-
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
వైద్యుల సేవలు అభినందనీయం
పేద ప్రజలకు ఎల్లప్పుడు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలి సిబ్బంది కొరతను త్వరలో తీరుస్తాను అవార్డు రావడం సంతోషదాయకం ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మెరుగు పడాలి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మెదక్:ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రతిఒక్కరికి మెరుగైన చికిత్సలు అందించి ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా సేవలందించాలని, లేని పోని సాకులు చెబుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్లు చేయవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ వచ్చిన సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో వైద్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రికి వచ్చేది నిరుపేదలేనని అలాంటి వారికి మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. తప్పని పరిస్థితి అయితే కాని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్లు చేయవద్దన్నారు. ఆస్పత్రిలో నార్మల్ డెలవరీలు చేసి ఉత్తమ అవార్డును కైవసం చేసుకోవటం వైద్యులకు వృత్తి మీద ఉన్న అంకిత భావాన్ని తెలియసేస్తుందన్నారు. ఆస్పత్రిలోని వైద్యుల పోస్టులను త్వరలో ¿¶ ర్తీ చేస్తానని పేర్కొన్నారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుని నాటిన ప్రతిమొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఇప్పటికే ఆస్పత్రిలో హైరిస్క్కేంద్రం ఏర్పాటు చే సి నిరుపేద మహిళలకు మెరుగైన వైద్యం అందించటం జరుగుతుందన్నారు. త్వరలో ఇటీవలే రూ.12 లక్షలతో అధునాతన ఎక్స్రేను సైతం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇప్పటికే డయాల్సిస్, ఐసీయూలను మంజూరు చేయించటం జరిగిందని, త్వరలో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆస్పత్రి నుంచి 200 పడకల ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు. అలాగే మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మరో 50 పడకల ఆస్పత్రికి సైతం ప్రతిపాదనలు పంపటం జరిగిందని చెప్పారు. వాటిని త్వరలోనే మంజూరు చేయించి నిరుపేదలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెస్తానని చెప్పారు. వైద్యులు ప్రజాప్రతినిధులు ఎప్పుడు అలర్టుగా ఉండి ప్రజలకు సేవలందిస్తేనే ఎంచుకున్న వృత్తికి న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు ఆస్పత్రి సూపరిటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో 4 వైద్యుల పోస్టులు కాలీగా ఉన్నాయని వాటిని ¿¶ ర్తీ చేయాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్చైర్మెన్ అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, నాయకులు వెంకటరమణ, చంద్రకళ, గంగాధర్, కృష్ణారెడ్డి, డీఎస్పీ నాగరాజు, సీఐలు రామకృష్ణ, సాయిఈశ్వర్గౌడ్, వైద్యులు పి చంద్రశేఖర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్లోకి డైరెక్టర్గా ఎంట్రీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
తప్పక చదవండి
- ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
- ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- ‘కవిత అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement