-
‘సోలో బాయ్’గా వస్తున్న గౌతమ్
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సోలో బాయ్. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు(ఏప్రిల్ 14) గౌతమ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం గౌతమ్ బర్త్డేని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తీసుకొస్తున్నాం. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ’ అన్నారు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించి, ఈ సినిమాను నిర్మించాను. ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అని ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అన్నారు దర్శకుడు పి.నవీన్ కుమార్. -
బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’
‘బిగ్బాస్’ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బాయ్’. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిసెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిరించారు. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక ఈ నెల 7వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారు మాట్లాడుతూ - కోవిడ్ టైంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. రెండు పాటలు మినహా పూర్తి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో గౌతమ్ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు గతంలో ఆకాశవీధిలో సినిమాతో అలాగే బిగ్ బాస్ 7 లో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాం ఫ్యూచర్లో టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు ఆలోచిస్తారు. అన్నారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ - గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చంది. తర్వాత వేరే కథలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జనాలు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా "సోలో బాయ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ముందు ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సినిమా అనుకున్న దానికంటే బాగా రూపొందించాం. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో కనెక్ట్ అయ్యాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. గతంలో ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. -
Bigg Boss 7: రైతుబిడ్డతో గౌతమ్ 'పంచె' పంచాయతీ.. క్షమాపణలు చెప్పిన రైతుబిడ్డ!
బిగ్బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతికక చెప్పి మరీ అమర్ అలా ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమర్దీప్ - యావర్, రతిక గౌతమ్ - ప్రశాంత్, శివాజీ రతిక - అమర్దీప్, ప్రశాంత్ అర్జున్ - యావర్, శివాజీ ప్రశాంత్ - గౌతమ్, రతిక అశ్విని - సెల్ఫ్ నామినేషన్ యావర్ నో లాజిక్స్ ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు. ప్రశాంత్ vs గౌతమ్ తొలుత గౌతమ్, ప్రశాంత్ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్లో సంచాలక్గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు. కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు. శివాజీని లాజిక్స్తో కొట్టారు ప్రశాంత్ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు. నేను సంచాలక్గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: శివాజీ vs గౌతమ్.. గొడవలో లాజిక్ లేదు కానీ ఆ నిజాలు బయటకు!
బిగ్బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్బాస్ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో మళ్లీ గొడవలు షురూ. శివాజీతో గౌతమ్ కొట్టుకుంటారేమో అనేంతలా రెచ్చిపోయాడు. కోపంలో అరుస్తూ గౌతమ్.. శివాజీ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. దీంతో అందరికీ శివాజీ నిజస్వరూపం ఇదేనా డౌట్ వచ్చింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 68 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అతి చేసిన రతిక ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌసులోకి వస్తున్నారు. శుక్రవారం అలా తొలుత రతిక తండ్రి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రావడంతో రతిక గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఇది కాస్త అతిలా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఓసారి రతిక ఎలిమినేట్ అయింది. దీంతో ఇంటికెళ్లి తల్లిదండ్రులని కలిసింది. దేవాలయాలకు కూడా తండ్రితో కలిసి వెళ్లినట్లు వీడియోలు పోస్ట్ చేసింది. ఇప్పుడేమో తండ్రి హౌసులోకి రాగానే తెచ్చిపెట్టుకున్నట్లు ఏడ్చేసింది. మళ్లీ వెంటనే ఏడుపు ఆపేసింది. బహుశా అందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టుకుని ఏడుస్తున్నారని రతిక కూడా ఏడ్చినట్లు అనిపించింది తప్పితే రియల్ ఎమోషనల్ కనిపించలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) రైతుబిడ్డ తండ్రి ఆగయా రతిక తండ్రి వెళ్లిన కాసేపటి తర్వాత పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. చేనులో పండిన బంతిపూలని తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చారు. అయితే నాన్న కోసం పొద్దున్నుంచి తినకుండా ఎదురుచూసిన ప్రశాంత్.. తండ్రితో కలిసి భోజనం చేశాడు. ఒకరికొకరు గోరుముద్దులు తినిపించుకోవడం చూడటానికి మంచిగా అనిపించింది. 'ఆట మంచిగా ఆడుకో, ఎవరివి ఏమనకు, నీ ఆట నువ్వు ఆడుకో' అని కొడుక్కి ధైర్యం చెప్పి ప్రశాంత్ తండ్రి వెళ్లిపోయారు. రతిక కన్నింగ్ గేమ్ ఫ్యామిలీ వీక్ అయిపోయింది. దీంతో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'ఓ బేబీ' అని ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓవైపు టేబుల్ ఆయా కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫొటోలు అతికించిన బొమ్మలు ఉంటాయి. బజర్ మోగిన ప్రతిసారి ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు. ఇందులో వరసగా శోభా, ప్రశాంత్, యవర్, అమరదీప్, రతిక, అశ్విని, భోలె, ప్రియాంక, గౌతమ్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ గేమ్లో కావాలనే మూడు నాలుగుసార్లు పరుగెత్తకుండా రతిక కన్నింగ్ గేమ్ ఆడింది. చివరకు ఐదో ప్రయత్నంలో ఆమె బొమ్మని ఎవరు పట్టుకెళ్లలేదు. దీంతో తను తీసిన గోతిలో తానే పడి బలైపోయింది. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) శివాజీ vs గౌతమ్ ఇక చివరగా ముగ్గురున్నప్పుడు గౌతమ్ బొమ్మ శివాజీ తీసుకోవడంతో గౌతమ్.. ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో కావాలనే శివాజీ తన బొమ్మ పట్టుకున్నారని చెప్పి గౌతమ్ సీన్ క్రియేట్ చేశాడు. అన్యాయం జరిగిందని చెప్పి శివాజీతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు మీదపడి మరీ అరుచుకున్నారు. 'ప్రతిసారి నీతో గోల, వాంటెడ్గా గొడవ పెట్టుకుంటావ్, ప్రతిసారి నీకు అటెన్షన్ కావాలి, అలానే గొడవ చేస్కో' అని శివాజీ అనేసరికి గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. 'మీకు కావాల్సినట్లు జరిపించండి, బిగ్బాస్తో మీరు మాట్లాడుకోండి. మీరు సెకండ్ బిగ్బాస్ అనుకుంటా, నేను కూర్చుని ఉంటాను' అనే శివాజీని ఉద్దేశిస్తూ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావ్' అని శివాజీ తిరిగి అనేసరికి గౌతమ్కి పట్టరాని కోపం వచ్చేసింది. మైక్ పక్కనబెట్టి.. వెళ్లిపోతా బిగ్బాస్, తలుపు తెరవండి అని గట్టిగా బాదుతూ సీన్ క్రియేట్ చేశాడు. శివాజీ నిజస్వరూపం గౌతమ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. శివాజీ, రెండో బిగ్బాస్లానే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే హౌసులోకి అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దమనిషి తరహాలో అందరికీ నీతులు చెబుతూ, ప్రశాంత్-యవర్-భోలెతో ఓ బ్యాచ్ తయారు చేసుకుని ఏదేదో చేస్తున్నాడు. శివాజీ ఏం చేసినా సరే వీకెండ్ వచ్చేసరికి హౌస్ట్ నాగార్జున ఇతడికే సపోర్ట్ చేస్తున్నాడు. బహుశా హౌసులోకి రావడానికి ముందే శివాజీ.. బిగ్బాస్ ఆర్గనైజర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడేమో? అని డౌట్ ప్రేక్షకులకు కలుగుతోంది. అదే టైంలో హౌసులో గౌతమ్ తప్ప శివాజీతో ఏ ఒక్కరూ గొడవ పడటానికి ధైర్యం చేయట్లేదు. అందులో గౌతమ్, శివాజీకి కరెక్ట్ మొగుడిలా కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్!
బిగ్బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో సీజన్లో అదే నడుస్తోంది. మంగళవారం ఎపిసోడ్లో అర్జున్ భార్య, శివాజీ కొడుకు, అశ్విని తల్లి వచ్చి ఎమోషనల్ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నవ్వించారు, ఏడిపించారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 66 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అమ్మ ప్రేమలో గౌతమ్ అశ్విని తల్లి వచ్చి వెళ్లడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత గౌతమ్ తల్లి.. పంచెని హౌసులోకి పంపింది. కానీ గౌతమ్.. అది తన కోసమే అని గుర్తుపట్టలేకపోయాడు. కొంతసేపటి తర్వాత 'కన్నయ్యా' అనే పిలుపుతో అమ్మ ఎక్కడుందా అని హౌస్ అంతా తిరిగేశాడు. హౌసులోకి రాగానే ఆమెని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. అందరినీ పలకరించిన తర్వాత కొడుకుతో చాలా మాట్లాడింది. (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియో.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్!) 'సూపర్ ఆడుతున్నావ్.. కరెక్ట్ గానే ఆడుతున్నావ్.. కానీ అక్కడక్కడా ఆలోచిస్తున్నావ్.. మాటలు కొంచెం రాకుండా చూడు.. ఏదైనా పాయింట్ అనుకుంటే దాన్నే స్ట్రాంగ్గా పట్టుకో, వివరణ వద్దు.. ఎక్సప్లెనేషన్ వల్ల డీవియేషన్ వస్తుంది. ఏమైద్దో అని భయం వద్దు, అమ్మ ఎప్పుడు అండగా ఉంటుంది' అని గౌతమ్ కి అతడి తల్లి ధైర్యం నింపింది. అమ్మని అందరూ మిస్ అవుతున్నారు కదా అని హౌసులోని ప్రతిఒక్కరికీ గౌతమ్ తల్లి గోరుముద్దలు తినిపించింది. ఈ సీన్ చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆ తర్వాత.. 'అమ్మ.. అమ్మ..' అనే పాట ప్లే చేయగా.. గౌతమ్, తల్లితో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ పాట ప్లే అవుతున్నంతసేపు శోభా, యవర్.. తల్లి గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారు. ఈ పాట వల్లో, తల్లి అనే ఎమోషనల్ వల్లనో ఏమో గానీ చూస్తున్న మీరు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారంటీ. హగ్స్-ముద్దులతో ప్రియాంక గౌతమ్ తల్లి వెళ్లిపోయిన తర్వాత కాసేపటికి ప్రియాంక బాయ్ఫ్రెండ్ శివ కుమార్ వచ్చాడు. రోజా ఫ్లవర్ తీసుకొచ్చి, మోకాళ్లపై వంగి మరీ ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. హగ్గులు, నుదుటిపై ముద్దులతో రెచ్చిపోయాడు. దీంతో పక్కనే ఉన్న అర్జున్.. ఏమైనా అడ్డుపెట్టాలా? అని చిన్నగా సెటైర్ వేశాడు. కాకపోతే ఈ కామెంట్ ని పట్టించుకునేంత మూడ్లో ఈ ప్రేమజంట లేదు. ఇన్నాళ్ల విరహవేదన వల్లో ఏమో గానీ ఒకరికి ఒకరు అతుక్కుపోయారు. కాస్త గ్యాప్ ఇచ్చి హౌస్మేట్స్ అందరిని ప్రియాంక బాయ్ఫ్రెండ్ తెగ పొగిడేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?) హౌసులో గొడవ జరిగితే అప్పుడు దాన్ని తెగే దాకా లాగడం నచ్చట్లేదని, ఆ విషయం కాస్త చూసుకోమని ప్రియాంకకు ఆమె బాయ్ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఫ్రెండ్స్, బెస్ట్ఫ్రెండ్స్ ఎవరు అవసరమే లేదు నీకు అని.. అమరదీప్, శోభా గురించే ఇన్ డైరెక్ట్గా చెప్పాడు. కిచెన్ లోనే ఉండిపోతున్నావ్, బయటకు రా అని కూడా చెప్పాడు. 'బయటకొచ్చాక నాతో గొడవ పడతావా?' అని ప్రియాంక గోముగా అడిగేసరికి.. బాయ్ఫ్రెండ్ ఐస్ అయిపోయాడు. నువ్వు ఏం చెబుతావో అదే వింటానని అనేశాడు. మరి పెళ్లెప్పుడు అని ప్రియాంక అతడిని అడగ్గా.. బయటకొచ్చాక చేసుకుందాం అన్నాడు. ఇప్పుడే చేసుకుందామని ప్రియాంక.. తన విరహావేదనని అంతా బయటపెట్టేసింది. వెళ్తూ వెళ్తూ కూడా కొంతమందితో మాత్రం చూసుకుని ఉండు అని.. శోభా, అమర్ గురించి ప్రియాంక బాయ్ఫ్రెండ్ చెప్పాడు. ఆ తర్వాత భోలె భార్య కూడా వచ్చింది. కాకపోతే యోగ క్షేమాలు మాట్లాడి హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అంటే మాత్రం ప్రియాంక-ఆమె బాయ్ఫ్రెండ్దే. గౌతమ్ తల్లి ఎమోషన్తో అందరితో కన్నీళ్లు పెట్టిస్తే.. ప్రియాంక ప్రియుడు మాత్రం హౌస్ మొత్తాన్ని రొమాంటిక్గా మార్చేశాడు. ఇక ప్రియాంక-బాయ్ఫ్రెండ్ పెళ్లి డిస్కషన్ చూసిన తర్వాత.. హౌస్ నుంచి బయటకెళ్లగానే ప్రియాంక పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అని క్లారిటీ వచ్చేసింది. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. మరి గురువారం ఎపిసోడ్లో ఎలాంటి ఎమోషన్స్ బయటకొస్తాయో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: భూటాన్లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత) -
బిగ్బాస్ షో చరిత్రలో ఫస్ట్టైమ్ అలాంటి నిర్ణయం!
ప్రస్తుతం తెలుగులో బిగ్బాస్ ఏడో సీజన్ ప్రసారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. మరీ అంతా సూపర్ అని చెప్పలేం కానీ ఓ మాదిరిగా అలరిస్తుంది. 'ఉల్టా పుల్టా' ట్యాగ్ లైన్తో జరుగుతున్న ఈ షోలో కొత్త కెప్టెన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. షో చూస్తున్న ఆడవాళ్ల మనసులు గెలుచుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? బిగ్బాస్ షోలో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ రోజు మాత్రం వేరే లెవల్ హడావుడి ఉంటుంది. ఈ సోమవారం అలానే మంచి హీటెక్కించే వాదనలు జరిగాయి. అంతకంటే ముందు కొత్త కెప్టెన్గా గౌతమ్ కృష్ణ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా హౌసులోని లేడీ కంటెస్టెంట్స్ రతిక, శోభాని ఎంచుకున్నాడు. దీని తర్వాత ఓ నిర్ణయంతో మార్కులు కొట్టేశాడు. (ఇదీ చదవండి: మంచానికే పరిమితమైన స్టార్ డైరెక్టర్ భార్యకు ప్రభుత్వ సాయం) 'ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాలు పనులు చేస్తుంటారు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే పైచేయి. ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడున్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్బాస్ హౌసులో ఈ వారం ఫీమేక్ వీక్ (ఆడవాళ్ల వారం) జరుపుకొందాం. ఇందుకోసం ఈ వారమంతా లేడీస్కి హాలీడే ఇస్తున్నాను' అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇదే గేమ్ ప్లానులో భాగమై ఉండొచ్చు గానీ ఏ భాషలో తీసుకున్నా సరే బిగ్బాస్ ఇలాంటి నిర్ణయం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలుస్తోంది. దీనితో పాటే కెప్టెన్ గౌతమ్ మరో ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు. 'ప్రతిరోజూ లైట్స్ ఆపేసిన తర్వాత ఆ రోజు చేసిన పని గురించి నిర్ణయం ఉంటుంది. ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడ్డారో వాళ్లకు కష్ట జీవి.. తక్కువ పనిచేసిన వాళ్లకు పనిదొంగ అని బిరుదులు ఇస్తాం. కష్ట జీవికి ఒక డ్రింక్ ఇస్తాను. అలాగే పనిదొంగ తన రెండు గుడ్లను కూడా తిరిగిచ్చేయాలి' అని కెప్టెన్ గౌతమ్ చెప్పాడు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) -
అందరూ మెచ్చే చిత్రాలు చేస్తా – నిర్మాత సతీష్ కుమార్
‘‘గతంలో నేను నిర్మించిన ‘బట్టల రామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం గౌతమ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాను. యువత, కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరూ మెచ్చే చిత్రాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా సతీష్ కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. గౌతమ్ కృష్ణ ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 7 షోలో ఉన్నారు. ఆ షో నుంచి తిరిగి రాగానే మా సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్దు, సంగీతం: జుడా శాండీ. -
'బిగ్బాస్ 7' గౌతమ్ హీరోగా కొత్త సినిమా.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సెవెన్ హిల్స్ నిర్మాణ సంస్థలో 'బిగ్బాస్ 7' ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్. నవీన్ కుమార్ దర్శకుడు. సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. గతంలో 'బట్టల రామస్వామి బయోపిక్కు' చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆర్పీ పట్నాయక్తో 'కాఫీ విత్ ఏ కిల్లర్' మూవీ తీశారు. ఇది సతీష్ కుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'గతంలో నేను నిర్మించిన రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. 'ఆకాశవీధుల్లో' సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్బాస్ 7 షోతో మరింత పాపులర్ అయిన గౌతమ్ కృష్ణతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది' 'గౌతమ్.. బిగ్బాస్ నుంచి తిరిగి రాగానే చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం. సాధారణ మధ్యతరగతి వ్యక్తి.. స్టూడెంట్ నుంచి కార్పోరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు అనే పాయింట్తో తీస్తున్న సినిమా ఇది. త్వరలో ఫస్ట్లుక్, టీజర్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత సతీశ్ చెప్పారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్తో సహా మొత్తం!) -
నోరుజారిన డాక్టర్బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా
'బిగ్బాస్ 7'.. గత రెండు వారాలతో పోలిస్తే రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్లో భాగంగా కాస్త హడావుడి జరిగినా.. తర్వాతి రోజుకే అది చల్లారిపోయింది. మరోవైపు మూడో పవరస్త్ర కోసం ముగ్గుర్ని సెలెక్ట్ చేసిన బిగ్బాస్.. హౌస్ మొత్తాన్ని ఆగమాగం చేసేశాడు. ఇందులో భాగంగా బుధవారం కూడా శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఇంతకీ హౌసులో 17వ రోజు ఏం జరిగిందనేది Day-17 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఒకే ప్లేటులో తిన్నారు మంగళవారం జరిగిన పవరస్త్ర టాస్కులో యవర్.. అనర్హుడని రతిక నామినేట్ చేసింది. తనతోనే ఉంటూ తననే వెన్నుపోటు పొడవడంపై తొలుత కాస్త ఇబ్బందిపడ్డ ప్రిన్స్.. తనని తాను సంభాళించుకున్నాడు. రతికతోనే మాట్లాడుతూ.. తనకు ఏం ప్రాబ్లమ్ లేదని ఆమెకే చెప్పుకొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాత్రి ఒకే ప్లేటులో కలిసి భోజనం కూడా చేశారు. ఇది చూసి శుభశ్రీ, దామిని, గౌతమ్.. గుసగుసలాడుకున్నారు. (ఇదీ చదవండి: రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్ఫ్రెండ్!) శివాజీ పవరస్త్ర గొడవ తన పవరస్త్ర దొంగిలించారని పిల్లాడిలా శివాజీ గిలగిలా కొట్టేసుకుంటూనే ఉన్నాడు. సందీప్తో మాట్లాడుతూ తేజపై అనుమానం వ్యక్తం చేశాడు. వాడిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే, ఇలా చేస్తాడా? వాడికి అసలు అర్హతే లేదని అంటూ రెచ్చిపోయాడు. మరోవైపు పవరస్త్ర కొట్టేసిన అమరదీప్.. శివాజీ, రతిక బెడ్స్ దగ్గర టిష్యూ పేపర్పై ఏఏ, ఏ ఏడీ అని రాసి హింట్స్ ఇచ్చేలా పెట్టాడు. కానీ వాళ్లు కనిపెట్టలేకపోయారు. యవర్ని ఆటాడేసుకున్నారు అయితే పవరస్త్ర పోటీలో ఉన్న ప్రిన్స్ యవర్.. కంటెండర్గా నిలబడాలంటే ఓ పోటీ తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఓ బల్లపై గడ్డం పెట్టాలి. అతడిని నామినేట్ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్ చేస్తారు. కదలకుండా గంటసేపు నిలబడాలని రూల్ పెట్టాడు. దీన్ని పాటించిన యవర్.. కదలకుండా అలానే నిలబడ్డాడు. అయితే దామిని,రతిక, తేజ మాత్రం.. పేడ, గడ్డి, శాంపూ నీళ్లు, ఐస్ గడ్డలతో ఆటాడేసుకున్నారు. కానీ యవర్ ఇందులో గెలిచి నిలబడ్డాడు. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) శోభాశెట్టి vs గౌతమ్ ఇక యవర్ టాస్క్ అయిపోయిన తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేసిన వాళ్ల వీడియోలు చూపించారు. ప్రశాంత్, శుభశ్రీ వరకు పెద్దగా పట్టించుకుని ఈమె.. గౌతమ్ తో మాత్రం పెద్ద గొడవ పెట్టుకుంది. ఫిజికల్గా స్ట్రాంగ్ అని కారణం చెప్పడంపై శోభా మండిపడింది. తను శారీరకంగా బలంగా లేకపోతే.. పుల్ రాజా పుల్ టాస్కులో ఎలా గెలుస్తాను, కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను అంటూ గొడవ పెట్టుకుంది. దీంతో గౌతమ్.. తను అనుకున్న కారణాలు చెబుతూ షర్ట్ విప్పేశాడు. అయితే అతడు షర్ట్ తీసి షో హాఫ్ చేస్తున్నాడని శోభాశెట్టి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని అన్నాడు. అలా మాటామాట పెరిగిన ఒకానొక టైంలో.. 'అసలు నీకు హౌసులో ఉండటానికి అర్హతే లేదు' అని గౌతమ్ నోరుజారాడు. దెబ్బకు శోభాశెట్టి కౌంటర్ ఇచ్చింది. 'హౌసులో నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తా' అని ఛాలెంజ్ చేసింది. అయితే ఈ గొడవంతా చూస్తుంటే.. కార్తీకదీపం మోనిత శోభాశెట్టిని పూనిందేమో అని ప్రేక్షకులకు డౌట్ వచ్చింది. మరోవైపు అమరదీప్ని ప్రియాంక నామినేట్ చేసిన వీడియోని కూడా ప్లే చేశారు. అలా బుధవారం ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మెగాహీరో సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
ఫ్యామిలీతో స్విట్జర్లాండ్లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన పరశురాం దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఆ చిత్రంలో షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతోంది. ఈ సమయంలో కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్లో ట్రిప్లో ఉన్నాడు. తాజాగా ఈ ట్రిప్లో పిల్లలు సితార, గౌతమ్తో కలిసి ఈత కొడుతున్న ఎంజాయ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరితో కలిసి శాంతిని కనుగొన్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే ఆయన భార్య నమ్రతా సైతం ఈ ట్రిప్ సంబంధించి చిన్న వీడియోని షేర్ చేసింది. అందులో సూపర్ స్టార్ తన కూతురితో కలిసి లూసెర్న్లో నడుస్తున్నాడు. దీంతో ఇవీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారాయి. చదవండి: నా సూపర్ ఉమెన్తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
తండ్రి.. కొడుకు.. ఓ పురస్కారం
తాతయ్య చేతుల మీదుగా బుజ్జి మనవడు పురస్కారం అందుకోవడం... ఉత్తమ నటుడిగా అవార్డును తండ్రి అందజేస్తుంటే... కొడుకు పులకించిపోవడం... అటు కొడుకు... ఇటు మనవడు... ఎందరో హేమాహేమీల సమక్షంలో ‘జీవితకాల సాఫల్య పురస్కారా’న్ని స్వీకరించడం... ఈ అరుదైన... అపురూపమైన సంఘటనలకు వేదికగా నిలిచింది ‘మా టీవీ’ పురస్కారాల వేడుక. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది. నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణను లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ‘1... నేనొక్కడినే’ చిత్రానికి ఉత్తమ నటుడిగా మహేశ్, కృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ -‘‘ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నాన్న చేతుల మీదుగా ఏ అవార్డూ అందుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్. నా కెరీర్లో ‘1... నేనొక్కడినే’ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ‘1...నేనొక్కడినే’లో బాలనటుడిగా చేసిన గౌతమ్ కృష్ణ బెస్ట్ స్పెషల్ ఎప్పీయరెన్స్ అవార్డును తాతయ్య కృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. బెస్ట్ మూవీ (జ్యూరీ)గా ‘మనం’ చిత్రం ఎంపికైంది. అలాగే బెస్ట్ ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ పురస్కారాన్ని నాగార్జున స్వీకరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ - ‘‘మా ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎప్పుడూ ఎమోషనే. నాన్నగారు నటించిన ఆఖరి చిత్రమది. ఆయన ఈ సినిమా చూడలేకపోయారనే బాధ మాకు ఉన్నప్పటికీ, పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తారనే భావిస్తున్నా’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. బెస్ట్ యాక్టర్ (ఓటింగ్)గా ఎంపికైన అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘ఈ అవార్డును రామానాయుడు గారికి డెడికేట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఫిలింఫేర్ అవార్డుని ఏయన్నార్ గారికి డెడికేట్ చేశారు. ఇండస్ట్రీ ఈ రోజు ఇలా ఉందంటే కారణం అలాంటి గొప్పవాళ్లే’’ అని చెప్పారు. ‘రేసుగుర్రం, మనం, ముకుంద, నేనొక్కడినే, లౌక్యం, రౌడీ, పవర్, లెజెండ్, చందమామ కథలు, నా బంగారు తల్లి’ తదితర చిత్రాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పురస్కారాలు అందించారు. కె. రాఘవేంద్రరావు, విజయనిర్మల, వెంకటేశ్, ‘మా’ టీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్, జయసుధ, జయప్రద, జగపతిబాబు, కోట శ్రీనివాసరావు, మంచు లక్ష్మీప్రసన్న, రకుల్ ప్రీత్సింగ్, సాయిధరమ్తేజ్, అనూప్ రూబెన్స్, అలీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కథానాయికలు అంజలి, రాశీఖన్నా, హంసానందిని, రెజీనా, లక్ష్మీరాయ్ తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. -
గౌతమ్కు మహేష్ నుంచి అరుదైన బర్త్డే గిఫ్ట్
గత సంవత్సరం పుట్టినరోజుకు తన కొడుకు గౌతమ్ కృష్ణకు కోటి రూపాయలకు పైగా విలువగల క్రూయిజర్ కారును బహుమతిగా ఇచ్చిన మహేష్ బాబు.. ఈసారి అంతకంటే మరింత విలువైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ఆగడు' ఆడియో విడుదల కార్యక్రమాన్ని కొడుకు పుట్టినరోజు నాడే ఏర్పాటు చేయిస్తున్నాడు. మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతోంది. ఆగస్టు 31 గౌతమ్ పుట్టిన రోజు. 1.. నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం కూడా చేసేసిన గౌతమ్ కృష్ణకు ఇది చాలా అపురూపమైన బహుమతి అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ కొడుకూ ఊహించలేని అద్భుతమైన గిఫ్టును మహేష్ ఇస్తున్నాడు. ఇక సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ 50వ చిత్రంగా ఆగడు వస్తోంది. ఈ సినిమా పాటలను తమన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి అదరగొట్టాడని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అందులో ఆమె బికినీలో కనిపిస్తుందని కూడా ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉండే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు. Follow @sakshinews -
గౌతమ్ని చూస్తే ‘పోరాటం’లో మహేష్ గుర్తొచ్చాడు
‘‘అప్పట్లో ‘పోరాటం’ సినిమాలో మహేష్ బాల నటుడిగా చాలా ఈజ్తో చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో గౌతమ్ని చూస్తుంటే ‘పోరాటం’లో మహేష్ గుర్తొస్తున్నాడు. గౌతమ్ చాలా ఈజ్తో చేశాడు’’ అని కృష్ణ చెప్పారు. మహేష్బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1’ (నేనొక్కడినే) చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్లో తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ చూశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘ఇందులో మహేష్ నటన అసాధారణంగా ఉంది. ఒక రెగ్యులర్ సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సుకుమార్ చాలా బాగా తీశాడు. ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొదటివారమే పెద్ద రికార్డ్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు. -
నాకంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్: మహేశ్ బాబు
‘‘నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని... అభిమానంతో ఆదరిస్తున్న మీ రుణం తీర్చుకోలేనిది. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను. చేతులెత్తి నమస్కరించడం తప్ప’’ అని అభిమానులను ఉద్దేశించి మహేష్ ఉద్వేగంగా మాట్లాడారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘1’. ‘నేనొక్కడినే’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. కృతి సనన్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. మహేష్ తనయుడు గౌతమ్కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీను వైట్లకు అందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ-‘‘చాలాకాలంగా దేవిశ్రీ, నేనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సుకుమార్ కారణంగా మా కలయిక కుదిరింది. సుకుమార్ ఐడియాస్ సూపర్బ్. మూడేళ్లు ఈ సినిమాకోసం ఆయన పడ్డ కష్టం కళ్లతో చూసిన వాణ్ణి. పీటర్హేన్స్ ఈ సినిమాలో నాతో పెద్ద పెద్ద సాహసాలే చేయించారు. బిల్డింగుల మీదనుంచి దూకించేశారు. నేను డాన్సులు చేయడం లేదని అభిమానుల్లో ఓ బాధ ఉంది. ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది. మరో సినిమా ఒప్పుకోకుండా రెండేళ్లు మాతో ఉండి అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు కెమెరామేన్ రత్నవేలు. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. టోటల్గా నా కెరీర్లోనే బెస్ట్ మూవీ ఇది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘దేవిశ్రీతో నా అయిదో సినిమా ఇది. నా గత చిత్రాల్లాగే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఈ లుక్, ఈ కలర్ రావడానికి కారణం రత్నవేలు. సాంకేతికంగా ఈ సినిమా నిజంగా వండర్ అనే చెప్పాలి. ఓ కాఫీ షాప్లో రెండేళ్ల క్రితం మహేష్కి ఈ కథ చెప్పాను. రీసెంట్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్లో ఎక్కడో చిన్న మార్పు జరిగింది. ‘అప్పుడు నువ్వు ఈ కథ ఇలా చెప్పలేదే’అని అడిగారు. ఆయనలోని జ్ఞాపకశక్తి చూసి అనిపించింది ఎస్.. హీఈజ్ ‘1’ అని. మహేష్కి స్విమ్మింగ్ రాదు. కానీ... సముద్రంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్కై డైవింగ్ చేసేశారు. ఆయనలోని తెగువ చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. కెమెరాలోంచి ఏ కోణంలో చూసినా అందంగా ఉంటారు మహేష్. ఆయన 360 డిగ్రీల అందగాడు. ఆయన అందం చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. నిజంగా నేను లక్కీ. ఎలాగంటే... ఫ్యూచర్ సూపర్స్టార్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గౌతమ్’’అని సుకుమార్ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్బాబు, లహరి మ్యూజిక్ మనోహర్నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మంగళూరులో హంగామా
షర్ట్ లేకుండా ఏ సినిమాలోనూ కనిపించని మహేష్బాబు... ‘1’ సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసేశారు. ఇక్కడున్న మహేష్ స్టిల్ చూడండి... సిక్స్ప్యాక్ సూచా యగా కనిపిస్తోంది. సాధారణంగా సిక్స్ ప్యాక్ చేస్తే... ఫేస్లో బ్యూటీ పోతుందంటారు. చాలామంది హీరోల విషయంలో అది జరిగింది కూడా. కానీ మహేష్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఏ మాత్రం గ్లామర్ చెడ కుండా... ఎప్పటిలాగే మిల్కీబోయ్లా ఉన్నారు ప్రిన్స్. ఏడాదిన్నర నుంచి ఈ సినిమా కోసమే అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన. దీన్ని బట్టి... ‘1’ సినిమాపై మహేష్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే.. ప్రతిష్టాత్మకంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పాత్రలను భిన్నంగా మలిచే సుకుమార్ ఈ సినిమాలో కూడా మహేష్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇందులోని మహేష్ పాత్ర ప్రవర్తించే తీరు ఊహలకు అతీతంగా ఉంటుందట. మహేష్ కెరీర్లో ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేస్తున్నట్లు వినికిడి. కథ, కథనాల విషయంలో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. లండన్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. ఈ నెల 25 నుంచి మంగళూరులోని డాక్యార్డ్, బీచ్ ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సినిమాకే హైలైట్గా నిలిచేలా ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కృతనిశ్చయంతో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్కృష్ణ బాలనటునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, విక్రమ్ సింగ్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement