-
చిల్లర లేకపొతేనేం.. క్యూఆర్ ఉందిగా!
ఆధునిక సాంకేతికత అంతటా యమ వేగంగా అల్లుకుపోతూ ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల యుగం నడుస్తోంది. అందులో భాగంగా ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం తదితర పద్దతుల్లో ప్రజలు సొమ్ము చెల్లింపు, ఇతర లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు క్యూఆర్ కోడ్ను కూడా అనుసరిస్తున్నారు. ఈ పద్ధతిని ఓ ఆలయ నిర్వాహకులు కూడా అందిపుచ్చుకున్నారు. భక్తులు నగదు అందుబాటులో లేదని సరిపుచ్చుకొని వెళ్లిపోకుండా క్యూ ఆర్ స్కానింగ్ పద్ధతి కూడా అందుబాటులో ఉందని తెలుపుతూ హుండీపై స్టిక్కర్ను ఏర్పాటు చేశారు. హుండీలో కానుకగా వేసేందుకు నగదు అందుబాటులో లేని భక్తుల కోసం ఈ క్యూర్ కోడ్ను ‘కానుక’గా ఏర్పాటుచేశారు. –కడప కల్చరల్ -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ.2,92,28,842ల నగదు లభించింది. సరాసరిన రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. 740 గ్రాముల బంగారం, 6.95 కిలోల వెండి, భారీగా ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.89,193 విరాళాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సమర్పించినట్లు చెప్పారు. -
శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలు!
తిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలోకి స్టీల్తో తయారు చేసిన ఐదు అడుగుల హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలను ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలను, మరికొన్ని ఇత్తడి హుండీలను ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో శ్రీవారి ఆలయం నుంచి బయటకు, అక్కడి నుంచి లిప్టు ద్వారా లారీలో ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి నూతన పరకామణికి తరలిస్తున్నారు. అయితే ఇటీవల హుండీ తరలింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నూతన హుండీలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంత మంది ఆలయంలోకి ప్రవేశించి హుండీలో భక్తులు నగదు వేస్తున్న సమయంలో హుండీ లోపలకు చేయిపెట్టి చోరీ చేసిన సంఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఇబ్బందులు రాకుండా నూతన హుండీలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నూతన హుండీలో మూడు వైపులా భక్తులు నగదు వేయవచ్చు. అదే సమయంలో ఇందులో భక్తుడి చేయి పూర్తిగా దూరే అవకాశం లేదు. మధ్యలో ఓ ఇనుప చువ్వను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నూతన హుండీ పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. వినియోగం సులభంగా ఉంటే దీనినే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నేడు శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. -
తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు. కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత -
యాదాద్రీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం.. ఆదాయం రెండింతలు!
యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి ఈ కార్తీక మాసం కలిసొచ్చింది. గతేడాది కార్తీక మాసంతో పోల్చుకుంటే ఈసారి అన్ని విభాగాల ద్వారా ఆదాయం డబుల్ అయింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు 50వేల కంటే ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నిత్యా ఆదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. ఇక సత్యనారాయణస్వామి వ్రతాలు సైతం ఈసారి అధికంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ గీతారెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆదాయం రెండింతలు.. గతేడాది కార్తీక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా, ఈసారి రూ.14,66,38,097 ఆదాయం వచ్చింది. యాదాద్రి ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైన తర్వాత క్షేత్రానికి భక్తులు రాక అధికంగా పెరిగింది. స్వయంభూ దర్శనం పునఃప్రారంభం అయిన తరువాత మొదటిసారి వచ్చిన కార్తీక మాసం కావడంతో స్వామివారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వ్రతాలతో రూ.1.71కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధికంగా సత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఈ కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది బాలాలయం ఉన్న సమయంలో 19,176 వ్రతాలు మాత్రమే జరిపించారు. రికార్డు స్థాయిలో నిత్యాదాయం.. కార్తీకమాసం చివరి రెండు ఆదివారాలు 50వేలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 13న ఆదివారం రోజున స్వామి వారికి రూ.1,09,82,446 నిత్య ఆదాయం రాగా, 20న ఆదివారం రోజున రూ.1,16,13,977 నిత్య ఆదాయం వచ్చింది. కార్తీక మాసం చివరి ఆదివారం వచ్చిన ఆదాయమే ఆలయ చరిత్రలో అధికమని అధికారులు వెల్లడించారు. (క్లిక్ చేయండి: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement