడమే పెద్ద సవాల్. బరిలోకి దిగి పూర్తి సత్తాను ప్రదర్శించాలి. ఎప్పటికీ సీనియర్లపైనే ఆధారపడలేం కదా. కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. లేదంటే వారు ఎప్పుడు ఆడతారు. అందుకే పటిదార్ను ఎంచుకున్నాం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సాక్షి, హైదరాబాద్: భారత గడ్డపై మరో పెద్ద జట్టుతో టెస్టు సిరీస్కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టెస్టులో ఇరు జట్లు తలపడతాయి. బలాబలాలు, రికార్డుపరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ శర్మ జట్టుదే పైచేయిగా కనిపిస్తుండగా... గత కొంతకాలంగా మార్పులతో కనిపిస్తూ వచ్చిన ఇంగ్లండ్ను పూర్తిగా తక్కువ చేయలేం. ఏ జట్టు గెలిచినా సిరీస్లో శుభారంభం చేస్తే ఆపై దాని ప్రభావం కనిపించడం ఖాయం. కోహ్లి లేకుండా... భారత్కు సంబంధించి తుది జట్టు విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. దక్షిణాఫ్రికాతో కేప్టౌన్లో ఆడిన టీమ్ నుంచి సహజంగానే స్వదేశంలో మార్పులు ఖాయం. బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్ల స్థానాల్లో ఇద్దరు స్పిన్నర్లు వస్తున్నారు. సీనియర్ ఆటగాడు అఅశ్విన్ న్ బరిలోకి దిగడం ఖాయం. అఅశ్విన్ న్–జడేజాల స్పిన్ జోడీ చెలరేగితే ఇంగ్లండ్ ఏమాత్రం నిలబడగలదనేది ఆసక్తికరం. గత దశాబ్దకాలంలో వీరిద్దరు సొంతగడ్డపై ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉంది. కెప్టెన్ రోహిత్ కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా బ్యాటింగ్ను దృష్టిలో పెట్టుకునే అక్షర్కే ప్రాధాన్యత ఉంది. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటారు. కెరీర్లో 23 టెస్టులు ఆడిన సిరాజ్కు తన సొంత మైదానంలో ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఆరంభంలో వీరిద్దరు ప్రభావం చూపించగలరు. స్టార్ బ్యాటర్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కావడం అభిమానులను నిరాశపర్చేదే. అయితే అతను లేకపోవడం వల్ల బ్యాటింగ్లో ఎంపిక సమస్య లేకుండా పోయింది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతారు. శుబ్మన్ గిల్ టెస్టుల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కోహ్లి స్థానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ (కేఎస్) భరత్ జట్టులోకి వస్తాడు. రజత్ పటిదార్ను ఎంపిక చేసినా... తుది జట్టులో చోటు కష్టమే. మన బ్యాటర్లు భారీ స్కోరు అందిస్తే ఇంగ్లండ్ పని పట్టడం బౌలర్లకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో... మ్యాచ్కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. స్పిన్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని ముగ్గురు స్పిన్నర్లకు అవకాశమిచ్చి ఒకే ఒక పేసర్తో బరిలోకి దిగుతోంది. నాణ్యమైన స్పిన్నర్లు కాకపోయినా... అందుబాటులో ఉన్నవారి నుంచే ఎంచుకోక తప్పలేదు. 35 టెస్టుల అనుభవం ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు. కానీ లెగ్స్పిన్నర్ రేహన్ ఒకే ఒక టెస్టు ఆడగా, మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్లీకి ఇదే తొలి టెస్టు కానుంది. అదనంగా జో రూట్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. ఇంగ్లండ్ స్పిన్నర్లు మన బ్యాటింగ్ను ఏమాత్రం నిలువరించగలరనేది సందేహమే అయినా... స్పిన్తో కనీసం ప్రయత్నమైనా చేసేందుకు ఆ జట్టు సిద్ధమైంది. సీనియర్ అండర్సన్ను కాకుండా మార్క్ వుడ్ రూపంలో ఏకైక ఫాస్ట్ బౌలర్గా ఎంచుకుంది. బ్యాటింగ్లో రూట్, బెయిర్స్టోలపై ప్రధానంగా ఆ జట్టు ఆధారపడుతోంది. ఓలీ పోప్ కూడా మెరుగైన బ్యాటరే అయినా... క్రాలీ, డకెట్ ఎలాంటి ఆరంభం ఇస్తారో చూడాలి. స్టోక్స్ బ్యాటింగ్లో ధాటిని ప్రదర్శించాలని జట్టు కోరుకుంటోంది. ముఖ్యంగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ‘బజ్బాల్’ అంటూ దూకుడైన తరహా శైలితోనే టీమ్ సఫలమైంది. అయితే పూర్తి భిన్నమైన భారత పిచ్లపై అలాంటి మంత్రం ఎలా పని చేస్తుందో చూడాలి. ఈ జోరులో జట్టు కుప్పకూలిపోయే ప్రమాదమూ ఉంది. పిచ్, వాతావరణం ఉప్పల్ పిచ్ పొడిగా కనిపిస్తోంది. మరో మాటకు తావు లేకుండా స్పిన్కు అనుకూలించడం ఖాయం. అయితే అది ఎంత తొందరగా మొదలవుతుందనేదే ఆసక్తికరం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్కే మొగ్గు చూపుతుంది. తుది జట్లు భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి, గిల్, శ్రేయస్, కేఎల్ రాహుల్, జడేజా, భరత్, అఅశ్విన్ న్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, ఫోక్స్, వుడ్, రేహన్, హార్లీ, లీచ్. 4 ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు 5 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్తో 2010లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... తర్వాతి నాలుగు మ్యాచ్లలో వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్లపై భారీ విజయాలు సాధించింది. షోయబ్ బషీర్కు వీసా మంజూరు లండన్: భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు. ఈ వారాంతంలో భారత్కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్కు సర్వం సిద్దం..ఇరు జట్ల ప్రాక్టీస్
భాగ్యనగరం వాకిట్లో క్రికెట్ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆటతీరుతో కనువిందు చేయడానికి ‘సై’ అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు టెస్టుల్లో గెలుపొంది, ఒక టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిద్దాం. కోహ్లి లేడు.. వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరం కావడం తెలుగు క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్తో... జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వాడివేడి పేస్తో..అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ టి20 తరహా దూకుడైన ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై అదే జోరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్ బృందంలో బెన్ స్టోక్స్, జో రూట్, బెయిర్స్టో, ఒలీ పాప్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. లోకల్ స్టార్ సిరాజ్ రె‘ఢీ’.. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ‘లోకల్ స్టార్’ మొహమ్మద్ సిరాజ్ సొంత మైదానంలో తొలి టెస్టు ఆడటం ఖాయమైంది. ఇప్పటి వరకు సిరాజ్ 23 టెస్టులు ఆడాడు. ఇందులో 6 టెస్టులు (చెన్నై, అహ్మదాబాద్, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, ఇండోర్) భారత గడ్డపై, మిగతా 17 టెస్టులు విదేశాల్లో ఆడాడు. వ్యూహ రచనలో జడేజా, అశ్విన్.. టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తొలి టెస్ట్లో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరిద్దరు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంగ్లండ్ను రెండు ఇన్నింగ్స్ల్లో మడతపట్టేందుకు వీరిద్దరూ కఠోరంగా సాధన చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం.. భారత్ను స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా తెలుసు. అందుకే వారు మూడు రోజుల ముందుగానే తొలి టెస్ట్ వేదిక అయిన హైదరాబాద్కు చేరుకుని కఠోరంగా సాధన చేస్తున్నారు. అనుభవమే ఆయుధంగా.. భారత్పై ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న వెటరన్ పేసర్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్లో టీమిండియాను ఇబ్బంది పెట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆండర్సనే అని చెప్పాలి. అతని అనుభవం ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడతారో లేక ఆండర్సన్ కెరీర్కు చేదు అనుభవంతో ముగింపు పలుకుతారో వేచి చూడాలి. నాడు ప్లేయర్గా... నేడు కోచ్గా.. 2010లో ఉప్పల్ స్టేడియంలోనే భారత్తో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ జట్టు తరఫున ‘డబుల్ సెంచరీ’ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్గా మళ్లీ హైదరాబాద్కు రావడం విశేషం. -
కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ చేయడు: రాహుల్ ద్రవిడ్
త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సిరీస్లో రాహుల్ వికెట్కీపింగ్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. రాహుల్ కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అందులో భాగంగానే జట్టులో అదనంగా ఇద్దరు వికెట్కీపర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఇటీవలికాలంలో రాహుల్ ఫార్మాట్లకతీతంగా వికెట్కీపర్ బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో మాత్రం ప్రయోగాలు చేయలేమని అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున బ్యాటింగ్ పరంగానే రాహుల్పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే అతనిపై వికెట్కీపింగ్ భారాన్ని మోపే సాహసం చేయలేమని వివరణ ఇచ్చాడు. వికెట్కీపింగ్ బ్యాటర్ స్థానం కోసం కేఎస్ భరత్, దృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొందని, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తామని తెలిపాడు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదని అన్నాడు. కాగా, ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్ల కోసం భారత సెలక్టర్లు రాహుల్తో కలిపి ముగ్గురు వికెట్కీపర్లను ఎంపిక చేశారు. రాహుల్పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు కేఎస్ భరత్, దృవ్ జురెల్ స్టాండ్ బై కీపర్లుగా ఎంపిక చేశారు. కాగా, ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే హైదరాబాద్కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్లకు దూరం కాగా.. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల చేత సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. -
IND VS ENG 1st Test: అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. త్వరలో (జనవరి 25 నుంచి) ఇంగ్లండ్తో జరుగనున్న తొలి టెస్ట్లో (హైదరాబాద్) అశ్విన్ మరో 10 వికెట్లు తీస్తే, టెస్ట్ల్లో అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. హైదరాబాద్ టెస్ట్లో యాష్ ఈ ఘనతను సాధిస్తే అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున 500 వికెట్లు మార్కును తాకిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్ మరో 10 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. అశ్విన్కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథన్ లయోన్ (512) టెస్ట్ల్లో 500 వికెట్ల ఘనత సాధించారు. హైదరాబాద్ టెస్ట్ విషయానికొస్తే.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ను మిస్ కానున్నాడు. వ్యక్తిగత కారణాల చేత విరాట్ తొలి టెస్ట్తో పాటు రెండో టెస్ట్కు కూడా దూరంగా ఉండనున్నాడు. తొలి టెస్ట్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే హైదరాబాద్కు చేరుకున్నాయి. బాల రాముడి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం కోసం అశ్విన్, రవీంద్ర జడేజా అయోధ్య నగరికి వెళ్లారు. వీరిద్దరూ రేపటి లోగా జట్టుతో చేరతారు. ఈ సిరీస్లో భారత్.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్లు ఆడనుంది. తొలి రెండు టెస్ట్ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. విరాట్ కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది. తొలి టెస్ట్కు ముందు మ్యాచ్కు వేదిక అయిన హైదరాబాద్లో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, భారత అప్కమింగ్ ఆటగాడు శుభ్మన్ గిల్లకు అవార్డులు దక్కనున్నాయని తెలుస్తుంది. శాస్త్రికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. గిల్కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కనున్నాయని సమాచారం. వీరితో పాటు ముంబై ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు కూడా అవార్డు దక్కనున్నట్లు తెలుస్తుంది. -
భారత్, ఇంగ్లండ్ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి..
హైదరాబాద్లో ఈనెల 25 నుంచి జరగనున్న భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మొత్తం 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భారత జట్టు శనివారమే నగరానికి చేరుకోగా, ఇంగ్లండ్ నేడు అడుగు పెడుతుంది. -
AUS Vs WI: హాజిల్వుడ్ విజృంభణ.. విండీస్ను చిత్తు చేసిన ఆసీస్
టెస్ట్ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్.. తాజాగా అడిలైడ్లో జరిగిన టెస్ట్ల్లో (తొలి) విండీస్ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్వుడ్ (9/79), ట్రవిస్ హెడ్ (119) విజృంభించడంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. హాజిల్వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ మెక్కెంజీ (50), 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. విండీస్ ఆరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ (5/94) ఆసీస్ను దెబ్బతీశాడు. 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను హాజిల్వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ మెక్కెంజీ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆడుతూపాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్ స్మిత్ 11, లబూషేన్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ సిరీస్లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. -
AUS VS WI 1st Test: సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి సంచలన పేసర్గా..!
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో వెస్టిండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టెస్ట్ కెరీర్లో మొదటి బంతికే వికెట్ (స్టీవ్ స్మిత్) తీసిన షమార్.. టైరెల్ జాన్సన్ (1939లో ఇంగ్లండ్పై) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో విండీస్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 23వ బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్, లబూషేన్, కెమరూన్ గ్రీన్ లాంటి హేమాహేమీ బ్యాటర్లు సహా ఐదు వికెట్ల ఘనత సాధించిన షమార్.. టెస్ట్ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన 11వ విండీస్ బౌలర్గా నిలిచాడు. ఇదే మ్యాచ్లో 11వ నంబర్లో బ్యాటింగ్కు వచ్చి జట్టుకు ఎంతో అవసరమైన 36 పరుగులు చేసిన షమార్.. విండీస్ తరఫున టెస్ట్ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన 11వ నంబర్ బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రదర్శనలతో షమార్ మరిన్ని ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విండీస్ బౌలర్గా.. ఆస్ట్రేలియాలో టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన పదో పర్యాటక బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, షమార్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/94) విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (119) సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంతకుముందు హాజిల్వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ మెక్కెంజీ (50), షమార్ జోసఫ్ (36) మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను హాజిల్వుడ్ (4/18) మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్వుడ్ ధాటికి విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. విండీస్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి.. ఆసీస్తో తొలి టెస్ట్లో సంచలన ప్రదర్శన నమోదు చేసిన షమార్ జోసఫ్.. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తన జీవనాధారమైన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. కరీబియన్ దీవుల్లోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన షమార్.. టెస్ట్ అరంగేట్రానికి ముందు కేవలం ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 24 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ అయిన షమార్ అంతర్జాతీయ అరంగేట్రంలో తొలి మ్యాచ్లోనే ఆకట్టుకుని పలు రికార్డులు కొల్లగొట్టాడు. -
Aus vs WI : శతక్కొట్టిన ట్రావిస్ హెడ్..
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా 95 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ట్రావిస్ హెడ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులు చేసి ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేకపోయారు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్పై సెంచరీ తర్వాత హెడ్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో 15వ పరుగుతో హెడ్ టెస్ట్ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు. ఉస్మాన్ ఖ్వాజా (45), నాథన్ లయోన్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టీవ్ స్మిత్ 12, లబూషేన్ 10, కెమరూన్ గ్రీన్ 14, మిచెల్ మార్ష్ 5, అలెక్స్ క్యారీ 15, మిచెల్ స్టార్క్ 10, పాట్ కమిన్స్ 12 స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేయగా.. కీమర్ రోచ్, మరో అరంగ్రేటం బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ తలో రెండు వికెట్లు, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. మూడో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి, కష్టాల్లో చిక్కుకుంది. ఇంకా ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 88 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్నరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ డకౌట్లు కాగా.. క్రెయిగ్ బ్రాత్వైట్ ఒక్క పరుగులు చేసి ఔటయ్యారు. కిర్క్ మెక్కెంజీ (5), కవెమ్ హాడ్జ్ క్రీజ్లో ఉన్నారు. విండీస్ను రెండో ఇన్నింగ్స్లో హాజిల్వుడ్ దారుణంగా దెబ్బతీశాడు. ఈ ఇన్నింగ్స్లో విండీస్ కోల్పోయిన మూడు వికెట్లు హాజిల్వుడే తీశాడు. అంతకుముందు విండీస్ను తొలి ఇన్నింగ్స్లోనూ హాజిల్వుడే (4/44) దెబ్బకొట్టాడు. హాజిల్, కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్వైట్ (13), తేజ్నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. -
విండీస్తో తొలి టెస్ట్కు ఆసీస్ తుది జట్టు ఇదే.. స్మిత్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ తుది జట్ల వివరాలను వెల్లడించాయి. ఈ మ్యాచ్తో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓపెనర్గా కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. స్మిత్ ఓపెనర్ అవతారమెత్తడంతో మరో ఓపెనర్ మ్యాట్ రెన్షా బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమారూన్ గ్రీన్ కూడా చోటు దక్కించుకున్నాడు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఆసీస్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. మరోవైపు ఈ మ్యాచ్తో ముగ్గురు విండీస్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నారు. కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్లు సుదీర్ఘ ఫార్మాట్లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, నాథన్ లయోన్, జోష్ హాజిల్వుడ్ వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), తేజ్నరైన్ చందర్పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్కీపర్), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్ -
టీమిండియా బోల్తా
‘బాక్సింగ్ డే’ టెస్టులో మన జట్టు మూడే రోజుల్లో మునిగింది. రోజు రోజుకూ ప్రత్యర్థి జట్టే పట్టు బిగించడం... మూడో రోజైతే ఏకంగా అటు బ్యాటింగ్లో ప్రతాపం... ఇటు బౌలింగ్లో పట్టుదల చూపిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విజయం సాధించింది. దీంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్లోనూ సఫారీ బౌలింగ్ ముందు ఎదురు నిలువలేకపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్ మరోసారి పర్యటించాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచూరియన్: టీమిండియా ఈ పర్యటనలో టి20లను సమం చేసుకున్నా... వన్డే సిరీస్ను వశం చేసుకున్నా... అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాట్కు వచ్చేసరికి సఫారీలో సవారీ అంత సులభం కానేకాదని తొలిటెస్టు మూడు రోజుల్లోనే తెలుసుకుంది. ‘బాక్సింగ్ డే’ పోరులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట ఓవర్నైట్ స్కోరు 256/5తో గురువారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 108.4 ఓవర్లలో 408 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 185; 28 ఫోర్లు), మార్కొ జానెŠస్న్ (147 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీస్కోరుకు బాటవేశారు. ఇద్దరు కలిసి ఆరో వికెట్కు 111 పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భారత్ 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. కోహ్లి (82 బంతుల్లో 76; 12 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ పరుగులే చేయలేదు. రెండు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్టౌన్లో జరుగుతుంది. అప్పుడు రాహుల్... ఇప్పుడు కోహ్లి ఈ టెస్టులో సఫారీ పేసర్లు భారత బ్యాటర్ల పాలిట గన్ గురిపెట్టునట్లుగా... బంతుల స్థానంలో బుల్లెట్లు సంధించారేమో! ఎందుకంటే రెండు ఇన్నింగ్స్ల్లోనూ బ్యాటర్లు తేలిగ్గా వికెట్లను సమర్పించుకున్నారు. ముఖ్యంగా మూడో రోజైతే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలాన్ని, బౌలింగ్ అ్రస్తాల్ని ప్రయోగించిన తీరుకు భారత్ భీతిల్లిపోయింది. ప్రత్యర్థి తొలిసెషన్కు పైగా ఆడింది. 42.4 ఓవర్లలో మిగిలున్న 5 వికెట్లతోనే 152 పరుగులు చేసింది. కానీ 10 మంది భారత బ్యాటర్లు కనీసం 35 ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయారు. రబడ (2/32), బర్గర్ (4/33), జాన్సెన్ (3/36) ముప్పేట దాడికి దిగడంతో అనుభవజు్ఞడైన కెపె్టన్ రోహిత్ (0) ఖాతా తెరువలేకపోయాడు. యశస్వి (5), అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), అశ్విన్ (0), శార్దుల్ (2) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. కోహ్లి అర్ధసెంచరీతో పోరాడగా, శుబ్మన్ గిల్ (26) కాస్త మెరుగనిపించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 245 ఆలౌట్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 185; టోని జార్జి (సి) జైస్వాల్ (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి) రాహుల్ (బి) ప్రసి«ద్కృష్ణ 4; జాన్సెన్ నాటౌట్ 84; కొయెట్జీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 19; రబడ (బి) బుమ్రా 1; బర్గర్ (బి) బుమ్రా 0; బవుమా (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్ట్రాలు 24; మొత్తం (108.4 ఓవర్లలో ఆలౌట్) 408. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249, 6–360, 7–391, 8–392, 9–408. బౌలింగ్: బుమ్రా 26.4–5–69–4, సిరాజ్ 24–1–91–2, శార్దుల్ 19–2–101–1, ప్రసిధ్ కృష్ణ 20–2–93–1, అశ్విన్ 19–6–41–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి)బర్గర్ 5; రోహిత్ (బి) రబడ 0; గిల్ (బి) జాన్సెన్ 26; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; అయ్యర్ (బి) జాన్సెన్ 6; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) బర్గర్ 4; అశ్విన్ (సి) బెడింగ్హమ్ (బి) బర్గర్ 0; శార్దుల్ (సి) బెడింగ్హమ్ (బి) రబడ 2; బుమ్రా రనౌట్ 0; సిరాజ్ (సి) వెరిన్ (బి) బర్గర్ 4; ప్రసిద్కృష్ణ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (34.1 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–5, 2–13, 3–52, 4–72, 5–96, 6–96, 7–105, 8–113, 9–121, 10–131. బౌలింగ్: రబడ 12–3–32–2, బర్గర్ 10–3–33–4, జాన్సెన్ 7.1–1–36–3, కొయెట్జీ 5–0–28–0. -
రాహుల్ పోరాటం
‘బాక్సింగ్ డే’ టెస్టు సవాళ్లతో మొదలైంది. బంతి ఒక బుల్లెట్గా బ్యాటర్లను అదేపనిగా ఢీకొట్టింది. పేసర్లు గర్జిస్తుంటే... ప్రధాన బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు. అడుగడుగునా కఠిన సవాళ్లు ఎదురవుతున్న సెంచూరియన్ పిచ్పై మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం చేశాడు. అజేయ అర్ధ సెంచరీతో భారత్ ఇన్నింగ్స్ను ఆదుకున్నాడు. సెంచూరియన్: సఫారీ పేస్ దళానికి భారత బ్యాటింగ్ బలగమంతా వణికితే ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్ మాత్రం పెను సవాలుకు తన బ్యాటింగ్ సత్తాతో ఎదురు నిలిచాడు. తొలిటెస్టులో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ వర్షం కారణంగా ఆట నిలిచి సమయానికి తొలి ఇన్నింగ్స్లో 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (105 బంతుల్లో 70 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) భారత్ మొదటిరోజే ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డాడు. అజేయ అర్ధసెంచరీతో ఇన్నింగ్స్ను ఆదుకున్నాడు. రబడ ఐదు వికెట్లతో (5/44) చెలరేగాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ సీమర్ ప్రసిధ్ కృష్ణ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రోహిత్ 5, గిల్ 2 టాస్ నెగ్గిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. సీమర్లు తమ కెప్టెన్ నిర్ణయం సరైందనిపించడానికి ఎంతో సేపు పట్టలేదు. కెపె్టన్ రోహిత్ శర్మ (5)ను రబడ అవుట్ చేయగా, కాసేపటికే బర్గర్ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్ (17), శుబ్మన్ గిల్ (2)లను పెవిలియన్ చేర్చాడు. 24 పరుగులకే టీమిండియా విలువైన వికెట్లు కూలాయి. ఈ దశలో అనుభవజు్ఞడైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (64 బంతుల్లో 38; 5 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ను కనిపెట్టుకున్నారు. తొలిసెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుకున్నారు. భారత్ 91/3 స్కోరు వద్ద లంచ్ బ్రేక్కు వెళ్లింది. రబడ దెబ్బకు మళ్లీ... అదేంటో ఏమో మ్యాచ్ మొదలైనపుడు కష్టాల్లో పడ్డట్లే... రెండో సెషన్ మొదలైనపుడు కూడా భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కలిసొచ్చిన పిచ్... పనికొచ్చిన ఎక్స్ట్రా బౌన్స్తో వైవిధ్యమైన బంతులు వేసిన రబడ మ్యాచ్ను దక్షిణాఫ్రికా నియంత్రణలోకి తెచ్చాడు. సెషన్ ఆరంభమైన ఓవర్లోనే అయ్యర్, జట్టు స్కోరు వంద పూర్తయ్యాక కోహ్లి, అశ్విన్ (8)లను రబడ పెవిలియన్ చేర్చాడు. ఓ దశలో 121/6 స్కోరు వద్ద భారత్ ఆలౌట్కు దాదాపు చేరువైంది. ఎందుకంటే ఒక్క రాహుల్ మినహా ప్రధాన బ్యాటర్లెవరూ మిగల్లేదు! వీరోచిత పోరాటం కష్టమైన పిచ్... నిప్పులు చెరుగుతున్న బౌలర్లు... భారత్కు అన్నీ కష్టాలే! ఇలాంటి పరిస్థితిలో రాహుల్ అద్వితీయ పోరాటం చేశాడు. కీలక బ్యాటర్లెవరూ లేకపోయినా... టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (33 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో రెండో సెషన్ను నడిపించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో శార్దుల్ వికెట్ను పారేసుకున్నాడు. బుమ్రా క్రీజులోకి రాగా... టీమిండియా 176/7 వద్ద టీ బ్రేక్కు వెళ్లింది. విరామనంతరం రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికే బుమ్రా (1)ను జాన్సెన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ (0 బ్యాటింగ్) క్రీజులోకి రాగా... రాహుల్ కష్టపడి జట్టు స్కోరును 200 దాటించాడు. బ్యాడ్లైట్, వర్షం వల్ల ఫైనల్ సెషన్ ఎక్కువసేపు సాగలేదు. 208/8 స్కోరు వద్ద వాన రావడంతో తొలిరోజు ఆట అక్కడితోనే ఆగిపోయింది. మ్యాచ్ ఆరంభం కూడా ఆలస్యం కావడంతో మొదటి రోజు కేవలం 59 ఓవర్ల ఆటే సాధ్యమైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; గిల్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బ్యాటింగ్) 70; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 208. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191. బౌలింగ్: రబడ 17–3–44–5, మార్కొ జాన్సెన్ 15–1–52–1, బర్గర్ 15–4–50–2, కొయెట్జీ 12–1–53–0. -
AUS VS PAK 1st Test: 500 వికెట్ల క్లబ్లో చేరిన లియోన్
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను మట్టికరిపించారు. ఈ మ్యాచ్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్లో చేరిన వారిలో ఉన్నారు. FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ — cricket.com.au (@cricketcomau) December 17, 2023 సెకెండ్ ఇన్నింగ్స్లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ లెజెండరీ క్లబ్లో చేరాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్కు ముందు వార్న్, మెక్గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్ల క్లబ్లో చేరారు. లియోన్ తన 500 వికెట్ డీఆర్ఎస్కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 3, సెకెండ్ ఇన్నింగ్స్లో 2) సాధించిన లియోన్ ఆసీస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg — Johns. (@CricCrazyJohns) December 17, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్ల్లో పాకిస్తాన్కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నాడు. -
26వ టెస్ట్ శతకం.. డేవిడ్ వార్నర్ ఖాతాలో పలు రికార్డు
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (డిసెంబర్ 14) మొదలైన తొలి టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. డేవిడ్ వార్నర్ 26వ టెస్ట్ శతకంతో (211 బంతుల్లో 164; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ శతకానికి ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు తోడవ్వడంతో ఆసీస్ తొలి రోజే భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ (16) ఒక్కడే కాస్త నిరాశపరిచాడు. ఆట ముగిసే సమయానికి మిచెల్ మార్ష్ (15), అలెక్స్ క్యారీ (14) క్రీజ్లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆమిర్ జమాల్ 2 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఖుర్రమ్ షెహజాద్, ఫహీప్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. రికార్డు శతకం.. తన కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన వార్నర్.. తన కెరీర్ చరమాంకంలో రికార్డు శతకంతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్ ఆరంభంలో టీ20 తరహాలో చెలరేగిన వార్నీ.. ఆతర్వాత కాస్త నెమ్మిదించి డబుల్ సెంచరీ దిశగా సాగాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఆమిర్ జమాల్ బౌలింగ్లో ఇమామ్ ఉల్ హాక్కు క్యాచ్ ఇచ్చి 164 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో వార్నర్ డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్గా.. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి (80) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా.. ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ స్వదేశంలో పాకిస్తాన్తో ఆడిన గత 14 ఇన్నింగ్స్ల్లో ఏకంగా ఏడు సెంచరీలు చేసి సొంతగడ్డపై పాకిస్తాన్ పాలిట ఎంతటి ప్రమాదకారో నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్లు.. డేవిడ్ వార్నర్ (49) సచిన్ టెండూల్కర్ (45) క్రిస్ గేల్ (42) సనత్ జయసూర్య (41) మాథ్యూ హేడెన్ (40) రోహిత్ శర్మ (40) ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు.. విరాట్ కోహ్లి (574 ఇన్నింగ్స్ల్లో 80 సెంచరీలు) డేవిడ్ వార్నర్ (458 ఇన్నింగ్స్ల్లో 49 సెంచరీలు) జో రూట్ (437 ఇన్నింగ్స్ల్లో 46) రోహిత్ శర్మ (482 ఇన్నింగ్స్ల్లో 45) స్టీవ్ స్మిత్ (374 ఇన్నింగ్స్ల్లో 44) కేన్ విలియమ్సన్ (410 ఇన్నింగ్స్ల్లో 42) బాబర్ ఆజమ్ (300 ఇన్నింగ్స్ల్లో 31) ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. రికీ పాంటింగ్ 13378 అలెన్ బోర్డర్ 11174 స్టీవ్ వా 10927 స్టీవ్ స్మిత్ 9351 డేవిడ్ వార్నర్ 8651 మైఖేల్ క్లార్క్ 8643 -
ఆసీస్తో తొలి టెస్ట్.. పాక్ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాక్కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు ఆల్రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్గా మొహమ్మద్ రిజ్వాన్ను కాదని సర్ఫరాజ్ అహ్మద్వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్లను కొనసాగించిన పాక్ మేనేజ్మెంట్.. వన్ డౌన్లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. 🚨 Playing XI for first Test 🚨 Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023 ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా మసూద్కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. ఆసీస్తో తొలి టెస్ట్కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. -
వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్రకు షాక్
వన్డే వరల్డ్కప్ 2023లో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్గా (10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు) నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో ఇవాల్టి నుంచి (నవంబర్ 28) ప్రారంభమైన తొలి టెస్ట్లో రచిన్కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కలేదు. రచిన్ భీకర ఫామ్లో ఉన్నప్పటికీ న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కకు పెట్టడం విశేషం. బ్యాటర్గానే కాకుండా బౌలింగ్లోనూ (స్పిన్నర్గా) రాణించే సత్తా ఉన్న రచిన్ను న్యూజిలాండ్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియలేదు. న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్లో ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అజాజ్ పటేల్, ఐష్ సోధి, పార్ట్ టైమ్ స్పిన్నర్గా గ్లెన్ ఫిలిప్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టిమ్ సౌథీ నేతృత్వంలో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్సన్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, కైల్ జేమీసన్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టును నజ్ముల్ హసన్ షాంటో ముందుండి నడిపిస్తున్నాడు. మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాహదత్ హుస్సేన్, నూరుల్ హసన్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, షోరీఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. కాగా, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. జకీర్ హసన్ (12), షాంటో (37) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (42), మోమినుల్ హక్ (3) క్రీజ్లో ఉన్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్కు తలో వికెట్ దక్కింది. -
డొమినికా టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 421/5 డిక్లేర్డ్
-
150 పరుగులు పూర్తి చేసిన యశస్వి.. తొలి భారత క్రికెటర్గా..!
విండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పూర్తి ఆధిక్యం దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే ఓవర్నైట్ బ్యాటర్ యశస్వి 150 పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలో అతను టెస్ట్ డెబ్యూలో 150 పరుగుల మార్కును అందుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా, అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును దాటగా.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా పాక్ మాజీ క్రికెటర్ జావిద్ మియాందాద్ కొనసాగుతున్నాడు. మియాందాద్.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్లో 150 పరుగుల మార్కును దాటాడు. అతని తర్వాత ఆసీస్ ఆర్కీ జాక్సన్ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్ డౌగ్ వాల్టర్స్ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) వరుసలో ఉన్నారు. వీరి తర్వాత అత్యంత పిన్న వయసులో 150 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా యశస్వి రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, మూడో రోజు ఆట ప్రారంభం కాగానే జేసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో బౌండరీ, సింగల్ బాది యశస్వి 150 పరుగుల మార్కును అందుకున్నాడు. 359 బంతుల్లో అతను 150 మార్కును దాటాడు. 121 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 330/2గా ఉంది. యశస్వి (156)కి జతగా విరాట్ కోహ్లి (41) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (5/60), జడేజా (3/26) విండీస్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతక్కొట్టగా.. శుభ్మన్ గిల్ (6) విఫలమయ్యాడు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement