-
చాలా బాధగా ఉంది.. ఆ తప్పే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం తీరలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఆఖరి మ్యాచ్లలోనూ తమ మార్కును చూపించలేకపోతుంది. ఈ మ్యాచ్లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ(32) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ తెలిపాడు."ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. లక్ష్య చేధనలో మాకు అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మేము సద్వినియోగపరుచుకోలేకపోయాము. వాతవారణ పరిస్ధితుల కారణంగా పిచ్ కొంచెం మేము అనుకున్నదాని కంటే కొంచెం భిన్నంగా ఉంది. అయితే బ్యాటింగ్కు మరి అంత కష్టమైన వికెట్(ఈడెన్ పిచ్) అయితే కాదు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 పరుగుల టార్గెట్ అనేది మరి అంత పెద్ద లక్ష్యమేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే టప్పుడు మా బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతీసారి పూర్తిగా తడిగా మారి వెనుక్కి వచ్చేది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్ధి బ్యాటర్లు బౌండరీలను అలవోకగా బాదారు.ఇక మా చివరి మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలలు ఏమీ లేవు. వీలైనంతవరకు టోర్నీని విజయంతో ముగించేందుకు ప్రయ"త్నిస్తాము. ఏదమైనప్పటికి ఈ ఏడాది సీజన్లో మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్కు వర్షం అడ్డంకి..
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈడెన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది.11 మ్యాచ్లు ఆడిన కోల్కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది. -
'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్.. అందరి కంటే డిఫరెంట్'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా..తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు."హార్దిక్ పాండ్యా నిజంగా సూపర్ కెప్టెన్. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్కు ఒక స్టైల్ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్గా ఉంటాడు. ఫీల్డ్లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్ దిట్ట.నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్ రూమ్లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు. -
SRH Vs MI: రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. వాంఖడేలో కేకేఆర్ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై జట్టును విజయం పథంలో నడిపించలేక విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్ పాండ్యా కెప్టెన్స్పై మండిపడ్డాడు. "ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. పేపర్పై ముంబై జట్టు చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బౌలింగ్లో ముంబైకి మంచి ఆరంభం లభించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది.అటువంటి సమయంలో 6వ బౌలర్గా నమన్ ధీర్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చావ్లాతో ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్కు మంచి స్కోర్ అందించారు. క్రికెట్లో ఏ జట్టుకైనా కెప్టెన్సీ చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్సీ విషయంలో మేనేజ్మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ముంబై జట్టు ఒక యూనిటీగా ఆడడం లేదు. హార్దిక్ను కెప్టెన్గా నియమించడం ముంబై ఆటగాళ్లకు సైతం ఇష్టం లేనట్లుందని" స్టార్స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
ఐపీఎల్-2024లో దాదాపుగా ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(56) ఒక్కడే పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, రస్సెల్, చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్యర్ 70 పరుగులు చేశాడు. అయ్యర్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలోతుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన కేవలం 3 మ్యాచ్ల్లోనే విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో నిలిచింది. -
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో కేకేఆర్ తమ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్రౌండర్ మహ్మద్ నబీ స్ధానంలో నమాన్ ధీర్ వచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే.తుది జట్లుముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారకోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా వైస్ కెప్టెన్గా పంత్!?
టీ20 వరల్డ్కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే వరల్డ్కప్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్కప్ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్ కప్కు భారత జట్టు ఇదే..? ఊహించని ప్లేయర్కు చోటు!
టీ20 వరల్డ్కప్-2024లో భాగమయ్యే భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో భాగమయ్యే ఆ జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు టీ20 వరల్డ్కప్ కోసం బారత జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ స్సిన్నర్ హార్భజన్ సింగ్ చేరాడు. టీ20 ప్రపంచకప్ కోసం తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భజ్జీ ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుబ్మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్లకు భజ్జీ ఛాన్స్ ఇవ్వలేదు.వీరితో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా ఈ జట్టులో భజ్జీ పేసర్ అవేష్ ఖాన్కు చోటివ్వడం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్లో సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో తన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు.ఈ క్రమంలోనే హార్భజన్ అవేష్కు చోటిచ్చాడు. ఇక భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో అదరగొడుతున్న మయాంక్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్కు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్గా రిషబ్ పంత్ను హార్భజన్ ఎంచుకున్నాడు.అదేవిధంగా స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ను హార్భజన్ ఎంపిక చేశాడు.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం హర్భజన్ సింగ్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
రోహిత్ కూడా విఫలం.. ట్రోఫీ గెలవలేదు కదా!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను ప్రమోట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్గా, కెప్టెన్గానూ రాణించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్లలో ముంబై ఓడింది.ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక జట్టుగా ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు. గతంలో కెప్టెన్గా ఉన్నపుడు రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్ ఆర్డర్లో తనను ప్రమోట్ చేసుకున్నా తప్పేం లేదు. కానీ లోయర్ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బౌలింగ్ కూడా చేయగలడు. కెప్టెన్గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
IPL 2024 PBKS vs MI: ఉత్కంఠపోరులో పంజాబ్ ఓటమి..
IPL 2024 PBKS vs MI Live Updates: ఉత్కంఠపోరులో పంజాబ్ ఓటమి.. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 9 పరుగులతో ఓటమి పాలైంది. 192 పరుగుల భారీలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 183 పరుగులకే ఆలౌలైంది. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో హర్ప్రీత్ బ్రార్, రబాడ ఉన్నారు. అటు ముంబై విజయానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకాశ్ మధ్వాల్కు అప్పగించాడు. తొలి బంతిని మధ్వాల్ వైడ్గా సంధించాడు. ఈ క్రమంలో పంజాబ్ విజయసమీకరణం ఆరు బంతుల్లో 11 పరుగులుగా మారింది. తొలి బంతిని రబాడ ఆఫ్ సైడ్ డీప్ పాయింట్ దిశగా ఆడి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే మహ్మద్ నబీ వికెట్ కీపర్వైపు సూపర్త్రో వేశాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ స్టంప్స్ను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేయగా రీప్లేలో రనౌట్గా తేలింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ఆఖరి వరకు రావడంలో ఆ జట్టు ఆటగాడు అశుతోష్ కీలక పాత్ర పోషించాడు. 28 బంతుల్లో 7 సిక్సర్లు,2 ఫోర్లతో అశుతోష్ ఫైటింగ్ నాక్ ఆడాడు. ఓ దశలో మ్యాచ్ను ఈజీగా గెలిపించేలా కన్పించిన అశుతోష్.. అనూహ్యంగా ఔటయ్యి తన జట్టును గెలిపించలేకపోయాడు. పంజాబ్ ఎనిమిదో వికెట్ డౌన్.. అశుతోష్ ఔట్ 168 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 61 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్.. కోయిట్జీ బౌలింగ్లో ఔటయ్యాడు. అశుతోష్ సిక్సర్ల వర్షం.. విజయానికి చేరువలో పంజాబ్ పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అశుతోష్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో ఆశుతోష్ శర్మ(59), హర్ప్రీత్ బ్రార్(10) పరుగులతో అన్నారు. పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 141/7 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. క్రీజులో ఆశుతోష్ శర్మ(47), హర్ప్రీత్ బ్రార్(10) పరుగులతో అన్నారు. పంజాబ్ ఏడో వికెట్ డౌన్.. శశాంక్ ఔట్ శశాంక్ సింగ్ రూపంలో పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన శశాంక్ సింగ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 120/7. క్రీజులో అశుతోష్ శర్మ(36) పరుగులతో ఉన్నాడు. పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ ఔట్ 77 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ.. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 87/6. క్రీజులో శశాంక్ సింగ్(37), అశుతోష్ శర్మ(9) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 60/5 8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(7), శశాంక్ సింగ్(21) పరుగులతో ఉన్నారు. 14 పరుగులకే 4 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా,కోయిట్జీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లు ప్రబ్ సిమ్రాన్(0), రోసో(1), సామ్ కుర్రాన్(6), లివింగ్ స్టోన్(1) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. పంజాబ్ రెండో వికెట్ డౌన్.. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోసో క్లీన్ .. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. తొలి వికెట్ డౌన్.. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కోయిట్జీ బౌలింగ్లో ఫ్రబ్ సిమ్రాన్ సింగ్ పెవిలియన్కు చేరాడు. తొలి ఓవర్ ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. సూర్యకుమార్ విధ్వంసం.. పంజాబ్ టార్గెట్ 193 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(36), తిలక్ వర్మ(34) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్ రెండు, రబాడ ఓ వికెట్ సాధించారు. ముంబై నాలుగో వికెట్ డౌన్.. హార్దిక్ పాండ్యా ఔట్ 167 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ముంబై స్కోర్: 167/4 ముంబై మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన సూర్య.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు 15 ఓవర్లకు ముంబై స్కోర్: 130/2 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(67), తిలక్ వర్మ(17) పరుగులతో ఉన్నారు. ముంబై రెండో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్ రోహిత్ శర్మ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(59), తిలక్ వర్మ(5) పరుగులతో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ ఫిప్టీ.. సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 34 బంతుల్లో సూర్య తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(51), రోహిత్ శర్మ(36) పరుగులతో ఉన్నారు 10 ఓవర్లకు ముంబై స్కోర్: 86/1 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(49), రోహిత్ శర్మ(29) పరుగులతో ఉన్నారు 7 ఓవర్లకు ముంబై స్కోర్:58/1 7 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(24), రోహిత్ శర్మ(26) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్య కుమార్ యాదవ్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(10), సూర్యకుమార్ యాదవ్(9) పరుగులతో ఉన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో సామ్ కుర్రాన్ సారథ్యం వహిస్తున్నాడు. తుది జట్లు: ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ , జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిలీ రుసో, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్స్టోన్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబడ, అశుతోష్ శర్మ -
అతడే మా ఓటమిని శాసించాడు.. అస్సలు ఊహించలేదు: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్లో తేలిపోయిన ముంబై.. అనంతరం బ్యాటింగ్లోనూ రోహిత్ శర్మ మినహా(103నాటౌట్) మిగితా బ్యాటర్లంతా బ్యాట్లత్తేశారు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "హోం గ్రౌండ్లో ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 207 టార్గెట్ అనేది కచ్చితంగా చేధించగల్గే లక్ష్యమే. కానీ చెన్నై బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరనా తన బౌలింగ్తో మా ఓటమిని శాసించాడు. సీఎస్కే వారు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. వికెట్ల వెనక ధోని ఉన్నాడు. తన విలువైన సూచనలు ఎప్పటికప్పుడు తన జట్టుకే ఇస్తూనే ఉన్నాడు. ధోని లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉంటే 100 శాతం కలిసిస్తోంది. పిచ్ బ్యాటింగ్కు కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ వికెట్పై మేము పాజిటివ్ బ్యాటింగ్ చేయాలకున్నాం. అందుకే తగ్గట్టు గానే మా ఇన్నింగ్స్ను ప్రారంభించాం. కానీ పతిరాన బౌలింగ్ ఎటాక్లోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అక్కడే మా రిథమ్ను మేము కోల్పోయాం. ఇది మేము అస్సలు ఊహించలేదు. ఇక దూబే స్పిన్నర్ల కంటే సీమర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడతున్నందన నేను బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మా రాబోయే మ్యాచ్లపై దృష్టిసారించి.. భారీ విజయాలను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
CSK Vs MI: ధోని హ్యాట్రిక్ సిక్స్లు.. దద్దరిల్లిన స్టేడియం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంస్ ధోని మరోసారి ఫినిషర్ అవతరమెత్తాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోని వరుసగా హ్యాట్రిక్ సిక్స్లు బాది ఔరా అనిపించాడు. తన ఎదుర్కొన్న తొలి బంతిని లాంగాఫ్ మీదగా భారీ సిక్సర్ బాదిన మిస్టర్ కూల్, ఆ తర్వాత బంతులను లాంగాన్, డీప్ స్వ్కెర్ లెగ్ దిశగా సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్లో కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తలైవా.. మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ధోని సిక్స్లు కొట్టగానే స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లోపోయింది. ధోని బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫినిషర్ అంటూ ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. . ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
టీ20 వరల్డ్కప్ జట్టులో హార్దిక్కు నో ఛాన్స్.. అతడికే అవకాశం?
ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జాన్ 1 నుంచి టీ20 వరల్డ్కప్-2024 షురూ కానుంది. ఈ ఏడాది పొట్టిప్రపంచకప్నకు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత టీ20 వరల్డ్కప్ జట్టులో ఎవరుండాలన్న అన్న విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. వరల్డ్కప్ జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా ఆల్రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వాలని తివారీ సూచించాడు. "హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్గా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయాలి. గత మూడు మ్యాచ్ల నుంచి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అంతకముందు బౌలింగ్ చేసినా దాదాపు 11 పైగా ఏకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ప్రస్తుత ఫామ్ను చూస్తే టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్గా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. శివమ్ దూబే కచ్చితంగా సెలక్టర్ల దృష్టిలో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఒక వేళ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబేకు చోటు దక్కకపోతే అందుకు బాధ్యత సీఎస్కే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు. హార్దిక్కు ప్రత్నామ్యాయంగా దూబేను సెలక్టర్లు ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నానని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో శివమ్ దూబే దుమ్ములేపుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లలో బ్యాటింగ్కు వచ్చి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
ఇషాన్ కిషన్తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
RCB Vs MI: అది కదా కింగ్ కోహ్లి అంటే.. హార్దిక్ను హేళన చేయద్దంటూ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కోహ్లి సపోర్ట్గా నిలిచాడు. రోహిత్ శర్మ ఔట్ కాగానే హార్దిక్ క్రీజులోకి వచ్చినప్పడు అభిమానులు స్టాండ్స్ నుంచి గట్టిగా అరుస్తూ బూయింగ్(హేళన) చేశారు. వెంటనే కోహ్లి ప్రేక్షుకుల వైపు చూస్తూ హేళన చేయవద్దని కోరాడు. దయచేసి ఆపండి అన్నట్లు కోహ్లి సైగలు చేశాడు. స్టాండ్స్ వైపు కింగ్ కోహ్లి చూస్తూ ఏంటి ఇది అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. వెంటనే అభిమానులు హార్దిక్ హార్దిర్ అంటూ చీర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి హార్దిక్కు అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురువుతూనే ఉంది. అంతకు తొడు తొలి మూడు మ్యాచ్ల్లో ముంబై ఓడిపోవడంతో ఆ వ్యతిరేకత మరింత తీవ్రమైంది. హార్దిక్ మైదానంలో కన్పించడం చాలు అతడిని అభిమానులు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే ముంబై వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలవడంతో ముంబై ఫ్యాన్స్ కాస్త శాంతించే ఛాన్స్ ఉంది. ఇకనైన హార్దిక్ను ముంబై ఫ్యాన్స్ ఇష్టపడతారా లేదా మళ్లీ ట్రోలు చేస్తారా? అన్నది వేచి చూడాలి. Only a heartless man can hate Virat Kohli pic.twitter.com/H09lRy4XIc — ` (@chixxsays) April 11, 2024 -
MI Vs DC: మేము చాలా కష్టపడ్డాము.. మా విజయానికి కారణం అతడే: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(49) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. టిమ్ డేవిడ్(45), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), రొమారియో షెపర్డ్(38) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ కూడా పోరాడింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 71, 7 సిక్స్లు, 3 ఫోర్లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పృథ్వీషా(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో తొలి విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మొదటి విజయం కోసం చాలా కష్టపడ్డామని హార్దిక్ తెలిపాడు. "ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి మేము చాలా కష్టపడ్డాము. తొలి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైనప్పటికి మేము ఎటువంటి దిగులు చెందలేదు. ఎందుకంటే ఒక జట్టుగా మాపై మాకు నమ్మకం ఉంది. ఈ మ్యాచ్లో మేము పాజిటివ్ మైండ్ సెట్తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. ఈ మ్యాచ్తో పాటు ప్రతీ మ్యాచ్లోనూ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాం. అయితే మా 12 ప్లేయర్ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా ముఖ్యం. మా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్క విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశాం. అది మాకు ఈ రోజు వచ్చింది. ఇక మ్యాచ్లో ఓపెనర్లు మాకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్లో ప్లేలో 70 పరుగులు పైగా సాధించడం అంత సులభం కాదు. ప్రతీ ఒక్కరు ఈ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రొమారియో తన పవర్ చూపించాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అతడే మాకు విజయాన్ని అందించాడు. రోమారియో ఆడిన ఇన్నింగ్సే మా విజయానికి, ఢిల్లీ ఓటమి ప్రధాన కారణం. ఇక ఈ మ్యాచ్లో నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. కచ్చితంగా జట్టుకు అవసరమైనప్పుడు నేను బౌలింగ్ చేస్తా" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
హార్దిక్ది తప్పు కాదు.. దయ చేసి హేళన చేయవద్దు: గంగూలీ
ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఇరు జట్లకు చాలా కీలకం. ఢిల్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించగా.. ముంబై అయితే ఇంకా బోణే కొట్టలేదు. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గోన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యాకు గంగూలీ మద్దతుగా నిలిచాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను ఎవరూ హేళన చేయవద్దని అభిమానులను దాదా కోరాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్గా హార్దిక్ ఎంపికైనప్పటి నుంచి అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలో సైతం హార్దిక్కు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ ఎక్కడ కన్పించిన రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు బోయింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవడం కూడా అతడి కష్టాలను రెట్టింపు చేసింది. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. "దయచేసి అభిమానులు హార్దిక్ పాండ్యాను బూయింగ్(హేళన) చేయవద్దు. అది కరెక్ట్ కాదు. ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ను తమ కెప్టెన్గా నియమించింది. అటువంటిప్పుడు అతడేం తప్పు చేశాడు. ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి హార్దిక్ను తప్పుబట్టడం సరికాదు. క్రీడల్లో కెప్టెన్సీ మార్పు సహజం. భారత జట్టుకైనా కావచ్చు ఫ్రాంచైజీలకైనా ఏ ఆటగాడు తన ఇష్టానుసారం కెప్టెన్ కాలేడు. అది మెనెజ్మెంట్ నిర్ణయం. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని పెర్ఫార్మెన్స్ వేరే స్ధాయిలో ఉంటుంది.కెప్టెన్గా ఒక ఆటగాడిగా రోహిత్ ఒక అద్బుతమని" ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంగూలీ పేర్కొన్నాడు. -
సోమనాథ్ ఆలయంలో పూజలు చేసిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వరుస మూడు ఓటముల చవిచూసిన ముంబై ఇండియన్స్.. తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ముందు ముంబై జట్టుకు ఆరు రోజుల విరామం లభించింది. దీంతో ముంబై జట్టు మొత్తం గుజరాత్లోని జామ్నగర్కు టూర్కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ముంబై జట్టు ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు చేశాడు. శివలింగానికి పాండ్యా పాలాభిషేకం నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఏ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. #WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple. Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA — ANI (@ANI) April 5, 2024 -
కెప్టెన్సీ లేదు.. చెలరేగిపోతాడు! అతడిదే ఆరెంజ్ క్యాప్: శ్రీశాంత్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై కొత్త కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మను తప్పించి మరి జట్టు తనకు పగ్గాలను అప్పగించిన ముంబై యాజమన్యం నమ్మకాన్ని హార్దిక్ నిలబెట్టుకోలేకపోయాడు. ఎంఐ కెప్టెన్గా ఎంపికైనప్పటి నుంచి హార్దిక్కు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆఖరికి ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో కూడా హార్దిక్కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాడు. అతడిని తప్పించి ముంబై జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ స్వేచ్ఛగా ఆడటానికి ఇష్టపడతాడని శ్రీశాంత్ తెలిపాడు. "సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడటం మనం చూశాం. మేము అందరం కలిసి వన్డే వరల్డ్కప్ను కూడా గెలిచాము. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కింద రోహిత్ ఆడటానికి ఇష్టపడటం లేదని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఆ వాస్తవం. రోహిత్ హార్దిక్ కెప్టెన్సీలో ఆడటానికి కచ్చితంగా ఇష్టపడతాడు. నా వరకు అయితే రోహిత్ ఎలాంటి కెప్టెన్సీ భారం లేదు కాబట్టి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ సీజన్లో రోహిత్ మంచి రిథమ్లో కన్పిస్తున్నాడు. రోహిత్కు ఐదు సార్లు ముంబైని విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు జట్టును రోహిత్ వెనుకుండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నానని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ముంబై ఇండియన్స్కు గుడ్ బై!?
ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్ను ఓసారి ఛాంపియన్గా, మరోసారి రన్నరప్ నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబైని మాత్రం విజయ పథంలో నడిపించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. తన కెప్టెన్సీ మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. హార్దిక్ కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్యాతో రోహిత్కు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీరుపై కూడా హిట్మ్యాన్ గుర్రుగా ఉన్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీని వీడనున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూస్24 స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం .. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గోవాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ముంబై డ్రెస్సింగ్ రూమ్లో రెండు గ్రూపులు వున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కొంత మంది రోహిత్ సపోర్ట్కు ఉంటే మరి కొంత మంది హార్దిక్కు మద్దుతు పలుకుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. -
రాజస్తాన్ చేతిలో ఓటమి.. ఒంటరిగా వెళ్లి కూర్చున్న హార్దిక్! ఫోటోలు వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ అతడి సారథ్యంలో వరుసగా మూడో మ్యాచ్లో ఓటమి పాలైంది. సోమవారం(ఏప్రిల్ 1)న రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. అయితే రాజస్తాన్తో ఓటమి అనంతరం హార్దిక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ పూర్తియ్యాక సహాచర ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తే.. పాండ్యా మాత్రం డౌగట్లో ఒంటరిగా కూర్చోని ఉండిపోయాడు. పాండ్యా ఏదో కోల్పోయినట్లు ముఖంం పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా హార్దిక్ కెప్టెన్సీ పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి తిరిగి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు. ఈ మెగా ఈవెంట్లో తమ తదుపరి మ్యాచ్కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో హార్దిక్ బౌలర్గా తన మార్క్ను చూపించలేకపోయాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు. ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్లో వారు ఛాంపియన్లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
48 గంటల ముందు ప్రచారం నిలిపివేత
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
●తీరనున్న తాగునీటి సమస్య
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి
ప్రచారం.. పరిసమాప్తం!
తప్పక చదవండి
- ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
- మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement