-
శ్రీ దేవి దారిలో జాన్వీ కపూర్..!
-
బాలకృష్ణ ఆశ.. జూ.ఎన్టీఆర్ బొచ్చు కూడా పీకలేరు
-
బాలకృష్ణ తొడ కొట్టడం పై పేర్ని నాని సెటైర్లు
-
అదిరిపోయిన ప్రశాంత్ నీల్ ప్లానింగ్?
-
‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్తో గూగుల్ సెర్చ్లో జూమ్
సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్లో సత్తాచాటిన సెన్సేషనల్ సాంగ్ నాటు నాటు హవా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని ఈ సూపర్-హిట్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ గెల్చుకున్న తరువాత దీనిపై నెటిజన్ల ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది. ఫలితంగా నాటు నాటు సూపర్ ట్రెండింగ్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై సెర్చెస్ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. జపనీస్ ఆన్లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నాటునాటు కోసం ఆన్లైన్లో భారీ క్రేజ్ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని వెల్లడించింది. టాలీవుడ్ హీరోలు, జూ.ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ పెర్ఫామెన్స్ హైలైట్గా నిలిచింది. నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్ , స్టెప్పులు గ్లోబల్గా విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాపులర్ సింగర్స్ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్ టిక్టాక్లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు. కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. -
ముంబై వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష
-
‘జూనియర్ ఎన్టీఆర్ని కూడా వాడుకున్నారు’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసన అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కరోజు దీక్ష... దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు తన ఎదుగుదల కోసం జూనియర్ ఎన్టీఆర్ను కూడా వాడుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ధర్మాన్ని ఎక్కడైనా కాపాడారా? అని అంబటి ప్రశ్నించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘అధికారులపై మీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు దాడులు చేశారు ఇది ధర్మమా? హోదా అవసరం లేదని చెప్పి మీరు చెప్పలేదా. ప్యాకేజి కావాలని అడిగారు మరల హోదా కావాలని అంటున్నారు. మీరు చేస్తున్న దీక్షకు ఎలా మద్దత్తు ఇస్తారు. హోదా కోసం జపాన్ తరహా ఆందోళన చెయ్యడం ఏమిటో అర్థం కావడం లేదు. హోదా సీఎం చేసే దీక్షకు డ్వాక్రా, మహిళలు స్కూల్ పిల్లలు కాదు రావాల్సింది టీడీపీ నాయకులు,కార్యకర్తలు తరలి రావాలి. హోదా కోసం పేపర్ ఉద్యమాలు ఆపేసి ప్రజా ఉద్యమాలు చెయ్యాలి. హోదా కోసం వైఎస్సార్ సీపీ యువభేరి నిర్వహిస్తే సీఎం అడ్డుకున్నారు. పదవుల కోసం కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలను సీఎం మోసం చేశారు. సీఎం చేస్తున్నది ధర్మ పోరాటం కాదు అధర్మ పోరాటం. ప్రజలను, ఉద్యమకారులను తప్పు దారి పట్టించడానికి సీఎం దీక్ష చేస్తున్నారు. జపాన్ తరహా దీక్షలు అంటే ఏమిటో సీఎం చెప్పాలి.’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. -
బిగ్బాస్ షో ప్రైజ్మనీ ఎంతో తెలుసా..!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్బాస్ షో అతితక్కువ కాలంలోనే అభిమానుల మనసును చూరగొంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో ఆషోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూత్లో ఎక్కువ మందికి బిగ్బాస్షో కనెక్ట్ అయింది. మొదట14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్ను వైల్డ్కార్డు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ షో 70రోజుల పాటు జరగనుంది. ఇందులో పాల్గొనే శనివారం పోటీలో విన్నర్ గెలుచుకొనే డబ్బు మొత్తాన్ని ప్రకటించారు. షోలో గెలిచిన వారికి రూ.50లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారు. గెలుచుకున్న డబ్బును ఏం చేస్తారంటూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న ఒక్కొక్కరు తన అభిప్రాయాలను వెల్లడించారు. ధనరాజ్ తన శ్రీమతికి ఒక ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా, కత్తి మహేష్ మాత్రం గెలిచిన మొత్తాన్ని తన భార్య చేతిలో పెడతానంటూ సమాధానమిచ్చాడు. -
బిగ్బాస్లో రానా?
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ షో టీవీ రేటింగ్స్లో సంచలనాలు సృష్టిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్ను వైల్డ్కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజా ఈ షోలో మరో సెలబ్రిటీ కనిపించనున్నారు. నెం.1 యారీ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్గా మారిన దగ్గుబాటి రానా బిగ్బాస్లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో ముఖ్య అతిథి షోలో ఆయన కనిపించనున్నారు. ఎన్టీఆర్తోపాటు ఆయన ఉంటారని సమాచారం. ఇందులో పాల్గొనేందుకు రానా శనివారం ఇక్కడి నుంచి పూణే బయలుదేరారు. అయితే ఇందులో రానా వెళ్లేది మిగతా సభ్యులతో కలిసి ఆడటానికి మాత్రం కాదు. త్వరలో విడుదల కానున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈకార్యక్రమంలో పాల్గొననున్నారు. -
బిగ్బాస్ షోలో సంబరాలు
హైదరాబాద్: టీఆర్పీ రేటుంగుల కోసం ఛానెల్స్ మధ్య పోరు తీవ్రంగానే ఉంటుంది. ఇందుకోసం సరికొత్త ప్రోగ్రాములతో ప్రేక్షకులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్తో ఒకప్పటి మాటీవీలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున అలరించారు. తాజాగా స్టార్ మా ఛానెల్ జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్బాస్ రియాలిటీ షోను ప్రారంభించింది. ఈ షో టీవీ రేటింగ్స్లో సంచలనాలు సృష్టించింది. 14 మంది ప్రముఖులతో ప్రారంభమైన బిగ్బాస్ షో తొలుత నిదానంగా ప్రారంభమైన, రోజులు గడిచే కొద్ది టీఆర్పీ రేటింగులను పెంచకుంటోంది. తొలి వారంలో హౌజ్ మెట్స్ మధ్య అంతా సాన్నిహిత్యం లేకపోవడంతో మొదటి వారం నీరసంగా సాగింది. అయితే వారాంతంలో తారక్ ప్రోగ్రాంకు రావడంతో జోష్ అందుకుంది. అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్స్ వచ్చింది. దీంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్స్లో మొదటి స్థానంలో నిలచింది. దీంతో బిగ్ బాస్ టీం సంబరాల్లో మునిగి తేలింది. బిగ్బాస్ యూనిట్ మొత్తం తారక్ సమక్షంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
బిగ్ బాస్లో నేనా..? టైం లేదు: అనసూయ
అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ హోస్ట్గా మొదలైన 'బిగ్బాస్' రియాల్టీ షోకు ఆదరణ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్టీఆర్ శని, ఆదివారల్లో కనిపించడం ఓ కారణం అయితే.. హౌస్మేట్స్లో ఎవరూ పెద్దగా ఇప్పుడు 'ఫైల్'లో ఉన్నవాళ్ళు కాకపోవడం మరో కారణం. అంతా ఔట్డేటెడ్ గ్యాంగ్.. అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అంతేగాకుండా సోషల్ మీడియాలో షో గురించి నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో 'బిగ్బాస్' రియాల్టీ షోకి ఊపు తెచ్చేందుకోసం, పలువురు హాట్ సెలబ్రిటీస్ని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా తీసుకొస్తున్నారనే ప్రచారం ఊపందుకొంది. ఈ లిస్ట్లో అందరికన్నా ముందు విన్పించిన పేరు హాట్ యాంకర్ అనసూయదే. అయితే, అనసూయ మాత్రం తన చుట్టూ విన్పిస్తోన్న 'బిగ్బాస్' గాసిప్స్ని కొట్టి పారేసింది. తనకు అంత టైమ్ లేదని తేల్చి చెప్పేసింది. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నానని అనసూయ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చేసింది. Umm..Laksmi garu..i dont know I dont think I can afford that time to #BigBossTelugu ..i am hands full with prior TV and movie commitments.. -
11నుంచి ఎన్టీఆర్ 27?
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నందమూరి కల్యాణ్రామ్ నిర్మించనున్న కొత్త చిత్రానికి ఫిబ్రవరి 11న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొంచెం విరామం తీసుకున్నారు. తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనే దానిపై పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్గా బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న గ్రాండ్గా ప్రారంభోత్సవం జరపాలనుకుంటున్నారట. ఆగస్టులో సినిమా విడుదల చే సేలా యూనిట్ భావిస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ని పెట్టనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్ఛాంబర్లో ‘జై లవకుశ’ నమోదు చేయించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు భోగట్టా. అన్నట్లు.. ఇది ఎన్టీఆర్కి 27వ సినిమా. -
'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'
-
'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'
హైదరాబాద్ : తాత గురించి ఎంత చెప్పినా తక్కువేనని హీరో జూ.ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ తాత అడుగుజాడల్లో నడుస్తామన్నారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఎన్టీఆర్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాజీ రాజ్యసభసభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. నివాళులర్పించిన వారిలో హీరో కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. -
జీవితంలో ఎవరికీ తలవంచను : హరికృష్ణ
‘‘నా అరవై ఏళ్ల జీవితంలో ఎవరూ పొందలేని, అనుభవించలేని ఆనంద సమయాలు చూశా. మా నాన్న నందమూరి తారక రామారావుగారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నా అనుభవాలు హిమాలయ పర్వతాలను మించిపోయాయి. ఆయన మాకు వీరాభిమానులను ఇచ్చారు. అభిమానాన్ని ఎవరూ దొంగలించలేరు’’ అని నటులు హరికృష్ణ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. అదితీ ఆర్య హీరోయిన్. అనూప్ రూబెన్స్ స్వర పరచిన ఈ చిత్రం పాటల సీడీని హరికృష్ణ విడుదల చేసి చిన్న ఎన్టీఆర్కు ఇచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ- ‘‘నేనెప్పుడూ మనసులో అనిపించినది బయటకు చెప్పేస్తా. దాచుకోలేను. ఎన్ని దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికీ తలవంచను.. వంచే ప్రశ్నే లేదు. తల వంచేవాడినైతే ఎన్టీఆర్ కడుపున పుట్టేవాణ్ణే కాదు. ఆయన మాకు జీవితం ఇచ్చింది తలవంచి బ్రతకమని కాదు. కృషి చెయ్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఆ బాటలో నా బిడ్డలు వెళుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ ‘ఇజం’ టీజర్ హరికృష్ణగారికి నచ్చడంతో నాకు రెండు పావురాలు బహుమానంగా ఇచ్చారు. ఈ చిత్రం కోసం మూడు నెలల్లో కల్యాణ్ రామ్ 13 కిలోలు బరువు తగ్గాడు. ఇందులో కోర్టు సీన్ హైలెట్’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. కల్యాణ్రామ్ మాట్లాడుతూ- ‘‘నేను ఇప్పటి వరకూ పనిచేసిన వాళ్లలో ‘ఇజం’ టీమ్ బెస్ట్. నా కెరీర్లో బెస్ట్ డెరైక్టర్ పూరీనే. ఆయన గురించి సినిమా విడుదల రోజు ఓ గంట మాట్లాడతా. మరోసారి ఇదే టీమ్తో పని చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘ ‘టెంపర్’ టైమ్లో అన్నయ్యతో(కల్యాణ్ రామ్) ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు పూరీ భయ్యా నాతో అన్నప్పుడు సంతోషపడ్డా. వెంటనే ఫోన్ చేసి అన్నయ్యకు చెప్పా. ‘టెంపర్’ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నయ్య నాకు ఫిలాసఫర్, గైడ్.. ఒక్కోసారి గర్ల్ఫ్రెండ్ కూడా. ‘ఇజం’ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో అదితీ ఆర్య, అనూప్ రూబెన్స్, నందమూరి రామకృష్ణ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, నటులు తనికెళ్ల భరణి, ప్రకాశ్రాజ్, అలీ, పాటల రచయిత భాస్కరభట్ల, కెమెరామేన్ ముఖేష్, ‘ఆదిత్య’ నిరంజన్, దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికీ తారక్ను తిట్టుకుంటుంటా! - రాజమౌళి
ఎడిటింగ్ అసిస్టెంట్గా కెరియర్ ప్రారంభించిన రాజమౌళి పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. డెరైక్టర్గా పదిహేనేళ్ల ప్రస్థానం కంప్లీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా 2000లో సెప్టెంబర్ 27న విడుదలైంది. తాజాగా రాజమౌళి ఆ సంగతులు పంచుకుంటూ, ‘‘స్విట్జర్లాండ్లో ‘స్టూడెంట్ నెం.1’ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు, తారక్కు (జూనియర్ ఎన్టీఆర్) ఒకే రూమ్. నాకేమో 9 గంటలకే పడు కునే అలవాటు. తారక్ అర్ధరాత్రి 12 వరకూ టీవీ చూసేవాడు. ఆ టీవీలో వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం స్విస్ భాషలో వస్తుండేది. ఆ విషయం గుర్తుకొస్తే ఇప్పటికీ తారక్ని తిట్టుకుంటుంటా’’ అన్నారు. ‘‘ఇంటర్వెల్కు ముందు వచ్చే సన్నివేశం మిన హా మిగిలిన సన్నివేశాల్లో నాకు దర్శకత్వ అనుభవం లేని విషయం తెలుస్తుంది. సక్సెస్ టూర్లో 19 ఏళ్ల తారక్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పెద్ద వయసు వారూ రావడం మరచిపోలేని అనుభూతి’’ అని రాజమౌళి పేర్కొన్నారు. చిన్న ఎన్టీఆర్ స్పందిస్తూ, ‘‘పదిహేనేళ్ల క్రితం వర్ధమాన దర్శకుడిగా జర్నీ ప్రారంభించిన నా జక్కన్న దేశంలో అత్యంత గౌరవనీయమైన దర్శకులు. ఆయనకు సుదీర్ఘ ప్రయాణం ఉంది’’ అని అన్నారు. -
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం?
హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం త్వరలో తెరకెక్కనుందట. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసే విషయమై ఎన్టీఆర్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దసరా నాటికి పూరీ జగన్నాధ్ దర్శకుడుగా తన సోదరుడు కల్యాణ్ రాం నిర్మాతగా ఓ చిత్రంలో నటించేందుకు తారక్ సిద్ధమయ్యారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభమైన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద హిట్గా నిలిచిన 'జనతా గ్యారేజ్' కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.70కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరుని కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి మరో రెండు సన్నివేశాలను జత చేశారు. ఆదివారం నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో అభిమానులు మళ్లీ చూసే అవకాశాలు ఎక్కువ. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. జనతా గ్యారేజ్ హిట్తో మరింత టాప్ లెవల్కు చేరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తారక్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించారు. కొత్త సన్నివేశాలు జత చేయడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. -
రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సాయంత్రం సెన్సార్కు వెళ్లనుంది. సెన్సార్ పూర్తి కాగానే అన్ని ప్రాంతాలకు ప్రింట్స్ పంపిణీ కానున్నాయి. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది. -
ఒకరోజు ముందే ఆ సినిమా రిలీజ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సోమవారంతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ముందు ప్రకటించినట్లు సెప్టెంబర్ 2న కాకుండా, ఒకరోజు ముందే.. అంటే సెప్టెంబర్ 1 వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. ఈ మేరకు అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంతలు హీరోయిన్లుగా నటించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. And all set for September 1st. Need ur love and blessings. Thank u all. — koratala siva (@sivakoratala) 23 August 2016 And here it is.. pic.twitter.com/2LCQwcWnzZ — koratala siva (@sivakoratala) 23 August 2016 -
'నా ప్రాణం లెక్క చేయనంత'
యువ హీరో మంచు మనోజ్ ఒక్క ట్వీట్తో తారక్ ఫ్యాన్స్ను ఫిదా చేశాడు. ట్విట్టర్లో ఓ అభిమాని 'అన్నా.. నీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం?' అని ప్రశ్నించగా.. నా ప్రాణం లెక్కచేయనంత అంటూ సమాధానమిచ్చాడు మనోజ్. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయాలి అని, మంచువారి మంచి ఫ్రెండ్షిప్ అని.. రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో తారక్, మనోజ్ల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందన్నది తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం మంచు మనోజ్.. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్ ఉద్యమకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్గా నటిస్తుంది. శివ ఆర్. నందిగం ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. @HeroManoj1 @akramsyedrocks anna niku ntr ante enta ishtam? — Yashwanth Kumar (@yashwanthk115) 19 August 2016 Naa Pranam Lekacheyani anthaa:) https://t.co/iqRnDHHcgf — Manchu Manoj (@HeroManoj1) 19 August 2016 -
ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
గత కొన్ని రోజులుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 12 వ తేదీన పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. శిల్ప కళావేదికలో గ్రాండ్ ఈవెంట్కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్, సమంతలపై పాట చిత్రీకరణకు మూవీ టీం కేరళ చేరుకుంది. ఎన్టీఆర్ సరసన మరో కథానాయికగా నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
-
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్తో బాధపడుతున్న అమ్మాయిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు. బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement